appeal
-
సునీతా విలియమ్స్ను తీసుకురండి: ట్రంప్
వాషింగ్టన్: నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి తీసుకురావాలంటూ టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని ఆ యన తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో పంచుకున్నారు. ‘బైడెన్ ప్రభుత్వం అంతరిక్ష కేంద్రంలో వదిలేసిన ఇద్దరు ధైర్యవంతులైన వ్యోమగాములను తీసుకురావాలని మస్క్ ను కోరుతున్నా. సునీత, విల్మోర్ కొన్ని నెలలుగా అంతరిక్ష కేంద్రంలో ఎదురు చూస్తున్నారు. వీలైనంత త్వరగా వ్యోమగాములను తీసుకురావాలి. గుడ్ల క్ ఎలాన్’అని ట్రంప్ తన పోస్టులో పేర్కొన్నారు. దీనికి మస్క్ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘‘మేం తీసుకొస్తాం. బైడెన్ ప్రభుత్వం ఇంతకాలం వారిన లా వదిలేయడం దారుణం’’అని మస్క్ వ్యాఖ్యానించారు. పది రోజుల మిషన్ కోసం సునీత, విల్మోర్ 2024 జూన్ 5న బోయింగ్ సంస్థకు చెందిన స్టార్లైనర్ వ్యోమనౌకలో అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. అయితే అక్కడికి వెళ్లాక వ్యోమనౌకలోని థ్రస్టర్ పనిచేయకపోవడం, హీలియం లీక్ కావడంతో వ్యోమగాములను అక్కడే వదిలేసి స్టార్లైనర్ క్యాప్సుల్ మాత్రం సెపె్టంబర్ 7న తిరిగి భూ మి మీదకొచి్చంది. అంతరిక్షంలో ఎక్కువకాలం ఉండటంతో ఆమె చాలా బరువు తగ్గినట్లు ఇటీవల బహిర్గతమైన ఫొటోల ద్వారా వెల్లడైంది. తన ఆరోగ్యంపై వస్తున్న ఊహాగానాలను గతేడాది నవంబర్లో సునీత తోసిపుచ్చారు. తన శరీరం కొద్దిగా మారిందని, అదే బరువుతో ఉన్నానని చెప్పారు. ఒకవేళ మార్చి నెలాఖరులో వీళ్లిద్దరూ భూమికి తిరిగొస్తే అనుకోకుండా అక్కడే ఉండిపోయి 300 రోజులపాటు అంతరిక్షంలో గడిపిన వ్యోమగాములుగా మరో రికార్డ్ నెలకొల్పుతారు. ఎలా నడవాలో గుర్తుంచుకునేందుకు ప్రయత్నిస్తున్నా: సునీత ఇప్పటికే 7 నెలలుగా అంతరిక్ష కేంద్రంలో ఉండిపోయిన సునీత తాను చదివిన పాఠశాల విద్యార్థులతో సోమవారం మాట్లాడారు. వర్చువల్గా జరిగిన ప్రశ్నోత్తరాల సెషన్లో సునీతను విద్యార్థులు అత్యల్ప గురుత్వాకర్షణ స్థితిపై ప్రశ్నలు సంధించారు. ‘‘ఈత కొట్టడం, ఎగరడం వంటి అనుభూతిని మాత్రమే ఆస్వాదిస్తున్నా. ఎక్కువకాలం అంతరిక్షంలో ఉండటం వల్ల తన శరీరం అనేక సర్దుబాట్లకు లోనైంది. చాలాకాలంగా నేను నడవలేదు. కూర్చోలేదు. పడుకోలేదు. నడవడం ఎలా ఉంటుందో గుర్తుంచుకోవడానికి ప్రయత్నిస్తున్నా’’అని తెలిపారు. ‘‘ఎలాగోలా తిరిగి రావడానికి మరో నెలరోజుల సమయం పడుతుందనుకున్నా. కానీ ఇన్ని రోజులైనా ఇంకా ఉండాల్సి రావడం కాస్త ఇబ్బందిపెడుతోంది. వృద్ధాప్యంలో ఉన్న నా తల్లితో వీలైనంతసేపు మాట్లాడుతున్నా. అంతరిక్ష కేంద్రంలో బిజీ షెడ్యూల్, కుటుంబంతో క్రమం తప్పకుండా మాట్లాడటం వల్ల తాను ఒంటరిగా ఉన్నట్లు భావించట్లేను’’అని సునీత చెప్పారు. -
‘ఆర్జీకర్’ కేసు..బెంగాల్ హైకోర్టు కీలక నిర్ణయం
కోల్కతా:పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతా ఆర్జీకర్ కాలేజీ ట్రైనీ డాక్టర్పై హత్యాచారం కేసులో అప్పీల్ను కోల్కతా హైకోర్టు బుధవారం(జనవరి22) విచారించింది. బెంగాల్ ప్రభుత్వం వేసిన ఈ అప్పీల్పై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. దోషి సంజయ్రాయ్ శిక్షపై అందరి వాదనలు విన్నాకే అప్పీల్ను పరిగణలోకి తీసుకుంటామని హైకోర్టు తెలిపింది.సంజయ్రాయ్కి శిక్ష సరిపోదని బెంగాల్ ప్రభుత్వం వేసిన పిటిషన్పై సీబీఐ, బాధితురాలి కుటుంబం, దోషి వాదనలు విన్న తర్వాతనే విచారణ ప్రారంభిస్తామని హైకోర్టు పేర్కొంది. ఈ విషయంలో సోమవారం వాదనలు వింటామని హైకోర్టు తెలిపింది. అయితే ఈ కేసులో అప్పీల్ వేసే అధికారం తమకే ఉందని, బెంగాల్ ప్రభుత్వానికి లేదని సీబీఐ హైకోర్టుకు తెలపడం గమనార్హం. ఈ విషయంలోనూ హైకోర్టు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మరోవైపు సంజయ్రాయ్ శిక్షపై ట్రైనీ డాక్టర్ తల్లిదండ్రులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ను కూడా సుప్రీంకోర్టు బుధవారమే విచారించనుంది.సంజయ్రాయ్కి జీవిత ఖైదు మాత్రమే విధించడంపై బాధితురాలి తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంలో కోల్కతాలో మళ్లీ ఆందోళనలు జరుగుతున్నాయి. రాయ్కి మరణశిక్ష విధించాలన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది.ఇదీ చదవండి: ఆర్జీకర్ కేసుపై ‘సుప్రీం’లో నేడు విచారణ -
అప్పీల్కు అవకాశం.. ఉచిత న్యాయ సహాయం..
సాక్షి, హైదరాబాద్: ముసాయిదాలో పెట్టిన కొన్ని నిబంధనలను మారుస్తూ, కొత్తగా ల్యాండ్ ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేస్తూ ‘రికార్డ్ ఆఫ్ రైట్స్–2024’బిల్లును రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. దీనిని ‘తెలంగాణ భూభారతి (రికార్డ్స్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్) చట్టం–2024’గా పిలుస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టు 2వ తేదీన ప్రభుత్వం దీనికి సంబంధించిన ముసాయిదాను విడుదల చేసింది. అందులో 20 సెక్షన్లు ఉండగా.. తాజాగా సవరణలు, మార్పులతో అసెంబ్లీ ముందు పెట్టిన బిల్లులో 23 సెక్షన్లు ఉన్నాయి.ల్యాండ్ ట్రిబ్యునళ్ల ఏర్పాటు, పహాణీలో సాగుదారుకాలమ్, రెవెన్యూ మాన్యు వల్ రికార్డుల నిర్వహణ, ఉచిత న్యాయ సహాయం, ఇప్పటివరకు దరఖాస్తులు అందిన సాదాబైనామాల క్రమబద్ధీకరణ, తప్పుచేసిన అధికారులకు శిక్షలు, కోర్టుకు వెళ్లడంపై స్పష్టత వంటి కొత్త నిబంధనలను దీనిలో చేర్చారు. ధరణిలో ఉన్న వివరాలు తాత్కాలికంగానే భూభారతిలోకి వస్తాయని... రానున్న రోజుల్లో ఈ రికార్డుల సంపూర్ణ ప్రక్షాళన ఉంటుందని అందులో పేర్కొన్నారు. ముసాయిదాలో పేర్కొన్న విధంగా మ్యుటేషన్ చేసే అధికారం ఆర్డీవోలకు, రిజి్రస్టేషన్ తర్వాత మ్యుటేషన్ సమయంలో విచారణ, తప్పులుంటే మ్యుటేషన్ నిలిపివేత, పరిష్కార బాధ్యతలు కలెక్టర్ల నుంచి ఆర్డీవోలకు బదలాయింపు, ప్రతి భూకమతానికి భూదార్, ఆబాదీలకూ హక్కుల రికార్డు, హక్కుల బదలాయింపు జరగ్గానే గ్రామ పహాణీలో నమోదు, భూముల రీసర్వే వంటివి కొనసాగించారు. మళ్లీ రెవెన్యూ ట్రిబ్యునళ్లు భూభారతి ద్వారా రెవెన్యూ ట్రిబ్యునళ్లు మళ్లీ ఏర్పా టు కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడం ద్వారా ఈ ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేయ వచ్చు. ఎన్ని, ఏ స్థాయిలో ఏర్పాటు చేయాలన్న వె సులుబాటు ప్రభుత్వానికే ఉంటుంది. అవి ఏర్పాట య్యేంత వరకు సీసీఎల్ఏనే ల్యాండ్ ట్రిబ్యునల్గా వ్యవహరిస్తారు. తహసీల్దార్లు, సబ్రిజి్రస్టార్లు తీసు కునే నిర్ణయాలపై 60 రోజుల్లోగా ఆర్డీవోకు దర ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆర్డీవోల నిర్ణయాలపై 60 రోజుల్లోగా కలెక్టర్కు దరఖాస్తు చేసుకోవాలి. భూదార్ కార్డుల జారీ, పట్టాదారు పాసు పుస్తకాల జారీకి సంబంధించిన అప్పీళ్లను ఆర్డీవోకు చేసుకోవాలి.ఈ క్రమంలో ఆర్డీవోలు తీసుకునే నిర్ణయంతో విభేదిస్తే.. 30 రోజుల్లోపు కలెక్టర్కు అప్పీల్ చేసుకోవాలి. కలెక్టర్ల నిర్ణయాలతో విభేదిస్తే 30 రోజుల్లోపు ట్రిబ్యునల్కు అప్పీల్ చేసుకోవచ్చు. ఈ విషయంలో ట్రిబ్యునల్ తీసుకునే నిర్ణయమే ఫైనల్. ట్రిబ్యునల్స్ లేదా అప్పిలేట్ అథారిటీలకు అప్పీల్ చేసుకునే పరిస్థితి లేని రైతులకు ప్రభుత్వం ఉచితంగా న్యాయ సహాయం అందిస్తుంది. కోర్టుకు వెళ్లడంపై స్పష్టత.. సర్వే నంబర్లను అవసరానికి అనుగుణంగా సబ్ డివిజన్ చేసుకునేందుకు ఈ చట్టం వెసులుబాటు కల్పిస్తోంది. ప్రభుత్వ, దేవాదాయ, వక్ఫ్, భూదాన్, అసైన్డ్, లావణి భూముల వివాదాలపై సుమోటోగా, లేదంటే ఏదైనా దరఖాస్తు ద్వారా తీసుకుని విచారించి రికార్డులను సరిచేసే అధికారం, నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భూమి బదిలీ తిరిగి ప్రభుత్వానికి దఖలు పరుచుకునే అధికారం భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ)కు ఉంటుంది.అప్పిలేట్ అథారిటీలు, రివిజన్ అథారిటీలకు సివిల్ కోర్టులకుండే అధికారాలను ఈ చట్టం ద్వారా కల్పిస్తున్నారు. భూరికార్డులను తారుమారు చేసిన, హక్కుల రికార్డు విషయంలో తప్పులు చేసిన అధికారులను సరీ్వసు నుంచి తొలగించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. ఇక కేవలం యాజమాన్య హక్కుల గురించి మాత్రమే సివిల్ కోర్టులకు వెళ్లాల్సి ఉంటుందని... రికార్డుల్లో సవరణలు, తప్పొప్పుల గురించి కోర్టుకు వెళ్లడం కుదరదని ఈ చట్టంలో స్పష్టం చేశారు.వైఎస్ హయాంలో పెట్టిన పేరు.. ‘భూభారతి’తెలంగాణలో అమల్లోకి రానున్న కొత్త ఆర్వోఆర్ చట్టానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అమలు చేసిన ఒక భూసంబంధిత ప్రాజెక్టు పేరును ఖరారు చేయడం గమనార్హం. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేశంలోనే తొలి భూరికార్డుల ఆధునీకరణ పైలట్ ప్రాజెక్టును ఉమ్మడి రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో ప్రారంభించారు. ఆ ప్రాజెక్టుకు ‘భూభారతి’అని పేరుపెట్టారు. తాజాగా కొత్త చట్టానికి భూమాత, భూభారతి, వెబ్ల్యాండ్, మాభూమి అని నాలుగు పేర్లను ప్రతిపాదించారు. ఇందులో ప్రభుత్వం భూభారతిని ఖరారు చేసింది. సర్క్యులేషన్ విధానంలో మంత్రివర్గ ఆమోదం తీసుకుని ఈ చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ చట్టం ఎందుకు తెస్తున్నామంటే!కొత్త చట్టాన్ని తెచ్చేందుకు కారణాలను అసెంబ్లీలో పెట్టిన బిల్లులో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. 2020 అక్టోబర్ 29 నుంచి అమల్లోకి వచ్చిన ప్రస్తుత చట్టం కారణంగా భూయజమా నులకు ఇబ్బంది కలిగిందని, ధరణి పోర్టల్లో లెక్కలేనన్ని పొరపాట్లు ఉన్నాయని పేర్కొంది. ఆ పొరపాట్లను సరిదిద్దే వెసులుబాటును ఆ చట్టం కల్పించలేదని, భూమి రికార్డులను సరిదిద్దుకునేందుకు సివిల్ కోర్టులకు వెళ్లాల్సిన పరిస్థితులను కలి్పంచిందని తెలిపింది. సాదాబైనామాల క్రమబద్ధికరణకు కావాల్సిన వెసులుబాటు అందులో లేదని పేర్కొంది.సభ ముందు ఉంచిన కొత్త చట్టం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఆస్తులు, భూ ముల వివాదాలు తగ్గుతాయని.. ప్రజలు వారి ఆ స్తులు, భూములను వారి అవసరాలకు వినియోగించుకునేందుకు, వారికి ఆర్థిక స్థిరత్వం కలిగించేందుకు ఉపయోగపడుతుందని ప్రభు త్వం తెలిపింది.ప్రభుత్వ భూముల రక్షణ, సులభతరంగా, ప్రజలకు ఇబ్బందులు లేకుండా భూరికార్డుల పోర్టల్ నిర్వహణ, సాదాబైనామాల క్రమబద్ధీకరణ, ప్రతి భూమికి భూదార్ నంబర్, కార్డుల జారీ, వ్యవసాయేతర భూములు, ఆబాదీల హ క్కుల కోసం రికార్డు తయారీ, హక్కుల రికార్డులో మ్యుటేషన్ పద్ధతిని సరిదిద్దడం, భూరికార్డుల పో ర్టల్లో నమోదైన తప్పులను సరిచేసే వ్యవస్థను నెలకొల్పడం, పార్ట్–బీలో పెట్టిన భూముల సమస్యలను పరిష్కరించడం, ప్రస్తుత రికార్డులను అప్గ్రేడ్ చేయడంతోపాటు భూముల రీసర్వే నిర్వహించి కొత్త రికార్డు తయారు చేయడమే లక్ష్యంగా కొత్త చట్టాన్ని తెస్తున్నామని స్పష్టం చేసింది.24 సార్లు సవరణలు చేసి.. సభ ముందుకు..భూభారతి చట్టం కోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్ద కసరత్తే చేసింది. ఈ ఏడాది ఆగస్టు 2న ముసాయిదాను విడుదల చేసింది. అన్ని వర్గాల నుంచి ఆన్లైన్ ద్వారా సలహాలు, సూచనలు స్వీకరించింది. జిల్లాస్థాయిలో సదస్సులు నిర్వహించి అభిప్రాయాలను తెలుసుకుంది. ఆయా అంశాలన్నింటినీ క్షుణ్నంగా పరిశీలించి.. ముసాయిదాను 14 సార్లు సవరించింది. సీఎం, రెవెన్యూ మంత్రి, ఉన్నతాధికారులతో చర్చిస్తూ చట్టాన్ని అసెంబ్లీలో పెట్టడానికి కొన్ని గంటల ముందు వరకు కూడా సవరించుకుంటూ వచ్చారు.మొత్తంగా 24 సార్లు సవరించి.. 24వ ముసాయిదాను ఫైనల్ చేసి భూభారతి–2024 చట్టం బిల్లును అసెంబ్లీ ఆమోదానికి ఉంచారు. అటు ముసాయిదా, ఇటు అసెంబ్లీ ముందు పెట్టిన బిల్లు రూపకల్పనలో భూచట్టాల నిపుణుడు ఎం.సునీల్కుమార్ ప్రత్యేక కృషి చేయగా... రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్మిత్తల్, సీసీఎల్ఏ అసిస్టెంట్ సెక్రటరీ వి.లచ్చిరెడ్డి కీలకపాత్ర పోషించారు. -
రూ. 213 కోట్లు జరిమానా.. అప్పీలుకు మెటా
న్యూఢిల్లీ: వాట్సాప్ గోప్యతా పాలసీకి సంబంధించి కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) రూ. 213 కోట్లు జరిమానా విధించడంపై అప్పీలుకెళ్లనున్నట్లు సోషల్ మీడియా దిగ్గజం మెటా వెల్లడించింది. 2021లో అమల్లోకి తెచ్చిన అప్డేట్లో యూజర్ల వ్యక్తిగత మెసేజీల గోప్యతకు భంగం కలిగించే మార్పులేమీ చేయలేదని స్పష్టం చేసింది.వాస్తవానికి డేటా సేకరణ, వినియోగంపై మరింత స్పష్టతనివ్వడంతో పాటు పలు బిజినెస్ ఫీచర్లను కూడా ప్రవేశపెట్టామని పేర్కొంది. వివిధ సేవలతో ప్రజలు, వ్యాపార సంస్థలకు వాట్సాప్ ఎంతో ఉపయోగకరమైనదిగా ఉంటోందని, ఇదంతా మెటా సహకారంతోనే సాధ్యపడుతోందని వివరించింది.మాతృసంస్థ మెటాతో యూజర్లు తమ డేటాను తప్పనిసరిగా షేర్ చేసుకునేలా 2021లో పాలసీని అప్డేట్ చేయడం పోటీ నిబంధనలకు విరుద్ధమంటూ సీసీఐ రూ. 213 కోట్ల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. -
ఎన్నికల వేళ ట్రంప్ కీలక ట్వీట్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ సమయం వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఓటర్లను ఉద్దేశించి దేశ అధ్యక్షుడు జో బైడెన్, రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ సోషల్మీడియాలో ప్రజలకు చివరిసారిగా విజ్ఞప్తి చేశారు. ప్రజలంతా తమ ఓటుహక్కు వినియోగించుకోవాలని కోరారు.ముస్లిం ఓటర్లకు ట్రంప్ గాలంఅమెరికాను మళ్లీ గొప్పగా తీర్చుదిద్దుకుందామని,దేశ రాజకీయ చరిత్రలో అతిపెద్ద, విస్తృతమైన సంకీర్ణాన్ని నిర్మిద్దామని ట్రంప్ ఓటర్లకు పిలుపునిచ్చారు. కమలా హారిస్ అధికారంలోకి వస్తే పశ్చిమాసియా ఆక్రమణకు గురవుతుందని శాంతిని కోరుకునే మిచిగాన్లోని అనేక మంది అరబ్,ముస్లిం ఓటర్లుఓటర్లకు తెలుసన్నారు. అందుకే తనకు ఓటేసి శాంతిని పునరుద్ధరించాలని ట్రంప్ కోరారు.కమల చేతిలో ట్రంప్ ఓటమి ఖాయం:బైడెన్మరి కొన్ని గంటల్లో ఎన్నికలు జరగనున్నాయని, కమలా హారిస్ ట్రంప్ను ఓడిస్తుందని తనకు తెలుసని అధ్యకక్షుడు జో బైడెన్ పోస్టు చేశారు. ఇందుకు మీరంతా ఓటింగ్లో పాల్గొనాలని బైడెన్ కోరారు.ముందస్తు ఓటింగ్ను వినియోగించుకోని వారంతా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. Tomorrow is our last chance to defeat the corrupt establishment. GET OUT AND VOTE! #FightForAmerica https://t.co/czQRkZmr59 pic.twitter.com/vKF0bXhBnb— Donald J. Trump (@realDonaldTrump) November 5, 2024ఇదీ చదవండి: అమెరికా ఎన్నికలపై హిప్పో జోస్యం.. వీడియో వైరల్ -
సింగిల్ జడ్జి ఉత్తర్వులను కొట్టివేయండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలకు గ్రీన్సిగ్నల్ ఇస్తూ మూడురోజుల క్రితం సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో అప్పీల్ దాఖలైంది. వికారాబాద్ జిల్లా పరిగికి చెందిన గంగుల దామోదర్రెడ్డితోపాటు మరో నలుగురు హైకోర్టులో రిట్ అప్పీల్ దాఖలు చేశారు. తెలంగాణ పబ్లిక్ సచ్చిస్ కమిషన్, జీఏడీ కార్యదర్శిని ప్రతివాదులుగా చేర్చా రు. ఈ అప్పీల్పై జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, జస్టిస్ లక్ష్మీనారాయణ అలిశెట్టి ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టనుంది. ‘ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థుల జాబితాను ప్రచురించే ముందు ప్రాథమిక కీపై వచ్చిన అభ్యంతరాలను నిష్పాక్షికంగా పరిశీలించాలి. ఆ అభ్యంతరాలపై పూర్తి పరిశీలన జరిగిన తర్వాతే మెరిట్ జాబితా ప్రకటించాలి. కానీ టీజీపీఎస్సీ ఆ మేరకు చర్యలు తీసుకోలేదు. తప్పుగా వచ్చిన ప్రశ్నలను తొలగించి మళ్లీ మెరిట్ జాబితా ప్రకటించేలా ఆదేశించాలి’అని దామోదర్రెడ్డితోపాటు మరికొందరు దాఖలుచేసిన రిట్ పిటిషన్ను సింగిల్ జడ్జి కొట్టివేశారు. సాంకేతిక అంశాలను నిపుణుల కమిటీకే వదిలేయాలని, కోర్టుల జోక్యం కూడదని వ్యాఖ్యానించారు. ఈ ఉత్తర్వులను కొట్టివేయాలంటూ తాజాగా పిటిషనర్లు ద్విసభ్య ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. అప్పీల్లో పేర్కొన్న అంశాలివీ.. ‘సింగిల్ జడ్జి ఉత్తర్వులు చట్టవిరుద్ధం. గ్రూప్–1 ప్రిలిమ్స్ ‘కీ’లో కొన్ని ప్రశ్నలు, జవాబుల్లో స్పష్టంగా తప్పులు కనిపిస్తున్నాయి. వాటిని, పిటిషనర్ల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండానే రిట్ పిటిషన్ కొట్టివేశారు. నిపుణుల కమిటీ నిర్ణయంపై న్యాయ సమీక్ష అవసరం లేదని చెప్పారు. తప్పుడు ప్రశ్నలు తొలగిస్తే మెరిట్ జాబితా అంతా మారిపోతుందని అందులో జోక్యం చేసుకోవడానికి నిరాకరించారు. కొన్ని ప్రశ్నలు తప్పుగా రూపొందించిన విషయాన్నీ గ్రహించలేదు. సింగిల్ జడ్జి మా పిటిషన్లను కొట్టివేయడం ద్వారా తప్పుడు ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన వారు కూడా మెయిన్స్కు అర్హత సాధించినట్లు అవుతుంది. ఈ తప్పుడు ప్రశ్నలకు అనుకోకుండా పిటిషనర్లు కొందరు సరైన సమాధానం ఇవ్వడాన్ని టీజీపీఎస్సీ సింగిల్ జడ్జి ముందు పేర్కొంది. ప్రిలిమ్స్తోనే నేరుగా జాబ్ ఇవ్వకపోయినా మెయిన్స్ పరీక్ష రాయడానికి అదే కీలకం.ఇలా తప్పుడు ‘కీ’తో అర్హత సాధించి పోస్టుల్లో చేరే వారు తదుపరి మూడు దశాబ్దాల పాటు అధికారులుగా విధులు నిర్వహిస్తారు. రాహుల్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును సింగిల్ జడ్జి పరిగణనలోకి తీసుకోలేదు. ఈనెల 15న సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను కొట్టివేయాలి’అని ద్విసభ్య ధర్మాసనం ముందు దాఖలుచేసిన అప్పీల్లో కోరారు. -
మునిగే తండాలో ఇక ఉండలేం
సాక్షి, మహబూబాబాద్: ‘సారూ.. శనివారం రాత్రి వచ్చిన వరదతో చెట్టుకొకరం.. పుట్టకొకరం అయినం. ట్యాంకులు ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నం.. ఇట్టా మునిగే తండాలో ఉండలేం.. మాకు వేరేచోట ఇళ్లు కట్టించి ఇవ్వండి.. తండా అంతా అక్కడే ఉంటాం..’అంటూ సీఎం రేవంత్రెడ్డి ఎదుట మహ బూబాబాద్ జిల్లా మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం శివారు సీతారాం తండావాసులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. పర్యటనలో భాగంగా మంగళవారం తండాకు వచి్చన సీఎం స్థానికులతో మాట్లాడారు. సీఎం: నీ పేరు ఏం పేరు...? తండావాసీ: నాపేరు మంగీలాల్ సార్..సీఎం: ఏం జరిగింది? ఎక్కడివరకు నీళ్లు వచ్చాయి? (ఇల్లు చూపిస్తూ) మంగీలాల్: శనివారం రాత్రి అందాజ 2 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా ఇంట్లోకి నీళ్లు రావడం ప్రారంభించాయి. ఏంది అని చూడగానే బయట అంతా కొండ మాదిరిగా నీళ్లతో ఉంది. నా భుజాల వరకు నీళ్లు వచ్చేశాయి. వెంటనే మేము పిల్లల్ని తీసుకుని పెద్ద బిల్డింగ్, ట్యాంకులు ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నాం..ఇక ఇక్కడ ఉండలేం సార్.. మాకు వేరే ఇల్లు కట్టించండి. సీఎం: శీనన్నా (పొంగులేటి శ్రీనివాస్రెడ్డి) వీళ్లను చూడు. ఈ ఇల్లు మీరే కట్టుకున్నారా? (మళ్లీ మంగీలాల్ను ఉద్దేశించి) మంగీలాల్: లేదు సార్.. ఇందిరమ్మ ఇల్లు అప్పుడు కట్టుకున్నాం. సీఎం: ఇప్పుడు కూడా ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తాం.. ఇక్కడే ఉంటారా.. వేరే చోటుకు వెళ్తారా? కలెక్టర్ గారూ అంతా చూడండి. తండా మొత్తం నమోదు చేసుకోండి. మంచి సైట్ చూడండి. ఇంట్లో ఏం తడిసినయి? ఏం ఇబ్బంది జరిగింది? మంగీలాల్ కొడుకు: సార్ నా పుస్తకాలు తడిసినయి.. ఈ ఇంట్లో ఉండలేము. మళ్లీ మునుగుతాం.. మాకు వేరే ఇల్లు కావాలి. మంగీలాల్: బియ్యం, బట్టలు అన్నీ తడిసినయ్ సార్ సీఎం: ఈమె తెలుసా? (సీతక్కను చూపిస్తూ) ఈమె నీకు కావాల్సిన పుస్తకాలు కొనిస్తుంది.. ఈయన తెలుసా? (ఎమ్మెల్యే రాంచంద్రునాయక్ను చూపిస్తూ) ఈయన పెద్ద డాక్టర్. ఈయన మాదిరిగానే మంచిగా చదువుకోవాలి.. అధైర్య పడకండి.. అన్నీ చూసుకుంటాం. -
వినేశ్ రజత పతకం అప్పీల్పై తీర్పు నేడు!
పారిస్: క్రీడాలోకమే కాదు... యావత్ దేశం ఎదురుచూపులకు నేడు తెరపడే అవకాశముంది. భారత మహిళా స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ అప్పీల్పై నేడు తీర్పు వెలువడనుంది. పారిస్ విశ్వక్రీడల్లో మహిళల 50 కేజీల కేటగిరీలో ఫైనల్లోకి ప్రవేశించిన ఆమె సరిగ్గా బౌట్కు ముందు కేవలం 100 గ్రాముల అధిక బరువు కారణంగా అనర్హతకు గురైంది. దీంతో ఫైనల్లో ఓడినా కనీసం ఖాయమనుకున్న రజతం చేజారడంతో పాటు... అమె పాల్గొన్న వెయిట్ కేటగిరీ జాబితాలో చివరి స్థానంలో నిలవడం భారతావనిని నిర్ఘాంత పరిచింది. తన అనర్హతపై సవాలుకు వెళ్లిన ఫొగాట్... సంయుక్త రజతం డిమాండ్ చేస్తూ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్)లో అప్పీలు చేసింది. భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) నిష్ణాతులైన లాయర్లతో ఈ అప్పీలుపై వాదించింది. విచారణ పూర్తికావడంతో నేడు సీఏఎస్ తుది తీర్పు వెలువరించనుంది. కాగా ఐఓఏ అధ్యక్షురాలు పీటీ ఉష మాట్లాడుతూ... వినేశ్ బరువు పెరగడం, అనర్హతకు బాధ్యుడిని చేస్తూ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ దిన్షా పర్దివాలాపై విమర్శలకు దిగడం సమంజసం కాదని చెప్పింది.సంబంధిత అథ్లెట్ల బరువు, ఈవెంట్ల నిబంధనలపై కోచ్, వ్యక్తిగత సిబ్బంది జాగ్రత్తగా ఉండాల్సిందని ఆమె అభిప్రాయపడింది. -
హత్రాస్ తొక్కిసలాట: భయంతో మరో బాబా వినతి
ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో జరిగిన తొక్కిసలాటలో మృతిచెందిన భక్తుల సంఖ్య 121 దాటింది. ఈ ప్రమాదం నేపధ్యంలో అప్రమత్తమైన మధ్యప్రదేశ్కు చెందిన మరో బాబా తన అనుచరులను ఉద్దేశిస్తూ ఒక వీడియో విడుదల చేశారు.బాగేశ్వర్ ధామ్కు చెందిన పండిట్ ధీరేంద్ర కృష్ణ శాస్త్రికి భక్తులు, అనుచరులు అధిక సంఖ్యలో ఉన్నారు. జూలై నాలుగున జరిగే అతని పుట్టిన రోజుల వేడుకలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే హత్రాస్ ఘటన నేపధ్యంలో మరోమారు అలాంటి ప్రమాదం జరగకూడదనే ఉద్దేశ్యంతో పండిట్ ధీరేంద్ర కృష్ణ శాస్త్రి తన సోషల్ మీడియా ఖాతాలో ఒక వీడియో షేర్ చేశారు.ఆ వీడియోలో పండిట్ ధీరేంద్ర శాస్త్రి ‘జూలై 4న నా పుట్టిన రోజు. ఆ రోజు నా జీవితంలో ఒక సంవత్సరం తగ్గుతుంది. అయితే ఆరోజు వేడుకలు నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ వీడియో ద్వారా ఒక అభ్యర్థన చేస్తున్నాను. జూలై నాలుగున జరిగే వేడుకలకు దూరప్రాంతాల నుంచి రావాలనుకుంటున్నవారు తమ ఇళ్లలోనే పూజలు చేసుకోవాలి. ఇప్పటికే ఇక్కడ భక్తుల రద్దీ పెరిగింది. భద్రత దృష్ట్యా ఎక్కడివారు అక్కడే వేడుకలు చేసుకోవాలి’ అని విజ్ఞప్తి చేశారు. अतिआवश्यक सूचना…पूज्य सरकार द्वारा सभी भक्तों को आवश्यक संदेश….इसे जन जन तक पहुँचाए… pic.twitter.com/GgLledRw4H— Bageshwar Dham Sarkar (Official) (@bageshwardham) July 2, 2024 -
కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి
-
ట్యుటికోరిన్ కోల్ బిడ్డింగ్పై జిందాల్ పవర్కు చుక్కెదురు
న్యూఢిల్లీ: ట్యుటికోరిన్ కోల్ టెర్మినల్ (టీసీటీ) బిడ్డింగ్లో పాల్గొనేందుకు అనుమతించాలంటూ జిందాల్ పవర్ (జేపీఎల్) చేసిన విజ్ఞప్తిని నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) తిరస్కరించింది. నిబంధనల ప్రకారం పరిష్కార ప్రక్రియను సమర్పించేందుకు జేపీఎల్కు అర్హత లేదంటూ ఎన్సీఎల్టీ ముంబై బెంచ్ ఇచి్చన ఉత్తర్వులను సమర్ధించింది. కంపెనీకి గరిష్ట విలువను రాబట్టడమే దివాలా కోడ్ (ఐబీసీ) లక్ష్యం అయినప్పటికీ .. దరఖాస్తుదారుల తుది జాబితాలో లేని కంపెనీలకు మధ్యలో ప్రవేశం కలి్పంచడానికి నిబంధనలు అంగీకరించవని పేర్కొంది. తుది జాబితాలోని సీపోల్ సమర్పించిన బిడ్పై తగు నిర్ణయం తీసుకోవాలంటూ పరిష్కార నిపుణుడు (ఆర్పీ), రుణదాతల కమిటీ (సీవోసీ)కి ఎన్సీఎల్ఏటీ సూచించింది. రుణ పరిష్కార ప్రక్రియలో భాగంగా టీసీటీని కొనుగోలు చేసేందుకు సీపోల్ గతేడాది ఫిబ్రవరి 18న ప్రణాళిక సమరి్పంచింది. దాన్ని రుణదాతల కమిటీ (సీవోసీ) పరిశీలిస్తుండగానే దాదాపు అదే సమయంలో బిడ్డింగ్లో పాల్గొనేందుకు తమకు కూడా అవకాశం కలి్పంచాలంటూ జూలై 12న జేపీఎల్ కోరింది. అయితే, బిడ్డింగ్కు అనుమతిస్తూనే.. సీఐఆర్పీ నిబంధనలకు అనుగుణంగా అనుమతులు ఉంటాయంటూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ తెలిపింది. దీనిపై సందిగ్ధత నెలకొనడంతో స్పష్టతనివ్వాలంటూ ఆర్పీ కోరారు. దీంతో జేపీఎల్కు అర్హత ఉండదంటూ ఎన్సీఎల్టీ స్పష్టతనిచ్చింది. ఈ ఉత్తర్వులనే సవాలు చేస్తూ ఎన్సీఎల్ఏటీని జేపీఎల్ ఆశ్రయించింది. -
హఫీజ్ సయీద్ను అప్పగించండి
న్యూఢిల్లీ: 26/11 ముంబై దాడుల సూత్రధారి, కరడుగట్టిన ఉగ్రవాది, లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ను తమకు అప్పగించాలని భారత ప్రభుత్వం పాకిస్తాన్కు అధికారికంగా విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ఒక వినతిని పాకిస్తాన్ ప్రభుత్వానికి పంపించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. సయీద్ను అప్పగించడానికి చట్టపరమైన ప్రక్రియను ప్రారంభించాలని కోరినట్లు తెలియజేశాయి. భారత్ రూపొందించిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో హఫీజ్ సయీద్ ఉన్నాడు. అతడి తలపై అమెరికా ప్రభుత్వం 10 మిలియన్ డాలర్ల బహుమానం ప్రకటించింది. 2008 నాటి ముంబై దాడులకు వ్యూహ రచన చేసిన హఫీజ్ సయీద్ను విచారించేందుకు భారత ప్రభుత్వం ప్రయతి్నస్తోంది. అతడిని తమకు అప్పగించాలని భారత్ పదేపదే కోరుతున్నా పాకిస్తాన్ పట్టించుకోవడం లేదు. -
యెమెన్లో కేరళ నర్సుకు నిరాశ
ఢిల్లీ: యెమెన్లో మరణశిక్షను ఎదుర్కొంటున్న భారతీయ నర్సుకు నిరాశే ఎదురైంది. ఆమె మరణశిక్షపై దాఖలు చేసిన అప్పీల్ను ఆ దేశ సుప్రీంకోర్టు తిరస్కరించింది. మరోవైపు తన కూతుర్ని విడిపించడానికి యెమెన్ వెళ్లాలని బాధితురాలి తల్లి చేసిన అభ్యర్థనపై వారంలోగా నిర్ణయం తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు కేంద్రాన్ని గురువారం కోరింది. కేరళకు చెందిన నిమిషా ప్రియ అనే మహిళ తన పాస్పోర్ట్ను తిరిగి పొందే ప్రయత్నంలో తలాల్ అబ్దో మహదీ అనే వ్కక్తికి మత్తుమందు ఇచ్చి చంపినట్లు కోర్టు దోషిగా తేల్చింది. మరణశిక్ష విధించింది. ఈ కేసులో 2017 నుంచి నిమిషా ప్రియ యెమెన్లో జైలు శిక్ష అనుభవిస్తోంది. అరబ్ దేశంలో అంతర్యుద్ధం కారణంగా 2017 నుంచి భారతీయ పౌరులకు ప్రయాణ నిషేధం ఉంది. అయినప్పటికీ యెమెన్ వెళ్లేందుకు అనుమతి కోరుతూ ప్రియా తల్లి ఈ ఏడాది ఆరంభంలో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ప్రియను విడుదల చేయడానికి మహదీ కుటుంబంతో నష్టపరిహారం గురించి చర్చలు జరపడానికి యెమెన్ వెళ్లాలని కోరుకుంటోంది. తన బిడ్డను కాపడటానికి తప్పకుండా యెమెన్ వెళ్లాల్సి ఉందని ధర్మాసనానికి ప్రియ తల్లి విన్నవించుకున్నారు. అందుకు ప్రయాణ నిషేధం అడ్డుగా ఉందని పేర్కొన్నారు. యెమెన్ ప్రయాణ నిషేధాన్ని సడలించవచ్చని ప్రభుత్వ తరుపు న్యాయవాది తెలిపారు. ప్రత్యేక పరిస్థితుల్లో భారతీయులు యెమెన్ వెల్లడానికి ప్రభుత్వం అంగీకరించే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ప్రియా విడుదల కోసం "సేవ్ నిమిషా ప్రియా ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్" అనే బృందం 2022లో హైకోర్టును ఆశ్రయించింది. నిమిషా ప్రియను రక్షించేందుకు దౌత్యపరమైన జోక్యం చేసుకోవడంతో పాటు కేంద్రం చర్చలు జరపాలని కోరింది. అయితే.. ప్రియాను రక్షించడానికి పరిహారం గురించి చర్చలు జరపాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేయలేమని హైకోర్టు తెలిపింది. ఆమెను దోషిగా నిర్ధారించినందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందేనని ధర్మాసనం వెల్లడించింది. ఇదీ చదవండి: లాటరీలో రూ.45 కోట్లు గెలుచుకున్న కేరళవాసి -
అభివృద్ధి కోసం బీజేపీని గెలిపించండి
న్యూఢిల్లీ: రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందాలంటే బీజేపీకి ఓటు వేయాలని మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. రెండు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచార పర్వం ముగుస్తున్న నేపథ్యంలో బుధవారం ‘ఎక్స్’లో ఆయన ఈ మేరకు పోస్టు చేశారు. కాంగ్రెస్ పార్టీ వారసత్వ, ప్రతికూల రాజకీయాలతో జనం విసుగెత్తిపోయారని వెల్లడించారు. బీజేపీని గెలిపిస్తే ప్రజలకు ఇచి్చన హామీలన్నీ అమలు చేస్తామని పునరుద్ఘాటించారు. జనం ఆకాంక్షలను నెరవేర్చడం తమ బాధ్యత అని వివరించారు. కాంగ్రెస్ ఇస్తున్న డొల్ల హామీలు నమ్మొద్దని, సుపరిపాలన అందించే బీజేపీకి పట్టం కట్టాలని కోరారు. తమ పార్టీ పట్ల జనం అచంచల విశ్వాసం చూపుతున్నారని హర్షం వ్యక్తం చేశారు. బీజేపీ వల్లనే ప్రగతి సాధ్యమని వారు నమ్ముతున్నారని వివరించారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం వల్ల కలిగే మేలు ఏమిటో మధ్యప్రదేశ్ ప్రజలు ఇప్పటికే గుర్తించారని తెలిపారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వాన్ని అదికారంలోకి తీసుకురావాలని ఛత్తీస్గఢ్ ప్రజలకు సూచించారు. రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ను తిరస్కరించి, బీజేపీని గెలిపిస్తారన్న నమ్మకం తనకు సంపూర్ణంగా ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
ఆ 8 మందికి మరణశిక్షపై భారత్ అప్పీల్
న్యూఢిల్లీ: తమ దేశంలో గూఢచర్యానికి పాల్పడ్డారనే ఆరోపణలపై ఎనిమిది మంది మాజీ భారతీయ నావికాదళ అధికారులపై ఖతర్ దేశ న్యాయస్థానం విధించిన మరణశిక్షపై అప్పీల్ చేశామని భారత్ గురువారం వెల్లడించింది. సంబంధిత అంశాలను ఢిల్లీలో విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరీందమ్ బాగ్చీ వివరించారు. ‘ మంగళవారమే ఆ ఎనిమిది మందితో సంప్రతింపుల జరిపే అవకాశం దోహా నగరంలోని భారతీయ ఎంబసీ దౌత్యాధికారులకు లభించింది. నిర్బంధంలో ఉన్న మాజీ నావికాధికారులతో మనవాళ్లు మాట్లాడారు. వారికి న్యాయ, దౌత్యపరమైన పూర్తి రక్షణ కలి్పంచేందుకు భారత ప్రభుత్వం కృషిచేస్తోంది’ అని బాగ్చీ అన్నారు. వీరికి మరణశిక్ష ఖరారుచేస్తూ ఖతర్ కోర్టు అక్టోబర్ 26వ తేదీన తీర్పు ఇవ్వగానే భారత ప్రభుత్వం ఈ అంశాన్ని తీవ్రమైనదిగా పరిగణించింది. వారికి విముక్తి కలి్పంచేందుకు తీసుకోవాల్సిన చర్యలు, అనుసరించాల్సిన దౌత్య మార్గాలను అన్వేíÙస్తోంది. ‘అల్ దహ్రా గ్లోబల్ అనే ప్రైవేట్ కంపెనీలో పనిచేసిన వీరిపై ఖతర్ మరణశిక్ష మోపింది. ఈ తీర్పు వివరాలు అత్యంత గోప్యమైనవి. వీటిని కేవలం న్యాయబృందంతోనే భారత్ పంచుకుంటోంది. తదుపరి చర్యలకు సిద్ధమయ్యాం. ఇప్పటికే అప్పీల్ కూడా చేశాం. బాధితుల కుటుంబాలతో మాట్లాడాం. ఇటీవలే వారి కుటుంబసభ్యులను భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ స్వయంగా కలిసి ధైర్యం చెప్పారు’’ అని బాగ్చీ చెప్పారు. అసలు వీరు ఏ విధమైన గూఢచర్యానికి పాల్పడ్డారనే వివరాలను ఇంతవరకు ఖతర్ న్యాయస్థానం బహిరంగంగా వెల్లడించలేదు. కేసులోని సున్నితత్వం దృష్ట్యా ఈ అంశంపై భారత్ తరఫున ఉన్నతాధికారులూ బహిరంగంగా ఏమీ మాట్లాడలేదు. ‘కేసు సున్నితత్వాన్ని పరిగణనలోకి తీసుకుని ఎవరూ ఈ అంశాన్ని సంచలనాల కోసం లేనిపోని రాద్దాంతాలు, వక్రభాష్యాలతో నింపేయకండి’ అని బాగ్చీ విజ్ఞప్తిచేశారు. మార్చి 25వ తేదీన మాజీ అధికారులపై కేసు నమోదుచేసి ఖతార్ చట్టాల కింద అరెస్ట్చేశారు. మరణశిక్షను ఎదుర్కొంటున్న వీరంతా భారత నావికాదళంలో ముఖ్యమైన పదవుల్లో దాదాపు 20 సంవత్సరాలపాటు సేవలందించారు. దళ సభ్యులకు ఇన్స్ట్రక్టర్లుగా పనిచేశారని మాజీ సైన్యాధికారులు గుర్తుచేసుకున్నారు. వీరి అరెస్ట్ తర్వాత మే నెలలో దోహాలోని అల్ దహ్రా గ్లోబల్ సంస్థ తన కార్యకలాపాలను నిలిపేసింది. అందులో పనిచేసే సిబ్బందిని, ముఖ్యంగా భారతీయులను స్వదేశానికి పంపించేసింది. -
ఆ అధికారులపై చర్యలు తీసుకోండి
సాక్షి, హైదరాబాద్: అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో ఖమ్మం జిల్లా ఎన్నికల అధికారి/కలెక్టర్, సత్తుపల్లి రిటర్నింగ్ ఆఫీసర్ పక్షపాత ధోరణిలో వ్యవహరిస్తు న్నారని.. వారిపై తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో)కి బీజేపీ ఈసీ వ్యవహారాల కమిటీ చైర్మన్ మర్రిశశిధర్రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆ అధికారుల తీరుపై విచారణకు ఆదేశించాలని, వెంటనే బదిలీ చేయాలని కోరారు. ఎన్ని కల షెడ్యూల్ ప్రకటనకు ముందే ఈ నెల 9న కేంద్ర మంత్రి బీఎల్ వర్మ ఖమ్మం జిల్లా పర్యటన ఖరారైందని.. కానీ షెడ్యూల్ వెలువడటంతో ఎస్సీసీఎల్ అధికారులు, గ్రీన్ఫీల్డ్ హైవేస్ అథారిటీ, ఇతర ప్రభుత్వ అధికారులతో ఆ సమావేశాన్ని విరమించుకున్నారని సీఈవోకు వివరించారు. కేంద్రమంత్రి సమావేశం జరగకపోయినా కూడా.. ఆ సమావేశంలో పాల్గొని ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారంటూ బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ వీరం రాజుపై అధికారులు కేసు పెట్టారని మండిపడ్డారు. దీనిపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని కోరారు. సీఎస్ఆర్ నిధులతో ప్రలోభమంటూ.. స్త్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ నుంచి కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధులను పూర్తిగా మంత్రి ఎర్రబెల్లి నియోజకవర్గంలోని డెయిరీ, టైలరింగ్ యూనిట్లకు ఖర్చు చేస్తున్నారని ఢిల్లీలోని చీఫ్ ఎలక్షన్ కమిషనర్కు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి ఫిర్యాదు చేశారు. ఎన్నికల సమయంలో ఇది సరికాదని.. స్త్రీనిధి సంస్థ ఎండీ, ఇతర రిటైర్డ్ అధికారులను వారి బాధ్యతల నుంచి రిలీవ్ చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. -
మాజీ మంత్రి నారాయణ గుట్టుమట్లు నాకు తెలుసు.. : పొంగూరి ప్రియ
సాక్షి, అమరావతి: ఏపీ సీఐడీకి విజ్ఞప్తులు చేస్తూ మాజీ మంత్రి పొంగూరు నారాయణ మరదలు పొంగూరు ప్రియ శనివారం మీడియాకు విడుదల చేసిన వీడియోలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సోమవారం జరిగే విచారణలో నారాయణ ఏమీ తెలియదని, గుర్తులేదని చెప్పే అవకాశం ఉందని.. కానీ నారాయణకు అన్నీ తెలుసని ఆమె ఆ వీడియోలో పేర్కొన్నారు. ఎక్కడెక్కడ బినామీల పేరిట ఆయనకు స్థలాలు ఉన్నాయో తనకు తెలుసునన్నారు. ఈ కేసులో భాగంగా తనను కూడా విచారించాలని.. అలా చేస్తే దర్యాప్తునకు సహాయం చేసినట్టవుతుందన్నారు. ఈ మేరకు సీఐడీకి విజ్ఞప్తి చేస్తున్నా అన్నారు. నారాయణ కేసు విచారణలో ఇన్నర్ రింగ్ రోడ్డు దగ్గర తన స్థలం ఆయనకు గుర్తు ఉందన్నారు. ‘మీ విచారణలో మాత్రం ఆయనకు ఇవేమీ గుర్తు రావు. కాబట్టి మీ ఎంక్వైరీలో నన్ను కూడా విచారిస్తే అన్ని విషయాలు చెబుతా. ఒక పర్సన్ వల్ల తీగలాగితే డొంక కదులుతుంది. రింగ్ రోడ్ భూముల విషయంలో ఆయన ఏమేం చేశారో మీకు తెలుస్తుంది. ఆ పర్సన్ ఎవరో ఎంక్వైరీలో మీకు నేను చెబుతాను. ఒక రకంగా ఈ సమాచారం దర్యాప్తులో మీకు హెల్ప్ అవుతుంది’ అని ఆ వీడియోలో పొంగూరి ప్రియ పేర్కొన్నారు. -
కమ్మలకు ప్రాధాన్యం కల్పించండి
సాక్షి, హైదరాబాద్: రానున్న ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలకు ప్రాధాన్యమివ్వాలని కమ్మ రాజకీయ ఐక్య వేదిక విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు గురువారం గాందీభవన్లో కమ్మ ఐక్య వేదిక ప్రతినిధులు రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్రావ్ ఠాక్రేను కలసి వినతిపత్రం సమర్పించారు. కాంగ్రెస్ పార్టీ లోని కమ్మ నేతలకు తగిన అవకాశాలు కల్పించాలని అందులో కోరారు. పరిశీలకుల భేటీ.. ఏఐసీసీ నియమించిన పార్లమెంటరీ పరిశీలకుల సమావేశం ఠాక్రే అధ్యక్షతన గాందీభవన్లో జరిగింది. ఈ సమావేశంలో పరిశీలకులు దీపాదాస్మున్షీ, జ్యోతిమణి, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లురవి, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్కుమార్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. పార్లమెంటరీ స్థానాల వారీగా తమ పర్యటనల సందర్భంగా దృష్టికి వచ్చిన అంశాలను, ఆయా స్థానాల పరిధిలో పార్టీ పరిస్థితిని ఈ సందర్భంగా పరిశీలకులు ఠాక్రేకు వివరించారు. ఈ మేరకు పార్లమెంటు స్థానాల వారీగా ప్రత్యేక నివేదికను తయారుచేసి అధిష్టానానికి పంపాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. -
‘నా జీవితం ఇంకొకరికి అంకితం’.. నర్సు ఉద్యోగం రాగానే భర్తను గెంటేసి..
‘మీనాక్షికి చదువంటే ఎంతో ఇష్టం. నేను లక్ష రూపాయలు ఖర్చుచేసి ఆమెకు జీఎన్ఎం ట్రైనింగ్ ఇప్పించాను. ఇందుకోసం బీమా పాలసీ కూడా వదులుకున్నాను. ఇప్పుడు మీనాక్షి నన్ను గుర్తించేందుకు కూడా ఇష్టపడటం లేదు. నన్ను తన భర్తగా అంగీకరించడం లేదు. తన జీవితంలోకి మరో వ్యక్తి ప్రవేశించాడని, నన్ను ఇంకొకరిని చూసుకోమని చెబుతోంది’ ‘ఆమె చదువు కోసం లక్షలు ఖర్చు చేశా’ యూపీలోని అనూప్పూర్ జిల్లాలోని పకరియా గ్రామానికి చెందిన జోహన్ భారియా తన గోడును అనూప్పూర్ కలెక్టర్కు విన్నవించుకునేందుకు వచ్చాడు. తన భార్య మీనాక్షి తన దగ్గరకు రావడం లేదని జోహన్ ఆవేదన వ్యక్తం చేశాడు. పెళ్లాయ్యాక ఆమె చదువుకోసం ఎంతో ఖర్చు చేశాను. ఇప్పుడు కనీసం నావైపు చూడటం లేదు. కుమార్తెను కూడా తనతోపాటు తీసుకువెళ్లిపోయింది. తన భార్య తన దగ్గరకు వచ్చేలా చేయండి అని వేడుకున్నాడు. ‘అప్పటికే మీనాక్షికి పెళ్లయ్యింది’ తమకు పెళ్లయ్యే నాటికే మీనాక్షికి వివాహం అయ్యిందని, ఆమె తన అత్తవారింటికి వెళ్లకుండా పుట్టింటిలోనే ఉండేదని, ఆ సమయంలోనే ఆమెతో తనకు పరిచయం అయ్యిందని జోహన్ తెలిపాడు. ఆమె ఇంటిలోనివారు అభ్యంతరం చెప్పినా, తాను వారిని ఎదిరించి మీనాక్షిని వివాహం చేసుకున్నానని తెలిపాడు. తరువాత తమకు కుమార్తె పుట్టిందన్నాడు. మీనాక్షి పోటీ పరీక్షలకు సిద్ధమవుతుండేదని, నర్సు ఉద్యోగం కోసం తీవ్రంగా ప్రయత్నించేదని, ఆమె నర్సింగ్ శిక్షణకు తాను లక్షా 15 వేలు ఖర్చు చేశానని జోహన్ పేర్కొన్నాడు. బీమా పాలసీ వదులుకుని మరీ ఆమె చదువుకు వెచ్చించానని తెలిపాడు. ప్రభుత్వ నర్సుగా ఎంపికైన ఆమెకు ఖండ్వా జిల్లా ఆసుపత్రిలో పోస్టింగ్ రావడంతో అక్కడికి వెళ్లిపోయిందన్నారు. ‘కుమార్తెనూ లాక్కుపోయారు’ నర్సు అయ్యాక మీనాక్షి ధోరణి పూర్తిగా మారిపోయిందని, తన దగ్గరకు రావడం మానేసిందని, పుట్టింటిలోనే ఉంటున్నదని, తాను ఆమె దగ్గరకు వెళ్లి బతిమాలినా తనను భర్త కాదు పొమ్మంటున్నదని జోహన్ ఆవేదన వ్యక్తం చేశాడు. తన జీవితంలోకి మరొకరు వచ్చారని, తనను మరో వివాహం చేసుకొమ్మంటున్నదని జోహర్ తెలిపాడు. తమ కుమార్తెను మీనాక్షి అన్నదమ్ములు బలవంతంగా వారితో పాటు తీసుకుపోయారని జోహన్ తెలిపాడు. మీనాక్షి వలన తాను అప్పుల పాలయ్యానని, ఆమె తిరిగి తన దగ్గరకు వచ్చేలా చూడాలని జోహన్ కలెక్టర్కు విన్నవించుకున్నాడు. ఇది కూడా చదవండి: లాటరీలో రూ. 18 కోట్ల జాక్పాట్.. ఒక్క ఈమెయిల్తో జీవితాలు తారుమారు -
Asian Games 2023: ఆసియా క్రీడల్లో ఆడనివ్వండి
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో భారత ఫుట్బాల్ జట్టుకు ఆడే అవకాశం కలి్పంచాలని కోరుతూ సీనియర్ టీమ్ హెడ్ కోచ్ ఐగర్ స్టిమాక్ దేశ ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. సెపె్టంబర్ 23 నుంచి చైనాలోని హాంగ్జూలో ఆసియా క్రీడలు జరగనున్నాయి. ఇందులో ఫుట్బాల్ క్రీడాంశంలో వివిధ దేశాలకు చెందిన అండర్–23 స్థాయి టీమ్లు పాల్గొంటాయి. ఈ జట్లలో ముగ్గురు సీనియర్ ఆటగాళ్లకు కూడా ఆడే వెసులుబాటు కలి్పస్తారు. అయితే టీమ్ ఈవెంట్లలో ర్యాంకింగ్స్లో టాప్–8లో ఉంటేనే మన జట్లను పంపిస్తామని భారత క్రీడా శాఖ మాత్రం విధానం రూపొందించుకుంది. ప్రస్తుతం ఆసియాలో భారత ఫుట్బాల్ జట్టు 18వ ర్యాంక్లో ఉంది. దాంతో ఫుట్బాల్ టీమ్ను పంపడానికి అవకాశం లేదు. దీనిపైనే ప్రధాని జోక్యం చేసుకోవాలంటూ స్టిమాక్ సోషల్ మీడియాలో సుదీర్ఘ లేఖ రాస్తూ ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. భారత్ 2017లో అండర్–17 ప్రపంచ కప్కు ఆతిథ్యమిచ్చింది. నాటి జట్టులో ఆడినవారే ఇప్పుడు అండర్–23 క్వాలిఫయర్స్లో మెరుగ్గా రాణించారు. ఈ కుర్రాళ్లలో మంచి ప్రతిభ ఉంది. కానీ ఇప్పుడు ఆసియా క్రీడల్లో మన జట్టు పాల్గొనకుండా అడ్డు చెబుతున్నారు. ఈ టీమ్లో అలాంటి ప్రతిష్టాత్మక ఈవెంట్లో పాల్గొనాలి. జట్టును పంపకుండా ఉండేందుకు చెబుతున్న కారణాలు సహేతుకంగా లేవు. అందుకే భారత్ కోచ్గా ఈ విషయాన్ని మీ దృష్టికి, కేంద్ర క్రీడాశాఖ దృష్టికి తీసుకొస్తున్నాను. కాబట్టి మీరు జోక్యం చేసుకొని జట్టు ఆసియా క్రీడల్లో పాల్గొనేలా చేయాలి అని స్టిమాక్ అన్నారు. ఎలాంటి ప్రత్యర్థినైనా ఓడించే సత్తా మన జట్టుకు ఉందని ఆయన అభిప్రాయ పడ్డారు. ‘ర్యాంకింగ్ పేరు చెప్పి మన క్రీడా శాఖనే జట్టు పాల్గొనకుండా చేస్తోంది. నిజానికి ఆసియా క్రీడల్లో పాల్గొంటున్న కొన్ని ఇతర క్రీడల టీమ్ల కంటే మన ఫుట్బాల్ జట్టు ర్యాంక్ మెరుగ్గానే ఉంది. పైగా తమకంటే బలమైన జట్లపై చిన్న టీమ్లు సంచలన విజయాలు సాధించడం ఫుట్బాల్లో అసాధ్యమేమీ కాదని చరిత్ర చెబుతోంది’ అని స్టిమాక్ అభిప్రాయపడ్డారు. ఇటీవల ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా అక్కడి స్టార్ ఆటగాడు కిలియాన్ ఎంబాపె భారత్లో సూపర్హిట్ అని, అతనికి అక్కడికంటే మన దేశంలోనే ఎక్కువ మంది అభిమానులు ఉన్నారని నరేంద్ర మోదీ చెప్పిన విషయాన్ని స్టిమాక్ గుర్తు చేశారు. ‘ఫ్రాన్స్ పర్యటనలో ఎంబాపె గురించి మీరు చేసిన వ్యాఖ్య భారత ఫుట్బాల్ను అభిమానించేవారందరికీ సంతోషం కలిగించింది. మన జట్టు ఆసియా క్రీడల్లో పాల్గొనేలా చూడాలని భారత టీమ్ తరఫున మిమ్మల్ని కోరుతున్నా. క్రీడాశాఖ సూచనల్లో ఒక ప్రత్యేక నిబంధన కూడా ఉంది. టాప్–8లో లేకపోయినా సరైన కారణంతో నిపుణుల బృందం సిఫారసు చేస్తే ఆ టీమ్ను ఆసియా క్రీడలకు పంపవచ్చు. దీని ప్రకారం అవకాశం కలి్పంచండి’ అని స్టిమాక్ కోరారు. భారత ఫుట్బాల్ జట్టు 1951 న్యూఢిల్లీ, 1962 జకార్తా ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలు... 1970 బ్యాంకాక్ ఆసియా క్రీడల్లో కాంస్య పతకం సాధించింది. ఆ తర్వాత పలుమార్లు భారత జట్టు ఆసియా క్రీడల్లో పాల్గొన్నా ఆరంభ రౌండ్లలోనే ని్రష్కమించింది. -
జీల్ ప్రమోటర్లకు శాట్ షాక్
ముంబై: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మధ్యంతర ఆదేశాలకు వ్యతిరేకంగా మీడియా దిగ్గజం జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్(జీల్) ప్రమోటర్లు చేసిన అప్పీల్ను సెక్యూరిటీస్ అపిల్లేట్ ట్రిబ్యునల్(శాట్) కొట్టివేసింది. (దేశంలో రిచెస్ట్ గాయని ఎవరో తెలుసా?ఏఆర్ రెహమాన్తో పోలిస్తే?) ఏడాదిపాటు లిస్టెడ్ కంపెనీలలో ఎలాంటి బాధ్యతలూ చేపట్టకుండా సెబీ నిలువరించడాన్ని వ్యతిరేకిస్తూ సుభాష్ చంద్ర, పునీత్ గోయెంకా శాట్ను ఆశ్రయించారు. నిధుల మళ్లింపు కేసులో వీరిరువురూ లిస్టెడ్ కంపెనీలలో ఎలాంటి డైరెక్టర్లు లేదా కీలక యాజమాన్య బాధ్యతలు చేపట్టకుండా సెబీ మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ఎస్సెల్ గ్రూప్ చైర్మన్ సుభాష్ చంద్ర, జీల్ ఎండీ, సీఈవో పునీత్ గోయెంకా అïప్పీల్పై ఆదేశాలను జూన్ 27కు శాట్ రిజర్వులో ఉంచింది. (ఐటీఆర్ ఫైలింగ్లో తప్పుడు వివరాలిచ్చారో : స్ట్రాంగ్ వార్నింగ్) -
పీఎల్ఐని సులభతరం చేయాలి
న్యూఢిల్లీ: ఉత్పత్తి అనుసంధానిత పథకం (పీఎల్ఐ) కింద కంపెనీలకు ఇచ్చే ద్రవ్యపరమైన ప్రోత్సాహకాల విషయంలో అర్హత నిబంధనలను సరళీకరించాలని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ అనే పరిశోధనా సంస్థ (జీటీఆర్ఐ) కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వం ఈ పథకం కింద ప్రకటించిన ప్రోత్సాహకాలు దుర్వినియోగం కాకుండా రక్షణ కూడా ఉండాల్సిన అవసరాన్ని ప్రస్తావించింది. కేంద్ర సర్కారు భారత్లో తయారీని పెంచి, దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించి, స్వావలంబన సాధించేందుకు పీఎల్ఐ పథకాన్ని తీసుకురావడం తెలిసిందే. దీని కింద 14 రంగాల్లో అదనపు ఉత్పత్తిని సాధించేందుకు రూ.1.97 లక్షల కోట్ల ద్రవ్య ప్రోత్సాహకలను ప్రకటించడం గమనార్హం. ఈ క్రమంలో జీటీఆర్ఐ చేసిన సూచనలకు ప్రాధాన్యం ఏర్పడింది. కంపెనీలు కాంట్రాక్టు తయారీదారులు లేదా గ్రూపు సంస్థల మద్దతుతో ఉత్పత్తి గణాంకాల్లో మోసాలకు పాల్పడే అవకాశం లేకపోలేదని జీటీఆర్ఐ హెచ్చరించింది. ఇందుకు 2003–06 మధ్య టార్గెట్ ప్లస్ పథకం కింద జరిగిన దుర్వినియోగాన్ని ప్రస్తావించింది. ‘‘పీఎల్ఐ పథకాన్ని అమలు చేసే ప్రభుత్వ విభాగాలు గతంలో టార్గెట్ ప్లస్ పథకం దుర్వినియోగాన్ని అధ్యయనం చేసి, అప్రమత్తంగా ఉండాలి. త్రైమాసికం వారీగా ప్రోత్సాహకాలను విడుదల చేసే సమయంలో ఈ రిస్క్ మరింత పెరుగుతుంది’’అని జీటీఆర్ఐ సహ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ సూచించారు. విడిభాగాల తయారీని ప్రోత్సహించాలి.. నిర్ధేశిత పెట్టుబడులు, ఉత్పత్తి, అమ్మకాలు, స్థానిక విడిభాగాలు/ముడి పదార్థాల వినియోగం తదితర అర్హత నిబంధనల్లో అన్నింటికీ తయారీ దారులు అర్హత పొందలేకపోవచ్చని జీటీఆర్ఐ తన నివేదికలో ప్రస్తావించింది. ‘‘చాలా కేసుల్లో ఉత్పత్తి అసలు విలువ లేదా ఇన్వాయిస్ వ్యాల్యూని తెలుసుకోవడం కష్టం. నిబంధనలు తక్కువగా, పారదర్శకంగా ఉండాలి’’అని పేర్కొంది. తుది ఉత్పత్తికి బదులు విడిభాగాల స్థానిక ఉత్పత్తికి ప్రోత్సాహకాలు ఇవ్వడం మెరుగైన విధానంగా అభిప్రాయపడింది. ఐరోపా యూనియన్ విధించిన కార్బన్ బోర్డర్ పన్నును త్వరలో మరిన్ని దేశాలు కూడా అనుసరించొచ్చని, ఈ అనుభవాల నేపథ్యంలో భారత్ శుద్ధ ఇంధన టెక్నాలజీలపై ఇన్వెస్ట్ చేయాలని సూచించింది. -
వడ్డీ రేట్ల పెంపు వేగాన్ని తగ్గించండి.. ఆర్బీఐకి సీఐఐ విజ్ఞప్తి
న్యూఢిల్లీ: వడ్డీ రేట్ల పెంపు వేగాన్ని కాస్త తగ్గించే అంశాన్ని పరిశీలించాలని రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ)కి పరిశ్రమల సమాఖ్య సీఐఐ విజ్ఞప్తి చేసింది. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను కట్టడి చేసేందుకే ఆర్బీఐ ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 190 బేసిస్ పాయింట్ల మేర పెంచినప్పటికీ .. దాని ప్రతికూల ప్రభావాలు ప్రస్తుతం కార్పొరేట్ రంగంపై కనిపిస్తున్నాయని పేర్కొంది. జులై–సెప్టెంబర్ త్రైమాసికంలో 2,000 పైచిలుకు కంపెనీల ఆదాయాలు, లాభాలు ఒక మోస్తరు స్థాయికే పరిమితమయ్యాయని తమ విశ్లేషణలో వెల్లడైనట్లు సీఐఐ తెలిపింది. దీంతో ‘అంతర్జాతీయ అనిశ్చితుల కారణంగా దేశీయంగా వృద్ధికి సవాళ్లు ఎదురయ్యే నేపథ్యంలో గతంలో లాగా 50 బేసిస్ పాయింట్ల స్థాయిలో కాకుండా వడ్డీ రేట్ల పెంపు వేగాన్ని కాస్త తగ్గించడాన్ని పరిశీలించాలి‘ అని ఆర్బీఐని సీఐఐ కోరింది. ఇంకా 6 శాతం ఎగువనే ఉంటున్న ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు అవసరమైతే మరో 25 నుండి 35 బేసిస్ పాయింట్ల వరకూ మాత్రమే పెంచే అవకాశాలను పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది. ఆర్బీఐ పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) డిసెంబర్ తొలి వారంలో వడ్డీ రేట్ల విషయంలో నిర్ణయాన్ని ప్రకటించనున్న నేపథ్యంలో సీఐఐ విజ్ఞప్తి ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటు ధరలను కట్టడి చేస్తూనే అటు వృద్ధికి కూడా ఊతమిచ్చేలా ఆర్బీఐ గతంలో లాగా తన అమ్ములపొదిలో ఉన్న అస్త్రాలన్నీ ఉపయోగించాలని సీఐఐ అభిప్రాయపడింది. అంతర్జాతీయంగా ఇన్వెస్టర్లు రిస్కులను తీసుకోవడానికి ఇష్టపడని ధోరణులు పెరుగుతుండటం .. భారత్లోకి విదేశీ పెట్టుబడుల ప్రవాహంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని వివరించింది. దీనితో కరెంటు అకౌంటు లోటును భర్తీ చేసుకోవడంలోనూ సవాళ్లు ఎదురుకానున్నట్లు పేర్కొంది. ప్రభుత్వం కేవలం విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడులను (ఎఫ్పీఐ) మాత్రమే ఎక్కువగా పట్టించుకోవడం కాకుండా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ), ఎన్నారై నిధుల ప్రవాహంపై కూడా దృష్టి పెట్టాలని సీఐఐ అభిప్రాయపడింది. -
బాంబే డైయింగ్కు సెబీ భారీ షాక్, కంపెనీ స్పందన ఇది!
సాక్షి, ముంబై: ఆర్థిక నివేదికల వెల్లడిలోఅవకతవకలు, అక్రమాల ఆరోపణలపై మార్కెట్ రెగ్యులేటరీ సెబీ నిషేధాన్ని ఎదుర్కొంటున్న ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ బాంబే డైయింగ్ న్యాయ పోరాటానికి దిగింది. సెబీ ఆర్డర్పై అప్పీల్ చేయడానికి తన చట్టబద్ధమైన హక్కును వినియోగించు కుంటుందని బాంబే డైయింగ్ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఈ ఉత్తర్వులకు వ్యతిరేకంగా సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (సాట్)ని ఆశ్రయించనున్నట్లు బాంబే డైయింగ్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ లిమిటెడ్ తెలిపింది. తమకు న్యాయం జరుగుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. సెబీ ఆర్డర్ను తాను పరిశీలించామని, అయితే దశాబ్దం క్రితం నాటి ఖాతాలపై సెబీ చర్యలు చేపట్టిందని తెలిపింది. 2011-12 ఆర్థిక సంవత్సరం, 2018-19 ఆర్థిక సంవత్సరం నాటి చెల్లుబాటు కాని ఖాతాలను, ఆమోదించని, లేదా సరిగా లేని వివరాలను అన్వయించడానికి ప్రయత్నించిందని కంపెనీ పేర్కొంది. కాగా ఫైనాన్సియల్ స్టేట్మెంట్స్లో తప్పుడు సమాచారం ఇచ్చారన్న అభియోగంపై సెబీ సెక్యూరిటీస్ మార్కెట్లో ప్రవేశించకుండా సెబీ రెండు సంవత్సరాల పాటు నిషేధం విధించింది. అలాగే వాడియా గ్రూప్పై సెబీ 157.5 మిలియన్ రూపాయల జరిమానా కూడా విధించింది. 2011-12, 2018-19 సంవత్సరాల్లో కంపెనీ కార్యకలాలపై నిశితంగా పరిశీలించినట్లు సెబీ తెలిపింది. అంతేకాదు వాడియా గ్రూప్నకు చెందిన బొంబే డైయింగ్ ప్రమోటర్స్ నుస్లీవాడియా, ఆయన ఇద్దరు కుమారులను కూడా సెక్యూరిటీ మార్కెట్లో కార్యకలాపాలు నిర్వహించకుండా రెండేళ్ల పాటు బ్యాన్ చేసింది. దీంతోపాటు వాడియా గ్రూప్కు చెందిన మరో కంపెనీ స్కేల్ సర్వీసెస్పైనా నిషేధం విధించింది. ఈ కంపెనీకి చెందిన మాజీ డైరెక్టర్లు డీఎస్ గగ్రాత్, ఎన్హెచ్ దంతేవాలా, శైలేష్ కార్నిక్, ఆర్ చంద్రశేఖరన్, బొంబే డైయింగ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ దర్గేష్ మెహతాపై కూడా సెబీ నిషేధం విధించింది. ఈ లాభాలకు కంపెనీ రియల్ ఎస్టేట్ విభాగం బాంబే డైయింగ్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ మాత్రమే బాధ్యత వహిస్తుందని ఆర్డర్ పేర్కొంది. స్కేల్తో కలిసి బీడీఎంసీఎల్ ఉద్దేశపూర్వకంగా ఆర్థిక నివేదికల తారుమారు చేసి, లాభాలను చూపించిన మార్కెట్ నిబంధలను ఉల్లఘించడమే కాకుండా షేర్ ధరలపై తప్పుదారి పట్టించేలా వ్యవహరించిందని సెబీ హోల్టైమ్ సభ్యుడు అనంత బారువా ఉత్తర్వులో పేర్కొన్నారు. బాంబే డైయింగ్ కంపెనీ పాలిస్టర్,టెక్స్టైల్స్, రియల్ ఎస్టేట్తో పాటు పది రంగాల్లో వ్యాపారాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. -
పుతిన్ ఇక చాలు.. మారణహోమం ఆపెయ్
రోమ్: ఉక్రెయిన్లో మారణహోమాన్ని ఆపాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను వేడుకున్నారు పోప్ ఫ్రాన్సిస్. యుద్ధం మొదలైన ఆరు నెలల తర్వాత తొలిసారి ఈమేరకు విజ్ఞప్తి చేశారు. సెయింట్ పీటర్స్బర్గ్లో వేలాది మందిని ఉద్దేశించి పోప్ మాట్లాడారు. యుద్ధం తీవ్రరూపం దాల్చి అణుబాంబులతో దాడులు చేసుకునే పరిస్థితి వచ్చేటట్టు ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని నెలలుగా ఉక్రెయిన్లో జరుగుతున్న రక్తపాతం తనను వెంటాడుతోందని అన్నారు. యుద్దం వల్ల సొంత ప్రజల ప్రేమను కూడా పుతిన్ కోల్పోతున్నారని పేర్కొన్నారు. యుద్ధం ఆపేందుకు రష్యా శాంతి ప్రతిపాదనలు చేస్తే దయచేసి అంగీకరించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెల్న్స్కీని కూడా కోరారు పోప్. రష్యాతో శాంతి చర్చలకు సుముఖంగా ఉండాలని సూచించారు. రెండు దేశాల యుద్ధం కారణంగా ప్రపంచదేశాలపై కూడా తీవ్ర ప్రభావం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే ఉక్రెయిన్ ప్రాంతాలను పుతిన్ రష్యాలో విలీనం చేయడం సరికాదని పోప్ అభిప్రాయపడ్డారు. ఇది అంతర్జాతీయ నిబంధనలకు విరుద్దమన్నారు. చదవండి: నేలపై నుంచి కాల్పులు.. విమానంలోకి దూసుకెళ్లిన బుల్లెట్ -
ఆ భూమి సినీ పెద్దలదే..
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ సర్వే నంబర్ 4, 5, 8, 9, 10, 12లోని 26.16 ఎకరాల భూమి సినీ పెద్దలదేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ భూమి ప్రభుత్వానిదే అనేందుకు ఆధారాలను సర్కార్ చూపలేకపోయిందని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ అప్పీల్ను కొట్టివేసింది. ఖానామెట్లో నిర్మాత డి.రామానాయుడు, దర్శకుడు కె.రాఘవేంద్రరావు, గోవిందరెడ్డి, ఇతరులు 26.16 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. సదరు భూమికి చెందిన హక్కుల వివాదంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ప్రభుత్వం రిట్ అప్పీల్ను దాఖలు చేసింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సూరేపల్లి నందా ధర్మాసనం విచారణ జరిపి బుధవారం ఉత్తర్వులిచ్చింది. మాజీ సైనికుడికి భూమి ఇచ్చిన పత్రాలపై సంతకాలకు అప్పటి తహసీల్దార్ సంతకాలకు పొంతన లేదని ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచంద్రరావు అంతకుముందు వాదనలు వినిపించారు. ఫోర్జరీ సంతకాలతో మాజీ సైనికుడికి కేటాయించిన ట్లుగా పత్రాలు సృష్టించారని, అతని నుంచి మరొక వ్యక్తి కొనుగోలు చేస్తే.. వారి నుంచి ప్రతివాదులు భూమిని కొనుగోలు చేశారన్నారు. 15 ఏళ్ల తర్వాత ప్రభు త్వం రికార్డులను సవరించడం చెల్లదని సింగిల్ ఇచ్చిన తీర్పును కొట్టేయాలని కోరారు. సినీ ప్రముఖుల తరఫు న్యాయవాది శ్రీరఘురాం వాదనలు వినిపించారు. ఆ భూమిని తాము కొనుగోలు చేసినప్పుడు అధికారులెవరూ అభ్యంతరం చెప్పలేదన్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ చేయడం చెల్లదన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. ఈ భూముల వ్యవహారంలో రాష్ట్ర సర్కార్ జోక్యం చేసుకోరాదని, అనుబంధ స్వేతార్ రద్దు చేసి భూముల స్వాధీనానికి ప్రయత్నించరాదన్న సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో కలుగజేసుకోవడానికి నిరాకరించింది. ఆ భూమి ప్రభుత్వానిదే అనేందుకు ఆధారాలు చూపలేకపోయిందని తప్పుపట్టింది. సర్కార్ అప్పీల్ను కొట్టివేస్తున్నామని ఉత్తర్వులు ఇచ్చింది. -
అనంతపురం పోలీసులకు చిక్కిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సుంకర ప్రసాద్ నాయుడు
-
శ్రీలంక అధ్యక్ష ఎన్నికల వేళ.. భారత్ సాయం కోరిన ప్రేమదాస
కొలంబో: తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో నేడు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో శ్రీలంక ప్రతిపక్ష పార్టీ సమగి జన బలవేగయ నాయకుడు సాజిత్ ప్రేమదాస సోషల్ మీడియా వేదికగా భారత్కి ఒక విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో... "ప్రధాని నరేంద్ర మోదీకి, భారత్లోని అన్ని రాజకీయ పార్టీలకు నా హృదయ పూర్వక అభ్యర్థన. అధ్యక్షుడిగా ఎవరూ ఎన్నికైనా భారత్ లంక తల్లికి మద్దతిచ్చి సహాయం చేస్తు ఉండాలని కోరారు." నెలల తరబడి సాగిన నిరసనకారులు ఆందోళనల నడుమ శ్రీలంక మాజీ అధ్యక్షుడు గోటబయ రాజపక్స గతవారమే రాజీనామా చేశారు. రాజపక్స కుటుంబికులే ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఉన్నారని వారివల్లే ఆర్థిక సంక్షోభానికి దారితీసిందంటూ వెల్లువెత్తిన విమర్శల నేపథ్యంలో గోటబయ లంక విడిచిపెట్టి పోవాల్సి రావడమే కాకుండా పదవికి రాజీనామ చేయాల్సిన దుస్థితి ఎదురైంది. ఆయన వెళ్లిపోతూ.. లంక అధ్యక్ష బాధ్యతలు విక్రమ సింఘే రణిల్కి అప్పగించారు. దీంతో విక్రమసింఘే లంక తాత్కాలిక అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. కానీ విక్రమసింఘేను రాజపక్స మిత్రపక్షంగా చూసే నిరసనకారులు ఆయన పట్ల విముఖత చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే లంకలో అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. ఐతే ఈ అధ్యక్ష ఎన్నికల్లో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ప్రధాని రణీల్ విక్రమ సింఘే, విద్యాశాఖ మాజీ మంత్రి డల్లాస్ అలహప్పెరుమా, వామపక్ష జనతా విముక్తి పెరమున పార్టీ నేత అనురా దిస్సనాయకేలు పోటీ పడుతున్నట్లు పార్లమెంట్ ప్రకటించింది. ఐతే ఈ త్రిముఖ పోటీలో రణిల్ విక్రమసింఘేకే గెలిచే అవకాశాలు ఎక్కువని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదీగాక అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానన్న పెరమున నుండి విడిపోయిన గ్రూప్కు చెందిన కీలక నేత డల్లాస్ అలహప్పెరును అధ్యక్ష ఎన్నికకు పోటీ చేస్తుండటంతో సాజిత్ ప్రేమదాస ఈ ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు. 225 మంది సభ్యులున్న శ్రీలంక పార్లమెంట్లో బుధవారం అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో గెలిచిన అధ్యక్షుడు 2024 నవంబరు వరకు పదవిలో కొనసాగనున్నారు. (చదవండి: Sri Lanka Presidential Election: శ్రీలంక అధ్యక్ష బరిలో ముగ్గురు.. విక్రమ సింఘేకే అవకాశం!) -
కులభూషణ్ జాదవ్కు ఊరట.. ఐసీజే దెబ్బకు వెనక్కు తగ్గిన పాక్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ జైలులో మగ్గుతన్న భారత మాజీ నేవీ అధికారి కులభూషణ్ జాదవ్కు కాస్త ఊరట లభించింది. అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) తీర్పు మేరకు అతనికి అప్పీలు చేసుకునేందుకు హక్కు కల్పించే బిల్లును పాకిస్థాన్ పార్లమెంట్ ఆమోదించింది. 2017లో.. భారత మాజీ నేవీ అధికారి కులభూషణ్పై పాక్ ఉగ్రవాదం, గూఢచర్యం లాంటి ఆరోపణలు మోపిన పాక్ ఆర్మీ కోర్టు జాదవ్కు మరణ శిక్ష విధించింది. ఈ తీర్పుని భారత్ అంతర్జాతీయ కోర్టు (ఐసీజే)లో సవాల్ చేసింది. దీంతో ఇరు దేశాల వాదనలు విన్న ఐసీజే 2019లో భారత్కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. జాదవ్కు విధించిన మరణ శిక్షపై పునరాలోచించడంతోపాటు సమీక్షించాలని తెలిపింది. అంతర్జాతీయ న్యాయస్థానం ( ఐసీజే) తీర్పుకు సంబంధించి భారత ఖైదీ కులభూషణ్ జాదవ్కు అప్పీలు చేసుకునే హక్కును కల్పించే బిల్లును పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ ఆమోదించింది. 2020లో, ప్రతిపక్ష పార్టీల నిరసనలు ఉన్నప్పటికీ, కులభూషణ్ జాదవ్ విషయంలో ఐసీజే తీర్పును దృష్టిలో ఉంచుకుని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ ప్రభుత్వం నేషనల్ అసెంబ్లీలో ఒక ఆర్డినెన్స్ను సమర్పించింది. దీని ప్రకారం.. 'ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ రివ్యూ అండ్ రీకన్సిడరేషన్ ఆర్డినెన్స్ 2020' గతేడాది మే 20న అమల్లోకి వచ్చింది. చదవండి: చదువుకి మధ్యలో ఫుల్ స్టాప్.. అప్పుడు తీసుకున్న రిస్క్ మిలియనీర్గా మార్చింది! -
యాజమాన్యానికి ఇస్తే పిల్లల చదువుల బాధ్యత ఎవరు తీసుకుంటారు?
-
విద్యాదీవెన, ఇంటర్ ఆన్లైన్ అడ్మిషన్లపై అప్పీల్కు వెళ్తాం..
-
విద్యాదీవెన, ఇంటర్ ఆన్లైన్ అడ్మిషన్లపై అప్పీల్కు వెళ్తాం..
సాక్షి, అమరావతి: విద్యాదీవెన, ఇంటర్ ఆన్లైన్ అడ్మిషన్లపై అప్పీల్కు వెళ్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తల్లుల ఖాతాల్లో డబ్బులు వేస్తే జవాబుదారీతనం ఉంటుందన్నారు. యాజమాన్యానికి ఇస్తే పిల్లల చదువుల బాధ్యత ఎవరు తీసుకుంటారని మంత్రి ప్రశ్నించారు. 40 శాతం మంది యాజమాన్యాలకు చెల్లించట్లేదనే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. ‘‘కొన్ని కళాశాలల్లో పీఆర్వో వ్యవస్థ విద్యాదీవెన కోసమే అడ్మిషన్లు చేస్తున్నాయి. 75 శాతం అటెండెన్స్ లేకపోతే రెండో విడత రాదు. గతంలో ఇంటర్ అడ్మిషన్లలో రిజర్వేషన్లు పాటించలేదు. పూర్తి పారదర్శకత కోసమే ఆన్లైన్ విధానం. డిగ్రీ అడ్మిషన్లలో ఆన్లైన్ విధానం విజయవంతమైందని’’ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. ఇవీ చదవండి: టీడీపీ నేతల సహకారం.. అగ్రిగోల్డ్ భూములు హాంఫట్! ఎచ్చెర్ల టీడీపీ ‘కళా’విహీనం..! -
భారత అథ్లెట్ గోమతి అప్పీల్ తిరస్కరణ
న్యూఢిల్లీ: కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్)లో భారత మిడిల్ డిస్టెన్స్ రన్నర్ గోమతి మరిముత్తుకు చుక్కెదురైంది. డోపింగ్కు పాల్పడినందుకు గోమతిపై 2019లో నాలుగేళ్ల నిషేధం పడింది. దీనిని సవాల్ చేస్తూ ఆమె సీఏఎస్ను ఆశ్రయించింది. 2019 ఆసియా చాంపియన్షిప్లో 800 మీటర్ల పరుగులో గోమతి స్వర్ణం గెలవగా... ఆ తర్వాత ఆమె డోపింగ్లో పట్టుబడటంతో వరల్డ్ అథ్లెటిక్స్ డిసిప్లినరీ ట్రిబ్యునల్ నాలుగేళ్ల నిషేధం విధించింది. తాను పాలీ సిస్టిక్ ఓవరీ సిండ్రోమ్తో బాధపడుతుండటంతో పాటు గర్భస్రావం జరిగిన కారణంగా శరీరంలో 19–నోరాన్డ్రోస్టిరోన్ ఎక్కువగా కనిపించిందని, సరైన రీతిలో పరీక్షలు కూడా నిర్వహించలేదని ఆమె తన అప్పీల్లో పేర్కొనగా... ఆర్బిట్రేటర్ జాన్ పాల్సన్ దానిని త్రోసి పుచ్చి నిషేధం కొనసాగుతుందని తీర్పునిచ్చారు. -
మధ్యవర్తిత్వంతోనే ఇరు పార్టీలు హ్యాపీ!
సాక్షి, హైదరాబాద్: ‘కోర్టుల్లో కేసు గెలిస్తే ఒక పార్టీ మాత్రమే ఆనందంగా ఉంటుంది. ఓడిన పార్టీ అప్పీల్కు వెళ్తుంది. అయితే మీడియేషన్తో వివాదం పరిష్కారమైతే ఇరు పార్టీల ముఖాల్లో చిరునవ్వు చూడొచ్చు’అని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి వ్యాఖ్యానించారు. మీడియేషన్ ద్వారా కేసులను పరిష్కరించడంతో న్యాయస్థానాలపై కేసుల భారాన్ని తగ్గించడమే కాక అప్పీల్ రూపంలో కొత్త కేసులు నమోదు కావడం లేదని తెలిపారు. ఈ-మీడియేషన్ రైటింగ్స్ ఆధ్వర్యంలో ప్రచురించిన 10వ వార్షిక సంచికను జస్టిస్ హిమా కోహ్లి సోమవారం జూమ్ ఆన్లైన్ మీటింగ్ ద్వారా ప్రారంభించారు. అనంతరం ‘పీస్ బిగిన్స్ ఫ్రం హోం’అనే అంశంపై జస్టిస్ హిమా కోహ్లి ప్రసంగించారు. ఇంట్లో శాంతి లేకపోతే శరీరం ఒకచోట, మనసు ఇంకో చోట ఉంటుందని, ఇంట్లో శాంతి ఉన్నప్పుడే.. సమాజం ప్రశాంతంగా ఉంటుందని చెప్పారు. వివాదాల పరిష్కారంలో మీడియేటర్లు కీలక భూమిక పోషిస్తున్నారని, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య, అన్నాతమ్ముళ్ల మధ్య ఇలాంటి కుటుంబ వివాదాలు పరిష్కరించడం ద్వారా ఆ కుటుంబీకుల ముఖాల్లో చిరునవ్వు చూడటానికి మించిన సంతృప్తి లేదని వెల్లడించారు. ఆ బాధ వర్ణించలేం.. ఇంట్లో ప్రశాంతత లేకపోతే ఆ కుటుంబంలో అశాంతి నెలకొంటుందని, ఆ బాధ వర్ణించలేమని జస్టిస్ టి.అమర్నాథ్గౌడ్ పేర్కొన్నారు. కుటుంబ వివాదాల పరిష్కారంలో మీడియేటర్లు క్రియాశీలంగా వ్యవహరించాలని సూచించారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీడియేటర్లు వివాదాలను పరిష్కరించడం అభినందనీయమని తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నరసింహారెడ్డి అన్నారు. ఓ కుటుంబ వివాదంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు కారణంగా.. కుటుంబ వివాదాల్లో పోలీస్స్టేషన్కు వచ్చే భార్యాభర్తలకు ముందుగా కౌన్సెలింగ్ ఇవ్వడం ద్వారా 40 శాతం వివాదాలను పరిష్కరించగలు గుతున్నామని నగర జాయింట్ కమిషనర్ అవినాశ్ మొహంతి పేర్కొన్నారు. మరో 25 శాతం వివాదాలు ఇరు పక్షాల విజ్ఞప్తి మేరకు కేసుల దాకా వెళ్లకుండా పెండింగ్లో ఉంటున్నాయని, 35 శాతం వివాదాలు కేసుల వరకు వెళ్తున్నాయని తెలిపారు. -
హైకోర్టులో అప్పీల్ చేయనున్న సమత దోషులు
సాక్షి, ఆదిలాబాద్: సమత కేసులో ఉరిశిక్ష పడిన ముగ్గురు దోషులు అప్పీల్ కోసం హైకోర్టుకు వెళ్లనున్నారు. దోషులకు కోర్టు విధించిన 26 వేల రూపాయల జరిమానాను శనివారం రోజున కుటుంబ సభ్యులు చెల్లించారు. రేపు హైకోర్టులో అప్పీల్ చేయనున్నట్లు తెలుస్తోంది. సమత అత్యాచారం, హత్య కేసులో షేక్ బాబు, షాక్ షాబుద్దీన్, షేక్ మగ్దుమ్కి ఇప్పటికే ప్రత్యేక న్యాయస్థానం ఉరి శిక్ష విధించింది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సమత అత్యాచారం, హత్య కేసులో నిందితులను దోషులుగా నిర్ధారించిన ఆదిలాబాద్ ప్రత్యేక కోర్టు.. వారికి ఉరి శిక్ష తీర్పు విధిస్తూ సంచలన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. గతేడాది నవంబర్ 24న ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం ఎల్లాపటార్లో సమతపై ముగ్గురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడి, దారుణంగా హత్య చేశారు. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్లో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి ఈ కేసులో న్యాయ మూర్తి విచారణ జరిపి మరణశిక్ష విధించారు. (‘మరణమే’ సరి..) -
మా బిడ్డలు ఆకలితో చచ్చిపోతే..బాధ్యులెవరు?
జెట్ ఎయిర్వేస్ సంక్షోభం ఉద్యోగుల పాలిట అశనిపాతంలా తాకింది. సంస్థలోని ఒక్కో ఉద్యోగిది ఒక్కో గాథ. అర్థాంతరంగా ఉపాధి కోల్పోయిన ఉద్యోగి పరిస్థితికి అద్దం పడుతున్న వారి ఆవేదన వర్ణనాతీతం. తమ భవిష్యత్తును తలుచుకొని కన్నీరుమున్నీరవుతున్న వైనం కలవర పరుస్తోంది. రుణ వితరణకు సంబంధించి ఎలాంటి పరిష్కారం లభించకపోవడంతోబుధవారం రాత్రి నుంచి అన్ని సర్వీసులనూ తాత్కాలికంగా రద్దు చేసినట్లు సంస్థ ప్రకటించింది. దీంతో దాదాపు 22వేలమందికి పైగా ఉద్యోగులు రోడ్డున పడ్డారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన జెట్ ఎయిర్వేస్ ను ఆదుకునేందుకు ఫౌండర్ నరేష్ గోయల్ సంస్థనుంచి తప్పుకుంటే.. రూ.1,500 కోట్ల మేర నిధులను సమకూరుస్తామని ఎస్బీఐ కన్సార్షియం చెప్పింది. దీని ప్రకారం ఆయన కంపెనీని వీడారు. కానీ ఇపుడు కనీసం 400కోట్ల రూపాయలు ఇవ్వడానికి కూడా బ్యాంకులు అంగీకరించడంలేదు. ఇందులో తప్పెవరిది? ఈ వ్యవహారంలో ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకోవడంలేదని ఉద్యోగులు మండిపడ్డారు. తమ ఉద్యోగాలకు ఎవరు బాధ్యత వహిస్తారు? మాజీ ఫౌండర్ నరేష్ గోయాల్? లేక ఎస్బీఐ యాజమాన్యమా అని ప్రశ్నిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. తమ బిడ్డలు ఆకలితో చచ్చిపోతోంటే ఎవరూ పట్టించుకోవడంలేదు. వారికి ఓట్లు మాత్రమే కావాంటూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకొని... తమ కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తమ కష్టాల్ని గుర్తించి జెట్ ఎయిర్వేస్ను ఈ సంక్షోభం నుంచి గట్టెక్కించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తమకు రెండునెలలుగా వేతనాలు లభించకపోవడంతో తమ పిల్లల స్కూలు ఫీజులు, లోన్ల ఈఎంఐలు, ఇలా చాలా బకాయిలు పేరుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. సంస్థలో ఐదేళ్లుగా పనిచేస్తున్న ప్రథమేష్ (27)ది కూడా ఇదే ఆవేదన. సంస్థమీద తనకు పూర్తి విశ్వాసం ఉందని సీనియర్ ఉద్యోగి అనిల్ సాహు(50) ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుత సునామీ ఉపద్రవంముంచుకొచ్చిందని, దీన్నుంచి కోలుకుని త్వరలోనే మళ్లీ పూర్వ వైభవం వస్తుందన్నారు. కానీ 50 ఏళ్ల వయసులో మరో ఎయిర్లైన్స్ సంస్థలో జాబ్ సంపాదించుకోవడం తేలిక కాదన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా సగం శాలరీకే చేరాల్సి వస్తుందని మరికొందరు ఉద్యోగులు పేర్కొన్నారు. ఏడేళ్లుగా పనిచేస్తున్న మరో ఉద్యోగి అమీనా, ఇప్పటికు తనకు తనకు లాంటి ఇబ్బంది లేదని, తిరిగి తమ సంస్థ పుంజుకుంటుందని భావిస్తున్నానన్నారు. జీతాల్లేవు.. అందుకే ప్రాఫిడ్ ఫండ్ విత్ డ్రా చేసి మరీ పిల్లల ఫీజులు కట్టాను. మా అమ్మ (70) వైద్య ఖర్చులు భరించడం ఇపుడొక సవాల్ - శంకర్ చక్రవర్తి (50) సీనియర్ అస్టిస్టెంట్ ఇంజనీర్. 1993నుంచి సంస్థలో పనిచేస్తున్న ఈయన జీతం నెలకు రూ.80వేలు. జెట్ ఎయిర్వేస్లో చేరినపుడు ఎన్నో కలలు కన్నాను. అందంతా మూణ్ణాళ్ల ముచ్చటగా మారిపోయింది - రమన్ రాజపుత్ (26) క్యాబిన్ క్రూ నేను సింగిల్ పేరెంట్ని. 12 ఏళ్ల కొడుకుని ఎలా పోషించాలి. భవిష్యత్తు అగ్యమగోచరంగా ఉంది -మోనికా బక్షి (42) కస్టమర్ సర్వీస్ అసిస్టెంట్ మరోవైపు సంస్థ సంక్షోభం గురించి ఎవరూ మీడియాతో మాట్లాడరాదంటూ జెట్ ఎయిర్వేస్ తమ సిబ్బందికి సూచించింది. జెట్ కొనుగోలు ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. -
వారికి ఏం రక్షణ ఉన్నట్లు?
సాక్షి, హైదరాబాద్ : ‘అధికారంలో ఉన్న పార్టీ ఏదైనా సరే.. ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులు సభలో ఉండటం అసౌకర్యంగా ఉందని భావించి, వారిని బహిష్కరిస్తుంటే, ఆ సభ్యులకు చట్ట ప్రకారం ఏం రక్షణ ఉన్నట్లు’అని హైకోర్టు ప్రశ్నించింది. కోమటిరెడ్డి బహిష్కరణకు మండలి చైర్మన్పై హెడ్ఫోన్ విసరడం కారణమైనప్పుడు, సంపత్ను ఏ కారణంతో బహిష్కరించారో చెప్పాలని అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరఫు సీనియర్ న్యాయవాదిని నిలదీసింది. ఈ రెండు విషయాలపై స్పష్టతనివ్వాలని ఆదేశించింది. గురువారం ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఎస్.ఎ.సంపత్కుమార్ల బహిష్కరణ తీర్మానంతోపాటు, వారు ప్రాతినిధ్యం వహిస్తున్న నల్లగొండ, ఆలంపూర్ అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయినట్లు ప్రకటిస్తూ జారీ చేసిన నోటిఫికేషన్ను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఈనెల 17న తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పును సవాలు చేస్తూ 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. అప్పీల్ దాఖలుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అనుమతినివ్వాలా? వద్దా? అనే దానిపై ధర్మాసనం విచారణ ప్రారంభించింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్ తన వాదనలను వినిపిస్తూ, సభ ప్రతిష్టను దిగజార్చేలా సభ్యులు అనుచితంగా ప్రవర్తిస్తే, వారిని బహిష్కరించే అధికారం సభకు ఉందని వివరించారు. బహిష్కరణకు సంబంధించి రాజ్యాంగంలో ఎలాంటి నియమ, నిబంధనలు లేవని తెలిపారు. రాజ్యాంగంలోని అధికరణ 184(3) ప్రకారం సభకు కొన్ని ప్రత్యేక, అసాధారణ అధికారాలున్నాయని, పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకునే అధికారం సభకు ఉందని, ఆ మేరకే కోమటిరెడ్డి, సంపత్లను బహిష్కరించారని చెప్పారు. సింగిల్ జడ్జి తన తీర్పులో సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా బహిష్కరణ ఉందని చెప్పారే తప్ప, సభ్యుల అనుచిత ప్రవర్తన గురించి పట్టించుకోలేదని వివరించారు. మండలి చైర్మన్పై హెడ్ఫోన్ విసిరినట్లు కోమటిరెడ్డి, సంపత్ తమ పిటిషన్లోనే అంగీకరించిన విషయాన్ని పరిగణనలోకి తీసుకోలేదని తెలిపారు. ధర్మాసనం స్పందిస్తూ, ఈ విషయాలను తీర్మానంలో ప్రస్తావించలేదు కదా? హెడ్ఫోన్ విసరడం వల్లే బహిష్కరించినట్లు ఎక్కడ పేర్కొన్నారు? అని ప్రశ్నించింది. హెడ్ఫోన్ విసిరి గాయపరిచిన ఘటనకు సభ మొత్తం సాక్ష్యమని, అలాంటి వాటికి కారణాలు వివరించాల్సిన అవసరం లేదని వైద్యనాథన్ తెలిపారు. దీనికి ధర్మాసనం.. కోమటిరెడ్డిని హెడ్ఫోన్ విసిరిన కారణంగా బహిష్కరించామంటున్నారు.. మరి సంపత్ను ఏ కారణంతో బహిష్కరించారని అడిగింది. దీనికి వైద్యనాథన్ సూటిగా సమాధానం ఇవ్వలేదు. దీనిపై తమకు స్పష్టతనివ్వాలని వైద్యనాథన్కు ధర్మాసనం స్పష్టం చేసింది. అప్పీల్ విచారణార్హతపై వాదనలు వినిపించాలని కోమటిరెడ్డి, సంపత్ల తరఫు న్యాయవాదిని ఆదేశిస్తూ తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. కోమటిరెడ్డి న్యాయవాదిపై ఆగ్రహం వాదనలు ప్రారంభం కావడానికి ముందు కోమటిరెడ్డి తరఫు న్యాయవాది రవిశంకర్ తీరును ధర్మాసనం తప్పుపట్టింది. సింగిల్ జడ్జి వద్ద కోమటిరెడ్డి, సంపత్ల తరఫున ఒక్కరే అఫిడవిట్లు దాఖలు చేసి.. తమ ముందు మాత్రం వేర్వేరుగా దాఖలు చేశామని చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది వృత్తిపరమైన దుష్ప్రవర్తన కిందకు వస్తుందని స్పష్టం చేసింది. దీనిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరఫు న్యాయవాది అభ్యంతరం చెబితే, విచారణకు ఆదేశించాల్సి ఉంటుందని తెలిపింది. అయితే వైద్యనాథన్ స్పందించకపోవడంతో ధర్మాసనం ఈ వ్యవహారాన్ని పక్కనపెట్టింది. -
ఆ తీర్పు అమలును నిలిపేయండి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఎస్.ఎ.సంపత్కుమార్ల బహిష్కరణ రద్దు తీర్పుపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్ నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం ఎదుట శుక్రవారం అప్పీల్ దాఖలైంది. తీర్పు అమలును నిలిపేయాలని కోరుతూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, జి.సాయన్న, మర్రి జనార్దన్రెడ్డి, గ్యాదరి కిశోర్ కుమార్, మాగంటి గోపీనాథ్, మల్లిపెద్ది సుధీర్రెడ్డి, కె.పి.వివేకానంద, అరికెపూడి గాంధీ, మాధవరం కృష్ణారావు, కాలె యాదయ్య, రమావత్ రవీంద్రకుమార్ అప్పీల్ దాఖలు చేశారు. సింగిల్ జడ్జి ముందు కోమటిరెడ్డి, సంపత్ దాఖలు చేసిన వ్యాజ్యంలో ఈ 12 మంది ఎమ్మెల్యేలు ప్రతివాదులు కాదు. దాంతో నిబంధనల మేరకు అప్పీల్ దాఖలుకు కోర్టు అనుమతి కోరుతూ అనుబంధ పిటిషన్ కూడా దాఖలు చేశారు. అప్పీల్ను అనుమతించి అత్యవసరంగా విచారణ జరపాలన్న ఎమ్మెల్యేల తరఫు న్యాయవాది కటిక రవీందర్రెడ్డి అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. అప్పీల్ దాఖలుకు అనుమతించాలన్న అనుబంధ పిటిషన్పై బుధవారం ముందు విచారణ జరుపుతామని పేర్కొంది. సింగిల్ జడ్జి తీర్పు చట్టవిరుద్దం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం సందర్భంగా శాసనమండలి చైర్మన్ స్వామి గౌడ్పై హెడ్ఫోన్ విసిరి గాయపరిచారంటూ కోమటిరెడ్డి, సంపత్లను సభ నుంచి బహిష్కరించడం, వారు ప్రాతినిథ్యం వహిస్తున్న నల్లగొండ, ఆలంపూర్ అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయినట్లు ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ చేయడం తెలిసిందే. వాటిని సవాలు చేస్తూ వారు హైకోర్టును ఆశ్రయించారు. బహిష్కరణను, నోటిఫికేషన్ను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి జస్టిస్ శివశంకరరావు ఈ నెల 17న తీర్పునిచ్చారు. తీవ్ర తర్జనభర్జనల అనంతరం ప్రభుత్వం ఎమ్మెల్యేలను రంగంలోకి దించి దానిపై అప్పీల్ దాఖలు చేయించింది. సింగిల్ జడ్జి తీర్పు ఏ రకంగా చూసినా చట్ట విరుద్ధమేనని అప్పీల్లో వారు వాదించారు. ‘‘కోమటిరెడ్డి, సంపత్ సభ్యులుగా కొనసాగేందుకు అర్హులే కాదు. సభా మర్యాదలను వారు మంటగలిపిన తీరును మాతో పాటు సభ్యులంతా చూశారు. వారు పిటిషన్లో కోరిన వాటికి మించి జడ్జి అనుకూల ఉత్తర్వులిచ్చారు. అసలు వారి వ్యాజ్యాన్ని విచారణార్హంగా పరిగణించి ఉండకూడదు. వారి చర్యలు సభా ధిక్కారమే. వారి బహిష్కరణకు శాసన వ్యవహారాల మంత్రి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా తీర్మానించింది. వీడియో ఫుటేజీ ఇవ్వకపోవడం, సభ్యులకు బహిష్కరణ తీర్మానం, నోటీసు, వాదనలు వినిపించే అవకాశం ఇవ్వకపోవడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమంటూ జడ్జి తప్పుబట్టారు. కానీ సహజ న్యాయ సూత్రాల విషయంలో పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. సభ్యుల చర్యలు దుష్ప్రవర్తనే గాక సభా ధిక్కారం కూడా. ఇలాంటి వారిని అసెంబ్లీ ప్రొసీడింగ్స్కు అనుమతించడం అసాధ్యం. వారేం చేశారో సభంతా చూశాక వారి వాదన వినాల్సిన అవసరమే లేదు. తప్పు చేశారని స్పష్టమవుతుంటే సహజ న్యాయ సూత్రాలను పాటించాలనడంలో అర్థమే లేదు. పైగా సభ్యుల చర్యలు సభా ధిక్కారమైనప్పుడు, వారి వాదనలు వినే విషయంలో ఎలాంటి ప్రొసీజర్ లేనప్పుడు తగిన తీర్మానం జారీ చేసే అధికారం సభకుందని హైకోర్టు ధర్మాసనం గతంలో తీర్పునిచ్చింది’’అని పేర్కొన్నారు. ఆ అధికరణను సుప్రీంకోర్టే ఉపయోగించగలదు ‘‘అసెంబ్లీకి కొన్ని ప్రత్యేక, అసాధారణ అధికారాలున్నాయి. వాటి ప్రకారం సభ్యులను శిక్షించవచ్చు. సభా మర్యాదలకు భంగం కలిగించినా, సభను ధిక్కరించినా, ప్రతిష్టను దిగజార్చినా బాధ్యులైన సభ్యులను బహిష్కరించే అధికారం ఉంది. షోకాజ్ నోటీసు ఇవ్వకుండా ఉద్యోగులను శిక్షించరని జడ్జి పేర్కొన్నారు. దానికి, శాసనసభ్యుల శిక్షకు ఉన్న తేడాను విస్మరించారు. తప్పు చేసిన సభ్యులను మన్నించి వదిలేస్తే సభ సార్వభౌమాధికారం ప్రశ్నార్థకమవుతుంది. సభలో జరిగిన విషయాలపై న్యాయ సమీక్షకు వీల్లేదు. సభకు ప్రత్యేక, అసాధారణ అధికారాలున్నాయని జడ్జి విస్మరించారు. ఆధారాలు సమర్పించకుంటే అవి విరుద్ధంగా ఉన్నాయని భావిం చే పరిస్థితి ఈ కేసుకు వర్తించదు. జడ్జి 142వ అధికరణ కింద ఉన్న అధికారాన్ని ఉపయోగించి తీర్పునిచ్చారు. ఈ అధికారాన్ని సుప్రీంకోర్టే ఉపయోగించగలదు. ఫుటేజీ సమర్పణకు సభ తీర్మానం అవసరం లేదని పార్లమెంటరీ సభా విధానాల ను పరిశీలించకుండానే తీర్పునిచ్చారు. న్యాయపరమైన ఉత్తర్వుల ద్వారా సభ నుంచి డాక్యుమెంట్ను కోరితే సభ ప్రత్యే క, అసాధారణ అధికారాలకు విలువ లేనట్లే! సభ జరుగుతుండగా జరిగిన విషయాలకు సంబంధించిన డాక్యుమెంట్లు ఇచ్చేందుకు సభ తీర్మానం తప్పనిసరి. సభా హక్కుల ఉల్లంఘన జరిగిందా, లేదా తేల్చేందుకు పార్లమెంటు, శాసనసభలే సరైన అధికార వ్యవస్థలని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. జడ్జి తన తీర్పుతో సభ తీర్మానంలో జోక్యం చేసుకున్నారు’’ అని అప్పీల్లో ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. -
ఆరుషి కేసులో కొత్త మలుపు
సాక్షి, న్యూఢిల్లీ : ఆరుషి జంట హత్యల కేసు మరో కొత్త మలుపు తిరిగింది. తల్వార్ దంపతులను నిర్దోషులుగా విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ వచ్చిన అప్పీల్ను సోమవారం సుప్రీంకోర్టు స్వీకరించింది. పని మనిషి హేమ్రాజ్ భార్య కుంకాల బంజాడే ఈ కేసుపై పునర్విచారణ చేపట్టాలంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు పిటిషన్ను స్వీకరించిన జస్టిస్ రంజన్ గోగయ్ నేతృత్వంలోని బెంచ్.. తల్వార్ దంపతులకు నోటీసులు జారీ చేసింది. 2008లో దంత వైద్యులైన రాజేశ్, నూపుర్ తల్వార్ దంపతుల కుమార్తె ఆరుషి, వాళ్ల ఇంట్లో పని మనిషి హేమరాజ్లు హత్యకు గరైయ్యారు. ఈ కేసులో ఘజియాబాద్ కోర్టు తల్వార్ దంపతులను దోషులుగా తేలుస్తూ 2013లో యావజ్జీవ శిక్ష విధించింది. అయితే సరైన సాక్ష్యాలు లేని కారణంగా ఆరుషి తల్లిదండ్రులను అలహాబాద్ కోర్టు నిర్దోషులుగా తేలుస్తూ 2017లో తీర్పు వెలువరించింది. -
తీర్పు తారుమారవుతుందన్న సుబ్రహ్మణ్య స్వామి
సాక్షి,న్యూఢిల్లీ: 2జీ కేసు తీర్పుపై బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎగువ కోర్టుకు వెళితే తీర్పు తారుమారవుతుందంటూ తమిళనాడు మాజీ సీఎం జయలలిత అక్రమాస్తుల కేసును ప్రస్తావించారు.ఏ రాజా, కనిమొళి సహా నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటించిన ప్రత్యేక కోర్టు తీర్పుపై హైకోర్టులో అప్పీల్ చేసి ప్రభుత్వం తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని ఆయన ట్వీట్ చేశారు. రూ 30,000 కోట్ల 2జీ స్కామ్ కేసులో 19 మంది నిందితులను సీబీఐ ప్రత్యేక కోర్ట్ నిర్ధోషులుగా పేర్కొంటూ తీర్పు వెలువరించిన అనంతరం తీర్పుపై తన అభిప్రాయాలను ట్విట్టర్లో పంచుకున్నారు.అక్రమాస్తుల కేసులో తమిళనాడు మాజీ సీఎం జయలలితను కర్నాటక హైకోర్టు నిర్ధోషిగా ప్రకటించిన అనంతరం సుప్రీం కోర్టులో భిన్నమైన తీర్పు వచ్చిన ఉదంతాన్ని ఈ సందర్భంగా స్వామి ప్రస్తావించారు. తీర్పు నేపథ్యంలో సంబరాలు చేసుకోవద్దని డీఎంకే నేతలకు ఆయన చురకలంటించారు.కాంగ్రెస్, మిత్రపక్షాలకు జయ అక్రమాస్తుల కేసులో ఎదురైన భంగపాటు 2జీ కేసుకూ తప్పదని మరో ట్వీట్లో వ్యాఖ్యానించారు. -
నిబంధనలు పాటించని కళాశాలలపై చర్యలు తీసుకోవాలి
కలెక్టర్కు విద్యార్థి సంఘం విజ్ఞప్తి అనంతపురం సెంట్రల్ : జిల్లాలో ప్రైవేటు, కార్పొరేట్ జూనియర్ కళాశాలలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా ధనార్జనే ధ్యేయంగా పని చేస్తున్నాయని ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు మీకోసం కార్యక్రమంలో కలెక్టర్ వీరపాండియన్ను కలిసి ఫిర్యాదు చేశారు. వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు బండి పరుశురాం, ఎన్ఎస్యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనార్ధన్రెడ్డి మాట్లాడుతూ కరువు జిల్లా అనంతలో ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నారని, ఎక్కువ కళాశాలలు నిబంధనల ప్రకారం లేవని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అపార్టుమెంట్లలోనూ, విద్యార్థులకు ఏమాత్రం సౌకర్యం లేని భవనాల్లోనూ కళాశాలలు నడుపుతున్నారని చెప్పారు. అలాంటి వాటిపై ఆర్ఐఓకు ఫిర్యాదు చేసినా సరైన చర్యలు తీసుకోవడం లేదని చెప్పారు. విద్యార్థులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరేంద్రరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సుధీర్రెడ్డి, బీసీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి అధ్యక్షుడు నరేష్ తదితరులు పాల్గొన్నారు. -
జెడ్పీలను బతికించండి!
• రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా పరిషత్ చైర్మన్ల మొర • రిటైర్డ్ ఉద్యోగులకు పింఛన్లు ఇచ్చేందుకూ నిధుల్లేవని ఆవేదన • జిల్లాకు రూ.100 కోట్ల చొప్పున ఇవ్వాలని విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: అభివృద్ధి ని«ధుల్లేక అధ్వాన స్థితికి చేరిన జిల్లా పరిషత్లకు పునర్వైభవం తెచ్చేందుకు చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా పరిషత్ చైర్పర్సన్లు విజ్ఞప్తి చేశారు. రెండేళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఒక్క రూపాయి కూడా అందడం లేదని, జెడ్పీల్లో పనిచేసి రిటైరైన ఉద్యోగులకు పింఛన్ కూడా ఇచ్చే పరిస్థితి లేదని వాపోయారు. జెడ్పీలకు జవసత్వాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలంటూ సోమవారం కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల జెడ్పీ చైర్పర్సన్లు తుల ఉమ, రాజు, పద్మతోపాటు వివిధ జిల్లాలకు చెందిన కొందరు జెడ్పీటీసీ సభ్యులు పంచాయతీరాజ్ మంత్రి జూపల్లి కృష్ణారావును, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ను కలిశారు. ఈ సందర్భంగా తమ సమస్యలను విన్నవించుకున్నారు. నిధుల కొరతతో రోజువారీ నిర్వహణే భారంగా మారిపోయిందని, జెడ్పీ సర్వసభ్య సమావేశాలు తూతూ మంత్రంగా జరుగుతున్నాయని పేర్కొ న్నారు. సమావే శాలకు వచ్చిన జెడ్పీటీసీ సభ్యులకు, ఇతర ప్రజాప్రతినిధులకు చాయ్ బిస్కట్లు పెట్టలేని దుస్థితి నెలకొందన్నారు. 2014 వరకు ఏటా ఒక్కో జిల్లా పరిషత్కు రూ.100 కోట్ల మేర నిధులు అందేవని... 14 ఆర్థిక సంఘం నుంచి నిధులను కేంద్రం నేరుగా గ్రామ పంచాయతీలకే అందజేస్తున్నందున జెడ్పీ పదవులు అలంకార ప్రాయంగా మారి పోయాయని వాపోయారు. స్థానిక సంస్థలను బలోపేతం చేస్తామన్న ప్రభుత్వం తక్షణమే అన్ని జెడ్పీలకు కనీసం రూ.100 కోట్ల చొప్పున కేటాయించాలని కోరారు. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం తరపున కేంద్రాన్ని నిధులు కోరేందుకు ఢిల్లీ వెళ్లనున్నట్లు జెడ్పీ చైర్పర్సన్లు తెలిపారు. విజ్ఞప్తులు, సమస్యలివీ.. ⇔ 14వ ఆర్థిక సంఘం నుంచి నేరుగా గ్రామాలకే నిధులు వెళుతుండడంతో జెడ్పీల ద్వారా జరగాల్సిన అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. పలు గ్రామాలను కలిపే లింకు రోడ్లు, జెడ్పీ పాఠశాలలు, గ్రామాల్లో మంచినీటి పథకాల నిర్వహణ, విద్యుత్ స్తంభాల ఏర్పాటు వంటి పనులు చేపట్టేందుకు నిధులలేమి ఆటంకంగా మారింది. ⇔ గతంలో ఆర్ఆర్ఎం గ్రాంటు ద్వారా జరిగే పనులకు జెడ్పీ ఆమోదం, పరిపాలనా మంజూరు తర్వాతే నిధులు ఖర్చయ్యేవి. ప్రస్తుతం నేరుగా ప్రభుత్వమే నిధులు మం జూరు చేస్తుండడంతో జెడ్పీలు నిర్వీర్యమ వుతున్నాయి. ⇔ స్థానిక సంస్థలకు తలసరి గ్రాంట్ను పెంచాలి. వెంటనే విడుదల చేయాలి. ⇔ రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా వచ్చే స్టాంపుడ్యూటీలో జెడ్పీలకు 3 శాతం రావాల్సి ఉండగా.. రెండేళ్లుగా అవి అందడం లేదు. ⇔ గనులు, ఖనిజాల ద్వారా జెడ్పీలకు రావాల్సిన సీనరేజీ ఆదాయాన్ని ప్రభుత్వం అందించడం లేదు. ⇔ ప్రభుత్వం నిధులు విడుదల చేయని ఫలితంగా మండల పరిషత్, జిల్లా పరిషత్ కార్యాలయాల్లో విద్యుత్, టెలిఫోన్ బిల్లులు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. ఇంధన చార్జీలు లేక వాహనాలు మూలన పడుతున్న దుస్థితి నెలకొంది. -
‘ఫిరాయింపుల’ తీర్పుపై అప్పీల్
సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాలు చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి అప్పీలు దాఖలు సాక్షి, హైదరాబాద్: అధికార టీఆర్ఎస్ పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై మూడు నెలల్లోగా తగిన నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్ను ఆదేశిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఇద్దరు న్యాయ మూర్తులతో కూడిన ధర్మాసనం ముందు అసెంబ్లీ కార్యదర్శి అప్పీల్ దాఖలు చేశారు. ఈ అప్పీల్పై గురువారం విచారణ జరిపిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావులతో కూడిన ధర్మాసనం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. తమ పార్టీ నుంచి అధికార టీఆర్ఎస్లోకి ఫిరాయించిన తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణారెడ్డి, మాధవరం కృష్ణారావు, జి.సాయన్న, ప్రకాశ్గౌడ్, మంచిరెడ్డి కిషన్రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, రాజేందర్రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, కె.పి.వివేకానంద్, మాగంటి గోపీనాథ్, అరెకపూడి గాంధీలపై అనర్హత వేటు వేయాలంటూ టీడీపీ నేతలు స్పీకర్ ముందు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లను పరిష్కరించకుండానే టీఆర్ఎస్లో టీటీడీఎల్పీ వీలైనమైనట్లు పేర్కొంటూ శాసనసభ కార్యదర్శి పేరు మీద బులిటెన్ జారీ అయింది. ఈ బులిటెన్ రాజ్యాంగ విరుద్ధమని, దాన్ని కొట్టేయాలంటూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, స్పీకర్ తీరును ఆక్షేపించారు. తన ముందున్న అనర్హత పిటిషన్లను పరిష్కరించకుండానే, టీటీడీఎల్పీ విలీనంపై స్పీకర్ నిర్ణయం తీసుకోవడం సరికాదని అన్నారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం ఈ కేసులో స్పీకర్ ఓ ట్రిబ్యునల్గా వ్యవహరిస్తున్నారని, అందువల్ల ఆయన నిర్ణయాలు న్యాయ సమీక్షకు లోబడి ఉంటాయని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై మూడు నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలంటూ గత సెప్టెంబర్ 21న ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 21తో మూడు నెలల గడువు ముగియనున్న నేపథ్యంలో సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాలు చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి.. ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. దీనిపై గురువారం ధర్మాసనం విచా రణ చేపట్టింది. ఈ సందర్భంగా కార్యదర్శి తరఫున అడ్వొకేట్ జనరల్ కె.రామకృష్ణారెడ్డి వాదనలు వినిపిస్తూ, అనర్హత పిటిషన్లు స్పీకర్ వద్ద పెండిం గ్లో ఉన్నప్పుడు దానిపై న్యాయ సమీక్ష చేయడానికి వీల్లేదని తెలిపారు. అధికరణ 212 ప్రకారం శాసన వ్యవహారాల్లో న్యాయస్థానాల జోక్యం తగదని చెప్పారు. పూర్తిస్థాయి వాదనల నిమిత్తం విచారణ సోమవారానికి వాయిదా పడింది. -
అప్పీల్ పెండింగ్లో ఉంటే.. బెయిల్ పొందొచ్చు
-
సత్వరమే అనుమతులు
పెట్టుబడిదారుల సదస్సులో సీఎం సాక్షి, విశాఖపట్నం: దేశంలోనే తొలిసారిగా విశాఖలో నిర్మించనున్న ఏపీ మెడ్టెక్ జోన్లో యూనిట్ల స్థాపనకు ముందుకు రావాలని పెట్టుబడిదార్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఇక్కడ పెట్టుబడులు పెడితే అన్ని వసతులు కల్పిస్తామని, సత్వరమే (14 రోజుల్లో) ఆన్లైన్లో అనుమతులు ఇస్తామని చెప్పారు. శుక్రవారం విశాఖ జిల్లా పెదగంట్యాడ మండలం నడుపూరులో 270 ఎకరాల్లో రూ. 225 కోట్ల వ్యయంతో ఏర్పాటు కానున్న మెడ్టెక్ జోన్కు కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, అనంతకుమార్లతో కలిసి చంద్రబాబు భూమి పూజ చేశారు. అనంతరం ఉక్కునగరం క్లబ్లో జరిగిన ఇన్వెస్టర్ల మీట్లో ఆయన మాట్లాడారు. మెడ్టెక్ జోన్ను ప్రతిపాదించిన ఎనిమిది నెలల్లోనే డీపీఆర్, ఎస్పీవీ, భూ కేటాయింపు పూర్తయిందన్నారు. మరో ఏడాదిలో ఈ జోన్ కార్యరూపం దాలుస్తుందన్నారు. -
అప్పీలుకు వెళ్తామనడం దారుణం
జీఓ 123పై తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ సాక్షి, హైదరాబాద్: జీవో 123ను హైకోర్టు రద్దు చేస్తే దానిపై ప్రభుత్వం అప్పీలుకు వెళ్లడం దారుణమని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు కోర్టు 16సార్లు మొట్టికాయలు వేసిందని, అయినా వారికి సిగ్గు రావడంలేదన్నారు. రమణ నేతృత్వంలో టీటీడీపీ బృందం శుక్రవారం రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్తో భేటీ అయ్యింది. ప్రతిపక్షాలను విశ్వాసంలోకి తీసుకోకుండా ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలతో నియంతృత్వంగా వ్యవహరిస్తోందని గవర్నర్కు రమణ ఫిర్యాదు చేశారు. కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూ సేకరణ చట్టం-2013 అమలుకు ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని గవర్నర్ను కోరారు. ఎంసెట్-2 లీకేజీ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన మంత్రులు కడియం శ్రీహరి, లక్ష్మారెడ్డిలను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. బృందంలో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, తెలుగు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వంటేరు ప్రతాప్రెడ్డి తదితరులున్నారు. -
కేసులో ఇంప్లీడ్ అవుతాం: చాడ
సాక్షి, హైదరాబాద్: జీవో 123ని హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలని శుక్రవారం సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వం చేసిన అప్పీలుకు సంబంధించిన కేసులో సీపీఐ కూడా ఇంప్లీడ్ అవుతుందని తెలిపారు. జీవో 123ని కోర్టు కొట్టేసినా దానిపై అప్పీలుకు వెళ్లడం ప్రభుత్వ మొండివైఖరికి నిదర్శనమని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వానికి పట్టు విడుపులుండాలని సూచించారు. -
అప్పీల్ చేస్తే ఇంప్లీడ్ అవుతాం: తమ్మినేని
సాక్షి, హైదరాబాద్: జీవో 123 రద్దుపై ప్రభుత్వం అప్పీలుకు వెళ్తే తాము కూడా ఇంప్లీడ్ అవుతామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. భూ సేకరణ జీవోను కొట్టివేసి హైకోర్టు వేసిన చెంపదెబ్బ నుంచి గుణపాఠం నేర్చుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని విమర్శించారు. మంత్రి హరీశ్రావు అప్పీల్ ప్రకటనను పక్కనపెట్టి హైకోర్టు లేవనెత్తిన ఆయా అంశాలకు సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు. పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశాల సందర్భంగా గురువారం ఎంబీభవన్లో చెరుపల్లి సీతారాములు, జి.నాగయ్యలతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారిగా వ్యవహరిస్తోందని, పేదలకు కాకుండా పెద్దలకు అనుకూలంగా వ్యవహరిస్తోందని హైకోర్టు వ్యాఖ్యలను బట్టి తెలుస్తోందని ఆరోపించారు. -
జీవో 123 కొట్టివేతపై నేడు అప్పీల్
సాక్షి, హైదరాబాద్: జీవో 123ని కొట్టేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం మధ్యాహ్నం లంచ్ మోషన్ రూపంలో అప్పీల్ను దాఖలు చేయనుంది. ఉదయం 10.30 గంటలకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి ఇందుకు సంబంధించి ప్రస్తావన చేయనున్నారు. ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు గురువారం స్వయంగా ఏజీతో మాట్లాడినట్లు సమాచారం. ఈ అప్పీల్లో హాజరై వాదనలు వినిపించే బాధ్యతలను ఏజీకి అప్పగించినట్లు తెలిసింది. దీంతో రంగంలోకి దిగిన ఏజీ.. స్వచ్ఛందంగా ముందుకొచ్చే రైతుల నుంచి భూములు కొనుగోలు చేసే విషయంలో ప్రభుత్వానికి ఉన్న అధికారాలు, ఈ విషయంలో ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న ఉత్తర్వులు, వాటి తీరు తెన్నులు తదితర అంశాలపై అధ్యయనం మొదలుపెట్టారు. భూములను అమ్మే, కొనే అధికారం ప్రభుత్వానికి ఉందన్న కోణంలో వివిధ హైకోర్టులు, సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో ఇచ్చిన తీర్పులను పరిశీలించారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో అక్కడి ప్రభుత్వం రాజధాని నిర్మాణం కోసం భూములను ఎలా సేకరిస్తోంది.. దానిపై హైకోర్టులో దాఖలైన వ్యాజ్యాలు.. వాటిపై ధర్మాసనం ఇచ్చిన తీర్పులు.. తదితర అంశాలపైనా ఏజీ బృందం దృష్టి సారించింది. ఇప్పటికే జీవో 123పై అప్పటి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే నేతృత్వంలోని ధర్మాసనం ఇచ్చిన తీర్పును కూడా అప్పీల్లో ప్రముఖంగా ప్రస్తావించనున్నారు. గురువారం సాయంత్రం వరకు జీవో కొట్టివేత తాలుకు తీర్పు కాపీ అందుబాటులోకి రాకపోవడంతో స్వయంగా ఏజీనే రంగంలోకి దిగారు. సాయంత్రం న్యాయమూర్తి జస్టిస్ సురేశ్ కైత్ కోర్టుకు వెళ్లి.. తీర్పు కాపీ కోసం న్యాయమూర్తిని అభ్యర్థించారు. విస్తృత ప్రజా ప్రయోజనాలు ముడిపడి ఉన్న అంశమని, అందువల్ల తీర్పు కాపీ వీలైనంత త్వరగా అందుబాటులోకి వచ్చేలా చూడాలన్నారు. ఏజీ స్వయంగా వచ్చి కోరడంతో సానుకూలంగా స్పందించిన న్యాయమూర్తి.. తన ఢిల్లీ విమాన ప్రయాణ సమయాన్ని కూడా మార్చుకున్నారు. బెంచ్ దిగిన తర్వాత న్యాయమూర్తి.. తన తీర్పు కాపీలో ఏవైనా అక్షర దోషాలు ఉన్నాయో పరిశీలించి వాటిని సరిచేసే పని పూర్తిచేశారు. అనంతరం రిజిస్ట్రీలో తీర్పు కాపీ బయటకు వచ్చేందుకు అన్ని ప్రక్రియలు పూర్తయి, ఏజీ చేతికి కాపీ వచ్చే సరికి రాత్రి 8.30 అయింది. అప్పటి వరకు రామకృష్ణారెడ్డి హైకోర్టులోనే ఉన్నారు. తీర్పు కాపీ తీసుకుని ఇంటికి వెళ్లారు. -
కొత్త జిల్లాకు శ్రీకాంతాచారి పేరు పెట్టాలి
సత్తుపల్లి: కొత్తగా ఏర్పాటయ్యే జిల్లాల్లో ఒకదానికి తెలంగాణ ఉద్యమ అమరుడు శ్రీకాంతాచారి పేరు పెట్టాలని ఆయన తల్లి శంకరమ్మ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సత్తుపల్లి టీజేఏసీ ఆధ్వర్యంలో సత్తుపల్లిలో నిర్మితమైన తెలంగాణ అమరవీరుల స్థూపాన్ని శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మతో కలిసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శంకరమ్మ మాట్లాడుతూ.. ‘‘ఉద్యమ నేత కేసీఆర్ అరెస్టుకు నిరసనగా సాగిన ఆందోళనలో నా కొడుకు శ్రీకాంతాచారి తన ఒంటికి నిప్పు అంటించుకున్నాడు. శరీరాన్ని మంటలు దహిస్తున్నప్పుడు కూడా అమ్మా.. నాన్న.. అని అనలేదు. ‘జై తెలంగాణ.. జైజై తెలంగాణ’ అంటూ అమరుడయ్యాడు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించడంతో అమరుడైన నా కొడుకు ఆత్మ శాంతించింది’’ అని, భావోద్వేగం వ్యక్తం చేశారు. అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటామని సీఎం కేసీఆర్ చెప్పారని అన్నారు. ‘‘శ్రీకాంతాచారి తొలి వర్ధంతి రోజున అప్పటి ఉద్యమ నేత కేసీఆర్ మాట్లాడుతూ, కొత్తగా ఏర్పాటయ్యే జిల్లాలలో ఒకదానికి శ్రీకాంతాచారి పేరు పెడతామని ప్రకటించారు’’ అని గుర్తు చేశారు. ప్రతి జిల్లాలో శ్రీకాంతాచారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలలో భాగంగా అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించాలని కోరారు. కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్పర్సన్ దొడ్డాకుల స్వాతి, టీజేఏసీ జిల్లా కన్వీనర్ కూరపాటి రంగరాజు, నాయకులు చిత్తలూరి ప్రసాద్, గోకినేపల్లి వెంకటేశ్వరరావు, కూకలకుంట రవి, కూసంపూడి రవీంద్ర, జి.రామకృష్ణ, ఆయూబ్పాషా, అమర్లపూడి రాము, చీపు జగదీష్, కోటగిరి మురళీకృష్ణారావు, వి.సాగర్, టీఆర్ఎస్ నాయకులు చల్లగుళ్ల నర్సింహారావు, కృష్ణయ్య, గాదె సత్యం, కొత్తూరు ప్రభాకర్రావు, నారాయణవరపు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
మాల్యాను అప్పగించండి..
బ్రిటన్కు భారత్ విజ్ఞప్తి న్యూఢిల్లీ: పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి బ్రిటన్కు పరారైన ‘ఉద్దేశపూర్వక ఎగవేతదారు’ విజయ్మాల్యాను భారత్కు తిరిగి రప్పించడానికి కేంద్రం కీలక చర్య తీసుకుంది. ఢిల్లీలోని బ్రిటన్ హై కమిషన్కు విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఈ మేరకు ఒక లేఖ రాసింది. బ్యాంకులకు రూ.9,400 కోట్ల బకాయి, పాస్పోర్ట్ సస్పెన్షన్, నాన్-బెయిలబుల్ వారంట్, సుప్రీంకోర్టులో కేసు విచారణ వంటి అంశాలను లేఖలో వివరించినట్లు విదేశాంగమంత్రిత్వశాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు. మాల్యాను భారత్కు తీసుకువచ్చే అంశంపై బ్రిటన్ అధికారులతో భారత్ తన చర్చలను కొనసాగిస్తుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. బ్రిటన్లోని భారత్ హై కమిషన్ కూడా బ్రిటన్ విదేశీ, కామన్వెల్త్ కార్యాలయానికి మాల్యాను భారత్కు పంపే విషయమై లేఖ రాసినట్లు ఆయన తెలిపారు. మార్చి 2న మాల్యా బ్రిటన్ వెళ్లినట్లు భావిస్తున్నారు. మాల్యా తదుపరి చర్య! తాజా పరిణామాల నేపథ్యంలో మాల్యా బ్రిటన్ అధికారులను ఆశ్రయించి, తాను దేశంలో కొనసాగేలా అనుమతించాలని కోరే అవకాశం ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పాస్పోర్ట్ రద్దును కూడా ఆయన సవాలు చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. దాదాపు రూ.900 కోట్ల ఐడీబీఐ రుణ ఎగవేత కేసులో భారత్ ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ విజ్ఞప్తి మేరకు ముంబై ప్రత్యేక కోర్టు ఆయనపై నాన్-బెయిలబుల్ ఆదేశాలు జారీ చేసింది. కాగా, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తన, తన కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను సీల్డ్కవర్లో తెలియజేసిన మాల్యా, దేశానికి వచ్చే విషయంలో మాత్రం ఎటువంటి సూచనా చేయలేదు. తాను దేశానికి వచ్చిన మరుక్షణం తీహార్ జైలుకు పంపిస్తారన్న ఆందోళనను ఆయన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రెండు నెలల్లో ఆయనపై బ్యాంకింగ్ రికవరీ కేసులను బెంగళూరు డెట్ రికవరీ ట్రిబ్యునల్ పరిష్కరించాల్సి ఉంది. 30న కింగ్ఫిషర్ ట్రేడ్మార్క్ల వేలం ఇదిలావుండగా... ఈ నెల 30న కింగ్ఫిషర్ లోగో, ‘ప్లై ది గుడ్ టైమ్స్’(టేగ్లైన్) ట్రేడ్మార్క్ల వేలానికి బ్యాంకింగ్ రంగం సిద్ధం చేసింది. ఫ్లైయింగ్ మోడల్స్, ఫ్లై ది గుడ్ టైమ్స్, ఫన్లైనర్, ఫ్లై కింగ్ఫిషర్, ఫ్లైయింగ్ బర్డ్ డివైస్సహా ట్రేడ్మార్క్లకు రిజర్వ్ ప్రైజ్ ధర రూ.366 కోట్లు. రుణాలు పొందే ప్రక్రియలో ఈ ట్రేడ్మార్క్లను సంస్థ బ్యాంకులకు తనఖాగా పెట్టింది. ఈ ఆన్లైన్ వేలాన్ని ఎస్బీఐక్యాప్ ట్రస్టీ కంపెనీ (ఎస్బీఐ క్యాప్స్ అనుబంధ సంస్థ) నిర్వహిస్తుంది. అయితే ఒకప్పుడు మంచి ధర ఉన్న ఈ బ్రాండ్స్కు ఇప్పుడు విలువ పడిపోయిందని, వీటి కోసం బిడ్డర్స్ నుంచి ఎటువంటి ఆసక్తీ ఉండకపోవచ్చన్నది నిపుణుల విశ్లేషణ. గత నెలల్లో కింగ్ఫిషర్ హౌస్ వేలం విజయవంతం కాలేదు. రూ. 150 కోట్ల రిజర్వ్ ప్రైస్ అధికమని భావించిన బిడ్డర్లు ఈ వేలంపై ఆసక్తి చూపలేదు. -
ప్రమాదంలో ప్రజాస్వామ్యం
♦ ఈవీఎం యంత్రాలకు ప్రింటర్లు అమర్చాలి ♦ కేంద్ర ఎన్నికల సంఘానికి టీపీసీసీ విజ్ఞప్తి సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని, పాలేరు ఉప ఎన్నిక సజావుగా సాగేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని టీపీసీసీ కేంద్రాన్ని కోరింది. ఎన్నికల్లో ఈవీఎం యంత్రాలకు ప్రింటర్లు అమర్చాలంది. ఈ విధానం ఎన్నికల్లో అక్రమాలకు ఆస్కారం లేకుండా దోహదపడుతుందని పేర్కొంది. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ నసీం జైదీతో పాటు ఎన్నికల కమిషనర్లను కలిసి వినతిపత్రం అందించింది. బృందంలో పార్లమెంటు సభ్యులు వి.హనుమంతరావు, గుత్తా సుఖేందర్రెడ్డి, నంది ఎల్లయ్య, పాల్వాయి గోవర్దనరెడ్డి, రాపోలు ఆనందభాస్కర్, ఎం.ఎ.ఖాన్, రేణుకాచౌదరి, పార్టీ నేతలు పొంగులేటి సుధాకర్రెడ్డి, దాసోజు శ్రవణ్, గురిజాల వెంకట్, నిరంజన్, కైలాష్ ఉన్నారు. ఖమ్మం జిల్లాలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ నిర్వహించుకోవడానికి ఇచ్చిన అనుమతిని వెనక్కితీసుకోవాలని కోరారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని, పోలీసు బలగాలను ముఖ్యమంత్రి దుర్వినియోగం చేస్తున్నారన్నారు. ఉప ఎన్నిక సజావుగా సాగేందుకు అదనపు కేంద్ర పోలీసు బలగాలను మోహరించాలని, ధనప్రవాహాన్ని అడ్డుకోవాలని కోరారు. వరంగల్ లోక్సభ, నారాయణఖేడ్ ఉప ఎన్నికలు, జీహెచ్ఎంసీతో పాటు మరో రెండు మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో ఈవీఎంలు ట్యాంపరింగ్కు గురయ్యాయన్నారు. ప్రజాప్రతినిధులను కొంటున్నారు... తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ రాజ్యాంగ విరుద్ధంగా, అప్రజాస్వామికంగా ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను కొనుగోలు చేస్తోందని ఉత్తమ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పోలీసు వ్యవస్థ అధికార పార్టీ తొత్తుగా మారిందన్నారు. -
నగరంలో రెండు సర్వేలు..
♦ ఎన్యూమరేటర్లకు సహకరించండి ♦ నగర ప్రజలకు జీహెచ్ఎంసీ కమిషనర్ విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్ : భారత పౌరుల జాతీయ రిజిస్టరు తయారీలో మొదటి అంకమైన నేషనల్ పాపులేషన్ రిజిస్టర్(ఎన్పీఆర్)కోసం జరుగుతున్న ఇంటింటి సర్వేలో సిబ్బందికి తగిన విధంగా సహకరించాల్సిందిగా జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్దన్రెడ్డి నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సర్వేలో భాగంగా ఎన్యూమరేటర్లు కోరే వ్యక్తుల పేర్లు, తల్లిదండ్రుల పేర్లు, పుట్టిన స్థలం, ప్రస్తుత చిరునామా, విద్యార్హతలు, వృత్తి, జాతీయత, చిరునామా తదితర వివరాలు అందజేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ నెలాఖరు వరకు ఈ సర్వే జరుగనుంది. 19.71 లక్షల ఓటర్ల పునః పరిశీలన.. ఓటర్ల తుది జాబితా మే 31న విడుదల చేయనున్నందున స్పెషల్ సప్లిమెంటరీ రివిజన్ కింద ఓటర్ల జాబితాకు సంబంధించి ఇంటింటి సర్వే జరుగుతోంది. ఈ సర్వేలో భాగంగా చిరునామా మారినవారు, మరణించిన వారు, డూప్లికేట్లను జాబితాలోంచి తొలగిస్తారు. మే 15 వరకు మార్పుచేర్పులతో కూడిన తుది జాబితాను రూపొందించి, 31వ తేదీన వెలువరిస్తారు. గతంలో జాబితాలోంచి తొలగించిన 19.71 లక్షలమంది ఓటర్లకు సంబంధించిన వివరాలను పునః పరిశీలిస్తారు. మృతులు, చిరునామా మారిన వారు, అనర్హులు తదితరులను గుర్తిస్తారు. అర్హులుంటే జాబితాలో చేరుస్తారు. ఇందుకుగాను బూత్లెవెల్ ఆఫీసర్లు ఇంటింటి సర్వేలో పాల్గొంటున్నారు. అనర్హులను తొలగించేందుకు ఏప్రిల్ 16 నుంచి 22 వరకు నోటీసులు జారీ చేస్తారు. మే 10లోగా ఫిర్యాదులు స్వీకరిస్తారు. మార్పులు, చేర్పులు, జాబితాలో పేరు స్పెల్లింగ్లలో పొరపాట్లు తదితరమైన వాటికి సంబంధించి అందిన దరఖాస్తులను పరిష్కరిస్తారు. 15వ తేదీలోగా అనర్హులను, చిరునామా మారినవారి పేర్లు తొలగిస్తారు. 18న అనుబంధ జాబితా రూపొందిస్తారు. 20 తేదీన జాబితాను ప్రచురిస్తారు. 21 వ తేదీనాటికి ఎన్నికల ప్రధానాధికారికి పంపిస్తారు. 23వ తేదీ నాటికి కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిస్తారు. మే 31న ఓటర్ల తుది జాబితాను వెలువరిస్తారు. ఈ సందర్భంగా ఇళ్లకు వచ్చే బూత్లెవెల్ అధికారులకు సహకరించాల్సిందిగా హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్దన్రెడ్డి విజ్ఞప్తి చేశారు. జాబితా లో పొరపాట్లు ఉంటే సవరించుకోవాలని, అర్హులైన వారు జాబితాలో పేర్లు లేకుంటే నమోదు చేయించుకోవాలని, చిరునామా మార్పులు, ఫొటోలు, పేర్లలో పొరపాట్లు దొర్లినా సవరించుకోవచ్చునని సూచించారు. -
అప్పీల్ చేయడంలో ఈ మతలబేంటి?
హైదరాబాద్: వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాను అసెంబ్లీ నుంచి ఏడాది పాటు సస్పెన్షన్ తీర్మానం చెల్లదని హైకోర్టు ఇచ్చిన మధ్యంతర తీర్పుపై ధర్మాసనం ముందు అప్పీలు చేసే విషయంలోనూ టీడీపీ ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలనే పాటించిందా? ధర్మాసనం ముందు దాఖలు చేసిన పిటిషన్ ను పరిశీలిస్తే అవుననే తెలుస్తోంది. అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని చెల్లదని న్యాయస్థానం తీర్పు వెలువరిస్తే, దానిపై అసెంబ్లీ కార్యదర్శి ద్వారా కాకుండా ఆర్థిక, శాసనసభా వ్యవహారాల శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా అప్పీలు దాఖలు చేయించడంతోనే టీడీపీ నేతల డొల్లతనం బయటపడింది. అసెంబ్లీకి హాజరుకాకుండా రోజాపై ఏడాది పాటు సస్పెన్షన్ విధిస్తూ చేసిన తీర్మానం చెల్లదని హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులతో పరువు-ప్రతిష్ట కోల్పోయిన టీడీపీ ప్రభుత్వం దానినుంచి బయటపడటానికి రకరకాల ప్రయత్నాలను ప్రారంభించింది. హైకోర్టు ఆదేశాలను గురువారం రోజునే స్వయంగా రోజా తీసుకొచ్చి శాసనసభ కార్యదర్శికి అందజేయడమే కాకుండా న్యాయస్థానం ద్వారా అధికారికంగా కూడా ఆ ఉత్తర్వులు అందిన విషయం తెలిసిందే. దానిపై ఏం చేయాలన్న అంశంపై తర్జన భర్జన పడిన ముఖ్యమంత్రి, మంత్రులు ఆ తీర్పుపై అప్పీలు చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. ఆ తీర్పు ప్రతిని అందించిన తర్వాత శుక్రవారం తాను శాసనసభ సమావేశాలకు హాజరవుతానని కూడా రోజా అక్కడే ప్రకటించారు. రోజా సభకు వస్తానని ప్రకటన చేసిన నేపథ్యంలో తర్జనభర్తన పడిన టీడీపీ నేతలు ధర్మాసనం ముందు అప్పీలు చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. అయితే ఇక్కడ ఎవరి ద్వారా అప్పీలు చేయించాలన్న దానిలోనే తిరకాసు దాగి ఉంది. ఎందుకంటే... శుక్రవారం శాసనసభలో అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు స్పీకర్ మాట్లాడుతూ, రోజాను సస్పెండ్ చేయడమన్నది సభ ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయంగా చెప్పారు. అంతకుముందు టీడీపీ నేతలు మంత్రి రావెల కిషోర్ బాబు, ఎమ్మెల్యేలు బోండా ఉమామహేశ్వరరావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి తదితరులు మీడియాతో మాట్లాడుతూ, రోజా సస్పెన్షన్ తీర్మానం చెల్లదంటూ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు లెక్క చేయబోమని, స్పీకర్ తీర్పుపై జోక్యం చేసుకునే అధికారం కోర్టులకు లేదని చెప్పారు. నిజానికి రోజాను ఏడాది పాటు సస్పెండు చేయాలంటూ అసెంబ్లీలో చేసింది ఏకగ్రీవ తీర్మానం కాదు. శీతాకాల సమావేశాల్లో డిసెంబర్ 18న రోజాను ఏడాది పాటు సస్పెండు చేస్తూ శాసనసభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు తీర్మానం ప్రతిపాదించినప్పుడు ప్రతిపక్షం తీవ్రంగా వ్యతిరేకించింది. 340 నిబంధన కింద ఏడాది పాటు సస్పెండు చేసే అధికారం లేదని ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ రూల్స్ ను ఉటంకిస్తూ సోదాహరణగా చెప్పారు. ఆ సమయంలో రోజాకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకపోగా, ఆమె సభ నుంచి బయటకు వెళ్లిన తర్వాత మాత్రమే జగన్ కు మాట్లాడే అవకాశం ఇస్తామని పట్టుబట్టి ఆమెను బయటకు పంపించారు. సభ ఏకగ్రీవంగా చేసిన తీర్మానం కాదన్న విషయం అందరికీ తెలుసు. అందుకు విరుద్ధంగా సభ ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయం అంటూ ఈరోజు సభలో ప్రకటన చేయడం విడ్డూరం. ఆ తీర్మానం చెల్లుబాటు కాదని హైకోర్టు తీర్పును పట్టించుకోమని ఒకవైపు చెబుతూ రెండో వైపు ఆ తీర్పుపై అప్పీలు చేయడం గమనార్హం. స్పీకర్ నిర్ణయంపై కోర్టులు జోక్యం చేసుకోరాదని చెబుతున్న నేతలు అలాంటప్పుడు ఏమీ పట్టించుకోమని వదిలేయకుండా మళ్లీ అప్పీలుకు వెళ్లడం విచిత్రం. స్పీకర్ నిర్ణయంపై జోక్యం చేసుకునే అధికారమే లేదని చెప్పినప్పుడు సింగిల్ బెంచి తీర్పుపై స్టే కోరడమంటే... ముందు వచ్చిన తీర్పును అంగీకరించినట్లే. ఇంకో విచిత్రమేమంటే... రోజాను సస్పెండు చేయమన్నది శాసనసభ ఏకగ్రీవంగా చేసిన తీర్మానం అని చెప్పినప్పుడు పైకోర్టులో అప్పీలును శాసనసభ కార్యదర్శి మాత్రమే దాఖలు చేయాలి. అలా కాకుండా శాసనసభ వ్యవహారాలకు సంబంధం లేని ఒక ప్రభుత్వ అధికారితో అప్పీలు దాఖలు చేయించడం. అంటే రేపటి రోజున ధర్మాసనం సింగిల్ బెంచి తీర్పును సమర్థిస్తే... ఒక మాట... స్టే ఇస్తే మరో మాట చెప్పుకోవడానికి వీలుగా ఈ రకంగా అప్పీలును ప్రభుత్వ అధికారితో దాఖలు చేయించారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి ముఖ్య కార్యదర్శి ధర్మాసనం ముందు అప్పీలు దాఖలు చేశారు. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించాలని ముఖ్య కార్యదర్శి తన అప్పీలులో కోరారు. ఈ అప్పీలుపై ధర్మాసనం సోమవారం వాదనలు విననుంది. -
ఎన్ఐఐఎఫ్ లో పెట్టుబడులు పెట్టండి
యూఏఈకి జైట్లీ వినతి... న్యూఢిల్లీ: భారత్ తొలి సావరిన్ వెల్త్ ఫండ్- ఎన్ఐఐఎఫ్లో పెట్టుబడులు పెట్టాలని ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ యూఏఈకి విజ్ఞప్తి చేశారు. యూఏఈ ఆర్థికమంత్రి సుల్తాన్ అల్ మన్సూరీ ఇక్కడ జరిగిన సమావేశం సందర్భంగా జైట్లీ ఈ విజ్ఞప్తి చేశారు. మౌలిక రంగ ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు ఫండ్గా రూ.40,000 కోట్ల ఎన్ఐఐఎఫ్ ఏర్పాటయిన సంగతి తెలిసిందే. ఇందులో ప్రభుత్వ వాటా 49 శాతం వాటా కాగా మిగిలిన వాటా ప్రైవేటు ఇన్వెస్టర్లుగా నిర్దేశించడం జరిగింది. గల్ఫ్ ప్రాంతంలో ఇన్వెస్టర్ల నుంచి భారత్ మౌలిక ప్రాజెక్టుల్లో పెట్టుబడులను తాము కోరుకుంటున్నట్లు తెలిపారు. వివిధ రంగాల్లో సన్నిహిత సహకారాన్ని ఇచ్చిపుచ్చుకోవాలని ఇరువురు నాయకులూ నిర్ణయించినట్లు ఆర్థికశాఖ విడుదల చేసిన ఒక ప్రకటన తెలిపింది. -
సల్మాన్కు వ్యతిరేకంగా సుప్రీంకు..!
-
ఎన్నికల నిర్వహణపై జోక్యం చేసుకోవాలి
♦ హైకోర్టుకు చాడ విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల తేదీలు, నిర్వహణపై జోక్యం చేసుకోవాలని సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికలు సక్రమంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగేలా చూడాలని కోరారు. బుధవారం మఖ్దూం భవన్లో పార్టీ నాయకులు అజీజ్ పాషా, వీఎస్ బోస్, సుధాకర్, ఈటీ నర్సింహా, బాల మల్లేశ్, మందా పవన్తో కలసి ఆయన మాట్లాడారు. ఈ ఎన్నికల్లో గెలిచేందుకు అధికార టీఆర్ఎస్ తప్పుడు పద్ధతులు అవలంబిస్తోందని విమర్శించారు. ఇతర పార్టీల అభ్యర్థులను ప్రలోభాలకు గురిచేసి పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. నీతిమంతమైన రాజకీయాలు కోసం సీపీఎం, సీపీఐ, లోక్సత్తా తదితర సామాజిక శక్తులతో కలసి పోటీ చేస్తామన్నారు. -
'అందులో విదేశీ హస్తం ఉంది.. బయటపెడతాం'
న్యూఢిల్లీ: పంజాబ్లో గత కొన్ని రోజులుగా సిక్కు వర్గాల మధ్య జరుగుతున్న ఘర్షణలు, ఆందోళనలు నిరసనల వెనుక విదేశీ హస్తం ఉందని కేంద్రమంత్రి అకాలీ దళ్ నేత హర్సిమ్రత్ కౌర్ బాదల్ అన్నారు. త్వరలోనే వారి వివరాలన్నీ ఆధారాలతో సహా బయటపెడతామని చెప్పారు. తమ ఇష్ట దైవాన్ని కించపరిచారని ఆరోపిస్తూ ఫరీద్ కోట్లో ఓ సిక్కు వర్గం నిరసన ర్యాలీకి బయలుదేరగా.. వారిని మరో వర్గం అడ్డగించింది. ఈ క్రమంలో పరస్పరం రాళ్లతోపాటు, పదునైన ఆయుధాలు, కర్రలతో దాడులు చేసుకున్నారు. వీరిని నిలువరించేందుకు పోలీసులు కూడా జోక్యం చేసుకోగా వారిని తీవ్రంగా గాయపరిచారు. దీని అనంతరం పంజాబ్లో పలు సున్నిత ప్రాంతాల్లో ఈ ఘర్షణలు వాయువేగంతో వ్యాపించి ఉద్రిక్త పరిస్థితులకు దారి తీశాయి. ఆస్తి నష్టం ప్రాణనష్టం కూడా చోటు చేసుకుంది. ప్రస్తుతం కూడా అక్కడ ఇంకా అలాంటి పరిస్దితులే ఉన్నాయి. దీనిపై ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ స్పందించిన తర్వాత కేంద్ర నుంచి తొలిసారి ఓ కేంద్రమంత్రి స్పందించి సంచలన వ్యాఖ్య చేశారు. ఈ ఘర్షణల వెనుక విదేశీ హస్తం ఉందన్నారు. అన్ని వర్గాలు దయచేసి శాంతి సంయమనంతో వ్యవహరించాలని సూచించారు. -
ఉద్యోగుల విభజన అప్పీళ్లపై విచారణ 6కు వాయిదా
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల విభజన అప్పీళ్లపై విచారణను హైకోర్టు జూలై 6కు వాయిదా వేసింది. విద్యుత్ ఉద్యోగుల విభజనకు సంబంధించిన మార్గదర్శకాలకు తెలంగాణ విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శి ఆమోదముద్ర వేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను, ఆ ఉత్తర్వులకు అనుగుణంగా టీఎస్ ట్రాన్స్కో చైర్మన్ రూపొందించిన తుది జాబితా అమలును నిలిపేస్తూ సింగిల్ జడ్జి ఈ నెల 12న జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ తెలంగాణ ట్రాన్స్కో, జెన్కో, విద్యుత్ పంపిణీ సంస్థలు దాఖలు చేసిన అప్పీళ్లపై విచారణ జూలై 6కు వాయిదా పడింది. ఈ అప్పీళ్ల విచారణార్హతపైనే వాదనలు వినిపించాలని హైకోర్టు ఈ సందర్భంగా జెన్కో, పంపిణీ సంస్థల తరఫు న్యాయవాదులకు ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఖండవల్లి చంద్రభాను, జస్టిస్ అనిస్లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. టీ ట్రాన్స్కో, జెన్కో, పంపిణీ సంస్థలు దాఖలు చేసిన ఈ అప్పీళ్ల విచారణార్హతపై ఉద్యోగుల తరఫు సీనియర్ న్యాయవాదులు సి.వి.మోహన్రెడ్డి, వేదుల వెంకటరమణ, డాక్టర్ లక్ష్మీనర్సింహలు అభ్యంతరం తెలిపారు. సింగిల్ జడ్జి ముందు పెండింగ్లో ఉన్న వ్యాజ్యాల్లో టీ ట్రాన్స్కో తదితరులు కౌంటర్లు దాఖలు చేయలేదని వారు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కౌంటర్లు దాఖలు చేయకుండా అప్పీళ్లు దాఖలు చేయడానికి వీల్లేదని కోర్టుకు నివేదించారు. రిలీవ్ చేసిన ఉద్యోగులకు కేవలం పది రోజులకు మాత్రమే జీతాలు చెల్లించారని వేదుల వెంకటరమణ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ధర్మాసనం, తదుపరి విచారణ సమయంలో ఈ అప్పీళ్ల విచారణార్హతపై వాదనలు వినిపించాలని టీ ట్రాన్స్కో, ఇతర పంపిణీ సంస్థల అప్పీళ్ల తరఫు సీనియర్ న్యాయవాదులు డి.ప్రకాశ్రెడ్డి, జి.విద్యాసాగర్, ఎస్.నిరంజన్రెడ్డిలకు స్పష్టం చేస్తూ విచారణను జూలై 6కు వాయిదా వేసింది. -
అప్పీలు కలకలం
చెన్నై, సాక్షి ప్రతినిధి: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలితను నిర్దోషిగా పేర్కొంటూ వెలువడిన తీర్పుపై అప్పీలుకు వెళ్లాలని కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాష్ట్రంలో కలకలం సృష్టించింది. ఆర్కేనగర్ ఉప ఎన్నిక ప్రచారంలో తలమునకలై ఉన్న అన్నాడీఎంకే శ్రేణులు పిడుగుపాటులాంటి ఈ సమాచారంతో ఆందోళనలో మునిగిపోయాయి. ఆస్తుల కేసులో కర్ణాటక ప్రత్యేక కోర్టు జయకు నాలుగేళ్ల జైలుశిక్ష, 100 కోట్ల జరిమానా విధించింది. ఈ తీర్పు కారణంగా జయ జైలు పాలుకావడమేగాక ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి పదవులను సైతం కోల్పోయారు. బెయిల్పై విడుదలైన జయ తనకు పడిన శిక్షపై అప్పీలు చేయగా కర్ణాటక హైకోర్టు నిర్దోషిగా తీర్పు చెప్పింది. తాజా తీర్పుతో జయలలిత మళ్లీ ముఖ్యమంత్రి పదవిని సైతం చేపట్టారు. ముఖ్యమంత్రిగా జయ కొనసాగాలంటే ఆరు నెలల్లోగా ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉన్నందున ఆర్కేనగర్ సిద్ధమైంది. ఈనెల 5వ తేదీన జయలలిత నామినేషన్ దాఖలు చేస్తుండగా, 27వ తేదీన ఉప ఎన్నికపై పోలింగ్ జరగనుంది. అప్పీలుపై ఆందోళన: ఆస్తుల కేసులో ముద్దాయి నుంచి నిర్దోషిత్వంతో ముఖ్యమంత్రిగా మారిన జయలలితకు అప్పీలుతో కొత్త చిక్కువచ్చి పడింది. గత నెల 11వ తేదీన జయను నిర్దోషిగా పేర్కొంటూ తాజా తీర్పు వెలువడగానే అన్నాడీఎంకే సంబరాలు చేసుకుంది. అమ్మ వెంటనే సీఎం కాబోతున్నారని ఆనందపడిపోయింది. రాష్ట్రంలోని విపక్షాలు సైతం తీర్పును నిరసిస్తూ అదే స్థాయిలో విరుచుకుపడ్డాయి. అప్పీలుపై కర్నాటక ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాయి. జయ, కేంద్రప్రభుత్వాల మధ్య లోపాయికారి ఒప్పందం కారణంగానే ఇలాంటి తీర్పు వెలువడిందని విపక్షాలు విమర్శించాయి. జయ ఆస్తుల లెక్కలను తారుమారు చేసి నిర్దోషిగా చూపారని కోర్టు తీర్పునే దుయ్యబట్టాయి. కర్నాటక ప్రభుత్వ న్యాయవాది ఆచారి సైతం అప్పీలుకు వెళ్లాలని తమ ప్రభుత్వాన్ని కోరారు. తీర్పు అనంతరం ఉత్పన్నమైన పరిణామాలపై జయలలిత 12 రోజుల పాటూ న్యాయనిపుణులతో చర్చలు జరిపారు. న్యాయకోవిదుల నుండి ఎటువంటి హామీ వచ్చిందో ఏమో గత నెల 23 వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ఇదిలా ఉండగా, అప్పీలుపై తర్జనభర్జనలు చేసిన కర్నాటక ప్రభుత్వం సోమవారం మంత్రి మండలి సమావేశాన్ని నిర్వహించి అప్పీలుకు వెళ్లాలని నిర్ణయించింది. జయ కేసులో కర్నాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీలు వెళ్లాలని మంత్రి మండలి సమావేశాల్లో తీర్మానించినట్లు కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య సోమవారం ప్రకటించారు. మరో రెండురోజుల్లో సుప్రీం కోర్టులో అప్పీలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కర్నాటక ప్రభుత్వం అప్పీలు చేయబోయే తరుణంలో జయ నామినేషన్కు సిద్ధం అవుతున్నారు. అప్పీలులో ఏఏ అంశాలు ప్రతిపాదిస్తారోనని రాష్ట్రంలో రసవత్తరమైన చర్చ సాగుతోంది. తాజాతీర్పు అమలుపై తక్షణం నిషేధం విధించాలని, మలి తీర్పు వెలువడే వరకు జయ ముఖ్యమంత్రి పదవిలో కొనసాగకుండా ఉత్తర్వులు జారీచేయాలని కర్నాటక ప్రభుత్వం కోరిన పక్షంలో అన్నాడీఎంకే ప్రభుత్వం ఇరుకున పడుతుందని అంటున్నారు. కర్నాటక ప్రభుత్వం కోరిన రీతిలోనే సుప్రీం కోర్టు నుంచి ఉత్తర్వులు వెలువడిన పరిస్థితిలో అమ్మ మరోసారి పదవీచ్యుతులు అవుతారా అనే అంశం ప్రధాన చర్చనీయాంశంగా మారింది. మరి అదే జరిగితే అమ్మ కోసమే సిద్ధం చేసుకున్న ఆర్కేనగర్లో ఉప ఎన్నిక మాటేమిటనే ప్రశ్న ఉత్పన్నమైంది. కర్నాటక ప్రభుత్వం అప్పీలును చట్టపరంగానే ఎదుర్కొంటామని అన్నాడీఎంకే నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆర్కేనగర్ ఉప ఎన్నిక ప్రచారంలో ఉత్సాహంగా ఉన్న అన్నాడీఎంకే నేతలను అప్పీలు వ్యవహారం నిరుత్సాహానికి గురిచేసింది. సుప్రీం కోర్టు నుండి ఏక్షణాన ఎటువంటి సమాచారం వినాల్సి వస్తుందోననే ఆందోళన నెలకొని ఉంది. -
అప్పీలుపై ఒత్తిడి
తీర్పుపై అనుమానాలు కర్ణాటకపై విపక్షాల ఒత్తిడి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులోఅన్నాడీఎంకే అధినేత్రి జయలలిత నిర్దోషిత్వాన్ని సవాలు చేయాలని విపక్షాలు పట్టుపడుతున్నాయి. కర్ణాటక ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం ద్వారా అప్పీలు కోసం ఆరాటపడుతున్నాయి. చెన్నై, సాక్షి ప్రతినిధి: జయకు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.100 కోట్ల జరిమానా విధిస్తూ కర్ణాటక ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పుతో సంబరం చేసుకున్న రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు తాజా తీర్పుతో ఖంగుతిన్నాయి. ఇంత పెద్ద కేసు నుంచి జయ నిర్దోషిగా బైటపడడాన్ని జీర్ణించుకోలేక పోతున్నాయి. కాం గ్రెస్, డీఎంకే, పీఎంకే తదితర పార్టీలు ఏకంగా కోర్టు తీర్పునే అనుమానిస్తూ బహిరంగ వ్యాఖ్యానాలు చేయడం ప్రారంభించాయి. జయపై వెలువడిన తీర్పుపై సుప్రీం కోర్టులో అప్పీలు చేయాలని కర్నాటక ప్రభుత్వ న్యాయవాది పీవీ ఆచార్య సైతం అభిప్రాయపడుతున్న తరుణంలో రాష్ట్రంలోని విపక్షాల నేతలు వంత పాడుతున్నారు.అయితే అప్పీలు విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య మంగళవారం ప్రకటించారు. అప్పీలు చేయాల్సిందే: కరుణ జయ కేసులో సుప్రీం కోర్టులో అప్పీలు చేయాల్సిందేనని డీఎంకే అధినేత కరుణానిధి కర్నాటక ప్రభుత్వాన్ని కోరుతూ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జయ ఆస్తులను లెక్కకట్టిన తరువాతే న్యాయమూర్తి గున్హ తన తీర్పులో శిక్షను విధించారని అన్నారు. అయితే అవే ఆస్తులను తాజా తీర్పులో మరోలా లెక్కకట్టడాన్ని కరుణ తప్పుపట్టారు. తీర్పు సైతం ముందుగానే రాసిపెట్టుకుని చివరిరోజుల్లో కొన్ని మార్పులు చేసినట్లుగా అనుమానం వ్యక్తం చేశారు. ఈ వాస్తవాలు వెలుగులోకి రావాలంటే సుప్రీంలో అప్పీలుతోనే సాధ్యమని కరుణ కర్ణాటక ప్రభుత్వానికి విన్నవించారు. తీర్పుపై ఏమా అవసరం: ఇళంగోవన్ 18 ఏళ్లపాటూ సాగిన కేసులో ప్రత్యేక కోర్టు చెప్పిన తీర్పుపై జయ చేసుకున్న అప్పీలును మూడునెలల్లోగా ముగించాల్సిన అవసరం ఏమొచ్చిందని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఈవీకేఎస్ ఇళంగోవన్ ప్రశ్నించారు. అదే స్థాయిలో అత్యవసర తీర్పు ఎందుకని ఆయన అన్నారు. మరో ఆరు నెలలు సాగి ఉంటే వాస్తవాలు వెల్లడయ్యేవని ఆయన వ్యాఖ్యానించారు. ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పుకు, హైకోర్టు ఇచ్చిన తీర్పుకు ఆకాశం, పాతాళంకు ఉన్న వ్యత్యాసం ఉన్నందున కర్నాటక ప్రభుత్వం సుప్రీంలో అప్పీలు చేయాలని ఆయన కోరారు. సుప్రీంలో అప్పీలు చేస్తా: స్వామి జయ తాజా తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో అప్పీలు చేస్తానని జయ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ప్రధాన పిటిషన్ దారుడైన బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి సైతం మంగళవారం ప్రకటించారు. జయ ఆస్తుల విషయంలో తాజా తీర్పులో పేర్కొన్న లెక్కలు తప్పుల తడకలని ఆయన అన్నారు. తొందరపడి పీఠం ఎక్కితే ముఖ్యమంత్రిగా జయ మళ్లీ రాజీనామా చేయాల్సి ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. న్యాయమే తలదించుకునే తీర్పు: విజయకాంత్ ప్రజలకు సేవచేయడమే ప్రజాప్రతినిధి కర్తవ్యం అనే నీతి బోధను న్యాయమూర్తి గున్హ తన తీర్పులో బోధించారని డీఎండీకే అధినేత విజయకాంత్ అన్నారు. అయితే అదే కేసులో తాజాగా వెలువడిన తీర్పు ప్రజలను నిరంతర ఆవేదనకు గురిచేసిందని వ్యాఖ్యానించారు. ప్రజలకు ఒకనీతి, ధన, రాజకీయ బలమున్నవారికి ఒకనీతా అని ప్రజల మనస్సులో ఆలోచనలను రేకెత్తించిందని ఆయన అన్నారు. న్యాయమే తలదించుకునేలా వెలువడిన తీర్పుకు కాలమే బదులుచెప్పగలదని ఆయన వ్యాఖ్యానించారు. తీర్పుపై అనుమానాలు : రాందాస్ జయను నిర్దోషిగా పేర్కొంటూ న్యాయమూర్తి కుమారస్వామి చూపిన కారణాలు ఎంతమాత్రం హేతుబద్దంగా లేవని పీఎంకే అధినేత రాందాస్ అన్నారు. తీర్పులో పేర్కొన్న అంశాలు సైతం అనుమానాలకు తావిస్తున్నందున కర్నాటక ప్రభుత్వం సుప్రీం కోర్టులో అప్పీలు చేయాలని, సుప్రీం తీర్పు వెలువడే వరకు తాజా తీర్పుపై నిషేధం విధించాలని ఆయన కోరారు. అప్పీలు ఉండదు : మదురై ఆధీనం జయ కేసులో కర్నాటక ప్రభుత్వ అప్పీలుకు పోదని మదురై ఆధీనం స్వామి ధీమా వ్యక్తం చేశారు. మంచి నేతలను నిర్లక్ష్యం చేయడమో, బహిష్కరించడమో ఎంతమాత్రం కూడదని అనే భావనతోనే తీర్పుపై కర్నాటక మౌనం పాటిస్తున్నదని అన్నారు. తాజా తీర్పుపై కర్ణాటక అప్పీలుకు వెళ్లదు, వెళ్లలేదని న్యాయనిపుణుల అభిప్రాయమని స్వామి చెప్పారు. -
కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన వైయస్ జగన్
-
గ్రీవెన్స్.. నో రెస్పాన్స్...!
మచిలీపట్నం : ప్రతి సోమవారం కలెక్టరేట్లో జరిగే ప్రజావాణి కార్యక్రమం ప్రహసనంగా మారింది. జిల్లా నలుమూలల నుంచి తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రజావాణికి వచ్చే అర్జీదారుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి. ప్రజావాణికి వచ్చిన అర్జీలను ఆయా శాఖలకు పంపుతున్నా అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రజావాణికి కలెక్టర్ హాజరైతేనే జిల్లాస్థాయి అధికారులు వస్తున్నారు. లేకుంటే కిందిస్థాయి అధికారులను పంపుతున్నారు. దీర్ఘకాల సమస్యలు వెనక్కే... దీర్ఘకాల సమస్యలపై ప్రజావాణిలో అర్జీ ఇచ్చేందుకు వచ్చేవారిని ముందుగానే గుర్తించి లోపలకు రాకుండా వెనక్కి పంపే సంస్కృతి ఇక్కడ కొనసాగుతోంది. అక్టోబరు ఒకటి నుంచి నవంబరు 12వ తేదీల మధ్య ప్రతి సోమవారం జరిగే ప్రజావాణిని జన్మభూమి, హుద్హుద్ తుపాను తదితర కారణాలను చూపి వాయిదా వేశారు. కిందిస్థాయికి బదిలీ... గత ఆరునెలల్లో ప్రజావాణికి 5,385 అర్జీలు రాగా వాటిలో 2,228 పరిష్కరించినట్లు చూపారు. ఇక్కడే అసలు మతలబు దాగి ఉంది. కిందిస్థాయి అధికారులు సరిగా స్పందించడంలేదని అర్జీదారులు వచ్చి ఇక్కడ దరఖాస్తులు ఇస్తున్నారు. అయితే జిల్లా స్థాయి అధికారులు ఈ సమస్యలను కిందిస్థాయి అధికారులకు బదిలీ చేస్తున్నారు. ఇదే అదనుగా భావించిన మండలస్థాయి అధికారులు ఈ సమస్యను పరిష్కరించినట్లు ప్రజావాణి ఆన్లైన్లో చూపుతున్నారు. మళ్లీ ఇదే సమస్యపై అర్జీ ఇస్తే తిరిగి అదేసమాధానం ఆన్లైన్లో ఉంచడం గమనార్హం. ఇది చక్రంలా తిరుగుతూనే ఉంది. సమస్యలు మాత్రం ఎక్కడివక్కడే ఉన్నాయి. 5,385 దరఖాస్తులో పరిష్కరించినవిపోను 30 అర్జీలకు మధ్యంతర సమాచారం ఇచ్చామని, 64 తిరస్కరించామని 2,979 పరిశీలనలో ఉన్నాయని చూపారు. -
పీఆర్సీ వర్తింపజేయాలి
విద్యుత్ ఇంజనీర్ల అసోసియేషన్ విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: విద్యుత్ శాఖ ఉద్యోగులకు 2014 వేతన సవరణ (పీఆర్సీ) వర్తింపజేయాలని తెలంగాణ విద్యుత్ ఇంజనీర్ల అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. పది ప్రధాన డిమాండ్లను ప్రస్తావిస్తూ అసోసియేషన్ అధ్యక్షుడు నెహ్రూ, ప్రధాన కార్యదర్శి భాస్కర్ ఆధ్వర్యంలో టీఎస్జెన్కో చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ ప్రభాకర్రావుకు మెమోరాండం సమర్పించారు. కీలకమైన విభాగాలన్నింటా తెలంగాణ ఇంజనీర్లను నియమించాలని.. సీమాంధ్ర ఇంజనీర్లను అప్రాధాన్య విభాగాల్లో సర్దుబాటు చేయాలని అందులో కోరారు. జెన్కో విద్యుత్ ప్లాంట్లకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని.. అసిస్టెంట్ ఇంజనీర్ల నియామకం చేపట్టాలని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో జెన్కో, ట్రాన్స్కో, డిస్కమ్ ఉద్యోగులకు మెడికల్ పాలసీని వర్తింపజేయాలని, జెన్కో ఇంజనీర్లకు కొత్త క్వార్టర్ల నిర్మాణం చేపట్టాలని, పాల్వంచలో జెన్కో ఉద్యోగుల కాలనీకి నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు. -
అప్పీలుకు వెళ్లనున్న ఐపీఎస్లు?
కేటాయింపులపై రుసరుసలు తెలంగాణలోనే ఆరుగురు డీజీపీ స్థాయి ఆఫీసర్లు హైదరాబాద్: తాము కోరిన రాష్ట్రానికి తవును కేటారుుంచలేదని అసంతృప్తికి గురైన కొందరు పోలీసు అధికారులు అప్పీలుకు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నెల 29 వరకు అప్పీలుకు వెళ్లేందుకు గడువు ఇవ్వడంతో అధికారులు ఈ విషయుంలో సన్నాహాలు ప్రారంభించారని తెలుస్తోంది. కాగా అదనపు డీజీ సురేంద్రబాబు, అనురాధలు స్పౌజ్ కాజ్తో ఇరువురు కూడా ఇటు తెలంగాణ లేదా అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేడర్లలో ఏదో ఒక రాష్ట్రానికి కేటాయించాలని కోరే అవకాశవుుంది. భార్యాభర్తలైన ఇద్దరు అదనపు డీజీ స్థాయి అధికారులు ఎన్.వి.సురేంద్ర బాబు, ఏఆర్ అనురాధలు ఇద్దరు కూడా తెలంగాణ రాష్ట్రం కోసం ఆప్షన్ ఇచ్చారు. అయితే కేటాయింపుల్లో మాత్రం సురేంద్రబాబు ఆంధ్రప్రదేశ్కు, అనురాధ తెలంగాణ కేడర్కు ఎంపిక చేశారు. అలాగే ఇద్దరు ఐపీఎస్ సోదరులు, రాష్ట్ర మాజీ డీజీపీ ఎ.కె. మహంతి కుమారులిద్దరు కూడా తెలంగాణ రాష్ట్రానికి ఆప్షన్ ఇవ్వగా అవినాష్ తెలంగాణకు, అభిషేక్ ఏపీకి ఎంపికయ్యారు. అంతేగాకుండా తాత్కాలిక కేటాయింపుల్లో భాగంగా తెలంగాణలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న పలువురు ఐపీఎస్ అధికారులు ఈ రాష్ట్రానికే తమ ఆప్షన్ ఇవ్వగా వారిలో సగానికి పైగా ఆంధ్రప్రదేశ్ కేడర్కు ఎంపికయ్యారు. రెండు రాష్ట్రాలకు జరిపిన కేటాయింపుల్లో ఆరుగురు డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు (డీజీపీ) స్థాయి అధికారులను తెలంగాణకు కేటాయించారు. రాష్ట్రానికి అవసరమైన మేరకు ఇద్దరు డీజీపీలు కేడర్ ర్యాంకులో, మరో ఇద్దరు నాన్ కేడర్ ర్యాంకులో డీజీపీలు ఉండాలని భావిస్తుండగా, ఈ సంఖ్య కంటే ఇద్దరు డీజీపీలు ఎక్కువగా ఉన్నారని ఐపీఎస్ వర్గాలు పేర్కొన్నాయి. రోస్టర్ బ్యాండ్పై ఐపీఎస్ల అసహనం రాష్ట్ర విభజనతో అనివార్యమైన అఖిల భారత సర్వీసు అధికారుల పంపకానికి కేంద్రం చేపట్టిన రోస్టర్ బ్యాండ్ విధానంపై పలువురు ఐపీఎస్ అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రోస్టర్ పాయింట్ మారడంతో తమ స్థానాలు మారిపోయాయని అసహనం వ్యక్తం చేస్తున్నారు. స్పౌస్ గ్రౌండ్కు ప్రామాణికతను సైతం ఎక్కడా పేర్కొనకపోవడంపైనా విమర్శలు చేస్తున్నారు. ఈ అంశాలపై కమిటీకి అభ్యంతరం తెలపాలని అధికారులు నిర్ణయించారు. రోస్టర్ పాయింట్స్ మారడంతో తాము వెళ్లాల్సిన రాష్ట్రానికి కాకుండా వేరే దానికి వెళ్లామని అధికారులు వాపోతున్నారు. రెండు రాష్ట్రాలకూ అధికారుల్ని కేటాయించిన ప్రత్యూష్ సిన్హా కమిటీ వీటిపై అభ్యంతరాలు తెలపడానికి ఈ నెల 29 సాయంత్రం వరకు గడువు ఇచ్చింది. దీంతో పలువురు అధికారులు తమ అభ్యంతరాలను కమిటీ దృష్టికి తీసుకువెళ్లడానికి సన్నద్ధం అవుతున్నారు. -
జడేజాకు బీసీసీఐ బాసట
ముంబై: భారత ఆల్రౌండర్ రవీంద్ర జడేజాకు బీసీసీఐ అండగా నిలిచింది. ఇంగ్లండ్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్తో గొడవ పడిన వివాదంలో ఐసీసీ జడేజాకు జరిమానా విధించడాన్ని బోర్డు ఆక్షేపించింది. ఐసీసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అప్పీలు చేయాలని బీసీసీఐ నిర్ణయించింది. ఆండర్సన్ తో వివాదంలో జడేజాను ఐసీసీ దోషిగా నిర్ధారించింది. అతడి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత పెట్టి జరిమానా విధించింది. నాటింగ్హామ్ లో జరిగిన మొదటి టెస్టులో ఆండర్సన్, జడేజా గొడవ పడిన సంగతి తెలిసిందే. జడేజా ఐసీసీ చట్టంలోని లెవన్ 1 నేరానికి పాల్పడ్డాడని ఐసీసీ ప్రకటించింది. కాగా జడేజాతో జరిగిన గొడవకు సంబంధించి అండర్సన్ విచారణ ఆగస్ట్ 1న జరగనుంది. ఈ వివాదంపై లెవెల్ 3 అభియోగం ఎదుర్కొంటు న్న అండర్సన్ను..1న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జ్యుడీషియల్ కమిషనర్ గార్డన్ లూయీస్ విచారిస్తారు. -
అర్జీల పరిష్కారానికి ప్రాధాన్యం
కలెక్టరేట్, న్యూస్లైన్ : ప్రజావాణిలో వచ్చిన అర్జీల పరిష్కారానికి అధికారులు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ బుద్ధప్రకాష్ ఎం.జ్యోతి ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయనతో పాటు జేసీ ఉషాకుమారి, డీఆర్వో ఎల్.విజయచందర్లు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ నిర్ణీత సమయంలో సృ కమమైన సేవలు అందించటమే అధికారుల ముఖ్య ఉద్దేశంగా భావించాలన్నారు. జాయింట్ కలెక్టర్ పి.ఉషాకుమారి మాట్లాడుతూ గతంలో ఎంపెడా ఆధ్వర్యంలో ప్రభుత్వ భూముల్లో రొయ్యల సాగు చేసుకునేందుకు ప్రభుత్వ భూములు మంజూరు చేసినట్ల చెప్పారు. ఆ భూముల్లో ఇప్పుడు ఎంపెడా ఆధ్వర్యంలో చెరువులు సాగు చేయకపోవటం వల్ల అవి అన్యాక్రాంతమైపోతున్నాయన్నారు. ఆయా భూములను గుర్తించి ఆర్డీవో, మత్స్యశాఖ డీడీ కళ్యాణంలు చెరువుల నిర్మూలనకు చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. ఈ చర్యల్లో భాగంగా సంబంధిత అధికారులు పోలీసు శాఖ సహకారం తీసుకోవాలన్నారు. అర్జీలు ఇవే.. నూజివీడు మండలం అన్నవరం గ్రామానికి చెందిన ఎ.ఉమాదేవి తన సొంత స్థలం రోడ్లు, భవనాల శాఖ రహదారి నిర్మాణంలో ఆక్రమణకు గురైందని, విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని కోరుతూ కలెక్టర్కు అర్జీ ఇచ్చారు. ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి వీటీపీఎస్కు సంబంధించి జరగనున్న ప్రజాభిప్రాయ సేకరణ సభను వాయిదా వేయాలని లేదా రద్దు చేయాలని కోరుతూ గ్రామానికి చెందిన సీహెచ్ వేణుగోపాలరావు అర్జీ సమర్పించారు. నందిగామ గ్రామానికి చెందిన వికలాంగుడు పొల్లా రాజు తనకు ప్రభుత్వం తరఫున రుణం ఇప్పించాలని వినతిపత్రం అందజేశారు. ఆగస్టునెల పింఛను తనకు రాలేదని, వెంటనే ఇప్పించాలని కోరుతూ పామర్రుకు చెందిన బట్టా శామ్యూల్ వినతిపత్రం అందించారు. జిల్లా గిరిజన సంక్షేమశాఖ నుంచి తనకు రుణం ఇప్పించాలని కోరుతూ మొవ్వ మండలం కాజ గ్రామానికి చెందిన కట్టా దనువు వినతిపత్రం అందజేశారు. ఈ సమావేశంలో డ్వామా పీడీ రవికుమార్, మత్స్యశాఖ డీడీ కల్యాణం, డీపీవో కె.ఆనంద్, డీఈవో దేవానందరెడ్డి, డీఎం అండ్ హెచ్వో సరసిజాక్షి, డీఎస్వో పీబీ సంధ్యారాణి, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ డి.మధుసూదనరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.