Abids
-
హైదరాబాద్ : అబిడ్స్ ఇస్కాన్ టెంపుల్ లో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)
-
పాప సేఫ్ ... అబిడ్స్ కిడ్నాప్ కథ సుఖాంతం
-
అబిడ్స్ పీఎస్ వద్ద టెన్షన్.. కిడ్నాపర్పై పాప బంధువుల దాడి
సాక్షి, అబిడ్స్: హైదరాబాద్లోని అబిడ్స్ పోలీసు స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆరేళ్ల పాపను కిడ్నాప్ కేసులో నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. అనంతరం, పాప కుటుంబ సభ్యులు స్టేషన్కు చేరుకున్నారు. ఈ క్రమంలో నిందితుడిని చితకబాదారు. దీంతో, స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.వివరాల ప్రకారం.. అబిడ్స్లో కిడ్నాప్నకు గురైన ఒకటో తరగతి బాలిక ప్రగతి సురక్షితంగా ఉంది. శనివారం సాయంత్రం అబిడ్స్లోని కట్టెలమండిలో ఆడుకుంటున్న చిన్నారిని ఎండీ బిలాల్(కిడ్నాపర్) చాక్లెట్ ఇచ్చి ఆటోలో తీసుకెళ్లాడు. కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఐదు బృందాలతో గాలించారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు పోలీస్స్టేషన్ పరిధిలోని ఇనుముల నర్వలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.కాగా, కిడ్నాపర్ బిలాల్ను బీహార్కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతడిని పోలీసులు విచారిస్తున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా కేసును చేధించారు. చిన్నారిని అబిడ్స్ పీఎస్కు పోలీసులు తీసుకువచ్చారు. మరోవైపు నిందితుడిని కూడా పోలీసులు పీఎస్కు తీసుకొచ్చారు. ఆ సమయంలో చిన్నారి కుటుంబసభ్యులు, బంధువులు అతడిపై దాడి చేశారు. పోలీసులు అతికష్టంమీద నిందితుడిని పీఎస్ లోపలికి తీసుకెళ్లారు. దీంతో, అక్కడ ఉద్రికత్తకర పరిస్థితులు నెలకొన్నాయి. -
Hyderabad: ఆరేళ్ల చిన్నారి కిడ్నాప్
అబిడ్స్: ఆరేళ్ల చిన్నారి కిడ్నాప్కు గురైన ఘటన అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. బేగంబజార్ ఛత్రి ప్రాంతానికి చెందిన ప్రియాంక తన సోదరుడి కుమార్తె ప్రగతిని తీసుకొని శనివారం మధ్యాహ్నం కట్టెలమండిలోని పుట్టింటికి వచ్చింది. కాసేపటి తర్వాత ప్రగతి కట్టెలమండి ముత్యాలమ్మ ఆలయం ముందు ఆడుకుంటాన్నంటూ బయటకు వెళ్లింది. ఆమెతో పాటు ప్రియాంక సోదరి కుమారుడైన రుత్విక్ కూడా వెళ్లాడు. రుత్విక్ ఒక్కడే ఇంటికి రాగా ప్రగతి కనిపించలేదు. వెంటనే కుటుంబ సభ్యులు బాలిక కోసం పరిసరాల్లో గాలించి అబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముందుగా మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు రాత్రి వేళ బాలిక కిడ్నాప్ అయ్యిందని గుర్తించారు.ప్రగతిని ఓ గుర్తుతెలియని వ్యక్తి నడుచుకుంటూ వెంట తీసుకెళ్తున్న సీసీ ఫుటేజీలో రికార్డు అయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
కలకత్తా యువతులతో వ్యభిచారం
అబిడ్స్: కలకత్తా నుంచి యువతులను తీసుకువచ్చి అబిడ్స్ ఫార్చూన్ లాడ్జిలో వ్యభిచారం నిర్వహిస్తున్న నిర్వాహకులు, యువతులు, విటులను నగర టాస్్కఫోర్స్, అబిడ్స్ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. హైటెక్ తరహాలో అందరి కళ్లుగప్పి వ్యభిచారం నిర్వహిస్తున్న వారందరిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అఖిలేష్ (36) (అఖిలేష్ ఫహిల్వాన్) అనే వ్యక్తి అబిడ్స్లో ఫార్చూన్ లాడ్జిని కొనసాగిస్తున్నాడు. కొన్ని రోజులుగా కలకత్తా నుంచి యువతులను తీసుకువచ్చి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు. సమాచారం అందుకున్న నగర సెంట్రల్జోన్ టాస్్కఫోర్స్ పోలీసులు, అబిడ్స్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. లాడ్జి యజమాని అఖిలే‹Ù, మేనేజర్ రఘుపతి, 16 మంది యువతులు, 6 మంది విటులను అరెస్టు చేశారు. వీరిలో యువతులను తుక్కుగూడలోని రెస్క్యూహోమ్కు తరలించినట్లు ఇన్స్పెక్టర్ నర్సింహరాజు తెలిపారు. మిగతా వారిని చంచల్గూడ జైలుకు తరలించారు. ఈ కేసును అబిడ్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
అబిడ్స్ వ్యభిచారం కేసు.. రాంనగర్ అఖిల్ పహిల్వాన్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యభిచారం ముఠా గుట్టు రట్టైంది. ఓ హోటల్లో వ్యభిచారం చేస్తూ ముఠా పట్టుబడింది. రామ్నగర్కు చెందిన అఖిల్ పహిల్వాన్ ఆధ్వర్యంలో ఈ దందా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. టాస్క్ఫోర్స్ పోలీసుల తనిఖీల్లో 16 మంది అమ్మాయిలు, ఆరుగురు కస్టమర్లు, ఇద్దరు ఆర్గనైజర్లు పట్టుబడ్డారు. వారి నుంచి 22 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. విదేశాల నుంచి ఉద్యోగాల పేరుతో బలవంతంగా వ్యభిచారం చేస్తున్నట్లు సమాచారం. రామ్నగర్ అఖిల్ పహల్వాన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. రాంనగర్ అఖిల్ వ్యభిచారం కేసు పోలీసుల దర్యాప్తులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. అఖిలేష్ పూర్వ ట్రాక్ రికార్డ్లను పోలీసులు బయటికి తీయగా.. అతడి మొబైల్లో జాతీయ, అంతర్జాతీయ వ్యభిచారం ముఠా నిర్వాహకుల ఫోన్ నెంబర్లు ఉన్నట్లు గుర్తించారు. అఖిల్ రోజుకి 20 నుంచి 30 కాల్స్ నిర్వాహకులతో మాట్లాడుతున్నట్లు తేలింది. పశ్చిమబెంగాల్ నుంచి 16 మంది అమ్మాయిలను ఫార్చ్యూన్ హోటల్లో 25 రోజులుగా వ్యభిచారం చేయిస్తున్నట్లు గుర్తించారు. ఎలాంటి ప్రూఫ్స్ ఇవ్వకుండా 25 రోజులుగా అమ్మాయిలను హోటల్లో ఉంచిన అఖిల్.. ఈ 25 గదుల్లో 16 రూములను వ్యభిచారం కోసం ఉపయోగిస్తున్నట్లు విచారణలో తేలింది. సినీ ప్రముఖులకు అమ్మాయిలను సరాఫరా చేస్తున్నట్లు అఖిల్పై పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో సలువడి అఖిలేష్, పక్కల రఘుపతి, అభిషేక్ బాటి, కేశవ్ వ్యాస్, అబ్దుల్ ఖలీద్, సంతోష్ అరెస్ట్ చేసి లోతుగా విచారిస్తున్నారు. చదవండి: పన్నూ హత్యకు కుట్ర.. నిఖిల్ గుప్తా అప్పగింతకు కోర్టు ఓకే -
హైదరాబాద్ అబిడ్స్లో ఐఫోన్స్ పేరుతో భారీ మోసం
-
బిర్యానీ గొడవ: కస్టమర్లపై దాడి.. రాజాసింగ్ సీరియస్
హైదరాబాద్: హైదరాబాద్లోని అబిడ్స్ గ్రాండ్ హోటల్లో బిర్యానీ విషయంలో గొడవ కాస్త పరస్పర దాడి దారి తీసింది. మటన్ బిర్యానీ సరిగా ఉడకలేదని.. డబ్బులు చెల్లించమని హోటల్ వెయిటర్లతో వినియోగదారులు చెప్పారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం పెద్దది కావటంతో వెయిటర్లు వినియోగదారులపై కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో 12 మంది యువతీ యువకులకు గాయాలై ఆస్పత్రి పాలయ్యారు. ఫిర్యాదు రావడంతో.. 10మంది వెయిటర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. సదరు హోటల్ యజమానిపై అబిడ్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కస్టమర్లపై దాడి చేసిన ముగ్గురు వెయిటర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయంపై స్పందించిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.. ధూల్పేటకు చెందిన కస్టమర్లపై దాడి చేసినందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రాండ్ హోటల్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చదవండి: బైరి నరేష్ అడ్డగింత.. వాహనం ఢీ కొట్టి అయ్యప్ప భక్తుడికి గాయాలు -
ఆర్కిడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో విద్యార్థులతో సందడి చేసిన గీతా మాధురి (ఫోటోలు)
-
అబిడ్స్లో రాంజీ గోండ్ మ్యూజియం
సాక్షి, హైదరాబాద్: ఆదివాసీ పోరాట యోధుడు రాంజీగోండ్ పేరిట ప్రత్యేకంగా ఓ మ్యూజియం ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్ నడిబొడ్డున అబిడ్స్లోని గిరిజన సంక్షేమశాఖ స్థలంలో కేంద్రమంత్రులు అర్జున్ముండా, జి.కిషన్రెడ్డిల చేతుల మీదుగా సోమవారం శంకుస్థాపన జరిపేందుకు రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ ఏర్పాట్లు చేసింది. రూ.35 కోట్లపైగానే వ్యయం రాంజీగోండ్ మ్యూజియం ఏర్పాటుకు రూ.35 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభు త్వం రూ.10 కోట్లు విడుదల చేసింది. మరిన్ని నిధులు ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉంది. రూ.10 కోట్లు ఇచ్చి ఏళ్లు గడుస్తున్నా అడుగు ముందుకు పడలేదు. మొదట్లో బాపూఘాట్ వద్ద మ్యూజియం ఏర్పాటు చేయాలని భావించారు. కానీ భూ సమస్య కారణంగా ఆదిలోనే ఆగిపోయింది. దీంతో అబిడ్స్లో ఏర్పాటు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ మ్యూజియంలో ప్రధానంగా గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల వివరాలు, చరిత్ర, గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులోకి తెస్తారు. గిరిజన సంక్షేమశాఖ పరిధిలో ఈ మ్యూజియం నిర్వహణ ఉంటుంది. దీని నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యం కూడా ఉంది. టీసీఆర్టీఐ భవన ప్రారంభోత్సవం కూడా... మాసాబ్ట్యాంక్లోని దామోదరంసంజీవయ్య సంక్షేమభవన్ ఆవరణలో గిరిజన సాంస్కృతిక పరిశోధన శిక్షణ సంస్థ (టీసీఆర్టీఐ)భవనం నిర్మించారు. దీనికి కేంద్ర ప్రభుత్వమే పూర్తిగా నిధులు విడుదల చేసింది. నాలుగు అంతస్తుల్లో సుమారు 20వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ భవనానికి కేంద్రం ఇప్పటివరకు రూ.6.5 కోట్లు ఇచ్చినట్టు అధికారులు చెబుతు న్నారు. గిరిజన సంక్షేమశాఖలో టీసీఆర్టీఐ ఒక భాగమే అయినా, కేంద్ర గిరిజన సంక్షేమశాఖ ఆధీనంలో కార్యక్రమాలు నిర్వహిస్తారు. సోమ వారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ భవనాన్ని కేంద్రమంత్రులు అర్జున్ముండా, జి.కిషన్రెడ్డి ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. -
దంపతుల మధ్య ‘బ్యూటీ పార్లర్’ చిచ్చు.. భర్త కోరిక తీర్చడానికి ప్రయత్నించి..
సాక్షి, హైదరాబాద్: తనని మోడల్గా చూడాలనుకున్న భర్త కోరికను తీర్చడానికి ప్రయత్నం చేసిన ఓ మహిళకు బ్యూటీ పార్లర్ షాక్ ఇచ్చింది. పొడవాటి కురుల కోసం ప్రయత్నించి ఉన్న జుట్టును పొగొట్టుకుంది. అందం కోసం చేసిన ప్రయత్నం విఫలమైంది. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఓ మహిళ అబిడ్స్లోని బ్యూటీ పార్లర్కి వెళ్లింది. జుట్టును అందంగా చేస్తానని చెప్పిన బ్యూటిషియన్.. ముందుగా మహిళ హెయిర్ కొంచెం కట్ చేసింది. బాధిత మహిళ అభ్యంతరం చెబుతున్నా విన్నకుండా ఏదో హెయిర్ ఆయిల్ కూడా పూసారు. ఇంటికెళ్లిన తర్వాత ఆ మహిళ జుట్టు మొత్తం ఊడిపోయింది. జుట్టు ఊడిపోయిన భార్యను చూసి భర్త షాక్ అయ్యాడు. అందగా కనిపించాలనుకున్న తన భార్యకు వెంట్రుకలు ఊడిపోవడంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఆలుమగల మధ్య చిచ్చు పెట్టిన బ్యూటీ పార్లర్పై బాధితురాలు బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఊడిపోయిన జుట్టును పట్టుకెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధిత మహిళ. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: భార్యతోనే స్నేహితుడికి వలపు వల..! చివరికి.. బ్యూటీ పార్లర్ బాధితురాలు మీడియాతో మాట్లాడుతూ, హెయిర్ కలర్ కోసం అబిడ్స్లోని న్యూ క్వీన్ బ్యూటీ సెలూన్కి వచ్చాను. స్పెషల్ హెయిర్ స్టైల్ చేస్తానని నా హెయిర్ మొత్తం కాలిపోయేలా చేసింది. పార్లర్ నిర్వహకురాలు సొంతంగా తయారు చేసిన హెర్బల్ హెయిర్ ఆయిల్ వాడతామన్నారు. అది వాడితే పూర్తిగా నా జుట్టు రాలిపోయింది. వాటర్ పెడితే.. దువ్వెనతో దువ్వినా కూడా జుట్టు రాలిపోతుంది. క్వీన్ పార్లర్ను వెంటనే సీజ్ చేయాలి’’ అని ఆమె పేర్కొంది. -
అబిడ్స్లో బ్యూటీపార్లర్ నిర్వాకం.. ఆయిల్ పెట్టగానే ఊడిపోయిన మొత్తం జుట్టు
సాక్షి, హైదరాబాద్: హెయిర్ కట్ చేయించుకునేందుకు బ్యూటీపార్లర్కు వెళ్లిన మహిళకు షాక్ తగిలింది. బ్యూటీషియన్ నిర్వాకంతో ఆ మహిళకు జట్టు ఊడిపోయిన ఘటన అబిడ్స్లో జరిగింది. మహిళకు హెయిర్ కట్ చేసి ఆయిల్ పెట్టగానే మొత్తం జుట్టు ఊడిపోయింది. పీఎస్లో బాధితురాలి ఫిర్యాదు మేరకు పార్లర్పై కేసు నమోదు చేశారు. బ్యూటీ పార్లర్ నిర్వాహకుల నిర్వాకంతో గతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకోడంతో బ్యూటీ పార్లర్ అంటే మహిళలు హడలిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫేస్ వ్యాక్స్ చేయించుకున్న మహిళలకు ముఖంపై ఎర్రగా కంది నీటి పొక్కులు రావడం, ఫేస్మాస్క్ వికటించి మొహం నల్లగా మారిపోవడం వంటి ఘటనలు జరిగిన సంగతి తెలిసిందే. కొంతమంది బ్యూటీషియన్లకు సరైన అవగాహన లేకపోవడం, నాణ్యమైన మెటీరియల్ వాడకపోవడంతో మహిళలకు సమస్యలు ఎదురవుతున్నాయి. చదవండి: వదినపై అందరూ చూస్తుండగానే... -
ఎమ్మెల్యే రాజాసింగ్కు తెల్ల బుల్లెట్ ప్రూఫ్ కారు
అబిడ్స్: తన బుల్లెట్ ప్రూఫ్ వాహనం తరచూ మొరాయిస్తోందని, నూతన వాహనాన్ని సమకూర్చాలని గత కొద్దిరోజులుగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేస్తున్న విజ్ఞప్తికి ప్రభుత్వం స్పందించింది. ఆయన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని మార్చింది. ఈ మేరకు సోమవారం పోలీసు శాఖ అధికారులు నూతనంగా కేటాయించిన తెలుపురంగు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఆయన నివాసానికి తరలించారు. కాగా ఈ విషయమై ఎమ్మెల్యే రాజాసింగ్ను సంప్రదించగా తాను శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ఉన్నట్లు తెలిపారు. తెలుపు రంగు, 2017 మోడల్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తన ఇంటి వద్ద ఉంచినట్లు తెలిపారు. ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించడం సంతోషకరమని, ప్రస్తుతం కేటాయించిన వాహనం ఏ కండీషన్లో ఉందో చూడాల్సి ఉందన్నారు. -
అబిడ్స్ పోస్టాఫీస్ వద్ద సామూహిక గీతాలాపనలో కేసీఆర్
-
జాతి పండగకు జేజేలు
సాక్షి, హైదరాబాద్: భారత స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా నగరంలోని అబిడ్స్ జీపీఓ సర్కిల్ నెహ్రూ విగ్రహం వద్ద మంగళవారం ఉదయం 11 గంటలకు సామూహిక జాతీయ గీతాలాపన జరగనుంది. కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కానున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన ఉద్యోగులతో పాటు కళాశాల విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గోనున్నారు. జీపీఓ సర్కిల్ వద్ద స్వాతంత్య్ర సమరయోధుల చిత్ర పటాలు ప్రదర్శించనున్నారు. రంగురంగుల బ్యానర్లు, గీతాలాపన చేయడానికి మైక్ ఏర్పాట్లు చేశారు. గోల్కొండ కోటలో జాతీయ పతాకంతో కళాకారుడి ఆనంద హేల సామూహిక గీతాలాపన ఏర్పాట్లను సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్కుమార్ పరిశీలించారు. ట్రాఫిక్ నిబంధనలు, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట జీఏడీ కార్యదర్శి శేషాద్రి, అడిషనల్ డీజీపీ జితేందర్, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఉన్నత విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, కార్యదర్శి వాకాటి కరుణ, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, హైదరాబాద్ కలెక్టర్ అమయ్ కుమార్, సిటీ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ తదితరులు ఉన్నారు. ర్యాలీ నిర్వహిస్తున్న అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ అధ్యాపకులు తిరంగా సంబరం తరంగమై ఎగిసింది. నగరం అంగరంగ వైభవంగా మెరిసింది. మువ్వన్నెల జెండా వజ్రోత్సవంలా మురిసింది. స్వాతంత్య్ర శోభ వెల్లివిరిసింది. ఇళ్లు, వీధులు, వాహనాలపై త్రివర్ణ పతాకాలు సమున్నతంగా ఆవిష్కృతమయ్యాయి. సోమవారం నగరంలో స్వాతంత్య్ర దినోత్సవ సంబురాలు అంబరమంటాయి. ట్యాంక్బండ్, నెక్లెస్ రోడ్ ప్రాంతాల్లో భారీ జెండాలతో బైక్ ర్యాలీలు, కారు ర్యాలీలు జోరుగా సాగాయి. భారీ జాతీయ జెండా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పాతబస్తీలో జాతీయ జెండాలతో ఉత్సాహంగా ముస్లిం మహిళలు వజ్రోత్సవాల్లో భాగంగా ప్రతి పది మీటర్లకు ఒకటి చొప్పున ఏర్పాటు చేసిన పతాకాలు చూడముచ్చగా కనువిందు చేశాయి. సంజీవయ్య పార్క్ సమీపంలో జాతీయ జెండాలతో వింటేజ్ కార్లతో చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది. అబిడ్స్ మొజంజాహీ మార్కెట్ వేదికగా అతి పొడవైన జాతీయ జెండాతో చేసిన ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కళాశాలు, స్కూళ్లలో వేడుకలు ఆనందోత్సాహాలతో సాగాయి. కళాకారులు దేశభక్తి ఉట్టిపడేలా తయారైన విధానం అందరినీ ఆకట్టుకుంది. ట్యాంక్బండ్పై త్రివర్ణ పతాకాలతో ర్యాలీ నగరంలోని చారిత్రక కట్టడాలు, ప్రభుత్వ భవనాలతో పాటు నలుమూలలా వ్యాపించి ఉన్న కార్పొరేట్ ఆఫీసుల్లో, ఐటీ కంపెనీల్లో, విద్యా సంస్థల్లో 75 వసంతాల వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో గోల్కొండ కోట వేదికగా ఘనంగా సాంస్కృతిక కార్యక్రమాలతో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈసారి స్వాతంత్య్ర దినోత్సవాల్లో నగర యువత ఆసక్తిగా పాల్గొని సందడి చేశారు. వజ్రోత్సవాల్లో భాగంగా నగరానికి చెందిన మైక్రో ఆరి్టస్టు కృష్ణ ఉట్ల బియ్యపు గింజపై జాతీయ జెండాను రూపొందించారు. చిన్న పరిమాణంలో ఉండే బియ్యపు గింజపై అశోక చక్రం, మూడు వర్ణాలతో ఉన్న జాతీయ జెండాను వేసి దేశభక్తిని చాటుకున్నాడు. – సాక్షి, సిటీబ్యూరో (చదవండి: దేశాన్ని విచ్ఛిన్నం చేసే రాజకీయ శక్తులను అడ్డుకోవాలి) -
అమర్నాథ్లో ఆకస్మిక వరదలు.. ఆ దృశ్యం కళ్లారా చూశా: రాజాసింగ్
అబిడ్స్ (హైదరాబాద్): అమర్నాథ్ యాత్రకు వెళ్లిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అక్కడ భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ శుక్రవారం దైవదర్శనం చేసుకున్నారు. కుండపోత వర్షంతో అమర్నాథ్లో వరదలు రావడంతో వేలాది మంది భక్తులు ఇబ్బందులకు గురయ్యారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి రాజాసింగ్ ‘సాక్షి’ తో ఫోన్లో మాట్లాడారు. కుటుంబంతో కలిసి అమర్నాథ్ దర్శనం చేసుకుని జమ్మూకశ్మీర్ వరకు తరలి వచ్చినట్లు తెలి పారు. హెలికాప్టర్ అందుబాటులో లేకపోవడంతో గుర్రాలపై చేరుకున్నామన్నారు. వరదలు రావడం కొద్ది దూరం నుంచి కళ్లారా చూశానని, తన కళ్ల ముందే టెంట్లు కొట్టుకుపోయాయని వివరించారు. దీంతో వెంటనే అక్కడి నుంచి తరలి పోయామని చెప్పారు. కాగా, శనివారం వైష్ణవీదేవి దర్శనానికి వెళ్తున్నట్లు రాజాసింగ్ తెలిపారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి👉🏾Hyderabad: కుండపోత.. సిటీలో రోజంతా వర్షం -
జేఈఈ మెయిన్స్కు ‘సర్వర్’ షాక్
సాక్షి, హైదరాబాద్/సుల్తాన్బజార్: జేఈఈ మెయిన్స్ పరీక్ష శుక్రవారం విద్యార్థులకు చుక్కలు చూపింది. ప్రధానంగా హైదరాబాద్లోని అబిడ్స్, మూసారాంబాగ్లలో ఓ ప్రైవేటు కాలేజీకి చెందిన రెండు కేంద్రాల్లో సాంకేతిక సమస్యలతో పరీక్ష గంటల తరబడి ఆలస్యమైంది. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆ పరీక్ష కేంద్రాల వద్ద ఆందోళనకు దిగారు. పరీక్ష నిర్వహణలో జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విఫలమైందని మండిపడ్డారు. కొందరు విద్యార్థులు కాలేజీ అద్దాలు పగలగొట్టారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని శాంతింపజేశారు. సర్వర్ మొరాయించడంతో... దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్స్ తొలిదశ పరీక్షను ఈ నెల 23 నుంచి 29 వరకు ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్లోని మూసా రాంబాగ్ పరీక్ష కేంద్రంలో శుక్రవారం ఉద యం 9 గంటలకు పరీక్ష ప్రారంభం కావాల్సి ఉండగా విద్యార్థులు 8 గంటలకే కేంద్రానికి చేరుకున్నారు. అయితే ఆడ్మిట్ కార్డుపై బార్ కోడ్ను స్కాన్ చేసే సమయంలో ఎన్టీఏతో అను సంధానమైన సర్వర్ మొరాయించింది. చాలా సేపటి వరకూ అది పనిచేయలేదు. చివరకు కనెక్ట్ అవ్వడంతో విద్యార్థులను పరీక్ష హాలు లోకి పంపారు. అప్పటికే మానసిక ఆందోళనకు గురైన విద్యా ర్థులు పూర్తిస్థాయి లో పరీక్ష రాయలేకపోయి నట్లు తెలిపారు. కంప్యూ టర్ స్క్రీన్పై కొన్ని ప్రశ్నలు సైతం సరిగ్గా కని పించలేదని.. ఫలితంగా పదుల సంఖ్యలో మార్కులు కోల్పో యామని పేర్కొ న్నారు. మధ్యాహ్నం 3 గంట ల సెషన్లోనూ ఇదే సమస్య తలెత్తింది. కొంద రు విద్యార్థులు మొత్తం ప్రశ్నలు కన్పించలేదని తెలిపారు. అబిడ్స్లోని పరీక్ష కేంద్రంలోనూ ఇదే రకమైన సమస్య ఎదురైంది. ఉదయం 9 గంటలకు జర గాల్సిన పరీక్ష 10:30 గంటలకు మొదలైంది. ఇక మధ్యాహ్నం 3 గంటలకు జరగాల్సిన పరీక్ష సాంకేతిక కారణాలతో సాయంత్రం 5 గంటల వరకు మొదలుకాక పోవడంతో ఆ కేంద్రంలో పరీక్షను ఎన్టీఏ వాయిదా వేసినట్లు కాలేజీ నిర్వాహకులు ఓ నోట్ విడుదల చేశారు. పరీక్ష తేదీని ఎన్టీఏ త్వరలో ప్రకటిస్తుందన్నారు. గణితం తికమక... ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈజీ రెండేళ్ల జేఈఈ మెయిన్స్ పేపర్తో పోలిస్తే ఈసారి తేలికగానే ఉంది. అయితే కరోనా కారణంగా రెండేళ్లుగా ఆన్లైన్ బోధన జరగడం వల్ల కొంత ఇబ్బంది పడే వీలుంది. గణితం 5 నుంచి 10 న్యూమరికల్ ప్రశ్నలు మినహా సమాధానాలు గుర్తించడానికి ఎక్కువ సమయం తీసుకుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీలో ప్రశ్నలు గతంలో వచ్చినవే ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువగా ఎన్సీఈ ఆర్టీ సిలబస్ నుంచే ప్రశ్నలు వచ్చాయి. జనరల్ కేటగిరీ అభ్యర్థులు 300 మార్కులకు 78 నుంచి 87 మార్కులు తెచ్చుకుంటే అడ్వాన్స్డ్కు అర్హత సాధించే అవకాశం ఉంది. ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కోటా అభ్యర్థులు 60 నుంచి 65 మార్కులతో క్వాలిఫై అవుతారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 40–50 మార్కులతో క్వాలిఫై అయ్యే అవకాశం కనిపిస్తోంది. – ఎంఎన్రావు, గణిత శాస్త్ర నిపుణుడు తీవ్ర ఆందోళనకు గురయ్యాం దాదాపు 4 గంటలు ఎండలో ఉండాల్సి వచ్చింది. సర్వర్ పనిచేయడం లేదని చెప్పారు. ఆ తర్వాత తర్వాత పరీక్ష రాసినా తీవ్ర ఆందోళన మధ్య సరిగా సమాధానాలు ఇవ్వలేకపోయాం. ఈ పరీక్షను తిరిగి నిర్వహిస్తే బాగుంటుంది. – అతావుల్లా, జేఈఈ పరీక్ష రాసిన విద్యార్థి, టౌలిచౌకి అరోరా కాలేజీ వద్ద ఉద్రిక్తత అబిడ్స్ అరోరా కాలేజీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కావాల్సిన జేఈఈ మెయిన్స్ పరీక్ష ఇంకా జరగలేదు. ఇదే విషయంపై సిబ్బందిని ప్రశ్నిస్తే సర్వర్డౌన్, టెక్నికల్ ప్రాబ్లమని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు కాలేజీ కిటికీల అద్దాలను ధ్వంసం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు కాలేజీ బయట రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. దీంతో అబిడ్స్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. చదవండి: (అర్ధరాత్రి ఫోన్.. భర్త వార్నింగ్.. గంట తర్వాత చూస్తే..) -
ఆబిడ్స్ పీఎస్ లో ఎమ్మెల్యే రఘునందన్ పై కేసు
-
హంతకులను ఉరి తీయాలి.. నీరజ్ పన్వార్ భార్య సంజన డిమాండ్
అబిడ్స్/నాంపల్లి: నీరజ్ పన్వార్ను తన బంధువులే చంపారని, హత్య చేసిన వారిని ఉరి తీయాలని మృతుడి భార్య సంజన డిమాండ్ చేశారు. తాను, నీరజ్.. ప్రేమించి పెళ్లి చేసుకోవడం నేరమా అని ప్రశ్నించారు. తన కజిన్ బ్రదర్సే నీరజ్ను చంపారని వెల్లడించారు. ఫాస్ట్రాక్ కోర్టు ద్వారా కేసు విచారణ జరపాలని, నిందితులపై పీడీయాక్ట్ నమోదు చేయాలని కోరారు. నీరజ్ హత్యను నిరసిస్తూ.. సంజన, స్థానిక వ్యాపారులు శనివారం ఆందోళనకు దిగారు. దీంతో బేగంబజార్లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వందలాది మంది వ్యాపారులు దుకాణాలను మూసివేసి ఆందోళన చేశారు. షాహినాయత్గంజ్ పోలీస్స్టేషన్ ముందు 2 నెలల పసికందుతో సంజన, ఆమె బంధువులు, వ్యాపారులు దాదాపు 3 గంటల పాటు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. హంతకులను ఉరితీయాలని, అంతవరకు ఆందోళన చేస్తామని బైఠాయించారు. వెస్ట్జోన్ డీసీపీ జోయల్ డేవిస్, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. అనంతరం సంజన మీడియాతో మాట్లాడారు. హంతకులు తన 2 నెలల కొడుకును కూడా చంపుతారన్న భయాందోళన వ్యక్తం చేశారు. వాళ్లు గతంలో తనను, నీరజ్ను చాలాసార్లు బెదిరించారని చెప్పారు. తనకు, అత్తామామలకు, తన కొడుకుకు పోలీసులు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వారికి ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. తన కళ్లెదుటే నీరజ్ను పొడిచేశారని అతని తాత జగదీశ్ పన్వార్ వాపోయారు. తను, నీరజ్ బేగంబజార్ ఫిష్మార్కెట్ వద్ద వెళ్తుండగా, వెంబడించిన ఐదుగురు దుండగులు తమ ముందుకొచ్చి కళ్లల్లో ఏదో చల్లారన్నారు. దీంతో తమకు ఏమీ కనిపించలేదని చెప్పారు. దుండగులు నీరజ్ తలపై బండరాయితో కొట్టి కత్తులతో పొడిచారని పేర్కొన్నారు. అడ్డుకునేందుకు ప్రయత్నించగా తనపై కూడా దాడి చేశారన్నారు. చంపుతామని బెదిరిస్తున్నారని ఏడాది క్రితమే అఫ్జల్గంజ్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఇలా జరిగిందని రోదిస్తూ వెల్లడించారు. కులాంతర వివాహం నచ్చకే.. బేగంబజార్ పరువు హత్య కేసును షాహినాయత్గంజ్ పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. నీరజ్ను హత్య చేసిన ఆరుగురిలో నలుగురిని అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. అరెస్టయిన వారిలో ఒక మైనర్ బాలుడు ఉన్నట్లు పశ్చిమ మండల డీసీపీ జోయల్ డేవిస్ వెల్లడించారు. ఈ మేరకు శనివారం గోషామహల్లోని షాహినాయత్గంజ్ పోలీస్స్టేషన్లో మీడియాకు హత్య వివ రాలు వెల్లడించారు. ‘కోల్సావాడికి చెందిన రాజేంద్రప్రసాద్ పన్వార్ కుమారుడు నీరజ్(20) వృత్తిరీత్యా వేరుశనగ గింజల వ్యాపారం చేస్తుంటారు. అదే బస్తీలో ఉండే సంజనను నీరజ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే సంజన తల్లిదండ్రులు ఈ వివాహాన్ని వ్యతిరేకించారు. దీంతో పాతబస్తీలో ఫలక్నుమాలోని శంషీర్గంజ్లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నీరజ్, సంజన జీవిస్తున్నారు. అయితే నీరజ్ వ్యాపారం బేగంబజార్లో ఉండటంతో రోజూ ఫలక్నుమా నుంచి వచ్చి పోతుండేవారు. కులాంతర వివాహం చేసుకున్న నీరజ్ను అంతమొందించాలని 15 రోజుల నుంచి సంజన బంధువులు బేగంబజార్కు వచ్చి రెక్కీ నిర్వహించారు. కోల్సావాడికి చెందిన సంజన బంధువులైన మదన్లాల్ కుమారుడు అభినందన్ యాదవ్ అలియాస్ నందన్(26), యాదవ్లాల్ యాదవ్ కుమారుడైన కె.విజయ్(22), జై చరణ్ యాదవ్ కుమారుడు కె.సంజయ్(25), శ్రవణ్ యాదవ్ కుమారుడు బి.రోహిత్(18), అఫ్జల్గంజ్ నివాసి మహేష్ అహీర్ యాదవ్ అలియాస్ గోటియా(21), మరో మైనర్ బాలుడితో కలసి హత్యకు కుట్రపన్నారు. ఇందులో భాగంగా జుమేరాత్ బజార్లో కత్తులు కొనుగోలు చేశారు. శుక్రవారం సాయంత్రం పీకల దాకా మద్యాన్ని సేవించారు. నీరజ్ను చంపేందుకు 2 ద్విచక్ర వాహనాలపై బేగంబజార్కు చేరుకున్నారు. నీరజ్ తన తాతతో కలసి వెళ్తుండగా అడ్డగించి కత్తులతో పొడిచి పారిపోయారు. నీరజ్ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందారు. దీంతో హత్య కేసు నమోదు చేసుకుని ఏడు బృందాలను రంగంలోకి దించాం. నగర శివార్లలో తలదాచుకున్న నలుగురిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న అభినందన్ యాదవ్, మహేష్ యాదవ్ను త్వరలోనే పట్టుకుంటాం’అని డీసీపీ వెల్లడించారు. -
25 నుంచి నుమాయిష్ పునఃప్రారంభం
అబిడ్స్: ఈ నెల 25 నుంచి ఎగ్జిబిషన్ (నుమాయిష్) ప్రారంభం కానుంది. ఇందుకోసం ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందని ఎగ్జిబిషన్ సొసైటీ గౌరవ కార్యదర్శి ఆదిత్య మార్గం తెలిపారు. జనవరి 1న ప్రారంభమైన నుమాయిష్ను కరోనా కారణాలతో 2 నుంచి నిలిపివేయడం తెలిసిందే. కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం ఎగ్జిబిషన్కు అనుమతి ఇచ్చింది. దాదాపు 1500 స్టాళ్లతో ఎగ్జిబిషన్ ప్రారంభం కానుంది. ప్రభుత్వ, ప్రైవేటు స్టాళ్లతో పాటు పలు రాష్ట్రాల స్టాళ్లను కూడా ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేస్తారు. ఎగ్జిబిషన్ సొసైటీ ఎగ్జిబిషన్ను పునఃప్రారంభించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేసింది. -
HYD: ఆరేళ్ల చిన్నారిపై అఘాయిత్యాన్ని అడ్డుకున్న ఆటోడ్రైవర్
సాక్షి, హైదరాబాద్: అబిడ్స్లోని జీపీఓ సమీపంలో బుధవారం తెల్లవారుజామున ఓ చిన్నారిపై అఘాయిత్యాన్ని ఆటోడ్రైవర్ జాహిద్ అడ్డుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ స్పందించారు. జాహిద్ను తన కార్యాలయానికి పిలిపించుకుని అభినందించడంతో పాటు జ్ఞాపిక అందించారు. సీపీ చెప్పిన వివరాల ప్రకారం.. ► హఫీజ్పేటకు చెందిన ఓ మహిళ నిత్యం తన ఇద్దరు కుమార్తెలతో (ఆరేళ్లు, రెండేళ్లు) కలిసి ఎంఎంటీఎస్ రైలులో వచ్చి నాంపల్లి యూసిఫియాన్ దర్గా వద్ద భిక్షాటన చేసుకుని రాత్రికి తిరిగి వెళ్తూంటుంది. మంగళవారం కూడా ఇలాగే చేసిన మహిళ జీపీఓ వద్ద ఉండే తన సోదరుణ్ని కలవడానికి వెళ్లింది. అక్కడ ఆలస్యం కావడంతో వీళ్లు తిరిగి వెళ్లే రైలు సమయం దాటిపోయింది. దీంతో ఆ రాత్రికి తన సోదరుడితో కలిసి జీపీఓ వద్ద ఫుట్పాత్పై నిద్రించింది. చదవండి: తండ్రి అత్యాచారం.. గర్భం దాల్చిన బాలిక ► బుధవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో అఫ్జల్గంజ్ ప్రాంతానికి చెందిన మహ్మద్ ఛోటూ అటుగా వెళ్తూ వీళ్లని గమనించాడు. అంతా నిద్రలో ఉన్నారని తెలుసుకుని ఆరేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి యత్నించాడు. తన ఆటోను అక్కడే పార్క్ చేసి.. ప్రయాణికుల కోసం వేచి చూస్తున్న సయ్యద్ జాహిద్ ఈ విషయం గమనించాడు. వెంటనే అప్రమత్తమై ఛోటూను వారించడంతో పాటు నిద్రిస్తున్న చిన్నారి తల్లి, ఆమె సోదరుణ్ని లేపాడు. ► వీరితో ఛోటూ వాగ్వాదానికి దిగగా... అటుగా వస్తున్న అబిడ్స్ ఠాణాకు చెందిన గస్తీ పోలీసులు గమనించారు. వారిని పోలీసుస్టేషన్కు తీసుకువెళ్లి విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఛోటూపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. బాధ్యతగా స్పందించిన జాహిద్ను కమిషనర్ తన కార్యాలయానికి పిలిపించుకుని అభినందించారు. -
రూ.100 కోట్ల బంగారం దారి మళ్లింపు కేసులో ఈడీ దూకుడు
సాక్షి, హైదరాబాద్: విదేశాలకు ఎగుమతి చేయాల్సిన బంగారాన్ని దారి మళ్లించి దేశీయ విపణిలో విక్రయించిన ఆరోపణలపై ఘన్శ్యామ్దాస్ జెమ్స్ అండ్ జ్యువెల్స్ సహా మరికొన్ని సంస్థలపై నమోదు చేసిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కొరడా ఝుళిపించింది. ఈ ఏడాది మార్చిలో నమోదైన కేసుకు సంబంధించి ముగ్గురికి చెందిన రూ. 25.28 కోట్ల విలువైన ఆస్తుల్ని బుధవారం తాత్కాలిక జప్తు చేసింది. సంజయ్ కుమార్ అగర్వాల్, రాధిక అగర్వాల్, సంజయ్ కుమారుడు ప్రీత్ కుమార్ అగర్వాల్కు చెందిన ఖరీదైన విల్లాలతో పాటు 54 కేజీల బంగారం ఎటాచ్ చేసిన వాటిలో ఉన్నాయి. ►అబిడ్స్ కేంద్రంగా కార్యకలాపాలు నడిపే ఘన్శ్యామ్దాస్ సంస్థను సంజయ్ కుమార్ నిర్వహిస్తున్నారు. ఈయనతో పాటు ఇతరులూ విదేశాలకు ఎగుమతి చేసే నెపంతో నకిలీ పత్రాలు సృష్టించి ఎంఎంటీసీ, స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, డైమండ్ ఇండియా లిమిటెడ్ సంస్థల నుంచి 250 కేజీల బంగారం ఖరీదు చేశారు. ►ఎక్స్పోర్ట్ చేసే పసిడిపై కస్టమ్స్ సుంకం లేకపోవడాన్ని వీళ్లు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. ఈ మొత్తం బంగారాన్నిదారి మళ్లించి దేశీయ విపణిలోనే విక్రయించేశారు. దానికి సంబంధించన నగదు లావాదేవీలన్నీ హవాలా రూపంలో సాగించారు. ►కోల్కతాకు చెందిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు ఈ విషయం గుర్తించారు. 2018 ఏప్రిల్ 4న ప్రీత్ కుమార్ అగర్వాల్ను కోల్కతా విమానాశ్రయంలో పట్టుకున్నారు. అప్పటికే సంజయ్ అగర్వాల్ హైదరాబాద్ రావడానికి ఇండిగో సంస్థకు చెందిన విమానం ఎక్కేశారు. దీన్ని గుర్తించిన డీఆర్ఐ అధికారులు విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ కింద వెనక్కు రప్పించి ఆయన్నూ అరెస్టు చేశారు. అదేరోజు ఇండిగో ఎయిర్లైన్స్ డొమెస్టిక్ కార్గోలో రెండు బాక్సుల్లో ఉన్న రూ.16 కోట్ల విలువైన 1,194 బంగారం ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. ►ఎంఎంటీసీ సహా మూడు సంస్థల నుంచి ఖరీదు చేసిన బంగారాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు వీళ్లు అన్ని పత్రాలు సిద్ధం చేసేవాళ్లు. విమానాశ్రయం వర కు వెళ్లిన తర్వాత ఆ బంగారాన్ని దారి మళ్లించి డొమెస్టిక్ కార్గొ ద్వారా హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాలకు అక్రమ రవాణా చేస్తూ వచ్చారని డీఆర్ఐ తేల్చింది. దీనికిపై ఈ ఏడాది మార్చిలో కోల్కతాకు చెందిన ఈడీ అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వీళ్లు వివిధ దశల్లో రూ.100 కోట్ల విలువైన 250 కేజీల బంగారం దారి మళ్లించినట్లు తేల్చారు. ►ఈ నేపథ్యంలోనే కోల్కతా ఈడీ అధికారులు నగర యూనిట్ సహకారంతో ఈ ఏడాది మార్చిలో ఘన్శ్యామ్దాస్ సంస్థతో పాటు శ్రీగణేష్ జ్యువెల్స్, పీహెచ్ జ్యువెల్స్ సంస్థలోదాడులు చేసి కీలక ఆధారాలు సేకరించారు. ఈ కేసులోనే ఈడీ బుధవారం ఆస్తులను తాత్కాలిక జప్తు చేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను మోసం చేసిన కేసులో సంజయ్కుమార్ అగర్వాల్ను 2012 ఫిబ్రవరిలో సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. -
హైదరాబాద్: అబిడ్స్ ఎస్బీఐలో కాల్పుల కలకలం
-
అబిడ్స్ ఎస్బీఐలో కాల్పుల కలకలం
సాక్షి, హైదరాబాద్: కూకట్పల్లి ఏటీఎం వద్ద దుండగులు కాల్పులకు పాల్పడిన ఘటన మరవక ముందే హైదరాబాద్లో మరో దారుణం చోటు చేసుకుంది. ఈ సారి ఏకంగా ఎస్బీఐ బ్యాంక్లో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఓ మహిళతో పాటు ఎస్బీఐ కాంట్రాక్ట్ ఉద్యోగి ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ వివరాలు.. అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్బీఐ బ్యాంక్లో బుధవారం కాల్పులు చోటు చేసుకున్నాయి. కాంట్రాక్ట్ ఉద్యోగి సురేందర్పై సెక్యూరిటీ గార్డ్ సర్దార్ ఖాన్ కాల్పులు జరిపాడు. సెక్యూరిటీ వెపన్తో రెండు రౌండ్ల కాల్పులు జరిపాడు సర్దార్ ఖాన్. ఈ ఘటనలో సురేందర్ తీవ్రంగా గాయపడటమే కాక.. అక్కడే ఉన్న మహిళా కస్టమర్ కడుపులోకి బుల్లెట్ దూసుకెళ్లడంతో ఆమెకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. సురేందర్, సెక్యూరిటీ గార్డు ఇద్దరి మధ్య తలెత్తిన వివాదం కాస్త చినికి చినికి చివరకు కాల్పులు చోటు చేసుకునే వరకు వచ్చినట్లు సమాచారం. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సురేందర్ను, మహిళను హైదర్గూడ అపోలో ఆస్పత్రికి తరలించారు. కాల్పులు జరిపిన సెక్యూరిటీ గార్డు సర్దార్ ఖాన్ను అబిడ్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివాదానికి కారణం తెలియాల్సి ఉంది. కాల్పుల ఘటనపై అబిడ్స్ ఏసీసీ వెంకట్రెడ్డి మాట్లాడారు. ‘‘బ్యాంక్ ఉద్యోగి, సెక్యూరిటీగార్డుకు మధ్య మాటా మాటా పెరగడంతో కాల్పులకు దారితీసింది. ఆవేశంతో సెక్యూరిటీగార్డు తన గన్తో సురేందర్పై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో సురేందర్ కడుపులోకి రెండు బుల్లెట్లు దిగాయి. సెక్యూరిటీగార్డు సర్దార్ఖాన్ను అదుపులోకి తీసుకున్నాం’’ అని వెంకట్రెడ్డి తెలిపారు. -
అబిడ్స్లో భారీ అగ్నిప్రమాదం
సాక్షి, హైదరాబాద్: అబిడ్స్లోని ట్రూప్ బజార్లో శుక్రవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక డీకే సానిటరీ షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మంటలు అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. నిత్యం రద్దీగా ఉండే ట్రూప్ బజార్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడంతో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని వాహనాలను దారి మల్లిస్తున్నారు. -
'మద్యం తాగించి నాపై అత్యాచారం చేశాడు'
సాక్షి, హైదరాబాద్ : ప్రేమ పేరుతో ఒక యువతిని నమ్మించి ఆపై శారీరకంగా మోసం చేసిన ఘటన హైదరాబాద్లోని అబిడ్స్లో ఆలస్యంగా వెలుగుచూసింది. ప్రియుడిపై కేసు నమోదు చేసి మూడు నెలలు కావొస్తున్నా కేసులో ఎలాంటి పురోగతి లేకపోడంతో బాధితురాలు మీడియా ముందుకు వచ్చి తనకు న్యాయం చేయాలని కోరారు. వివరాలు.. అబిడ్స్లో ఉంటున్న మహెయ్స్ మరియం అనే యువతిని బంజారాహిల్స్కు చెందిన సయ్యద్ ఇమ్రాన్ హైమద్ గత కొంతకాలంగా ప్రేమిస్తున్నానంటూ వెంబడించాడు. కాగా ఇమ్రాన్ ఆ యువతిని పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి మరియంను క్రైస్తవ మతం నుంచి ముస్లిం మత మార్పిడి చేయించాడు. ఈ నేపథ్యంలో ఒకరోజు మరియం వద్దకు వచ్చిన ఇమ్రాన్ ఒక హోటల్లో తెలిసిన వారి ఫంక్షన్ ఉందని చెప్పి వెళ్దామన్నాడు. అయితే మరియం రానని మొండికేయడంతో చేయి చేసుకొని ఆమెకు బలవంతంగా మద్యం తాగించి ఆపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కొంతకాలానికి మరియం గర్భం దాల్చిందని తెలుసుకున్న ఆమె ప్రియుడు బలవంతంగా అబార్షన్ చేయించాడు. దీంతో పెళ్లి చేసుకుంటానని చెప్పి శారీరకంగా అనుభవించి మోసం చేశాడంటూ మరియం అబిడ్స్ పోలీసులను ఆశ్రయించింది. అయితే ఇది మా పరిధిలోకి రాదని చెప్పిన పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి బంజారాహిల్స్ పోలీస్స్టేషన్కు కేసును బదిలీ చేశారు. ఇది జరిగి దాదాపు మూడు నెలలు కావొస్తోంది. అప్పటి నుంచి సదరు యువతి పోలీస్స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా కేసులో ఎలాంటి పురోగతి లేదు. తనకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదని బావించి తాను మీడియా ముందుకు వచ్చినట్లు మరియం పేర్కొన్నారు. -
బాలకృష్ణ అల్లుడు భరత్కు మరో షాక్!
-
బాలయ్య చిన్నల్లుడు భరత్కు మరో షాక్!
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ చిన్నల్లుడు, గీతం సంస్థల అధినేత భరత్కు మరో భారీ షాక్ తగిలింది. రుణాల చెల్లింపు ఎగవేసిన కారణంగా భరత్ తండ్రి పట్టాభి రామారావు సహా ఇతర కుటుంబీకుల ఆస్తుల జప్తునకు అబిడ్స్ కరూర్ వైశ్యా బ్యాంకు నోటీసులు జారీ చేసింది. కాగా టెక్నో యూనిక్ ఇన్ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరిట భరత్ కుటుంబీకులు తీసుకున్న రుణం అసలు, వడ్డీ కలిపి రూ. 124 కోట్ల 39 లక్షల 21 వేల, 485 పైసలు.. జనవరి 21, 2020లోగా చెల్లించాలని గతంలో బ్యాంకు నోటీసులు జారీ చేసింది. అయితే వారు ఇందుకు స్పందించపోవడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో రుణం కోసం బ్యాంకులో తాకట్టు పెట్టిన గాజువాక మండలం, భీమిలి మండలంలోని భూములను స్వాధీనం చేసుకుని, వేలం వేస్తామని హెచ్చరించింది. ఇక గతంలో భరత్ ఆంధ్రా భ్యాంకుకు సుమారు రూ. 100 కోట్ల రుణం ఎగవేసినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా కరూర్ వైశ్యా బ్యాంకుకు రుణం ఎగవేయడంతో ఆస్తుల జప్తునకు నోటీసు జారీ అయ్యింది. కాగా గత ఎన్నికల్లో విశాఖపట్నం లోక్సభ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన భరత్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. -
వైరల్ : ప్రార్థన చేసి, గుంజీలు తీసి ఆపై..
సాక్షి , హైదరాబాద్ : ఒక దొంగ దర్జాగా గుడి లోపలికి వచ్చి దేవుడిని ప్రార్థన చేసి మరీ కిరీటాన్ని ఎత్తుకెళ్లాడు. ఈ వింత ఘటన మన హైదరాబాద్లోని అబిడ్స్ ప్రాంతంలోనే బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. కాగా దొంగ చేసిన పని సీసీ కెమెరాలో రికార్డవడం అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే దొంగతనం చేసే ముందు ఆ వ్యక్తి చేసిన పని అందరికి నవ్వు తెప్పిస్తుంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్లో నిత్యం రద్దీగా ఉండే అబిడ్స్ ప్రాంతంలో ఉన్న దుర్గ గుడికి బుధవారం సాయంత్రం ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి వచ్చిన సమయంలో గుడిలో ఎవరు లేరు. ఇదే అదనుగా భావించిన సదరు దొంగ కిరీటాన్నీ ఎత్తుకెళ్లాలని భావించాడు. అయితే కిరీటాన్ని దొంగలించడానికి ముందు తనను క్షమించాలంటూ ప్రదర్శనలు చేసి దేవతను ప్రార్థించి కొన్ని గుంజీలు తీశాడు. తరువాత తనను ఎవరైనా గమనిస్తున్నారేమోనని చుట్టు పక్కల చూశాడు. ఎవరు చూడట్లేదని నిర్థారించుకొని మెళ్లిగా కిరీటాన్ని తీసి తన షర్టులోకి దోపుకున్నాడు. మళ్లీ ఎప్పటిలాగే ఎవరికి ఏ అనుమానం రాకుండా బైక్పై అక్కడి నుంచి పరారయ్యడు. గురువారం ఉదయం యధావిధిగా గుడికి వచ్చిన పూజారి విగ్రహానికి కిరీటం లేకపోవడాన్ని గమనించాడు. దీంతో వెంటనే మేనేజర్కు తెలపగా అతను పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సీసీ కెమెరాలు పరిక్షించి దొంగ చేసిన పనికి అవాక్కయ్యారు. దొంగపై సెక్షన్ 380 కేసు నమోదు చేసి నిందితుని కోసం గాలిస్తున్నారు. అయితే ఈ వీడియోపై సోషల్ మీడియాలో మాత్రం విపరీతమైన కామెంట్లు వస్తున్నాయి. దేవుడి సొమ్మును ఎత్తుకెళ్తున్నందుకు తనకు ఏ పాపం తగలకూడదనే ఇలా చేసి ఉంటాడని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. -
ఐక్యంగా ముందుకు సాగుదాం
సాక్షి, హైదరాబాద్: ఐక్యమత్యంగా ఉండి తమ హక్కులు సాధించుకోవాలని నాయీ బ్రాహ్మణ నాయకులు అభిప్రాయపడ్డారు. ఆదివారం ఆబిడ్స్లోని జయ ఇంటర్నేషనల్ హోటల్లో జరిగిన దసరా ఆత్మీయ సమ్మేళనంలో నాయీ బ్రాహ్మణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ.. దాడుల నుంచి రక్షణ కల్పించేందుకు ప్రత్యేక చట్టం తేవాల్సిన ఆవశ్యకతను వివరించారు. ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. నాయీ బ్రాహ్మణులు ఇప్పటికీ ఎంతో వెనుకబడి ఉన్నారని, రాజకీయంగా ఎదగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎన్నికల్లో తమకు సరైన అవకాశాలు దక్కడం లేదని, తమ వాటా తమకు ఇవ్వడం లేదని వాపోయారు. ఎన్నికల్లోనూ బీసీ వర్గీకరణ అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీ వర్గీకరణ కోసం న్యాయ పోరాటం చేస్తూనే, రాజకీయ పార్టీలపై ఒత్తిడి తీసుకోస్తామన్నారు. నాయీ బ్రాహ్మణులు సామాజికంగా, ఆర్థికంగా పురోభివృద్ధి సాధించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తోడ్పాటు అందించాలని కోరారు. తమను అత్యంత వెనుకబడిన బలహీన వర్గాల జాబితాలో చేర్చాలని జస్టిస్ రోహిణి కమిషన్కు వినతులు ఇచ్చినట్టు వెల్లడించారు. కాగా, తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు నాయీ బ్రాహ్మణులు తమ సంఘీభావం తెలిపారు. 25న ధన్వంతరి జయంతి వేడుకలు వైద్య వృత్తికి ఆదిదేవుడు, నాయీ బ్రాహ్మణుల కులదైవమైన ధన్వంతరి జయంతి వేడుకలను ఈ నెల 25న నిర్వహించనున్నామని డాక్టర్ బీర్ఆర్కేఆర్ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. సారంగపాణి తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయంతం చేసి నాయీ బ్రాహ్మణుల ఐక్యతను చాటిచెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ధన్వంతరి స్ఫూర్తితో అన్ని రంగాల్లో ముందుడుగు వేయాలని ఆయన ఆకాంక్షించారు. తమ సంఘీయుల మధ్య సృహృద్భావ సంబంధాలు ఏర్పాలడాలన్న ఉద్దేశంతో దసరా ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు న్యాయవాది ఎం. రమేశ్, ఎం. గోపాలకృష్ణ. ఎ. సుధాకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మహేంద్రచంద్ర, కె. వెంకటేశ్వరరావు, జి. అశోక్, గంగాధర్, సీఎల్ఎన్ గాంధీ, రామానందస్వామి, నాగన్న, మద్దికుంట లింగం, సీనియర్ కార్టూనిస్ట్ నారూ, రాపోలు సుదర్శన్, వెంకట్రాయుడు, సూర్యనారాయణ, బాలరాజు, ధనరాజ్, శ్రీధర్, రాజేశ్, పసుపుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
నాయీ బ్రాహ్మణుల అలయ్ బలయ్
సాక్షి, హైదరాబాద్: నాయీ బ్రాహ్మణుల దసరా ఆత్మీయ సదస్సు(అలయ్ బలయ్) ఆదివారం ఆబిడ్స్లోని హోటల్ మందాకిని జయ ఇంటర్నేషనల్లో జరగనుంది. నాయీ జాతి రత్నాలు సంస్థ ఆధ్వర్యంలో జరగనున్న ఈ కార్యక్రమానికి నాయీ బ్రాహ్మణులు తరలి రావాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు ఆత్మీయ సదస్సు జరుగుతుందని తెలిపారు. నాలుగేళ్లుగా ఈ కార్యక్రమం చేస్తున్నామని నిర్వాహకులు న్యాయవాది ఎం. రమేశ్, ఎం. గోపాలకృష్ణ. ఎ. సుధాకర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నాయీ బ్రాహ్మణుల ఐక్యమత్యానికి, సృహృద్భావ సంబంధాల కోసం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. -
విజేత హిందూ పబ్లిక్ స్కూల్
సాక్షి, హైదరాబాద్: లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ (అబిడ్స్) ఆధ్వర్యంలో జరిగిన ఇంటర్ స్కూల్ టేబుల్ టెన్నిస్ (టీటీ) టోర్నమెంట్లో జూనియర్ బాలికల టీమ్ విభాగంలో హిందూ పబ్లిక్ స్కూల్ విజేతగా నిలిచింది. మంగళవారం జరిగిన ఫైనల్లో హిందూ పబ్లిక్ స్కూల్ 3–0తో చిరెక్ (సీబీఎస్ఈ–ఎ) పబ్లిక్ స్కూల్ జట్టుపై విజయం సాధించింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్స్లో హిందూ పబ్లిక్ స్కూల్ 3–2తో డాన్ బాస్కో జట్టుపై, చిరెక్ 3–2తో ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్పై గెలుపొందాయి. జూనియర్ బాలుర విభాగంలో చిరెక్ (సీబీఎస్ఈ–ఎ) పబ్లిక్ స్కూల్, సెయింట్ పాల్స్ హైస్కూల్ ‘బి’, సెయింట్ పాల్స్ హైస్కూల్ ‘ఎ’, చిరెక్ కేంబ్రిడ్జ్ స్కూల్ జట్లు సెమీఫైనల్లోకి అడుగుపెట్టాయి. మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్లో చిరెక్ 2–0తో డీపీఎస్ (ఖాజా గూడ) జట్టుపై, చిరెక్ కేంబ్రిడ్జి స్కూల్ 2–0తో భారతీయ విద్యాభవన్ (జూబ్లీహిల్స్)పై... సెయింట్ పాల్స్ ‘ఎ’ 2–0తో చిరెక్ సీబీఎస్ఈ–ఎఫ్ జట్టుపై, సెయింట్ పాల్స్ ‘బి’ 2–0తో డీఏవీ జట్టుపై గెలిచాయి. సీనియర్ బాలికల విభాగంలో రోజరీ కాన్వెంట్ (అబిడ్స్), డాన్ బాస్కో హైస్కూల్, గీతాంజలి దేవాశ్రయ్, సెయింట్ పాల్స్ హైస్కూల్ జట్లు సెమీఫైనల్లోకి ప్రవేశించాయి. కామన్వెల్త్ టీటీ చాంపియన్షిప్లో మూడు పతకాలు సాధించిన తెలంగాణ అంతర్జాతీయ క్రీడాకారిణి ఆకుల శ్రీజ ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ టోర్నమెంట్ను ప్రారంభించింది. -
రూ. 3 కోట్లు డిమాండ్; అబిడ్స్లో వదిలేశారు!
సాక్షి, హైదరాబాద్ : దోమలగూడకు చెందిన వ్యాపారి గజేంద్ర ప్రసాద్ కిడ్నాప్ కేసు కీలక మలుపు తిరిగింది. తనను కిడ్నాప్ చేసి రూ. కోటి వసూలు చేసి విడిచిపెట్టారంటూ గజేంద్ర పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టగా పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఫార్చ్యూన్ ఫైనాన్స్ కేసులో దాదాపు రూ. 24 కోట్ల మేర మోసం చేశాడనే ఆరోపణలతో... గతంలో గజేంద్రప్రసాద్ అన్నను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో గజేంద్రప్రసాద్ కిడ్నాప్ కేసులో పలు అనుమానాలు తలెత్తున్నాయి. దీంతో గజేంద్ర ప్రసాద్ స్టేట్మెంట్ రికార్డు చేసిన పోలీసులు... అసలు కిడ్నాప్ జరిగిందా లేదా అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. కాగా చిక్కడపల్లిలో వ్యాపారవేత్త గజేందర్ ప్రసాద్ కిడ్నాప్ కలకలం రేపిన సంగతి తెలిసిందే. దోమల్గూడ ప్రాంతానికి చెందిన గజేంద్ర ప్రసాద్ ఆటోమొబైల్ ఫైనాన్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు ఆయనను కిడ్నాప్ చేశారు. అనంతరం మూడు కోట్ల రూపాయలు ఇవ్వాల్సిందిగా కుటుంబ సభ్యులను డిమాండ్ చేశారు. అయితే కోటి రూపాయలు తీసుకుని సోమవారం ఉదయం ఆయనను అబిడ్స్లో విడిచిపెట్టారు. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
భాగ్యనగరంలో తాజ్
భాగ్యనగరం నడిబొడ్డున ఉన్న అబిడ్స్లో ఘుమఘుమలను వెదజల్లే తాజ్ హోటల్ హైదరాబాదీల నోటికి రుచికరమైన వంటలు అందిస్తోంది. ఈ హోటల్ ప్రయాణం ఆరు దశాబ్దాల క్రితం ప్రారంభమైంది. గోల్డ్ షాపులు, పాదరక్షల దుకాణాలు, స్కూల్స్తో నిత్యం అబిడ్స్ప్రాంతం రద్దీగా, హడావుడిగా కనిపించేది, ఇప్పటికీ అలాగే కనిపిస్తోంది. అందుకే ఈ హోటల్ విజయ ప్రయాణం సాఫీగా సాగింది. నిత్యం జనంతో... ఈ హోటల్లోకి అడుగుపెట్టగానే గలగలమంటూ కబుర్లు వినిపిస్తాయ. నిత్యం జనాలతో నిండుగా కళకళలాడుతూ కిటకిటలాడుతూ కనిపించే ఈ హోటల్లో భోజన ప్రియులు అన్నం తింటూ, మరికొందరు గప్చుప్లు తింటూ కనిపిస్తారు. కాలేజీ విద్యార్థులు, మధ్యవయస్కులు, మహిళలు, మగవారు ఒకరేమిటి... హడావుడిగా ఉండే వృత్తి వ్యాపారుల నుంచి వృద్ధుల దాకా అందరూ ఇక్కడి భోజనం రుచి చూడాల్సిందే. ఇంటి నుంచి దూరంగా ఉండే విద్యార్థులకు తాజ్ హోటల్ అమ్మ చేతి భోజనాన్ని తలపిస్తుంది. ఆప్యాయతకు చిరునామాగా మారింది నిలిచిన అబిడ్స్ బ్రాంచి తాజ్లో భోజనం చేయడానికి భాగ్యనగరవాసులు ఆసక్తి చూపుతారు. పొట్ట చేత పట్టుకుని, ఉడిపి నుంచి భాగ్యనగరానికి వచ్చిన ఆనందరావు, ఫుడ్ ప్రొడక్షన్లో నైపుణ్యం సంపాదించిన బాబురావుతో కలిసి 1942లో సికింద్రాబాద్ మహంకాళి దేవాలయం దగ్గర చిన్నప్రదేశాన్ని అద్దెకు తీసుకుని ‘అంబా భవన్’ అని పేరుపెట్టి వ్యాపారం ఆరంభించారు. కొంతకాలానికే బాబూరావు సోదరుడు సుందర్ రావు కూడా చేరడంతో ముగ్గురూ కలిసి 1948లో సికింద్రాబాద్లో తాజ్హోటల్ ప్రారంభించి, 1950 నాటికి ఆబిడ్స్లో మరో బ్రాంచి ప్రారంభించే స్థాయికి చేరుకుంది వ్యాపారం అంటారు సుందర్రావు కుమారుడు చంద్రశేఖర్ రావు. నాటి నుంచి నేటి వరకు... ఆదివారాలు, స్కూల్ సెలవు రోజుల్లో తండ్రితో కలిసి హోటల్కి వచ్చేవాడినని చంద్రశేఖరరావు బాల్యాన్ని గుర్తు చేసుకుంటారు. మసాలాల ఘాటు లేకుండా, సాత్త్వికంగా ఉండే ఆహారం తాజ్ ప్రత్యేకత కావడంతో ఇక్కడ భోజనం చేయడానికి అందరూ ఆసక్తి చూపేవారు. అందరికీ అందుబాటులో లభించే దక్షిణాది భోజనం అందించాలన్నదే వీరి లక్ష్యం. రెడీమేడ్గా దొరికే మసాలాలను నేటికీ వీరు ఉపయోగించట్లేదు. నేటికీ అదే కాఫీ పొడి... మొదటి రోజు నుంచి నేటివరకు అదే కాఫీ రుచి, అదే కాఫీ పొడి. ఆరు దశాబ్దాలుగా ఒకే అమ్మకం దారు దగ్గర కాఫీ పొడి కొనుగోలు చేస్తూ, కాఫీ ప్రియులను ఆకర్షిస్తోంది తాజ్. పరిశుభ్రతకు పెద్ద పీట వేయడం వీరి ప్రత్యేకత. హోటల్ ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు కస్టమర్లను ప్రేమగా పలకరిస్తూ, పెదవుల మీద చెక్కుచెదరని చిరునవ్వుతో కొసరి కొసరి వడ్డిస్తున్నారు. నాటి నుంచి నేటి వరకు సేవల విషయంలో ఎటువంటి మార్పు లేదు. ఇది పుట్టిల్లు... సెలబ్రిటీలకు తాజ్ హోటల్ పుట్టింటితో సమానమంటారని చెబుతారు చంద్రశేఖరరావు. ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు ఎం.ఎఫ్. హుస్సేన్ తనకు ఇష్టమైన బటన్ ఇడ్లీ, సాంబారు కోసం ఇక్కడకు వచ్చి ఈ హోటల్లోనే సేద తీరేవారని గుర్తుచేసుకుంటారు చంద్రశేఖర్. అక్కినేని నాగేశ్వరరావు, జమున వంటి వారికి ఇక్కడకు వస్తే, సొంత ఇంట్లో ఉన్న అనుభూతి కలుగుతుందని అనేవారట. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ సమావేశాలు మెథడిస్టు స్కూల్లో జరిగినప్పుడు, తాజ్ హోటల్ వారే క్యాటరింగ్ చేశారంటారు చంద్రశేఖరరావు. రెండో తరం వివాహాలూ ఇక్కడే... దశాబ్దాల క్రితం రూఫ్ గార్డెన్లో వివాహం చేసుకున్నవారు, వారిపిల్లల వివాహాలు కూడా ఇక్కడే చేయడం చాలా ఆనందం అంటారు చంద్రశేఖరరావు. హోటల్ ముందర ఉన్న చెట్టుని అదృష్ట వృక్షంగా భావిస్తారని, ఆ చెట్టు కింద నిలబడి భూ వ్యవహారాలు మాట్లాడుకున్నవారికి మంచి జరిగిందని , ఇక్కడే పెళ్లిసంబంధాలు కూడా నిశ్చయించుకున్నారని చెబుతారు వారు.ఇప్పుడు చంద్రశేఖర్ కుమారుడు ఆదిత్య, ఆదర్శ్లు కలిసి ఈ వ్యాపారాన్ని మరింత వృద్ధి చేస్తున్నారు. వారి నరాలలో రక్తానికి బదులు సాంబారు ప్రవహిస్తోందని చెబుతారు వీరు. ఆ మాట నూటికి నూరు శాతం నిజం అంటారు వినియోగదారులు. -
అంబులెన్స్లో వచ్చి ఓటు వేశారు..
సాక్షి, హైదరాబాద్: అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ముఖేశ్ గౌడ్ అంబులెన్స్లో వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ముఖేశ్ గౌడ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఎలాగైనా తన ఓటు హక్కును వినియోగించుకోవాలని భావించిన ముఖేశ్ గౌడ్ను కుటుంబ సభ్యులు అంబులెన్స్లో పోలింగ్ బూత్కు తరలించారు. దీంతో ఆయన అబిడ్స్ పోస్టాఫీస్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన ఓటమిపాలైన సంగతి తెలిసిందే. అయితే ముఖేశ్ గౌడ్ని ఈ పరిస్థితుల్లో చూసిన ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకుని మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్గా పాల్గొనాలని కోరుకుంటున్నట్టు వారు తెలిపారు. -
విద్యార్థిపై నుంచి దూసుకెళ్లిన వాటర్ ట్యాంకర్..!
-
విద్యార్థిపై నుంచి దూసుకెళ్లిన వాటర్ ట్యాంకర్..!
సాక్షి, హైదరాబాద్ : డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా మరో విద్యార్థిని బండి చక్రాల కిందపడి ప్రాణాలు కోల్పోయింది. అబిడ్స్లోని చాపెల్ రోడ్డులో గల రోజారీ కాన్వెంట్లో మూడో తరగతి చదువుతున్న ఎనిమిదేళ్ల దియా జైన్పై నుంచి వాటర్ ట్యాంకర్ దూసుకుపోయింది. తీవ్ర గాయాలపాలైన బాలిక అక్కడికక్కడే మృతి చెందగా.. ఆమె తండ్రి నరేష్ కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. -
అబిడ్స్లో భారీ చోరీ
అబిడ్స్: అబిడ్స్ పోలీస్స్టేషన్ పరిధిలోని మహేష్ నగర్ కాలనీ ఫతేసుల్తాన్లేన్లో భారీ చోరీ జరిగింది. రూ. కోటి రూపాయల విలువచేసే నగదు, బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. ఈ భారీ చోరీని ఇంట్లో పనిచేసే వాచ్మెన్ దంపతులు మరో ఇద్దరితో కలిసి చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇన్స్పెక్టర్ రవికుమార్ తెలిపిన మేరకు.. మహేష్నగర్ కాలనీ ఫతేసుల్తాన్లేన్లో నివాసముండే సునీల్ అగర్వాల్(54) ట్రావెల్స్, మెటల్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాడు. శనివారం రాత్రి బంధువుల నివాసంలో ఉన్న ఓ శుభకార్యం నిమిత్తం ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి బంజారాహిల్స్కు వెళ్లి అర్థరాత్రి 12 గంటల సమయంలో వచ్చారు. ఇంటి గేటు తాళం వేసి ఉండగా ఇంటి ప్రధాన ద్వారం తాళాలను పగులగొట్టి ఉండడంతో సునీల్ అగర్వాల్ ఇంట్లోకి వెళ్లి పరిశీలించాడు. కోటి రూపాయల నగదుతో పాటు బంగారు ఆభరణాలు కనిపించలేదు. వాచ్మెన్ దంపతులు కూడా కనిపించకుండా పోవడంతో ఈ చోరీ వారే చేసి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తంచేశారు. ఇదిలా ఉండగా మరో గదిలో ఉన్న రూ. 50 లక్షలు మాత్రం దొంగతనం కాలేదని పోలీసులు తెలిపారు. అయితే దొంగతనానికి పాల్పడిన వారు సీసీ పుటేజీల రికార్డులు నమోదయ్యే డీవీఆర్ను కూడా దొంగిలించి తీసుకువెళ్లారు. యజమాని సునీల్ అగర్వాల్ అబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్లూస్ టీం, డాగ్స్క్వాడ్ను రంగంలోకి దింపి వేలి ముద్రలను సేకరించారు. సమాచారం అందుకున్న సెంట్రల్ జోన్ డీసీపీ విశ్వప్రసాద్, అదనపు డీసీపీ గంగారెడ్డి, అబిడ్స్ ఏసీపీ భిక్షంరెడ్డిలు పోలీస్ స్టేషన్లో సమావేశమై దొంగతనం జరిగిన తీరును తెలుసుకొని కేసు మిస్టరీని చేధించేందుకు గాను అధికారులకు సూచనలు చేశారు. నేపాల్కు చెందిన వికాస్ ఆయన భార్య సునీల్ అగర్వాల్ నివాసంలో వాచ్మెన్గా రెండు నెలల క్రితం చేశారు. గతంలో ఇక్కడ పనిచేసిన వ్యక్తి వీరిని నిమమించినట్లు తెలిసింది. అయితే వారితో పాటు మరో ఇద్దరు ఈ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీ ఫుటేజీలను పరిశీలించగా వాచ్మెన్ దంపతులు ఓ దారి వెంట, మరో ఇద్దరు మరో దారిలో వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు విచారణను వేగవంతం చేశారు. -
అబిడ్స్ పాఠశాలలో అగ్ని ప్రమాదం
సాక్షి, హైదరాబాద్ : అబిడ్స్లోని అల్సెన్స్ హైస్కూల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. లంచ్ అవర్ కావడంతో పేను ప్రమాదం తప్పింది. వివరాలు.. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో పాఠశాలలోని పరేడ్ స్టేజ్ క్రింద ఉన్న గది నుంచి ఒక్కసారిగా దట్టమైన పొగ వెలువడింది. ఈ సమయంలో స్కూల్ ఆవరణలో దాదాపు 2 వేల మంది విద్యార్థులు ఉన్నారు. అయితే లంచ్ అవర్ కాండంతో భారీ ప్రమాదం తప్పింది. కానీ దట్టమైన పోగ రావడం వల్ల ఏడుగురు విద్యార్థులు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు. వీరిని పాఠశాల యాజమాన్యం స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుంది. సమాచారం తెలుసుకున్న అగ్రిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని పొగను అదుపులోకి తీసుకోచ్చారు. ఈ సంఘటన గురించి యాజమాన్యం మాట్లాడుతూ..‘ప్రమాదానికి గల కారణాలను తెలియాల్సి ఉంది. విద్యార్థులేవరికి ఏమి కాలేదు. కానీ దట్టమైన పోగ వల్ల కొందరు విద్యార్థులు ఇబ్బందికి గురయ్యారు. వారిని ఆస్పత్రికి తరలించాం. విద్యార్థులను, తల్లిదండ్రులను ఆందోళన పడవద్దని కోరుకుంటున్నాం’ అని తెలిపారు. -
అబిడ్స్ బీసీ హాస్టల్: నాన్ బోర్డర్స్ ధర్నా
-
‘కేసీఆర్లోకి రజాకార్ల ఆత్మ ప్రవేశించింది’
సాక్షి, హైదరాబాద్ : ‘టీఆర్ఎస్ కారైతే.. దాని స్టీరింగ్ మాత్రం ఎమ్ఐఎమ్ చేతిలో ఉంది.. ఎమ్ఐఎమ్ ప్రోద్భలంతోనే కేసీఆర్ నాపై అక్రమ కేసులు బనాయించారని బీజేపీ పార్టీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆరోపించారు. గత నెల అనుమతి లేకుండా నగరంలో తిరంగ యాత్ర నిర్వహించినందుకుగాను రాజా సింగ్పై కేసు నమోదయిన సంగతి తేలిసిందే. ఈ కేసు విచారణలో భాగంగా నేడు రాజా సింగ్ అబిడ్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. ఇద్దరు న్యాయవాదులతో కలిసి విచారణలో పాల్గొన్న ఆయన ప్రశ్నలన్నింటికి రాత పూర్వక సమాధానాలు ఇచ్చినట్లు సమాచారం. విచారణ అనంతరం బయటకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో రజాకార్ల పాలన సాగుతుందంటూ మండి పడ్డారు. 50 ఏళ్ల క్రితం తుడిచిపెట్టుకు పోయిన రజాకార్ల ఆత్మ మళ్లీ ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్లో ప్రవేశించిందని విమర్శిచారు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ కారైతే దాని స్టీరింగ్ మాత్రం ఎమ్ఐఎమ్ చేతిలో ఉందని ఆరోపించారు. ఎమ్ఐఎమ్ ప్రోత్సాహంతోనే కేసీఆర్ తనపై అక్రమ కేసులు బనాయించారని రాజాసింగ్ మండిపడ్డారు. స్వాతంత్ర్య దినోత్సవం నాడు తిరంగ యాత్ర నిర్వహించినందుకు తనపై కేసులు పెట్టారన్నారు. ఇవన్ని చూస్తే తెలంగాణ పాకిస్తాన్లో ఉందో, భారత దేశంలో ఉందో అర్థం కావడం లేదని వాపోయారు. తనను ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా భయపడనని రాబోయే ఎన్నికల్లో కూడా తాను బీజేపీ తరపున గోషామహల్ నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు. ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీన రాజాసింగ్ ఆద్వర్యంలో నగరంలో తిరంగ యాత్ర జరిగిన విషయం తెలిసిందే. అనుమతి లేకుండా ఆ యాత్ర నిర్వహించినందుకు అతడిపై నగరంలోని ఐదు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఈ కేసు విచారణలో భాగంగా తమ ఎదుట హాజరుకావాల్సిందిగా ఆబిడ్స్ పోలీసులు రాజాసింగ్కు నోటీసులు జారీ చేశారు. -
ఆహ్వానం..40 ఏళ్ల అనుబంధం!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ అబిడ్స్లోని ఆహ్వానం హోటల్తో నందమూరి హరికృష్ణకు విడదీయరాని బంధం ఉంది. గత నలభై ఏళ్లుగా ఆయనకు ఈ హోటల్ కేరాఫ్ అడ్రస్గా నిలిచింది. ఎన్టీఆర్, హరికృష్ణ అభిమానులు అక్కడకు తరలివచ్చేవారు.. వారిని హరికృష్ణ ఆత్మీయంగా పలకరించేవారు. యోగక్షేమాలను తెలుసుకుని.. వచ్చిన వారికి భోజనం పెట్టి ఆదరించి అక్కున చేర్చుకునేవారు. బుధవారం ఆయన అకాల మరణవార్త తెలిసి ఎన్టీఆర్ ఎస్టేట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. రామకృష్ణ థియేటర్తోపాటు దుకాణ సముదాయాలను వ్యాపారులు స్వచ్ఛందంగా మూసివేసి హరికృష్ణ నివాసానికి తరలివెళ్లారు. ఆహ్వానం హోటల్ సిబ్బంది హరికృష్ణ చిత్రపటాన్ని ప్రవేశద్వారం వద్ద ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. 1001 నంబరు గది.. : మూడంతస్తులున్న ఆహ్వానం హోటల్లో మొత్తం 48 గదులున్నాయి. వీటిలో మూడు మినహా మిగతా 45 గదులను హోటల్ సిబ్బంది అద్దెకిస్తున్నారు. ఈ మూడు గదులను హరికృష్ణ తన వ్యక్తిగత అవసరాలకు వినియోగించేవారు. బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులకు మాత్రమే ఈ గదులను కేటాయించేవారు. రోజూ ఉదయం 11 గంటలకు హోటల్కు చేరుకుని సాయంత్రం 5 గంటల వరకు 1001 నంబరు గదిలో ఉండేవారు. పదేళ్లుగా హోటల్ నిర్వహణ బాధ్యతలను కృష్ణారావు అనే వ్యక్తికి హరికృష్ణ అప్పజెప్పారు. అంతకుముందు తానే హోటల్ బాధ్యతలు చూసేవారని సిబ్బంది తెలిపారు. ‘టాటా సియారా’పై ఎనలేని ప్రేమ: ఆహ్వానం హోటల్ ఎదురుగా పార్క్ చేసిన తెలుపు రంగు టాటా సియారా వాహనం అంటే హరికృష్ణకు ఎంతో ప్రేమ. ఈ వాహనం నంబర్ ఏపీ 20బి 3339ని లక్కీ నంబర్గా భావించేవారని హోటల్ సిబ్బంది తెలిపారు. హోటల్ ఆవరణలో పార్క్ చేసిన ఏఏయూ 2622 నంబరు బుల్లెట్, ఏపీ 9ఏ 5229 బుల్లెట్లంటే ఆయనకు ఎంతో మక్కువ. ఇక్కడే పార్క్ చేసిన బజాజ్ చేతక్, హీరో హోండా వాహనాలు గతంలో హరికృష్ణ వాడినవే. ద్విచక్ర వాహనాలు, కార్లు, ఇతర వాహనాలను నడపడం, వాటిపై సుదూర ప్రాంతాలకు నడుపుకుంటూ వెళ్లడం అంటే ఆయనకు ఎనలేని సరదా అని స్థానికులు తెలిపారు. -
గురువులను, తల్లిదండ్రులను గౌరవించాలి ; నరసింహన్
సాక్షి, హైదరాబాద్ : ప్రతి విద్యార్థి చదువు చెప్పే గురువులను, కని పెంచిన తల్లిదండ్రులను గౌరవించాలని తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సూచించారు. మంగళవారం అబిడ్స్లోని లిటిల్ ఫ్లవర్ పాఠశాలకు వెళ్లిన ఆయన అక్కడ పిల్లలతో సరదాగా గడిపారు. విద్యార్థులతో ముఖాముఖీ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారు అడిగిన ప్రశ్నలకు గవర్నర్ సమాధానం చెప్పారు. తాను కూడా లిటిల్ ఫ్లవర్ స్కూల్లో 5వ తరగతి వరకు చదువుకున్నానని తెలిపారు. చదువుకున్న స్కూల్కు గవర్నరు హోదాలో రావడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. జీవితంలో తన అనుభవాలను తాను చదువుకున్న స్కూల్ విద్యార్థులతో పంచుకోవడం సంతోషంగా ఉందన్నారు. జీవితంలో డబ్బులు ముఖ్యం కాదని, చదువు మాత్రమే ముఖ్యమని.. ఆ దిశలో విద్యార్థులు ముందుకు సాగాలని సూచించారు. -
లిక్కర్ చాక్లెట్ల స్మగ్లింగ్ అడ్డాగా అబిడ్స్
సాక్షి, హైదరాబాద్ : ఢిల్లీ కేంద్రంగా నగరంలోని బేగం బజార్, అబిడ్స్లో లిక్కర్ చాక్లెట్ల స్మగ్లింగ్కు పాల్పడుతున్న ముఠా కార్యకలాపాలను ఎక్సైజ్ శాఖ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఛేదించారు. ఆయా స్థావరాలపై దాడులు నిర్వహించి పెద్ద మొత్తంలో లిక్కర్ చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లింగ్కు పాల్పడుతున్న షాప్ యజమానులపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. అబిడ్స్లోని కమల్ వాచ్స్&గిఫ్ట్స్ కంపెనీ షోరూం, బేగంబజార్, సిద్దంబర్ బజార్లోని హీరా కాంప్లెక్స్ చాక్లెట్ డిస్టిబ్యూటర్ కంపెనీపై దాడులు చేసినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు పేర్కొన్నారు. లక్షల విలువ చేసే లిక్కర్ చాక్లెట్లు.. పలు బ్రాండ్ల పేరుతో లిక్కర్ చాక్లెట్ అమ్మకాలు జరుపుతున్నట్లు గుర్తించామని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఇంజనీరింగ్, మెడికల్ విద్యార్థులు, ఐటీ నిపుణులు, పాఠశాల విద్యార్థులకు వీటిని సరఫరా చేస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. మొత్తంగా 1081 బాక్స్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. విదేశీ మాదక ద్రవ్యంలో వీటి విలువ లక్షల్లో ఉంటుందని పేర్కొన్నారు. ప్రాధమికంగా ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నామని... వారిచ్చిన సమాచారం మేరకు కేసు దర్యాప్తును ముమ్మరం చేసినట్లు తెలిపారు. కాగా లిక్కర్ చాక్లెట్లకు సంబంధించిన ముఠా బేగం బజార్, అబిడ్స్ కేంద్రంగా పనిచేస్తున్నట్లు పోలీస్ విచారణలో తేలింది. -
‘చుక్క’... చోద్యం!
సాక్షి, సిటీ బ్యూరో(హైదరాబాద్) : బయట సన్నగా వర్షం పడుతోంది. భాగ్యనగర వాసులు ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. సరిగ్గా అప్పుడే అబిడ్స్ రోడ్లోని బీఎస్ఎన్ఎల్ టెలిఫోన్ ఎక్సెంజ్ వద్ద రోడ్డు పక్కనే ‘సాక్షి’ కెమెరాకు చిక్కిందో వింత దృశ్యం. ఓ యువతి, యువకుడు శుక్రవారం మద్యం తాగుతూ, గంజాయి పీలుస్తున్న సన్నివేశం కెమెరా కంటపడింది. ఎవరేమనుకుంటే తమకేంటి అన్నట్టుగా వారిద్దరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ‘చుక్కే’శారు. మూసి ఉన్న దుకాణం ముందు తాపీగా కూర్చుకుని మందు మజాతో విందు చేసుకున్నారు. మత్తు సరిపోలేదో, కిక్ ఇంకా కావాలనుకున్నారో తెలియదు కానీ మద్యానికి గంజాయి, సిగరెట్ జత చేసుకున్నారు. లోకమంతా మరిచి మత్తులో మునిగి తేలారు. పబ్లిగ్గా మందేస్తున్న చుక్క, చక్కనోడిని చూసి ఆ దారిన పోయే వారంతా చకితులై నోళ్లు వెళ్లబెట్టారు. ఇదేం చోద్యమంటూ గుసగుసలాడారు. గ‘మ్మత్తు’ అంటే ఇదేనేమో! -
అబిడ్స్ ఆర్ఎస్ బ్రదర్స్లో భారీ అగ్నిప్రమాదం
-
ఆర్ఎస్ బ్రదర్స్లో అగ్నిప్రమాదం.. భారీ నష్టం
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని అబిడ్స్ ఆర్ఎస్ బ్రదర్స్ వస్త్ర దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. నాలుగు అంతస్తుల భవనంలో దాదాపు నాలుగు గంటల పాటు అగ్నికీలలు ఎగసిపడ్డాయి. నాలుగు అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపు చేయడానికి ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం కావడంతో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో కోఠికి వెళ్లే వాహనాలను మోంజాయి మార్కెట్ మీదుగా దారి మళ్లించారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని సమాచారం. అదృష్టవశాత్తూ అర్థరాత్రి వేళ ప్రమాదం జరగటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. చుట్టుపక్కల ఇతర దుకాణాలకు మంటలు వ్యాపించకుండా తగిన చర్యలు తీసుకున్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ప్రమాదంలో దాదాపు మూడు కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగినట్లు దుకాణపు యాజమాన్యం తెలిపింది. -
హైదరాబాద్ అబిడ్స్లో భారీ అగ్నిప్రమాదం
-
అనుకున్న ర్యాంకు రాలేదని యువతి ఆత్మహత్య
-
భవనంపై నుంచి దూకి యువతి ఆత్మహత్య
-
ర్యాంకు రాలేదనే ప్రాణం తీసుకుంది
సాక్షి, హైదరాబాద్: నగరంలోని అబిడ్స్ ప్రాంతంలో కలకలం రేగింది. మంగళవారం ఉదయం మయూరి కాంప్లెక్స్ భవనంపై నుంచి దూకి యువతి ఆత్మహత్య చేసుకుంది. కాచిగూడకు చెందిన యువతి(18)గా పోలీసులు గుర్తించారు. స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నీట్ పరీక్షలో అర్హత సాధించకపోవటంతో మనస్థాపం చెంది ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తేలింది. జెస్లీస్ భవనంలోని వెళ్లిన దృశ్యాలు, పై నుంచి దూకిన విజువల్స్ మీడియాకు చిక్కాయి. తల్లిదండ్రులకు సమాచారం అందించిన పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం తరలించారు. -
అబిడ్స్లో బిల్డింగ్ నుంచి పడి యువతి మృతి
-
సిటీ సూపర్ మార్కెట్ అబిడ్స్ షాప్
సాక్షి, సిటీబ్యూరో : నేడు మనం చూస్తున్న సూపర్ మార్కెట్లకు నగరంలో 125 ఏళ్ల క్రితమే పునాది పడింది. ప్రపంచవ్యాప్త ప్రసిద్ధి పొందిన భాగ్యనగరం... ఆనాడే అన్ని వస్తువులకు కేంద్రంగా నిలిచింది. సూది నుంచి వాకీటాకీ వరకు ఇక్కడ లభించేవి. ఆర్మేనియా దేశస్థుడు అల్బర్ట్ అబిడ్స్ 1893 ఫిబ్రవరి 20న ‘అల్బర్ట్ అబిడ్స్ అండ్ కో’ పేరుతో దీనిని నెలకొల్పాడు. అల్బర్ట్ అబిడ్స్ 1848 జులై 23న ఆర్మేనియాలో జన్మించాడు. వృత్తిరీత్యా వజ్రాల వ్యాపారి అయిన అల్బర్ట్... ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్కు విదేశీ దుస్తులు, ఆభరణాలు, విలువైన వస్తువులు తీసుకొచ్చేవాడు. ఈ క్రమంలో నిజాం రాజుకు స్టైలిస్ట్గా మారాడు. ఇక్కడి ప్రజల జీవనశైలిపై అధ్యయనం చేశాడు. దీంతో నగరంలో దేశవిదేశీ వస్తువులతో షాప్ నెలకొల్పేందుకు నిజాం అనుమతి తీసుకున్నాడు. అప్పటికి నగరం నడుమ జనరల్ పోస్టాఫీస్ ప్రాంతంలో ముస్తఫా బజార్ కొనసాగుతుంది. అక్కడే ‘అల్బర్ట్ అబిడ్స్ అండ్ కో’ పేరుతో షాప్ ఏర్పాటు చేశాడు. అప్పటి వరకు నగరంలో ఆభరణాలు, గడియారాలు, మోటార్సైకిళ్లు, స్టేషనరీకి సంబంధించి వేర్వేరు షాపులు కొనసాగుతున్నాయి. వీటన్నింటినీ ఒకే దగ్గరికి చేర్చిందీ షాప్. లైఫ్స్టైల్ ఉత్పత్తులు, జ్యువెలరీ, స్టేషనరీ... ఇలా అన్ని రకాల దేశవిదేశీ వస్తువులు ఇందులో లభించేవి. ఇప్పుడున్న సూపర్ మార్కెట్లలో మాదిరి ఒక్క పండ్లు, కూరగాయలు మినహా అన్ని ఉండేవి. ఈ షాప్ ఏర్పాటుతోనే ఆ ప్రాంతానికి అబిడ్స్ అనే పేరొచ్చింది. 1942 వరకు కొనసాగింపు... 1911లో మహబూబ్ అలీఖాన్ మరణించాడు. దీంతో ఆవేదనకు గురైన అల్బర్ట్ షాప్ను విక్రయించి స్వదేశానికి వెళ్లిపోయాడు. 1914లో ‘స్టేట్ టాకీస్’ రూ.5లక్షలకు ఈ వ్యాపార సముదాయాన్ని కొనుగోలు చేసింది. స్టేట్ టాకీస్ రెండేళ్లు కొనసాగించిన అనంతరం... ఇందుభాయ్ పటేల్ రూ.7 లక్షలకు దీనిని తీసుకున్నారు. 1942 వరకు ఈ షాప్ను నడిపించారు. వ్యాపార సముదాయ నిర్మాణం... 1942 తర్వాత ఇందుభాయ్ పటేల్ దీనిని ప్యాలెస్ టాకీస్గా మార్చారు. 1974 వరకు ఇది కొనసాగింది. అనంతరం అదే స్థలంలో కొత్తగా రెండు మినీ ప్యాలెస్లు నిర్మించి సినిమా హాళ్లను ఏర్పాటు చేశారు. 1996 వరకు ఇవి కొనసాగాయి. తర్వాత వీటిని కూలగొట్టి 2001లో వ్యాపార సముదాయం నిర్మించారు. ఇక్కడే బిగ్ బజార్, ఇతర షాపులు నడుస్తున్నాయి. ప్రస్తుతం ఇది ఇందుభాయ్ కుమారుల అధీనంలో ఉంది. -
నృత్యాలతో అలరించిన చిన్నారులు
-
అబిడ్స్ చౌరస్తాలో స్కూల్ ఆటో బోల్తా..
హైదరాబాద్: స్కూలు పిల్లలతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టడంతో అందులో ఉన్న ఐదుగురు చిన్నారులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన నగరంలోని అబిడ్స్ జీపీఓ చౌరస్తా వద్ద శనివారం ఉదయం చోటు చేసుకుంది. పాఠశాలకు ఆలస్యం అవుతుందని ఆటో డ్రైవర్ వేగంగా నడుపుతుండటంతోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఇది గుర్తించిన పోలీసులు చిన్నారులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. -
అబిడ్స్ GPO వద్ద బారులు తీరిన జనం
-
నేటి నుంచి రామాయణ్ మేళా
అబిడ్స్ : ఎగ్జిబిషషన్ సొసైటీ, రాజస్థానీ ప్రగతి సమాజ్ ఆధ్వర్యంలో ఆనవాయితీగా నిర్వహిస్తున్న రామాయణ్ మేళా మహోత్సవాన్ని ఏడాదికూడా ఘనంగా నిర్వహించనున్నట్లు రామాయణ్ మేళా చీఫ్ కన్వీనర్ గోవింద్ రాఠి అన్నారు. శుక్రవారం ఎగ్జిబిషషన్ సొసైటీ కార్యాలయంలో రామాయణ్ మేళా వివరాలను వెల్లడించారు. శనివారం నుంచి ప్రారంభమయ్యే ఉత్సవాలు 11వ తేదీ వరకు కొనసాగుతాయన్నారు. మంగళవారం ఘట స్థాపన జరిపి రామాయణ్ కవి సమ్మేళనం నిర్వహించనున్నట్లు తెలిపారు. రామాయణ్ పై ప్రశ్్నమంచ్ కార్యక్రమం, బాల సంస్కార్ శిబిరం ఏర్పాటు చేశామన్నారు. 11న విజయదశమి సందర్భంగా షమీ పూజ, సాంస్కృతి క కార్యక్రమాలు, శ్రీరామునికి పట్టాభిషేకం, రావణ , కుంభకర్ణ మేఘనాధుని దహనం నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రాంచందర్, ఆదిత్య మార్గం, కృష్ణాజీ యాదవ్, రమేష్ కుమార్ బంగ్, గిరిధారిలాల్ డాగా, కళావతి జాజు, మనోజ్ జైశ్వాల్, రాజ్ కుమార్ సాంక్ల, కళావతి జాజు, కమలా రాఠి తదితరులు పాల్గొన్నారు. గర్భాదాండియా ఉత్సవాలు ఎగ్జిబిషన్ ఎకనామిక్ కమిటీ ఆధ్వర్యంలో నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో 6 నుంచి 10వ తేదీ వరకు గర్భాదాండియా ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాండియా నత్యాలలో పాల్గొనే వారికి అవసరమైన అన్ని వసతులు కల్పిస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. దాండియా నృత్యాలల్ల్రోపతిభ కనబర్చిన వారికి ప్రతిరోజూ బహుమతులు అందజేస్తామన్నారు. ఈ సందర్భంగా ఫుడ్ కోర్టును కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 9న బతుకమ్మ ఉత్సవాలు ఎగ్జిబిషన్ మైదానంలో ఎగ్జిబిషన్ ఎకనామిక్ కమిటీ ద్వారా ఈనెల 9న బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. వందలాది మహిళలతో బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టారు. -
గణేష్ ఉత్సవాలతో నగరానికి కీర్తి
అబిడ్స్: గణేష్ ఉత్సవాలతో నగర ఖ్యాతి అంతర్జాతీయ స్థాయిలో పెరుగుతోందని మాజీ మంత్రి దానం నాగేందర్ పేర్కొన్నారు. గోషామహల్ హిందీనగర్లో మార్కెట్ మాజీ డైరెక్టర్ టి. సతీష్కుమార్ ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో శనివారం దానం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మండపం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ వేడుకలో గ్రేటర్ కాంగ్రెస్ నేతలు సతీష్, బీజేపీ నేత బంగారు సుధీర్ కుమార్, టీఆర్ఎస్ నాయకులు ధన్ రాజ్, కేంద్ర ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యులు గడ్డమీది నరేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
నగరంలో లిక్కర్ చాక్లెట్ల దందా!
అబిడ్స్: లిక్కర్ చాక్లెట్స్ తయారుచేస్తున్న ఫ్యాక్టరీపై తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. చాక్లెట్పై లిక్కర్ పేరుండడం, అందులో వైన్ కలుపుతున్నట్లు సమాచారం రావడంతో శుక్రవారం ఓల్డ్ మల్లేపల్లిలోని ఈ అక్రమ చాక్లెట్ ఫ్యాక్టరీపై దాడులు చేశారు. రాష్ట్ర ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ ఈఎస్ శశిధర్రెడ్డి, ఏఈఎస్ నాగేందర్, ఎస్ఐ పవన్గౌడ్లు తమ సిబ్బందితో కలిసి దాడులు చేయడంతో ఈ దాడుల్లో భారీ ఎత్తున లిక్కర్ చాక్లెట్స్ స్వాధీనం చేసుకున్నారు. 400 చాక్లెట్ పీస్లను ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకొని ధూల్పేట్ ఎక్సైజ్ పోలీస్స్టేషన్కు అప్పగించారు. నగరంలోని ఐమాక్స్ థియేటర్ వద్ద వీటిని విక్రయిస్తున్నట్లు ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ పోలీసులకు సమాచారం రావడంతో రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ వెంటనే దాడులు నిర్వహించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మద్యం బాటిళ్ల కలకలం .. ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు జరిపినప్పుడు లిక్కర్ చాక్లెట్ల ఫ్యాక్టరీలో నాలుగు మద్యం ఫుల్బాటిళ్లను ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మధురావైన్, టీచర్స్, బకాడీ కంపెనీలకు చెందిన నాలుగు ఫుల్ బాటిల్స్ లభించడంతో లిక్కర్ చాక్లెట్స్లలో వైన్ కలుపుతున్నట్లు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. లిక్కర్ చాక్లెట్పై రూ.60 ధరను ముద్రించారు. ఇదిలా ఉండగా నగరంలోని పలు ప్రాంతాల్లో లిక్కర్ చాక్లెట్లు తయారవుతున్నాయని ఎక్సైజ్ పోలీసులకు సమాచారం అందింది. ప్రయోగశాలకు పంపుతున్నాం... ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్న లిక్కర్ చాక్లెట్లను ప్రయోగశాలకు పంపుతున్నామని ధూల్పేట్ ఎక్సైజ్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ అంజిరెడ్డి తెలిపారు. ల్యాబ్ నుంచి నివేదిక వచ్చిన వెంటనే కేసులు నమోదు చేస్తామని వివరించారు. ముందుగా లిక్కర్ చాక్లెట్లు తయారు చేస్తున్న కృష్ణకు నోటీసులు జారీ చేస్తున్నట్లు తెలిపారు. నిద్రమత్తులో వాణిజ్య పన్నుల శాఖ ... ఓల్డ్ మల్లేపల్లిలో అక్రమంగా తయారుచేస్తున్న లిక్కర్ చాక్లెట్ల ఫ్యాక్టరీపై రాష్ట్ర ఎక్సైజ్ పోలీసులు దాడిచేసినట్లు వార్తలు మీడియాలో, సోషల్ మీడియాలో వచ్చినా వాణిజ్య పన్నుల శాఖ అధికారులు మాత్రం నిద్రమత్తును వీడలేదు. చార్మినార్ కమర్షియల్ ట్యాక్స్ డీసీ అధికారులు గానీ, మెహిదీపట్నం సీటీవో సర్కిల్ అధికారులు గానీ ఓల్డ్మల్లేపల్లిలోని లిక్కర్ చాక్లెట్లు తయారు చేస్తున్న 11–1–940/1/2 నెంబర్ గల అడ్డా వద్దకు రాకపోవడంతో పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే ప్రాంతంలో మరిన్ని అక్రమ చాక్లెట్ ఫ్యాక్టరీలతో పాటు పలు అక్రమ ఫ్లైవుడ్ గోడౌన్లు ఉన్నా కూడా, వాణిజ్య పన్నుల శాఖ అధికారులు చర్యలు తీసుకోవడంలేదు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ ఈ ప్రాంతంలో దాడులు చేపడితే అక్రమాలను అరికట్టవచ్చని పలువురు పేర్కొంటున్నారు. -
31 రకాల పప్పులతో..
అబిడ్స్: ప్రతి సంవత్సరం వెరైటీ గణనాథులను ప్రతిష్టిస్తున్న గోషామహల్లోని హిందీనగర్ బాల యువమండలి ఈ సంవత్సరం వినూత్న తరహాలో 31 రకాల పప్పుదినుసులతో గణనాథుడిని తీర్చిదిద్దారు. గత 35 రోజులుగా యువ మండలి యువకులు పప్పులు, ఇతర ఆహార ధాన్యాలతో 8.7 అడుగుల విఘ్నేశ్వరునికి రూపకల్పన చేశారు. గతంలో అమెరికన్ డైమండ్స్తో గణనాధున్ని నెలకొల్పగా... ఈ సంవత్సరం కందిపప్పు, శెనగపప్పు, పెసరపప్పు, పుట్నాల పప్పు, మినపప్పు, ఎర్రపప్పు, శెనగలు, రాజ్మా పప్పు, జొన్నలు, కాబూద్ చెన, పల్లీలతో పాటు పలు రకాల ఆహార ధాన్యాలతో విఘ్నేశ్వరుడిని తయారుచేశారు. యువ మండలి అధ్యక్షులు ఆకాష్ అగర్వాల్, మండలి యువకులు హితేష్ అగర్వాల్, కృష్ణసేన్, సంతోష్కుమార్, శుభం అగర్వాల్, యశ్ అగర్వాల్, శుభంలు ఈ గణనాధున్ని రేయింబవళ్లు శ్రమించి తీర్చిదిద్దారు. -
గో రక్షణ కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధం
అబిడ్స్ : గోరక్షణ కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధంగా ఉన్నానని తెలంగాణ రాష్ట్ర బీజేపీ గోరక్షా సెల్ కన్వీనర్, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్లోథ పేర్కొన్నారు. గోవధ నిషేధ చట్టాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆదివారం మహారాష్ట్రలోని నాందేడ్లో జరిగిన హిందూ గోరక్షా సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆయన ప్రసంగాన్ని ధూల్పేట్లోని ఎమ్మెల్యే కార్యాలయం మీడియాకు విడుదల చేసింది. గోవధ కాకుండా శ్రీరామ్సేన కార్యకర్తలు నిరంతరం హైదరాబాద్ నగరంలో కృషి చేస్తున్నారని వివరించారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున గోభక్తులు పాల్గొన్నారు. -
అందరి చూపు ఆ కేఫ్ వైపే!
సాక్షి, సిటీబ్యూరో: ఆర్ట్ గ్యాలరీలు అంటే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లాంటి ఖరీదైన ప్రాంతాల్లో ఉంటాయి. ఇక కాఫీడేలు, కల్చరల్ సెంటర్లలోని ఎగ్జిబిషన్ హాల్స్ సైతం ప్రముఖులకో, మేధావులకో అందుబాటులో ఉంటాయి. అక్కడ నిర్వహించే ఫొటో ప్రదర్శనలను తిలకించే అవకాశం సామాన్యులకు సు‘దూరమే’. ఈ దూరాన్ని చెరిపేయాలనుకున్నారు నగరానికి చెందిన ‘ఫొటో వాకర్స్’. సిటీ ఐడెంటిటీ సింబల్స్లో ఒకటైన ఇరానీ కేఫ్నే ఫోటో ఎగ్జిబిషన్కు వేదిక చేసుకున్నారు. ఫొటో ఎగ్జిబిషన్స్ అనగానే ఏ గ్యాలరీ అనే ప్రశ్నే వస్తుంది. అయితే వీటిని సామాన్యులకు చేరువ చేయాలనే ట్రెండ్ ఇటీవలే మొదలైంది. చెన్నై, బెంగళూరు నగరాల్లో ఇవి ఇప్పటికే సామాన్యుడి ముంగిటకు వచ్చేశాయి. ఏకంగా బస్ స్టాపులు, రైల్వే స్టేషన్లు.. ఇలా జన సమూహం ఎక్కువగా ఉండే ప్రదేశాలను వెతికి మరీ ఎక్స్పోలను ఆరెంజ్ చేస్తున్నారు. నగరానికి ఈ ట్రెండ్ని పరిచయం చేస్తూ ఎక్కువ జనాలు వచ్చే ఇరానీ కేఫ్లో ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. సిటీ లుక్.. సిటిజన్స్ క్లిక్.. ఈనెల 19న అబిడ్స్లోని హోటల్ గ్రాండ్ ఇరానీ కేఫ్లో ఫొటో గ్రాఫర్స్ గ్రూప్ షో ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శన నేటితో ముగియనుంది. మధ్య తరగతి, సామాన్య జనాన్ని అందుకునేందుకు సిటీలో తొలిసారిగా ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామని, నగరం నలుమూలల్నీ ప్రతిబింబించే ఫొటోలను, నగరవాసులే తీసిన నేపధ్యంలో ఈ ప్రదర్శనను ఏదైనా రద్దీగా ఉండే ప్లేస్లో పెట్టాలని అనుకున్నామని చెప్పారు నిర్వాహకులు. తాము ఆశించినట్టే గ్యాలరీల కన్నా మిన్నగా గంటకి కనీసం 50 నుంచి 70 మంది సందర్శకులు వీటిని వీక్షిస్తున్నారంటూ ఆనందం వ్యక్తం చేశారు. స్పిరిట్ ఆఫ్ సిటీ.. ఈ ఎగ్జిబిషన్ కోసం ‘స్పిరిట్ ఆఫ్ హైదరాబాద్’ టైటిల్తో ఫొటోలు పంపించాల్సిందిగా కోరామని, వందలాదిగా ఎంట్రీలు వచ్చాయని, అందులో నుంచి ప్రత్యేకమైన ఫొటోలను ఎంపిక చేసినట్టు హైదరాబాద్ ఫొటోగ్రాఫర్స్ క్యూరేటర్ చంద్రశేఖర్ సింగ్ తెలిపారు. మన సిటీకి చెంది హైదరాబాద్ వీకెండ్ షూట్ టీం మెంబర్స్తో పాటు హైదరాబాద్ ఫొటో వాకర్స్.. వీకెండ్స్లో సిటీలో సంచరిస్తూ.. నచ్చిన దృశ్యాన్ని క్లిక్మనిపించిన వాటిలో నుంచి ఉత్తమ ఫొటోలను తీసుకున్నారు. అజయ్ కుమార్ పాణిగ్రాహి, ఆశ సతీశ్, బాబీ చౌదరి, చంద్ర కూచిభొట్ల, దీపాలు శర్మ, ద్వారకానాథ్ కీర్తి.. ఇలా ఆ వీకెండ్ షూట్ టీంలోని 20 మంది టాప్ ఫొటోగ్రాఫర్ల ఎక్స్క్లూజివ్ ఫొటోస్ని ఈ ఇరానీ కేఫ్ ఎక్స్పోలో ఉంచారు. కామన్ పీపుల్ సైతం కేఫ్లోని ఇరానీ చాయ్ని ఆస్వాదిస్తూ ఫొటోగ్రాఫ్్సని చూస్తూ వాటి వెనక స్టోరీని తెలుసుకుంటూ.. ఫొటో గ్రాఫర్స్తో సెల్ఫీలు దిగుతూ కొత్త థ్రిల్ని ఎంజాయ్ చేస్తున్నారని చంద్రశేఖర్ సింగ్ తెలిపారు. -
లేపాక్షి షోరూమ్లో వెడ్డింగ్ ఫర్నీచర్
-
బ్యాంకు లాకర్ తెరిచిచూసిన మహిళకు షాక్
15 తులాల బంగారు అభరణాలు మాయం హైదరాబాద్: భద్రతకు మారుపేరు బ్యాంకు లాకర్ అంటారు. ఇంట్లో ఉంటే దొంగలు ఎత్తుకెళుతారన్న భయంతో చాలామంది బ్యాంకు లాకర్లలో బంగారు అభరణాలు, విలువైన వస్తువులు, పత్రాలను దాచిపెడుతుంటారు. ఇదేవిధంగా ఎస్బీహెచ్ బ్యాంకు లాకర్ లో 15 తులాల బంగారు అభరణాలను పెట్టిన ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. లాకర్ ఉంచిన బంగారం మాయమైంది. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. నగరంలోని రాజేంద్రనగర్కు చెందిన అస్నా ఫర్ఖుందా తాజ్ అనే మహిళ అబిడ్స్ గన్ ఫౌండ్రీలోని ఎస్బీహెచ్ లాకర్లో కొన్ని రోజుల క్రితం 15 తులాల బంగారు ఆభరణాలను ఉంచింది. మంగళవారం ఆమె లాకర్ తెరిచి చూడగా.. అందులో ఆభరణాలు కనిపించలేదు. దీంతో ఆమె అబిడ్స్ పోలసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రభుత్వ పార్కింగ్ స్థలం వారిదే!
అబిడ్స్: అధికారులు ఏర్పాటు చేసిన ఉచిత పార్కింగ్ స్థలం వారిదే అన్న తీరుగా.. వాహనదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అబిడ్స్ పోలీసులు అరెస్టుచేశారు. జీహెచ్ఎంసీ 8వ సర్కిల్ డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ బాబయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు అబిడ్స్ జగదీష్ మార్కెట్లో కొన్ని నెలలుగా ప్రతిరోజూ వందలాది వాహనాల వద్ద పార్కింగ్ ఫీజులు వసూలు చేస్తున్న ఫైజుల్, ఎం. మఫీలను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. అయితే ఈ విషయమై కొంతమంది స్థానిక వ్యాపారస్తులు, సన్నిహితులు వారిని విడిచిపెట్టాలని పోలీసులను డిమాండ్ చేశారు. అంతేగాక చార్మినార్ మజ్లిస్ ఎమ్మెల్యే పాషాఖాద్రీకి కూడా వారు ఫిర్యాదు చేశారు. అయితే, సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్రెడ్డి, అబిడ్స్ ఏసీపీ రాఘవేందర్రెడ్డి, ఇన్స్పెక్టర్ శ్రీనివాస్లు ఎమ్మెల్యేకు వారిద్దరినీ ఎందుకు అరెస్టు చేశామో వివరించారు. ప్రజలకు ఉచిత పార్కింగ్ జీహెచ్ఎంసీ కల్పిస్తే ఎందుకు పార్కింగ్ ఫీజులు వసూలు చేస్తున్నారని పోలీసు అధికారులు ఈ విషయమై ప్రశ్నించిన ఎమ్మెల్యేను ప్రశ్నించడంతో తనకేమీ తెలియదంటూ ఆయన వెళ్లిపోయారు. ఇద్దరు నిందితులపై పోలీసులు పలు కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. -
అబిడ్స్ లో తనిఖీలు: రూ. 35 లక్షలు స్వాధీనం
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు నగర వ్యాప్తంగా విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. గురువారం ఆబిడ్స్ జీపీవో ఎదురుగా తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు హోండా యాక్టీవాలో తరలిస్తున్న రూ. 35 లక్షలను గుర్తించారు. దీంతో వాహనంపై ఉన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ప్రస్తుతానికి డబ్బుకు సంబంధించిన సరైన పత్రాలు చూపకపోవడంతో సాయంత్రం వరకు గడువు ఇచ్చారు. తనిఖీలు కొనసాగుతున్నాయి. -
కావూరి కంపెనీల ముందు బ్యాంకు ఉద్యోగుల ప్రదర్శన
* కేంద్ర మాజీ మంత్రికావూరి కుమార్తె శ్రీవాణికి చెందిన సంస్థ ఎదుట ప్రదర్శన * 18 బ్యాంకులకు రూ. వెయ్యి కోట్ల మేర బకాయి పడినట్లు వెల్లడి హైదరాబాద్: కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కుమార్తె శ్రీవాణికి చెందిన ఓ నిర్మాణ సంస్థ నగరంలోని 18 బ్యాంకులకు దాదాపు రూ.వెయ్యి కోట్ల మేర బకాయి పడింది. దీంతో ఆయా బ్యాంకుల మేనేజర్లు, ఏజీఎంలు ఆ సంస్థ ఎదుట సోమవారం ప్లకార్డులతో మౌన ప్రదర్శనకు దిగారు. శ్రీవాణికి చెందిన ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ గత పదేళ్ల నుంచి నగరంలోని ప్రముఖ బ్యాంకులలో రూ.వందల కోట్ల రుణాలు తీసుకుంటూ తిరిగి చెల్లింపులు జరుపుతోంది. అయితే గత నాలుగేళ్లుగా ఆ సంస్థ తాను తీసుకున్న రుణాలను చెల్లించడం లేదు. దీంతో 18 బ్యాంకుల అధికారులు సోమవారం అబిడ్స్ చిరాగ్అలీ లైన్లోని రాఘవ రత్న టవర్ 7వ అంతస్తులో ఉన్న ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ కార్యాలయం ముందు ప్లకార్డులతో మౌన ప్రదర్శనకు దిగారు. ఉదయం 9.45 గంటల నుంచి 11.45 గంటల వరకు రెండు గంటల పాటు ప్రదర్శనకు దిగి రుణాలు చెల్లించాలని కోరారు. ఆ సమయంలో కార్యాలయంలో ఎవరూ అందుబాటులో లేరు. ఈ బ్యాంకులకే బకాయిలు... నగరంలోని కోఠి ఆంధ్రాబ్యాంకు, బ్యాంకు స్ట్రీట్లోని యునెటైడ్ బ్యాంకు ఆఫ్ ఇండియా, ఎస్డీ రోడ్లోని కోఆపరేటివ్ ఫైనాన్స్ గ్రూప్, ఎక్స్పోర్ట్ అండ్ ఇన్పోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఏసీ గాడ్స్లోని బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాగుట్టలోని ఎస్బీహెచ్, బేగంపేట్లోని ఐసీఐసీఐ, సికింద్రాబాద్లోని ఎస్బీఐ, సైఫాబాద్లోని కెనరా బ్యాంకు, పబ్లిక్ గార్డెన్స్లోని విజయబ్యాంకు, అబిడ్స్లోని పంజాబ్ నేషనల్ బ్యాంకు, యూకో బ్యాంకు, సోమాజిగూడలోని బ్యాంక్ ఆఫ్ బహెరాన్, కువైట్ బ్యాంక్, హిమాయత్నగర్లోని అలహాబాద్ బ్యాంక్, సికింద్రాబాద్లో కార్పొరేషన్ బ్యాంకు, బేగంపేట్లోని ఇండస్ట్రియల్ బ్యాంకు, బంజారాహిల్స్లోని శ్రీ ఎక్విప్మెంట్ ఫైనాన్స్ ప్రైవేటు లిమిటెడ్ బ్యాంకులకు ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ కంపెనీ దాదాపు వెయ్యి కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. కోఠి ఆంధ్రాబ్యాంకుకే రూ. 200 కోట్లు కోఠి చౌరస్తాలోని ఒక్క ఆంధ్రాబ్యాంకుకే దాదాపు రూ. 200 కోట్ల బకాయిలు ఉన్నట్లు సమాచారం. దీంతో పాటు మిగతా 17 బ్యాంకులతో కలిపి రూ. వెయ్యి కోట్ల బకాయిలు ఉన్నాయని అధికారులు తెలిపారు. నోటీసులు ఇచ్చినా స్పందన లేదు... వివిధ బ్యాంకులు బకాయిలు చెల్లించాలని పలుమార్లు నోటీసులు ఇచ్చినా స్పందన లేదని, దీంతోనే తామంతా ఏకమై మౌన ప్రదర్శనకు దిగామని పలువురు అధికారులు తెలిపారు. వివిధ ప్రాజెక్టుల కోసం రుణాలు తీసుకున్నట్లు వివరించారు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఎన్పీఏ అయిన అనంతరమే తాము నోటీసులు జారీ చేసి చట్టపరంగా ముందుకు పోతామని అధికారులు తెలిపారు. ఈ ప్రదర్శనలో పలు బ్యాంకులకు చెందిన అధికారులు హెచ్.ఆర్. చౌదరి, ఎం. రవి, సీహెచ్. రాజశేఖర్, కమలాకర్రావు, హనుమంతరావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఉద్యోగి
అబిడ్స్ (హైదరాబాద్) : లంచం తీసుకుంటూ విద్యా శాఖ ఉద్యోగి ఒకరు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు దొరికిపోయారు. గన్ఫౌండ్రీలోని జిల్లా విద్యా శాఖ అధికారి కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ వహీదుద్దీన్... శుక్రవారం సాయంత్రం ఓ వ్యక్తి నుంచి రూ.4 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కాగా దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
'సోషల్ మీడియాతో ఆ పోలీసులకు తిప్పలు'
అబిడ్స్: నగరం నడిబొడ్డున ఉన్న అబిడ్స్లో ఓ ప్రేమజంటపై సినిమా థియేటర్ వద్ద కొంతమంది పోకిరీలు దాడిచేశారంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేశాయి. బుధవారం మధ్యాహ్నం నుంచే వాట్సాప్, ఫేస్బుక్లలో ఈ వార్త సంచలనం రేపింది. కానీ ఏ థియేటర్ వద్ద జరిగిందో, ఎవరిపై జరిగిందో వివరాలు మాత్రం పూర్తిగా లేకపోవడంతో అబిడ్స్ పోలీసులు సైతం తలపట్టుకున్నారు. అబిడ్స్ ఇన్స్పెక్టర్ కె శ్రీనివాస్, అదనపు ఇన్స్పెక్టర్ పులి యాదగిరి ఈ సోషల్ మీడియా సంచలన వార్తతో పలు థియేటర్ల వద్ద కూడా విచారణ జరిపారు. ఏ థియేటర్ వద్ద ఈ సంఘటన జరగలేదని పలువురు థియేటర్ యాజమానులు పోలీసులకు వివరించడంతో వారు ఊపిరిపీల్చుకున్నారు. అంతేగాక కొన్ని నెలల క్రితం అబిడ్స్ సంతోష్-స్వప్న థియేటర్ వద్ద ఒక ప్రేమజంటపై గుర్తుతెలియని పోకిరీలు దాడిచేసినట్లు సమాచారం. కానీ ఆ సంఘటనపై కూడా నేటి వరకు పోలీసులకు లిఖితపూర్వకంగా ఎవరూ ఫిర్యాదు చేయలేదు. ఇలా సోషల్ మీడియా హాట్ న్యూస్ పోలీసులకే తలనొప్పిగా మారింది. -
అబిడ్స్ కమర్షియల్ టాక్స్ ఆఫీస్లో మంటలు
-
అబిడ్స్లో చైన్ స్నాచింగ్
హైదరాబాద్ : అబిడ్స్ బొగ్గులకుంటలో బుధవారం చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. రహదారిపై నడిచి వెళ్తున్న మహిళపై స్నాచర్లు దాడి చేశారు. అనంతరం ఆమె మెడలోని గొలుసు తెంచుకుని... బైక్పై అక్కడి నుంచి పరారైయ్యారు. చైన్ స్నాచర్ల దాడిలో గాయపడిన మహిళను స్థానికులు వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బస్టాండ్లోకి దూసుకెళ్లిన కారు..
-
అబిడ్స్లో కారు బీభత్సం
హైదరాబాద్ : అబిడ్స్ చర్మాస్ వద్ద శుక్రవారం ఉదయం ఓ కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వెళ్తున్న కారు ఒక్కసారిగా చర్మాస్ బస్టాప్లోకి దూసుకెళ్లింది. దీంతో బారికేడ్లు ధ్వంసమైనాయి. అప్పటికే బస్టాప్లో బస్సుల కోసం వేచి ఉన్న ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. స్థానికులు వెంటనే స్పందించి... అబిడ్స్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకుని... స్టేషన్కి తరలించారు. కాగా డ్రైవర్పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు వెల్లడించారు. -
అబిడ్స్లో మోడల్ పోలీస్స్టేషన్
-
అబిడ్స్ పెయి౦టాన్స్గ్రౌ౦డ్లోగుడ్ఫ్రైడే కార్యక్రమ౦
-
మహాత్మాగాంధీ శాంతి అవార్డును అందుకున్న జంగారెడ్డి
కందుకూరు: జిల్లా పరిషత్లో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ ఏనుగు జంగారెడ్డి మహాత్మాగాంధీ శాంతి అవార్డు-2014ను అందుకున్నారు. అంతర్జాతీయ సంస్థ సుబేదార్ అమీర్అలీఖాన్ గ్లోబల్ పీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ ఆబిడ్స్లోని ఆంధ్ర సరస్వతి పరిషత్ ఆడిటోరియంలో అంతర్జాతీయ అహింసాదినోత్సవం ముగింపు ఉత్సవాలు నిర్వహించారు. అందులో భాగంగా స్వాతంత్య్ర సమరయోధులతో పాటు సమాజసేవలో ఉన్న వారికి శాంతి అవార్డులను అందించారు. ఈ సందర్భంగా జస్టిస్ వామన్రావు, ప్రొఫెసర్లు కె.పురుషోత్తమ్రెడ్డి, సీతా, సీవీ.చారి తదితరుల చేతుల మీదుగా ఆయన అవార్డు అందుకున్నారు. ఎంపీటీసీ సభ్యుడు ఈశ్వర్గౌడ్, మాజీ ఎంపీటీసీ సభ్యుడు కృష్ణనాయక్, ఐబీపీ మార్కెట్ కమిటీ మాజీ డెరైక్టర్ కరుణాకర్రెడ్డి, ఉపసర్పంచ్ గోపాల్రెడ్డి, సీనియర్ నాయకులు రాణాప్రతాప్రెడ్డి, కె.వెంకట్రెడ్డి, కె.గోపాల్రెడ్డి, సి.రఘుమారెడ్డి తదితరులు ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. -
అబిడ్స్ సీఐపై మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు
హైదరాబాద్: అబిడ్స్ సీఐ వేధింపులకు పాల్పడుతున్నారని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కు మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు చేశారు. డ్యూటి విషయంలో తనను వేధింపులకు గురి చేస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. మహిళా కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరపాలంటూ ఉన్నతాధికారులకు కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. అయితే తాను ఎలాంటి వేధింపులకు పాల్పడలేదని సీఐ వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది. -
నూతన సంవత్సర సంబరాలు
-
సమైక్య న్యాయవాదుల సభను అడ్డుకున్న టీ. లాయర్లు
-
సమైక్య న్యాయవాదుల సభను అడ్డుకున్న టీ. లాయర్ల జేఏసీ, ఉద్రిక్తం
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ భవన్ లో సమైక్యాంధ్ర న్యాయవాదుల జాయింట్ యాక్షన్ సమావేశం ఉద్రిక్తంగా మారింది. హైదరాబాద్ల లోని అబిడ్స్ లోని ఏపీఎన్జీవో భవన్లో నిర్వహిస్తున్న సమైక్యాంధ్ర న్యాయవాదుల జేఏసీ సమావేశాన్ని తెలంగాణ న్యాయవాదుల జేఏసీ అడ్డుకున్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా హైదరాబాద్ లో ఎలాంటి సదస్సులు, సమావేశాలు నిర్వహించకూడదని తెలంగాణ న్యాయవాదుల జేఏసీ అభ్యంతరం తెలిపింది. ఇరువర్గాలు పోటాపోటీగా నినాదాలు చేశారు. దాంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరువర్గాల మధ్య తోపులాట కూడా జరగడంతో ఏపీఎన్ జీవో భవన్ వద్ద వాతావరణం వేడెక్కింది. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక బ్యానర్ ను తెలంగాణ న్యాయవాదులు చించివేశారు.