Ali Reza
-
అలీరెజా కూతురు ఎంత క్యూట్గా ఉందో.. బర్త్డే పిక్స్ వైరల్
-
పుట్టిన ఊరు కోసం...
‘బిగ్బాస్’ ఫేమ్ అలీ రేజా, సీతా నారాయణన్ జోడీగా నటించిన చిత్రం ‘రామ్ ఎన్ ఆర్ఐ’. ‘పవర్ ఆఫ్ రిలేషన్ షిప్’ అనేది ఉపశీర్షిక. ఎన్.లక్ష్మీ నందా దర్శకత్వం వహించారు. ఎస్ఎంకే ఫిల్మ్స్ సింగులూరి మోహన్ కృష్ణ సమర్పణలో మువ్వా సత్యనారాయణ నిర్మించిన ఈ మూవీ ఈ నెల 26న విడుదలఅవుతోంది.ఈ సందర్భంగా నిర్వహించిన ట్రైలర్ లాంచ్, ప్రీ రిలీజ్ ఈవెంట్కి నిర్మాతలు ప్రసన్న కుమార్, సాయి వెంకట్, రామకృష్ణ గౌడ్, రామ సత్యనారాయణ వంటి వారు ముఖ్య అతిథులుగా హాజరై, సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఎన్.లక్ష్మీ నందా మాట్లాడుతూ– ‘‘పుట్టిన ఊరు కోసం ఎన్ఆర్ఐలు ఏం చేశారు? అనే కథాంశంతో ‘రామ్ ఎన్ ఆర్ఐ’ రూపొందింది’’ అన్నారు. ‘‘లక్ష్మీ నందాగారితో సోలోగా ఓ సినిమా తీస్తున్నాను’’ అన్నారు సింగులూరి మోహన్ కృష్ణ. ‘‘మా సినిమాని ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు మువ్వా సత్యనారాయణ. నటుడు రవి వర్మ మాట్లాడారు. -
బిగ్బాస్ ఫేమ్ హీరోగా 'రామ్ ఎన్ఆర్ఐ'.. ట్రైలర్ వచ్చేసింది!
బిగ్బాస్ ఫేమ్ అలీ రెజా, సీతా నారాయణన్ జంటగా నటించిన చిత్రం ‘రామ్ ఎన్ఆర్ఐ’. ‘పవర్ ఆఫ్ రిలేషన్ షిప్’ అనేది ఈ చిత్రం ఉపశీర్షిక. ఈ చిత్రానికి ఎన్.లక్ష్మీ నందా దర్శకత్వం వహిస్తున్నారు. మువ్వా క్రియేషన్స్ పతాకంపై ఎస్ఎంకే ఫిల్మ్స్ సింగులూరి మోహన్కృష్ణ సమర్పణలో మువ్వా సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీని జూలై 26న విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ను గ్రాండ్గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రైలర్ను కూడా రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్కు ప్రసన్న కుమార్, లయన్ సాయి వెంకట్, రామకృష్ణ గౌడ్, రామసత్య నారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.డైరెక్టర్ ఎన్.లక్ష్మీ నందా మాట్లాడుతూ.. ‘నాకు సపోర్ట్ చేసిన నా టీంకు ప్రత్యేకంగా థాంక్స్. పుట్టిన ఊరికి ఏదైనా చేయాలని కోరుకున్న వారంతా ముందుకు వచ్చి నా ఈవెంట్ను సక్సెస్ చేశారు. సినిమా చాలా బాగా వచ్చింది. అందరూ చూసి ఆదరించండి’ అని అన్నారు.సింగులూరి మోహన్కృష్ణ మాట్లాడుతూ.. ‘సినిమా అద్భుతంగా వచ్చింది. ఈ చిత్రాన్ని రిలీజ్ చేసే అవకాశం ఇచ్చిన వారందరికీ థాంక్స్. నా మీద నమ్మకంతో నాకు ఈ చిత్రాన్ని ఇచ్చారు. జూలై 26న మా చిత్రం రాబోతోంది. ఉయ్యాల జంపాల, శతమానంభవతి ఫ్లేవర్ నాకు కనిపించింది. మా ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని భావిస్తున్నా’ అని అన్నారు. నిర్మాత మువ్వా సత్యనారాయణ మాట్లాడుతూ.. ‘సినిమా చాలా బాగా వచ్చింది. చిత్రాన్ని చాలా ఎంజాయ్ చేస్తూ నిర్మించాం. ఈ మూవీ పెద్ద సక్సెస్ అవుతుందని భావిస్తున్నాం. మా సినిమాను అందరూ ఆదరించండి’అని అన్నారు.నటుడు రవి వర్మ మాట్లాడుతూ.. ‘డైరెక్టర్ ఈ కథ చెప్పినప్పుడు ఎంతో రిలేట్ అయ్యాను. పుట్టిన ఊరుకి ఏం చేశామని ఎంతో మంది అనుకుంటారు. అలాంటి పాయింట్ను తీసుకుని కథ చేయడం గొప్ప విషయం. ఈ కథ ఏ ఒక్కరికీ నచ్చినా ఎంతో కొంత మార్పు వస్తుంది కదా అని అనిపించింది. ఇలాంటి మంచి చిత్రంలో కచ్చితంగా నటించాలని కోరుకున్నా. నిర్మాత మొవ్వా సత్యనారాయణ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. అందరూ చూసి మా సినిమాను ఆదరించండి’ అని అన్నారు. -
బిగ్బాస్ షోకి వెళ్లొచ్చాక నన్ను బ్యాన్ చేశారు: అలీ రెజా
తెలుగు బిగ్బాస్ ఇప్పటివరకు ఏడు సీజన్లు పూర్తి చేసుకుంది. ఈ షోతో చాలామంది మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మరోవైపు సినిమాల్లో సెటిలైపోయిన వాళ్లు ఉన్నారు. అయితే మూడో సీజన్లో పాల్గొని ఫైనలిస్ట్గా నిలిచిన అలీ రెజా కూడా ఇప్పుడు సినిమాల్లో నటిస్తూ ఫేమ్ తెచ్చుకుంటున్నాడు. గతంలో బిగ్బాస్ షోకి వెళ్లొచ్చిన తర్వాత ఓ ఛానెల్ తనపై నిషేధం విధించిందని చెబుతూ అప్పుడు జరిగిన వివాదం గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చాడు. (ఇదీ చదవండి: 'ఆపరేషన్ వాలంటైన్' ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. వచ్చేది అప్పుడేనా?) 'బిగ్ బాస్ షోకి వెళ్లకముందు సీరియల్ చేస్తుండేవాడిని. షోకి వెళ్లొచ్చిన తర్వాత తిరిగి మళ్లీ సీరియల్లో చేరాలని అనుకున్నాను. కానీ బిగ్బాస్ స్టేజీపై ఉన్నప్పుడే 'వైల్డ్ డాగ్' మూవీలో రోల్ గురించి నాగార్జున సర్ చెప్పారు. దర్శకుడిని కలవడంతో ఆయన నాకు ఛాన్స్ ఇచ్చారు. ఫైట్ సీన్స్ కోసం రోజూ పొద్దునే ప్రాక్టీస్ ఉండేది. రెండు రోజులు రాకపోతే సినిమాలో నుంచి వెళ్లిపోవాల్సి ఉంటుందని ముందు చెప్పారు. సరిగ్గా అదే టైంలో సీరియల్ వాళ్లు పిలిచి క్లోజ్ చేస్తున్నాం, నువ్వు రావాలి అన్నారు. అప్పటికీ నేను వస్తానని, కాకపోతే టైమింగ్స్ బట్టి వస్తానని చెప్పాను' 'నేను వచ్చే విషయమై డిస్కషన్ జరుగుతుండగానే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి ఫోన్ వచ్చింది. నేను వెళ్లి పరిస్థితి అంతా వివరించాను. ఆ తర్వాత ఓ రోజు 'వైల్డ్ డాగ్' షూటింగ్లో ఉన్నాను. అప్పుడు.. కౌన్సిల్లో మీటింగ్ ఉంది రావాలని ఫోన్ కాల్ వచ్చింది. నేను ఇప్పుడు రాలేను, సాయంత్రం ఓ గంట పర్మిషన్ తీసుకుని వస్తానని చెప్పాను. ఇది జరిగిన రెండు రోజులకు నాకు ఓ స్క్రీన్ షాట్ వచ్చింది. నన్ను బ్యాన్ చేసినట్లు, రెండేళ్లు ఎవరూ షూటింగ్స్, షోలకు పిలవొద్దు అని అందులో ఉంది. చాలా బాధపడ్డాను. ఇలా ఎలా చేస్తారనిపించింది' అని అలీ రెజా చెప్పుకొచ్చాడు. అలీ రెజాతో పాటు నటి పల్లవి గౌడని కూడా సదరు ఛానెల్ వాళ్లు పలు కారణాలతో నిషేధించారు. కానీ అలీ రెజా సినిమా నటుడిగా సెటిలైపోయాడు. పల్లవి గౌడ మాత్రం ప్రస్తుతం అదే ఛానెల్లో రీఎంట్రీ ఇచ్చి సీరియల్స్ చేసుకుంటోంది. (ఇదీ చదవండి: ‘ఆపరేషన్ వాలెంటైన్’ రివ్యూ) -
బిగ్బాస్తోనే ఫేమ్.. వరుణ్ తేజ్ పెళ్లి వార్తతో షాకయ్యా!
బాలీవుడ్లో ముఖ్బీర్ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన టాలీవుడ్ నటుడు అలీ రెజా. ఆ తర్వాత 'పసుపు కుంకుమ' సీరియల్తో బుల్లితెరపై కనిపించారు. 2014లో అమృతం చందమామలో సినిమా ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ధృవ, మెట్రో కథలు, వైల్డ్ డాగ్, రంగమార్తాండ, గ్రే సినిమాల్లో నటించారు. అంతే కాకుండా 2019లో బిగ్బాస్లో కంటెస్టెంట్గా పాల్గొన్ని మరింత ఫేమస్ అయ్యారు. తాజాగా అవికా గోర్ నటించిన వధువు వెబ్ సిరీస్తో మరోసారి ప్రేక్షకులను పలకరించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అలీ రెజా తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అవేంటో ఓ లుక్కేద్దాం. అలీ రెజా మాట్లాడుతూ.. 'నేను హోటల్లో ఉన్నప్పుడు మా పక్కనే మోడలింగ్ కంపెనీ ఉండేది. ఆ తర్వాత నాకు మోడలింగ్ వెళ్లమని కొందరు సలహా ఇచ్చారు. అలా నా జర్నీ మొదలైంది. నేను ఫేమస్ అవ్వడానికి 14 ఏళ్లు పట్టింది. నాకు పసుపు- కుంకుమ సీరియల్తో గుర్తింపు వచ్చింది. కానీ బిగ్బాస్ తర్వాతే ఎక్కువ ఫేమస్ అయ్యా. ఈ సీజన్లో ఎవరెవరు ఉన్నారో అని ఫస్ట్ ఎపిసోడ్ చూశా. ' అని అన్నారు. డబ్బు సంపాదించాలనే కోరిక సినిమాల్లోకి రావడంపై మాట్లాడుతూ.. ' నాకు చిన్నప్పటి నుంచి బిజినెస్ చేసి బాగా డబ్బులు సంపాదించాలనే కోరిక ఉంది. దీంతో పాటు యాక్టింగ్ చేయాలనే పిచ్చి కూడా ఉండేది. అందుకే హోటల్ వ్యాపారం నుంచి తప్పుకున్నా. అయితే కరోనా తర్వాత ఇండస్ట్రీలో మార్పులొచ్చాయి. కానీ మా నాన్నకు రెస్టారెంట్స్ ఉండటం వల్ల నాకు మేలు జరిగింది. అప్పుడే సొంతంగా బిజినెస్ చేద్దామనే ఆలోచన వచ్చింది. నాకు ఇందులో అనుభవం కూడా ఉంది. ఆర్థికంగా బలంగా ఉండాలని ఫిక్స్ అయ్యా. అందుకే రీసెంట్గా ముంబైలో రెండు రెస్టారెంట్స్ ప్రారంభించానని' తెలిపారు. డబ్బుకోసమే ఆ పాత్ర ఒప్పుకున్నా మెట్రో కథలు చిత్రం గురించి మాట్లాడుతూ.. 'చాలామంది మెట్రో కథల్లో చేసిన క్యారెక్టర్ను కొందరు బ్యాడ్గా రిసీవ్ చేసుకున్నారు. కానీ అందులో ఎక్కడా కూడా ఇంటీమసీ లేదు. అది మన ప్రస్తుత సమాజంలో జరుగుతున్నదే చూపించారు. నిజంగా నేను డబ్బుల కోసమే ఆ పాత్ర చేశా. కానీ అది ఒక మంచి మేసేజ్. చాలామంది యూట్యూబ్లో ఆ సీన్ను రాంగ్గా చూపించారు. సోషల్ మీడియాలో ఏం చేసినా నా కెరీర్పై ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. నేను వాటిని అసలు పట్టించుకోను. ప్రస్తుతం రిలీజైన వధువు వెబ్సిరీస్లో నందు అన్నతో చేయడం చాలా బాగా అనిపించింది. మా ఇద్దరి మధ్య స్నేహం ఇంకా బాగా పెరిగింది' అని అన్నారు. వరుణ్ తేజ్ పెళ్లిపై కామెంట్స్.. అయితే ప్రస్తుతం వరుణ్ తేజ్ మూవీ ఆపరేషన్ వాలైంటెన్లో చేస్తున్నట్లు తెలిపారు. మరో కొన్ని ప్రాజెక్టులు కూడా రిలీజ్కు సిద్ధంగా ఉన్నాయని అలీ రెజా వెల్లడించారు. వరుణ్ తేజ్ పెళ్లి గురించి విన్నప్పుడు మాకు కూడా షాకింగ్గా అనిపించింది. అన్నతో పెళ్లికి ముందే కలిసి పనిచేశా.. సెట్స్లో కూడా ఎప్పుడు ఆ విషయం ఎప్పుడు చెప్పలేదని అన్నారు. వరుణ్ అన్న మంచి వ్యక్తి.. ఆయనతో పని చేయడం సంతోషంగా అనిపించిందని తెలిపారు. పెళ్లి తర్వాత కూడా వరుణ్ను కలిశానని వెల్లడించారు. -
అనుమానాస్పదంగా ‘వధువు’
అవికా గోర్ ప్రధాన పాత్రలో, నందు, అలీ రెజా కీలక పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘వధువు’. శ్రీకాంత్ మొహ్తా, మహేంద్ర సోని నిర్మాణంలో పోలూరు కృష్ణ రూపొందించిన ఈ వెబ్ సిరీస్ ఈ నెల 8 నుంచి హాట్స్టార్ ఓటీటీ ఫ్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా నందు మాట్లాడుతూ– ‘‘ఓ కుటుంబంలోని సభ్యులందరూ ఎందుకు అనుమానాస్పదంగా కనిపిస్తారు? అనే అంశం ‘వధువు’లో కొత్తగా ఉంటుంది. అవికా, నేను బెక్కెం వేణుగోపాల్ ప్రొడక్షన్లో ఓ సినిమా చేస్తున్నాం’’ అన్నారు. ‘‘ఈ సిరీస్లో నా పాత్ర చాలా సెటిల్డ్గా ఉంటుంది’’ అన్నారు అలీ రెజా. ‘‘బెంగాలీ సిరీస్ ‘ఇందు’ను ‘వధువు’గా రీమేక్ చేశాం. అయితే నేను సోల్ను మాత్రమే తీసుకున్నాను. మన నేటివిటీకి తగ్గట్లు మార్పులు చేశాం. ఫస్ట్ ఎపిసోడ్ లో అవికా పెళ్లై అత్తవారింటికి వస్తుంది. సెకండ్ ఎపిసోడ్ నుంచి అసలు కథ మొదలవుతుంది. అవికా అత్తవారింటికి ప్రేక్షకుల్ని కూడా తీసుకెళ్తాం. అంత గ్రిప్పింగ్ గా సిరీస్ ఉంటుంది. సెకండ్ ఎపిసోడ్ నుంచి 7వ ఎపిసోడ్ వరకు అంతే క్యూరియస్ గా కథ సాగుతుంది. 7వ ఎపిసోడ్ కిక్ ఇచ్చేలా ఉంటుంది’ అన్నారు దర్శకుడు పోలూరు కృష్ణ. -
Grey Movie Review: ‘గ్రే’ మూవీ రివ్యూ
టైటిల్: గ్రే నటీనటుటు: అరవింద్ కృష్ణ, అలీ రెజా, ఊర్వశి రాయ్, ప్రతాప్ పోతేన్ తదితరులు నిర్మాణ సంస్థ: అద్వితీయ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మాతలు: వెంకట కిరణ్ కళ్లకూరి, హేమ మాధురి కాళ్లకూరి రచన- దర్శకుడు: రాజ్ మాదిరాజు సంగీతం: నాగరాజు తాళ్లూరి సినిమాటోగ్రఫీ: చేతన్ మధురాంతకం ఎడిటర్: సత్య గిడుతూరి విడుదల తేదీ: మే 26, 2023 ఈ మధ్యకాలంలో విడుదలకు ముందే సినిమాలను ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ కి పంపిస్తున్నారు. అలా వెళ్లి 2022 నుంచి దాదాపుగా అనేక ఫిలిం ఫెస్టివల్స్ లో అవార్డులు అందుకున్న గ్రే సినిమా మే 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ఇప్పటికే ది బుడాపెస్ట్ ఫిలిం ఫెస్టివల్, జైపూర్ ఫిలిం ఫెస్టివల్, ఠాగూర్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్, సింగపూర్ వరల్డ్ ఫిలిం కార్నివాల్, యూరోపియన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్, దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించబడిన గ్రే సినిమా ఎలా ఉంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. మన భారతదేశానికి చెందిన అనేకమంది న్యూక్లియర్ సైంటిస్టులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఇలాంటి సంఘటనలను ఆధారంగా చేసుకుని ఈ సినిమా తెరకెక్కింది. న్యూక్లియర్ సైంటిస్ట్ సుదర్శన్ రెడ్డి(ప్రతాప్ పోతెన్) అనుమానాస్పద పరిస్థితుల్లో మరణిస్తాడు. ఆ కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చిన నాయక్(అలీ రెజా) అనే పోలీసు ఆఫీసర్ మొదటి చూపులోనే సుదర్శన్ రెడ్డి భార్య(ఊర్వశి రాయ్)తో ప్రేమలో పడతాడు. ఆమె కూడా నాయక్ కి ఎట్రాక్ట్ అవుతుంది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా సుదర్శన్ రెడ్డి మృతికి డాక్టర్ రఘు(అరవింద్) కారణమని తేలుతుంది. అయితే సుదర్శన్ రెడ్డిని డాక్టర్ రఘు ఎందుకు చంపాడు? ఇందులో సుదర్శన్ రెడ్డి భార్య పాత్ర ఏమిటి? చివరికి సుదర్శన్ రెడ్డి మరణానికి కారణమైన ఒక కీలకమైన వస్తువు ఏమైంది? పోలీసులు పంపకుండానే పోలీసులా వచ్చిన నాయక్ ఎవరు? అనేది ఈ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఎలా ఉందంటే సాధారణంగానే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ అనగానే ప్రేక్షకులకు ఎక్కడలేని ఆసక్తి వచ్చేస్తుంది. ఈ సినిమా కూడా కొంత ఆ జానర్ కి చెందిన సినిమానే. పబ్లిక్ లో పలుకుబడి ఉన్న ఒక బడా వ్యక్తి అనూహ్య పరిస్థితుల్లో మరణిస్తే అతని కేసు సాల్వ్ చేయడానికి వచ్చిన ఆఫీసర్ అతని భార్యతోనే ప్రేమలో పడటం, క్షణాల వ్యవధిలోనే వారిద్దరూ బెడ్ రూమ్ వరకు వెళ్లడం, శారీరకంగా ఒక్కటవ్వడం ఇలాంటి విషయాలన్నీ ఏమాత్రం కన్విన్సింగ్ గా అనిపించవు. అయితే ఫస్ట్ అఫ్ పూర్తయి ఇంటర్వెల్ తర్వాత సినిమా మొదలయ్యాక ఒక్కొక్క విషయాన్ని చిక్కుముడిలా విడదీస్తున్నట్లు క్లారిటీ ఇచ్చుకుంటూ రావడం గమనార్హం. న్యూక్లియర్ బాంబు తయారు చేయడానికి సంబంధించిన రీసెర్చ్ చేసే సుదర్శన్ రెడ్డి అప్పటివరకు ఆడవాళ్ళందరికీ దూరంగా ఉంటూనే ఒక ప్రెస్ రిపోర్టర్ అయిన ఆరుషి ప్రేమలో పడతాడు. ఆమె ప్రేమలో పడిన తర్వాత తన రీసెర్చ్ అంతా పూర్తి చేసి ఆ రీసెర్చ్ కాపీ డెలివరీ ఇవ్వాల్సిన సమయంలో మరణిస్తాడు. అయితే అతని మరణానికి కారణం ఆరుషినా? ఆరుషితో వివాహేతర సంబంధం పెట్టుకున్న రఘు అనే డాక్టరా? లేక సుదర్శన్ రెడ్డిని చంపడానికి ప్రయత్నిస్తున్న రష్యన్ లేదా ఐఎస్ఐ ఏజెంట్లా అనే విషయాలను తెరమీద ఇంట్రెస్ట్ కలిగించేలా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశారు దర్శకుడు. ఈ విషయాలన్నీ సినిమా తెరమీద చూసి తెలుసుకోవాల్సిందే. కథగా చూసుకుంటే ఇంట్రెస్టింగ్ గానే ఉంది, కానీ కథనం చప్పగా సాగడంతో బోర్ కొట్టిన ఫీలింగ్ కలుగుతుంది. అయితే యూత్ కి కనెక్ట్ అయ్యే విధంగా కొన్ని రొమాంటిక్ సీన్లు, డైలాగులు బాగా పేలుతాయి. కొద్ది రోజుల్లో అవి మీమ్స్ ద్వారా పాపులర్ అవుతాయి అనడంలో కూడా సందేహం లేదు. లాజిక్స్ పక్కన పెట్టి చూస్తే థ్రిల్లర్స్ ఎంజాయ్ చేసేవాళ్లు ఈ సినిమాను కూడా ఎంజాయ్ చేయొచ్చు. కానీ స్లో నేరేషన్, ఏమాత్రం లాజిక్ లేని కొన్ని సీన్స్ ఇబ్బందిగా మారుతాయి. ఎవరు ఎలా చేశారంటే డాక్టర్ పాత్రలో అరవింద్, న్యూక్లియర్ సైంటిస్ట్ సుదర్శన్ రెడ్డి పాత్రలో ప్రతాప్ పొథెన్ బాగా సూట్ అయ్యారు. అయితే వారి పాత్రలకు ఏ మాత్రం ఎమోషన్స్ సెట్ అవ్వలేదు. ఎప్పటిలాగే అలీ రెజా తనకి అచ్చొచ్చిన పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించాడు. ఇక హీరోయిన్ ఊర్వశిరాయ్ తన గ్లామర్ తో అందరినీ డామినేట్ చేసే ప్రయత్నం చేసింది. ఇక మిగతా పాత్రలలో కనిపించిన వారు కూడా తమ తమ పాత్రల పరిధి మీద నటించి ఆకట్టుకున్నారు. ఇక సాంకేతిక బృందం విషయానికి వస్తే సంగీత దర్శకుడు నాగరాజు తాళ్లూరి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా కుదిరింది. పాటలు మాత్రం అంత క్యాచీగా లేవు కానీ సినిమా కథకు తగ్గట్టు సెట్ అయ్యాయి. చేతన్ మధురాంతకం అందించిన సినిమాటోగ్రఫీ ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే కలర్ సినిమాలకు అలవాటు పడిన అందరికీ తన కెమెరా పనితనంతో గ్రే ఎఫెక్ట్ లో చూపించాడు. ఇక ఎడిటింగ్ టేబుల్ మీద కూడా కాస్త శ్రద్ధ తీసుకుంటే బాగుండేది. సినిమా నిర్మాణ విలువలు అయితే సినిమా స్థాయికి తగ్గట్టుగా సెట్ అయ్యాయి. రేటింగ్: 2.5 -
బ్లాక్ అండ్ వైట్ స్పై థ్రిల్లర్.. ఆసక్తి పెంచుతోన్న 'గ్రే'
ప్రతాప్ పోతన్, అరవింద్ కృష్ణ, అలీ రెజా, ఊర్వశీరాయ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన స్పై థ్రిల్లర్ 'గ్రే: ద స్పై హూ లవ్డ్ మి'. ఈ చిత్రానికి రాజ్ మాదిరాజు దర్శకత్వం వహించారు. ఈ మూవీని అద్వితీయ మూవీస్ పతాకంపై కిరణ్ కాళ్లకూరి నిర్మించగా.. దాదాపు 40 ఏళ్ల తర్వాత బ్లాక్ అండ్ వైట్లో వస్తున్న చిత్రమిది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 26న విడుదల కానుంది. (ఇది చదవండి: టాలీవుడ్ సీనియర్ నటుడు శరత్ బాబు కన్నుమూత) దర్శకుడు రాజ్ మాదిరాజు మాట్లాడుతూ.. 'ఐదారేళ్ల క్రితం మనదేశంలో రెండేళ్ల వ్యవధిలో దాదాపు 12మంది న్యూక్లియర్ సైంటిస్టులు కనపడకుండా పోయారు. ఇలా గతంలో కూడా చాలా సార్లు జరిగింది. వీటన్నింటికి కారణం ఏంటంటే ఫారెన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ వారు చాలా జాగ్రత్తగా వలపన్ని చేసిన ఆపరేషన్స్. అందులో నుంచి పుట్టిన ఐడియానే ఈ గ్రే మూవీ. ప్రతి ఆలోచన వెనుక మన ఆలోచనలకు కూడా అందని కొన్ని వింతైన ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. అదే ఈ స్పై డ్రామా' అని అన్నారు. (ఇది చదవండి: ఫోన్ రావడంతో కన్నీళ్లాగలేదు..చిన్న పిల్లాడిలా ఏడ్చేసిన నరేశ్!) మా ‘గ్రే’ చిత్రం 2022లో పలు అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్కు ఎంపికైంది. కలకత్తా ఇంటర్నేషనల్ కల్ట్ ఫిలిం ఫెస్టివల్ 2022 లో విన్నర్గా నిలిచింది. 2022 ఆసియన్ ఫిలిం ఫెస్టివల్, బ్రెజిల్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ నిర్వాహకులు గ్రే చిత్రాన్ని కొనియాడారు. -
అలీ రేజాతో రొమాంటిక్ సీన్పై ప్రశ్న.. నటి సనా షాకింగ్ రియాక్షన్
సినీ నటి సనా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లే. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా దాదాపు ఆరు వందల సినిమాలు చేసిన ఆమె పూర్తి పేరు సనా బేగమ్. పాత్రలు, హీరోయిన్ ఫ్రెండ్గా, తల్లిగా డిసెంట్ రోల్స్ చేసి ఆడియన్స్ మెప్పించింది. ఇటీవలే రిలీజైన రంగమార్తాండ చిత్రంలోనూ విభిన్న పాత్ర పోషించింది. ఇక ఈ పాత్రల గురించి పక్కన పెడితే ఇంతకాలం సంప్రదాయ పాత్రలు చేసిన ఆమె రీసెంట్గా నటించిన మెట్రోల కథలు వెబ్ సిరీస్లో బోల్డ్ రోల్లో కనిపించి షాకిచ్చింది. ఈ సిరీస్లో అప్పటికే పెళ్లై భర్త ఉన్న ఆమె మరో వ్యక్తితో బెడ్ షేర్ చేసుకుంటుంది. చదవండి: తొలిసారి బేబీ బంప్తో ఉపాసన.. ఫొటోలు వైరల్ అయితే తాజాగా తన బోల్డ్ రోల్పై సనా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఓ యూట్యూబ్ చానల్కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆమెకు దీనిపై ప్రశ్న ఎదురైంది. ఆమె మాట్లాడుతూ.. ‘‘డైరెక్టర్ కరుణ కుమార్, రైటర్ ఖాదీర్ బాబు చెప్పడంతో నేను ఆ రోల్ చేశాను. తాగుబోతు భర్త వల్ల ఓ మిడిల్ క్లాస్ మహిళ పడే ఇబ్బందులు, కష్టాలను ఈ ‘మెట్రో కథలు’ సిరీస్లో చూపించారు. నా పాత్రతో చాలా మంది స్ఫూర్తి పొందుతారు. ముఖ్యంగా ఆ వయసు మహిళలకు నా పాత్ర బాగా చేరుతుంది. ఎందుకంటే భార్యని పట్టించుకోని తాగుబోతూ భర్త వల్ల కోరికలను చంపుకుని బతుకుతారు కొందరు మహిళలు. కానీ ఆలాంటి మహిళల గురించి బయట సమాజం ఎలా మాట్లాడుకుంటుంది, భర్త చేసిన తప్పుకు ఆమెను ఎలా ట్రీట్ చేస్తుందో చూపించారు. ప్రస్తుతం బయటకు జరుగుతున్నదే సిరీస్లో చూపించారు. ఆ పాత్రని చాలా నీట్ గా ప్రెజెంట్ చేశారు. మంచి మెసేజ్ ఉన్న సిరీస్, అలాగే మంచి ప్రొడక్షన్ హౌస్ కూడా. అందుకే నేను కూడా ఈ పాత్రకు ఒప్పుకున్నా. నా రోల్ చూసి ఆ వయసులో ఉన్న చాలామంది మహిళలు కనెక్ట్ అవుతారు. తను కావాలని తప్పు చేయదు. చదవండి: చరణ్ బర్త్డే పార్టీలో కనిపించని తారక్.. ఎందుకు రాలేదు? అనుకోకుండా ఓ వీక్ మూమెంట్లో ఆ తప్పు జరిగిపోతుంది. ఆ తప్పు తనకు నచ్చింది కాబట్టి ఒప్పుకుంది. నన్ను చూసి ఇన్స్పైర్ అవుతారని ఆ రోల్ చేశాను. భవిష్యత్తులో ఇలాంటి స్టఫ్ ఉన్న రోల్స్ వస్తే తప్పకుండా చేస్తాను’’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. కాగా ఇందులోని ఓ ఎపిసోడ్లో భర్తవల్ల చాలా ఇబ్బందిపడే గృహిణి పాత్రలో సనా నటించింది. తన తాగుబోతూ భర్తకు యాక్సెండ్ చేసిన వ్యక్తితో ఓ వీక్ మూమెంట్లో దగ్గరవుతుంది. ఆ వ్యక్తి పాత్రలో బిగ్బాస్ ఫేం అలీ రేజా నటించాడు. ఆలీ రేజాతో ఇంటిమేట్ సీన్ చేసిన సనా వార్తల్లో నిలిచింది. -
ఇరాన్లో మాజీ అధికారికి ఉరి
దుబాయ్: బ్రిటన్ రహస్య నిఘా సంస్థ ‘ఎం16’కు సమాచారం చేర వేస్తున్నాడనే అనుమానంతో రక్షణ శాఖ మాజీ అధికారి అలీ రెజా అక్బారీని ఉరి తీసినట్లు ఇరాన్ ప్రభుత్వం తెలిపింది. బ్రిటన్–ఇరాన్ ద్వంద్వ పౌరసత్వం ఉన్న అక్బారీ ఇరాన్ రక్షణ శాఖలో కీలకంగా ఉన్న అలీ షంఖానీకి సన్నిహితుడిగా పేరుంది. ఇరాన్ ప్రభుత్వం అక్బారీని 2019లోనే అదుపులోకి తీసుకున్నట్లు అనుమానిస్తున్నారు. గతంలోనే అక్బారీకి మరణ శిక్ష విధించి, తాజాగా ఆ విషయం బయటపెట్టి ఉంటుందని భావిస్తున్నారు. దేశంలో అంతర్గతంగా ఆధిపత్య పోరు జరుగుతున్నట్లు అర్ధమవుతోందని పరిశీలకులు అంటున్నారు. తాము వద్దంటున్న అక్బారీకి ఇరాన్ ప్రభుత్వం మరణ శిక్ష విధించడంపై బ్రిటన్, అమెరికా మండిపడుతున్నాయి. -
ప్రజ్ఞానంద సంచలనం
మయామి: ఎఫ్టీఎక్స్ క్రిప్టో కప్ అంతర్జాతీయ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్లో భారత యువ గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానంద సంచలనంతో శుభారంభం చేశాడు. అమెరికా వేదికగా ఎనిమిది మంది మేటి గ్రాండ్మాస్టర్ల మధ్య లీగ్ పద్ధతిలో ఈ టోర్నీ జరుగుతోంది. తొలి రౌండ్ మ్యాచ్లో తమిళనాడుకు చెందిన 17 ఏళ్ల ప్రజ్ఞానంద 2.5–1.5తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ అలీరెజా ఫిరూజా (ఫ్రాన్స్)పై గెలుపొందాడు. ఈ విజయంతో ప్రజ్ఞానందకు 7,500 డాలర్ల (రూ. 5 లక్షల 94 వేలు) ప్రైజ్మనీ లభించింది. ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే), లెవాన్ అరోనియన్ (అమెరికా), జాన్ క్రిస్టాఫ్ డూడా (పోలాండ్), లియెమ్ లీ (వియత్నాం), హాన్స్ నీమెన్ (అమెరికా), అనీశ్ గిరి (నెదర్లాండ్స్) కూడా ఈ టోర్నీలో ఆడుతున్నారు. -
అలీ రెజా నటించిన 'గ్రే' మూవీ ట్రైలర్ చూశారా?
ప్రతాప్ పోతన్, అరవింద్ కృష్ణ, అలీ రెజా, ఊర్వశీ రాయ్ ప్రధాన పాత్రల్లో రాజ్ మదిరాజు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గ్రే’. ‘ద స్పై హూ లవ్డ్ మీ’ అనేది ట్యాగ్లైన్. కిరణ్ కాళ్లకూరి నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్ను హైదరాబాద్లో జరుగుతున్న ఎలైట్ ప్రో బాస్కెట్బాల్ టోర్నీలో రిలీజ్ చేశారు. ‘‘దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత బ్లాక్ అండ్ వైట్లో రూపొందిన చిత్రం ‘గ్రే’’ అన్నారు రాజ్ మదిరాజు. ‘‘నాకు యాక్టింగ్, బాస్కెట్బాల్ అంటే ఇష్టం. ఈ లీగ్లో నేను హైదరాబాద్ తరఫున పోటీ చేస్తున్నా. త్వరలో బాస్కెట్బాల్ నేపథ్యంలో ఓ సినిమా చేస్తా’’ అన్నారు అరవింద్ కృష్ణ. ‘‘మా సినిమా రష్ చూసినవారు మధుబాబు ‘షాడో’ నవలలా అద్భుతంగా ఉందని అభినందించారు’’ అన్నారు కిరణ్. -
బిగ్బాస్ తర్వాత నన్ను రెండేళ్లు బ్యాన్ చేశారు: అలీ రెజా
అలీ రెజా.. బుల్లితెర ప్రేక్షకులకు ఈ పేరు బాగా సుపరిచితం. అప్పటివరకు సీరియల్స్లో నటించినా రాని గుర్తింపు బిగ్బాస్ సీజన్-3తో సంపాదించుకున్నాడు. ఫిజికల్ టాస్కుల్లో తనదైన స్టైల్లో ఆడి ప్రేక్షకుల్ని మెప్పించిన అలీ బిగ్బాస్ అనంతరం బుల్లితెరపై పెద్దగా కనిపించలేదు. తాజాగా ఓ షోలో పాల్గొన్న అలీ తెరపై కనిపించకుండా ఉండటం వెనకున్న బలమైన కారణాన్ని బయటపెట్టాడు. ఈ మధ్య టీవీల్లో కనిపించడం లేదేంటి అని హోస్ట్ అడగ్గా.. తనను బ్యాన్ చేశారని చెప్పి షాకిచ్చాడు. అప్పట్లో నాకు బిగ్బాస్ ఆఫర్ వచ్చింది. ఆ టైంలో చిన్న మిస్టేక్ చేశా. ప్రొడ్యూసర్ కౌన్సిల్కి రావాలని ఫోన్ చేశారు. నేను వెళ్లేసరకి అలీ రెజా రెండేళ్లు బ్యాన్ అన్నారు. ఆ మాట విని నాకు హార్ట్ ఎటాక్ వచ్చినంత పనైంది అంటూ చెప్పుకొచ్చాడు. దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది. -
బిగ్బాస్ కంటెస్టెంట్ అలీ రెజా లేటెస్ట్ మూవీ
ప్రతాప్ పోతన్, అరవింద్ కృష్ణ, అలీ రెజా, ఊర్వశీ రాయ్ ముఖ్య తారలుగా రాజ్ మదిరాజు దర్శకత్వంలో కిరణ్ కాళ్లకూరి నిర్మించిన చిత్రం ‘గ్రే’. రాజ్ మదిరాజ్ మాట్లాడుతూ– ‘‘ఐదారేళ్ల క్రితం మన దేశంలో రెండేళ్ల వ్యవధిలో 12మంది న్యూక్లియర్ సైంటిస్టులు కనబడకుండా పోయారు. గతంలోనూ ఇలా జరిగింది. ఫారిన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ వల పన్ని చేసిన ఆపరేషన్స్లో భాగంగానే అలా జరిగాయి. అందులో నుంచి పుట్టిన ఐడియానే ‘గ్రే’. దాదాపు 40 ఏళ్ల తర్వాత బ్లాక్ అండ్ వైట్లో వస్తున్న చిత్రమిది’’అన్నారు. ‘‘రెండు గంటలు హ్యాపీగా చూసే చిత్రమిది’’ అన్నారు కిరణ్ కాళ్లకూరి. ఈ చిత్రానికి సహనిర్మాతలు: రాజేష్ తోరేటి, రాజా వశిష్ట, శ్రీదేవి కాళ్లకూరి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఉమామహేశ్వర్ చదలవాడ. -
స్పై థ్రిల్లర్గా గ్రే మూవీ, ఆలోచనలకు అందని కొన్ని వింతైన ఎక్స్ప్రెషన్స్..
ప్రతాప్ పోతన్, అరవింద్ కృష్ణ, అలీ రెజా, ఊర్వశీరాయ్ ప్రధాన పాత్రల్లో అద్వితీయ మూవీస్ ప్రై.లి పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా రూపొందుతున్న చిత్రం ‘గ్రే’. స్పై థ్రిల్లర్గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి రాజ్ మదిరాజు దర్శకత్వం వహిస్తున్నారు. కిరణ్ కాళ్లకూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ద స్పై హూ లవ్డ్ మి అనే ట్యాగ్లైన్ తో తెరకెక్కిన ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో.. రాజ్ మదిరాజ్ మాట్లాడుతూ.. ‘ఐదారేళ్ల క్రితం మనదేశంలో రెండేళ్ల వ్యవధిలో దాదాపు 12మంది న్యూక్లియర్ సైంటిస్టులు కనపడకుండా పోయారు. ఇలా గతంలో కూడా చాలా సార్లు జరిగింది. వీటన్నింటికి కారణం ఏంటంటే ఫారెన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సిస్. వారు చాలా జాగ్రత్తగా వలపన్ని చేసిన ఆపరేషన్స్ అవన్ని. అందులో నుండి పుట్టిన ఐడియానే గ్రే మూవీ..మనం సాధారణంగా మంచిని తెలుపుగాను, చెడును నలుపుగాను చూస్తుంటాం. కాని ఆ రెండు కలర్స్ మధ్యలో కొన్ని వందల షేడ్స్ ఉంటాయి. ప్రతి ఆలోచన వెనుక మన ఆలోచనలకు కూడా అందని కొన్ని వింతైన ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. అదే గ్రే..ఒక స్పై డ్రామా. అరవింద్ కృష్ణతో రెండు సినిమాలు చేశాను. మళ్లీ అతనితో కలిసి చేయడం హ్యాపీ. ఈ సినిమాలో డాక్టర్ క్యారెక్టర్ చేశారు. అలీ రెజాని బిగ్బాస్ తర్వాత కలిశాను. చాలా మంచి నటుడు. వీరిద్దరితో పాటు ప్రతాప్ పోతన్ గారు ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేయడం జరిగింది. ఒక రకంగా సూత్రధారి క్యారెక్టర్. ఊర్వశీ రాయ్ హీరోయిన్గా ఇంట్రడ్యూస్ అవుతుంది. ఆమెది లీడింగ్ లేడీ క్యారెక్టర్. సినిమా ఫస్ట్ కాపీ చూశాం. చాలా బాగా వచ్చింది. మా టీమ్ అందరికీ నచ్చింది. ఆడియన్స్ కి కూడా తప్పకుండా నచ్చుతుందని నమ్ముతున్నాను. దాదాపు 40 ఏళ్ల తర్వాత బ్లాక్ అండ్ వైట్లో వస్తున్న చిత్రమిది. దానికోసం అన్ని అంశాలను రీసెర్చ్ చేయడం జరిగింది’ అన్నారు. ఈ సినిమాలో ప్రతాప్ పోతన్, అరవింద్ కృష్ణ, అలీ రెజా, ఊర్వశీరాయ్, రాజ్ మదిరాజు, షాని సాల్మోన్, నజియా, సిద్ధార్థ్ తదితరులు నటిస్తున్నారు. -
యాంకర్ రవి సహా బిగ్బాస్లో మోస్ట్ షాకింగ్ ఎలిమినేషన్స్ ఇవే..
Bigg Boss Telugu shocking Eliminations: బిగ్బాస్ హౌస్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టమే. అయితే ఈ సీజన్లో ఇప్పటివరకు జరిగిన ఎలిమినేషన్స్లో మోస్ట్ షాకింగ్ ఎలిమినేషన్ మాత్రం యాంకర్ రవిదే అని చెప్పొచ్చు. మిగతా కంటెస్టెంట్లతో పోలిస్తే అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా రవి ఎలిమినేట్ కావడం ప్రేక్షకులు ఎవరూ ఊహించలేదు. ఇది మోస్ట్ అన్ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ నెటిజన్లు రవికి సపోర్ట్గా నిలిచారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు జరిగిన బిగ్బాస్ తెలుగు సీజన్స్లతో మోస్ట్ షాకింగ్ ఎలిమినేషన్స్ను ఏంటో ఓసారి చూద్దాం. సీజన్-1 బిగ్బాస్ సీజన్-1లో నటుడు ప్రిన్సీ ఎలిమినేషన్ అందరికీ షాకిచ్చింది. టైటిల్ రేసులో ఉంటాడనుకున్న ప్రిన్సీ ఊహించని విధంగా ఎలిమినేట్ కావడం అప్పట్లో హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. సీజన్-2 బుల్లితెరపై పలు టీవీ షోలతో అలరించే యాంకర్ శ్యామల బిగ్బాస్ హౌస్ నుంచి అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యింది. ముఖ్యంగా లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న శ్యామల అంత త్వరగా ఎలిమేట్ కావడం షాకింగ్గా అనిపించింది. దీంతో ఇది అన్ఫెయిర్ అంటూ ఫ్యాన్స్ బాగా ఓట్లు వేసి రీఎంట్రీతో మరోసారి హౌస్లోకి పంపించారు. సీజన్-3 అప్పటివరకు పెద్దగా గుర్తింపు లేని అలీ రెజా బిగ్బాస్ ఎంట్రీతో పాపులర్ అయ్యాడు. అర్జున్రెడ్డిగా గుర్తింపు పొందిన అలీ టాప్-5లో ఉంటాడని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా షో నుంచి ఎలిమినేట్ అయ్యాడు. సీజన్-4 బిగ్బాస్ సీజన్-4లో యాంకర్ దేవి నాగవల్లి ఎలిమినేషన్ అందరినీ కంటతడి పెట్టించింది. హౌస్లో చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్గా ఉన్న దేవీ మూడో వారమే ఎలిమినేట్ అవ్వడం ప్రేక్షకులను షాకింగ్కి గురిచేసింది. దీంతో అన్ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ అప్పట్లో సోషల్ మీడియాలో దేవికి మద్దతుగా ఎంతోమంది నిలిచిన సంగతి తెలిసిందే. సీజన్-5 బిగ్బాస్ సీజన్-5లో యాంకర్ రవి ఎంట్రీ నుంచే ఆయన టాప్-5అని అంతా భావించారు. సెపరేట్ ఫ్యాన్ బేస్, ఆటతీరుతో వాడే స్ట్రాటజీస్తో మరింత స్ట్రాంగ్ కంటెస్టెంట్గా గుర్తింపు పొందాడు. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ అనూహ్యంగా హౌస్ నుంచి బయటకు వచ్చాడు. ఇప్పటికీ రవి ఎలిమినేషన్ను ఆయన ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు.మోస్ట్ డిసర్వింగ్ కంటెస్టెంట్ను బయటకు పంపించారంటూ ఫైర్ అవుతున్నారు. ఇది మోస్ట్ అన్ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. చదవండి: షణ్నూని ఇష్టపడుతున్నట్లు సిరి నాతో చెప్పింది: యాంకర్ రవి కొత్త ఇంట్లోకి యాంకర్ శ్యామల గృహప్రవేశం.. వీడియో వైరల్ Bigg Boss Telugu 5: అలా అనుకోవడం వల్లే యాంకర్ రవి ఎలిమినేట్ అయ్యాడా? -
తండ్రి అయిన అలీ రెజా, దేవత జన్మించిందంటూ పోస్ట్
Ali Reza- Masuma Wecome Baby Girl: బుల్లితెర నటుడు, మాజీ బిగ్బాస్ కంటెస్టెంట్ అలీ రెజా తండ్రయ్యాడు. ఆయన సతీమణి మసుమ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని నటుడు అలీ ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించాడు. 'అందమైన దేవతకు తండ్రినయ్యానని సగర్వంగా చెప్తున్నాను. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. మమ్మల్ని ఆశీర్వదించిన ప్రతిఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు' అని రాసుకొచ్చాడు. మరో పోస్ట్లో కూతురును ఎద్దుకుని ముద్దాడిన ఫొటోలు షేర్ చేశాడు. కానీ ఆ ఫొటోల్లో పాప ముఖాన్ని మాత్రం చూపించలేదు. ఇక ఈ శుభవార్త తెలిసిన సెలబ్రిటీలు, మాజీ బిగ్బాస్ కంటెస్టెంట్లు, అభిమానులు అలీ రెజాకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా తెలుగు సిరీయల్తో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన అలీ ఇటూ నటుడిగా, అటూ మోడల్గానూ రాణిస్తున్నాడు. ‘గాయకుడు’ సినిమాతో హీరోగా వెండితెరపై అరంగ్రేటం చేసిన అలీ ఆ మధ్య నాగార్జునతో వైల్డ్ డాగ్ అనే సినిమా కూడా చేశాడు. బిగ్బాస్ తెలుగు మూడో సీజన్లో పాల్గొని ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇటీవలే ‘గుండెల్లో దమ్మున్న దోస్త్ ఖాజా భాయ్’అనే మరో సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. View this post on Instagram A post shared by Ali Reza (@i.ali.reza) -
రవి అలాంటి వాడు..విశ్వ పైకి అలా కనిపిస్తాడు కానీ!: అలీ రెజా
Bigg Boss Fame Ali Reza About Anchor Ravi: టెలివిజన్ చరిత్రలోనే అతిపెద్ద రియాలిటీ షో బిగ్బాస్ చాలామందికి ఫేమ్ ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అప్పటివరకు గుర్తింపు కోసం ఎదురుచూస్తున్న వారికి కూడా బిగ్బాస్ షోతో ఓవర్ నైట్ స్టార్డం వస్తుంది. అదే స్థాయిలో కొందరి పాపులారిటీ అమాంతం తగ్గిపోతుంది. షోలో చేసే చిన్న చిన్న తప్పుల వల్ల కొందరు డీఫేమ్తో బయటకు రావడం చూస్తుంటాం. ప్రస్తుతం బిగ్బాస్ తెలుగు సీజన్-5లో అందరి కన్నా ఎక్కువ పాపులారిటీ ఉన్న కంటెస్టెంట్లలో యాంకర్ రవి ఒకరు. అయితే ప్రియ-లహరి ఎపిసోడ్ తర్వాత రవిపై నెగిటివిటి సైతం పెరిగిపోయింది. మొన్నటికి మొన్న శ్వేత సైతం రవికి దూరంగా ఉండాలంటూ హౌస్ మేట్స్ను హెచ్చరించిన సంగతి తెలిసిందే. చేసిన తప్పులు ఒప్పుకోకపోవడం సహా ఇతరులపై నిందలు వేస్తాడంటూ రవిని సోషల్ మీడియాలోనూ నెటిజన్లు ఆడేసుకుంటున్నారు. దీనిపై బిగ్బాస్ మాజీ కంటెస్టెంట్, రవి స్నేహితుడు అలీ రెజా స్పందించాడు. షోకు వెళ్లేముందే ఈ విషయాల గురించి మాట్లాడుకున్నామని, ఇలా అవుతుందని తనకు ముందే తెలుసని అలీ పేర్కొన్నాడు. ఎవరితోనైనా గొడవలు వస్తే అది పరిష్కరించుకోవాలని రవి భావిస్తాడని, అయితే కొందరు అపార్థం చేసుకుంటున్నారన్నాడు. రవి తనకు వ్యక్తిగతంలో తెలుసని, కాబట్టి షో చూసి జడ్జ్ చేయనని రవికి కితాబిచ్చాడు. ఇక మరో కంటెస్టెంట్ విశ్వ పైకి చాలా పహిల్వాన్లా కనిపించినా తను చాలా ఎమోషనల్ పర్సన్ అని, బయట కూడా అతను అలాగే ఉంటాడని చెప్పుకొచ్చాడు. -
టాలీవుడ్లోకి మరో కొత్త నిర్మాణసంస్థ ఎంట్రీ
టాలీవుడ్లోకి మరో కొత్త నిర్మాణసంస్థ ఎంట్రీ ఇచ్చింది. ప్రతాప్ పోతన్, అరవింద్ కృష్ణ, అలీ రెజా, ఊర్వశీరాయ్ ప్రధాన పాత్రల్లో అద్వితీయ మూవీస్ ప్రై.లి పతాకంపై కిరణ్ కల్లాకురి నిర్మాతగా రూపొందుతున్న చిత్రం `గ్రే`. ద స్పై హూ లవ్డ్ మి అనేది ఉపశీర్షిక. స్పై థ్రిల్లర్గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి రాజ్మదిరాజు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ పూజా కార్యక్రమం ఈ సినిమా హైదరాబాద్లోని ప్రసాద్ల్యాబ్లో ఘనంగా ప్రారంభమైంది. మూహుర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు వీఎన్. ఆదిత్య క్లాప్ ఇవ్వగా, ప్రసాద్ గ్రూప్స్ అధినేత రమేష్ ప్రసాద్ కెమెరా స్విఛ్చాన్ చేశారు. ప్రముఖ రచయిత లక్ష్మీ భూపాల్ స్క్రిప్ట్ను అందజేశారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వివేక్ కూచిబొట్ల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దర్శకుడు రాజ్ మాదిరాజు మాట్లాడుతూ `గ్రే అనేది ఒక నెగటివ్ షేడ్ అనే కాదు. ఓ రిలేషన్ షిప్. ఓ రెవల్యూషన్. గ్రే మనలైఫ్లో ఉంది. మనం వెనక్కి తిరిగి చూసుకుంటే మన నీడే ఒక గ్రే. ఇదొక స్పై మూవీ. థ్రిల్లర్. నమ్మలేని అంశాలు ఉంటాయి.ఈ నెల 22 నుంచి షూటింగ్ స్టార్ట్ అవుతుంది. డిసెంబరు కల్లా అన్నీ కార్యక్రమాలను పూర్తి సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నాం`అన్నారు. `రాజ్ ముదిరాజ్ మంచి ప్రతిభావంతుడు. గ్రే సినిమాకు మంచి క్యాస్టింగ్ కుదిరింది. ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను`అన్నారు ప్రసాద్ గ్రూప్స్ అధినేత రమేష్ ప్రసాద్. నిర్మాత కిరణ్ కల్లాకురి మాట్లాడుతూ..`ఈ సినిమా కోసం రాజు, రమేష్చదలవాడ చాలా కష్టపడ్డారు. సినిమాకు డబ్బులు పెట్టడం సులువే. కానీ మంచి అవుట్పుట్ ఇవ్వడం కష్టం. గ్రే మంచి సినిమా అవుతుందని నమ్ము తున్నాను. థ్రిల్లర్ సినిమాలు పెద్దగా తెలుగులో రాలేదు. గ్రే మంచి థ్రిల్లర్ మూవీ`అన్నారు. -
వైభవంగా అలీ రెజా సతీమణి సీమంతం వేడుక
బుల్లితెర నటుడు అలీ రెజా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బిగ్బాస్ తెలుగు మూడో సీజన్లో పాల్గొన్న అలీ ఫిజికల్ టాస్కుల్లో మిగతావారికి గట్టిపోటీనిస్తూ తనేంటో నిరూపించుకున్నాడు. బిగ్బాస్ ద్వారా వచ్చిన క్రేజ్తో ఏకంగా నాగార్జునతో కలిసి 'వైల్డ్డాగ్' సినిమాలోనూ నటించాడు. కాగా ఈ బిగ్బాస్ మాజీ కంటెస్టెంట్ త్వరలో తండ్రి కాబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అలీ భార్య మసుమ్ సీమంతం వేడుక నిర్వహించారు. ఈ వేడుకకు బుల్లితెర సెలబ్రిటీలు హిమజ, శివజ్యోతి, లాస్య, రవి, శ్రీవాణి తదితరులు హాజరై సందడి చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అలీ భార్య సీమంతానికి సంబంధించిన ఫొటోలు వైరల్గా మారాయి. వీటిని చూసిన నెటిజన్లు అలీ దంపతులను క్యూట్ కపుల్గా అభివర్ణిస్తున్నారు. కాగా సావిత్రి సిరీయల్తో బుల్లితెర ఎంట్రీ ఇచ్చిన అలీ ఇటూ నటుడిగా, అటూ మోడల్గానూ రాణిస్తున్నాడు. అంతేగాక ‘గాయకుడు’ సినిమాతో హీరోగా వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన ఇతడు ఇటీవల ‘గుండెల్లో దమ్మున్న దోస్త్ ఖాజా భాయ్’ అనే మరో సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం విదితమే! -
దుమ్మురేపుతున్న రాహుల్ సిప్లిగంజ్ ‘చిచ్చాస్ కా గణేశ్’ పాట
సాక్షి, వెబ్డెస్క్: వినాయక చవితి సందర్భంగా పలు సంస్థలు, గాయకులు కొత్త పాటలు విడుదల చేశారు. తాజాగా ‘బుల్లెట్టు బండి’ పాట రచయిత లక్ష్మణ్ రాసిన పాటకు ప్రముఖ గాయని మంగ్లీ పాడిన అద్భుత సాంగ్ విడుదలైంది. మధుప్రియ కూడా ఓ పాట రూపొందించి విడుదల చేసింది. ఇక తాజాగా ‘బిగ్ బాస్ 3’ విజేతగా నిలిచిన ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ గణేశ్ నవరాత్రుల సందర్భంగా ఓ జబర్దస్త్ పాటతో వచ్చాడు. వేంగి సుధాకర్ హైదరాబాదీ భాషలో రాసిన ‘చిచ్చాస్ కా గణేశ్’ పాటకు రాహుల్ దుమ్ములేపేలా పాడాడు. నిఖిల్, హరిణ్య రెడ్డి కోటంరెడ్డి సమర్పించిన ఆ పాట గణపతి మండపాల్లో మార్మోగుతోంది. చదవండి: భిక్షమెత్తుకుంటున్న మాజీ ముఖ్యమంత్రి మరదలు అయితే ఈ పాటలో రాహుల్కు బిగ్బాస్లో దోస్తీ అయిన అలీ రెజా ప్రత్యక్షమయ్యాడు. ఇద్దరూ కలిసి ధూమ్ధామ్గా డ్యాన్స్ చేశారు. శిరీశ్ కుమార్ కొరియోగ్రఫీ చేశారు. ఒక సినిమా పాట తెరకెక్కించినట్లు పాటను ఉన్నతంగా తీర్చిదిద్దారు. భారీ సెట్ వేసినట్లు తెలుస్తోంది. గతంలో రాహుల్ విడుదల చేసిన ‘గల్లీకా గణేశ్’ పాట మాదిరి ఈ పాట కూడా దూసుకుపోతుంది. ఇప్పటికే ఒక మిలియన్ వ్యూస్ సంపాదించుకుంది. -
తండ్రి కాబోతున్న బిగ్బాస్ మాజీ కంటెస్టెంట్
అలీ రెజా.. బుల్లితెర ప్రేక్షకులకు ఈ పేరు బాగా సుపరిచితం. బిగ్బాస్ తెలుగు మూడో సీజన్లో పాల్గొని వీక్షకులను ఎంతగానో ఎంటర్టైన్ చేసినవారిలో అలీ ఒకరు. ఫిజికల్ టాస్కుల్లో గట్టిపోటీనిస్తూ ఇతర కంటెస్టెంట్లకు చెమటలు పట్టించిన అలీ ఒకానొక సమయంలో షో నుంచి ఎలిమినేట్ అయినప్పటికీ తిరిగి వైల్డ్కార్డ్ ద్వారా హౌస్లో రీఎంట్రీ ఇచ్చాడు. ఇదిలా ఉండగా త్వరలోనే ఈ బిగ్బాస్ మాజీ కంటెస్టెంట్ తండ్రి కాబోతున్నాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. చదవండి: సీక్రెట్గా పెళ్లి చేసుకున్న ప్రముఖ లేడీ కమెడియన్ భార్యతో కలిసి ఓ వీడియో చేసి తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. ఇందులో అలీ భార్య బేబీ బంప్తో దర్శనం ఇచ్చారు. ఇది చూసిన అతడి సన్నిహితులు, నటీనటులు, అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా సావిత్రి సిరీయల్తో బుల్లితెర ఎంట్రీ ఇచ్చిన అలీ ఇటూ నటుడిగా, అటూ మోడల్గా రాణిస్తున్నాడు. అంతేగాక ‘గాయకుడు’ సినిమాతో హీరోగా వెండితెర ఎంట్రీ ఇచ్చిన అలీ ఇటీవల ‘గుండెల్లో దమ్మున్న దోస్త్ ఖాజా భాయ్’ అనే మరో మూవీలో చేస్తున్నట్లు ప్రకటించాడు. View this post on Instagram A post shared by Ali Reza (@i.ali.reza) -
సోషల్ హల్చల్ : అనన్య ఆట.. అలీరెజా తిప్పలు
మల్లెశం మెమోరీస్ అంటూ.. గచ్చకాయలు ఆడుతున్న వీడియోని పంచుకుంది హీరోయిన్ అనన్య నాగళ్ల అప్పుడప్పుడు గిల్లు కోవడం అంటూ.. బుల్లితెర నటి, యాంకర్ సమీర చిందులేస్తుంది చాటుగా స్నాక్స్ తినేసిన అలీ రేజా.. అవే స్నాక్స్ను తన భార్య తీసుకెళ్లి కుక్కపిల్లకు పెట్టడంతో కక్కలేక మింగలేక అవస్థపడ్డాడు బ్యాడ్ సెల్ఫీ అంటూ సిమ్రాత్ కౌర్ ఓ ఫోటోని అభిమానులతో పంచుకుంది. తుమ్మడం కరోనా లక్షణం అని కుక్క పిల్లకు కూడా తెలిపోనట్లుందంటూ ఓ ఫన్నీ వీడియోని షేర్ చేసింది బిగ్బాస్ ఫేమ్ హిమజ View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) View this post on Instagram A post shared by Sonal Chauhan (@sonalchauhan) View this post on Instagram A post shared by Ameesha Patel (@ameeshapatel9) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Ananya Nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Ali Reza (@i.ali.reza) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) \ View this post on Instagram A post shared by Sameera Sherief (@sameerasherief) View this post on Instagram A post shared by Himaja💫 (@itshimaja) View this post on Instagram A post shared by Simrat Kaur Randhawa (@simratkaur_16) View this post on Instagram A post shared by Lavanya T (@itsmelavanya) View this post on Instagram A post shared by syamala Anchor (@syamalaofficial) View this post on Instagram A post shared by Sesh Adivi (@adivisesh) -
Ali Reza: 'గుండెల్లో దమ్ము' సినిమాతో రచ్చ..
అలీ రెజా.. బుల్లితెర ప్రేక్షకులకు ఈ పేరు బాగా సుపరిచితం. బిగ్బాస్ తెలుగు మూడో సీజన్లో పాల్గొని వీక్షకులను ఎంతగానో ఎంటర్టైన్ చేసినవారిలో అలీ ఒకరు. ఫిజికల్ టాస్కుల్లో గట్టిపోటీనిస్తూ ఇతర కంటెస్టెంట్లకు చెమటలు పట్టించిన అలీ ఒకానొక సమయంలో షో నుంచి ఎలిమినేట్ అయినప్పటికీ తిరిగి వైల్డ్కార్డ్ ద్వారా హౌస్లో రీఎంట్రీ ఇచ్చాడు. తన కోపం తన పతనానికి కారణమవుతుందని తెలుసుకున్న అలీ దాన్ని అదుపులో పెట్టుకుంటూ ఫినాలేకు చేరుకున్నాడు. టాప్ 5లో చోటు దక్కించుకున్న అలీ ట్రోఫీ గెలవలేకపోయినప్పటికీ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. నిన్న(మే 24న) అలీ రెజా బర్త్డే. ఈ సందర్భంగా అతడు తన కొత్త సినిమాను ప్రకటించాడు. 'గుండెల్లో దమ్మున్న దోస్త్ ఖాజా భాయ్' అంటూ G.D (G ఫర్ గుండె, D ఫర్ దమ్ము) సినిమా పోస్టర్ను రిలీజ్ చేశాడు. ఈడు ఎవని అయ్యకి వినడు, దోస్తులకు తప్ప అని రాసుకొచ్చాడు. అయితే తన ప్రయాణంలో ఏం జరగబోతుందనేది ఖాజా భాయ్కు కూడా తెలీదు అని పేర్కొన్నాడు. గుండెల్లో దమ్మున్న దోస్తులు అందరికోసం ఈ ఫస్ట్ లుక్ అని తెలిపాడు. పోస్టర్లో అలీ రకరకాల సంఘర్షణకు లోనవుతున్నట్లు కనిపిస్తోంది. సినిమా చేస్తున్నందుకు కంగ్రాట్స్ చెప్తూన్ ఫ్యాన్స్ అలీ రెజాకు బర్త్డే విషెస్ తెలియజేస్తున్నారు. View this post on Instagram A post shared by Ali Reza (@i.ali.reza) చదవండి: అలీ రెజా కొత్త కారు, రవి ఏదో అంటున్నాడే? -
'బిగ్బాస్ తర్వాత అందుకే మాకు ఛాన్సులు రాలేదు'
బిగ్బాస్ షోలో పాల్గొన్న తర్వాత కంటెస్టెంట్లకు అప్పటి వరకు రాని గుర్తింపు వస్తుంది. కొందరికి ఏకంగా ఓవర్ నైట్ స్టార్ ఇమేజ్ కూడా వస్తుంది. అయితే చాలామందికి ఈ క్రేజ్ ఎక్కువకాలం నిలవట్లేదు. షో నుంచి బయటకు రాగానే చేతిలో పెద్దగా ప్రాజెక్టులేమీ లేక ఇబ్బందులు పడిన వాళ్లు కూడా ఎందరో ఉన్నారు. బిగ్బాస్ తర్వాత వచ్చే క్రేజ్ వాళ్ల కెరీర్కు మాత్రం ఉపయోగపడటం లేదు. తాజాగా ఇదే విషయంపై సీజన్-3 ఫైనలిస్ట్ అలీ రెజా స్పందించారు. 'మేం షో నుంచి బయటకు వచ్చాక దాదాపు అందరికి మంచి క్రేజ్ ఏర్పడింది. అయితే మాకు హైప్ ఉన్న ఆ నాలుగు నెలల్లోనే కరోనా వచ్చింది. లాక్డౌన్ మమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టేసింది. దీంతో బయటకు వెళ్లి ఏదైనా చేసుకునే అవకాశం దొరకలేదు. ఆ తర్వాత వెంటనే సీజన్ 4 కూడా వచ్చేసింది' అంటూ చెప్పుకొచ్చాడు అలీ రెజా. బిగ్బాస్ షోలో అర్జున్ రెడ్డిలా గుర్తింపు పొందిన అలా రెజా ఫైనలిస్ట్గా మిగిలాడు. ఆ తర్వాత కొన్ని సీరియల్స్లోనూ కనిపించాడు. రీసెంట్గా నాగార్జున నటించిన వైల్డ్ డాగ్ చిత్రంలోనూ నటించాడు. నిజానికి బిగ్బాస్ సీజన్-3తో పోలిస్తే ఆ తర్వాత పాల్గొన్న కంటెస్టెంట్లు వర్క్ పరంగా బాగా బిజీ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అఖిల్, సోహైల్ తాము చేస్తున్న సినిమాలను ప్రకటించి దూకుడు పెంచారు. ఇక యాంకరింగ్కు బ్రేక్ ఇచ్చిన లాస్య సైతం బిగ్బాస్ తర్వాత బిజీ అయ్యింది. చదవండి : 'షో వల్ల కెరీర్ నాశనమైంది.. అదే నేను చేసిన తప్పు' ‘బిగ్బాస్’ ఆఫర్ రిజెక్ట్ చేశా, డబ్బు కోసం కాదు కానీ.., : ఇంద్రజ -
అలీ రెజా కొత్త కారు, రవి ఏదో అంటున్నాడే?
అలీ రెజా.. బిగ్బాస్ రియాలిటీ షోలో పాల్గొన్న ఇతడు తన యాటిట్యూడ్తో, ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. బిగ్బాస్ మూడో సీజన్లో టాప్ 5 కంటెస్టెంట్లలో ఒకరిగా నిలిచిన అలీ ఈ షో తర్వాత ఏకంగా నాగార్జునతో కలిసి నటించే అవకాశాన్ని సైతం దక్కించుకున్నాడు. అలా యాక్షన్ మూవీ వైల్డ్ డాగ్ సినిమాలోనూ నటించి అభిమానులను మెప్పించాడు. తాజాగా అలీ రెజా ఓ కొత్త కారు కొన్నాడు, మహీంద్రా జిప్సీ ముందు ఫొటోకు పోజివ్వగా దీన్ని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. దీంతో బుల్లితెర స్టార్స్తో పాటు ఫ్యాన్స్ అతడికి శుభాకాంక్షలు చెప్తున్నారు. ఈ క్రమంలో యాంకర్ రవి డిఫరెంట్గా కంగ్రాట్స్ చెప్పాడు,. వాట్ ద .. అంటూ ఎమోజీలు పెట్టాడు. ఇది చూసిన నెటిజన్లు.. ఎమోజీలతో బాగానే కవర్ చేస్తున్నావే అంటూ సెటైర్లు వేస్తున్నారు. View this post on Instagram A post shared by Ali Reza (@i.ali.reza) చదవండి: నాగార్జున ఫ్యాన్స్ను ఏప్రిల్ ఫూల్ చేసిన 'వైల్డ్ డాగ్' యూనిట్ -
రిలీజ్కు ముందే 'వైల్డ్ డాగ్' ఫుల్ మూవీ లీక్!
అక్కినేని నాగార్జున పవర్ఫుల్ పోలీసాఫీసర్గా నటిస్తున్న చిత్రం "వైల్డ్ డాగ్". వాస్తవ సంఘటనలతో తెరకెక్కిన ఈ సినిమాలో దర్శకుడు సహా అందరూ కొత్తవాళ్లే. దీంతో ఈ సినిమాను ప్రేక్షకుల దగ్గరకు తీసుకువెళ్లేందుకు నాగ్ బాగా కష్టపడుతున్నాడు. మిగతా సినిమాల కంటే భిన్నంగా ప్రమోట్ చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ కూడా ప్రమోషన్లు బాగానే చేస్తోంది. అందులో భాగంగా సినిమా లీక్ అయిందంటూ ప్రచారం మొదలుపెట్టింది. ఎవరో తమ యూట్యూబ్ ఛానల్ను హ్యాక్ చేసి, వైల్డ్ డాగ్ ఫుల్ మూవీని అప్లోడ్ చేశారని ట్వీట్ చేసింది. Someone has taken over our Youtube Channel & Uploaded the Full Movie! Please avoid watching & Catch #Wildog in theatres from tomorrow. Book your tickets now - https://t.co/jD6B8c7z2s#WildDogOnApril2nd - https://t.co/g3gGvSNrHn — Matinee Entertainment (@MatineeEnt) April 1, 2021 ఇంకేముందీ.. రిలీజవకముందే సినిమా ఎలా అప్లోడ్ చేస్తారు? అని తల గోక్కుంటూనే అక్కడి యూట్యూబ్ లింకును క్లిక్ చేస్తున్నారు జనాలు. తీరా లింక్ ఓపెన్ అవగానే అలీ రెజా, సయామీ ఖేర్ ప్రత్యక్షమై "పైరసీ ఆపండి. వైల్డ్డాగ్ థియేటర్లోనే చూడండి" అని సెలవిచ్చారు. అలా నాగార్జున ఫ్యాన్స్ను ఏప్రిల్ ఫూల్ చేశారు. దీంతో దిమ్మతిరిగిన నెటిజన్లు 'ఇది కనీవినీ ఎరగని ఏప్రిల్ ఫూల్', 'దగా మోసం, అరాచకం..' అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం 'అబ్బో ఇంటర్వెల్లో సీన్ ఉంటుంది మాస్టారూ.. మాటల్లేవ్ చెప్పడానికి..', 'సెకండాఫ్లో, క్లైమాక్స్లో సన్నివేశాలు అదుర్స్ అంతే..' అంటూ ఫన్నీగా కౌంటర్లు వేస్తున్నారు. కాగా ఈ చిత్రం శుక్రవారం (ఏప్రిల్ 2న) రిలీజ్ అవుతోంది. చదవండి: నా సగం కల పూర్తయింది.. ఇంకో సగం మిగిలి ఉంది నాగ్ సార్ బిర్యాని తెస్తే.. ఓ పట్టుపట్టా: హీరోయిన్ -
పీఆర్ టీమ్ పెట్టుకుంటే సోహైల్ కథ వేరే ఉండేది
బిగ్బాస్ ఫైనలిస్టు హారిక చెప్పినట్లుగా పోరాటం ముగిసింది. అటు కంటెస్టెంట్లతో పాటు, వారిని గెలిపించేందుకు విశ్వప్రయత్నాలు చేసిన అభిమానుల పోరాటం ముగిసింది. దీని ఫలితం మాత్రం తేలాల్సి ఉంది. ఈసారి గత సీజన్ల కంటే భారీ స్థాయిలో ఓట్లు పడినట్లు తెలుస్తోంది. మరోపక్క నెట్టింట్లో అభిజితే విన్నర్ అన్న పేరు వినిపిస్తోంది. కానీ అది బిగ్బాస్ షో. అంచనాలు తారుమారు చేసేందుకు బిగ్బాస్కు ఓ క్షణం పట్టదు. గెలుపోటముల లెక్క రేపు నాగార్జున చూసుకుంటారు. కాబట్టి ఈ విషయాన్ని కాస్త పక్కన పెడితే మాజీ కంటెస్టెంటు అలీ రెజా కాబోయే విజేత ఎవరనేది చెప్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ట్రోఫీ కన్నా అదే ముఖ్యం "సోహైల్ నాకు 8 ఏళ్లుగా తెలుసు. అతడు నా తమ్ముడు లాంటి వాడు. తనేంటో ప్రూవ్ చేసుకుంటేనే సపోర్ట్ చేస్తానని ముందే చెప్పాను. రెండు మూడు వారాల్లోనే అతడేంటో నిరూపించుకున్నాడు. అప్పుడే అనుకున్నా, వీడు కచ్చితంగా టాప్ 5లో ఉంటాడని! కొందరు అతడు ముస్లిం కాబట్టి సపోర్ట్ చేస్తున్నా అంటున్నారు. అది పూర్తిగా అబద్ధం. ఇలా మతాలను అడ్డు పెట్టుకుని నేను ఏ పనీ చేయను. అతడికే కాదు, గతంలోనూ ఎవరికీ మతపరంగా పక్షపాతం చూపించలేదు. సోహైల్ జెన్యూన్, చిన్న పిల్లాడి మనస్తత్వం. అవి చూశాకే మూడో వారం నుంచి అతడికి సపోర్ట్ చేయడం ప్రారంభించాను. అతడు షోకి వెళ్లేముందు కొన్ని సలహాలు ఇచ్చాను. ట్రోఫీ అందుకోవడం కన్నా ప్రత్యేకతను చాటుకోవడం ముఖ్యమని చెప్పాను. ఎలాంటి పరిస్థితిలోనైనా నువ్వు నీలాగే ఉండమని సూచించాను. అతడు అలాగే ఉన్నాడు కూడా! అందుకే ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ముఖ్యంగా నామినేషన్లంటే భయపడొద్దన్నాను. ఎందుకంటే డేంజర్ జోన్లో ఉంటేనే ప్రేక్షకులకు మనకు ఓట్లు వేసే అలవాటు పెరుగుతుంది" అని చెప్పుకొచ్చాడు. (చదవండి: ఆ ఒక్కరికే రాహుల్ సిప్లిగంజ్సపోర్ట్!) అభిజిత్ వల్ల కాదు "కోపాన్ని జయించి తనను తాను ఎంతగానో మార్చుకున్న సోహైల్ ట్రోఫీ గెలిచేందుకు అన్ని విధాలా అర్హుడు. ఈసారి అమ్మాయి గెలిచేందుకు జీరో ఛాన్స్ ఉంది. సోషల్ మీడియా ప్రకారం అభిజిత్, సోహైల్ మధ్య గట్టి పోటీ ఉంది. కానీ సోహైల్ కూడా మంచి పీఆర్ టీమ్ను పెట్టుకుంటే ఫలితం మరోలా ఉండేది. అయితే అతడి కుటుంబానికి పీఆర్ టీమ్ పెట్టుకునేంత ఆర్థిక స్థోమత లేదు. కానీ ఇప్పటికీ సోహైల్ గెలిచేందుకు అవకాశాలున్నాయి. సోహైల్ వల్లే ఈ సీజన్ ముందుకు నడిచింది తప్ప అభిజిత్ వల్ల కాదు అని స్పష్టం చేశాడు. ఏదేమైనా తన దృష్టిలో సోహైల్ ఇప్పటికే గెలిచేశాడని అలీ రెజా పేర్కొన్నాడు. (చదవండి: బిగ్బాస్ గిఫ్ట్: బంగారం కొన్న గంగవ్వ) -
బిగ్బాస్ రూల్స్ బ్రేక్ చేయండి: శ్రీముఖి సలహా
తెలుగు బిగ్బాస్ హిందీ బిగ్బాస్ను ఫాలో అయినట్లు కనిపించింది. మాజీ కంటెస్టెంట్లను తీసుకువచ్చి ఎంటర్టైన్మెంట్ ప్లాన్ చేశారు. మొదటి సీజన్ ఫైనలిస్ట్ హరితేజ, రెండో సీజన్ రన్నరప్ గీతా మాధురి, మూడో సీజన్ రన్నరప్ శ్రీముఖితో పాటు సీజన్ 3 కంటెస్టెంట్ అలీ రెజాలకు రెట్టించిన ఉత్సాహంతో షోను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను అప్పగించారు. కానీ కోవిడ్ వల్ల నేరుగా హౌస్లోకి వెళ్లకుండా ప్రత్యేక గదిలో నుంచే ఫైనలిస్టులతో సంభాషించారు. మరి 101వ ఎపిసోడ్లో ఈ మాజీ ఫైనలిస్టులు ఇప్పుడున్న కంటెస్టెంట్లను ఏమేం ప్రశ్నలడిగారు? వారిని ఎలా ఆడుకున్నారనేది తెలియాలంటే ఈ స్టోరీని చదివేయండి.. టాటూలు నిజమైనవా? గ్రాఫిక్సా? గత సీజన్ల ఫైనలిస్టులు హరితేజ, గీతా మాధురి, శ్రీముఖి, అలీ రెజా ఇంటిసభ్యులను సర్ప్రైజ్ చేశారు. అప్పట్లో తాము దంచుతూ కష్టాలు పడుతుంటే మీరేమో మిక్సీలు వాడుతున్నారా? అని ఈ సీజన్ కంటెస్టెంట్ల మీద అక్కసు వెళ్లగక్కారు. తమ టాటూలు నిజమైనవా? గ్రాఫిక్సా? అని అడుగుతున్నారని, బయట ఇలాంటి టాస్కులు ఉంటాయనుకోలేదని శ్రీముఖి వాపోయింది. తర్వాత ప్రేక్షకుల తరపున ప్రశ్నలు అడుగుతూ వారికి సరదాను పంచేందుకు సిద్ధమయ్యారు. ఇంకొన్ని రోజులైతే ఆరిపోయేట్టు ఉన్నావు, కాస్త తినమని శ్రీముఖి అరియానాకు సలహా ఇచ్చింది. (చదవండి: ఏడవకుండా నవ్వుతూ మోనాల్ వీడ్కోలు) మోనాల్ లేకపోవడంతో ఊపిరాడలేదు నీకు ఎలాంటి అమ్మాయి కావాలన్న ప్రశ్నకు సోహైల్ తన కోపాన్ని కూల్ చేయగలగాలి అని చెప్పాడు. ఇది జరగని పని అని హరితేజ కుండ బద్ధలు కొట్టింది. మోనాల్ వెళ్లాక సైలెంట్ అయ్యావేంటని అఖిల్ను కూపీ లాగేందుకు ప్రయత్నించగా సోహైల్ మధ్యలో లేచి అంత లేదంటూ, ఇక్కడ ఇద్దరికి సోపులేస్తున్నాడని పంచ్ వేశాడు. అయితే మోనాల్ వెళ్లిపోయాక కాసేపటివరకు ఊపిరి ఆడలేదని అఖిల్ చెప్పుకొచ్చాడు. తర్వాత సీనియర్లు అరియానాను లౌడ్ స్పీకర్గా అభివర్ణిస్తూ ఇమిటేట్ చేయడంతో ఇంటి సభ్యులు పడీపడీ నవ్వారు. అయితే కొన్నిసార్లు ఆమె లీడ్ తీసుకుని మాట్లాడటాన్ని శ్రీముఖి మెచ్చుకుంది. దీనిపై అరియానా స్పందిస్తూ.. గత సీజన్లో శ్రీముఖికే సపోర్ట్ చేశాను, ఆమె ఆడిన విధానం నచ్చిందంటూ చెప్పుకొచ్చింది. హౌస్ అంతా రివర్స్ అయినప్పుడు కూడా పాజిటివ్గా మాట్లాడటం గ్రేట్ అని హరితేజ సైతం మెచ్చుకుంది. (చదవండి: హౌస్లో శివగామి ఎవరో చెప్పిన అభిజిత్) అమ్మాయిల కోసం పాట పాడిన అభి కావాలని తప్పులు చేయండి, ఎందుకంటే వారంలో బిగ్బాస్ గొంతు మిస్సవుతారు అని సీనియర్లు ఉచిత సలహా ఇచ్చారు. తర్వాత అందరితో డ్యాన్స్ చేయించారు. గర్ల్ ఫ్యాన్స్ కోసం అభిజిత్తో పాట పాడించారు. అయితే లిరిక్స్ రాకపోయినా 'నీ ఎదలో నాకు చోటే వద్దు.. అంటూ బాగానే పాడాడు. తర్వాత అలీ రెజా మాట్లాడుతూ..నన్ను అర్జున్రెడ్డి అనేవారు, కానీ నువ్వు నన్ను మించిపోయావని, గొడవయ్యాక నువ్వే వెళ్లి కలిసిపోవడం బాగుందని సోహైల్ను మెచ్చుకున్నాడు. ఇలా కోప్పడే ఒకరు ట్రోఫీ తీసుకెళ్లారు తన కోపం కారణం లేకుండా రాదని, ఎంత కోప్పడినా మళ్లీ మనవాళ్లే అని దగ్గరకు తీసుకుంటా అని సోహైల్ చెప్పగా ఇలా కోప్పడే ఒకరు బిగ్బాస్ 1 ట్రోఫీని పట్టుకెళ్లారని హరితేజ శివబాలాజీని గుర్తు చేసింది. తర్వాత మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ అఖిల్ మీద ప్రశ్నల వర్షం కురిపించారు. టాస్కుల్లో మామూలు స్పీడు లేదని గీతా మాధురి మెచ్చుకుంది. నవ్వితే బాగుంటావు, కానీ ఎప్పుడూ సీరియస్గా ముఖం పెడతావేంటని శ్రీముఖి నిలదీయడంతో అలాంటిదేమీ లేదని అఖిల్ తెలిపాడు. పులిహోర మాత్రం మామూలుగా కలపడం లేదని గీతా, హరితేజ సెటైర్లు వేశారు. (చదవండి: ఆ సెంటిమెంట్ కలిసొస్తే అభిజితే విన్నర్?) ఉన్న టైమ్ను ఎంజాయ్ చేయండి చివర్లో మాకు సలహాలు ఇవ్వండని జూనియర్లు సీనియర్లను కోరారు. మొదట హరితేజ మాట్లాడుతూ... ఇక్కడిదాకా వచ్చాక మార్చుకోవాల్సినవేమీ ఉండవని చెప్పింది. ఉన్న సమయాన్ని ఎంజాయ్ చేయమని సూచించింది. గీతా మాధురి కూడా ఎంజాయ్ చేయమని చెప్తూనే చివర్లో ఎవరినీ బాధపెట్టే డైలాగులు మాట్లాడకండని సలహా ఇచ్చింది. శ్రీముఖి మాట్లాడుతూ.. 'గత సీజన్లో నేను సెట్లో ప్రతి మూలమూలకు వెళ్లాను. ఎందుకంటే తర్వాత ఆ సెట్ తీసేస్తారు. కాబట్టి మీరు కూడా హౌస్లో చిల్ అవ్వండి. రూల్స్ బ్రేక్ చేసి బిగ్బాస్తో తిట్టించుకోండి. ఎందుకంటే మళ్లీ ఆ వాయిస్ వినలేరు' అని చెప్పింది. హౌస్లో ఎంత నెగెటివిటీ వస్తుందో అంత పాజిటివిటీ వస్తుందని అలీ ధైర్యం చెప్పాడు. మా అమ్మాయి బిగ్బాస్ చూస్తూనే అన్నం తింటుది, వారం తర్వాత పరిస్థితి ఏంటో అని గీతామాధురి తల పట్టుకోగా తాము ఇంటికొచ్చి తినిపిస్తాం అని ఫైనలిస్టులు ముందుకొచ్చారు. అనంతరం మాజీలు టాప్ 5 కంటెస్టెంట్లకు ఆల్ ద బెస్ట్ చెప్తూ వీడ్కోలు పలికారు. (చదవండి: బిగ్బాస్: టైటిల్ గెలిచే అర్హత హారిక, అరియానాకు లేదు!) -
హిందీ బిగ్బాస్ విన్నర్తో అలీ రెజా
బిగ్బాస్ రియాలిటీ షో ముగిశాక కంటెస్టెంట్లు ఎవరి దారి వాళ్లు చూసుకుంటారు. అప్పటివరకు ఒకరిని విడిచి ఒకరం ఉండలేమన్నట్లుగా కనిపించే వాళ్లు బయటకు వచ్చాక మాత్రం పలకరింపులు కూడా తగ్గించేసేవాళ్లుంటారు. అయితే నాగార్జున మాత్రం కంటెస్టెంట్లను అంత ఈజీగా మర్చిపోరు. అలాగే నాగ్ కంట్లో పడటమూ అంత సులువేమీ కాదు. గత సీజన్లో కండల వీరుడు అలీ రెజా స్టైల్ నచ్చుతుందని అని నాగార్జున పొగిడేవారు. అయితే ఓసారి వీకెండ్లో నాగ్ ధరించిన బ్రాండెడ్ షూ చాలా నచ్చిందరి, అది తనకు కావాలని అలీ మనసులోని కోరికను బయటపెట్టాడు. అతని కోరికను తప్పకుండా నెరవేరుస్తానన్న నాగ్ ఆ మాట మీద నిలబడ్డారు. షో పూర్తైన నెల రోజుల తర్వాత కూడా ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని మరీ అలీకి బ్రాండెడ్ షూను నాగ్ గిఫ్ట్గా ఇచ్చాడు. (చదవండి: తెలుగు బిగ్బాస్లో ఆవేశం స్టార్లు ఎవరో తెలుసా?) అటు అలీ కూడా నాగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న వైల్డ్ డాగ్ సినిమాలో నటించే బంపరాఫర్ కొట్టేశాడు. ఈ క్రమంలో నాగ్తో కలిసి మనాలీలో షూటింగ్ జరుపుకుంటున్న ఫొటోలను కూడా ఆయన అభిమానులతో పంచుకున్నాడు. ఇదిలా వుంటే తాజాగా అలీ షేర్ చేసిన ఫొటో అభిమానులను ఆశ్చర్యంతో ముంచెత్తుతోంది. అతను హిందీ బిగ్బాస్ 13 విన్నర్ సిద్ధార్థ్ శుక్లాతో పాటు షెహనాజ్ గిల్ను కలిశాడు. మంగళవారం నాడు చంఢీగఢ్ విమానాశ్రయమంలో వారిని కలుసుకోవడమే కాక ఓ సెల్ఫీ దిగి ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. 'తెలుగు బిగ్బాస్ హిందీ బిగ్బాస్ను కలిసిన వేళ..' అని ఓ క్యాప్షన్ కూడా పెట్టాడు. 'ముగ్గురు ఫేవరెట్ కంటెస్టెంట్లు ఒకే చోట కనిపిస్తే ఆ కిక్కే వేరప్పా' అని ఓ నెటిజన్ సంతోషం వ్యక్తం చేయగా 'భలే ఛాన్సు కొట్టేశారు' అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. కాగా అలీ ఈ మధ్యే కొత్త యూట్యూబ్ ఛానల్ను కూడా ప్రారంభించాడు. (చదవండి: కాబోయే కోడలికే ఆ డైమండ్: శిల్పా శెట్టి) View this post on Instagram Yeh dekho kaun mile kal . BB Telugu meets BB Hindi. #SidNaaz A post shared by Ali Reza (@i.ali.reza) on Nov 10, 2020 at 8:00pm PST -
తెలుగు బిగ్బాస్లో ఆవేశం స్టార్లు ఎవరో తెలుసా?
ఉగాది పచ్చడిలో అయినా షడ్రుచులు కాస్త అటూఇటుగా ఉంటాయోమో కానీ బిగ్బాస్ షోలో మాత్రం అన్ని రసాలు పండించే కంటెస్టెంట్లను లోనికి పంపిస్తారు. ఆవేశం స్టార్లను, అతి సహనపరులను, నవ్వించేవాళ్లను, డ్యాన్స్ చేసేవాళ్లను.. ఇలా ప్రతీది ప్రేక్షకులకు నచ్చేలా, మెచ్చేలా చూసుకుంటారు. ఈ నేపథ్యంలో ప్రతీ సీజన్లో ఓ అర్జున్ రెడ్డి క్యారెక్టర్ అనేది పక్కాగా ఉంటోంది. వీళ్లు చిన్న విషయానికి కూడా చిందులు తొక్కుతుంటారు. మరి మొదటి సీజన్ నుంచి నాల్గవ సీజన్ వరకు ఆ అర్జున్రెడ్డి ఎవరెవరున్నారో ఓ లుక్కేయండి.. ఇస్మార్ట్ సోహైల్ ఇప్పుడు అతడిని కెప్టెన్ సోహైల్ అని పిలుచుకోవాలి. ఈ సీజన్లో ఐదో కెప్టెన్గా అవతరించాడు. మొదట్లో కాస్త సాఫ్ట్గా కనిపించిన సోహైల్ ఉన్నట్టుండి వయొలెంట్గా మారిపోయాడు. గొడవ ప్రారంభమైందంటే చాలు కథ వేరుంటది అంటూ రెచ్చిపోయి మాట్లాడుతుంటాడు. ఈ క్రమంలో అతడికి తెలీకుండానే బూతులు కూడా మాట్లాడేస్తాడు. దీంతో అతడంటేనే ఓ రకమైన భయం వచ్చేసింది కొందరు కంటెస్టెంట్లకు. ఎలిమినేట్ అయిన స్వాతి దీక్షిత్ కూడా సోహైల్ నరాలు కట్ అయిపోయేలా మాట్లాడతాడని చెప్పింది. ఆఖరికి నాగార్జున కూడా చాలా కోపం ఉందని, కాస్త నియంత్రించుకోమని సూచించారు. తమన్నా సింహాద్రి మొట్టమొదటిసారి ఓ ట్రాన్స్జెండర్ను బిగ్బాస్లోకి తీసుకొచ్చారు. మొదట బాగానే ఉన్న ఆమె తన విశ్వరూపం చూపించింది. సహ కంటెస్టెంటు రవికి చుక్కలు చూపించింది. పప్పు అని ఆడుకుంటూ అతడిని ఏడిపించింది. అటు అలీ రెజా, రోహిణితో కూడా కయ్యానికి కాలు దువ్వేది. అలా హౌస్లో ఆమె పేరు చెప్తేనే వణికే పరిస్థితి వచ్చింది. దీంతో ఆమె అరాచకాలకు అడ్డు కట్ట వేయాలని భావించిన ప్రేక్షకులు ఆమెను తొందరగానే హౌస్ నుంచి బయటకు పంపించేశారు. అయితే ఇలా కోపంగా ఉంటూ గొడవలు పెట్టుకుంటూనే తను షోలో ఉన్నానన్న విషయం అందరికీ తెలుస్తుందనే ఈ ట్రిక్ ప్లే చేశానని చెప్పుకొచ్చింది. (చదవండి: అవినాష్, అరియానాల బండారం బయటపడనుందా?) అలీ రెజా టాస్క్ అంటే చాలు.. ఉన్న శక్తినంతా కూడదీసుకుని మరీ టాస్క్లో తన ప్రతాపాన్ని చూపేవాడు. అతని ఆటకు చాలామంది అభిమానులు కూడా ఉన్నారు. కానీ అతని కోపమే అతని పాపులారిటీని, ఓట్లను దెబ్బ తీసింది. వీరావేశంతో ఎదుటివారిపై నోరు జారడంతో ఆయన షో మధ్యలోనే వీడ్కోలు తీసుకోవాల్సి వచ్చింది. కానీ అతడు రీ ఎంట్రీ ఇవ్వాలని నెటిజన్లు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో డిమాండ్ చేయడంతో మళ్లీ బిగ్బాస్ హౌస్లో అడుగు పెట్టాడు. ఈ సారి గేమ్ ప్లాన్ మార్చి ఆడటంతో ఫైనల్ వరకు వెళ్లాడు. తనీష్ అల్లాడి రెండో సీజన్లో పాల్గొన్న హీరో తనీష్ను కోపానికి కేరాప్ అడ్రస్గా చెప్పుకోవచ్చు. కౌశల్, నూతన్ నాయుడుతో తరచూ గొడవలు జరిగేవి. వీటికి హద్దూ అదుపూ ఉండేది కాదు. అయినా సరే, తనీష్కు అభిమాన గణం మెండుగానే ఉండేది. దీనికితోడూ దీప్తి సునయనతో ప్రేమాయణం కూడా బాగానే వర్కవుట్ అయింది. దీంతో టాప్ 3 స్థానంలో నిలబడ్డాడు. ((చదవండి: 'అమ్మో' రాజశేఖర్, మళ్లీ శాపం పెట్టాడు!) తేజస్వి మడివాడ రెండో సీజన్లో తేజస్వి కూడా చీటికి మాటికీ రుసరుసలాడుతుండేది. తనకు ఏదైనా నచ్చకపోతే చాలా ఆ విషయాన్ని చీల్చి చెండాడేది. వివాదం, ఫిజికల్ టాస్క్, బ్రెయిన్ టాస్క్ ఇలా ఏదైనా సరే అందులో తన మార్క్ చూపించేది. ముక్కు మీద కోపం ఉన్న ఈ భామ ఏడో వారంలోనే బ్యాగు సర్దేసుకుని వెళ్లిపోయింది. (చదవండి: అవునా.. అరియానాకు బిగ్బాస్ అంత ఇస్తున్నాడా?) శివబాలాజీ అన్నీ అమర్చిన బిగ్బాసే ఒక్కోసారి కంటెస్టెంట్ల తిక్క కుదిర్చేందుకు కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వడు. అయితే ఇలాంటి సందర్భాల్లో బిగ్బాస్ను అభ్యర్థించాల్సింది పోయి అతడిపైనే ఆవేశపెట్టాడు శివబాలాజీ. మొదటి సీజన్లో పాల్గొన్న శివబాలాజీ ఓ రోజు నీళ్లు సడన్గా రాకపోవడంతో బిగ్బాస్పైనే ఆగ్రహించాడు. కోపంతో పాటు మిగతా ఎమోషన్స్ కూడా ఎక్కువే కావడంతో ఆ ఆగ్రహాన్ని కవర్ చేయగలిగాడు. అలా జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన తొలి సీజన్ విజేతగా నిలిచాడు. -
బిగ్బాస్ కంటెస్టెంట్ కోరిక నెరవేర్చిన నాగార్జున
వెండితెర, బుల్లితెర రెండింటినీ సమంగా బ్యాలెన్స్ చేస్తూ రెండుచోట్ల ప్రేక్షకాదరణను రెట్టింపు చేసుకున్న హీరో కింగ్ నాగార్జున. ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరించిన బిగ్బాస్ 3 రియాలిటీ షో ఈమధ్యే ఘనంగా ముగిసింది. ఇందులో నాగ్ పార్టిసిపెంట్లతో ఓవైపు ప్రేమగా మాట్లాడుతూనే అవసరమైనపుడు మందలించేవాడు కూడా. ఇక బిగ్బాస్తో క్రేజ్ రెట్టింపైన వ్యక్తుల్లో అలీరెజా ఒకరు. అతను బుల్లితెర అర్జున్రెడ్డి అన్న పేరు కూడా సంపాదించుకున్నాడు. ఇక అలీ ఎలిమినేట్ అయినపుడు పార్టిసిపెంట్లతోపాటు ఆయన అభిమానులు కూడా కంటతడి పెట్టారు. దీంతో బిగ్బాస్ యాజమాన్యం అతడిని వైల్డ్ కార్డ్ ఎంట్రీతో తిరిగి ఇంట్లోకి పంపించింది. అలీ బిగ్బాస్ హౌస్లో ఉన్నన్ని రోజులు స్టైలిష్గానే ఉండటానికే ప్రయత్నించాడు. నాగ్ కూడా చాలాసార్లు నీ స్టైల్ నచ్చుతుంది అంటూ పొగిడేవాడు. అయితే వీకెండ్లో ఓసారి నాగ్ ధరించిన బ్రాండెడ్ షూ కావాలని అలీ కోరాడు. దానికి నాగ్ ఓకే చెప్పాడు. ఆ తర్వాత షో ముగిసింది. ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉన్నారు. ఈ సమయంలో నాగ్.. అలీరెజాకు బ్రాండెడ్ షూను గిఫ్ట్ ఇచ్చాడు. షో పూర్తయి నెల రోజులు దాటిపోయినా గుర్తుపెట్టుకుని మరీ తన కోరిక నెరవేర్చడంతో అలీ రెజా ఆనందంలో మునిగి తేలుతున్నాడు. నాగ్కు కృతజ్ఞతలు తెలుపుతూ ఆయనతో కలిసి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు. ఇదిలా ఉండగా బిగ్బాస్ 3 కంటెస్టెంట్లు మరోసారి ఒకేవేదికపై కనిపించనున్నారు. నూతన సంవత్సర వేడుకల కోసం అంతా ఒక చోటికి చేరి నానాహంగామా చేయనున్నారు. -
బిగ్బాస్ గ్రాండ్ ఫినాలె: ఫస్ట్ ఎలిమినేషన్ అతడే!
బిగ్బాస్ సీజన్ 3 తుది అంకానికి చేరుకుంది. మూడో సీజన్ విజేత ఎవరో మరికాసేపట్లో తేలనుంది. మా టీవీలో ప్రస్తుతం బిగ్బాస్ -3 గేమ్ షో గ్రాండ్ ఫినాలె ప్రసారం అవుతోంది. ఈ షోలో భాగంగా గ్రాండ్ ఫినాలె నుంచి ఎలిమినేట్ అయిన తొలి కంటెస్టెంట్గా టీవీ నటుడు అలీ రెజా నిలిచారు. బిగ్బాస్ హౌజ్లోకి అతిథులుగా వెళ్లి సందడి చేసిన మారుతి, హీరోయిన్ రాశీ ఖన్నా ఈ విషయాన్ని రివీల్ చేశారు. టాప్-5లో ఉన్న కంటెస్టెంట్లలో మొదట ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్గా అలీ రెజా పేరును వారు వెల్లడించారు. దీంతో అలీ రెజా హౌజ్ నుంచి బయటకు వచ్చి హోస్ట్ నాగార్జునతో ముచ్చటిస్తూ.. తన అనుభవాలు పంచుకున్నారు. టాప్-5లో ఐదుగురు కంటెస్టెంట్లలో నేడు ముగ్గురు ఎమిలినేట్ అవనుండగా.. ఒకరు విజేతగా, మరొకరు రన్నరప్గా నిలువనున్నారు. 17 మంది కంటెస్టెంట్లతో.. వారానికి ఒక ఎలిమినేషన్ చొప్పున 105 రోజులపాటు సాగిన రియాటీ షో ఈసారి ప్రేక్షకులను గణనీయంగా అలరించిన సంగతి తెలిసిందే. జులై 21న అట్టహాసంగా ప్రారంభమైన బిగ్బాస్ సీజన్ త్రీ తెలుగు ప్రజలకు త్వరగానే చేరువైంది. తొలి రోజు నుంచే ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూ..15 వారాలపాటు ఒకే ఇంట్లో ఉంటూ ఎన్నో ఎమోషన్స్ను తట్టుకుంటూ ఐదుగురు ఇంటి సభ్యులు శ్రీముఖి, రాహుల్ సిప్లింగజ్, వరుణ్ సందేశ్, బాబా భాస్కర్, అలీ రెజా ఫైనల్కు చేరుకున్న సంగతి తెలిసిందే. -
శ్రీముఖి జీవితంలో మధుర క్షణాలు..
బిగ్బాస్ షో తుది ఘట్టానికి చేరుకుంది. 15 మందితో ప్రారంభమైన బిగ్బాస్ షోలో మరో రెండు వైల్డ్ కార్డులు వచ్చి చేరగా ప్రస్తుతం ఇంట్లో అయిదుగురు మాత్రమే మిగిలారు. బిగ్బాస్ వందరోజుల ప్రయాణాన్ని ఇంటి సభ్యులకు కళ్లకు కట్టినట్లు చూపించాడు. ఆటుపోట్లు, ఆటపాటలు, గొడవలు, గిల్లికజ్జాలు అన్నింటితో మిళితమైన జర్నీ వీడియోలు చూశాక ఇంటి సభ్యులు తెలీని ఫీలింగ్లో ఉండిపోయారు. ఇప్పటికే రాహుల్, వరుణ్, బాబా తమ జర్నీ చూసి ఎమోషనల్ అయ్యారు. తాజా ఎపిసోడ్లో శ్రీముఖి, అలీకి బిగ్బాస్ జర్నీ వీడియోను చూపించాడు. దానికన్నా ముందు వారి ఆటతీరును, సంపాదించుకున్న పేరు ప్రతిష్టలను ప్రస్తావించాడు. శ్రీముఖి జీవితంలో మధుర క్షణాలు ‘బిగ్బాస్’ ‘శ్రీముఖి బిగ్బాస్ ఇంట్లో అడుగుపెట్టకముందు తెరపై మాత్రమే చూసి అభిమానులుగా మారారు. కానీ ఈ ప్రయాణం శ్రీముఖిని ప్రతీ ఒక్కరి ఇంట్లో అమ్మాయిగా మార్చింద’ని బిగ్బాస్ తెలిపాడు. ‘ఎప్పుడూ అల్లరిగా ఆడుతూ పాడుతూ ఉండే శ్రీముఖిని ప్రేక్షకులు ఎక్కువగా ప్రేమించార’ని బిగ్బాస్ ప్రశంసించాడు. దీంతో శ్రీముఖి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిపోయింది. జీవితానికి ఇది చాలు అని సంతోషం వ్యక్తం చేసింది. ఎంతో కొంత సాధించానన్న ఫీలింగ్ కలిగిందని ఆనందంతో తేలియాడింది. తన జీవితంలోనే ఇవి మధుర క్షణాలు అని పేర్కొంది. అనంతరం అలీ యాక్టివిటీ ఏరియాలోకి వెళ్లాడు. ఆటలో దూకుడు, ప్రతీ టాస్క్లో చూపించిన శ్రద్ధే అలీని ఇక్కడివరకు తీసుకువచ్చాయని బిగ్బాస్ పేర్కొన్నాడు. యంగ్స్టార్ బిరుదు దక్కించుకున్న అలీ రెజా ‘టాస్క్ల్లో ఉత్సాహం వల్ల కొన్నిసార్లు శిక్ష అనుభవించారు. కానీ ప్రేక్షకులు మాత్రం మిమ్మల్ని అభిమానిస్తూ వచ్చారు. మీరు రెండోసారి ఇంట్లోకి వచ్చినపుడు పరిస్థితులు, మనుషులు అన్నీ మారిపోయాయి’ అని చెప్తూ అలీకి జర్నీ వీడియోను చూపించాడు. అతనికి ‘యంగ్ స్టార్’ అంటూ బిరుదు కూడా ఇచ్చేశాడు. ఎమోషనల్ అయిన అలీ.. రీఎంట్రీ అవకాశాన్నిచ్చిన బిగ్బాస్కు కృతజ్ఞతలు తెలిపాడు. తన జీవితాంతం బిగ్బాస్ జర్నీ గుర్తుండిపోతుందన్నాడు. అనంతరం ఇంటి సభ్యులకు బిగ్బాస్ ఓ టాస్క్ ఇచ్చాడు. బిగ్బాస్ సీజన్తోపాటు ఇంటి గురించి సైతం యాడ్స్ చేయమని ఆదేశించాడు. ఈ టాస్క్లో హౌస్మేట్స్ రెచ్చిపోతూ ప్రేక్షకులను పొట్ట చెక్కలయ్యేలా నవ్వించారు. -
బిగ్బాస్ ఏ ఒక్కరినీ వదలట్లేదు.. చివరిగా
బిగ్బాస్ తెలుగు 3 రియాలిటీ షో వంద రోజులు పూర్తి చేసుకుంది. ఇన్నిరోజులుగా కలిసి ఉన్న ఇంటి సభ్యులు మరో రెండు మూడు రోజుల్లో విడిపోనున్నారు. బిగ్బాస్ షో అనేది వారి జీవితంలో మధురానుభూతుల పేజీగా మిగిలిపోనుంది. అయితే ఇన్ని రోజులు హౌస్లో ఎలా ఉన్నారో, వారేంటో వాళ్లకే చూపించడానికి బిగ్బాస్ రెడీ అయిపోయాడు. ఈ మేరకు ఇప్పటికే వరుణ్, రాహుల్, బాబా భాస్కర్లను ఒక్కొక్కరిగా పిలిచి బిగ్బాస్ ఇంట్లో కొనసాగిన జర్నీ వీడియోను చూపించాడు. అది చూస్తూ హౌస్మేట్స్ ఎమోషనల్ అవడంతోపాటు ఇంతమంచి చాన్స్ ఇచ్చిన బిగ్బాస్కు కృతజ్ఞతలు తెలిపారు. మిగిలిన ఇంటి సభ్యులైన శ్రీముఖి, అలీ రెజాకు నేటి ఎపిసోడ్లో వారి బ్యూటిఫుల్ జర్నీని చూపించనున్నాడు. తాజా ప్రోమోను చూసినట్టయితే జర్నీ వీడియోను చూస్తున్న అలీ, శ్రీముఖిలు కన్నీళ్లు పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. అదే సమయంలో హౌస్లోని జ్ఞాపకాలను చూసి సంతోషంతో మురిసిపోతున్నట్టు తెలుస్తోంది. ఈ విధంగా బిగ్బాస్ ఇంట్లో ఏ ఒక్కరినీ వదలకుండా అందరినీ ఏడిపించేస్తున్నాడు. నేడు కూడా బిగ్బాస్ హౌస్లో ఎమోషన్ బాగానే పండనుందని స్పష్టమవుతోంది. మరి మిగతా హౌస్మేట్స్ జర్నీ చూడాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేవరకు ఆగాల్సిందే! Beautiful journey of #Sreemukhi & #AliReza Tonight!!!#BiggBossTelugu3 Today at 10 PM on @StarMaa pic.twitter.com/AlupHOMdqM — STAR MAA (@StarMaa) October 31, 2019 -
బిగ్బాస్: ఫైనల్కు రాహుల్, అలీకి బిగ్ షాక్
బిగ్బాస్ ప్రవేశపెట్టిన నామినేషన్ ప్రక్రియ ఆద్యంతం ఉత్కంఠకరంగా సాగింది. టికెట్ టు ఫినాలే రేసులో గెలుపు కోసం ఇంటి సభ్యులు రెచ్చిపోయారు. ఇక పూల టాస్క్లో అలీ రెజా, బాబా భాస్కర్ల ఫైట్ సినిమాల్లోని పోరాట ఘట్టాలకు ఏమాత్రం తీసిపోనిదిగా ఉంది. టాస్క్లో భాగంగా.. అలీ బాబాను తోసెస్తూ మట్టి పాత్ర దరిదాపుల్లోకి కూడా రానీకుండా విశ్వప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఇద్దరూ ఒకరిని ఒకరు తోసుకుంటూ బల ప్రదర్శన చూపించారు. దీంతో బిగ్బాస్ హింసకు తావలేదంటూ హెచ్చరికలు జారీ చేశాడు. అయినప్పటికీ వినిపించుకోని అలీ.. బాబాను తలతో గుద్దుతూ కిందపడేశాడు. దీంతో బిగ్బాస్ ఈ టాస్క్ను రద్దు చూస్తూ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. హింసకు పాల్పడ్డ అలీని టికెట్ టు ఫినాలే రేసుకు అనర్హుడిగా ప్రకటించాడు. దీంతో వీరోచితంగా పోరాడిన అలీ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరయింది. అప్పటివరకూ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చిన అలీకి బిగ్ షాక్ తగిలినట్టయింది. చిచా గెలుపు... అనంతరం బెల్ మోగించిన రాహుల్, శ్రీముఖి తలపడ్డారు. వారికిచ్చిన డామినోస్ (కార్డ్స్)లను వరుస క్రమంలో నిలబెట్టాల్సి ఉంటుందని బిగ్బాస్ తెలిపాడు. ఈ టాస్క్లో రాహుల్కు అలీ సహాయం చేయగా శ్రీముఖి ఒంటరి పోరాటం చేసింది. కానీ వీరి ఆటకు గాలి ఆటంకం కలిగించడంతో శ్రీముఖి పెట్టిన కార్డ్స్ అన్నీ పడిపోగా రాహుల్వి మాత్రం నిటారుగా ఉండటంతో అతను గెలిచాడు. ఓటమితో శ్రీముఖి తీవ్ర నిరాశ చెందినట్టు కనిపించింది. అనంతరం బజర్ మోగినపుడు గంట కొట్టిన శ్రీముఖి, శివజ్యోతిలకు క్యూబ్స్తో పిరమిడ్లు నిర్మించాల్సిన టాస్క్ ఇవ్వగా ఇందులో రాములమ్మ విజయం సాధించింది. కాగా అప్పటికే ఆధిక్యంలో ఉన్న రాహుల్ను ఇంటి సభ్యులెవరూ అందుకోలేకపోయారు. నామినేషన్ టాస్క్లో అలీ, వరుణ్ 0, శివజ్యోతి, శ్రీముఖి.. 10, బాబా భాస్కర్.. 20, రాహుల్.. 40 శాతం బ్యాటరీని సాధించారు. అధిక బ్యాటరీతో ముందంజలో ఉన్న రాహుల్ నామినేషన్ నుంచి సేఫ్ అవడంతోపాటు ‘టికెట్ టు ఫినాలే’ గెలుచుకున్నాడు. మిగిలిన అయిదుగురు ఇంటి సభ్యులు ఈ వారం నామినేషన్లో ఉన్నారు. కాగా ఈ సీజన్లో మొదటి ఫైనలిస్టు అయిన రాహల్ కోసం బిగ్బాస్ చాక్లెట్లు పంపించి పండగ చేసుకోమన్నాడు. -
బిగ్బాస్: అలీని చూసి వణికిపోతున్న హౌస్మేట్స్
బిగ్బాస్ తెలుగు సీజన్ పద్నాలుగో వారంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం ఇంట్లో ఆరుగురు సభ్యులు మాత్రమే మిగిలారు. వీరికోసం బిగ్బాస్ ఓ సువర్ణావకాశాన్ని ఇస్తూనే అందులో ఓ మెలిక పెట్టాడు. నామినేషన్ ప్రక్రియలో భాగంగా ‘టికెట్ టు ఫినాలే’ అనే టాస్క్ను ఇచ్చాడు. ఇందులో ఒక్కరు మాత్రమే గెలిచే అవకాశం ఉండగా ఓడిపోయిన మిగతా అయిదుగురు సభ్యులు నామినేషన్లో ఉంటారని ప్రకటించాడు. గెలిచిన ఒక్కరికి టికెట్ టు ఫినాలే దక్కుతుందని తెలిపాడు. దీనికోసం పగలూ రాత్రీ తేడా లేకుండా ఇంటి సభ్యులంతా టాస్క్లపైనే దృష్టి సారించారు. ఇప్పటికే అధిక శాతం బ్యాటరీతో అలీ రెజా మొదటి స్థానంలో ఉండగా.. తక్కువ బ్యాటరీతో వరుణ్ చివరి స్థానంలో ఉన్నాడు. ఇక అర్ధరాత్రి సమయంలో బజర్ మోగించినపుడు అలీ, బాబాలు గంట మోగించడంతో వారిద్దరికీ బిగ్బాస్ రసవత్తరమైన టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగా మట్టి పాత్రలో బాబా ఎరుపు రంగు పూలు.. అలీ ఊదా రంగు పూలు పెట్టాల్సి ఉంటుంది. ఒకరి పూలను మరొకరు పీకే ప్రయత్నం చేయవచ్చని బిగ్బాస్ సూచించాడు. దీంతో అలీ.. బాబా పూలను పెకిలిస్తూ.. దూరంగా విసిరేశాడు. ఆగ్రహించిన బాబా.. అలీ పూలను కూడా మట్టిలో నుంచి తీసేయడానికి విశ్వప్రయత్నం చేస్తున్నాడు. ఈ కుస్తీలో ఇద్దరూ ఒకరిపై ఒకరు దొర్లుతూ గెలుపు కోసం భీకరంగా పోరాడుతున్నారు. తాజా ప్రోమో ప్రకారం.. అలీ బాబాను ఎత్తిపడేస్తున్నట్టు కనిపిస్తోంది. వీరి పోరాట పటిమను చూస్తుంటే ఇంటి సభ్యులకు సైతం ఒళ్లు గగుర్పొడొస్తోంది. టాస్క్ హింసాత్మకంగా మారడంతో ఇంటి సభ్యులు భయంతో వణికిపోయారు. ఓ పక్క శ్రీముఖి వారిస్తోన్నప్పటికీ అలీ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా బాబాపై విరుచుకుపడ్డాడు. రసవత్తరంగా మారిన ఈ టాస్క్లో ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. #Ali ki #BabaBhaskar ki madhyalo jarigina fight lo evaru gelicharu?#BiggBossTelugu3 today at 9:30 PM on @StarMaa pic.twitter.com/zWDLv9aZCD — STAR MAA (@StarMaa) October 22, 2019 -
బిగ్బాస్: బాబాపై ప్రతాపాన్ని చూపిస్తున్న అలీ..
బిగ్బాస్ హౌస్ నుంచి వితికా వెళ్లిపోయినా ఆమె జ్ఞాపకాల్లో బందీ అయిన వరుణ్ తనను తలుచుకుంటూ బాధపడ్డాడు. ఒంటరిగా కూర్చుని కన్నీళ్లు కారుస్తున్న వరుణ్ను.. రాహుల్, అలీ ఊరడించే ప్రయత్నం చేశారు. ఇక బిగ్బాస్ పద్నాలుగోవారానికిగానూ నామినేషన్ ప్రక్రియను కాస్త భిన్నంగా ఇచ్చాడు. ఇందులో గెలిచే ఒక్కరే ‘టికెట్ టు ఫినాలే’ సొంతం చేసుకుంటారని, మిగతా అయిదుగురు నామినేట్ అవుతారని ప్రకటించాడు. బిగ్బాస్ ఇచ్చిన ‘బ్యాటరీ ఉంటే నిండుగా.. జరుపుకోండి పండగ’ టాస్క్లో భాగంగా ఇంటి సభ్యులందరూ వివిధ కలర్ బ్లాక్స్ను ఎంచుకున్నారు. అందులో ఉన్న నెంబర్ శాతం ప్రకారం.. బాబా భాస్కర్.. 40 %, రాహుల్, శ్రీముఖిలు.. 50 %, శివజ్యోతి 60 %, అలీ.. 70% ల బ్యాటరీ పర్సెంటేజ్తో ఆట స్టార్ట్ చేశారు. సైరన్ మోగిన ప్రతీసారి ఇంటి సభ్యుల బ్యాటరీ లెవల్స్ తగ్గుతూ వస్తాయి. అయితే బజర్ మోగినప్పుడు గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేసిన రెండు గంటలను ఎవరు ముందుగా మోగిస్తారో వారు బ్యాటరీ రీఫిల్ చేసుకోడానికి టాస్క్లు ఆడాల్సి ఉంటుంది. ఇందుకోసం వారి బ్యాటరీలను చూపించే పట్టికను బిగ్బాస్ గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేశాడు. ఒకేసారి గంట కొట్టిన అలీ-శివజ్యోతి.. రాహుల్-వరుణ్.. బాబా భాస్కర్-శ్రీముఖి టాస్క్ల్లో తలపడ్డారు. అరటిపండ్ల టాస్క్లో శివజ్యోతి 15 మాత్రమే తినగా, అలీ 21 తిని రీఫిల్ చేసుకునే అవకాశాన్ని పొందాడు. రాహుల్, వరుణ్లకు థర్మాకోల్ నింపిన సంచులను ఇచ్చి ఒకరి సంచిని మరొకరు ఖాళీ చేయాల్సి ఉంటుందని బిగ్బాస్ పేర్కొన్నాడు. ఇందులో వరుణ్, రాహుల్ భీకర పోరాటం చేయగా చివరగా రాహుల్దే పైచేయి అయింది. బాబా, శ్రీముఖిలు.. ఆల్ఫాబెట్ కాయిన్స్ను పిండి, ఈకలు ఉన్న డబ్బాలో నుంచి కేవలం నోటి సహాయంతో తీయాల్సి ఉండగా ఇద్దరూ సమానంగా తీయగా టై అయింది. దీంతో టాస్క్ను ముందుగా పూర్తి చేసిన బాబా భాస్కర్ విజయం సాధించాడని బిగ్బాస్ ప్రకటించాడు. కాగా వారికిచ్చిన టాస్క్ల్లో గెలిచిన అలీ, రాహుల్, బాబా 10 శాతం బ్యాటరీలను పెంచుకున్నారు. ఇక అర్ధరాత్రి బజర్ మోగినప్పుడు బెల్ కొట్టిన బాబా, అలీ ఇద్దరూ చివరగా తలపడ్డారు. మట్టి నింపిన డబ్బాలో తలా ఒక రంగును పూలను నిలబెట్టాల్సి ఉంటుంది. ప్రత్యర్థి పూలను పీకే ప్రయత్నం కూడా చేయవచ్చని బిగ్బాస్ సూచించాడు. ఈ క్రమంలో అలీ, బాబాలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. చాలా రోజులకు ఫిజికల్ టాస్క్ రావటంతో అలీ తన శక్తినంతా కూడబెట్టుకుని బాబాపై విరుచుకుపడుతున్నాడు. బాబా పెట్టిన పూలను దూరంగా విసిరి పారేస్తున్నాడు. బాబా తన పూలను కాపాడుకోడానికి ఎంతో కష్టపడుతున్నాడు. మరి ఈ భీకర పోరులో విజయం ఎవరిని వరించనుంది అనేది నేటి ఎపిసోడ్లో తేలనుంది. -
రాహుల్ది ఫేక్ రిలేషన్షిప్ : వితికా
పదమూడో వారానికిగానూ వితికా ఎలిమినేట్ అవడంతో వరుణ్ వెక్కి వెక్కి ఏడ్చాడు. ఇక్కడో చిన్న ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. వితికా హౌస్ను వీడేముందు జాగ్రత్తగా మాట్లాడమని చెప్తూ శ్రీముఖి ఆమె చెవిలో గుసగుసలాడింది. అనంతరం బయటకు వచ్చిన వితికాతో నాగ్ ఓ గేమ్ ఆడించాడు. హౌస్మేట్స్ ఫొటోలు ఉన్న బెలూన్లను పగలగొట్టి వారికి చెప్పాలనుకునేటివి ఏమైనా ఉంటే చెప్పాలన్నాడు. ఈ సమయంలో వితికా తన మనసులో ఉన్న భావాలన్నింటినీ నిర్మొహమాటంగా వెల్లడించింది. తను బయటకు రావడానికి కారణం శివజ్యోతి అని బల్లగుద్ది చెప్పింది. లేకపోతే షో చివరిదాకా ఉండేదాన్నేమోనని ఆశాభావం వ్యక్తం చేసింది. శివజ్యోతి తనకన్నా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని వితికా అంగీకరించింది. ‘నాకన్నా ఒక స్టెప్పు ఎక్కువే నువ్వు. అది నేను ఒప్పుకుంటున్నా’నంటూ శివజ్యోతికి తెలిపింది. కాగా వరుణ్.. శివజ్యోతి కన్నా వితికా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అంటూ నామినేషన్లో తన స్థానాన్ని భార్యకు ఇచ్చేసిన విషయం తెలిసిందే! అయితే ఇప్పుడు వితికా.. శివజ్యోతే తనకన్నా స్ట్రాంగ్ అని ఒప్పుకోవటం గమనార్హం. ఇక ఎవరి గురించి చెడుగా చెప్పాలనుకోడవం లేదంటూనే రాహుల్కు చురకలంటించింది. ‘నామినేషన్ తర్వాత నుంచి మాతో దూరంగా ఉంటున్నావు. మాతో నువ్వు ఫేక్ రిలేషన్షిప్ కొనసాగిస్తున్నావేమో’ అని అనుమానంగా ఉందని చెప్పుకొచ్చింది. దూరంగా ఉన్నంతమాత్రాన ఫేక్ రిలేషన్ కాదని రాహుల్ తిరుగు సమాధానమిచ్చాడు. అనంతరం ‘అలీ ఉండాలి, నేను వెళ్లిపోవాలనుకున్నాను’ అన్న విషయాన్ని వితికా వెల్లడించింది. ‘ఎలిమినేట్ అయి వెళ్లిపోవటం, తిరిగి రావటం నీ తప్పు కాదు’ అంటూ అలీకి ధైర్యం నూరిపోసింది. బాబా భాస్కర్తో.. మా ఆయనను జాగ్రత్తగా చూసుకోండి, తనకు ఒక దోసె కూడా ఎక్కువగా ఇవ్వండి అని ఆర్డర్ వేసింది. చివరగా వరుణ్, శ్రీముఖిల ఫొటోలు ఉన్న బెలూన్లను పగలగొట్టడానికి చాలాసేపు తటాపటాయించింది. వరుణ్ ఏడ్చినందుకుగానూ అతని బెలూన్ను పగలగొట్టింది. శ్రీముఖిని కరెంట్తో పోల్చుతూ ఆమె అసలు అలసిపోదని ఎప్పటికీ ఎనర్జెటిక్గా ఉంటుందని వితికా ప్రశంసించింది. -
బిగ్బాస్: ‘పాత అలీ కావాలి!’
బిగ్బాస్ ఇంట్లో గ్రూప్లు మారిపోయినట్టు కొట్టొచినట్టు కనిపిస్తోంది. రాహుల్.. శివజ్యోతి, అలీ రెజా ఒక గ్రూప్... శ్రీముఖి, బాబా భాస్కర్, వరుణ్, వితిక మరో గ్రూప్గా మారిపోయారు. అయితే ఇదంతా నామినేషన్ ఎఫెక్ట్ అని స్పష్టంగా తెలుస్తోంది. ఇక బిగ్బాస్ ఇంట్లోకి హౌస్మేట్స్ కుటుంబీకులను పంపిస్తూ అందరికీ బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఈపాటికే వితిక చెల్లెలు రితిక అందరినీ పలకరించి వెళ్లింది. తాజా ఎపిసోడ్లో అందరూ స్లీప్ మోడ్లో ఉన్న సమయంలో అలీ భార్య మసుమా హౌజ్లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే వచ్చింది మసుమా అని శివజ్యోతి గుర్తుపట్టింది. స్లీప్ మోడ్ రివీల్ చేసిన తర్వాత అలీతో బయట జరుగుతున్న వాటికోసం కబుర్లు చెప్పింది. ‘వైల్డ్కార్డ్ ఎంట్రీకి ముందున్న అలీ కావాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారని.. నాకు అదే కావాలని కోరింది. బంధాల్లో ఇరుక్కుపోకుండా నీ గేమ్ నువ్వు ఆడు..’ అని అలీకి చురకలు అంటించింది. తర్వాత వచ్చిన మరో అతిథి గంగూలీని చూడగానే శివజ్యోతి కన్నీటి పర్యంతం అయింది. శివజ్యోతిని దగ్గరికి తీసుకుని బాగా ఆడుతున్నావ్ అంటూ గంగూలీ ధైర్యం చెప్పాడు. కాసేపు రాహుల్, అలీ శివజ్యోతిని ఆటపట్టించగా.. ఏయ్, మా ఆయన ఉన్నాడు అంటూ రెచ్చిపోయింది. అయితే తను లేనందుకు గంగూలీ కొంచెం కూడా బాధపడట్లేదని శివజ్యోతి ఫీల్ అయింది. ఏడుస్తూనే భర్తను సాగనంపింది. తర్వాత బాబా భాస్కర్ వంతు వచ్చింది. ముందుగా వారి పిల్లలను, తర్వాత భార్య రేవతిని ఇంట్లోకి పంపించారు. ఏంటి.. ఇంత మేకప్ వేసుకున్నారు అంటూ బాబా వాళ్లని ఆటపట్టించాడు. ఇంటి సభ్యులను పరిచయం చేస్తూ సైతాన్ అని శ్రీముఖిని చూపించాడు. అనంతరం కుటుంబం అంతా కలిసి కాసేపు హాయిగా ముచ్చటించారు. ఎందుకు అన్నిసార్లు ఏడ్చారు అని రేవతి.. బాబాను ప్రశ్నించింది. ‘బిగ్బాస్ షో ఎలా ఉంటుందో చూద్దాం అని వచ్చాను.. కానీ ఇక్కడ అందరూ నేను గేమ్ ఆడుతున్నానని అనేసరికి కష్టం అనిపించి ఏడ్చాన’ని చెప్పాడు. వెళ్లిపోయే ముందు రేవతి మాట్లాడుతూ ఎప్పుడూ బాబానే మూడుపూటలా వంట చేస్తాడు.. అసలు మీరెవరూ చేయరా అని నిలదీసింది. అసలు వితిక, శివజ్యోతిలను వంట వచ్చా? కిచెన్లో శ్రీముఖి కేవలం గరిటె ఊపుతుంది.. అని కామెంట్ చేసింది. అయితే బాబా మమ్మల్ని ఎవరినీ వంట చేయనివ్వడని ఇంటి సభ్యులు సమాధానమిచ్చారు. కాగా ముచ్చటగా మరో ముగ్గురి ఇంటి సభ్యుల బంధువులు ఇంకా రావాల్సి ఉంది. వాళ్లను చూడగానే ఇంటి సభ్యులు తమాయించుకుంటారో, ఏడ్చేస్తారో లేదో చూడాలి! -
బిగ్బాస్: ఏడ్చేసిన వితిక, ధైర్యం చెప్పిన ఆమె!
బిగ్బాస్ ఇంట్లో నామినేషన్ చిచ్చు చల్లారలేదు. మాటల యుద్ధానికి దిగిన కంటెస్టెంట్లు ఇంకా దాన్ని కొనసాగిస్తూనే వచ్చారు. ‘నన్ను కంత్రి అని నోరు పారేసుకున్నాడు. టివిలొ మా ఆయన చూస్తే ఫీల్ కాడా? తనకొక్కడికే పెళ్లాం ఉందా?’ అంటూ శివజ్యోతి ఏడ్చింది. ఇక నామినేషన్ ప్రక్రియ వరుణ్, రాహుల్ స్నేహానికి ఎసరు పెట్టినట్టు కనిపిస్తోంది. పునర్నవి వెళ్లినప్పటి నుంచి రాహుల్ కాస్త దూరంగా ఉంటున్నాడని, తనలో మార్పు గమనిస్తున్నానని వరుణ్ అభిప్రాయపడ్డాడు. ఇక బిగ్బాస్ ఇంటి సభ్యులకు ఫన్నీ టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగా వారి పనితనంతో హోటల్కు సెవన్ స్టార్ సంపాదించి పునర్వైభవాన్ని తీసుకురావాలని ఆదేశించాడు. హోటల్ మేనేజర్ వరుణ్.. వంట మాస్టర్లుగా బాబా భాస్కర్, శ్రీముఖి, వితిక, హౌస్ కీపింగ్ స్టాఫ్గా అలీ, శివజ్యోతి, రాహుల్ పనిచేశారు. వీరందిరి చేత బిగ్బాస్ కొన్ని డ్రిల్స్ చేయించాడు. మార్చ్.. ఆగకుండా శుభ్రం చేయడం.. ఫ్రీజ్ అవటం.. ఉన్నచోటే నిద్రపోవడం.. పాట వచ్చినప్పుడు డాన్స్ చేయడం వంటివి చేయాల్సి ఉంటుంది. ఇలా కాసేపు ఇంటి సభ్యులతో ఆడుకున్న బిగ్బాస్.. తర్వాత ఒక్కొక్కరి కుటుంబ సభ్యులను ఇంట్లోకి పంపించాడు. ముందుగా వితిక చెల్లెలిని ఇంట్లోకి పంపించగా.. ఆమె బావగారూ అంటూ పరుగెత్తుకెళ్లి వరుణ్ను హత్తుకుంది. చెల్లెలు రితికను చూడగానే వితిక బోరున ఏడ్చింది. వితికను ఊరడిస్తూ.. చాలా బాగా ఆడుతున్నావ్ అంటూ ఆమెకు ధైర్యాన్ని నూరిపోసింది. టాస్క్లో మరింత పర్ఫార్మ్ చేస్తే బాగుంటుంది అంటూ వరుణ్కు సలహా ఇచ్చింది. చివరగా వెళ్లిపోతూ హోటల్కు ఒక స్టార్ను ఇచ్చింది. తర్వాత అలీ రెజా భార్య మాసుమా ఇంట్లోకి అడుగు పెట్టింది. వచ్చీరాగానే అలీని హత్తుకుని విలపించింది. ఇక మావాళ్లు ఎప్పుడొస్తారో అంటూ మిగతా హౌస్మేట్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. -
బిగ్బాస్: ఇంటి సభ్యులకు బిగ్ సర్ప్రైజ్!
హౌస్లో గొడవలు రాజుకున్నాయనుకునేలోపే ఏదైనా ఫన్నీ టాస్క్ ఇచ్చి ఇంటి సభ్యులను కూల్ చేస్తాడు బిగ్బాస్. అందరూ కుటుంబంలాగా కలిసిపోయారనుకునేలోపే మళ్లీ వాళ్ల మధ్య చిచ్చు పెట్టి అగ్గి రాజేస్తాడు. ఇవాళ కూడా ఇదే ఫార్ములా వాడనున్నాడు. నామినేషన్ ప్రక్రియతో బిగ్బాస్ హౌజ్ హీటెక్కగా ఫన్నీ టాస్క్తో నవ్వులు పూయించనున్నాడు. తాజా ప్రోమోలో ఇంటి సభ్యులందరూ ఒకే రకమైన వస్త్రాలను ధరించి, వారి చేష్టలతో నవ్వు తెప్పిస్తున్నారు. కాగా బిగ్బాస్ ఇంట్లో ఎనభై అయిదు రోజులు పూర్తయ్యాయి. షో ముగియడానికి ఇంకా కొద్ది రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఇక ఇప్పటివరకు ఇంటి సభ్యులు బయటి ప్రపంచానికి దూరంగానే ఉంటూ వస్తున్నారు. వారిని బంధువులతో ఫోన్లో మాట్లాడించడం కానీ, కలవనీయడం కానీ జరగలేదు. గతంలో అరవై రోజుల పండగలో వితిక, రవి వారి కుటుంబ సభ్యులను కలుసుకుని తనివితీరా కబుర్లు చెప్పుకున్నప్పటికీ మిగతావారికి మాత్రం ఆ అవకాశం దక్కలేదు. ఒక్కసారి కలుసుకునే చాన్స్ ఇవ్వండని కన్నీళ్లతో వేడుకున్నప్పటికీ అందుకు బిగ్బాస్ ససేమీరా ఒప్పుకోలేదు. కాగా నేటి ఎపిసోడ్లో ఇంటి సభ్యులందరికీ బిగ్బాస్ బిగ్ సర్ప్రైజ్ ఇవ్వనున్నట్లు కనిపిస్తోంది. షో ముగింపుకు వస్తున్నందున ఇంటి సభ్యులకు బూస్ట్ ఇవ్వడానికి ఫ్యామిలీ మెంబర్స్ను ఇంట్లోకి పంపిచనున్నట్టు తెలుస్తోంది. అలీ భార్య మసూమా ఇంట్లోకి ఎంట్రీ ఇస్తూనే ఎమోషనల్గా మారింది. మరి ఇంటి సభ్యులందరి ఫ్యామిలీస్ను కూడా బిగ్బాస్ పంపిస్తున్నాడా లేదా అనేది నేటి ఎపిసోడ్లో తేలనుంది. అటు కామెడీ, ఇటు ఎమోషన్స్తో నేటి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారనుంది. Entertaining task lo Families entry!!! ❤️#BiggBossTelugu3 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/PsstJF7ZUs — STAR MAA (@StarMaa) October 15, 2019 -
‘మొగుడే ఎక్కువ రియాక్ట్ అవుతున్నాడు’
బిగ్బాస్ ఇంటిసభ్యులకు హంట్ అండ్ హిట్ టాస్క్ ఇచ్చారు. ఇందులో ఇంటి సభ్యులకు వారికి తెలియని, ఇంతవరకూ చూడని వీడియోను ప్లే చేశాడు. దీంతో అందరి రంగు బయటపడింది. ఊసరవెల్లిలా రంగులా మార్చేవారు ఈ దెబ్బతో తెల్లమొహం వేశారు. మొదట బాబా భాస్కర్కు అలీ రెజా, రాహుల్ వీడియోలను చూపించాడు. అయితే కోపంలో అవన్నీ మామూలే అని బాబా తేలికగా తీసుకున్నాడు. రాహుల్తో మాట్లాడుతూ నిజంగా నిన్ను టార్గెట్ చేసి ఉంటే ముఖం మీద చెప్తాను అంటూ సంజాయిషీ ఇచ్చుకున్నాడు. అనంతరం అలీ రెజా ఫోటో ఉన్న కుండను పగలగొట్టాడు. శ్రీముఖికికి..ఆమె ఒక్క నిమిషం కూడా బిగ్బాస్ గేమ్ వదలదు అంటూ మాట్లాడిన అలీ, డైరెక్ట్ ఎలిమినేట్ చేయమంటే శ్రీముఖిని లగేజ్ సర్దుకోమంటానని చెప్పిన మహేశ్ వీడియోలను చూపించాడు. దీంతో వీరావేశంతో బయటికి వచ్చిన శ్రీముఖి మహేశ్కు ఆల్ ద బెస్ట్ చెప్పి అతని ఫొటో కుండకు అతికించి కసితీరా కర్రతో కొట్టి ముక్కలు చేసింది. శివజ్యోతి రాహుల్ ఫొటో ఉన్న కుండను పగలగొట్టింది. రాహుల్కు నోటిదూల ఎక్కువ అంటూ మహేశ్, శివజ్యోతితో చెప్పుకొచ్చిన వీడియోను బిగ్బాస్ రాహుల్కు చూపించాడు. నేరుగా చెప్పే దమ్ము లేదా అంటూ మహేశ్తో వాగ్వాదానికి దిగిన రాహుల్. మహేశ్ ఫొటో ఉన్న కుండను బద్ధలు కొట్టాడు. వితిక.. వీడియో చూశాక అలీపై సీరియస్ అయి అతడి ఫోటో ఉన్న కుండ పగలగొట్టింది. ఇక అలీ.. వీడియో చూసిన తర్వాత శ్రీముఖితో మాట్లాడుతూ పెళ్లాం కన్నా మొగుడు ఎక్కువ రియాక్ట్ అవుతున్నాడంటూ వరుణ్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ కోపాన్నంతా శ్రీముఖి ఫోటో ఉన్న కుండను బద్ధలు కొట్టడంలో చూపించాడు. మహేశ్కు.. శ్రీముఖి అతని గురించి నెగెటివ్గా మాట్లాడిన వీడియోను ప్లే చేశాడు. అది చూసిన మహేశ్కు చిర్రెత్తుకొచ్చి శ్రీముఖి కుండను ముక్కలు చేసి ప్రతీకారం తీర్చుకున్నాడు. వరుణ్.. అలీ ఫొటో ఉన్న కుండను ముక్కలు ముక్కలు చేశాడు. ఇక స్టార్ ఆఫ్ దహౌస్గా నిలిచిన వరుణ్, శివజ్యోతికి స్పెషల్ డిన్నర్ రావటంతో ఇంటిసభ్యులు గుటకలు వేసినా ఏం లాభం లేదని తెలుసుకుని మిన్నకుండిపోయారు. ఇక మహేశ్ వీడియో చూసిన తర్వాత బాగా హర్ట్ అయినట్టు కనిపించాడు. ఇక నుంచి తాను ఎవరితో మాట్లాడను అంటూ శ్రీముఖి, మాస్టర్పై అలిగాడు. నా వల్ల ఎవరికీ నష్టం జరగలేదు. అయినా నాపై జోకులు వేస్తున్నారు. శ్రీముఖి అవసరం కొద్దీ మెదులుతుంది. నామినేషన్కు వెళ్లకుండా ఉండటానికి అందరితో క్లోజ్గా ఉంటుంది అని అతని అభిప్రాయాన్ని శివజ్యోతితో పంచుకున్నాడు. అలీరెజా గుట్టు బయటపడిందని, మహేశ్ చిత్రగుప్తులవాడు అని వరుణ్, వితిక అభిప్రాయపడ్డారు. బిగ్బాస్ పుట్టినరోజు సందర్భంగా ఇంటిసభ్యులు రచ్చరచ్చ చేశారు. వింత వింత వేషధారణలతో డాన్స్ చేశారు. బిగ్బాస్ బర్త్డే ఇంటిసభ్యుల చావుకొచ్చింది అన్నట్టుగా తయారైంది పరిస్థితి. బర్త్డే సందర్భంగా బిగ్బాస్ కేకుల మీద కేకులు పంపించాడు. మొదటి కేక్ను ఆవురావురుమంటూ తిన్నారు కానీ నాలుగో కేక్కు వచ్చేసరికి అపసోపాలు పడుకుంటూ తినేశారు. ఇక బిగ్బాస్ ఇంట్లో 80 రోజులు గడిచిపోయాయి. రానురాను టాస్క్లు మరింత కఠినతరం కానున్నాయి. ఎవరు ఎత్తుకు పై ఎత్తు వేస్తూ కడదాకా పోరాడుతారో చూడాలి! -
బిగ్బాస్: శివజ్యోతికి దూరంగా ఉంటే బెటరేమో!
బిగ్బాస్ ఇంట్లో కదిలిస్తే కన్నీళ్లే అనగానే గుర్తొచ్చే మొదటి, ఆఖరి వ్యక్తి శివజ్యోతి. ఇప్పటివరకు జరిగిన బిగ్బాస్ జర్నీని చూసుకుంటే టాస్క్లో గట్టిపోటీనిచ్చే వ్యక్తుల్లో శివజ్యోతి ఒకరు అని చెప్పడంలో సందేహం లేదు. అయితే తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే అన్న సూత్రాన్ని తను పాటించినంత కచ్చితంగా మరెవరూ ఆచరించరు. ఇక తన ఏడుపు గురించి సోషల్ మీడియాలో ఎన్నో ఫన్నీ మీమ్స్ పుట్టుకొచ్చాయి. ఆకు వచ్చి ముళ్లు మీద పడ్డా.. ముళ్లు వచ్చి ఆకు మీద పడ్డా చిరిగేది ఆకే అన్న సామెత అందరికీ తెలిసిందే. ప్రస్తుతం శివజ్యోతి విషయంలో అదే జరుగుతోందని కొందరు అంటున్నారు. అటు శివజ్యోతికి క్లోజ్ అయినవాళ్లకు మూడింది. ఇటు శివజ్యోతితో పెట్టుకున్నశ్రీముఖి ఎలిమినేషన్ చివరి అంచుల దాకా వెళ్లివచ్చింది. వివరంగా చూస్తే.. శివజ్యోతికి దగ్గరైనవాళ్లు ఒక్కొక్కరుగా బిగ్బాస్ ఇంటిని వీడి వెళ్లారు. ఏ తప్పు చేయని రోహిణి.. శివజ్యోతితో గుసగుసలు పెట్టినందుకుగానూ నామినేషన్ జోన్లోకి వచ్చి అకారణంగా ఎలిమినేట్ అయింది. ఆ తర్వాత తనకు దగ్గరివారైన అషూరెడ్డి, అలీ కూడా వెళ్లిపోయారు. ఇక వీరంతా వెళ్లిపోయే సమయంలో గుక్క తిప్పుకోకుండా ఏడ్చిన శివజ్యోతి మళ్లీ ఓ కొత్త జోడును వెతుక్కుంది. మంచోడని పేరుగాంచిన రవి దగ్గరకు వెళ్లి జంట కట్టగా చివరికి అతను కూడా బిగ్బాస్కు గుడ్బై చెప్పక తప్పలేదు. దీంతో శివజ్యోతికి కాస్త దూరంగా ఉంటే బెటర్ అని కొంతమంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇక బయట మంచి క్రేజ్ తెచ్చుకున్న అలీరెజాను బిగ్బాస్ టీం ఎలాగోలా వైల్డ్కార్డ్ ఎంట్రీ ద్వారా తిరిగి తీసుకొచ్చింది. అయితే బిగ్బాస్ ఇంట్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన అలీ రెజా కాస్త విభిన్నంగా ప్రవర్తిస్తున్నట్టు కనిపిస్తోంది. శ్రీముఖితో అంటీముట్టనట్టుగా వ్యవహరించడమే కాకుండా వరుణ్ టీంలో జాయిన్ అవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక శివజ్యోతి, అలీల బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత ఎపిసోడ్లో కుళాయి కొట్లాట గేమ్లో శివజ్యోతిని గెలిపించాలని తహతహలాడాడు. ఈ విషయంలో శ్రీముఖి.. అలీకి మధ్య పెద్ద గొడవే జరిగింది. ‘తనకెందుకు సహాయం చేస్తున్నావు? టైటిల్ కూడా ఆమెకే వదిలేస్తావా?’ అన్న శ్రీముఖి ప్రశ్నకు వదిలేస్తానంటూ దురుసుగా సమాధానమిచ్చాడు. అయితే అలీ చూపించిన అత్యుత్సాహానికి బిగ్బాస్ బ్రేక్ వేశాడు. అలీ చేసిన తప్పిదానికి బిగ్బాస్ అలీతోపాటు, శివజ్యోతిని అనర్హులుగా ప్రకటించాడు. అలీ గేమ్ ఆడాలి కానీ ఎమోషన్లో ఇరుక్కుపోవడం బాలేదని నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. -
నాగార్జునతో తేల్చుకుంటానన్న శ్రీముఖి!
బిగ్బాస్ పదకొండోవారంలో ఊహించని సంఘటనలు జరుగుతున్నాయి. మిస్టర్ కూల్గా పేరు తెచ్చుకున్న వరుణ్ రెండుసార్లు గొడవకు దిగాడు. ఇప్పటివరకు పెద్దగా కష్టపడని పునర్నవి ఆట ఆడింది. అయినప్పటికీ నామినేషన్ నుంచి తప్పించుకోలేకపోయింది. అది వేరే విషయం. ఇక బెస్ట్ ఫ్రెండ్స్.. బద్ధ శత్రువులుగా మారిపోయారా అన్న అనుమానం రేకెత్తుతోంది. ఇది ఎవరి గురించి చెప్తున్నామో బహుశా ఈపాటికే అర్థమైపోయుంటుంది. మంచి స్నేహితులుగా ఉండే అలీ, శ్రీముఖిల మధ్య దూరం పెరుగుతోందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అసలు ఏం జరిగిందో చూసినట్టయితే.. ఏడవ వారంలో బిగ్బాస్ ఇంటికి వీడ్కోలు చెప్పిన అలీరెజా పదో వారంలో వైల్డ్కార్డ్ ఎంట్రీతో మళ్లీ వచ్చాడు. అయితే బయట పరిస్థితులు ఎలా ఉన్నాయో చూశాక అలీ గేమ్ ప్లాన్ మార్చుకున్నట్టు తెలుస్తోంది. ‘రాహుల్, వరుణ్, పునర్నవి, వితికలు కలిసి ఉన్నంతవరకు వారు సేఫ్గానే ఉంటారు’ అని అలీ తన అభిప్రాయాన్ని మిగతా ఇంటిసభ్యులతో పంచుకున్నాడు. సో అలీ ఆ నలుగురి టీంలో కలిసిపోవడానికి బాగా ప్రయత్నిస్తున్నాడని కొందరు అంటున్నారు. ఇక రీఎంట్రీ ఇచ్చినప్పటినుంచి అలీ.. అయితే శివజ్యోతి, లేకుంటే వరుణ్ టీంతోనే ఎక్కువగా గడుపుతున్నాడు. జిగిరీ దోస్త్ అయిన శ్రీముఖిని పక్కనపెట్టాడనేది దాయలేని నిజం. ఇది తాజా ఎపిసోడ్లోనూ తేటతెల్లమైంది. కాగా బిగ్బాస్ ఇచ్చిన ‘బ్యాటిల్ ఆఫ్ ద మెడాలియన్’ టాస్క్లో భాగంగా మొదటి లెవల్ ‘కుళాయి కొట్లాట’ గేమ్లో పునర్నవి సంచాలకులుగా వ్యవహరించింది. ఈ టాస్క్లో గ్లాస్ కంటెయినర్లో నీళ్లు నింపి స్మైలీ బాల్ను పైకి వచ్చేలా చేయాలి. ఈ టాస్క్లో నామినేట్ అయిన సభ్యులను అనర్హులుగా ప్రకటించగా వారు నచ్చనివారిని అడ్డుకోవచ్చు, నచ్చినవారికి సహాయం చేయవచ్చు. ఉన్నవి రెండే కుళాయిలు కాగా కొద్దిసేపు మాత్రమే వచ్చే నీళ్ల కోసం బాబా భాస్కర్, అలీ రెజా, వితిక షెరు, శివజ్యోతి, శ్రీముఖఙ హోరాహోరీగా పోటీపడ్డారు అలీ త్వరగానే తన కంటెయినర్ను నింపుకోవటమే కాక శివజ్యోతికి సహాయం చేయాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా శివజ్యోతి కంటెయినర్లో నీళ్లు నింపడం ప్రారంభించాడు. ఇది చూసిన శ్రీముఖి, వితికలు అలీపై ఫైర్ అయ్యారు. ‘ఇక్కడ సొంతంగా ఆడేవాళ్లం పిచ్చివాళ్లమా? ఎవరి ఆట వాళ్లు ఆడండి అంటూ ఉచిత సలహా ఇచ్చారు. ‘నా ఇష్టం’ అంటూ అలీ ఎదురు తిరగగా శ్రీముఖి ఒంటికాలిపై లేచింది. బిగ్బాస్ టైటిల్ కూడా శివజ్యోతికి ఇచ్చేస్తావా? అని అడిగితే ఇచ్చేస్తా అనడంతో తనతో మాట్లాడటం అనవసరమని వీకెండ్లో నాగార్జున మాట్లాడతారు అని చెప్పుకొచ్చింది. ఇక అలీ.. శివజ్యోతి కంటెయినర్లో నీళ్లు పోసినప్పటికీ తాను వద్దని వారించనందువల్ల బిగ్బాస్ వారిద్దరినీ టాస్క్లో అనర్హులుగా ప్రకటించాడు. కాగా మొదటి లెవల్లో వితిక విజయం సాధించగా ‘బ్యాటిల్ ఆఫ్ ద మెడాలియన్’ పోరులో నేరుగా ఫైనల్కు అర్హత సాధించింది. ఇక మెడల్ గెల్చుకోడానికి ఇంటిసభ్యులు ఎన్ని ప్రయాసలు పడతారో చూడాలి! -
అలీ రీఎంట్రీ.. ఆనందంలో శివజ్యోతి, శ్రీముఖి
బిగ్బాస్ హౌస్లో ఎప్పుడేం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. బిగ్బాస్ తమిళ మూడో సీజన్ మాదిరిగానే.. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ను మళ్లీ వైల్డ్కార్డ్ఎంట్రీలో ప్రవేశపెట్టాడు. అక్కడ వనితా విజయ్కుమార్ను రీఎంట్రీలో తీసుకురాగ.. ఇక్కడ అలీ రెజాను రీఎంట్రీలో తీసుకొచ్చాడు. ఇది బిగ్బాస్ షో.. ఇక్కడ ఏమైనా జరుగొచ్చు అనేదానికి నిదర్శనంగానే ఈ రీఎంట్రీని ప్రవేశపెట్టినట్టు అనిపిస్తోంది. ప్రాణ స్నేహితులుగా ఉన్న వరుణ్-రాహుల్ మధ్య గొడవలు జరగడం నిన్నటి ఎపిసోడ్లో అందరం చూశాం. దాని ప్రభావం నేటి ఎపిసోడ్లో పడింది. రాహుల్-పునర్నవి, వరుణ్-వితికాలు మాట్లాడుకోలేదు. వరుణ్ వద్దకు వచ్చి పునర్నవి మాట్లాడే ప్రయత్నం చేసింది. కానీ అంతగా వర్కౌట్ కాలేదు. ఇక హౌస్లో అందరూ ఓ వైపు ఉండగా.. రాహుల్-పున్నులు మరోవైపు ఉన్నారు. ఎప్పుడో జరిగినవి ఇప్పుడు మాట్లాడుతున్నాడు అది మగతనం కాదంటూ వరుణ్నుద్దేశించి.. రాహుల్ కాస్త ఘాటుగా మాట్లాడాడు. వర్షంలో డ్యాన్సులు చేసిన జంటలు.. వర్షం పడుతుండటంతో.. పాటలు ప్లే చేయండంటూ హౌస్మేట్స్ బిగ్బాస్ను కోరగా.. పాటలు ప్లే చేయడంతో డ్యాన్సులు వేస్తు దుమ్ములేపారు. ఎవరి జంటలను వారు పట్టుకుని వర్షంలోఎంజాయ్ చేశారు. ఇక మధ్యలో రాహుల-పునర్నవి వచ్చి జాయిన్ అయ్యారు. మూడు జంటలు కలిసి ఓ వైపు డ్యాన్సులు వేస్తుండగా.. శివజ్యోతి, బాబా, మహేష్ కలిసి మరో వైపు అదరగొట్టారు. రాహుల్-పున్నులకు మహేష్ సలహా.. గొడవ కారణంగా మాట్లాడుకోవడం మానేసిన వరుణ్-రాహుల-పున్ను-వితికాలను మహేష్ ఓ సలహా ఇచ్చాడు. మీరు ఎలాగూ రెండు మూడు రోజుల తరువాత మాట్లాడుకుంటారు. అయితే అంత వరకు మీ మధ్య వచ్చి పుల్లలు పెట్టే వారిని గమనిస్తూ ఉండండి. ఎవరు ఎలాంటి వారో తెలుస్తుందని చెప్పుకొచ్చాడు. అయితే శ్రీముఖిని పాయింట్ అవుట్చేస్తూనే మహేష్ ఆ ఐడియా ఇచ్చినట్టు కనిపిస్తోంది. గొడవ జరిగింది వరుణ్తో కదా.. పునర్నవి తనతో ఎందుకు మాట్లాడటం లేదని వితికా శ్రీముఖితో చెప్పుకొచ్చింది. అయితే ఈ టాస్క్లో రవి-శ్రీముఖిలు గోడను నిర్మించి.. కెప్టెన్సీ టాస్క్కు అర్హత సాధించారు. వీలునామా తన దగ్గరే దాచుకోవడంతో శివజ్యోతిసైతం అర్హత సాధించింది. బెస్ట్ పర్ఫార్మర్గా బాబాను అందరూ ఏకాభిప్రాయంతో ఎంపిక చేసి.. కెప్టెన్సీకి అర్హత సాధించేలా చేశారు. దీంతో ఈ వారంలో రవి, శ్రీముఖి, బాబా, శివజ్యోతిలోంచి ఎవరో ఒకరు కెప్టెన్ అయ్యే చాన్స్ ఉంది. అలీ రీఎంట్రీతో శ్రీముఖి ఫుల్ ఖుషీ అయింది. ఇక శివజ్యోతి ఎప్పటిలాగే.. పాతాళగంగలా మారింది. అలీ ఎంట్రీతో శివజ్యోతి, రవి స్ట్రాంగ్ అవుతారు. మరో వైపు శ్రీముఖికి బలం పెరిగినట్టైంది. ఇక వరుణ్-వితికా, పున్ను-రాహుల్ విడిపోవడంతో ఆట మరింత రక్తికట్టనుంది. ఇక ఇంట్లో గ్రూపిజం ఎలా రూపు మారుతుంది? ఎవరెవరు ఒక్కటవుతారు? ఇకపై ఆట ఎలా ఉండబోతుందనన్నది ఆసక్తికరంగా మారింది. -
అలీరెజా వస్తే.. బిగ్బాస్ చూడం!
హౌస్మేట్స్కు సర్ప్రైజ్ ట్విస్ట్.. వెయిట్ అండ్ వాచ్ అంటూ విడదల చేసిన ఓ ప్రోమో.. ప్రస్తుతం వైరల్ అవుతోంది. అయితే అందులో ఉన్నది అలీ రెజా అని తెలిసిపోతూనే ఉంది. అలీ రెజా నామినేషన్స్లోకి వచ్చిన మొదటిసారే.. వెనుదిరిగిపోయాడు. అలీ ఎలిమినేషన్తో హౌస్మేట్స్తో పాటు ఆడియెన్స్ కూడా షాక్కు గురయ్యారు. అలీని తిరిగి బిగ్బాస్ ఇంట్లోకి తీసుకురావాలని అతని అభిమానులు సోషల్ మీడియాలో హల్చల్ చేశారు. అయితే నేటి ఎపిసోడ్లో అలీ బిగ్బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వబోతోన్నట్లు విడుదల చేసిన ప్రోమో.. సోషల్మీడియాలో పెద్ద చర్చకే దారి తీసింది. ఓటింగ్ ప్రక్రియ చేపట్టకుండా.. అలీని హౌస్లోకి ఎలా తీసుకువస్తారు? అంటూ నెటిజన్లు గగ్గోలు పెడుతున్నారు. అలీని తిరిగి ఇంట్లో ప్రవేశపెట్టాలని అందరూ కోరుకుంటున్నారు.. కానీ ఇలా ఇష్టం వచ్చినట్లు చేస్తే ఎలా అని అంటున్నారు. ప్రజల కోరిక మేరకే ఎలిమినేషన్ జరిగింది. వారంతా సమయాన్ని వృథా చేసుకుంటూ ఓట్లు వేస్తూ షోను ఆదరిస్తున్నారు. ఇలా ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా.. ఓటింగ్ చేపట్టకుండా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ను ఎలా రీఎంట్రీ పేరిట తీసుకువచ్చి రుద్దుతారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే రీఎంట్రీ కోసం ఓటింగ్ పెడితే.. వచ్చేది అలీరెజానే అని కొంతమంది అంటున్నారు. కంటెస్టెంట్లను సెలెక్ట్ చేసేటప్పుడు ప్రజలను అడిగి చేస్తున్నారా? వైల్డ్ కార్డ్ ఎంట్రీ అప్పుడు ప్రజల అభిప్రాయాలను తీసుకుంటున్నారా? అంటూ ఇంకొంత మంది అలీ రీఎంట్రీని సపోర్ట్ చేస్తున్నారు. ఏదేమైనా.. కొన్నింటికి కొన్ని పద్దతులు ఉంటాయని వాటిని పాటించనక్కర్లేదా అని మరో వర్గం అసహనం వ్యక్తం చేస్తుంది. అలీ రీఎంట్రీ అనేది నిజమే అయితే.. ఓటింగ్ చేపట్టకుండా అలా చేసినందుకు బిగ్బాస్ షోను ఇక చూడమంటూ తెగేసి చెబుతున్నారు. మరి నేటి ఎపిసోడ్లో ఏం జరగనుందో చూడాలి. నిజంగానే అలీ రీఎంట్రీ ఇచ్చాడా? లేదా కేవలం అతిథిలా వచ్చాడా?అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే.. ఇంకొన్ని గంటలు ఆగాలి. -
బిగ్బాస్: అదిరిపోయే ట్విస్ట్.. అలీ రీఎంట్రీ!
బిగ్బాస్ రియాల్టీ షో 15 మంది కంటెస్టెంట్లతో గ్రాండ్గా స్టార్ట్ అయింది. తర్వాత వీరికి తోడుగా వచ్చిన రెండు వైల్డ్కార్డ్ ఎంట్రీలతో ఇంటిసభ్యుల సంఖ్య 17కు చేరుకుంది. అయితే వైల్డ్కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తమన్నా, శిల్ప చక్రవర్తిలు సరైన ప్రేక్షకాదరణ పొందలేక వీలైనంత త్వరగా బిగ్బాస్ హౌస్కు వీడ్కోలు చెప్పారు. ప్రస్తుతం ఇంటి సభ్యుల సంఖ్య 9కు చేరుకుంది. ఇప్పుడిప్పుడే పోటీ తీవ్రతరమయ్యే సమయంలో మళ్లీ వైల్డ్కార్డ్ ఎంట్రీ తీసుకురావటం అనేది బిగ్బాస్ టీమ్కు కత్తి మీద సామే. అందుకని రూటు మార్చిన బిగ్బాస్ టీం ఎలిమినేట్ అయిన సభ్యుల్లోంచి ఒకరికి రీఎంట్రీ అవకాశం ఇవ్వాలని భావిస్తోంది. ఇప్పటివరకు హేమ, జాఫర్, తమన్నా, రోహిణి, అషూరెడ్డి, అలీ రెజా, శిల్ప చక్రవర్తి, హిమజలు ఎలిమినేట్ అయ్యారు. అయితే రీఎంట్రీ చాన్స్ మాత్రం అలీకే ఎక్కువగా ఉన్నాయి. కాగా నేటి ఎపిసోడ్లో బిగ్బాస్ బిగ్ట్విస్ట్ ఇవ్వనున్నాడు. మొదట వైల్డ్కార్డ్ అయి ఉంటుందని భావించిన ఇంటిసభ్యులకు షాక్ ఇచ్చాడు. బిగ్బాస్ ఇంట్లోకి అందరికీ తెలిసిన వ్యక్తి రాబోతున్నాడు. బిగ్బాస్ ఇచ్చే ఏ టాస్క్ అయినా.. దానికి పూర్తి న్యాయం చేసే వ్యక్తిగా, మోస్ట్ అగ్రెసివ్గా పేరు తెచ్చుకున్న స్ట్రాంగ్ కంటెస్టెంట్ అలీ రెజాను బిగ్బాస్ ఇంట్లోకి పంపించనున్నట్టు తెలుస్తోంది. ఇక ఎలిమినేషన్ జోన్లోకి వెళ్లిన మొదటి సారే అలీ ఎలిమినేట్ అవడం అందర్నీ షాక్కు గురిచేసిన విషయం తెలిసిందే. దీంతో అతని అభిమానులు అలీ లేకుండా షో చూడటం వేస్ట్ అని బిగ్బాస్ నిర్వాహకులపై ఫైర్ అయ్యారు. తాజాగా అలీ రాక రీఎంట్రీగా మారితే మాత్రం అతని అభిమానులకు ఇక పండగే. ఇక నేటి ఎపిసోడ్లో గ్రాండ్ ఎంట్రీతో అలీ అదరగొట్టనున్నట్టు కనిపిస్తోంది. మరి అలీది రీఎంట్రీనా లేక జస్ట్ ఎంట్రీనా అన్న సందిగ్ధానికి నేటి ఎపిసోడ్లో తెరపడనుంది. Housemates ki surprise twist...Wait and watch!!#BiggBossTelugu3 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/GEdx0VHsAZ — STAR MAA (@StarMaa) September 26, 2019 -
అలీ రెజా సూపర్ స్ట్రాంగ్ : రోహిణి
ఏడో వారంలో అనూహ్యంగా ఎలిమినేట్ అయి ఇంటిబాట పట్టాడు అలీ రెజా. బిగ్బాస్ మూడో సీజన్లో విన్నర్గా నిలిచే అవకాశాలున్న కంటెస్టెంట్గా పేరు తెచ్చుకున్న అలీ.. అనుకోకుండా ఎలిమినేట్ అయ్యాడు. ఆరువారాలుగా నామినేషన్ను ఫేస్ చేయకుండా ఉన్న అలీ.. ఇలా ఎలిమినేట్ అవడంతో హౌస్మేట్స్తో పాటు ఆడియెన్స్ కూడా షాక్కు గురయ్యారు. అయితే అలీ రెజాను తిరిగి హౌస్లోకి పంపించాలని అతని అభిమానులు కోరుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ట్వీట్లతో హల్ చల్ చేస్తున్నారు. అలీ రెజా తన కోపాన్ని కంట్రోల్ చేసుకుని, మాటలను అదుపులో పెట్టుకుని ఉంటే ఎలిమినేట్ అయ్యేవాడు కాదని అతని ఫాలోవర్స్ అనుకుంటున్నారు. అలీ ఎలిమినేషన్పై బిగ్బాస్ కంటెస్టెంట్ రోహిణి సైతం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. రోహిణి తన పుట్టినరోజు సందర్భంగా.. కాసేపు నెటిజన్లతో ముచ్చటించింది. ఈమేరకు కొంతమంది అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పుకొచ్చింది. అలీ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవునా? కాదా? సూపర్స్ట్రాంగ్. అలీ ఎలిమినేషన్ కరెక్ట్ అనే భావిస్తున్నారా? అవును ఎక్స్పెక్ట్ చేయలేదు. రవి ఫైనల్ వరకు వెళ్తాడా? బిగ్బాస్ హౌస్లో ఏదైనా జరగొచ్చు. చాన్స్ వస్తే బిగ్బాస్కి మళ్లీ వెళ్తారా? వెళ్దాం. రాహుల్పై మీ అభిప్రాయం? నోరు జారడం తప్పా మిగతాదంతా జెన్యూన్గా ఉంటాడు. అలీ పేరెంట్స్ చనిపోయారా? అందుకే ఎలిమినేట్ చేశారా? ఛీ ఛీ ఎవరు చెప్పారు.. అది తప్పుడు వార్త. ఇలా నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. శ్రీముఖి, రవి, బాబా భాస్కర్, తమన్నా, శివజ్యోతిలకు సంబంధించిన కొన్ని ప్రశ్నలను కూడా అడిగారు. వాటికి కూడా రోహిణి కూల్గా సమాధానమిచ్చింది. వాటికి సంబంధించిన సమాధానాలు కావాలంటే.. గ్యాలరీలో చూడండి. -
అలీ రెజా ఇంట్లో విషాదం.. భావోద్వేగ పోస్ట్
బిగ్బాస్ హౌస్లో స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్గా పేరు తెచ్చుకున్న అలీ రెజా.. ఎలిమినేట్ అవడం బిగ్బాస్ ఇంటి సభ్యులనే కాదు.. అతని అభిమానులను కూడా షాక్కు గురి చేసింది. ఆరు వారాల పాటు అసలు ఎలిమినేషన్ జోన్లోకే రాని అలీ.. సడెన్గా ఎలిమినేట్ అయ్యే సరికి హౌస్మేట్స్ ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. అలీ రెజా ఇంటిని వీడిపోయే సమయంలో దాదాపు హౌస్మేట్స్ అందరూ భావోద్వేగానికి గురయ్యారు. ఇక శివజ్యోతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె కన్నీటిని ఎవరూ ఆపలేకపోయారు. శ్రీముఖి సైతం కన్నీటిపర్యంతమైంది. ఇంతమంది తన కోసం ఏడుస్తున్నారు.. బిగ్బాస్ టైటిల్ గెలవకపోయినా.. వీరందరి ప్రేమ గెలుచుకున్నానంటూ అలీ తెలిపాడు. అయితే అలీ రెజా బిగ్బాస్ టైటిల్ గెలవాలని, త్వరగా ఎలిమినేట్ అయితే ఇంటికి రానివ్వమంటూ.. కుటుంబ సభ్యులు ఓ సందేశాన్ని కూడా పంపించారు. అయితే ఆ సందేశం వచ్చిన వారమే అలీ ఇంటిని వీడాడు. తాను బిగ్బాస్ హౌస్లో ఉన్న సమయంలో తన మామయ్య చనిపోయాడని, ఈ సంగతిని ఫ్యామిలీ మెంబర్స్ తనకు తెలియనివ్వలేదని అలీ రెజా సోషల్మీడియాలో ఓ భావోద్వేగ సందేశాన్ని పోస్ట్ చేశాడు. (బిగ్బాస్ హౌస్లోకి అలీ రీఎంట్రీ?) ‘నా జీవితంలో విజయాన్ని చూడాలనుకున్నారు.. అయితే ఇప్పుడు నాపై ఎంతో మంది అభిమానం చూపిస్తున్నారు. ఎంతో మంది నన్ను ప్రేమిస్తున్నారు. కానీ ప్రస్తుతం మీరు అవన్నీ చూడలేకపోతున్నారు. మిమ్మల్ని చివరి క్షణంలోనైనా చూడలేకపోయాను. బిగ్బాస్ నాకెంత అవసరమో తల్లిదండ్రులకు తెలుసు.. అందుకే మీ గురించి నాకు తెలియనివ్వలేదు. అయినా వారికి తెలీదు మీరు కూడా నాకు అంతే ముఖ్యమని.. బిగ్బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వడమే నాకు ఓ షాక్లా ఉంటే.. బయటకు వచ్చాక మీరు లేరన్న వార్త మరింత షాక్కు గురిచేసింది. ఇంట్లో అనంతమైన బాధ ఉన్నా.. నన్ను సంతోషంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు. అందరూ నాకు సపోర్ట్ను ఇస్తున్నారు. అన్ని వైపుల నుంచి ఇంతప్రేమను నేను చూశాకా.. నాకు ఇంకెమీ అవసరం లేదనిపిస్తోంది. మామా నువ్వు బెస్ట్. నిన్ను అంతిమ సమయంలో చూడలేకపోయినందుకు నేనెప్పుడూ బాధపడుతూనే ఉంటాను. లవ్ యూ ఫర్ ఎవర్. నీ ఆత్మకు శాంతి చేకూరాలి’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అలీ చేసిన ఈ పోస్ట్పై ఎంతో మంది అభిమానులు స్పందిస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు. View this post on Instagram You wanted to see me successful in life and now that i have so many people loving me and praising me ur not there to see that. I wish i could atleast see you for the last time. Mom dad could not send any information cause they knew how important Bigg boss was for me and they dint wanted this to effect my game but they dint know you were equally important for me in life . By the time I could come out of my elimination shock i got another huge shock of you being No more. There has been so much of greef at home and still everyone trying to stay happy and support me . I want nothing more in life after seeing all the love and support from all over . Mama you were the best, Your the best and will always remain the best. Ill always have the regret of not getting to see u for the last time. Love you forever. May your soul rest in peace. A post shared by Ali Reza (@i.ali.reza) on Sep 9, 2019 at 9:31pm PDT -
బిగ్బాస్ హౌస్లోకి అలీ రీఎంట్రీ?
బిగ్బాస్ ఇచ్చే టాస్క్లో వందశాతం తన వంతు న్యాయం చేసే కంటెస్టెంట్ అలీ రెజా. ఈ మూడో సీజన్లో ఇచ్చే టాస్క్లు అంతంతమాత్రంగా ఉన్నా.. వాటిల్లోనూ బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నించే హౌస్మేట్స్ తక్కువ మందే ఉన్నారు. వారిలో అలీరెజా ముందువరుసలో ఉంటాడు. అలాంటి అలీ.. ఆరు వారాల పాటు నామినేషన్ జోన్లోకి రాలేదు. స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ అంటూ అలీని ఇంటి సభ్యులు ఏడో వారంలో నామినేట్ చేశారు. అలీ రెజా ఎలిమినేట్ అవుతారని ఎవ్వరూ ఊహించలేదు. దీంతో ఖంగుతిన్న ఇంటిసభ్యులు భోరున విలపించారు. శివజ్యోతి, శ్రీముఖి కన్నీరును ఆపుకోలేకపోయారు. అయితే అలీ రెజాకి బయట అంత నెగెటివిటీ లేకపోయినా.. అతను ఎలిమినేట్ కావడం ఆయన అభిమానులకు విచిత్రంగా అనిపిస్తోంది. దీంతో అలీని ఎలాగైనా.. రీఎంట్రీ ఇచ్చి హౌస్లోకి రావాలని కోరుకుంటున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ట్వీట్లు, హ్యాష్ట్యాగ్స్తో కామెంట్లు చేస్తున్నారు. బిగ్బాస్లో యాభై రోజులు పూర్తవ్వడంతో.. మిగిలిన సెకండ్పార్ట్ను మరింత కఠినతరం చేయనున్నట్లు తెలుస్తోంది. గత సీజన్లో మాదిరి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లలోంచి ఇద్దరికి రీఎంట్రీ ఇచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అయితే ఇలాంటి అవకాశం వస్తే అలీకి చాన్స్ ఇద్దామని నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. మరి నిజంగా అలాంటి అవకాశం బిగ్బాస్ ఇస్తే.. హేమ, జాఫర్, తమనా, రోహిణి, అషూ, అలీ.. వీరందరిలో ఎవరికి ఓట్లు అధికంగా వస్తాయో చూడాలి. అలీ ఉంటేనే షోలో గట్టి పోటీ ఉంటుందని కామెంట్లు చేస్తున్నారు. ఈ వారం నామినేషన్ ప్రక్రియ మొదలైనట్లు.. తాజాగా విడుదల చేసిన ప్రోమోల ద్వారా తెలుస్తోంది. మరి రీఎంట్రీ గురించి బిగ్బాస్ ఎప్పుడు ప్రకటిస్తాడో చూడాలి. -
అలీ అవుట్.. షాక్లో హౌస్మేట్స్
శనివారం సాయంత్రం నుంచే బిగ్బాస్ ఏడో వారంలో ఇంటిని వీడే కంటెస్టెంట్ అలీరెజా అంటూ ప్రచారం సాగింది. అయితే తీరా చూస్తే అదే నిజమైంది. అలీరెజా ఎలిమినేట్ అయినట్టు నాగ్ చెప్పడంతో హౌస్మేట్స్ అందరూ షాక్కు గురయ్యారు. ఇక శివజ్యోతి పాతాళగంగలా మారిపోయింది. శివజ్యోతి వెక్కి వెక్కి ఏడుస్తూ అలీని వీడలేకపోయింది. శ్రీముఖి కూడా కన్నీరు పెట్టుకుంది. తాను వెళ్తుంటే.. ఇంత మంది ఏడుస్తున్నారు.. ఇది చాలు.. టైటిల్ గెలవకపోయినా పర్లేదు అంటూ అలీ చెప్పుకొచ్చాడు. ఇక హౌస్మేట్స్ అందరూ కలిసి అలీకి వీడ్కోలు చెప్పారు. బయటకు వచ్చిన అలీ.. హౌస్మేట్స్తో ఫోన్లో పర్సనల్గా మాట్లాడేందుకు ఓ అవకాశాన్ని ఇచ్చాడు. స్ట్రాంగ్గా ఉండంటూ, ఏడ్వొద్దని శివజ్యోతికి సూచించాడు. ఎలా ఆడుతున్నావో అలానే ఆడు, బాబా భాస్కర్ను చూస్తూ ఉండంటూ మహేష్కు సలహా ఇచ్చాడు. మంచోడు మంచోడు అంటే సరిపోదు.. గేమ్ కూడా ఆడు.. జ్యోతిని సరిగా చూసుకో అంటూ రవికి, అమేజింగ్, ఎలా ఆడుతున్నావో అలానే ఆడు.. ఫైనల్ వరకు ఉంటావని వరుణ్కు సూచించాడు. పునర్నవి-అలీ పరస్పరం క్షమాపణలు చెప్పుకున్నారు. కొంచెం చూస్తూ మాట్లాడు అంటూ రాహుల్కు, జ్యోతిని కూడా కాస్త చూస్తూ ఉండు అని వితికాను కోరాడు. విన్నర్గా చూడాలనుకుంటున్నా అని శ్రీముఖికి తెలిపాడు. నాగార్జునతో పాటు నాని కూడా బిగ్బాస్ స్టేజ్పై సందడి చేశారు. గ్యాంగ్ లీడర్ సినిమా ప్రమోషన్లో భాగంగా నాని హౌస్మేట్స్ను ఎంటర్టైన్ చేయడానికి ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీలో నాని రైటర్ కాబట్టి.. హౌస్మేట్స్కు సరిపోయే క్యారెక్టర్స్ను సూచించాడు. హౌస్మేట్స్కు గ్యాంగ్ లీడర్ ట్రైలర్ ప్లే చేసి చూపించారు. నాగ్ ఇచ్చిన కొన్ని ఇంగ్లీష్ మూవీ టైటిల్స్ను తెలుగులో అనువాదం చేసి ఫన్ క్రియేట్ అయ్యేలా చేశాడు. ఇక ఎనిమిదో వారంలో ఎంటర్ కానున్న బిగ్బాస్ హౌస్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి. -
బిగ్బాస్.. అతను లేకుంటే షో చూడటం వేస్ట్!
బిగ్బాస్ హౌస్లో అలీరెజా... మోస్ట్ అగ్రెసివ్గా పేరు తెచ్చుకున్న కంటెస్టెంట్. టాస్క్లో చురుగ్గా పాల్గొంటూ.. గేమ్ను మలుపులు తిప్పే ప్రయత్నం చేస్తుంటాడు. అయితే ఆ క్రమంలో ఒక్కోసారి ఇతర హౌస్మేట్స్తో గొడవలు జరుగుతూ ఉంటాయి. దాదాపు అందరితో గొడవలు పెట్టుకున్న అలీ.. నేడు ఎలిమినేట్ అయినట్లు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అలీ ఎలిమినేట్ కావడంపై నెటిజన్లు పలురకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అలీ రెజా ఎలిమినేట్ అవుతాడని అస్సలు ఊహించలేదని, అతను లేకుంటే షో చూడటం కూడా వేస్ట్ అని, టాస్క్లు చేసే ఏకైక వ్యక్తి అని అంటూ అతని ఎలిమినేషన్ పట్ల అందరూ స్పందిస్తున్నారు. అలీకి ఉన్న అగ్రెసివ్నెస్ మూలాన్నే ఎలిమినేట్ అయ్యాడని, కోపంలో ప్రవర్తించే విధానం, ఆ సమయంలో నోటికి ఎంతొస్తే అంత అనడం లాంటి కారణాలు ఓటింగ్ను దెబ్బతీశాయని తెలుస్తోంది. తమన్నాతో గొడవ, మహేష్తో వాగ్వాదం, హిమజ విషయంలో అలీ ప్రవర్తనపై నెగెటివిటీ పెరగడం, టాస్క్ విషయంలో వరుణ్తో గొడవపడటం ఇలా చాలా విషయాల్లో అలీ తన టెంపర్ను కంట్రోల్ చేసుకోలేకపోయాడు. అందరితో కలిసే ప్రయత్నం చేస్తున్నా.. అతనికి గల కోపమే శత్రువుగా మారింది. మరి అలీరెజా ఎలిమినేట్ అయితే.. శివజ్యోతి, రవి, శ్రీముఖిల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలని కొందరు కామెంట్లు చేస్తున్నారు. నేటి ఎపిసోడ్లో ఏం జరుగనుందో తెలియాలంటే ఇంకొంచెం సమయం వేచి చూడాలి. -
బిగ్షాక్.. అలీరెజా అవుట్!
బిగ్బాస్ హౌస్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. హౌస్మేట్స్లో ఎవరు ఎప్పుడు నిష్క్రమిస్తారో ఎవరికీ తెలీదు. ప్రతీవారం దినదినగండంగా గడుపుతూ ఉంటారు. సోమవారం వచ్చిందంటే నామినేషన్స్ భయం.. ఆదివారం వచ్చిందంటే ఎలిమినేషన్ భయం. అయితే ఎలిమినేషన్లో ఉంటే.. కంటెస్టెంట్లకు రెండు విషయాలు తెలిసొస్తాయి. వారు ఎంత బలమైన కంటెస్టెంట్లన్న విషయం ఎలిమినేషన్ ప్రక్రియ చాటిచెబుతుంది. నామినేట్ అవుతూ.. ఎలిమినేట్ కాకుండా ఉంటే వారికి ఫాలోయింగ్ పెరుగుతూ ఉన్నట్లు లెక్క. ఇక నామినేషన్స్లోకి రాకుండా సేఫ్గేమ్ ఆడుతూ ఉంటే.. వారికి వాస్తవం బోధపడదు. బయట ఏం జరుగుతుందో? తమకు అనుకూల పరిస్థితులు ఉన్నాయో? ప్రతికూల పరిస్థితులు ఉన్నాయో అన్న విషయం తెలీదు. ఒక్కసారి కూడా నామినేషన్ ఫేస్ చేయకుండా ఉంటే.. అతడ్ని బలమైన కంటెస్టెంట్ అని చెప్పలేము. ప్రతీవారం నామినేట్ అయినా.. సేవ్ అవుతూ వచ్చేవారినే స్ట్రాంగ్ కంటెస్టెంట్లుగా భావిస్తాము. అయితే ఇంతవరకు ఆరువారాలు గడవగా.. ఐదు ఎలిమినేషన్స్ జరిగాయి. దీంట్లో భాగంగా హేమ, జాఫర్, తమన్నా, రోహిణి, అషూ ఇంటిని వీడిపోయారు. అయితే వీటన్నంటిలో ఏ ఒక్కసారి అలీరెజా నామినేషన్స్ను ఫేస్ చేయలేదు. ఇదే కారణంతో.. అలీరెజాను స్ట్రాంగ్ కంటెస్టెంట్గా అందరూ పరిగణించి ఏడో వారంలో నామినేట్ చేశారు. అయితే మొదటిసారి ఎలిమినేషన్ ఫేజ్లోకి వచ్చిన అలీ.. ఇంటిముఖం పట్టినట్లు సోషల్ మీడియా కోడై కూస్తోంది. అలీరెజా ఎలిమినేట్ అయినట్లు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మొదటి సీజన్లో.. కూడా ఇలాగే ప్రిన్స్ మొదటిసారి నామినేషన్ జోన్లోకి వచ్చి ఎలిమినేట్ అయ్యాడు. రెండో సీజన్లో దాదాపు ప్రతీవారం నామినేట్ అవుతూ.. అంతకంతకూ తన ఫాలోయింగ్ పెంచుకుంటూ విన్నర్గా నిలిచాడు కౌశల్. అయితే అలీరెజా ఒక్కసారి నామినేషన్ ఫేస్ చేసి.. ఎలిమినేట్ అయిపోయాడని కామెంట్లు వినిపిస్తున్నాయి. టాస్క్లు బాగానే ఆడుతున్నా.. తనకున్న టెంపర్, అగ్రెసివ్నెస్ మూలానే ఓట్లు తక్కువగా వచ్చాయని అందుకే ఎలిమినేట్ అయ్యారని నెటిజన్లు భావిస్తున్నారు. మరి నిజంగానే అలీ ఎలిమినేట్ అయ్యాడా? అన్నది అధికారికంగా తెలియాలంటే ఇంకొన్ని గంటలు ఆగాలి. -
బిగ్బాస్: రాహుల్ ఫ్లాష్బ్యాక్.. ప్చ్ పాపం!
బిగ్బాస్ ఆరోవారంలోకి ఎంటరైందో లేదో ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి రెడీ అయింది. గొడవలతో గరం మీద ఉన్న ఇంటి సభ్యులను కూల్ చేయడానికి బిగ్బాస్ ఓ ఫన్నీ గేమ్ ఆడించబోతున్నాడు. ఇక దొరికిందే చాన్సు అన్నట్టు అందరూ యాక్టింగ్ కుమ్మేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటిదాకా ఇంటి సభ్యులు చేసిన జర్నీని పక్కనపెట్టి వారితో కొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టించాడు బిగ్బాస్. అదే బిగ్బాస్ బిగ్ ఎక్స్ప్రెస్... ఇక్కడ వినోదాలకు మాత్రమే చోటు అన్న రీతిలో తాజా ప్రోమో కనిపిస్తోంది. ఆటలు, పాటలు, డాన్సులతో బిగ్బాస్ హౌస్ దద్దరిల్లడం ఖాయం అని కొందరు ప్రేక్షకులు భావిస్తున్నారు. ఇక ఇప్పటికే పునర్నవి-రవిని జంటగా చూసి కళ్లలో నిప్పులు పోసుకుంటున్న రాహుల్ ఊరికే ఉంటాడా అన్నది ఆలోచించాల్సిన విషయమే! సినిమాల్లోలాగా రాహుల్ దీన వదనంతో తన ఫ్లాష్బ్యాక్లో ఓ పిల్ల ఉండేదంటూ తన లవ్స్టోరీ ఇంటిసభ్యులకు చెప్తూ ఉంటే మధ్య మధ్యలో శ్రీముఖి పంచ్లు పేల్చుతోంది. అసలు రాహుల్ తన గతాన్ని చెబుతోంది పోయిన అమ్మాయిని తిరిగి దక్కించుకోవటం కోసమా.. కళ్ల ముందు కులాసాగా తిరుగుతున్న జంట మధ్య చిచ్చు పెట్టడానికా అన్న అనుమానం రాక మానదు. పైగా ఇప్పుడిప్పుడే పట్టాలెక్కుతున్న ప్రేమను ఎవరో తన్నేసుకుపోవడం సహించలేని రాహుల్ తన లైన్ క్లియర్ చేసుకోవడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ విషయాన్ని కాస్త పక్కనపెడితే ఇంట్లో మరో కొత్త జంట అలీ రెజా, శ్రీముఖిలు ప్రేమ గీతాలు పాడుకుంటున్నారు. అయితే ఇది టాస్క్లో భాగమని కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. మరి ఈ ప్రేమ జంటలను అడ్డుకునేందుకు ఇంటిసభ్యులు ఎవరైనా యత్నిస్తారా? లేక ఈ రెండూ జంటలూ హాయిగా డ్యూయెట్ సాంగ్ వేసుకుని ఎంజాయ్ చేస్తుంటాయా.. ఒకవేళ అదే జరిగితే రాహుల్ మొహం మాడిపోవడం ఖాయం. ఇంటి సభ్యుల ఎంజాయ్మెంట్ చూస్తుంటే నేటి ఎపిసోడ్ నిజంగానే జోరుగా కొనసాగనుంది అని అనిపించక మానదు. #BBExpress lo joyful ride ki ready avvandi 😀#BiggBossTelugu3 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/n0qySP7QtM — STAR MAA (@StarMaa) August 28, 2019 -
బిగ్బాస్.. ఏయ్ సరిగా మాట్లాడురా అంటూ అలీ ఫైర్
బిగ్బాస్లో ప్రతీవారం నామినేషన్స్,టాస్క్, ఎలిమినేషన్స్ జరగుతూనే ఉంటాయి. హౌస్లో ఉండే కంటెస్టంట్లు ఒక్కొక్కరుగా ఇంటిని వీడిపోతూ ఉంటారు. సోమవారం నాడు నామినేషన్ ప్రక్రియ అనంతరం ఆరోవారానికి గానూ.. పునర్నవి,రవికృష్ణ, మహేష్, హిమజ, రాహుల్,వరుణ్ సందేశ్ నామినేట్ అయ్యారు. ఇక నేడు బిగ్బాస్ ఓ టాస్క్ను ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ టాస్క్లో భాగంగా ఏయ్ సరిగా మాట్లాడు అంటూ రాహుల్పై అలీరెజా ఫైర్ అయ్యాడు. ఈ టాస్క్తో బిగ్బాస్ హౌస్ అంతా గందరగోళంగా మారినట్టు కనిపిస్తోంది. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య పెద్ద గొడవ జరగబోతోన్నట్లు తెలుస్తోంది. టాస్క్లో భాగంగా ఈ గొడవ జరగనుందా? మరేతర కారణంగానైనా జరగనుందా? అనే విషయం తెలియాలి. గతానికి భిన్నంగా వితికా ఏడ్వడం లేదు.. వరుణ్ కూడా తన భార్యను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపించడం లేదు. ఎందుకలా బిహేవ్ చేస్తున్నావ్, రూడ్గా బిహేవ్ చేస్తున్నావ్ అంటూ వితికానుద్దేశించి వరుణ్ చెప్పడం.. ‘నా దగ్గరికి రావొద్దంటోన్న’ అంటూ వితికా తిరిగి అనడం.. ఇలా మాటామాట పెరిగి వరుణ్ అసహనానికి గురైనట్టు కనిపిస్తోంది. కోపంలో కాఫీని విసిరేయడం లాంటివి ప్రోమోలో ఆసక్తిని రేపుతున్నాయి. మరి వారిద్దరి మధ్య గొడవ ఎందుకు వచ్చింది? అనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ ప్రసారమయ్యేవరకు ఆగాలి. -
బాబా భాస్కర్-అలీ వ్యవహారం ముదురుతోందా?
బిగ్బాస్ ఇంట్లో గొడవలు ముదురుతున్నాయి. అలాగే సోషల్ మీడియాలో వారి ఫాలోవర్స్ మధ్య వాడివేడిగా చర్చలు జరగుతున్నాయి. బిగ్బాస్ హౌస్లో ముందు నుంచీ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన బాబా భాస్కర్ గ్రాఫ్ క్రమక్రమంగా తగ్గిపోతున్నట్లు అనిపిస్తోంది. జాఫర్ ఉన్నంత కాలం ఆయనతో సరదాగా కామెడీలు చేస్తూ, ఆటపాటలతో ఎంజాయ్ చేసిన బాబాకు రానురాను గడ్డుపరిస్థతి ఎదురయ్యేట్టు కనిపిస్తోంది. జాఫర్ ఎలిమినేట్ అయ్యాక కుంగిపోయిన బాబా.. అనంతరం శ్రీముఖి, మహేష్లతో క్లోజ్ అయ్యాడు. ఎప్పుడు చూసిన మహేష్ లేదా శ్రీముఖితో ఉంటూ.. మిగతా వారిని గ్రూప్ అంటూ కామెంట్లు చేస్తూ ఉంటే వింటూ ఉంటున్నాడు. సీక్రెట్ టాస్క్లో భాగంగా అలీరెజా, పునర్నవిలు కనిపించకుండా పోయినప్పుడు బాబా భాస్కర్, హిమజలు వారిద్దరు రాకపోయినా తమకేం ఇబ్బంది లేదన్న సంగతి గుర్తుండే ఉంటుంది. అయితే అదే విషయాన్ని గుర్తించుకుని అలీ రెజా బాబాను నామినేట్ చేశాడని, కెప్టెన్సీ టాస్క్లో బాబా అంతగా సహాయం చేసినా అది గుర్తుంచుకోలేదని అలీరెజాను టార్గెట్ చేస్తున్నారు బాబా ఫాలోవర్స్. శ్రీముఖి, మహేష్ మాటలకు ఇన్ఫ్లూయెన్స్ అవుతూ.. వారితోనే ఓ గ్రూప్గా ఉంటూ మిగతా వారి గురించి కామెంట్లు చేస్తుంటే వింటూ ఉంటాడు, ఏదైనా గొడవలు జరిగితే సేఫ్ గేమ్ ఆడుతూ.. ఏ స్టాండ్ సరిగా తీసుకోకుండా ఉంటాడని ఓ వర్గం బాబాను టార్గెట్ చేస్తోంది. మొత్తానికి మంచి వాడిగా, స్ట్రాంగ్ కంటెస్టెంట్గా పేరు తెచ్చుకున్న బాబా భాస్కర్.. నామినేషన్స్లోకి వస్తే కంగారుపడటం, బాధపడటం ఆయన ఫాలోవర్స్కు మింగుడుపడటం లేదు. బాబా భాస్కర్ను ఏడిపించేలా చేస్తారా? అంటూ ఆయన అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఇక ఈ వారం బిగ్బాస్ హౌస్లో కెప్టెన్గా ఎవరు ఎన్నికవుతారో చూడాలి. మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం క్లిక్ చేయండి -
బిగ్బాస్.. అలీరెజాపై మహేష్ ఫైర్
బిగ్బాస్ హౌస్ ఐదో వారానికి గానూ జరిగిన నామినేషన్ ప్రక్రియ పెద్ద గొడవకు దారి తీసినట్టు కనిపిస్తోంది. కెప్టెన్ అయిన కారణంగా అలీరెజాకు బిగ్బాస్ ప్రత్యేక అధికారాన్ని ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇంటి సభ్యుల్లోంచి నలుగురు పేర్లను సూచించమనడం.. అందులో ఒకర్ని నేరుగా నామినేట్ చేసే అధికారాన్ని అలీరెజాకు ఇవ్వడం.. దీంతో బాబా భాస్కర్ను నామినేట్ చేస్తున్నట్లు బిగ్బాస్కు అలీరెజా తెలపడం తెలిసిందే. బాబా భాస్కర్ మహేష్ మాటలతో ఇన్ఫ్లూయెన్స్ అవుతున్నాడని శ్రీముఖి, అలీరెజా, వరుణ్ సందేశ్లు మాట్లాడుకున్నారు. అయితే ఇదే విషయంపై నేడు హౌస్లో చర్చకు రానున్నట్లు తెలుస్తోంది. వీకెండ్లో అందరికీ ఫన్నీ అవార్డులు ఇచ్చిన నాగ్.. పుల్లలు పెట్టే అవార్డును మహేష్కు ఇచ్చిన సంగతి తెలిసిందే. తాను బాబా భాస్కర్ను నామినేట్ చేయడం.. దీనికి సంజాయిషీ ఇచ్చుకుంటున్న సందర్భంలో మహేష్ మధ్యలో రావడంతో పుల్లలు పెట్టకు అంటూ అలీరెజా అనడంతో మహేష్ వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. మరి వీరిద్దరి మధ్య జరిగే గొడవ ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి. మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం క్లిక్ చేయండి -
బిగ్బాస్: గుడ్ల కోసం కొట్టుకున్నారుగా..!
బిగ్బాస్ నాల్గవ వారంలోకి అడుగు పెట్టింది. తాజా ఎపిసోడ్లో బిగ్బాస్ ఇంటిసభ్యుల చేత కెప్టెన్సీ టాస్క్ ఆడించారు. అందులో భాగంగా ఇంటి సభ్యులను రెండు గ్రూపులుగా విడగొట్టగా వారి మధ్య ఐకమత్యం కనిపించలేదు. ఎవరికి వారే ఒంటరిగా టాస్క్లు గెలవడానికి పోరాడారు. టాస్క్లో గెలుపొందిన రాహుల్కు పునర్నవి గోరుముద్దలు తినిపించింది. ఎత్తుకు పై ఎత్తులతో సాగిన ఈ గేమ్లో శ్రీముఖి రాహుల్పై ఫైర్ అయింది. ‘నిన్ను నమ్మి టీంలోకి తీసుకున్నా. నన్ను మోసం చేస్తే నీతో జీవితంలో మాట్లాడను’ అని రాహుల్ పై సీరియస్ అయింది. అయితే ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడిలా రాహుల్.. శ్రీముఖికి పాద నమస్కారం చేసి మరీ తన దగ్గర ఉన్న గుడ్డును కొట్టేశాడు. దీంతో తెల్లముఖం వేయడం శ్రీముఖి వంతయింది. టాస్క్ ప్రారంభంలో అమ్మాయిలు హవా చూపించినప్పటికీ చివరికి ఆట అబ్బాయిల చేతిలోకి వెళ్లిపోయింది. కెప్టెన్సీ టాస్క్లో భాగంగా బిగ్బాస్ ‘నేనే రాజు-నేనే మంత్రి’ గేమ్ ఆడించారు. ఇందుకుగానూ ఇంటి సభ్యులను విక్రమపురి (రెడ్ టీమ్), సింహపురి (బ్లూ టీమ్)లుగా విడగొట్టాడు. రెడ్ టీమ్కు సేనాపతిగా శ్రీముఖి, బ్లూ టీమ్ సేనాపతిగా హిమజలను నియమించారు. రెడ్ టీమ్ సేనాపతి శ్రీముఖి.. అలీ, రాహుల్, మహేశ్, అషూరెడ్డిలను సైనికులుగా ఎంచుకుంది. బ్లూ టీమ్ సేనాపతి హిమజ.. వరుణ్, పునర్నవి, బాబా భాస్కర్, రవిలను సైనికులుగా సెలక్ట్ చేసుకుంటుంది. ఆట విషయానికొస్తే.. రెడ్ టీం దగ్గర ఎరుపు రంగు జెండాలు, బ్లూ టీం దగ్గర నీలం రంగు జెండాలు ఉంటాయి. రెడ్ టీం.. బ్లూ టీం రాజ్యంలో జెండాలు పాతాలి. అదే విధంగా బ్లూ టీం.. రెడ్ టీం రాజ్యంలో జెండాలను ఉంచాలి. పొరుగు రాజ్యం పాతిన జెండాలను నిర్దాక్షిణ్యంగా తీసి పాడేసే హక్కు సంబంధిత రాజ్యానికి ఉంటుంది. బజర్ మోగగానే హోరాహోరీగా సాగిన ఈ ఆట రాను రానూ రసవత్తరంగా మారింది. మొదట జెండాల కోసం కుస్తీ పడ్డా తరువాత అందరి దృష్టి డ్రాగన్ ఎగ్స్పైకే వెళ్లింది. గుడ్డు సంపాదించుకున్న వారికి ప్రత్యేక ప్రయోజనాలతో పాటు నేరుగా రెండో రౌండ్కు వెళ్లే అవకాశం ఉండటమే ప్రధాన కారణం. ఇరు రాజ్యాల సైనికులు ఎంతసేపూ గుడ్డు మీద కన్నేయడంతో రెండు టీమ్లు తదుపరి లెవల్కు వెళ్లలేదు. ఆట ప్రారంభానికి ముందే డ్రాగన్ ఎగ్స్ సంపాదించుకున్న వితిక, రోహిణి, శివజ్యోతిలు వాటిని కాపాడుకోడానికి విశ్వప్రయత్నం చేసినప్పటికీ గుడ్లను జారవిడ్చుకుని కెప్టెన్సీ టాస్క్ మధ్యలోనే తప్పుకున్నారు. ఇక రెడ్ టీం.. జెండాలు కాపాడుకున్నా, సైనికులు లేక.. బ్లూ టీమ్ అటు జెండాలు, ఇటు సైనికులు రెండూ కోల్పోవడంతో తర్వాతి లెవల్కు వెళ్లే అవకాశాన్ని కోల్పోయాయి. వ్యూహాత్మకంగా సాగిన ఈ గేమ్లో చివరాఖరికి రాహుల్, రవి, అలీ రెజాలు డ్రాగన్ ఎగ్స్ దక్కించుకుని నెక్స్ట్ లెవల్కు వెళ్లారు. కెప్టెన్సీ టాస్క్లో ఈ ముగ్గురూ తలపడనున్నారు. కూల్గా ఉండే రవి, అతిగా ఆవేశపడే అలీ, నవ్వుతూనే ఎత్తులు వేసే రాహుల్.. ఈ ముగ్గురిలో ఎవరు కెప్టెన్గా నిలుస్తారో చూడాలి..! -
బిగ్బాస్.. అలీ రెజాపై నాగ్ ఫైర్
బిగ్బాస్ ఇచ్చిన ‘దొంగలున్నారు జాగ్రత్త’ అనే టాస్క్ రక్తపాతాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ టాస్క్లో అలీ రెజా, హిమజ మధ్య జరిగిన గొడవ కూడా పెద్ద చర్చకు దారి తీసింది. ఈ వ్యవహారంలో తలదూర్చిన తమన్నాపై కూడా అలీ రెజా విరుచుకుపడ్డాడు. ఈ టాస్క్ పెట్టిన చిచ్చు అంత తొందరగా చల్లారలేదు. చివరకు హిమజ.. అలీ రెజా కాళ్లు పట్టుకుని ఏడ్చే వరకు వెళ్లింది. తన నుంచి సారీ మాత్రమే ఆశించానని, కాళ్లు పట్టుకోమని అడగలేదని అలీ రెజా వివరించే ప్రయత్నం చేశాడు. అయితే ఈ గొడవలో హిమజ పట్ల దురుసుగా ప్రవర్తించాడు. కొడతాను అని బెదిరించినట్లు పదేపదే వ్యాఖ్యలు చేశాడు. అయితే ఇదే వ్యవహారాన్ని వీకెండ్లో నాగ్ ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అలీ రెజాపై నాగ్ విరుచుకుపడ్డట్లు ఓ ప్రోమోను విడుదల చేశారు. తనకు డ్రెస్సింగ్ ఉంది కానీ కామన్సెన్స్ లేదంటూ అలీపై ఫైర్ అయ్యాడు. ఇంతవరకు హౌస్మేట్స్ చేసిన తప్పులను నవ్వుతూ సరిచేసేందుకు ప్రయత్నించిన నాగ్.. మొదటిసారిగా ఫైర్ అయినట్లు కనబడుతోంది. మరి ఈ వ్యవహారంలో నాగ్ ఇచ్చిన తీర్పు ఏంటో? రవికృష్ణకు గాయం కావడం, అతన్ని ప్రోత్సహించిన శ్రీముఖి, ఐడియా ఇచ్చిన మహేష్ను నాగ్ ఏవిధంగా మందలించాడో చూడాలి. ఇక ఇంటి నుంచి బయటకు వెళ్లే మూడో వ్యక్తి ఎవరో రేపు తెలిసిపోనుంది. అయితే సోషల్ మీడియా ట్రెండింగ్ ప్రకారం తమన్నా సింహాద్రి ఎలిమినేట్ కానుందని తెలుస్తోంది. మరి ఇది నిజం అవుతుందో కాదో తెలియాలంటే ఇంకొన్ని గంటలు ఎదురుచూడాలి. -
బిగ్బాస్.. శ్రీముఖికి షాక్!
ఇప్పటివరకు చిన్నపాటి గొడవలు, మాటల యుద్ధం వరకే సాగిన ఆట హింసాత్మకంగా మారింది. దొంగలున్నారు జాగ్రత్త టాస్క్లో రవికృష్ణ చేతికి గాయం అయి రక్తం కారింది. దీంతో అంతా శ్రీముఖి వల్లే జరిగింది అంటూ అందరూ తనని విమర్శించారు. ఈ విషయాన్ని బిగ్బాస్ కూడా సీరియస్గా తీసుకుని శ్రీముఖికి శిక్ష విధించాడు. ఇక అంతకు ముందేమో హిమజ, అలీకి మధ్య గొడవ జరగగా..హిమజ.. అలీ కాళ్లు పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో బిగ్బాస్ హౌస్ మరింత హీటెక్కింది. కాళ్లపై పడి క్షమాపణ.. కనికరించని అలీ టాస్క్లో భాగంగా ఇంట్లో దొంగలకు పట్టపగలే చుక్కలు చూపించారు తికమకపురం గ్రామస్తులు. దొంగలు, పోలీసులు, లాయర్.. ఎవరైనా సరే ఎంతో కొంత ముట్టు చెబితేనే గ్రామస్తులు వారికి కనీస సదుపాయాలు కల్పిస్తున్నారు. ఈ క్రమంలో హిమజ కిచెన్లో దూరి నీళ్లు కావాలంది. అలీ రెజా వచ్చి.. ముందు డబ్బులు ఇచ్చి తాగు అన్నాడు. అయితే హిమజ అవేవీ వినిపించుకోకుండా వెళ్లి నీళ్లు తాగేసి ఎంచక్కా వెళ్లిపోసాగింది. తను డబ్బులు ఇచ్చేలా లేదు అని భావించిన అలీ డబ్బు తీసుకోడానికి హిమజ ప్యాంటు జేబులో చేయి పెట్టాడు. దీంతో ఇబ్బందికి గురైన హిమజ సోఫాలో పడిపోయి.. అలీ ముఖాన్ని రెండుసార్లు తన్నింది. దీంతో నన్ను తంతావా అంటూ అలీ.. అక్కడ చేయి ఎలా పెడతావంటూ హిమజ చాలాసేపు గొడవ పడ్డారు. ఎంత వాదించిన లాభం లేదనుకున్న హిమజ ‘నన్ను నేను రక్షించే క్రమంలో అలా తన్నానే తప్ప కావాలని కాదు. సారీ..’ అంటూ అలీ కాళ్లు పట్టుకుని క్షమాపణలు కోరింది. అయినప్పటికీ అలీ శాంతించలేదు. ‘నిన్ను కాళ్లు పట్టుకోమని నేను అడిగానా..? ఒక సారీ చెప్తే సరిపోయేది కదా’ అని విసుగుచెందాడు. ‘ఇప్పటికీ నన్ను నువ్వు అర్థం చేసుకోవట్లేదు’ అంటూ హిమజ కన్నీటి పర్యంతం అయింది. ఈ గొడవలో దూరి పెద్దమనిషిలా సర్ది చెప్పాలనుకున్న తమన్నాపై అలీ విరుచుకుపడ్డాడు. మధ్యలోకి రాకు, డబుల్ గేమ్ ఆడొద్దు.. అంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఇక వారిద్దరూ కాసేపు చర్చించుకుని కూల్ అయిపోగా.. దొంగలు మాత్రం దోచుకోడానికి ఎప్పుడు సందు దొరుకుతుందా అన్నట్టు దొంగ చూపులు చూస్తున్నారు. వస్తువులను కొట్టేసినంత సులువుగా నిధిని సాధించలేకపోతున్నారు. ఇదిలా ఉండగా జైల్లో పడిన శ్రీముఖి పోలీసులతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని బయటికి వచ్చింది. వచ్చీ రాగానే వరుణ్ సందేశ్ను మాటలతో బుట్టలో పడేసి చాకచక్యంగా అతడి జేబులో ఉన్న మొత్తం డబ్బుని కొట్టేసి ట్రంకు పెట్టెలో పడేసింది. దీంతో షాక్ అవటం ఇంటిసభ్యుల వంతయింది. ఎలిమినేషన్లో శ్రీముఖి దాచి దాచి దొంగలపాలు అవడం ఇష్టం లేని గ్రామస్తులు నిధి చుట్టూ కాపలా పెంచారు. ఏదిఏమైనా నిధిని సంపాదించాల్సిందే అని నిర్ణయించుకన్న దొంగల ముఠా అందుకు స్కెచ్ వేసుకుంది. ప్లాన్లో భాగంగా శ్రీముఖి డంబెల్తో నిధి ఉన్న గాజు గ్లాస్ను పగలగొట్టి సాహసం చేసింది. అయితే శ్రీముఖిని మిగతా సభ్యులు పక్కకు లాగేయటంతో గ్లాస్ పగలగొట్టి డబ్బులు తీయమంటూ రవికి ఆదేశాలిచ్చింది. వెంటనే రవి ఏదీ ఆలోచించకుండా చేతితో గ్లాసు పగులగొట్టాడు. దీంతో అతని చేయికి దెబ్బ తగిలి రక్తం కారటాన్ని గుర్తించిన బిగ్బాస్ డాక్టర్ను పంపి రవికి వైద్యం అందించారు. అయితే ఇదంతా శ్రీముఖి వల్లే జరిగిందంటూ రాహుల్, వరుణ్, వితికా మాటల దాడి చేయగా శ్రీముఖి పక్కకు వెళ్లి ఏడ్చింది. గాయంతో బాధపడుతున్న రవికి బిగ్బాస్.. టాస్క్ల నుంచి తనకు ఉపశమనం తీసుకోవచ్చు అని ఆఫర్ చేసినప్పటికీ అతను సుతిమెత్తంగా తిరస్కరించాడు. ఇంటిలో వస్తువులను కదల్చకూడదన్న నిబంధనను ఇంటిసభ్యులు ఉల్లంఘించినందుకు, ఇంటిలో హింస చోటు చేసుకున్నందుకు టాస్క్ను బిగ్బాస్ రద్దు చేశారు. హింసకు కారణమైన శ్రీముఖిని తర్వాతి వారం నేరుగా ఎలిమినేషన్స్కు పంపిస్తున్నట్లుగా బిగ్బాస్ ప్రకటించారు. మరోవైపు అలీ రెజా, పునర్నవిలకు బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్ ఇచ్చారు. దీన్ని విజయవంతంగా పూర్తి చేస్తే తర్వాతి వారం ఎలిమినేషన్ నుంచి సేఫ్ అవుతారని బిగ్బాస్ పేర్కొన్నాడు. ఈ టాస్క్లో భాగంగా అలీ రెజా రాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో చడీచప్పుడు చేయకుండా సీక్రెట్ గదిలోకి వెళ్లగా, పునర్నవి ఉదయంపూట సీక్రెట్ గదిలోకి ప్రవేశించింది. అలీరెజా ఆ గదిలో ఏం చేయాలో తోచక కాసేపు కెమెరా ముందు కుప్పిగంతులు వేశాడు. ఇక 18వ రోజు అలీ రెజా, పునర్నవి కనిపించకపోవటంతో ఇంటి సభ్యులు కాస్తంత కంగారు పడ్డా తర్వాత లైట్ తీసుకున్నారు. పైగా వారిద్దరూ తిరిగి ఇంట్లోకి రావాలంటే ఇంటిసభ్యులు కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుందని బిగ్బాస్ తెలిపాడు. ఇందుకు హిమజ, బాబా భాస్కర్లు వ్యతిరేకించారు. త్యాగాల విషయానికొస్తే.. ఇంటి సభ్యులు వారం రోజులపాటు పాదరక్షలు లేకుండా తిరగాలి. మరో వారం రోజులు పెరుగును తీసుకోకూడదు. మరి ఇందుకు ఇంటి సభ్యులు ఏ విధంగా స్పందిస్తారు.. అలీ, పునర్నవి మళ్లీ ఇంటికి తిరిగొస్తారా అనేది చూడాలి..! -
అషూకు సిగ్గు, శరం లేదు : తమన్నా
డైమండ్ టాస్క్.. కింగ్లా మారడం.. ఇంట్లో అధికారం చెలాయించడం అనే ఆటలో పెద్ద రచ్చ జరిగింది. ఆడవారి వేషం వేయలేనని జాఫర్, వరుణ్ సందేశ్లు ఎదురుతిరగడం.. అలీ రెజా, అషూ రెడ్డిపై తమన్నా ఘాటు వ్యాఖ్యలు.. వరుణ్ సందేశ్ ఇంటి మొదటి కెప్టెన్గా ఎన్నిక కావడం నేటి ఎపిసోడ్లో హైలెట్గా నిలిచాయి. సైక్లింగ్ టాస్క్లో చెత్తగా పర్ఫామెన్స్ చేసిన వారేవరు అని బిగ్బాస్ అడగ్గా వరుణ్ తనంతట తానే లేవడంపై హిమజ మాట్లాడటంతో వితికా ఫైర్ అయింది. ఇక విషయంపై అలీ రెజా వచ్చి హిమజతో మాట్లాడటంతో మరింత రచ్చ జరిగింది. పవర్ గేమ్ టాస్క్ బజర్ మోగిన తరువాత ఎవరైతే.. డైమండ్ను చేజిక్కించుకుంటారో వారికి ఇంటిపై పెత్తనం చేసే అధికారం వస్తుందని తెలిపాడు. మళ్లీ బజర్ మోగేంతవరకు ఆ హౌస్మేట్ చెప్పినట్లే మిగతా ఇంటిసభ్యులు పాటించవలసి ఉంటుందని తెలిపాడు. అయితే మొదటి అవకాశంలో వరుణ్ సందేశ్ డైమండ్ను పట్టుకుని కింగ్లా మారిపోయాడు. ఈ ప్రాసెస్లో వితికాకు, శివజ్యోతికి గాయాలయ్యాయి. అయితే తన మంత్రిగా బాబా భాస్కర్ను వరుణ్ ఎంచుకున్నాడు. ఇక తన బట్టలను ఉతకవలసిందిగా హిమజను.. బెడ్రూంను సరిగా సర్దమని శ్రీముఖి, మహేష్లను.. నాగిని డ్యాన్స్ వేయాలని తమన్నాను.. ఆమెకు సహాయం చేయాల్సిందిగా బాబా భాస్కర్ను ఆదేశించాడు. రంగ రంగస్థలాన పాటను రాహుల్ ఆలపించగా.. జాఫర్, పునర్నవిలు చేసిన డ్యాన్స్ ఆకట్టుకుంది. అలీ రెజా విలన్.. తమన్నా హీరోయిన్ రెండో బజర్ మోగిన వెంటనే పరిగెత్తిన అలీ రెజా.. డైమండ్ను పట్టే క్రమంలో శివజ్యోతిని నెట్టేశాడు. అయితే కిందపడిన శివజ్యోతిని లేపిన అనంతరం ఆమెనే వజ్రాన్ని తీసుకొమ్మన్నాడు. అయితే ఆటలో ఇవన్నీ సహజమేనని.. అలీ రెజాకు శివజ్యోతి కిరీటాన్ని తొడిగింది. దీంతో.. మగవారందరినీ ఆడవారిగా రెడీ కావాలని అలీ ఆదేశించాడు. ఇక ఈ టాస్క్లో పాల్గొనలేమని జాఫర్, వరుణ్ సందేశ్, వితికా షెరు, తమన్నాలు పేర్కొన్నారు. వారంతా సైలెంట్ కూర్చొని చూస్తుండగా.. మిగతా వారంతా ఆడుతూ పాడుతూ కింగ్(అలీ రెజా)ను ఎంటర్టైన్ చేశారు. ఇలా జరుగుతూ ఉండగా.. అలీ రెజాపై తమన్నా ఫైర్ అయింది. మాటామాటా పెరిగి పెద్ద రచ్చగా మారింది. తనేమీ మెగాస్టార్, సూపర్స్టార్ కాదనీ, బాడీ ఉన్నంత మాత్రాన సూపర్స్టార్ కాలేరని అలీ రెజానుద్దేశించి తమన్నా ఘాటుగా విమర్శించింది. తనను సూపర్స్టార్ కాకుండా అడ్డుకుంటానని తమన్నా పేర్కొంది. ఇక అషూరెడ్డిని సైతం ఘోరంగా విమర్శించింది. అందంగా ఉన్నావు.. సిగ్గు, శరం లేకుండా అక్కడ(అలీ రెజా పక్కన) ఎంత బాగా కూర్చున్నావంటూ అషూ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. దీంతో హౌస్మేట్స్ అందరూ తమన్నా తీరును తప్పుబట్టారు. అలీ రెజా విలన్ అంటూ.. తాను హీరోయిన్ అంటూ జాఫర్తో తమన్నా చెప్పుకొచ్చింది. మొదటి కెప్టెన్గా వరుణ్ సందేశ్ మూడో బజర్ మోగాక.. హిమజ డైమండ్ను మొదటగా పట్టుకుంది. ఇంటి సభ్యులు తమ గురించి పరిచయం చేసుకోవాలని ఆదేశించింది. మొదటగా తన గురించి చెప్పాలని తమన్నాను ఆదేశించగా.. తన లైఫ్ గురించి చెప్పుకొచ్చింది. అనంతరం బాబా భాస్కర్ వచ్చి.. తనకు కోపం ఎక్కువగా ఉండేదని, దానివల్ల ఎన్నో అవకాశాలను కోల్పోయానని తన గురించి చెప్పుకొచ్చాడు. ఇక ఈ టాస్క్లో డైమండ్ను చేజిక్కించుకుని రాజులుగా మారిన వరుణ్ సందేశ్, అలీ రెజా, హిమజలను మొదటి కెప్టెన్ అయ్యే అవకాశం వచ్చింది. మెజార్టీ సభ్యుల ఓటింగ్తో వరుణ్ సందేశ్ బిగ్బాస్ హౌస్ మొదటి కెప్టెన్ ఎన్నికయ్యాడు. మరి కెప్టెన్గా ఎన్నికైనందున ఎలిమినేషన్లో వరుణ్ సందేశ్ ఉండకపోవడంతో.. మిగిలిన ఏడుగురిలో ఎవరు ఇంటిని వీడిపోనున్నారో చూడాలి. -
పసుపు-కుంకుమ స్టార్.. అలీ రెజా
బిగ్బాస్ మూడో సీజన్లో పదకొండో కంటెస్టెంట్గా ప్రముఖ నటుడు అలీ రెజా ఎంట్రీ ఇచ్చాడు. బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి.. అటుపై ఇక్కడ పసుపు-కుంకుమ సీరియల్తో ఫేమస్ అయ్యాడు. సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తూ.. వచ్చిన పాత్రలు చేసుకుంటూ వెళ్తున్నాడు అలీ రెజా. ధృవ సినిమాలో రామ్ చరణ్ స్నేహితుడిగా పోలీస్ పాత్రలో నటించాడు. గాయకుడు, సినీ మహల్, చందమామలో అమృతం అనే చిత్రాల్లో నటించిన అలీ.. బిగ్బాస్ హౌస్లోకి ఎంటరయ్యాడు. మరి బిగ్బాస్లో వీక్షకులను ఎంటర్టైన్ చేసి.. క్రేజ్ను సంపాదించుకుని స్టార్గా ఎదుగుతాడా? అన్నది చూడాలి. -
నవ్వుల నవాబ్
అలీ రజీత్, అజీజ్, సూఫీ ఖాన్, సమైరా, ఫరాఖాన్ ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘హైదరాబాద్ నవాబ్స్ 2’. 2006లో వచ్చిన ‘హైదరాబాద్ నవాబ్’ సినిమాకు ఇది సీక్వెల్. ఆర్.కె. స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘హైదరాబాద్ నవాబ్స్ 2’ ఈ శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో దర్శక–నిర్మాత ఆర్.కె. మాట్లాడుతూ– ‘‘రియల్ ఎస్టేట్ కథాంశంతో తీసిన చిత్రమిది. పాత బస్తీ నేపథ్యంలో ఉంటుంది. రెండు గంటల పాటు మా సినిమా ప్రేక్షకుల్ని నవ్విస్తుంది. హైదరాబాద్ లోకల్ కల్చర్ను బేస్ చేసుకొని తీసిన ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు. ‘‘ధృవ సినిమాలో చిన్న పాత్ర చేశా.. టీవీ సీరియల్స్లో నటించాను. ‘హైదరాబాద్ నవాబ్స్ 2’లో నటించడం ఆనందంగా ఉంది’’ అన్నారు అలీ రజీత్. ‘‘ఈ సినిమాకు కథే హీరో. ఇందులో కామెడీ మెయిన్ హైలైట్గా ఉంటుంది’’ అన్నారు అజీజ్. ‘‘ఇందులోని పాటలన్నీ బాగున్నాయి. కుటుంబంతో కలిసి చూడదగ్గ సినిమా ఇది’’ అన్నారు ఫరాఖాన్, సూఫీ ఖాన్, సమైరా, మ్యూజిక్ డైరెక్టర్ రాజేష్ పాల్గొన్నారు. -
పవర్ ఆఫ్ రిలేషన్షిప్
అలీ రెజా, సీతానారాయణన్ జంటగా ఎన్.లక్ష్మి నంద దర్శకత్వంలో మువ్వ సత్యనారాయణ నిర్మించిన చిత్రం ‘రామ్ – ఎన్.ఆర్.ఐ’. పవర్ ఆఫ్ రిలేషన్షిప్.. అన్నది ఉపశీర్షిక. ఈ సినిమా టీజర్ను హైదరాబాద్లో విడుదల చేశారు. దర్శక– నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘మా ఇద్దరికీ ఇది తొలి చిత్రం. ఈ సినిమాలో కుటుంబ విలువలకు ప్రాధాన్యం ఇచ్చాం. సామాజిక స్పృహతో మంచి మెసేజ్తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ను జోడించాం. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచే ్చలా ఉంటుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. త్వరలో సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, నిర్మాతలు టి. ప్రసన్నకుమార్, సాయివెంకట్, మేకా రమేష్, నటీనటులు విజయ్చందర్, గీతాంజలి తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రావణ్, కెమెరా: నాగబాబు కర్ర.