australian
-
ఆన్లైన్ లవ్.. రూ.4.3 కోట్లు అర్పించేసుకున్న మహిళ
టెక్నాలజీ ఎంతగా పెరుగుతోందో.. స్కామర్లు కూడా అంతే వేగంగా పెరిగిపోతున్నారు. ఆన్లైన్లో ఎప్పుడైనా ఆదమరిస్తే.. చెబుకు చిల్లు ఖాయమే. ఇలాంటి ఘటనలు గతంలో కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. తాజాగా మరో సంఘటన ఆస్ట్రేలియాలో వెలుగులోకి వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.ఆస్ట్రేలియాకు చెందిన మహిళ 'అన్నెట్ ఫోర్డ్' ఆన్లైన్లో ప్రేమ కోసం వెతుకుతున్నప్పుడు.. స్కామర్ల చేతికి చిక్కింది. దీంతో సుమారు 4.3 కోట్లు (780000 ఆస్ట్రేలియన్ డాలర్స్) పోగొట్టుకుంది. పెళ్ళై కొన్నేళ్ళకు భర్తతో విడిపోయిన తరువాత.. 2018లో ఫోర్డ్ ఆన్లైన్ డేటింగ్ వైపు మొగ్గు చూపి, 'ప్లెంటీ ఆఫ్ ఫిష్' అనే డేటింగ్ సైట్లో చేరింది. ఇక్కడే 'విలియం' అనే వ్యక్తితో చాట్ చేయడం ప్రారంభించింది.కొన్ని నెలల తరువాత మలేషియాలోని కౌలాలంపూర్లో కొంతమంది పర్సు, కార్డులను ఎవరో దొంగలించారని చెప్పి, అన్నెట్ ఫోర్డ్ నుంచి విలియం రూ. 2.75 లక్షలు తీసుకున్నాడు. ఆ తరువాత కూడా బ్యాంక్ కార్డులు పోయాయని.. మెడికల్స్ బిల్స్, హోటల్స్ బిల్స్ వంటివి చెల్లించాలని మరికొంత డబ్బు తీసుకున్నాడు. తాను (ఫోర్డ్) మోసపోయానని గ్రహించే సమయానికి ఆమె రూ. 1.6 కోట్లు నష్టపోయింది. ఈ విషయాన్ని ఆస్ట్రేలియన్ ఫెడరల్ పోలీసులకు నివేదించిప్పటికీ.. ఫలితం లేకుండా పోయింది.ఫేస్బుక్లో రెండో స్కామ్నాలుగు సంవత్సరాల తరువాత, 'అన్నెట్ ఫోర్డ్' ఫేస్బుక్లో మరొక స్కామ్ బారిన పడింది. ఆమ్స్టర్డామ్కు చెందినవాడినని చెప్పుకునే 'నెల్సన్' అనే వ్యక్తితో పరిచయం ఏర్పడిన తరువాత.. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI)లో తన స్నేహితుడు ఉన్నాడని, అతనిపై దర్యాప్తు జరుగుతోందని, అతనికి సహాయం చేయడానికి 2500 AUD (సుమారు రూ. 1.3 లక్షలు) అవసరమని చెప్పాడు.మొదట్లో అనుమానం వచ్చిన ఫోర్డ్ డబ్బు పంపించడానికి నిరాకరించింది. అయితే, నెల్సన్ ఆమెను బిట్కాయిన్ ATMలో డబ్బు జమ చేయమని ఒప్పించాడు. ఆ తరువాత కొన్ని రోజులకు ఆమె ఖాతాలోకి డబ్బు వచ్చి వెళ్లడం గమనించింది. అసలు విషయం తెలుసుకునే లోపే.. రూ. 1.5 కోట్లు పోగొట్టుకుంది.ఇదీ చదవండి: 'ఉచితంగా పనిచేస్తా.. ఉద్యోగమివ్వండి': టెకీ పోస్ట్ వైరల్మోసపోయిన తరువాత ఫోర్డ్.. ఆస్ట్రేలియన్లను ఇలాంటి మోసాలకు బలికావద్దని హితవు పలికింది. గుర్తు తెలియని వ్యక్తులు నమ్మకంగా మాట్లాడి.. చివరికి మీ నుంచి డబ్బు లాగేస్తారని, తరువాత మీరే దివాళా తీస్తారని చెప్పింది. మొత్తం మీద ఆన్లైన్లో ఏదైనా సెర్చ్ చేసేటప్పుడు, గుర్తు తెలియని వ్యక్తులకు స్పందించేటప్పుడు.. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని స్పష్టమవుతోంది. -
మూడో ప్రపంచయుద్ధం ముంచుకొస్తోంది: భయపెడుతున్న బిషప్ భవిష్యవాణి
కాన్బెర్రా: మూడో ప్రపంచయుద్ధ భయాలు ప్రపంచాన్ని వెంటాడుతున్నాయి. ఇరాన్, సిరియా, హమాస్, హిజ్బొల్లా, ఇజ్రాయెల్ మధ్య ఎప్పుడైనా భీకర యుద్ధం జరగబోతోందనే భయం అందరిలో నెలకొంది. మరోవైపు చైనా, తైవాన్ మధ్య ఉద్రిక్తతలు ఆసియా ఖండంలో అశాంతిని మరింతగా పెంచుతున్నాయి.ప్రపంచంలోని పలు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఇతర దేశాలలో తీవ్ర ఆందోళనను సృష్టిస్తున్నాయి. తాజాగా ఆస్ట్రేలియన్ బిషప్ చెప్పిన భవిష్యవాణి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆస్ట్రేలియాలోని సిడ్నీకి చెందిన బిషప్ మార్ మేరీ ఇమ్మాన్యుయేల్ మూడవ ప్రపంచ యుద్ధం భారీ బీభత్సాన్ని సృష్టిస్తుందని పేర్కొన్నాడు. ఈ యుద్ధంలో లెక్కలేనంత మంది ప్రాణాలు కోల్పోతారని, బతికిన వారు తర్వాత పశ్చాత్తాప పడతారని బిషప్ పేర్కొన్నారు. ఈయన తన సోషల్ మీడియా ఖాతా 'ఎక్స్'లో మానవాళికి ఎదురయ్యే చీకటి భవిష్యత్తును తాను ఊహించినట్లు పేర్కొన్నారు. A prophecy of world War 3.Almost one third of the population will perish.It will be the most disastorous , times of humanity. pic.twitter.com/om9PIia9BH— M. O. G. Bishop mar mari Emmanuel (@Bishopmurmuri) November 24, 2024బిషప్ మార్ మేరి ఇమ్మాన్యుయేల్ తన వీడియో సందేశంలో మూడవ ప్రపంచ యుద్ధం భారీ విధ్వంసాన్ని తెస్తుందని హెచ్చరించారు. ఈ యుద్ధంలో ప్రపంచ జనాభాలో మూడింట ఒక వంతు మంది కనుమరుగవుతారని, మిగిలిన మూడింట రెండొంతుల మంది తాము ఇక పుట్టకూడదని కోరుకుంటారని తెలిపారు. ఈ యుద్ధంలో అణ్వాయుధాలను వినియోగిస్తారని పేర్కొన్నారు. భవిష్యత్ గురించి బిషప్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. బాబా వెంగా, నోస్ట్రాడామస్ తదితర ప్రపంచ ప్రసిద్ధ భవిష్యవాణివేత్తలు కూడా ఇదే విధమైన విషయాలను వెల్లడించారు.ఇది కూడా చదవండి: World Oldest Man: ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడు కన్నుమూత -
ఆస్కార్ అదరహో
బాకు (అజర్బైజాన్): వరుసగా నాలుగో ఏడాది క్వాలిఫయింగ్లో మెరిపించిన ఫెరారీ జట్టు డ్రైవర్ చార్లెస్ లెక్లెర్క్ ప్రధాన రేసులో మాత్రం తడబడ్డాడు. ఆదివారం జరిగిన సీజన్లోని 17వ రేసు అజర్బైజాన్ గ్రాండ్ప్రిలో మెక్లారెన్ జట్టు డ్రైవర్ ఆస్కార్ పియాస్ట్రి విజేతగా నిలిచాడు. నిరీ్ణత 51 ల్యాప్లను ఆస్కార్ అందరికంటే వేగంగా 1 గంట 32 నిమిషాల 58.007 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఆ్రస్టేలియాకు చెందిన 23 ఏళ్ల ఆస్కార్కు ఈ సీజన్లో ఇది రెండో విజయం. హంగేరి గ్రాండ్ప్రిలోనూ ఆస్కార్ విజేతగా నిలిచాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును మొదలుపెట్టిన లెక్లెర్క్ 1 గంట 33 నిమిషాల 08.917 సెకన్ల సమయంతో రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. 20వ ల్యాప్లో అప్పటి వరకు నంబర్వన్ స్థానంలో ఉన్న లెక్లెర్క్ను ఆస్కార్ పియాస్ట్రి ఓవర్టేక్ చేసి ఆధిక్యంలోకి వచ్చాడు. ఈ ఆధిక్యాన్ని చివరి వరకు ఆస్కార్ నిలబెట్టుకొని తన కెరీర్లో రెండో విజయాన్ని దక్కించుకున్నాడు. మెర్సిడెస్ జట్టు డ్రైవర్ జార్జి రసెల్కు మూడో స్థానంలో, మెక్లారెన్ జట్టు డ్రైవర్ లాండో నోరిస్కు నాలుగో స్థానంలో, ప్రస్తుత ప్రపంచ చాంపియన్ మాక్స్ వెర్స్టాపెన్ (రెడ్బుల్) ఐదో స్థానంలో నిలిచారు. వీసా క్యాష్ యాప్ జట్టుకు చెందిన యుకీ సునోడా రేసును పూర్తి చేయడంలో విఫలమయ్యాడు. 24 రేసుల ఫార్ములావన్ సీజన్లో 17 రేసులు ముగిశాక మాక్స్ వెర్స్టాపెన్ 313 పాయింట్లతో టాప్ ర్యాంక్లో కొనసాగుతున్నాడు. సీజన్లోని 18వ రేసు సింగపూర్ గ్రాండ్ప్రి ఈనెల 22న జరుగుతుంది. -
కాల్ చేస్తే కట్ చేయొచ్చు
సిడ్నీ: ఆఫీసులో పని ముగించుకొని, ఇంటికెళ్లి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో యాజమాన్యం నుంచి ఫోన్లు, మెసేజ్లు వస్తే ఎలా ఉంటుంది? చాలా చిరాకు కలుగుతుంది కదా! ఆ్రస్టేలియాలో ఇలాంటి చిరాకు ఇకపై ఉండదు. ఎందుకంటే ‘రైట్ టు డిస్కనెక్ట్’ నిబంధన అమల్లోకి వచ్చింది. పని వేళలు ముగించుకొని ఇంటికెళ్లిన ఉద్యోగులకు యాజమాన్యాలు అనవసరంగా ఫోన్ చేస్తే జరిమానా విధిస్తారు. యాజమాన్యాలు ఫోన్లు, మెసేజ్లు చేస్తే ఉద్యోగులు స్పందించాల్సిన అవసరం లేదు. మాట్లాడకపోతే శిక్షిస్తారేమో, ఉద్యోగం పోతోందేమో అనే భయం కూడా అవసరం లేదు. ఆఫీసు అయిపోయాక యాజమాన్యం ఫోన్ చేస్తే ఫెయిర్ వర్క్ కమిషన్(ఎఫ్డబ్ల్యూసీ)కు ఫిర్యాదు చేయొచ్చు. అయితే, అత్యవసర పరిస్థితుల్లో యాజమాన్యం నుంచి ఫోన్ వస్తే ఉద్యోగులు స్పందించాల్సి ఉంటుంది. సరైన కారణం లేకుండా ఫోన్కాల్ను తిరస్కరించకూడదు. ఎఫ్డబ్ల్యూసీ నిబంధనలు అతిక్రమిస్తే యాజమాన్యాలకు 94 వేల డాలర్లు, ఉద్యోగులకు 19 వేల డాలర్ల జరిమానా విధిస్తారు. ఆఫీసులో పని ముగిశాక తమకు ఫోన్ చేయవచ్చా? లేదా? అనేది నిర్ణయించుకొనే అధికారాన్ని ఉద్యోగికి కట్టబెట్టారు. ఆ్రస్టేలియాలో ఆఫీసు టైమ్ అయిపోయిన తర్వాత కూడా ఉద్యోగులు పని చేయడం మామూలే. ఒక్కో ఉద్యోగి ప్రతిఏటా సగటున 281 గంటలు అధికంగా ఆఫీసులో పని చేస్తున్నట్లు గత ఏడాది ఒక సర్వేలో వెల్లడయ్యింది. ఈ ఓవర్టైమ్ పనికి అదనపు వేతనం ఉండదు. -
డెవిల్స్ పూల్! ఆ నీళ్లల్లో అడుగుపెడితే ప్రాణాలకు గ్యారెంటీ లేదట!!
క్వీన్స్లండ్, ఆస్ట్రేలియన్ బుష్లో ‘బబిందా బౌల్డర్స్ పూల్’ అనే విస్తారమైన ఈత కొలను.. సహజ అందాలకు కొలువు. కానీ ఆ నీళ్లల్లో అడుగుపెడితే ప్రాణాలకు గ్యారెంటీ లేదట. 1959 నుంచి ఇప్పటి వరకు ఆ కొలనులో పడి సుమారు 21 మందికి పైగా చనిపోయారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కొన్ని మృతదేహాలు ఇంకా దొరకను కూడా లేదు. ఆ కొలను రాళ్ల మధ్య ఉంటుంది. అక్కడ నీరు ఉన్నట్టుండి పెరుగుతుంది, అకస్మాత్తుగా తగ్గుతుంది.కాలాన్ని బట్టి.. సమయాన్ని బట్టి మారుతుంది. పైగా ఆ రాతికొండలకు లోతైన గోతులు, గుంతలు ఉంటాయి. వాటిల్లో నీళ్లు నిండి.. కొన్ని చోట్ల ఆ గుంతలు కనిపించను కూడా కనిపించవు. ఆ క్రమంలోనే అక్కడ చాలామంది ప్రాణాలు కోల్పోయారు. కొందరు ఆ గోతుల్లో ఇరుక్కుని.. బయటికి రాలేక చనిపోతున్నారు. ఆ కొలనులో నీరు నిండుగా ఉన్నా.. నేల మట్టానికి చేరుకున్నా.. కళ్లు చెదిరే అందం అక్కడి ప్రకృతి సొంతం. అందుకే ఆ అందాలను చూడటానికి, ఈత కొట్టడానికి జనాలు ఎగబడుతుంటారు. కొన్ని డేంజర్ జోన్స్ని సూచిస్తూ హెచ్చరికలు, గమనికలు ఉన్న బోర్డ్స్ కనిపిస్తూనే ఉంటాయి. అయినా ప్రమాదాలు ఆగడంలేదు.అక్కడికి వచ్చే వారిలో ఒకరిని ఆ కొలను దగ్గరుండే దయ్యం ఎన్నుకుంటుందని.. వారిని చావుకు ఆహ్వానిస్తుందని.. బాధితులంతా అలా చనిపోయినవారేనని కొందరు స్థానికుల నమ్మకం. ఆ తరహాలోనే.. సమీపంలో నివసించే ఆదివాసులు.. హడలెత్తించే విషాద గాథనూ వినిపిస్తుంటారు. కొన్నేళ్ల క్రితం యిండింజి తెగకు చెందిన ఊలానా అనే అందమైన యువతి.. వరూనూ అనే ఆ జాతి పెద్దను వివాహం చేసుకుని.. కొత్త జీవితాన్ని ప్రారంభించిందట.అయితే వివాహమైన కొన్నాళ్లకి ఊలానా జీవితంలోకి మరొక తెగకు చెందిన డైగా అనే యువకుడు రావడంతో.. అది వారి మధ్య ప్రేమకు దారితీసింది. కొంతకాలం గుట్టుగా సాగిన ఆ బంధం.. ఉన్నట్టుండి బంధువుల మధ్య పంచాయతీకి రావడంతో అవమానాన్ని తట్టుకోలేక ఊలానా.. బబిందా బౌల్డర్స్ పూల్లో దూకి ఆత్మహత్య చేసుకుందట. అయితే ఆమె ఆ కొలనులోకి దూకే క్రమంలోనే ‘డైగా డైగా’ అని అరిచిందట. ఆ అరుపులకు డైగా కూడా అదే కొలనులో దూకి చనిపోయాడు.అయితే డైగా దూకడం, చనిపోవడం అంతా.. ఊలానా చనిపోతూనే కళ్లరా చూసిందట. తాను చనిపోతున్న సమయంలోనే.. తన ప్రియుడి చావుని చూస్తూ.. భీకరంగా ఏడ్చిందట. ఆ కన్నీరే ఆ కొలను నీటిమట్టాన్ని పెంచిందని.. కొలనులో ప్రమాదకరమైన గుంతలను ఏర్పరచిందని వారంతా చెబుతారు. అందుకే ఆ ప్రాంతాన్ని వారు హాంటెడ్ ప్రదేశంగా నమ్మి.. అటువైపు పోవద్దని హెచ్చరిస్తుంటారు.మొదట బాధితుడు లేదా బాధితురాలి శరీరంలోకి డైగా ఆత్మ చేరుతుందని.. నీటిలో ఉన్న ఊలానా ఆత్మ.. ప్రేమగా ‘డెగా డైగా’ అని పిలవగానే.. బాధితులు తమపై తాము నియంత్రణ కోల్పోయి.. నీటిలో ఇరుక్కునేలా డైగా ఆత్మ చేస్తుందని.. అలా ఆత్మల ప్రేమకు అమాయకులు బలవుతున్నారనేది స్థానికుల మాట.మరోవైపు 1940లో జాన్ డొమినిక్ అనే ఎనిమిదేళ్ల బాలుడు ఆ నీటిలో మునిగి చనిపోయాడు. అతడి కుటుంబం అక్కడే అతడి పేరున స్మారక ఫలకాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఆ ఫలకాన్ని తన్నిన ఓ యువకుడు.. ఆ తర్వాత నుంచి అదృశ్యమయ్యాడని, డొమినిక్ ఆత్మే అతడ్ని మాయం చేసిందనే మరో హారర్ స్టోరీ వినిపిస్తూ ఉంటుంది.ఒకానొక సాయంత్ర వేళ ఒక జంట ఆ కొలను అందాలు చూడటానికి వెళ్తే.. ఉన్నట్టుండి నీళ్లు అనకొండలా పైకి లేచి.. రాళ్ల మీదున్న వారిని కొలనులోకి లాక్కెళ్లడం ఓ వ్యక్తి కళ్లారా చూశాడట. అప్పటి నుంచి ఆ కొలనుపై పుకార్లు మరింతగా పెరిగిపోయాయి. ఏదిఏమైనా ఆ ప్రదేశంలో ఏ శక్తి ఉంది? ఎందుకు అంతమంది చనిపోతున్నారు? అనేది మాత్రం నేటికీ మిస్టరీనే. – సంహిత నిమ్మన -
స్నేహితురాలిని పెళ్లాడిన ఆ్రస్టేలియా మహిళా మంత్రి
అడిలైడ్: ఆ్రస్టేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ తన చిరకాల భాగస్వామి సోఫీ అల్లౌచెను పెళ్లి చేసుకున్నారు. ఆ్రస్టేలియా పార్లమెంట్ సభ్యుల్లో మొట్టమొదటిగా స్వలింగ సంపర్కులిగా ప్రకటించుకున్న వాంగ్.. తనతోపాటు పూల బొకెతో పెళ్లి దుస్తుల్లో ఉన్న అల్లౌచె ఫొటోను ఆదివారం ఇన్స్ట్రాగామ్లో షేర్ చేశారు. ‘మా కుటుంబసభ్యులు, ఎందరో స్నేహితులు ఈ ప్రత్యేకమైన రోజును మాతో పంచుకున్నందుకు సంతోషిస్తున్నాం’అని వాంగ్ పేర్కొన్నారు. వాంగ్, అల్లౌచె దాదాపు రెండు దశాబ్దాలుగా కలిసి ఉంటున్నారు. శనివారం అడిలైడ్లోని ఓ ద్రాక్ష తోటలో వారి వివాహ వేడుక జరిగినట్లు ‘సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్’ తెలిపింది. సెనేట్లో దక్షిణ ఆస్ట్రేలియా తరఫున వాంగ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ్రస్టేలియా కేబినెట్లో స్థానం సంపాదించుకున్న ఆసియా(చైనా)లో జని్మంచిన మొదటి వ్యక్తి పెన్నీ వాంగ్. ఆ్రస్టేలియాలో 2017 నుంచి స్వలింగ వివాహాలకు చట్టబద్ధత లభించింది. -
చనిపోయిన భర్త నుంచే పిల్లలు పొందాలని.. ఆమె ఏకంగా..!
ఇటీవల కాలంలో చనిపోయిన భర్త నుంచే పిల్లలను కన్న ఓ మహిళ గురించి విన్నాం. ఆకేసులో ఆ దంపతులు పిల్లలు పుట్టకపోవడంతో ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్(ఐవీఎఫ్) ఆస్పత్రిని ఆశ్రయించారు. ఆ పద్ధతిలో పిల్లను కనాలనుకునేలోపు కరోనా మహమ్మారి రావడం భర్త చనిపోవడం క్షణాల్లో జరిగిపోయింది. ఒంటిరిగా అయిపోయిన ఆ భార్య తన భర్త ఉన్నప్పుడు పిల్లలను కనాలనుకున్న ఘటన గుర్తొచ్చి ఆస్పత్రికి వెళ్లి తన నిర్ణయాన్ని తెలిపి మరీ సాహసోపేతంగా బిడ్డను కని వార్తల్లో నిలిచింది. అది మరువక మునుపే అదే మాదిరి ఘటన కాకపోతే కొద్ది తేడా ఉంది. అక్కడ బతికుండగానే భర్త నుంచి స్పెర్మ్ తీసుకున్నారు. ఇక్కడ ఈ జంట కనాలనుకునేలోపే భర్త అకాల మరణం పొందాడు. అయినా తన భర్త నుంచే పిల్లలను కనాలనుకుంటున్నా అంటూ అందుకు పర్మిషన్ ఇమ్మని ఏకంగా సుప్రీం కోర్టునే ఆశ్రయించి అనుమతి తెచ్చుకుంది. ఈ ఆశ్చర్యకర ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..వెస్ట్ ఆస్ట్రేలియాకు చెందిన 62 ఏళ్ల మహిళ ఆమె భర్త తమ ఇద్దరు పిల్లలను వేర్వేరు ఘటనలు పోగొట్టుకున్నారు. దీంతో ఇరువురు పిల్లను కనాలని కృతనిశ్చయంతో ఉన్నారు. అయితే అనుకోకుండా ఇటీవలే డిసెంబర్ 17న భర్త ఆకస్మికంగా మరణించారు. దీంతో ఆమె తన భర్త బతికుండగానే పిల్లలను కనాలనుకున్న దాన్ని నిజం చేయాలనుకుంది. చనిపోయినప్పటికీ తన భర్త నుంచే పిల్లలను కనాలనుకుంది. అందుకోసం అని చనిపోయిన భర్త నుంచి స్పెర్మ్ని సేకరించాలనుకుంది. దీనికి సుప్రీం కోర్టు అనుమతివ్వాలంటూ అభ్యర్థించింది. తన భర్త బతికున్నప్పుడే తామిరువురం అనుకున్నామని, తన భర్త కోరికని అనుమతిమ్మని కోర్టుని వేడుకుంది. దీంతో ధర్మాసనం చనిపోయిన భర్త నుంచి స్పెర్మ్ని తీసుకునేందు అనుమతి మంజూరుచేసింది. ఇక్కడ ఓ చనిపోయిన వ్యక్తి స్పెర్మ్ ఫలదీకరణం చెందించేలా ఉపయోగించడం అనేది వైద్యశాస్త్రంలో మరింత పురోగతికి నాంది పలుకుతుందనే చెప్పాలి. ఇక ఆ జంట పిల్లలు 2013లో కుమార్తె(29) ఫిషింగ్ ట్రిప్లో మరణించగా, కుమారుడు(30) కారు ప్రమాదంలో మరణించాడు. దీంతో ఆ జంట ఐవీఎఫ్ పద్ధతిలో పిల్లను కనాలని అనుకుంది. అయితే పిల్లలను కనే వయసు సదరు మహిళకు దాటిపోవడంతో సరోగసి ద్వారా పిల్లలను పొందాలనుకున్నారు. ఈలోగా అనుకోకుండా భర్త దూరమవ్వడంతో ఆ కోరిక కలగా మిగిలిపోకూడదని ఆ మహిళ స్ట్రాంగ్గా నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలోనే ఆమె సుప్రీంకోర్టుని ఆశ్రయించి చనిపోయిన భర్త నుంచే స్పెర్మ్ని సేకరించేలా అనుమతి పొందింది. కాగా, మరణాంతర ఫలదీకరణంపై వెస్ట్ ఆస్ట్రేలియా నిషేధం విధించింది. అందువల్ల ఆమె సరోగసి ద్వారా బిడ్డను పొందాలనుకుంటే..ముందుగా సదరు మహిళ స్త్రీ పునరుత్పత్తి సాంకేతిక పరిజ్ఞాన మండలికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆమె దివగంత భర్త తండ్రి కావాలనుకున్నాడా? అలాగే సదరు మహిళ చెబుతోంది అంతా నిజమేనా? అన్నది నిర్థారణ చేసుకుని ఆస్ట్రేలియా వైద్యాధికారులు అనుమతి ఇస్తేనే ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఇక అధికారులు సదరు మహిళ వివరాలను చాలా గోప్యంగా ఉంచారు. (చదవండి: ఒక లీటర్ బాటిల్లో ఎన్ని నానో ప్లాస్టిక్ కణాలు ఉంటాయో తెలుసా! వెలుగులోకి షాకింగ్ విషయాలు!) -
David Warner: ఆసీస్ డ్యాషింగ్ బ్యాట్స్మెన్ డేవిడ్ వార్నర్ ఫ్యామిలీ (ఫొటోలు)
-
అభిమాని కలకలం
అహ్మదాబాద్: రెండు అగ్రశ్రేణి జట్ల మధ్య లక్ష పైచిలుకు అభిమానులున్న స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. 6000 మందికి పైగా సాయుధ బలగాలు పహారా కాస్తున్నాయి. ఇంతటి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన కూడా... ఆస్ట్రేలియాకు చెందిన పాలస్తీనా సానుభూతిపరుడు ఇన్ని అంచెలను దాటుకొని కోహ్లిని కలవడం, కౌగిలించుకోవడం కలకలం సృష్టించింది. ఇది భద్రత డొల్లతనాన్ని భయటపెట్టింది. వెంటనే అప్రతమత్తమైన భద్రత దళాలు వేన్ జాన్సన్ అనే ఆ్రస్టేలియన్ను నిర్బంధించాయి. అతన్ని చాంద్ ఖేడా పోలీస్ స్టేషన్కు తరలించి తదుపరి విచారణ చేపట్టింది. ప్రస్తుతం పాలస్తీనాలో హమాస్, ఇజ్రాయెల్ల మధ్య భీకర దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే! -
భలే ఉద్యోగ ప్రకటన!..జీతం ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!
ఈ ఫొటోల్లో కనిపిస్తున్న వ్యక్తి పేరు మాథ్యూ లెప్రీ. ఆస్ట్రేలియాలో ఉంటూ ఆన్లైన్ వ్యాపారం చేస్తుంటాడు. ‘ఈకామ్ వారియర్ అకాడమీ’ని నెలకొల్పాడు. వ్యాపారంలో కోట్లకు కోట్లు గడించాడు. ఇప్పుడు ఇతగాడు ప్రపంచయాత్ర చేయాలనుకుంటున్నాడు. గడచిన ఐదేళ్లలో ముప్పయి దేశాలు తిరిగి, అక్కడి తన క్లయింట్ల వ్యాపారాలు పుంజుకొనేందుకు సహాయపడ్డాడు. ప్రపంచవ్యాప్తంగా సంచరించే తనకు తన ప్రయాణాల్లో సహకరించేందుకు ఒక సహాయకుడు కావాలంటూ ఇటీవల ఇతగాడు ప్రకటన ఇచ్చాడు. వెంటనే ఈ ప్రకటన వైరల్గా మారింది. తగిన వ్యక్తి దొరికితే తనకు సహాయకుడిగా నియమించుకుంటానని, జీతంగా ఏడాదికి 30,500 పౌండ్లు (రూ.31 లక్షలు) చెల్లించడమే కాకుండా, హెల్త్ ఇన్సూరెన్స్, ట్రావెల్ అలవెన్స్ తదితర సౌకర్యాలు కూడా కల్పించనున్నట్లు ప్రకటించాడు. ఈ ఉద్యోగం కోసం ఇప్పటికే 70 వేలకు పైగా దరఖాస్తులు పోటెత్తాయి. View this post on Instagram A post shared by Matthew Lepre (@matthewlepre) (చదవండి: అదొక శాపగ్రస్త గ్రామం! అరవై ఏళ్లుగా మనుషులే లేని ఊరు) -
Moeen Ali Unseen Photos: ట్రెండింగ్లో ఇంగ్లండ్ ఆల్రౌండర్ మొయిన్ అలీ (ఫోటోలు)
-
ఆస్ట్రేలియా టీమ్ కి నిద్రలేని రాత్రులు ఎందుకంటే..!
-
కొత తరహాలో సైబర్ మోసం..ఆస్ట్రేలియా జైల్లో..
ఇంతవరకు సైబర్ నేరస్తులు ఏదో ఒక ఎర వేసి లేదా ఆశ చూపో వారి ట్రాప్లోకి దించి డబ్బులు దుండుకునేవారు. అదీ కుదరకపోతే ఏకంగా అత్యున్నత హోదా అధికారి పేరు చెప్పి ట్రాప్ చేసేవారు. ఇక వాటన్నింటిని అధిగమించి కొత్త తరహాలో నేరాలకు తెగబడుతున్నారు. అందుకోసం ఆయా వ్యక్తుల నేపథ్యం గురించి తెలుసుకుని ట్రాప్ చేసి మోసం చేస్తున్నారు. అచ్చం అలానే ఓ కుటుంబం రూ. 4 లక్షలు పొగొట్టుకుంది. వివరాల్లోకెళ్తే..ఉత్తర ఢిల్లీలోని ఓ కుటుంబం సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని రూ. 4 లక్షలు పోగొట్టుకుంది. 29 ఏళ్ల గుర్సిమ్రాన్ సింగ్ ఈ విషయమై పోలీసులుకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగు చూసింది. ఆ వ్యక్తి తన తల్లికి ఓ అంతర్జాతీయ కాల్ వచ్చిందని పోలీసులకు తెలిపాడు. వారి బంధువు నౌనిహాల్ ఆస్ట్రేలియాలో చదువుకుంటున్నాడు అతడి పేరు చెప్పి సైబర్ నేరగాళ్లు ఆ కుటంబాన్ని దోచుకున్నారు. ఓ రోజు తన తల్లికి నౌనిహాల్ సింగ్ అని పరిచయం చేసుకుంటూ ఓ కాల్ వచ్చింది. అతడు తమ బంధువే కదా అని అతడి తల్లి ఫోన్లో మాట్లాడింది. ఆ తర్వాత కొద్దిరోజుల అనంతరం నైనిహాల్ స్నేహితులందరూ జైల్లో ఉన్నారని, వారంతా ఓ వ్యక్తితో గొడపడ్డట్టు చెప్పుకొచ్చాడు. నైనిహాల్ మాత్రమే బయటే ఉన్నట్లు తెలిపాడు. కేసు గురించి మరింతగా విచారించడానికి ఒక న్యాయవాది ఆమెను పిలుస్తారని అతను తన తల్లికి చెప్పాడని పోలీసులకు వెల్లడించాడు. కొద్ది వ్యవధిలోనే ఓ న్యాయవాది ఫోన్ చేసి నౌనిహాల్ని జైలుకు పంపారని, బెయిల్ పొందడానికి పోలీసులకు డబ్బులు డిపాజిట్ చేయాలని చెప్పాడు. చెల్లించకపోతే సుమారు 15 నుంచి 20 ఏళ్ల వరకు కటకటాల్లోనే ఉంటాడని చెప్పాడు. పైగా డబ్బులు డిపాజిట్ చేసేందుకు రాంచీలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్కి సంబంధించి విక్రమ్ కుమార్ ముండా పేరిట ఉన్న ఖాతా నెంబర్ను ఇచ్చాడు. మొదట రెండు లక్షలు అని చెప్పాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా పోలీసులు రూ. 2.5 లక్షలు డిమాండ్ చేస్తున్నట్లు తెలిపాడు. దీంతో ఆ కుటుంబం విడతలు వారీగా ఆర్టీజీఎస్ ద్వారా నగదును అతడిచ్చిన ఖాతా నెంబర్కు బదిలీ చేశారు. ఆ తర్వాత బంధువుల్ని విచారించగా..నౌనిహాల్ క్షేమంగా ఉన్నాడని, తనపై అతడి స్నేహితులపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని తెలిసి ఆ కుటుంబం ఒక్కసారిగా షాక్కి గురైంది. తాము సైబర్ మోసానికి బలయ్యినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు గుర్సిమ్రాన్ సింగ్ పేర్కొన్నాడు. ఉత్తర ఢిల్లీకి చెందిన మరో కుటుంబాన్ని ఇదే తరహాలో మోసం చేసేందుకు యత్నించి నేరగాళ్లు విఫలమైనట్లు అధికారులు తెలిపారు. ఆ కేసులో కూడా..ఆ కుటుంబానికి కెనడాలో బంధువులు ఉన్నారు. దీంతో సైబర్ నేరగాళ్లు మీ బంధువులు జైలులో ఉన్నారని వారిని బెయిల్పై విడుదల చేయడానికి డబ్బు అవసరమంటూ ట్రాప్ చేసేందుకు యత్నించారు. అయితే వారు డబ్బులు డిమాండ్ చేయడంతో అనుమానం వచ్చి ఎంక్వైయిరీ చేస్తే అది నకిలీ ఫోన్ కాల్ అని తేలిందని పోలీసులు చెప్పుకొచ్చారు. (చదవండి: షాకింగ్ ఘటన: ఏకంగా 45 బ్యాగుల్లో మానవ అవశేషాలు!) -
రతన్ టాటాకు మరో అరుదైన పురస్కారం: ఫోటోలు వైరల్
సాక్షి, ముంబై: పారిశ్రామికవేత్త, టాటాసన్స్ ఛైర్మన్ ఎమెరిటస్ రతన్ టాటాకు అరుదైన పురస్కారం లభించింది. ఆస్ట్రేలియా అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా పురస్కారం రతన్ టాటాను వరించింది. ఆస్ట్రేలియా-భారత్ ద్వైపాక్షిక సంబంధానికి చేసిన సేవకుగాను ఈ గౌరవం లభించింది. దీనికి సంబంధించిన ఫోటోలను భారతదేశంలోని ఆస్ట్రేలియన్ రాయబారి బారీ ఓ' ఫారెల్ ట్విటర్లో షేర్ చేశారు. పారిశ్రామిక దిగ్గజమైన రతన్ టాటా వ్యాపారంలోనే కాదు, దాతృత్వంలో కూడా గొప్ప వ్యక్తిగా నిలిచారని ప్రశంసించారు. టాటా సహకారం ఆస్ట్రేలియాలో గణనీయమైన ప్రభావాన్ని తీసుకొచ్చిం దన్నారు. ఆస్ట్రేలియా-భారత్ బంధానికి టాటా సుదీర్ఘ నిబద్ధతకు గుర్తింపుగా ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా గౌరవాన్ని ప్రదానం చేయడం ఆనందంగా ఉందని ట్వీట్ చేశారు. టాటా వపర్ సదరన్ ఒడిశా డిస్టట్రీబ్యూషన్ ఎగ్జిక్యూటివ్ రాహుల్ రంజన్ కూడా లింక్డ్ఇన్ పోస్ట్లో సత్కార వేడుక ఫోటోలను చేశారు. బిజినెస్లోనూ, ఫిలాంత్రఫీలోనే టాటా చేసిన సేవలు భారత దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా పాపులర్ అయ్యాయన్నారు. అనేక విజయవంతమైన వెంచర్ల వెనుక చోదక శక్తిగా రతన్ టాటా ఉన్నారు. ఆయన లీడర్ షిప్, విజన్ ఎంతోమందికి తమ కలల సాకారంలో గొప్ప స్ఫూర్తినిచ్చిందని పేర్కొన్నారు Ratan Tata is a titan of biz, industry & philanthropy not just in 🇮🇳, but his contributions have also made a significant impact in 🇦🇺. Delighted to confer Order of Australia (AO) honour to @RNTata2000 in recognition of his longstanding commitment to the 🇦🇺🇮🇳relationship. @ausgov pic.twitter.com/N7e05sWzpV — Barry O’Farrell AO (@AusHCIndia) April 22, 2023 -
Pull-ups: 24 గంటల్లో 8,008 పుల్ అప్స్.. గిన్నిస్ రికార్డు బద్దలు..
కాన్బెర్రా: వ్యాయామం చేసే వారు తమ బాడీ ఫిట్గా ఉండేందుకు కచ్చితంగా పుల్ అప్స్ చేస్తారు. వీటి వల్ల వీపు, ఛాతీ, భుజాల ఖండరాలు ఉత్తేజితమవుతాయి. అయితే ఇవి చేయడం కాస్త కఠినమే. రోజుకు 1,000 పుల్ అప్స్ చేయడమంటే గగనమే. అయితే ఆస్ట్రేలియా సిడ్నీకి చెందిన ఓ ఫిట్నెస్ ఔత్సాహికుడు మాత్రం పుల్ అప్స్లో గిన్నిస్ రికార్డును బద్దలుకొట్టి సరికొత్త చరిత్ర సృష్టించాడు. 24 గంటల్లో 8,008 పుల్ అప్స్ చేసి కొత్త రికార్డు నెలకొల్పాడు. గత రికార్డు 7,715 పుల్ అప్స్ను చెరిపేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను జాక్సన్ ఇటాలియోనో తన ఇన్స్టాగ్రాంలో షేర్ చేశాడు. ఈ రికార్డు కోసం తాను 8 నెలలపాటు శిక్షణ తీసుకున్నట్లు వివరించాడు. ఎట్టకేలకు తన శ్రమకు ఫలితం దక్కిందని ఆనందం వ్యక్తం చేశాడు. గిన్నిస్ రికార్డు నెలకొల్పడం సంతోషంగా ఉందన్నాడు. View this post on Instagram A post shared by Jaxon Italiano (@jaxon_italiano) గతంలో మరొకరి పేరుపై ఉన్న 12 గంటల్లో 5,900 పుల్ అప్స్ రికార్డును కూడా జాక్సన్ అధిగమించాడు. కాగా.. మొత్తం 24 గంటల్లో చివరి 3.5 గంటలను జాక్సన్ వినియోగించుకోలేదు. తీవ్రంగా అలసిపోవడంతో ఈ సమయంలో ఒక్క పుల్ అప్ కూడా చేయలేదు. అయినా గిన్నిస్ రికార్డును బద్దలుకొట్టి సత్తా చాటాడు. జాక్సన్ పుల్ అప్స్ రికార్డుతో పాటు ఈ ఒక్క రోజే చారిటీ కోసం రూ.5లక్షల విరాళాలు కూడా సేకరించడం గమనార్హం. చదవండి: షాకింగ్.. ఇంట్లో 1,000 కుక్కలు మృతి.. ఆకలితో కడుపు మాడ్చి! -
చిన్నారులపై అత్యాచారం కేసులో ఒక వ్యక్తికి 129 ఏళ్లు జైలు శిక్ష
చిన్నారులపై అత్యాచారం, లైంగిక వేధింపులకు పాల్పుడుతున్న ఒక వ్యక్తికి 129 ఏళ్లు జైలు శిక్ష విధించింది కోర్టు. ఈ ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. బాలికలపై అత్యాచారం, మానవ అక్రమ రవాణా కేసుల్లో ఇప్పటికే జీవిత ఖైతు అనుభవిస్తున్న పీటర్ గెరార్డ్ స్కల్లీ అనే ఆస్ట్రేలియా వ్యక్తికి ఇది రెండో నేరం. అతను 18 నెలలు వయసు ఉన్న చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడటంతో స్కల్లీకి ఈ శిక్ష విధించినట్లు న్యాయమూర్తి తెలిపారు. ఈ తీర్పు ఇలాంటి ఘోరమైన నేరాలకు పాల్పడేవారికి, మానవ అక్రమ రవాణాదారులకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుందన్నారు. ప్రస్తుతం ఫిలిప్పీన్స్ చిన్నారులపై లైంగిక వేదింపులకు అడ్డగా మారిందన్నారు. దేశంలోని పేదరికం, ఆగ్లంలో మంచి పట్టు, హైస్పీడ్ ఇంటర్నెట్ వెసులుబాటు తదితరాలు ఈ దారుణమైన ఘటనలకు కారణమని నిపుణులు హెచ్చరిస్తున్నారన్నారు. నిందితుడు స్కల్లీ చిన్నారులపై అత్యాచారాలు, మానవ అక్రమ రవాణాతో సహా సుమారు 60 నేరాలకు పాల్పడినట్లు తెలిపారు. ఈ మేరకు ఆస్ట్రేలియా కగాయన్ డి ఓరో కోర్టు నిందితుడు స్కల్లీ అతని ముగ్గురు సహచరులకు 129 ఏళ్ల జైలు శిక్ష విధించగా అతడి స్నేహితురాలికి 126 ఏళ్లు జైలు శిక్ష విధించింది. (చదవండి: ఇదే నా చివరి మెసేజ్ కావొచ్చు’.. బందీగా మారిన భారత నావికుడు) -
వింత ఘటన: బతికి ఉండగానే మార్చురీకి... కంగుతిన్న వైద్యులు
ఒక వ్యక్తిని బతికి ఉండగానే మార్చురీకి పంపించింది ఓ ఆస్పత్రి. చనిపోయింది ఒకరోజు అయితే మరో రోజు చనిపోయినట్లు మరణ ధృవీకరణ పత్రాన్ని ఇచ్చింది. దీంతో ఆస్సత్రి వర్గాలు కోర్టు చుట్టూ తిరుగుతున్నాయి. ఈ ఘటన యూకేలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే....55 ఏళ్ల ఆస్ట్రేలియన్ వ్యక్తి రీడ్ని యూకేలో పెర్త్లోని రాకింగ్హామ్ ఆస్పత్రి చనిపోయాడని నిర్ధారించి మార్చురీకి తరలించింది. ఐతే సదరు వ్యక్తి మృతదేహాన్ని తరలించడానికి ముందు కుటుంబ సభ్యులుకు సమాచారం కూడా అందించింది. ఐతే ధృవీకరణ పత్రం వెంటనే జారీ చేయలేదు. వాస్తవానికి రీడ్ అనే వ్యక్తిని మార్చురుకి సజీవంగా ఉండగానే తరలించారు. ఈ విషయం మార్చురీలో వైద్యులు శవపరీక్ష జరుపుతుండగా బయటపడింది. ఈ మేరకు వైద్యుడు పోస్ట్మార్టం నిర్వహించేందుకు సిద్ధమవుతుండగా ఆ మృతదేహాన్ని చూసి అనుమానం వచ్చింది. ఎందుకంటే ఆ మృతదేహం ఉన్న స్థితి చాలా సేపటి క్రితం చనిపోయిన వ్యక్తిలా లేదు కొద్ది నిమిషాల ముందు చనిపోయినట్లు అనిపించింది. పైగా సదరు వ్యక్తి మృతదేహాన్ని ప్యాక్ చేసిన కవర్ విప్పి ఉందని, కవర్పై రక్తం పడి ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోయినట్లు తెలిపాడు వైద్యుడు. బహుశా ఆ వ్యక్తి బతికే ఉండవచ్చని ఆ కవర్ నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించి ఉండవచ్చని అన్నారు. అందువల్లే కవర్ని ఓపెన్ చేసి ఉందని దానిపై రక్తపు మరకలు ఉన్నాయని అన్నారు. పైగా ఆ రక్తం బతికి ఉన్న వ్యక్తి శరీరంలోని రక్తం మాదిరిగా ఉందని అన్నారు. తాము పోస్ట్మార్టం చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి చనిపోయి చాలాసేపు కాలేదని, కొద్ది నిమిషాల వ్యవధిలోనే మరణించినట్లు వైద్యులు పోస్ట్మార్టం నివేదికలో తెలిపారు. అదీగాక అతను సెప్టెంబర్ 5న చనిపోతే...6న చనిపోయినట్లు మరణ ధృవీకరణ పత్రాన్ని ఇచ్చింది రాకింగ్హామ్ ఆస్పత్రి. దీంతో ఈ ఘటనపై యూకే కరోనరీ కోర్టు దర్యాప్తు ప్రారంభించింది. మరోవైపు ఆస్పత్రి వర్గాలు ఈ ఘటనను కప్పి పుచ్చుకునేందుకు యత్నించాయి కూడా. అంతేగాదు మరణధృవీకరణ పత్రాన్ని వెనక్కి తీసుకుంటామని ఆస్పత్రి వర్గాలు కోర్టుని అభ్యర్థించాయి కూడా. దీంతో కరోనరి కోర్టు సదరు వ్యక్తి మరణం అసహజంగా ఉందని పోస్ట్మార్టం నివేదిక ఆస్పత్రి వర్గాలు చెబుతున్న దానికి భిన్నంగా ఉందంటూ దర్యాప్తు ప్రారంభించటమే కాకుండా బాధ్యులపై కఠిన చర్యుల తీసుకుంటామని స్పష్టం చేసింది. (చదవండి: విధ్వంసం.. క్రిమియా-రష్యాను కలిపే వంతెనపై భారీ పేలుడు) -
ఉద్యోగులకు బంపర్ ఆఫర్: ఖాళీలున్నాయా బాస్ అంటున్న నెటిజన్లు
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా కంపెనీ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇవ్వడం వైరల్గా మారింది. సిడ్నీకి చెందిన మార్కెటింగ్ సంస్థ సూప్ ఏజెన్సీ ఇంటర్నెట్లో సంచలనంగా మారింది. మొత్తం ఉద్యోగులందరినీ చాలా ఖరీదైన ట్రిప్కు తీసుకెళ్లింది. అందులోనూ ఉద్యోగులలో ఒకరి 24వ పుట్టినరోజును కూడా ఘనంగా నిర్వహించింది. దీంతో కంపెనీ ఎండీ కాట్యా వకులెంకో, "వరల్డ్స్ బెస్ట్ బాస్" అంటూ నెటిజన్లు తెగ పొగిడేస్తున్నారు. అంతేకాదు ఈ రోజు సూప్ ఏజెన్సీ మూడో పుట్టినరోజును జరుపుకుంటోంది. తొందర్లోనే మరో యూరప్కు ట్రిప్ను ప్లాన్ చేస్తోందట కంపెనీ. View this post on Instagram A post shared by Soup Agency (@soup_agency) ఈ సంవత్సరం మేలో జరిగిన ఈ ట్రిప్పై నెటిజన్లులు కామెంట్ల వర్షం కురిపించారు. "లక్కీ ఉద్యోగులు...మనకు అదంతా కలే " అని ఒక యూజర్ వాపోయాడు. నాకు అలాంటి అద్భుతమైన ఏజెన్సీ, యజమానిని దొరికితేనా.. నా నా సామి రంగ అన్నట్టుగా మరొకరు కమెంట్ చేశారు. అంతేకాదు ఏమైనా వేకెన్సీలున్నాయా బాస్ అంటూ మరో యూజర్ కమెంట్ చేయడం విశేషంగా నిలిచింది. ఇండొనేసియాలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం బాలికి తన ఉద్యోగులందర్నీ హాలీడే ట్రిప్నకు పంపించింది ఆస్ట్రేలియాలోని సిడ్నీకి చెందిన సూప్ ఏజెన్సీ ఒకటి రెండు రోజులు కాదు ఏకంగా 2 వారాల పెయిడ్ లీవ్ ఇచ్చింది. అంతేకాదు విలాసవంతమైన హాలీడే ట్రిప్నకు అయ్యే ఖర్చులన్నీ తానే భరించింది. దీంతో ఉద్యోగులందరూ ఎగిరి గంతేసి మరీ పండగ చేసుకున్నారు. ఫ్యామిలీలతో బాలికి చెక్కేశారు. జాగింగ్లు, డ్రింక్స్తో అంటూ తెగ ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను జూన్ 9న కంపెనీ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. బాలిలో ఉద్యోగులు ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కాగా కంపెనీ వెబ్సైట్ ప్రకారం, సూప్ ఏజెన్సీ సిడ్నీలో ఇండిపెండెంట్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ, ఇన్వెంటివ్, డేటా ఆధారిత ప్రచారాలకు అత్యుత్తమ ఫలితాలను సాధించిన కంపెనీగా పాపులర్ అయింది. కోవిడ్-19 సంక్షోభం సమయంలో ఉత్పాదకత ఎక్కువగానే ఉందని డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ కుమి హో తెలిపారు. ఇది ఖచ్చితంగా జీవితంలో మరచిపోలేని అనుభవం అంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. View this post on Instagram A post shared by Soup Agency (@soup_agency) -
22 ఏళ్ల యూట్యూబ్ స్టార్ మృతి.. తండ్రి భావోద్వేగపు పోస్ట్
Australian Rapper YouTube Star Lil Bo Weep Dies At 22: ప్రముఖ ఆస్ట్రేలియిన్ ర్యాపర్, యూట్యూబ్ స్టార్ లిల్ బో వీప్ అకాల మరణం చెందింది. 22 ఏళ్ల ఈ గాయని మార్చి 3న తుది శ్వాస విడిచింది. ఈ విషయాన్ని ఆమె తండ్రి మాథ్క్యూ స్కోఫీల్డ్ సోషల్ మీడియా వేదికైన ఫేస్బుక్లో తెలిపారు. ఈ పోస్ట్లో 'డిప్రెషన్, బాధ, పీటీఎస్డీ, డ్రగ్స్కు వ్యతిరేకంగా మా కుమార్తె కోసం ఈ వారమంతా పోరాడుతూనే ఉన్నాం. ఆమెను అమెరికా నుంచి ఇక్కడికీ తీసుకువచ్చినప్పటినుంచి మేము పోరాడుతూనే ఉన్నాం. మేము పక్కనే ఉన్నప్పుడు ఆమె తన రాక్షసులతో తీవ్రంగా పోరాడింది. కానీ మేము ఆమెను కోల్పోయాం. మేము కూడా ఓడిపోయాం' అంటూ రాసుకొచ్చారు. అయితే ఆమె మృతికి గల సరైన కారణాలను ఇంకా వెల్లడించలేదు. గాయని లిల్ బో వీప్ మృతిపట్ల ఆమె అభిమానులు విచారం వ్యక్తం చేశారు. 'ఐ లవ్ యూ. ఐయామ్ సారీ బేబీ గర్ల్. మరో జీవితం', 'రెస్ట్ ఇన్ పీస్ వినోనా, నా కష్టతరమైన సమయంలో మీ సంగీతం నాకు సాంత్వన కలిగించింది.' అంటూ కామెంట్స్ పెట్టారు. లిల్ అభిమానుల ప్రేమను చూసి ఆమె తండ్రి మళ్లీ 'ఆమె తండ్రిగా నేను చాలా గర్వపడుతున్నాను. తను నా హీరో, నా కూతురు, నా బెస్ట్ ఫ్రెండ్. తనను ఎంతగా ప్రేమిస్తున్నానో చెప్పలేను. ఆమె మళ్లీ తిరిగి వస్తుంది.' అంటూ రాసుకొచ్చారు. లిల్ బో వీప్ అసలు పేరు 'వినోనా బ్రూక్స్'. 2015సో సౌండ్క్లౌడ్లో తన సంగీతం కెరీర్ను ప్రారంభించింది. తర్వాత అనేక మంది ఫాలోవర్స్ను సంపాదించుకుంది. 'పీటీఎస్డీ' పేరుతో ఒక నిమిషంన్నర నిడివి గల పాటను ఆమె చివరిగా పోస్ట్ చేసింది. -
ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్స్లామ్ విజేత యాష్లే బార్టీ
-
అభ్యర్థుల్లో ‘కంగారు’ పుట్టించారు
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు వ్యక్తులు ఆస్ట్రేలియాలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కౌన్సిలర్లుగా గెలిచి సత్తా చాటారు. సిడ్నీలోని కొన్ని మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగ్గా తెలంగాణకు చెందిన సంధ్యారెడ్డి అలియాస్ సాండీ రెడ్డి.. వెస్ట్ సిడ్నీలోని స్ట్రాత్ ఫీల్డ్ మున్సిపల్ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలవగా, రాష్ట్రానికి చెందిన మరో వ్యక్తి చెట్టిపల్లి లివింగ్స్టన్.. బ్లాక్ టౌన్ వార్డ్ 5 నుంచి విజయం సాధించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పిల్లలమర్రి శ్రీనివాస్ అలియాస్ శ్రీనీ.. హాన్స్ బీ వార్డు నుంచి కౌన్సిలర్గా ఎన్నికయ్యారు. లివింగ్స్టన్, శ్రీనివాస్ ఇద్దరూ లిబరల్ పార్టీ నుంచి గెలవగా సంధ్యారెడ్డి ఇండిపెండెంట్గా విజయం సాధించా రు. ఈ మేరకు బుధవారం ఫలితాలు వెల్లడించారు. కొండా ఫ్యామిలీ నుంచి.. కొండా రంగారెడ్డి సోదరుడు కొండా నారాయణరెడ్డి మనవరాలు సంధ్యారెడ్డి. ఈమె మేనమామ కొండా లక్ష్మణ్ రెడ్డి 1983లో చేవెళ్ల నుంచి అసెంబ్లీకి కాంగ్రెస్ తరఫున ఎన్నికయ్యారు. చిన్ననాటి నుంచి ఖైరతాబాద్లో పెరిగిన సంధ్యారెడ్డి.. 16 ఏళ్ల క్రితం నగరానికి చెందిన కర్రి బుచ్చిరెడ్డిని వివాహం చేసుకున్నారు. 30 ఏళ్ల క్రితమే ఆస్ట్రేలియా వెళ్లిన బుచ్చిరెడ్డి కంప్యూటర్ ఇంజనీర్గా పనిచేస్తూ సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. సంధ్యారెడ్డి కూడా స్ట్రాత్ ఫీల్డ్లో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలతో పాటు క్లీన్ అప్ ఆస్ట్రేలియా నినాదంతో కార్యక్రమాలు చేశారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు నీల్ రెడ్డి, నిఖిల్ రెడ్డి. ఇద్దరూ ప్రస్తుతం హైస్కూల్ విద్యాభ్యాసంలో ఉండగా చిన్న కుమారుడు నిఖిల్రెడ్డి నేషనల్ జూనియర్ చెస్ ఛాంపియన్గా నిలిచాడు. డిప్యూటీ మేయర్ రేసులో సంధ్యారెడ్డి స్ట్రాత్ ఫీల్డ్ మున్సిపల్ డిప్యూటీ మేయర్ రేసులో సంధ్యారెడ్డి ఉన్నట్టు తెలిసింది. ఈ స్థానిక సంస్థలో ఏడుగురు కౌన్సిలర్లు ఉన్నారు. ఇందులో సంధ్యారెడ్డితో పాటు మరో ముగ్గురు ఇండిపెండెంట్గా గెలవగా మిగిలిన వాళ్లు స్థానిక పార్టీల నుంచి ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ మేయర్గా సంధ్యారెడ్డికి అవకాశం వస్తుందని సిడ్నీలోని భారతీయులు భావిస్తున్నారు. -
ఏ భర్తకు ఇటువంటి కష్టం రాకూడదు!
Australian Man Banned From Leaving Israel: ఇటీవల కాలంలో రకరకాల విడాకులు చట్టాలు గురించి విన్నాం. అయితే వాటిలో భార్యకు విడాకులు ఇవ్వాలంటే అత్యంత పెద్ద మొత్తంలో భరణం ఇవ్వడం వంటివి చూశాం. కానీ ఇక్కడ ఒక దేశంలో భరణం పూర్తిగా చెల్లించేంత వరకు దేశం విడిచి పెట్ట వెళ్లకుండా నిషేధించారు. (చదవండి: ప్రపంచపు తొలి డ్యూయల్ మోడ్ వాహనం) అయితే అసలు విషయంలోకెళ్లితే....ఆస్ట్రేలియన్కి చెందిన 44 ఏళ్ల నోమ్ హుప్పెర్ట్ 2012లో తన పిల్లల కోసం అని తన భార్య కోసం ఇజ్రాయెల్ దేశానికి వెళ్లాడు. అయితే అతని భార్య ఇజ్రాయెల్ కోర్టులో విడాకుల కేసు వేసింది. దీంతో కోర్టు 2013లో హుప్పెర్ట్కి వ్యతిరేకంగా "స్టే-ఆఫ్-ఎగ్జిట్"(దేశాన్ని విడిచి వెళ్లకూడదు) ఆర్డర్ని జారీ చేసింది. అంతే కాదు పిలల్లకు 18 ఏళ్లు వచ్చే వరకు ప్రతి నెల రూ లక్ష భరణం చెల్లించాల్సి ఉంటుంది. ఈ కారణంగా అతను దేశాన్ని విడిచిపెట్టడానికి వీలు లేకుండా ఆదేశాలు జారీ చేసింది. అంటే హుప్పెర్ట్ పిల్లల భవిష్యత్తు ఖర్చుల నిమిత్తం సుమారు రూ 18 కోట్లు చెల్లించాలి. ఈ మొత్తం చెల్లించేంత వరకు హుప్పెర్ట్ డిసెంబర్ 31, 9999వ సంవత్సవరం వరకు దేశాన్ని విడిచిపెట్టి వెళ్లకుండా ఇజ్రాయెల్ కోర్టు నిషేధించింది. పైగా సెలవు కారణంగానో లేక పని మీదనో కూడా వెళ్లడానికి వీల్లేదు. అంతేకాదు ఒకసారి ఇజ్రాయెల్ కోర్టు నుంచి ఇలాంటి ఆదేశాలు(నో ఎగ్జిట్ ఆర్డర్) వచ్చిన వాళ్లు కనీసం 21 రోజులు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. అయితే ఫార్మాస్యూటికల్ కంపెనీకి సంబంధించిన రసాయన శాస్త్రవేత్త అయిన హుప్పెర్ట్ దీనిపై ఆవేదన వ్యక్తం చేశాడు.. ఇజ్రాయెల్ వివాహ చట్టాలు చాలా కఠినమైనవని పైగా పురుషుల ఆర్థిక పరిస్థితి పై కోర్టు ఎటువంటి విచారణ జరపకుండా పురుషుల ఆదాయంలో 100 శాతం చెల్లించాల్సిందేనని ఆదేశిస్తుందని అని తన గోడు బ్రిటీష్ మీడియాకి వెల్లబోసుకున్నాడు.. (చదవండి: ప్రధాని మోదీ విరాళం ఎంతో తెలుసా!!) -
‘యూ బ్లడీ ఫూల్’ అంటూ బాతు నోట తిట్టు!
మానవేతర జాతుల్లో కొన్ని జాతులు.. శబ్దాలను అనుకరిస్తాయనడానికి చాలా ఆధారాలు ఉన్నాయి. ఏనుగులు, గబ్బిలాలు, చిలుకలు, హమ్మింగ్బర్డ్స్తో పాటు.. నీటిలోని జీవించే తిమింగలాలు, డాల్ఫిన్లు సహా.. ఇలా కొన్ని పక్షులు, జంతువులు.. నిర్దిష్ట శబ్దాలను ఇట్టే నేర్చుకోగలవని ఇప్పటికే పలుమార్లు రుజువైంది. అయితే ఆ జాబితాలో ఆస్ట్రేలియాకు చెందిన ‘రిప్పర్ డక్’ (కస్తూరి బాతు).. అచ్చం మనిషి మాదిరి మాట్లాడటమే కాదు.. మనిషి మాదిరి తిట్టగలదని నిరూపితమైంది. అందుకు 34 ఏళ్ల కిందట రికార్డ్ అయిన ఓ ఆడియో సాక్ష్యంగా నిలిచింది. చదవండి: ఇలా మనుషుల్ని అమ్మగలరా? లేదు కదా..? డాక్టర్ పీటర్ ఫుల్లగర్ అనే పరిశోదకుడు.. 1987లో కాన్బెర్రా సమీపంలోని టిడ్బిన్ బిల్లా నేచర్ రిజర్వ్లో కస్తూరి బాతు మాట్లాడుతుండగా ఆ వాయిస్ను రికార్డ్ చేశారు. దానిలో రిప్పర్ ‘యూ బ్లడీ ఫూల్’ అని అచ్చం మనిషి తిట్టినట్లే తిట్టింది. నాడు ఆయన చేసిన రికార్డింగులను ఇటీవల నెదర్లాండ్స్లోని లైడెన్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ కారెల్ టెన్ కేట్ తిరిగి వెలుగులోకి తెచ్చారు. పక్షులలో స్వర అభ్యాసంపై ప్రొఫెసర్ టెన్ కేట్ అధ్యయనం చేస్తున్నారు. తలుపు కొట్టుకుంటుండగా వచ్చే శబ్దాన్ని కూడా ఈ బాతు అనుకరించగలదని సరికొత్త అంశాన్ని గుర్తించారు. -
‘స్టిక్’ సీన్ మారింది...
సాక్షి క్రీడా విభాగం: ఎన్నో ఏళ్లుగా చెప్పుకోదగ్గ విజయాలు లేని బాధ, ఆటతీరుపై జోక్లు... అధికారుల చేతకానితనం, జట్టులో అంతర్గత రాజకీయాలు... ప్రతిభకు పాతర, ఆటగాళ్లంటే చులకనభావం... ఇంటా, బయటా భారత హాకీపై లెక్కలేనన్ని విమర్శలు వచ్చాయి. ఇలాంటి స్థితిలో రెండేళ్ల క్రితం చీఫ్ కోచ్గా వచ్చిన ఆస్ట్రేలియన్ గ్రాహం రీడ్ ‘భారత జట్టు ఉండాల్సింది ఈ స్థానంలో కాదు. దీన్ని నేను ఎక్కడికో తీసుకెళతాను’ అని తొలి మాటగా అన్నాడు. కొత్తగా రాగానే అందరూ చెప్పే మాటలే ఇవి అని ఎవరూ నమ్మలేదు. పైగా అంతర్గత రాజకీయాలతోపాటు కొత్తగా వచ్చే మార్పులను అంత సులభంగా అంగీకరించలేని తత్వం ఉన్న ఆటగాళ్ల జట్టుతో అతను సాధిస్తాడా అని అంతా తేలిగ్గా తీసుకున్నారు. కానీ రీడ్ ఎక్కడా తగ్గలేదు. కంప్యూటర్ సైన్స్ చదివి ఐటీ రంగంలో సుదీర్ఘ కాలం పని చేయడంతో పాటు ఆస్ట్రేలియాలోని ప్రముఖ సంస్థల్లో పెద్ద హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించిన అనుభవం ఉన్న రీడ్ హాకీలోనూ తనదైన కొత్త శైలితో ఆటగాళ్లను దారిలో పెట్టాడు. రీడ్ వచ్చే నాటికి జట్టులో అందరూ వ్యక్తిగతంగా పెద్ద ప్లేయర్లే. కానీ తుది ఫలితం వరకు వచ్చేసరికి మాత్రం అంతా అంతంతమాత్రమే. ముందుగా టీమ్ను ఒక్క చోటికి చేర్చడంలో అతను సఫలమయ్యాడు. పేరుకు శ్రీజేశ్, మన్ప్రీత్, మన్దీప్, బీరేంద్ర లక్డాలాంటి సీనియర్లు ఉన్నా వారెప్పుడూ జట్టుకంటే ఎక్కువ కాదనే భావనను రీడ్ కల్పించాడు. కోచింగ్ క్యాంప్లో రీడ్ భార్య స్వచ్ఛందంగా ఆటగాళ్లకు ‘పర్సనాలిటీ డెవలప్మెంట్’ క్లాస్లు తీసుకొని వారిలో ఆత్మవిశ్వాసం పెంచే ప్రయత్నం చేసిందంటే రీడ్ ఎంతగా తన మిషన్లో మునిగాడో అర్థమవుతుంది. టోక్యో ఒలింపిక్స్లో ఎంపికైన వారిలో 12 మందికి ఇదే తొలి ఒలింపిక్స్. ఇలాంటి టీమ్ను ఎంచుకోవడంలో కూడా కోచ్ సాహసం కనిపిస్తుంది. ఆటగాళ్లు, అధికారులతో ఏ విషయంలోనైనా మొహమాటం లేకుండా నిక్కచ్చిగా నిజం మాట్లాడే రీడ్ తత్వం అందరికీ మేలు చేసింది. ఫిట్నెస్ సూపర్... సుదీర్ఘ కాలంగా భారత హాకీ వైఫల్యాల్లో ఫిట్నెస్లేమి కూడా కీలకపాత్ర పోషించింది. ఆటపరంగా ఎంతో బాగున్నా, ఆస్ట్రోటర్ఫ్పై కొద్దిసేపు ఆడగానే అలసటకు గురై మనోళ్లు ఇబ్బంది పడుతూ కొనసాగడం గతంలో చాలాసార్లు జరిగింది. దీనిని ఎలాగైనా మార్చాలని రీడ్ సంకల్పించాడు. స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్లతో పాటు సైంటిఫిక్ అడ్వైజర్ రాబిన్ అర్కెల్ సహకారం తీసుకొని ఆటగాళ్లను ఫిట్గా తయారు చేశాడు. యూరోపియన్ జట్లతో పోటీ పడినప్పుడు గతంలో ఎదురైన సమస్యలేవీ లేకుండా మనోళ్లు వారితో సమానంగా మైదానంలో చురుగ్గా కనిపించడం ఆటగాళ్లలో వచ్చిన కీలకమార్పు. తీవ్రమైన వేడి ఉన్న ఒసి స్టేడియంలో 13 రోజుల వ్యవధిలో 8 మ్యాచ్లు ఆడగలగడం వారి ఫిట్నెస్ను చూపించింది. రీడ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మనోళ్లు పెనాల్టీ కార్నర్లను గోల్స్గా మలచడం బాగా మెరుగైంది. టోక్యోలో భారత్ 8 మ్యాచ్లలో 25 గోల్స్ చేసింది. ఇక సబ్స్టిట్యూట్లను సమర్థంగా వాడుకోవడం రీడ్ వ్యూహాల్లో బాగా పని చేసింది. సెమీస్లో సిమ్రన్జిత్కు విశ్రాంతినివ్వగా, కాంస్య పోరులో అతను కొత్త ఉత్సాహంతో వచ్చి రెండు గోల్స్ చేశాడు. అమిత్ రోహిదాస్ ‘ఫస్ట్ రషర్’ రూపంలో శ్రీజేశ్కంటే ముందే పెనాల్టీలను ఆపడానికి ముందుకు దూసుకురావడం మనం గతంలో చూడని మార్పు. భారత ఆటగాళ్లు తమను, తమ కోచ్ను, తమ సహచరులను, తమ శిక్షణను నమ్మారు కాబట్టే ఈ ఫలితం వచ్చింది. నాలుగు దశాబ్దాలుగా బరిలోకి దిగిన ప్రతీ భారత జట్టు మట్టిపై ఆడిన తమ ముందు తరంవారి విజయాల భారం మోస్తూ కుప్పకూలిపోయేది. ఈ జట్టు మాత్రం అలా కాలేదు. హాకీ మున్ముందు మరింత వెలిగేందుకు తమ వైపునుంచి తొలి అడుగు వేసింది. -
బంగారు పతకం గెలిచిన ఆనందంలో ఆమె ఏం అనేసిందో వినండి..!
టోక్యో: పట్టరాని ఆనందంలో ఉన్నప్పుడు ఏదేదో వాగేస్తుంటాం. కాసేపయ్యాక విషయం తెలిసి నాలుక్కరుచుకుంటుంటాం. మనిషి నైజమే ఇది. ఇలాంటి ఘటనే టోక్యో ఒలింపిక్స్లో మంగళవారం చోటుచేసుకుంది. 100 మీటర్ల బ్యాక్స్ట్రోక్ స్విమ్మింగ్ పోటీల్లో స్వర్ణ పతకం నెగ్గిన ఆస్ట్రేలియన్ స్విమ్మర్ కేలీ మెక్కీన్.. పతకం నెగ్గిన ఆనందంలో నోరు జారింది. మెడల్ గెలిచాక ఓ మీడియా ప్రతినిధి.. గోల్డ్ మెడల్ గెలుచుకోవడం పట్ల ఎలా ఫీల్ అవుతున్నారని ప్రశ్నించగా, అప్పటికే ఆనంద డోలికల్లో తేలియాడుతున్న కేలీ పొరపాటున వాడకూడని ఓ బూతు మాటను(F**K) అనేసింది. Starting a “best daily moments of the Olympics” thread with this Hall of Fame entry from Kaylee McKeown after winning gold: pic.twitter.com/6NVuOnUfss — Josh Butler (@JoshButler) July 27, 2021 అయితే తాను తప్పుగా మాట్లాడానని గుర్తించి వెంటనే టాపిక్ను డైవర్ట్ చేసి, చాలా సంతోషంగా ఉందంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెడల్ నెగ్గినందుకు కేలీకి కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు.. పట్టలేని సంతోషంలో ఉన్నప్పుడు ఇలాంటి పదాలు మాట్లాడటం సహజమేనని ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. భావోద్వేగాలకు ఎవరూ అతీతులు కాదనడానికి ఈ వీడియో ప్రత్యక్ష సాక్ష్యమని మరికొందరు నెటిజన్లు అంటున్నారు. అయితే కేలీ ఇలా లైవ్లో బూతు పదం వాడటంపై ఆమె తల్లి స్పందిస్తూ.. తనతో మాట్లాడతానని చెప్పడం విశేషం. కాగా, కేలీ.. 100 బ్యాక్స్ట్రోక్ను కేవలం 57.47 సెకన్లలో పూర్తి చేసి గోల్డ్ మెడల్ను సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే 20 ఏళ్ల కేలీ మెక్కీన్కు ఒలంపిక్స్లో మెడల్ సాధించడం ఇదే తొలిసారేమి కాదు. ఇప్పటి వరకు ఆమె ఏకంగా 4 మెడల్స్ గెలుచుకొని రికార్డు సృష్టించింది. -
కరోనా: పాట్ కమిన్స్ ఔదార్యం, ఐపీఎల్పై కీలక సూచన
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా ఉగ్రరూపంతో అల్లాడిపోతున్న భారత్ను ఆదుకునేందుకు ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్ ముందుకు వచ్చారు. తనవంతు సాయంగా 50 వేల డాలర్లను పీఎం కేర్స్ఫండ్కు సాయాన్ని ప్రకటించారు. అంతేకాదు మిగతా ఐపీఎల్ సభ్యులు కూడా స్పందించాలని కోరారు. కరోనా విజృంభణతో ఆక్సిజన్ నిల్వల తీవ్ర కొరత నేపథ్యంలో పాట్ ఈ నిర్ణయం తీసుకున్నారు. తనది చిరుసాయమే అయినా బాధితులకు ఎంతోకొంత ఉపయోపడితే చాలన్నారు. ప్రత్యేకంగా ఆక్సిజన్ సామాగ్రిని కొనుగోలు చేసేందుకు తన విరాళాన్ని ఉపయోగించాలని ఆయన కోరారు. అలాగే దేశంలో కరోనా కేసుల తీవ్రంగా వ్యాపిస్తున్న తరుణంలో ఐపీల్ కొనసాగించడం సరియైనదా కాదా అనే చర్చ జరుగుతోంది. కానీ లాక్డౌన్లో కాలక్షేపం చేస్తున్న ప్రజలకు ఐపీల్ మ్యాచ్లు కాస్త సంతోషానిస్తాయన్నారు. రికార్డు కేసులతో బెంబేలెత్తుతున్న వారికి క్రికెట్ ఊరటనిస్తుందనే విషయాన్ని భారత ప్రభుత్వానికి తను సూచించదల్చుకున్నానని తెలిపాడు. ఈ మేరకు కమిన్స్ ఒక ప్రకటన విడుదల చేశాడు. కాగా, 2021 ఐపీఎల్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్లో పాట్ కమిన్స్ సంచలన ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. సిక్సర్లతో ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. కేవలం 34 బంతుల్లోనే కమిన్స్ 66 పరుగులు చేసి కొత్త చరిత్రను రాశాడు. ఇలా ఐపీఎల్లో ఒకే ఓవర్లో 30, అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన వారిలో కమిన్స్ ఆరోవాడుగా నిలిచిన సంగతి తెలిసిందే. చదవండి: కోవిడ్ సంక్షోభం: సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల సాయం -
యుద్ధ వాతావరణం.. నౌకా విన్యాసం!
సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో జరుగుతున్న 24వ మలబార్ విన్యాసాలు బుధవారం రెండో రోజుకు చేరుకున్నాయి. భారత యుద్ధ నౌకలు మరోసారి తమ సత్తా చాటాయి. అండమాన్ సముద్ర జలాల్లో నిర్వహించిన విన్యాసాల్లో భారత నౌకాదళంతో పాటు యునైటెడ్ స్టేట్స్ నేవీ (యూఎస్ఎన్), జపాన్ మేరిటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ (జెఎంఎస్డీఎఫ్)తో పాటు తొలిసారిగా రాయల్ ఆస్ట్రేలియన్ నేవీ (ఆర్ఏఎన్)కి చెందిన నౌకలు చేసిన విన్యాసాలు యుద్ధ వాతావరణాన్ని తలపించింది. ముఖ్యంగా భారత్కు చెందిన ఐఎన్ఎస్ రణ్విజయ్, ఐఎన్ఎస్ శివాలిక్, ఐఎన్ఎస్ శక్తి, ఐఎన్ఎస్ సుకన్యతో పాటు సింధురాజ్ సబ్మెరైన్లు సముద్ర జలాల్లో కలియ తిరుగుతూ అద్భుత ప్రదర్శన కనబర్చాయి. -
చైనాకు 'చెక్' లక్ష్యంగా..
సాక్షి, విశాఖపట్నం: ఇండో–పసిఫిక్ రీజియన్పై పట్టు సాధిస్తూ.. శత్రు దేశం చైనా కుటిల యత్నాలకు, దాని దూకుడుకు చెక్ చెప్పేందుకు భారత్ వేస్తున్న ప్రతి అడుగూ విజయం దిశగా సాగుతోంది. రెండున్నర దశాబ్దాలుగా భారత్, యూఎస్, జపాన్ దేశాలు కలిసి ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మలబార్ యుద్ధ విన్యాసాల్లో ఈసారి రాయల్ ఆస్ట్రేలియా నౌకాదళం జత కలిసింది. మంగళవారం ప్రారంభమైన 24వ మలబార్ విన్యాసాల్లో పాల్గొనేందుకు నాలుగు దేశాల యుద్ధ నౌకలు బంగాళాఖాతంలోని అండమాన్ నికోబార్ దీవుల ఉత్తర సముద్ర తీరానికి చేరుకున్నాయి. ఈ నెల 6వ తేదీ వరకూ తొలి దశ యుద్ధ విన్యాసాలు జరగనున్నాయి. ఆ తరువాత ఇదే నెల 17 నుంచి 20వ తేదీ వరకూ మలబార్ రెండో దశ విన్యాసాలను అరేబియా సముద్రంలో నిర్వహించనున్నట్టు భారత నౌకాదళ వర్గాలు వెల్లడించాయి. భారత నౌకాదళంతో పాటు యునైటెడ్ స్టేట్స్ నేవీ (యూఎస్ఎన్), జపాన్ మేరీటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ (జెఎంఎస్డీఎఫ్)తోపాటు తొలిసారిగా రాయల్ ఆస్ట్రేలియన్ నేవీ (ఆర్ఏఎన్) నౌకాదళం పాల్గొన్నాయి. కోవిడ్–19 నేపథ్యంలో తొలిసారిగా ‘నాన్ కాంటాక్ట్–ఎట్ సీ’ పద్ధతిలో విన్యాసాలు చేపట్టారు. ఇండో–పసిఫిక్ సముద్ర జలాల్లో స్వేచ్ఛ, ఓపెన్ నావిగేషన్ వ్యవస్థల్ని పరిరక్షించడం, ఈ ప్రాంతంలో ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్న చైనా కుటిల యత్నాలకు చెక్ చెప్పడమే ప్రధాన లక్ష్యంగా ఈ కూటమి జత కట్టినట్టు ఆయా దేశాల నౌకాదళ వర్గాలు పరోక్ష హెచ్చరికలు జారీ చేశాయి. ఐఎన్ఎస్ రణ్విజయ్, ఐఎన్ఎస్ శివాలిక్, ఐఎన్ఎస్ శక్తి, ఐఎన్ఎస్ సుకన్యతో పాటు సింధురాజ్ సబ్మెరైన్లు భారత్ తరఫున విన్యాసాల్లో పాల్గొన్నాయి. యునైటెడ్ స్టేట్స్ నేవీకి చెందిన యూఎస్ఎస్ జాన్ మెక్కైన్, హెచ్ఎంఎఎస్ బలారత్, జపాన్కు చెందిన జేఎస్ ఒనామీతో పాటు రాయల్ ఆస్ట్రేలియన్ నేవీకి చెందిన యుద్ధ నౌకలు తొలి రోజు విన్యాసాల్లో కనువిందు చేశాయి. యాంటీ సబ్ మెరైన్ వార్ఫేర్ ఆపరేషన్స్, క్రాస్డెక్ ల్యాండింగ్స్, సీమ్యాన్ షిప్ విన్యాసాలతో సత్తా చాటాయి. నాలుగు దేశాల యుద్ధ నౌకలు సముద్ర జలాల్లో కలియ తిరుగుతూ.. విన్యాసాలకు తెర తీశాయి. భారత్–అమెరికా నౌకాదళాలు సంయుక్తంగా తొలిసారిగా 1992 నుంచి మలబార్ విన్యాసాలు ప్రారంభించాయి. 2015లో జపాన్ కూడా చేరడంతో అప్పటి నుంచి మూడు దేశాలు పాల్గొంటున్నాయి. తాజాగా రాయల్ ఆస్ట్రేలియన్ నేవీ చేరడంతో.. ఈ సంఖ్య నాలుగుకు చేరింది. గతేడాది సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 4 వరకూ జపాన్ తీరంలో మలబార్ విన్యాసాలు నిర్వహించారు. -
100వ టైటిల్ వేటలో...
మెల్బోర్న్: కెరీర్లో 100వ ఏటీపీ టైటిల్ సొంతం చేసుకునే లక్ష్యంతో ఆస్ట్రేలియన్ ఓపెన్ బరిలోకి దిగుతున్న టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్కు సులువైన ‘డ్రా’ ఎదురైంది. 2019లో తొలి గ్రాండ్ స్లామ్ టోర్నీకి సంబంధించిన ‘డ్రా’ గురువారం విడుదలైంది. డిఫెండింగ్ చాంపియన్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) తొలి రౌండ్లో ఉజ్బెకిస్తాన్కు చెందిన డెనిస్ ఇస్టోమిన్తో తలపడతాడు. 2017, 2018 సహా ఫెడెక్స్ ఇప్పటివరకు ఆరుసార్లు ఈ టైటిల్ నెగ్గాడు. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్లో 99వ స్థానంలో ఉన్న ఇస్టోమిన్కు 2017 ఆస్ట్రేలియన్ ఓపెన్ రెండో రౌండ్లో నొవాక్ జొకోవిచ్కు ఓడించిన రికార్డు ఉంది. అంచనాల ప్రకారమే అన్ని మ్యాచ్లు సాగితే ఫెడరర్, రాఫెల్ నాదల్ మధ్య సెమీ ఫైనల్ పోరు జరుగుతుంది. గత ఏడాది ఫెడరర్ చేతిలో ఫైనల్లో ఓడిన మారిన్ సిలిచ్తో పాటు బెర్నార్డ్ టామిక్, ఆండీ ముర్రే కూడా ఒకే పార్శ్వంలో ఉన్నారు. పురుషుల సింగిల్స్లో వరల్డ్ నంబర్వన్ జొకోవిచ్ (సెర్బియా)కు టాప్ సీడింగ్ లభించింది. అయితే జొకోవిచ్ ‘డ్రా’ మాత్రం కాస్త కఠినంగా ఉంది. రెండో రౌండ్లోనే అతను విల్ఫ్రెడ్ సోంగా (ఫ్రాన్స్)ను ఎదుర్కోవాల్సి రావచ్చు. జపాన్ స్టార్, ఇటీవలి బ్రిస్బేన్ ఓపెన్ గెలిచి ఊపు మీదున్న కి నిషికోరి కూడా అతని పార్శ్వంలోనే ఉండటం నంబర్వన్కు కఠిన పరీక్షగా మారనుంది. 2018లో అద్భుతంగా ఆడి వింబుల్డన్, యూఎస్ ఓపెన్లు గెలుచుకోవడంతో పాటు నంబర్వన్గా నిలిచిన జొకోవిచ్ ఖాతాలో కూడా ఆరు ఆస్ట్రేలియన్ ఓపెన్లు ఉన్నాయి. కెరీర్లో ఒకే ఒక్క ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ నెగ్గిన రాఫెల్ నాదల్ (స్పెయిన్)కు ప్రిక్వార్టర్ వరకు ఇబ్బంది లేకపోయినా క్వార్టర్స్లో వింబుల్డన్ రన్నరప్ కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా) ఎదురయ్యే ప్రమాదం ఉంది. తొలి రౌండ్లో నాదల్...ఆస్ట్రేలియా వైల్డ్ కార్డ్ ఎంట్రీ జేమ్స్ డక్వర్త్ను ఎదుర్కొంటాడు. సొంతగడ్డపై ఆడనున్న అన్సీడెడ్ నిక్ కిర్గియోస్, 16వ సీడ్ మిలోస్ రావోనిక్ (కెనడా) మధ్య జరిగే ఆసక్తికర మ్యాచ్తో సోమవారం నుంచి ఆస్ట్రేలియన్ ఓపెన్కు తెర లేవనుంది. అలీసన్ వాన్తో వోజ్నియాకీ పోరు... మహిళల విభాగంలో ఎనిమిదో సారి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ ఆశిస్తున్న అమెరికా స్టార్ సెరెనా విలియమ్స్ విజయమార్గం అంత సులువుగా లేదు. ఈ టోర్నీలో ఆమె 16వ సీడ్గా బరిలోకి దిగుతోంది. తొలి రౌండ్లో తత్జానా మారియా (జర్మనీ)ను ఎదుర్కోనున్న సెరెనా ప్రిక్వార్టర్స్లోనే వరల్డ్ నంబర్వన్ సిమోనా హలెప్ (రొమేనియా)తో తలపడే అవకాశం ఉంది. అంతకు ముందు రెండో రౌండ్ ప్రత్యర్థి బౌచర్డ్ (కెనడా)నుంచి కూడా సెరెనాకు ఇబ్బంది తప్పకపోవచ్చు. డిఫెండింగ్ చాంపియన్ కరోలినా వోజ్నియాకీ (డెన్మార్క్) తన మొదటి పోరులో అలీసన్ వాన్ (బెల్జియం)ను ఎదుర్కొంటుంది. మూడో రౌండ్లో మారియా షరపోవా (రష్యా)ను ఆమె ఎదుర్కోవాల్సి రావచ్చు. -
బోధ్ గయను సందర్శించడానికి వచ్చి..
పాట్నా : బౌద్దుల పవిత్ర పుణ్యక్షేత్రం బోధ్ గయాను దర్శించడానికి వచ్చిన ఓ ఆస్ట్రేలియన్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం రేపింది. వివరాలు.. సిడ్నికి చెందిన హీత్ అల్లాన్ అనే వ్యక్తి బోధ్ గయను దర్శింకుందామని బిహార్ వచ్చాడు. ఈ క్రమంలో సమీపంలోని అడవిలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ రోజు ఉదయం అడవికి వెళ్లిన స్థానికులకు ఉరేసుకుని మరణించిన హీత్ కనిపించాడు. వెంటనే వాళ్లు ఈ విషయం గురించి పోలీస్లకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు హీత్ బ్యాగ్, డైరీ, వాటర్ బాటిల్తో పాటు ఓ సూసైడ్ నోట్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. దీనిలో హీత్ తన సోదరి ఫోన్ నంబర్ రాసి.. ఈ విషయం గురించి ఆమెకి సమాచారం ఇవ్వాల్సిందిగా తెలియజేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. హీత్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. -
పుస్తకాలుంటే.. ఆ మూడు మంచి లక్షణాలు
పుస్తకాలు చదివితే ఏమొస్తుందని కొందరంటారుగానీ ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు మాత్రం కనీసం మూడు ప్రయోజనాలు ఉన్నాయని తేల్చేస్తున్నారు. చిన్నతనం నుంచి పుస్తకాలతో సావాసం చేసిన వాళ్లకు అంకెలు, సమస్య పూరణాలతోపాటు మేధావితనపు సంస్కారం అలవడతాయని వీరు అంటున్నారు. 2011 నుంచి 2015 మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1.60 లక్షల మందిని సర్వే చేసి మరీ ఈ అధ్యయనం చేశామని జోవానా సికోరా తెలిపారు. సర్వేలో పాల్గొన్న వాళ్లు 25– 65 మధ్య వయస్కులు. పదహారేళ్ల వయసు వచ్చేలోపు ఇంట్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? అన్న ప్రశ్నకు వీరంతా సమాధానమిచ్చారు. నార్వే, స్వీడన్, చెచ్నియా వంటి దేశాల్లోని పిల్లల ఇళ్లలో సగటున 200 పుస్తకాలు ఉండగా చిలీ, సింగపూర్, టర్కీ వంటి దేశాల్లో ఈ సంఖ్య 60 మాత్రమే. అందుబాటులో ఉన్న పుస్తకాల సంఖ్యకు తగ్గట్టుగానే ఆయా దేశాల యువకుల మేధోశక్తి కూడా ఉన్నట్లు ఈ పరీక్షల ద్వారా తెలిసింది. -
అదానీకి మరోషాక్
సాక్షి, ముంబై: భారత్లో అతిపెద్ద ఓడరేవుల నిర్వహణ సంస్థ అదానీ పోర్ట్కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఆస్ట్రేలియాలో చేపట్టిన కార్మైకేల్ బొగ్గు గని ప్రాజెక్టు విషయంలో మరోసారి అదానీకి భంగపాటు తప్పలేదు. ఆస్ట్రేలియాలోని డోనర్ ఈడీఐ లిమిటెడ్కు చెందిన ప్రాజెక్టును వదులుకుంటున్నట్టు ప్రకటించింది. పరస్పర అంగీకారంతో ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్టు అదానీ, డోర్ కంపెనీలు వెల్లడించాయి. వివాదాస్పద బొగ్గుగని ప్రాజెక్టును రద్దు చేసుకుంటున్నట్టు సోమవారం వెల్లడించింది. దీంతో దీర్ఘకాలంగా ఆలస్యమవుతూ వస్తున్న కార్మైకేల్ గనికి తాజాగా మరో షాక్ తగిలింది. చాలా ఏళ్లుగా పెండింగ్లో ఉన్న 16.5 బిలియన్ డాలర్ల ప్రాజెక్టు కోసం ప్రభుత్వ రుణాలను పొందడంలో విఫలమైన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఇప్పటికే అంతర్జాతీయ బ్యాంకులు, చైనా బ్యాంకులు కూడా ఈ ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టేందుకు నో చెప్పాయి. ఇక చివరి ప్రయత్నం కూడా విఫలం కావడంతో దీంతో అదానీ ఆశలు వదులకుంది. కాగా 16,500 కోట్ల డాలర్ల విలువైన కార్మైకేల్ ప్రాజెక్టు ప్రపంచంలోని అతిపెద్ద బొగ్గు గనుల్లో ఒకటి. అయితే అంతర్జాతీయ బ్యాంకులు సహా, చైనాకు చెందిన రెండు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజాలు ఈ ప్రాజెక్టుకు రుణాన్ని నిరాకరించాయి. మరోవైపు స్థానికులు, పర్యావరణవేత్తలు, పలు సామాజిక సంఘాలు ఈ ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకిస్తుండటంతో ఈ ప్రాజెక్టు వివాదంలో చిక్కుకుంది. -
జీఈఎస్లో స్పెషల్ ఎట్రాక్షన్ ఈ బుడతడు
సాక్షి,హైదరాబాద్: హైదరాబాదు హెచ్ఐసీసీలో జరుగుతున్న గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్షిప్ సమ్మిట్లో హమీష్ ఫిన్లేసన్ (13) అతిచిన్న పారిశ్రామిక వేత్తగా క్రెడిట్ దక్కించుకున్నాడు. 7వ తరగతి చదువుతున్న ఆస్ట్రేలియన్-ఆధారిత ఎంట్రపెన్యూర్ అతిచిన్న డెలిగేట్గా తన ప్రత్యేకతను చాటనున్నారు. గేమింగ్ అండ్ అవేర్నెస్పై తాను రూపొందించిన యాప్లను ప్రదర్శించనున్నారు. ముఖ్యంగా తాబేళ్లను రక్షించే ప్రాజెక్టులో ఇప్పటివరకు ఐదు యాప్లను హమీష్ అభివృద్ధి చేశాడు. ప్రస్తుతం ట్రాఫిక్ నియమాల గురించి అవగాహన కల్పించేందుకు గాను ఆరవ యాప్ను పనిచేసే పనిలో ఉన్నాడు. తాను భారతదేశం రావడం చాలా సంతోషంగా ఉందని ఫిన్లేసన్ తెలిపారు. టెక్నాలజీ అంటే తనకు ఎనలేని ప్రేమ అని, యాప్లు..టెక్నాలజీ అదే ఫస్ట్ లవ్..అయినా చదువుమీద కూడా దృష్టి పెడుతున్నట్టు చెప్పాడు. స్కూలు హోం వర్క్ పూర్తి చేసుకొని ఖాళీ సమయంలో మాత్రమే యాప్ల తయారీన పని చూసుకుంటానన్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఎదుర్కొంటున్న పెద్ద సమస్యలను పరిష్కరించడానికి టెక్నాలజీద్వారా పని చేయాలని కోరుకుంటున్నాడని హమీష్ తండ్రి గ్రేమే చెప్పారు. దాదాపు 54దేశాలలో వినియోగ దారులను సంపాదించుకున్న హమీష్ జీఈఎస్- 2017 ద్వారా సముద్ర తాబేళ్ల, ఆటిజం ప్రభావం గురించి అవగాహన పెంచాలని కోరుకుంటున్నారని తెలిపారు. కాగా భాగ్యనగరంలో మంగళవారంనుంచి మూడు రోజులపాటు జరగనున్న గ్లోబల్ ఎంట్రపెన్యూర్ షిప్ సమ్మిట్-2017మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సమ్మిట్ను ప్రారంభిస్తారు అలాగే మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రాధాన్యతనిస్తున్న ఈ సమ్మిట్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ముఖ్య అతిధిగా హాజరవుతున్న సంగతి తెలిసిందే. -
ఈ నులక మంచం ధర తెలిస్తే షాక్...
ఓ నులక మంచం ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. నులక మంచం ఏంటీ వైరల్ అవడం ఏంటి అనుకుంటున్నారా? అవును, సాధారణంగా రాత్రివేళ ఆరుబయట వెన్నెల్లో నులక మంచం మీద పడుకుని ఓ కునుకు పడితే వచ్చే సుఖమే వేరు అంటారు పెద్దలు. ఈ మంచాలు ఇప్పుడంటే కనుమరుగై పోతున్నాయి కానీ, పాతకాలపు రోజుల్లో మాత్రం ఎక్కడ చూసినా అవే కనిపించేవి. ఉత్తరాదికి వెళ్తే రహదారులు పక్కన ఉండే దాబా(హోటల్లు) బయట మంచాల్లోనే ఆతిథ్యం ఇస్తాయి. ఇప్పుడు ఈ నాటు మంచాలకు ఆన్లైన్లో భారీ ధర పలుకుతోంది. ఒక్కో మంచం ఖరీదు దాదాపు రూ.55వేలు మాత్రమే.. ఆస్ట్రేలియాకు చెందిన డానియేల్ బ్లూర్ 2010లో భారత్ పర్యటనకు వచ్చాడు. అప్పుడు పంజాబ్లోని ఓమంచం ఆయన్ను విశేషంగా ఆకట్టుకుంది. స్నేహితుడి సహాయంతో మంచం అల్లికను నేర్చుకొన్నాడు. అనంతరం ఆస్ట్రేలియాకు వెళ్లి మంచాలను తయారు చేసి అమ్మాకానికి పెట్టాడు. ధర చూస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే. ఒక్కో మంచం ఖరీదు దాదాపు రూ. 55వేలు. ఇప్పుడు దీనిపై సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తున్నాయి. నెట్జన్లు తమదైన శైలిలో జోకులు పేలుస్తున్నారు. 'ఇన్నిరోజులు అనవసరంగా పక్కన పెట్టేశామే' అని ఒకరు అంటే,, 'భారత్కు ఆదాయం రావడానికి భారత్లో ఉన్న ఈ మంచాలు అన్నింటిని అమ్మేస్తే సరి', 'దీనిపై కాపీ రైట్ తీసుకుంటాం' అంటూ సటైర్లు పేలుస్తున్నారు. -
అనుకోని అతిథిని చూసి యాంకర్ షాక్!
-
నాలుగేళ్లుంటేనే పౌరసత్వం
♦ మూడేళ్లు పెంచుతూ చట్టంలో మార్పులు చేసిన ఆస్ట్రేలియా ♦ ఆంగ్ల భాషలో ప్రావీణ్యమూ తప్పనిసరి ♦ నూతన విధానాన్ని ప్రకటించిన ప్రధాని మెల్బోర్న్: భారతీయులు అత్యధికంగా కలిగివున్న వర్క్ వీసాను రద్దు చేసిన ఆస్ట్రేలియా తాజాగా పౌరసత్వ నిబంధనలను మరింత కఠినతరం చేసింది. ఇకపై ఆసీస్ పౌరసత్వం పొందాలంటే ఆంగ్ల భాషలో ప్రావీణ్యంతో పాటు కనీసం నాలుగేళ్లు తప్పనిసరిగా ఆ దేశంలో శాశ్వత నివాసితులై ఉండాలని సరికొత్త చట్టాన్ని ప్రవేశపెట్టింది. అంటే ప్రస్తుతం ఉన్న 12 మాసాల నివాసిత నిబంధన కంటే ఇది మూడేళ్లు అదనం. నూతన సంస్కరణల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రధాని మాల్కమ్ టర్న్బుల్ వెల్లడించారు. దాంతోపాటు ‘ఆస్ట్రేలియా విలువల’కు కట్టుబడి ఉండాలని స్పష్టం చేశారు. అలాగే... పౌరసత్వం పొందేందుకు ఇప్పటివరకు ఎన్నిసార్లయినా పరీక్ష రాసుకొనే అవకాశం ఉండేది. తాజా మార్పులననుసరించి... మూడుసార్లు పరీక్షలో విఫలమైతే మళ్లీ రెండేళ్ల వరకూ పరీక్ష రాసే అవకాశం ఉండదు. ప్రజాస్వామ్యానికి పునాది... పౌరసత్వం పొందాలనుకొనేవారు కఠినమైన ఆంగ్ల పరీక్షలో కచ్చితంగా ఉత్తీర్ణులవ్వాలి. ఈ పరీక్షలో మహిళలు, పిల్లల గౌరవమర్యాదలకు సంబంధించిన అంశాలకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. బాల్య వివాహాలు, గృహహింస తదితర ప్రశ్నలుండవచ్చు. వీటితోపాటు ఆస్ట్రేలియా విలువలు, బాధ్యతలపై ఎంత వరకు అవగాహన ఉంది... వాటికి ఏమేరకు కట్టుబడి ఉన్నారన్నది నిర్ణయించేలా ప్రశ్నలుంటాయని టర్న్బుల్ చెప్పారు. ఆస్ట్రేలియా పౌరసత్వం ప్రత్యేక హక్కని, దాన్ని ప్రతిష్టాత్మకంగా భావించాలని అన్నారు. ‘పౌరసత్వం మా దేశానికి హృదయం వంటిది. ప్రజాస్వామ్యానికి పునాది. జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగానే పౌరసత్వ కార్యక్రమా లను రూపొందిస్తాం. దేశ ప్రజలతో సామాజికంగా మిళితమయ్యేందుకు ఆంగ్ల భాషలో ప్రావీణ్యం అవసరం. నేర ప్రవృత్తి, గృహహింస వంటివి ఆసీస్ విలువలను దెబ్బతీసేవే’అని ప్రధాని టర్న్బుల్ స్పష్టం చేశారు. పౌరసత్వ దరఖాస్తుల పరిశీలనలో అత్యున్నత స్థాయి పోలీసు తనిఖీలు ఉంటాయని ఇమిగ్రేషన్ మంత్రి పీటర్ డట్టన్ తెలిపారు. తమ దేశంలో పెరుగుతున్న నిరోద్యోగాన్ని నియంత్రించేందుకు ప్రాచుర్యం పొందిన 457 వర్క్ వీసాను రద్దు చేసిన మూడు రోజులకే ఆసీస్ పౌరసత్వ చట్టంలో మార్పులు చేయడం గమనార్హం. -
చాపెల్ చూశావా.. దిమ్మతిరిగే బదులు!
పాకిస్థాన్ ట్రెండ్ సెట్టర్ బ్యాట్స్మన్ షాహిద్ ఆఫ్రిదీ.. మైదానంలో మెరుపులు మెరిపించే ఈ ఆటగాడిని పాక్ క్రికెట్ అభిమానులు ‘బూమ్ బూమ్ ఆఫ్రిదీ’ అని పిలుచుకుంటారు. ప్రస్తుతం జట్టులో లేకపోయినా.. 36 ఏళ్ల ఆఫ్రిదీ తనదైన స్టైల్లో జట్టుకు అండగా నిలిచాడు. పాకిస్థాన్ జట్టు చెత్త క్రికెట్ ఆడుతున్నదని, ఆ జట్టున ఆస్ట్రేలియా పర్యటనకు పిలిచి ఉండాల్సింది కాదని ఆస్ట్రేలియా క్రికెటర్ ఇయాన్ చాపెల్ చేసిన విమర్శలకు ఘాటుగా బదులిచ్చాడు. ఆస్ట్రేలియా పర్యటనలో పాక్ జట్టు పోరాడినప్పటికీ.. 3-0 తేడాతో టెస్టు సిరీస్ కోల్పోయింది. దీంతో చెలరేగిపోయిన చాపెల్ పాక్ జట్టుపై నోరుపారేసుకున్నాడు. దీనికి దీటుగా అన్నట్టు రెండో వన్డేలో పాక్ జట్టు చెలరేగింది. ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. గత 12 ఏళ్లలో ఆస్ట్రేలియా గడ్డపై పాక్ జట్టుకు లభించిన తొలి విజయమిది. దీంతో ఉర్రూతలూగిన ఆఫ్రిదీ.. చాపెల్కు గట్టి బదులిచ్చాడు. ’శభాష్ పాకిస్థాన్. గొప్ప సారథ్యం, గొప్ప ఇన్నింగ్స్ హఫీజ్. వెల్డన్ జేకే, మాలిక్. ఇయాన్ చాపెల్ మ్యాచ్ చూశావా’ అంటూ ఆఫ్రిదీ ట్వీట్ చేశాడు. మెల్బోర్న్లో జరిగిన రెండో వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 220 పరుగులు మాత్రమే చేసింది. పాక్ బౌలర్లలో మహమ్మద్ ఆమిర్ మూడు, జునైద్ ఖాన్ రెండు వికెట్లు తీసుకున్నారు. అనంతరం కెప్టెన్ మహమ్మద్ హఫీజ్ 72 పరుగులు, షోయబ్ మాలిక్ 42 పరుగులు చేయడంతో 2.2 ఓవర్లు మిగిలి ఉండగానే పాక్ జట్టు లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో ఐదు వన్డేల సిరీస్ ను 1-1తో సమం చేసింది. -
సంప్రదాయ భారతావనికి దూరమయ్యాం
ఆస్ట్రేలియా టూరిస్టులు గ్రామీణ ప్రాంతాలపై డాక్యుమెంటరీ నిమిత్త జిల్లాకు వచ్చిన విదేశీయులు రాజవొమ్మంగి : 40 ఏళ్లనాటి సంప్రదాయ గ్రామీణ భారతావని, ఇప్పటికే ఎంతో మార్పు వచ్చిందని, నాటి సాంప్రదాయం, సంస్కృతిక గత భారతదేశాన్ని ఇప్పుడు చూడలేపోతున్నామని ఆస్ట్రేలియా దేశానికి చెందిన బాబ్ మెకే, స్టీఫెన్ బ్రౌన్ అన్నారు. చైన్నై నుంచి బుల్లెట్ మోటారు సైకిళ్లపై కోల్కత్తా వైపు వెళుతున్న వీరు బుధవారం మార్గమధ్యలో రాజవొమ్మంగి అటవీప్రాంతంలో కాసేపు సేదతీరగా.. ‘సాక్షి’ వీరిని పలుకరించింది. వారి రాక సంగతులు వారి మాటల్లోనే.. ‘‘భారత దేశంలోని సంప్రదాయ గ్రామీణ ప్రాంతంపై డాక్యుమెంటరీ ఫిల్మ్ చేయాలనే ఉద్దేశంతో ఇలా వచ్చాం. 'గో ప్రో– బీ హీరో' ఎక్విప్మెంట్ (మూవీ కేమెరాలు, జీపీఎస్, గూగుల్ మేప్స్ మొదలైన సరంజామా...)తో డాక్యుమెంటరీ ఫిల్మ్ తీసేందుకు ప్రణాళిక రూపొందించుకొన్న ముగ్గురులో ఒకరు చెన్నై వద్ద రోడ్ ప్రమాదానికి గురై గాయాలపాలై తిరిగి ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు. ఇక మేమిద్దరం నెలరోజుల వ్యవధిలో ఈ పనిని పూర్తి చేయాలని చెన్నై నుంచి యానాం తదితర గ్రామాల మీదుగా రాజవొమ్మంగి చేరుకున్నాం. విశాఖజిల్లాలోని కొయ్యూరు, కేడీ పేట మీదుగా కొండల ప్రాంతం చింతపల్లికి వెళతాం. కోల్కత్తాలో మా యాత్ర ముగుస్తుంది. అభివృద్ధి అంటే ఫ్లై ఓవర్లు, పెద్ద పెద్ద ఆకాశహార్మోన్లు కాదని, సాంప్రదాయం మరువ కూడదు.’’ అని చెప్పారు. భార తీయ వంటకాలు అంటే ఇష్టమని, రోజు వారీ భోజనంలో పప్పు అన్నం, పెరుగు ఉంటే చాలని అన్నారు. -
వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో అదానీ మైనింగ్
చివరి క్వార్టర్లో ప్రధాన కార్యక్రమాలు అదానీ అస్ట్రేలియా వెల్లడి మెల్బోర్న్: భారత ఇంధన దిగ్గజం అదానీ సంస్థ అస్ట్రేలియాలోని కార్మిఖేల్ మైనింగ్ కార్యక్రమాలను వచ్చే ఏడాది నుంచి ప్రారంభించనుంది. ఈ మైనింగ్ కార్యకలాపాలను వచ్చే ఏడాది మధ్యలో ఆరంభిస్తామని అదానీ తెలిపింది. 2,170 కోట్ల డాలర్ల ఈ ప్రాజెక్ట్ కారణంగా పదివేల ఉద్యోగాలు వస్తాయని అదానీ ఆస్ట్రేలియా సీఈఓ జెయకుమార్ జనక్రాజ్ చెప్పా రు. ఈ ఉద్యోగాల్లో స్థానిక కార్మికులకే ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఈ ప్రాజెక్ట్ను వివిధ పర్యావరణ సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ వివాదస్పద ప్రాజెక్ట్కు శాశ్వత రైల్వే లైన్కు తుది ఆమోదం సోమవారమే లభించింది. వచ్చే ఏడాది జూన్-జూలైలో కొన్ని పనులు ప్రారంభించాలనుకుంటున్నామని, ప్రధాన కార్యకలాపాలను వచ్చే ఏడాది చివరి క్వార్టర్లో ప్రారంభిస్తామని జనక్రాజ్ వివరించారు. ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి చాలా కష్టపడ్డామని, ప్రభుత్వం, ఈ ప్రాజెక్ట్ సంబంధిత వ్యక్తులు, సంస్థల సహకారంతో చివరకు విజయం సాధించామని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్, సంబంధిత మౌలిక సదుపాయాల కల్పనలో తోడ్పాటునందించేందుకు ప్రాంతీయ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. కాగా అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదాని..క్వీన్సల్యాండ్ రాష్ట్ర ప్రీమియర్, అనస్టేసియా పలాస్జక్తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రీజనల్ ప్రాజెక్ట్ సెంటర్లు, మైనింగ్ సంబంధిత మౌలిక సదుపాయాలు తదితర అంశాలపై ఆయన చర్చించారు. -
టుస్సీ తుస్సీ గ్రేట్ హో!
చూడగానే ముద్దొచ్చేలా కనిపిస్తున్నారు కదూ ఈ బుల్లిబుల్లి చిన్నారులు.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వీరు అందరికీ తెగ ముద్దొచ్చేస్తున్నారు. ఆస్ట్రేలియాలోని పెర్త్కు చెందిన టుస్సీ ఈ ఏడాది జనవరిలో వీరికి జన్మనిచ్చింది. ఇది వీరికి తొలి ఫొటోషూట్. ఇందులో నలుగురు ఆడ శిశువులు.. ఒక మగశిశువు ఉన్నారు. ఒక్కరితో వేగడమే కష్టం.. అలాంటిది ఒకేసారి ఐదుగురిని చూసుకోవడమంటే.. ఊహించుకోండి. అందుకే నెటిజన్లు ఆ తల్లిని అంటున్నారు.. 'టుస్సీ తుస్సీ గ్రేట్ హో!' అని. -
'ప్రజలారా.. ఇప్పట్లో అక్కడికి వెళ్లకండి'
కాన్బెర్రా: తమ దేశ పౌరులను ఆస్ట్రేలియా ప్రభుత్వం హెచ్చరించింది. ఇప్పట్లో అంకారా, ఇస్తాంబుల్వంటి టర్కీ నగరాల పర్యటనకు వెళ్లొద్దని గట్టిగా చెప్పింది. ప్రస్తుతం ఉగ్రవాదుల కన్ను ఆ నగరాలపై ఉన్నందున అక్కడికి వెళ్లవద్దని హెచ్చరించింది. ఈ రెండు నగరాల్లో ఉగ్రవాదులు పేలుళ్లకు పాల్పడి 80 మందికి పైగా ప్రాణాలు కోల్పోయేలా చేశారని, అందుకే తమ పౌరుల ప్రాణాలు కాపాడే దృష్ట్యా ఈ హెచ్చరికలు చేస్తున్నట్లు తెలిపింది. అంతేకాకుండా, మరోసారి భారీ పేలుళ్లకు పాల్పడతామని వరుస హెచ్చరికలు జారీ అవుతున్నాయని, బ్యాట్ మాన్, బింగోల్, బిట్లిస్, గాజియన్ టెప్, హక్కారీ, హాతే, మార్డిన్ వంటి ప్రాంతాలతోపాటు మరెన్నింటికో వార్నింగ్స్ ఇచ్చినందున టర్కీ నగర ప్రాంతాలకు వెళ్లొద్దని తమ ప్రజలకు హెచ్చరించింది. -
చోరీకిపోయి ఇరుక్కున్నాడు
పిల్లలు అల్లరి చేస్తుంటారు. అందులోనూ ఎప్పుడూ చూడని వస్తువులు కనిపిస్తే ఇంకాస్త అత్యుత్సాహం ప్రదర్శించి చిక్కులు కొని తెచ్చుకుంటారు. ఆస్ట్రేలియాలోని ఓ నాలుగేళ్ళ కుర్రాడి విషయంలో అదే జరిగింది. అంతకు ముందు ఎప్పుడూ చూడలేదో ఏమో కొత్తగా కనిపించిన వెండింగ్ మెషీన్ లో చేతులు పెట్టి ఇరుక్కు పోయాడు. అదృష్టం బాగుండి ఆరుగంటలు దాటాక ఎటువంటి అపాయం లేకుండా బయట పడ్డాడు. ఆస్ట్రేలియా బెల్బోర్న్ సిటీ సెంటర్ లో లియో అనే నాలుగేళ్ళ చిన్నారి బిస్కెట్లు, చాక్లెట్లు అమ్మకానికి వినియోగించే వెండింగ్ మెషీన్ లో చేతులు పెట్టేశాడు. విషయాన్ని గమనించిన అక్కడివారు వెంటనే ఫైర్ సిబ్బందికి ఇతర అధికారులకు సమాచారం అందించడంతో సహాయక చర్యలు చేపట్టారు. జరిగిన ఘటనతో చిన్నారి ఎంతో భయాందోళనలకు గురయ్యాడని, దీంతో సహాయక చర్యలు అతి సున్నితంగా నిర్వహించాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. అయితే బిస్కెట్లు, చాక్లెట్లను దొంగతనంగా చేజిక్కించుకోవడంకోసం లియో వివిధ పద్ధతుల్లో ప్రయత్నాలు చేశాడని చివరికి అవి దక్కక పోగా చేతులు మెషీన్ లో ఇరుక్కుపోయాయని అధికారులు చెప్తున్నారు. ఆరు గంటలపాలు నిర్వహించిన రెస్క్యూ ఆపరేషన్ సమయంలో లియో పలుమార్లు ఆందోళనకర స్థితికి చేరుకున్నాడు. మెషీన్లో ఇరుక్కున్న లియో చేతులను తీసేందుకు మెషీన్ ను కట్ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో లియో అరుపులను విని ఎంతో భయం వేసిందని, అతని దృష్టిని మరిపించేందుకు స్మార్ట్ ఫోన్లు వంటివి చూపించామని చుట్టుపక్కల వీధుల్లోని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం లియోకు ఎటువంటి ప్రమాదం లేదని, శరీరంపై ఎటువంటి గాయాలుకూడ కనిపించడం లేదని అధికారులు తెలిపారు. అయినప్పటికీ అతడ్ని పరిశీలించేందుకు మెల్బోర్న్ లోని రాయల్ ఛిల్డ్రన్స్ హాస్పిటల్ కు తరలించామని అన్నారు. ఇదిలా ఉంటే మా అబ్బాయి ఇంతకు ముందెప్పుడూ వెండింగ్ మిషన్ చూసినట్లు లేడని, బహుశా ఇదే మొదటిసారి కావడంతో బిస్కట్లు, చాక్లెట్లకోసం అందులో చేతులు పెట్టి ఉంటాడని నార్తరన్ టెర్రిటరీ ఆర్నెమ్ ల్యాండ్ లో నివసించే లియో తండ్రి ఆరోన్ అంటున్నాడు. ఏది ఏమైనా తమ కొడుకు సురక్షితంగా బయటపడటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. -
శవంపై హత్యాయత్నం.. ఏడేళ్ల జైలు
కాన్బెర్రా: శవంపై హత్యాయత్నం చేసినందుకు ఓ వ్యక్తికి కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించిన వింత కేసు.. ఆస్ట్రేలియాలోని కాన్బెర్రాలో నమోదైంది. డేనియల్ జేమ్స డారింగ్టన్ (39) అనే వ్యక్తి.. రాక్ మట్కాసీ(31) అనే వ్యక్తి శవంపై హత్యాయత్నానికి పాల్పడ్డాడని.. ఆస్ట్రేలియా సుప్రీంకోర్టు తేల్చింది. ప్రపంచంలోనే తొలిసారి.. శవంపై హత్యాయత్నానికి పాల్పడిన ఘటన వివరాల్లోకి వెళితే.. రెండేళ్ల కిందట మట్కాసి, డారింగ్టన్ కుస్తీ పడుతుండగా ప్రమాదవశాత్తు గన్ పేలి మట్కాసి కి తగిలింది. దీంతో భయాందోళనకు గురైన డారింగ్టన్, మట్కాసి చనిపోలేదని భావించి అతనిపై కాల్పులు జరిపాడు. కేసు విచారించిన పరిశోధన బృందం.. డేనియన్ చనిపోయిన వ్యక్తిపై కాల్పులు జరిపాడని అభియోగం నమోదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయవాదుల బృందం కేసుకు సంబంధించి పలు వివరాలు సేకరించింది. మార్చి 2014లో మట్కాసి, డారింగ్టన్లు ఏదో విషయంపై వాగ్వాదానికి దిగారు. ఈ సమయంలో ప్రమాదవశాత్తు గన్ మిస్ఫైర్ కావడంతో మట్కాసి అక్కడికక్కడే.. చనిపోయాడు. ఇది తెలియని డేనియల్ చనిపోయిన వ్యక్తిపై కాల్పులు జరిపాడని తెలిపింది. చనిపోయిన వ్యక్తి పై హత్యాయత్నమనే కేసు ప్రపంచంలోనే మొదటిసారి జరిగిందని న్యాయవాదుల బృందం అభిప్రాయపడింది. ఇది ఒక అసాధారణ, విచిత్రమైన కేసుగా ఆస్ట్రేలియా సుప్రీంకోర్టు 2015 డిసెంబర్లో పేర్కొంది. మట్కాసి కాల్పులు జరిపే టప్పటికే.. చనిపోయాడని తేల్చిన కోర్టు, అతను చనిపోయాడని భావించి కాల్పులు జరపడాన్ని హత్యాయత్నంగా భావిస్తున్నట్లు పేర్కొంది. విక్టోరియా రాష్ట్ర చట్టాల ప్రకారం చనిపోయిన వ్యక్తిపై అయినా.. కాల్పులు జరపడం.. హత్యాయత్నం కిందే పరిగణిస్తారు. దీంతో జస్టిస్ కోల్ గాన్... నిందితుడు డారింగ్టన్ కు ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్లు తీర్పునిచ్చారు. -
రూ. 7వేల కోట్ల డ్రగ్స్ రాకెట్ పట్టివేత!
ఆస్ట్రేలియా చరిత్రలోనే అతి పెద్ద డ్రగ్స్ రాకెట్ను అక్కడి పోలీసులు ఛేదించారు. హాంగ్కాంగ్ నుంచి అక్రమంగా ఆస్ట్రేలియాలోకి తీసుకు వచ్చిన 120 లీటర్ల మెతామ్ఫెటమైన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ మాఫియా అత్యంత చాకచక్యంగా అమ్మాయిలు ధరించే జెల్ బ్రాలలో డ్రగ్స్ను అక్రమంగా తీసుకొచ్చారు. నిఘావర్గాల సమాచారంతో పోలీసులు స్వాధీనం చేసుకున్న మెతామ్ఫెటమైన్ విలువ1 బిలియన్ డాలర్లు (దాదాపు 7 వేల కోట్ల రూపాయలు) ఉంటుందని అంచనా. ఈ సంఘటనతో ప్రమేయముందని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక చైనా వ్యక్తితో పాటు ముగ్గురు హాంగ్కాంగ్కు చెందిన వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఆస్ట్రేలియా చరిత్రలోనే పట్టుబడిన వాటిలో ఇదే అత్యంత పెద్ద డ్రగ్స్ రాకెట్ అని జస్టిస్ మినిస్టర్ మిచెల్ కినాన్ అన్నారు. సిడ్నీలో సీజ్ చేసిన ద్రవరూపంలో ఉన్న డ్రగ్ నుంచి 500 కిలోల క్రిస్టల్ మెత్ను తయారు చేయొచ్చని ఆస్ట్రేలియా ఫెడరల్ పోలీస్ కమాండర్ క్రిస్ షీహాన్ తెలిపారు. చైనా అధికారుల సహాయంతో గత కొంత కాలంగా నిఘా పెంచి ఈ మెతామ్ఫెటమైన్ రాకెట్ను ఛేదించగలిగామని తెలిపారు. నిఘావర్గాల సమాచారంతో సిడ్నీలోని మిరండా, హర్స్ట్ విల్లే, పెడాస్టో, కింగ్స్ గ్రూవ్ ప్రాంతాల్లోని గోడౌన్లలోకి వచ్చిన సరుకులను తనిఖీ చేయగా జెల్ బ్రాలతో పాటూ ఇంటి ఉపకరణాలలో నిలువ చేసిన డ్రగ్స్ను కనుగొన్నామని తెలిపారు. -
ఆస్ట్రేలియా హైకమిషనర్గా భారత సంతతి మహిళ
మెల్బోర్న్: భారత్లో ఆస్ట్రేలియా హైకమిషనర్గా హరీందర్ సిధూ నియమితులయ్యారు. ఐదేళ్ల వ్యవధిలో మన దేశంలో నియమితులైన భారత సంతతికి చెందిన రెండో ఆస్ట్రేలియన్ హైకమిషనర్ ఆమె. సిధూకుటుంబం పంజాబ్ నుంచి వెళ్లి ఆస్ట్రేలియాలో స్థిరపడింది. ప్రస్తుత హైకమిషనర్ పాట్రిక్ సక్లింగ్ స్థానంలో సిధూ బాధ్యతలు చేపట్టనున్నారు. అభివృద్ధిలో దూసుకుపోతున్న భారత్లో దౌత్య ప్రతినిధి పాత్ర పోషించేందుకు తాను ఎంతో ఆసక్తిగా ఉన్నానని ఆమె తెలిపారు. -
రికార్డు సృష్టించిన క్రిస్మస్ ట్రీ
కళాకారుడి సృజనకు, కష్టానికి మరోసారి ఫలితం దక్కింది. క్రిస్మస్ వేడుకల్లో భాగంగా ఏర్పాటుచేసిన ట్రీ ప్రపంచ రికార్డును నెలకొల్పింది. కాన్బెర్రా డౌన్ టౌన్లో నక్షత్రాల్లా మెరిసిపోయే లక్షల కొద్దీ లైట్లతో వెలిగిపోతున్న రిచర్డ్స్ రూపకల్పన గిన్నిస్ పుటలకెక్కింది. ఆస్ట్రేలియాకు చెందిన డేవిడ్ రిచర్డ్స్ సంవత్సరాల కృషి.. ప్రత్యేక గుర్తింపు పొందడంతోపాటు.. అతడు మూడోసారి రికార్డును సాధించేలా చేసింది. జపాన్ యూనివర్సల్ స్టూడియో ఐదేళ్లుగా ఒకాసాలో నిర్వహిస్తున్న ప్రదర్శనల్లో అత్యధిక లైట్లను ఏర్పాటుచేసి, ఆకట్టుకున్న కృత్రిమ చెట్టు.. ప్రపంచ రికార్డు నెలకొల్పింది. 118 అడుగుల ఎత్తు, సుమారు 3.75 లక్షల లైట్లతో మిరుమిట్లు గొల్పుతూ కొత్త ప్రమాణాలతో జపనీస్ ట్రీ... గిన్నిస్ పుస్తకంలో స్థానం సంపాదించింది. కాన్బెర్రా కు చెందిన న్యాయవాది, వ్యాపారవేత్త, రిచర్డ్స్... కొందరు ఇంజనీర్లతోపాటు, కార్పెంటర్, వెల్డర్ల వంటి సహాయక బృందంతో ఏర్పాటుచేసిన మిరుమిట్లు గొలిపే క్ర్మిస్మస్ ట్రీ ప్రదర్శన ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. కాన్బెర్రాకు చెందిన సడన్ ఇన్ఫాంట్ డెత్ సిండ్రోమ్ స్వచ్ఛంద సంస్థకు.. పిల్లలకు సాయం అందించేందుకు విరాళాలను ఆహ్వానిస్తూ ఈ ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. రిచర్డ్స్ 2013 లో మొదటిసారి తన సబర్బన్ హోమ్ ను 5 లక్షలకు పైగా బల్పులు లైట్లతో అలంకరించి గిన్నిస్ వరల్డ్ రికార్డును నెలకొల్పాడు. నాలుగు వారాలకు పైగా ప్రదర్శన నిర్వహించడంతో అప్పట్లో సుమారు 75 వేలమంది పైగా ఈ ప్రదర్శనను తిలకించారు. వచ్చే పోయే వారితో ఇరుగు పొరుగులతో సహా ఇంట్లోని వారూ విసిగిపోయారు. దీంతో ఇంకెప్పుడూ రికార్డు కోసం ఇటువంటి ప్రయత్నం చేయనని రిచర్డ్స్ హామీ ఇచ్చాడు. ఏడాది క్రితం రిచర్డ్స్ ఓ బహిరంగ ప్రదేశంలో 10 లక్షలకు పైగా ఎల్ఈడీ లైట్లను సెట్ చేసి తన రెండో గిన్నిస్ రికార్డును సాధించాడు. అప్పట్లో 120 కిలోమీటర్ల రంగురంగుల వైర్లను కాన్బెర్రా మాల్ లోని క్రిస్మస్ బహుమతులకు చుట్టి అతిపెద్ద ఎల్ఈడీ లైట్ల చిత్రాన్ని రూపొందించాడు. అయితే పోటీ ప్రపంచంలో రికార్డులు సాధించడం అంత సులభం కాదనేందుకు నిదర్శనంగా 2014 లో రిచర్డ్స్.. మ్యోకో హోటల్ వద్ద ఏర్పాటు చేసిన డ్రాగన్ లైట్ల ప్రదర్శనలో ఫెయిలయ్యాడు. అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా తిరిగి ఈసారి అతి పెద్ద కృత్రిమ క్రిస్మస్ ట్రీ కి అత్యధిక లైట్లను అలంకరించి 2012లో న్యూయార్క్ కుటుంబం సాధించిన గిన్నిస్ రికార్డును తిరగరాశాడు. -
ఆసీస్ వైస్కెప్టెన్గా వార్నర్ నియామకం
-
కాంపిటేషన్ మధ్యలో షార్క్ ఈడ్చుకెళ్లింది
-
కాంపిటేషన్ మధ్యలో షార్క్ ఈడ్చుకెళ్లింది
దక్షిణాఫ్రికా: అది దక్షిణాఫ్రికాలోని ఓ సముద్రం. భారీగా ఎగిసి పడుతున్న అలలు. ఒడ్డున ఆనందంతో ఎగిరి గంతులేస్తున్న భారీ జనం.. చుట్టూ కెమెరాలు. సముద్రపు అలలపై సర్ఫర్లు(చిన్న తెప్పలాంటిదానిపై నిల్చునిగానీ, పడుకొని గానీ సముద్రపు అలలపై రైడింగ్ చేసేవాళ్లు). వేగంగా వారు దూసుకెళుతుండగా వారికి రక్షణగా మరపడవలు. ఇందులో మిక్ ఫ్యానింగ్ అనే ఆస్ట్రేలియా సర్ఫర్ వాయువేగంతో లక్షిత ప్రాంతానికి దూసుకొస్తున్నాడు. మరికొద్ది సేపటిలో ఒడ్డుకు చేరుకుంటాడనంగా అతడిపై సడెన్గా ఓ షార్క్ దాడి చేసి నీటిలో అమాంతం ముంచివేసి గాయపరిచింది. ఎట్టకేలకు అతడిని అక్కడి సిబ్బంది రక్షించారు. మిక్ ఫ్యానింగ్ ఇప్పటికే సర్ఫింగ్లో మూడు టైటిళ్లు సాధించి లెజెండ్ అని నిరూపించుకున్నాడు. ఆదివారం దక్షిణాఫ్రికాలో 'జే బే సర్ఫ్ ఓపెన్' నిర్వహించగా అందులో పాల్గొన్నాడు. షార్క్ దాడి ఘటన గురించి ఆయన మాటల్లో చూస్తే 'లక్ష్యం మరికొద్ది దూరంలో ఉండగానే ఎవరో నా కాలు లాగుతున్నట్లు అనిపించింది. మొదటి సారి కాలు విదిలించాను. కొద్ది సేపటి తర్వాత మళ్లీ అలాగే అని పించింది. నేను మళ్లీ అలాగే చేశాను. కొంచెం సేపయ్యాక నా వెనుక ఎవరో ఉన్నట్లుగా అనిపించింది. తిరగి చూసేవరకు భయంకరమైన షార్క్ కోరపళ్లతో ఒక్కసారిగా నాపై విరుచుపడింది. భయంతో కేకలు వేయడం మొదలు పెట్టాను. చాలాసార్లు నన్ను నీటిలో ముంచి లోపలికి ఈడ్చుకెళ్లే ప్రయత్నం చేసింది. నా అరుపులు విని సిబ్బంది వచ్చి రక్షించారు. స్వల్పంగా నాకు గాయమైంది' అని వణికిపోతూ చెప్పాడు. జేబే సర్ఫ్ ఓపెన్ నిర్వాహకులు కూడా విక్ ఫ్యానింగ్ బతికి బయటపడ్డాడు మాకు అదే చాలు అని ఆనందం వ్యక్తం చేశారు. -
గుడ్లు పెట్టే ‘క్షీరదం’
ప్లే టైమ్ సరస్సులు, నదులు... వాటి ఒడ్డుల్లో నివసించే డక్బిల్ ప్లాటిపస్ది ఆసక్తికరమైన జీవనశైలి. ప్రధానంగా ఆస్ట్రేలియన్ తూర్పు ప్రాంతంలో కనిపించే ఇది క్షీరదజాతికి చెందినది. పునరుత్పత్తి ప్రక్రియలో ఇది గుడ్లు పెడుతుంది. దీంతో గుడ్లు పెట్టి పాలిచ్చే అరుదైన జీవిగా దీనికి గుర్తింపు ఉంది. నీటి అడుగున ఉండే చిన్న చిన్న చేపలు, లార్వాలు, పురుగులు, ఇతర జీవులే దీనికి ఆహారం. ఒక్కసారి నది అడుగుకు చేరిన ప్లాటిపస్ వీలైనంత ఆహారాన్ని సంపాదించుకొని నోటిలో పెట్టుకొంటుంది. ఒడ్డుకు చేరిన తర్వాత నెమరువేస్తూ ఆ ఆహారాన్ని మింగుతుంది. పళ్ల విషయంలో కూడా ప్లాటిపస్ ప్రత్యేకమైనదే. పుట్టినప్పుడు ఈ క్షీరదానికి పళ్లుంటాయి. అయితే కొంత వయసు వచ్చే సరికి అవన్నీ ఊడిపోతాయి. ఆ తర్వాత కూడా ఆహారాన్ని నెమరువేయడానికి దీనికే ఇబ్బందీ ఉండదు. ఆకలి తీరాకా ఒడ్డున చేరి సూర్యకాంతిని ఆస్వాదించడం వీటికి బాగా ఇష్టం. -
‘టాటు’ తీశారు!
సమ్థింగ్ స్పెషల్ ఎవరి పిచ్చి వారికి ఆనందం. మైఖేల్ బాక్స్టేర్ అనే యాభై రెండు సంవత్సరాల ఆస్ట్రేలియన్కు పాపులర్ కార్టూన్ సిరీస్ ‘ది సింప్సన్’ అంటే చాలా పిచ్చి. ఆ పిచ్చిలో నుంచి పుట్టిన ఆనందంలో నుంచి పుట్టిందే ఒంటి నిండా టాటూలు వేయించుకోవడం. ‘ది సింప్సన్’ కార్టూన్ సిరీస్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు మిస్ కాకుండా చూస్తున్నాడు మైఖేల్. ఒకటి కాదు రెండు కాదు ఆ కార్టూన్ సిరీస్కు చెందిన 203 కారెక్టర్లను ఒంటి మీద పొడిపించుకున్నాడు. రేపో మాపో గిన్నిస్బుక్లో ఎక్కడానికి సిద్ధంగా ఉన్నాడు. ‘ది సింప్సన్’లో ‘హోమర్’ పాత్ర అంటే మైఖేల్కు ఇష్టం. అంతమాత్రాన తన అభిమానాన్ని హోమర్కి మాత్రమే పరిమితం చేయకుండా అన్ని ముఖ్యపాత్రలకు తన ఒంటి మీద చోటు కల్పించాడు మైఖేల్. ‘‘నిజానికి ఇలా చేయడానికి ఎవరూ ఇష్టపడరు. ఇష్టం ఉన్న చోట...కష్టం అనేది లెక్కలోకి రాదు. సింప్సన్ కార్టూన్ సిరీస్ మీద నాకు ఉన్న అభిమానాన్ని కొత్తగా వ్యక్తీకరించాలనే ఆలోచనలో నుంచే ఈ ఐడియా పుట్టింది’’ అంటున్నాడు మైఖేల్. ‘ది సింప్సన్’ సిరీస్ పాతిక సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న మాసంలోనే మైఖేల్ గిన్నిస్ రికార్డ్కి దగ్గర కావడం యాదృచ్ఛికమే అయినా... అదొక విశేషంగా మారింది. ఈ టాటూల పుణ్యమా అని జైళ్ల శాఖలో అధికారిగా పని చేస్తున్న మైఖేల్... ఇప్పుడు చిన్న పాటి సెలబ్రిటీగా మారాడు. అంతర్జాలంలో ప్రపంచవ్యాప్తంగా అతడి ఫొటోలను లక్షలాది మంది చూశారు. ‘‘ఈ టూటూలు నాకు గుర్తింపు తెచ్చాయి’’ అని సంతోషిస్తూనే- ‘‘ఒంటి నిండా టాటులు వేయించుకోవడం మామూలు విషయం కాదు. ఆర్టిస్ట్లు నా తాట తీశారు. పని పూర్తి కావడానికి 130 గంటలు పట్టింది. కళ్లలో నీరు కారుతూనే ఉండేది’’ అంటున్నాడు మైఖేల్. ‘‘ఆయన ఓపిక చూసి ఆశ్చర్యానందాలకు గురయ్యాను’’ అని మైఖేల్ గురించి మెచ్చుకోలుగా చెప్పింది ఆండ్రియా అనే టాటూ ఆర్టిస్ట్. మొదట మైఖేల్ తన ఆలోచనను ఆండ్రియాకు చెప్పినప్పుడు ఆమె సీరియస్గా తీసుకోలేదు. సరదాగా అంటున్నాడేమో అనుకుంది.ఎవరు ఎలా అనుకున్నా.... మొత్తానికైతే అందరిచేత ‘వావ్’ అనిపించకున్నాడు మైఖేల్! -
దూసుకొస్తున్నాడు!
ప్రస్తుతం రికార్డు పరుగులన్నీ జమైకన్ అథ్లెట్ ఉసేన్ బోల్ట్వే! అత్యంత వేగంగా పరిగెత్తి ఒలింపిక్ రికార్డులను సృష్టించిన బోల్ట్ను దాటి వేగంగా పరిగెత్తేవారు ఉండరేమో, పరుగుల పోటీలో బోల్డ్కు సరైన ప్రత్యర్థి లేడు... అని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్న తరుణంలో ఒక యువకుడు దూసుకొస్తున్నాడు. బోల్ట్ రికార్డులను బ్రేక్ చేస్తూ అంతర్జాతీయ స్థాయి గుర్తింపును సొంతం చేసుకొంటాడనే ఊహాగానాలను రేకెత్తిస్తున్నాడు. జమైకన్ చిరుత బోల్ట్కు సవాలు విసురుతున్న ఆ ఆస్ట్రేలియన్ చిరుతే జేమ్స్ గలాఫర్. ఆస్ట్రేలియన్ అథ్లెటిక్ ఛాంపియన్ షిప్స్లో 200 మీటర్ల ట్రాక్ను 21.73 సెకన్లలో పూర్తి చేసి సంచలనం సృష్టించాడు జేమ్స్. ఇదే దూరాన్ని జమైకన్ అథ్లెట్ బోల్ట్ తన పద్నాలుగవ యేట 21.81 సెకన్లలో ఛేదించాడు. బోల్ట్ కన్నా 0.08 సెకన్ల ముందుగా లక్ష్యాన్ని చేరుకొన్నాడు జేమ్స్. దీంతో తన టీనే జ్లో బోల్ట్ స్థాపించిన రికార్డును జేమ్స్ చెరిపేసినట్టైంది. ఈ ఫీట్ద్వారా అథ్లెటిక్ ప్రపంచంలో కొత్త తారగా ఉదయించాననే విషయాన్ని ప్రపంచానికి చాటాడు, పశ్చిమ ప్రాంతానికి చెందిన జేమ్స్. రికార్డు చిన్నబోయింది... ప్రస్తుతం బోల్ట్ వయసు ఇరవైఏడు సంవత్సరాలు. పదమూడు సంవత్సరాల క్రితం 200 మీటర్ల దూరపు పరుగుపందెంలో రికార్డును సృష్టించాడు. ఆ తర్వాత ఇన్నేళ్లలో బోల్ట్ రికార్డును బ్రేక్ చేసిన వారెవరూ లేదు. బోల్ట్ జూనియర్ స్థాయి నుంచి ఒలింపిక్ స్థాయికి చేరాడు. అనేక కొత్త రికార్డులను స్థాపించాడు. ఒలింపిక్స్లో అయితే బోల్ట్ విన్యాసాలు అన్నీ ఇన్నీ కావు. 2008, 2012 ఒలింపిక్స్లో కొత్త రికార్డులను స్థాపించాడు బోల్ట్. అయితే ఇప్పుడు జేమ్స్ పరుగుధాటికి బోల్ట్ వేగం చిన్నబోయింది. బోల్ట్ను మించుతాడా? టీనేజర్గా బోల్ట్ స్థాపించిన రికార్డును బ్రేక్ చేసిన జేమ్స్ భవిష్యత్తులో పెద్ద అథ్లెట్గా ఎదిగే అవకాశం ఉందని, బోల్ట్తో సమానస్థాయికి చేరే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. టీనేజ్లో ఉండగా బోల్ట్లో ఎలాంటి సామర్థ్యం ఉండేదో పదమూడేళ్ల జేమ్స్కు అతడి కన్నా ఎక్కువ సామర్థ్యం ఉందని వారు అంటున్నారు.భవిష్యత్తులో బోల్ట్కి ప్రత్యామ్నాయం కాగలడనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అథ్లెటిక్స్ విషయంలో ఆస్ట్రేలియాకు మంచి ప్రాతినిధ్యం ఉంది. ఈ నేపథ్యంలో జేమ్స్ అంతర్జాతీయ, ఒలింపిక్ స్థాయిల్లో బోల్ట్ రికార్డులను అధిగమించినా పెద్దగా ఆశ్చర్యపోనవసరం లేదు. అతడు ఉత్సాహంతో ఉన్నాడు! ఒలింపిక్ ఛాంపియన్ అయిన ఒక వ్యక్తి తన కెరీర్ ఆరంభంలో సృష్టించిన రికార్డులను చెరిపేసిన ఉత్సాహంతో ఉన్నాడు జేమ్స్. ఇప్పుడు తను బోల్ట్ దృష్టిలో కూడా పడ్డానని జేమ్స్ సంతోషపడుతున్నాడు. బ్రెజిల్లో జరిగే 2016 ఒలింపిక్స్లో తమ దేశం తరఫున ప్రాతినిధ్యం దక్కుతుందని జేమ్స్ ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు. కోచ్లు కూడా జేమ్స్ విషయంలో నమ్మకంతోనే ఉన్నారు. కొత్త రికార్డులను నెలకొల్పగలడని ఆశిస్తున్నారు. ఈ లిటిల్ ఛాంపియన్పై ఒత్తిడి లేకుండా చూస్తామని అంటున్నారు కోచ్లు. హైస్కూల్స్థాయిలోనే అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జిస్తున్న జేమ్స్ను అంతర్జాతీయ అథ్లెట్గా తీర్చిదిద్దగలమని వారు పూర్తి నమ్మకంతో ఉన్నారు. మరి వారి ప్రయత్నం, బోలెడు శ్రమకు ప్రతిఫలంగా జేమ్స్ మరో బోల్ట్ కావొచ్చునేమో! ఒలింపిక్ ఛాంపియన్ అయిన బోల్ట్ తన కెరీర్ ఆరంభంలో సృష్టించిన రికార్డులను చెరిపేసిన ఉత్సాహంతో ఉన్నాడు జేమ్స్. ఇప్పుడు తను బోల్ట్ దృష్టిలో కూడా పడ్డానని జేమ్స్ సంతోషిస్తున్నాడు. బ్రెజిల్లో జరిగే 2016 ఒలింపిక్స్లో తమ దేశం తరఫున ప్రాతినిధ్యం దక్కుతుందని జేమ్స్ ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు. -
యవ 'రాజ్' కొట్టేనా
చాంపియన్స్ లీగ్తో దాదాపు మూడు వారాల పాటు టి20 సందడి కొనసాగింది. అయితే ఎన్ని మ్యాచ్లు జరిగినా అది క్లబ్ క్రికెట్ మాత్రమే. రెండు దేశాల మధ్య జరిగే ట్వంటీ20 మ్యాచ్కు ఉండే ప్రత్యేకతే వేరు. చాంపియన్స్ లీగ్లో మెరిసిన ధోని, రైనా, ధావన్, రోహిత్ లాంటి స్టార్ ఆటగాళ్లు ఇప్పుడు దేశం తరఫున సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. భారత్, ఆసీస్ ఏకైక టి20 మ్యాచ్ అందుకు వేదిక కానుంది. రాజ్కోట్: జట్టులో ప్రధాన ఆటగాడిగా దశాబ్దానికి పైగా కొనసాగిన తర్వాత స్థానం కోల్పోయిన ఆటగాళ్లు పునరాగమనం చేయడం అంత సులభం కాదు. ఎంతో పట్టుదల, శ్రమ ఉంటే కానీ అది సాధ్యం కాదు. జట్టులో స్థానం దక్కాలంటే దొడ్డిదారిని ఆశ్రయించాల్సిన పనిలేదని యువరాజ్ నిరూపించాడు. ఫ్రాన్స్ వెళ్లి ఫిట్నెస్ మెరుగు పరుచుకోవడం... దొరికిన అవకాశాలని ఉపయోగించుకుని భారీగా పరుగులు చేయడం ద్వారా మళ్లీ రాయల్గా జట్టులోకి వచ్చాడు. మరి దీనిని నిలుపుకుంటాడా..? భారత క్రికెట్ అభిమానులందరిలోనూ ఆసక్తి పెంచిన ప్రశ్న ఇది. అందుకే... భారత్, ఆస్ట్రేలియాల మధ్య నేడు రాజ్కోట్లో జరిగే ఏకైక టి20 మ్యాచ్లో అందరి దృష్టి యువరాజ్పై ఉంది. ఈ మ్యాచ్ ద్వారా భారత జట్టు కొత్త జెర్సీతో బరిలోకి దిగుతోంది. సొంతగడ్డపై జడేజా తొలిసారి గత డిసెంబర్లో భారత్ చివరిసారిగా అంతర్జాతీయ టి20 మ్యాచ్ ఆడింది. ఆ తర్వాత వన్డేల్లో ప్రదర్శన చూస్తే జట్టు చాలా పటిష్టంగా కనిపిస్తోంది. ఓపెనర్లుగా శిఖర్ ధావన్, రోహిత్ శర్మ చక్కగా రాణిస్తున్నారు. ఆ తర్వాత కోహ్లి, యువరాజ్, రైనా, ధోని, జడేజా ధాటిగా పరుగులు చేయగల సమర్థులు. దేశవాళీలో చక్కటి ప్రదర్శనతో జట్టులోకి వచ్చిన యువరాజ్ అదే ఫామ్ను కొనసాగించాల్సి ఉంది. ఇటీవల ఒక్కసారిగా స్టార్ ఆల్రౌండర్గా మారిపోయిన రవీంద్ర జడేజా తొలి సారి తన సొంత నగరంలో ప్రేక్షకుల మధ్య అంతర్జాతీయ మ్యాచ్ ఆడనుండటం విశేషం. బౌలర్లలో అశ్విన్ కీలకం కానున్నాడు. యువరాజ్, జడేజాల లెఫ్టార్మ్ స్పిన్ కూడా ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉంది. పేసర్లుగా భువనేశ్వర్, ఇషాంత్లకు చోటు ఖాయం. మరో పేసర్గా వినయ్ కుమార్కు లేదా వైవిధ్యం కోసం లెగ్స్పిన్నర్ అమిత్ మిశ్రాలకు తుది జట్టులో స్థానం లభించవచ్చు. పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉండటంతో అంబటి రాయుడుకు దాదాపు అవకాశం లేనట్లే. ఫించ్, వాట్సన్ కీలకం... భారత్తో పోలిస్తే ఆసీస్ జట్టులో కొత్త ఆటగాళ్లు ఎక్కువగా ఉన్నారు. అయితే టి20 స్పెషలిస్ట్లతో పాటు భారత గడ్డపై ఇటీవలే ఎక్కువ క్రికెట్ ఆడిన ఆటగాళ్లు ఉండటం ఆ జట్టు బలం. టి20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన ఆరోన్ ఫించ్ చెలరేగితే భారత్కు కష్టాలు తప్పవు. అదే తరహాలో షేన్ వాట్సన్ కూడా ఒంటిచేత్తో మ్యాచ్ను గెలిపించగల సమర్థుడు. సీఎల్టి20 ఫైనల్లో ఆకట్టుకున్న ఆల్రౌండర్ మ్యాక్స్వెల్ కూడా జట్టులో ఉన్నాడు. కెప్టెన్ బెయిలీ, కొత్త కుర్రాడు మాడిసన్పై ఆ జట్టు బ్యాటింగ్ ఆధారపడి ఉంది. బౌలింగ్లో మిచెల్ జాన్సన్, ఫాల్క్నర్, కౌల్టర్, మెక్కే...ఇలా ఎక్కువ మంది పేసర్లే ఉన్నారు. డోహర్తి ఒక్కడే స్పెషలిస్ట్ స్పిన్నర్. ఈ ఏడాది ఆరంభంలో భారత్ చేతిలో 0-4 తేడాతో టెస్టు సిరీస్ చిత్తుగా ఓడిన ఆస్ట్రేలియా ఈ పర్యటననైనా విజయంతో ఆరంభించాలని భావిస్తోంది. భారత గడ్డపై ఆసీస్ గతంలో ఒకే ఒక్క టి20 మ్యాచ్ (2007లో) ఆడి ఓడిపోయింది. వాన గండం! భారత్, ఆస్ట్రేలియా టి20 మ్యాచ్కు వర్షం అడ్డంకిగా మారే అవకాశం కూడా ఉంది. గుజరాత్లోని సౌరాష్ట్ర ప్రాంతంలో భారీగా వానలు కురుస్తున్నాయి. గురువారం కూడా వర్షం పడవచ్చని అక్కడి వాతావరణ శాఖ నివేదిక చెబుతోంది. యువీకి ఈ మ్యాచ్ ఎంతో కీలకమని మాకు తెలుసు. కాబట్టి అతనిపై అదనపు భారం లేకుండా, ఒత్తిడి పెంచకుండా ఉండేందుకు ప్రయత్నిస్తాం. మా జట్టు చాలా పటిష్టంగా ఉంది. అయితే ఆస్ట్రేలియా కూడా ఆల్రౌండర్లతో సమతూకంగా కనిపిస్తోంది. జడేజా టి20ల్లో అంతగా ప్రభావం చూపలేకపోతున్నాడనేది వాస్తవం. అయితే అతడి బౌలింగ్ను మేం సరైన విధంగా మేం ఉపయోగించుకోవాల్సి ఉంది. వాతావరణం గురించి మ్యాచ్కు గంట ముందు మాత్రమే ఆలోచిస్తాం. క్రికెట్లో ఏ ఫార్మాట్ ప్రత్యేకత దానికి ఉంది. ప్రతీదానిపై మరో ఫార్మాట్ ప్రభావం ఉంటుంది. అందుకే అన్నింటినీ మనం గౌరవించాలి. నాకు మాత్రం మూడూ ఆడటం ఇష్టమే - ఎం.ఎస్.ధోని, భారత కెప్టెన్ ఇప్పటివరకూ ఆస్ట్రేలియాతో ఆడిన ఏడు టి20 మ్యాచ్ల్లో భారత్ మూడు గెలిచి, నాలుగు ఓడిపోయింది. ఆస్ట్రేలియా జట్టు గత రెండేళ్లుగా కాస్త వెనుకబడినా మాలో పోరాట స్ఫూర్తి ఏ మాత్రం తగ్గలేదు. జట్టులో అనుభవానికి కొరత ఉంది. కానీ కొత్త కుర్రాళ్లు తమ సత్తా చూపాలని పట్టుదలగా ఉన్నారు. స్పిన్ను సమర్థంగా ఎదుర్కోగల ఆటగాళ్లు మాలో చాలా మంది ఉన్నారు. టి20ల్లో ఫేవరెట్ అంటూ ఎవరూ ఉండరు. ఒక్క ఇన్నింగ్స్ మ్యాచ్ను మలుపు తిప్పుతుంది - జార్జ్ బెయిలీ, ఆస్ట్రేలియా కెప్టెన్ జట్లు (అంచనా): భారత్: ధోని (కెప్టెన్), ధావన్, రోహిత్, కోహ్లి, యువరాజ్, రైనా, జడేజా, అశ్విన్, భువనేశ్వర్, ఇషాంత్, మిశ్రా/ వినయ్. ఆస్ట్రేలియా: బెయిలీ (కెప్టెన్), ఫించ్, మాడిసన్, వాట్సన్, హెన్రిక్స్, మ్యాక్స్వెల్, హాడిన్, జాన్సన్, మెక్కే, డోహర్తి, ఫాల్క్నర్/కౌల్టర్. -
సెప్టెంబర్ 7న ఆస్ట్రేలియా ఏన్నికలు