Banking system
-
లిక్విడిటీ అవసరాలకు ఆర్బీఐ రూ.43 లక్షల కోట్లు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ సంజయ్ మల్హోత్రా బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ సవాళ్లను పరిష్కరించడానికి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. 2024 డిసెంబర్లో బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి బ్యాంకింగ్ వ్యవస్థకు ఊతమిచ్చే చర్యలపై దృష్టి సారించారు. గత నాలుగు నెలల్లో సవాళ్లతో కూడిన లిక్విడిటీ పరిస్థితులను సమర్థంగా నిర్వహించేందుకు ఆర్బీఐ రూ.43.21 లక్షల కోట్లను చొప్పించింది.2024 డిసెంబర్ 16 నుంచి 2025 ఫిబ్రవరి 14 మధ్య బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ లోటు రూ.30,000 కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్లకు పెరిగింది. పన్ను ప్రవాహాలు, పరిమిత ప్రభుత్వ వ్యయం, రూపాయికి మద్దతుగా ఫారెక్స్ మార్కెట్లో ఆర్బీఐ భారీగా జోక్యం చేసుకోవడం ఈ మార్పునకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు.ఆర్బీఐ తీసుకున్న చర్యలుపెరుగుతున్న లిక్విడిటీ లోటును పరిష్కరించేందుకు, బ్యాంకింగ్ వ్యవస్థలోని సవాళ్లను ఎదుర్కోవడానికి ఆర్బీఐ కీలక చర్యలు తీసుకుంది. వేరియబుల్ రేట్ రెపో (వీఆర్ఆర్) వేలం ద్వారా రూ.16.38 లక్షల కోట్లను అందుబాటులో తీసుకొచ్చింది. రోజువారీ వీఆర్ఆర్ వేలం ద్వారా రూ.25.79 లక్షల కోట్లను అందించింది. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ (ఓఎంఓ) ద్వారా రూ.60,020 కోట్ల విలువైన ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేసింది. విదేశీ కరెన్సీ కొనుగోలు-అమ్మకం ద్వారా సుమారు రూ.45,000 కోట్లను వ్యవస్థలోకి చొప్పించింది.ఇదీ చదవండి: ఒకప్పుడు సుజుకీ సంస్థ నమ్మని మొదటి బిలియనీర్!మనీ మార్కెట్ రేట్లపై ప్రభావంలిక్విడిటీ లోటు సమస్యలున్నప్పటికీ ఓవర్నైట్ మనీ మార్కెట్ రేట్లు ఆర్బీఐ రెపోరేటు కంటే కొంచెం అధికంగానే ఉన్నాయి. 6.6 శాతం నుంచి 6.74 శాతం మధ్య ట్రేడ్ అవుతున్నాయి. కార్పొరేట్లు, బ్యాంకుల రుణ వ్యయాలపై ఇది నిరంతర ఒత్తిడిని పెంచుతోంది. దీన్ని పరిష్కరించాలని బ్యాంకర్లు ఆర్బీఐను కోరుతున్నారు. ఆర్థిక సవాళ్లను నిర్వహించడానికి, ఆర్థిక స్థిరత్వానికి మద్దతు ఇవ్వడానికి ఆర్బీఐ విస్తృత వ్యూహంలో భాగంగా ఇటీవలి పాలసీ రేటు కోతకు మద్దతు ఇచ్చింది. దాంతోపాటు బ్యాంకింగ్ వ్యవస్థలోకి లిక్విడిటీని చొప్పిస్తోంది. -
రేట్ల కోతతో తక్షణ, దీర్ఘకాలిక ప్రభావాలు
ఆర్థిక పరిస్థితులను సులభతరం చేయడానికి, ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరిచే లక్ష్యంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల కీలక వడ్డీరేట్ల తగ్గింపు నిర్ణయం తీసుకుంది. రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు తెలిపింది. ఈ నిర్ణయం రెపో రేటుతో అనుసంధానమయ్యే రుణగ్రహీతలకు తక్షణ ఉపశమనం కలిగించినప్పటికీ బ్యాంకింగ్ వ్యవస్థపై, ముఖ్యంగా మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR), డిపాజిట్లతో ముడిపడి ఉన్న రుణాలపై విస్తృత ప్రభావాలు చూపడానికి కొంత సమయం పడుతుందని నిపుణులు భావిస్తున్నారు.రెపో లింక్డ్ రుణగ్రహీతలకు తక్షణ ప్రయోజనాలుఆర్బీఐ రేట్ల తగ్గింపు వల్ల రెపో రేటుతో ముడిపడి ఉన్న రుణాలతో రుణగ్రహీతలకు తక్షణ ప్రయోజనం చేకూరుతుంది. వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ నుంచి తీసుకునే రుణాలపై విధించే వడ్డీని రెపో రేటు అంటారు. రెపో రేటును తగ్గించడం వల్ల ఈ రుణగ్రహీతలకు వడ్డీ రేట్లు తగ్గుతాయి. ఎందుకంటే బ్యాంకులు ఆ ప్రయోజనాన్ని వెంటనే లబ్ధిదారులకు బదిలీ చేస్తాయి. ఇది చాలా మంది రుణగ్రహీతలకు సమాన నెలవారీ వాయిదాలను (EMI) తగ్గించడానికి దారితీస్తుంది.ఎంసీఎల్ఆర్ రుణాలపై ప్రభావం ఆలస్యంఆర్బీఐ తీసుకున్న నిర్ణయంతో ఎంసీఎల్ఆర్తో ముడిపడి ఉన్న రుణాలపై ప్రభావం వెంటనే కనిపించదు. ఎంసీఎల్ఆర్ అనేది గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలు, ఇతర రుణాలపై వడ్డీ రేట్లను నిర్ణయించడానికి బ్యాంకులు ఉపయోగించే బెంచ్మార్క్ వడ్డీ రేటు. రెపో రేటు మాదిరిగా కాకుండా బ్యాంకులకు నిధుల వ్యయం, నిర్వహణ ఖర్చులు.. వంటి వాటిపై ఆధారపడి ఎంసీఎల్ఆర్లో మార్పులు ఉంటాయి. రేట్ల కోత ప్రభావం ఎంసీఎల్ఆర్లో పూర్తిగా ప్రతిబింబించడానికి కనీసం రెండు త్రైమాసికాలు పట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. బ్యాంకులు తమ వ్యయాలను సర్దుబాటు చేయడానికి, రేట్ల తగ్గింపు ప్రయోజనాలను రుణగ్రహీతలకు బదిలీ చేయడానికి కొంత సమయం వేచిచూడాల్సి ఉంటుంది. ఫలితంగా ఎంసీఎల్ఆర్ లింక్డ్ లోన్లు తీసుకున్నవారు తమ ఈఎంఐలు తగ్గాలంటే మరికొంత కాలం ఆగాలి.ఇదీ చదవండి: టార్గెట్ ఎఫ్డీఐ.. విధానాల సవరణకు యోచన!డిపాజిట్లకు సవాల్..వడ్డీరేట్ల తగ్గింపు డిపాజిట్ల పరంగా బ్యాంకులకు సవాలుగా మారుతుంది. రుణ రేట్లు తగ్గుతాయని భావిస్తున్నప్పటికీ డిపాజిట్లపై అందించే వడ్డీ రేట్లను కూడా బ్యాంకులు నిర్వహించాల్సి ఉంటుంది. డిపాజిట్ రేట్లను వెంటనే తగ్గించడం వల్ల బ్యాంకులు డిపాజిటర్లను ఆకర్షించడం, వారిని నిలుపుకోవడం కష్టతరం అవుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. వినియోగదారులు తమ పొదుపుపై మంచి రాబడిని కోరుకునే ఇతర మార్గాలను ఎంచుకుంటారని విశ్లేషిస్తున్నారు. -
లిక్విడిటీ లోటు రూ.3 లక్షల కోట్లు
భారతీయ బ్యాంకింగ్(Banking) వ్యవస్థలో లిక్విడిటీ లోటు గరిష్ఠ స్థాయికి చేరింది. తాజాగా ఈ లోటు ఏకంగా రూ.3 లక్షల కోట్లకు పైగా పెరిగింది. అమెరికా డాలర్(US Dollar)తో పోలిస్తే రూపాయి విలువ గణనీయంగా పడిపోతుండడం, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు అధికమవడం, యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలు లిక్విడిటీ తగ్గడానికి కారణమవుతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.లిక్విడిటీ లోటుకు కొన్ని కారణాలను మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. డాలర్తో పోలిస్తే భారీగా పడుతున్న రూపాయి విలువను కాపాడేందుకు ఆర్బీఐ తన వద్ద ఉన్న డాలర్లను విక్రయిస్తోంది. పన్ను చెల్లింపులకు సంబంధించిన అవుట్ ఫ్లోలు కూడా లిక్విడిటీ లోటు పెరిగేందుకు కారణమవుతున్నాయి. ఆర్బీఐ వద్ద ప్రభుత్వ నగదు నిల్వలు పెరగడం పరిస్థితిని మరింత తీవ్రతరం చేసింది.ఆర్బీఐ స్పందన..లిక్విడిటీ సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఆర్బీఐ విభిన్న చర్యలు తీసుకుటోంది. ఆర్బీఐ వేరియబుల్ రెపో రేటు (వీఆర్ఆర్-షార్ట్టర్మ్లో బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ పెంచేందుకు ఆర్బీఐ అప్పులు ఇవ్వడం) ఆక్షన్లను పెంచింది. బ్యాంకింగ్ వ్యవస్థలోకి లిక్విడిటీని చొప్పించడానికి రోజువారీ వేలం నిర్వహిస్తుంది. జనవరి 23న ఆర్బీఐ రూ.3.15 లక్షల కోట్లను వ్యవస్థలోకి చొప్పించింది. బ్యాంకు నిల్వల నిర్వహణలో అంతరాన్ని సర్దుబాటు చేసిన తర్వాత కూడా లోటు రూ.3.3 లక్షల కోట్లకు పైగానే ఉంది.ఇదీ చదవండి: ఫుడ్ కేటరింగ్ పునరుద్ధరణకు భాగస్వామ్యంనగదు నిల్వల నిష్పత్తిని (CRR) నికర డిపాజిట్లలో 4 శాతానికి తగ్గించిన ఆర్బీఐ బ్యాంకింగ్ వ్యవస్థలోకి దాదాపు రూ.1.16 లక్షల కోట్ల లిక్విడిటీని ఇటీవల విడుదల చేసింది. ఇది కూడా లిక్విడిటీ లోటు సమస్యకు కారణమని కొందరు అంచనా వేస్తున్నారు. ఈ తరుణంలో వచ్చే నెలలో జరగనున్న ఆర్బీఐ మానిటరీ పాలసీ సమావేశం కీలకంగా మారనుంది. -
రూ.7,409 కోట్ల విలువైన 2,000 నోట్లు ఇంకా ప్రజల్లోనే..
ముంబై: ఉపసంహరించిన రూ. 2000 డినామినేషన్ బ్యాంకు నోట్లలో 97.92 శాతం బ్యాంకింగ్ వ్యవస్థకు తిరిగి వచ్చాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గురువారం తెలిపింది. ప్రజల వద్ద ఇప్పటికీ రూ.7,409 కోట్ల విలువైన నోట్లు ఉన్నాయని పేర్కొంది. రూ. 2000 డినామినేషన్ నోట్లను చెలామణి నుండి ఉపసంహరించుకుంటున్నట్లు 2023 మే 19న ఆర్బీఐ ప్రకటించింది. ఉపసంహరణ ప్రకటించిన గత ఏడాది మే 19న బిజినెస్ వ్యవహార సమయం ముగిసే సమయానికి చెలామణిలో ఉన్న రూ. 2000 నోట్ల మొత్తం విలువ రూ. 3.56 లక్షల కోట్లు. ఈ ఏడాది జూలై 31న ఇదే సమయానికి ఈ విలువ రూ.7,409 కోట్లకు తగ్గింది. రూ. 2000 నోట్లను డిపాజిట్ చేయడం, లేదా మార్చుకునే సౌకర్యం దేశంలోని అన్ని బ్యాంక్ బ్రాంచ్లలో 2023 అక్టోబర్ 7 వరకు అందుబాటులో ఉంది. అటుపై 2023 అక్టోబర్ 9వ తేదీ నుండి ఆర్బీఐ ఇష్యూ కార్యాలయాలు వ్యక్తులు, సంస్థల నుండి రూ. 2000 నోట్లను స్వీకరిస్తున్నాయి. ప్రజలు రూ. 2000 నోట్లను ఇండియా పోస్ట్ ద్వారా దేశంలోని ఏదైనా పోస్టాఫీసు నుండి తమ బ్యాంకు ఖాతాలకు జమ చేయడానికి ఆర్బీఐ ఇష్యూ కార్యాలయాలకు పంపడానికి తగిన సౌలభ్యతను కూడా కలి్పంచడం జరిగింది. 2016 నవంబర్లో అప్పుడు అమలులో ఉన్న రూ.1000, రూ.500 నోట్ల రద్దు తర్వాత రూ. 2000 నోట్లను ప్రవేశపెట్టడం జరిగింది. -
97.5% రూ.2,000 నోట్లు వచ్చేశాయ్..!
ముంబై: బ్యాంకింగ్ వ్యవస్థలోకి 97.5 శాతం రూ.2,000 బ్యాంక్ నోట్లు తిరిగి వచ్చేసినట్లు బ్యాంకింగ్ రెగ్యులేటర్– రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పేర్కొంది. ఇంకా ప్రజాబాహుళ్యంలో రూ.8,897 కోట్ల విలువైన రూ.2,000 నోట్లు ఉన్నట్లు పేర్కొంది. ‘‘రూ. 2,000 బ్యాంకు నోట్ల ఉపసంహరణ ప్రకటించిన 2024 మే 19న వ్యాపారం ముగిసే సమయానికి చెలామణిలో ఉన్న రూ. 2,000 బ్యాంకు నోట్ల మొత్తం విలువ రూ. 3.56 లక్షల కోట్లు. 2024 జనవరి 31వ తేదీన వ్యాపారం ముగిసే సమయానికి ఈ విలువ రూ. రూ.8,897 కోట్లకు తగ్గింది’’ అని ఆర్బీఐ తాజా ప్రకటన వివరించింది. -
డిపాజిటర్ల డబ్బు పరిరక్షణే పవిత్ర విధి
ముంబై: డిపాజిటర్లు కష్టపడి సంపాదించిన డబ్బును రక్షించడం బ్యాంకర్కు పవిత్రమైన విధి అని, ఇది మతపరమైన స్థలాన్ని సందర్శించడం కంటే చాలా ముఖ్యమైనదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. చిన్న పొదుపుదారులు, మధ్యతరగతి, పదవీ విరమణ చేసిన వారి నుండి సమీకరించిన డిపాజిట్లపై మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థ ఆధారపడి ఉన్న నేపథ్యంలో ఈ డబ్బు పరిరక్షణే ప్రధాన పవిత్ర విధిగా భావించాలని ఆయన అన్నారు. ‘‘డిపాజిటర్ల డబ్బును రక్షించడం బ్యాంకు అతి ముఖ్యమైన బాధ్యత. ఇది పవిత్రమైన విధి. గుడి లేదా మసీదు లేదా గురుద్వారాకు నమస్కరించడం కంటే.. డిపాజిటర్ల సొమ్మును పరిరక్షించడం ఎంతో పవిత్రమైన విధి’’ దాస్ అన్నారు. బ్యాంకింగ్ రంగంలోని ప్రతి ఒక్కరిపై ఉన్న ‘‘అతిపెద్ద బాధ్యత ఇది’’ అని ఇక్కడ నిర్వహించిన అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకు (యుసీబీ) డైరెక్టర్ల సమావేశాన్ని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు. దాస్ ఆగస్టు 30వ తేదీన ఈ మేరకు చేసిన ఒక ప్రసంగాన్ని ఆర్బీఐ సోమవారం యూట్యూబ్లో అప్డేట్ చేసింది. ఆయన ప్రసంగంలోని మరికొన్ని ముఖ్యాంశాలు... ► డిపాజిటర్ల డబ్బు సురక్షితంగా ఉందని నిర్ధారించడానికి అన్ని బ్యాంకులతో కలిసి పనిచేయడం రిజర్వ్ బ్యాంక్ బాధ్యత. అందువల్ల ఈ దిశలో సెంట్రల్ బ్యాంక్ ప్రయత్నాలు ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటాయి. నిబంధనలు, పర్యవేక్షణ చర్యలు కొనసాగుతూనే ఉంటాయి. ► ఇక్కడ ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అంశం ఏమిటంటే... సహకార బ్యాంకింగ్ రంగంలో సంస్థలు ఎదుర్కొంటున్న సవాళ్ల కారణంగా డిపాజిటర్ సొమ్ము నిలిచిపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇలాంటి కేసుల్లో చాలా వరకూ నిర్వహణలో అక్రమాలే ప్రధాన కారణం. ఇక్కడ మనం యూసీబీ.. పంజాబ్ అండ్ మహారాష్ట్ర బ్యాంక్ను ప్రస్తావించుకోవచ్చు. ► 1,500 పైగా సంస్థలపై మెరుగైన నియంత్రణ, పర్యవేక్షణ చేయాలన్న ప్రధాన దృక్పథంతో యూసీబీల కోసం ఆర్బీఐ నాలుగు అంచెల పర్యవేక్షణా యంత్రాంగాన్ని రూపొందించింది. ► ఆర్థిక వ్యవస్థ సజావుగా సాగేందుకు మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థ స్థిరంగా ఉండాలి. ఆర్థిక వ్యవస్థలో యూసీబీలు ముఖ్యమైన భాగం. ► యూసీబీలపై ఆర్బీఐ పర్యవేక్షణను పటిష్టం చేయడాన్ని... ఆయా సంస్థలు తమ వృద్ధికి ఆటంకాలు కలిగించే ప్రయత్నంగా చూడవద్దు. యూసీబీల మొండిబకాయిలపై హెచ్చరిక అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులలో స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి (జీఎన్పీఏ) 8.7 శాతంగా ఉన్న విషయాన్ని గవర్నర్ ప్రస్తావిస్తూ, దీనిపట్ల సెంట్రల్ బ్యాంక్ ‘‘సౌఖ్యంగా లేదు’’ అని స్పష్టం చేశారు. షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల జీపీఎన్ఏలు 2023 మార్చిలో దశాబ్దపు అత్యుత్తమ స్థాయి 3.9 శాతానికి చేరుకున్నాయని, మరింత మెరుగుపడతాయన్న అంచనాలూ ఉన్నాయని ఈ సందర్భంగా అన్నారు. ఎన్పీఏల సమస్యను మెరుగుపరచడానికి యూసీబీలూ తగిన కృషి చేయాలని కోరారు. అలాగే యూసీబీలు పాలనా ప్రమాణాలను మెరుగుపరచాలని, డైరెక్టర్లు, అధికారుల వంటి బ్యాంకు నిర్వహణా సంబంధ పార్టీ లావాదేవీలను నివారించాలని, రుణ సమస్యలు తలెత్తకుండా చూడాలని ఆయన కోరారు. యూసీబీలు ఇటీవలి కాలంలో బహుళ సవాళ్లను ఎదుర్కొంటున్నాయని దాస్ పేర్కొన్నారు. మున్ముందు యూసీబీ సెగ్మెంట్.. డిజిటల్, ఫిన్టెక్, నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు, సూక్ష్మ రుణదాతలు వంటి టెక్–అవగాహన సంస్థల నుండి తీవ్ర పోటీని ఎదుర్కొననుందని, అందువల్ల సాంకేతికతపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని దాస్ చెప్పారు. అయితే ఈ రంగంలో కొన్ని బ్యాంకులు తగిన విధంగా పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. -
బ్యాంకుల్లో నగదు కొరత: నాలుగేళ్ల గరిష్టానికి!
India banking liquidity deficit: దేశీయ బ్యాంకింగ్ సిస్టమ్ లిక్విడిటీ కొరతపై రిపోర్ట్ ఒకటి ఆందోళన రేపుతోంది. ఈ ఏడాదిలో ఈ నెల (సెప్టెంబరు) 20నాటికి బ్యాంకింగ్ లిక్విడిటీ లోటు రూ. 1.46 లక్షల కోట్ల వద్ద నాలుగేళ్ల గరిష్ట స్థాయికి చేరుకుందని రాయిటర్స్ నివేదించింది. ఈ ఆర్థిక సంవత్సరం ఆగస్టులో తొలిసారిగా దేశీయ బ్యాంకుల్లో లిక్విడిటీ లోటులోకి జారుకుంది. నివేదిక ప్రకారం, ఏప్రిల్ 23, 2019 తర్వాత ఇదే అత్యధిక సింగిల్ డే కొరత. మే 19 , జూలై 28 మధ్య స్వీకరించిన ఇంక్రిమెంటల్ డిపాజిట్లలో 10శాతం ఇన్క్రిమెంటల్ క్యాష్ రిజర్వ్ రేషియో (ICRR)గా పక్కన పెట్టాలని ఆర్బీఐ ఆదేశించిన తరువాత ఈ పరిణామం వెలుగులోకి వచ్చింది. ఫలితంగా బ్యాంకులవద్ద మిగులు నగదు నిల్వ తగ్గింది. అయితే ముందుస్తు పన్ను చెల్లింపలు, జీఎస్టీ చెల్లింపులతో నగదు కొరతకు దారితీశాయనిపేర్కొంది. (భారత్-కెనడా ఉద్రిక్తతలు: ఆనంద్ మహీంద్ర సంచలన నిర్ణయం) ఈ క్రమంలోనే బ్యాంకులు ఎంఎస్ఫ్ (మార్జినల్ స్టాండింగ్ సదుపాయం) కింద రికార్డు స్థాయిలో రూ. 1.97 లక్షల కోట్ల రుణాలు, అలాగే ప్రత్యేక డిపాజిట్ సౌకర్యం కింద దాదాపు రూ. 46,724 కోట్లను నిలిపివేసినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది.రూ. 2.50 లక్షల కోట్ల వరకు మొత్తం బయటికి వచ్చే అవకాశం ఉందని అంచనా వేసినట్టు తెలిపింది. ఎందుకంటే అదే రిపోర్టింగ్ పక్షం రోజులలో జంట అవుట్ఫ్లోలు (ముందస్తు పన్ను చెల్లింపుల , జీఎస్టీ ) సంభవించాయని బ్యాంకర్లను ఉటంకిస్తూ రాయిటర్స్ పేర్కొంది. రూపాయిపై ఒత్తిడి డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ ఒడిదుడుకులతో వచ్చే ఇబ్బందులను, విజృంభిస్తున్న ద్రవ్యోల్బణం ముప్పును తప్పించుకోవడానికి బ్యాంకులకు ఆర్బీఐ విధించిన ఇంక్రిమెంటల్ క్యాష్ రిజర్వ్ రేషియో (ఐసీఆర్ఆర్) సైతం నగదు లోటుకు దారితీసిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయిప్పుడు. ఈ ఏడాది ఆగస్టు ద్రవ్యసమీక్షలో ఆర్బీఐ ఐసీసీఆర్ను పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే బ్యాంకులు తమ ఇంక్రిమెంటల్ డిపాజిట్లలో 10 శాతాన్ని పక్కనబెట్టాలని ఆదేశించింది.. కాగా, ఇంచుమించుగా వచ్చే నెల మొదటి వారం వరకు బ్యాంకులు ఇదే రకమైన ఒత్తిడిని ఎదుర్కోవచ్చన్న అంచనాను కొటక్ మహీంద్రా బ్యాంక్ ప్రధాన ఆర్థికవేత్త ఉపాసన భరద్వాజ్ వెలిబుచ్చారు. అంతేకాకుండా, డాలరు మారకంలో రూపాయిపై ఈ ఒత్తిడి కొనసాగితే, RBI ద్వారా FX జోక్యంతో మరింత ముప్పు ఉండే అవకాశం ఉందని ఫస్ట్ బ్యాంక్ ఆర్థికవేత్త గౌరా సేన్ గుప్తా రాయిటర్స్తో వ్యాఖ్యానించారు. ఐసీఆర్ఆర్తోపాటు, ఆగస్టు నాటి ద్రవ్యసమీక్షలో ఆర్బీఐ ఐసీసీఆర్ను విధింపుతో లిక్విడిటీ బిగుతు పెరుగుతోందంటున్నారు రూపాయిపై ఒత్తిడి ,అంతర్లీన ద్రవ్యోల్బణ నష్టాలను కూడా నిరోధించవచ్చని, స్వల్పకాలిక రేట్లను పెంచడానికి బదులుగా ఆర్బీఐ RBI సమీప కాలంలో ద్రవ్యతను కఠినంగా ఉంచుతుందని భావిస్తున్నారు కోటక్ మహీంద్రా బ్యాంక్ చీఫ్ ఎకనామిస్ట్ ఉపాస్నా భరద్వాజ్. ఈ నెలాఖరు నాటికి ద్రవ్యలోటు తగ్గుతుందని ఆమె తెలిపారు. లిక్విడిటీ లోటు అంటే సరళంగా చెప్పాలంటే, లిక్విడిటీ అంటే ఎంత నగదు తక్షణమే అందుబాటులో ఉంది లేదా ఎంత త్వరగా నగదును పొందగలరు అనేది. ఉదాహరణకు, సేవింగ్స్ ఖాతా కంటే ఐదేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్ లిక్విడిటీ తక్కువగా ఉంటుంది. అదే సేవింగ్స్ ఖాతా నుంచి అయితే మనకు అవసరమైనప్పుడు నగదు తీసుకోవచ్చు.బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ అంటే బ్యాంకుల స్వల్పకాలిక వ్యాపారం, ఆర్థిక అవసరాలను తీర్చడానికి ఎంత నగదు తక్షణమే అందుబాటులో ఉంది అనేది. -
కస్టమర్కు ప్రాధాన్యం ఇవ్వండి
ముంబై: వినియోగదారు ఆధారిత ప్రాధాన్య విధానాన్ని అనుసరించాలని బ్యాంకులు, ఆర్థిక సేవల సంస్థలకు ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ జే స్వామినాథన్ సూచించారు. తద్వారా బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకాన్ని బలోపేతం చేయవచ్చన్నారు. బ్యాంకుల కస్టమర్ సరీ్వస్ ఇన్చార్జ్లు, ఎండీ, ఈడీ తదితర ఉన్నతాధికారులతో గురువారం సమావేశం నిర్వహించారు. కస్టమర్ల ఫిర్యాదులను కచి్చతంగా పరిష్కరించడం, ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని క్రమబదీ్ధకరించడం, కస్టమర్లకు మెరుగైన అనుభవాన్ని అందించేందుకు, మోసాల నివారణ, నష్టాలను తగ్గించుకునేందుకు టెక్నాలజీని వినియోగించుకోవడంపై సమావేశంలో చర్చ జరిగినట్టు ఆర్బీఐ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆర్థిక వ్యవస్థ పట్ల నమ్మకం, విశ్వాసాన్ని పెంచడంతో కస్టమర్ సేవలు కీలక పాత్ర పోషిస్తాయని ఈ సందర్భంగా స్వామినాథన్ పేర్కొన్నారు. కస్టమర్ సేవలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఫిర్యాదులకు అసలు మూల కారణాలు, స్వీకరించిన అధికారే నేరుగా పరిష్కరించడం తదితర ఐదు అంశాలపై దృష్టి పెట్టాలని కోరారు. -
జాతి క్షేమాన్ని మించిన పదవీ కాంక్ష..
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సారథ్యంలోని గత యూపీఏ ప్రభుత్వం అధికార వ్యామోహంతో జాతి ప్రయోజనాలను పక్కనబెట్టిందని, బ్యాంకింగ్ వ్యవస్థను నాశనం చేసిందని ప్రధాని మోదీ ఆరోపించారు. తమ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థలను తిరిగి గాడినపెట్టిందని చెప్పారు. శనివారం ప్రధాని మోదీ రోజ్గార్ మేళాను వర్చువల్గా ప్రారంభించి, మాట్లాడారు. కార్యక్రమంలో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో 70వేల మందికి నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ప్రధాని ప్రసంగించారు. ‘ఆ ఒక్క కుటుంబానికి సన్నిహితులైన కొందరు రాజకీయ నేతలు బ్యాంకుల నుంచి తమ వారికి వేల కోట్ల రూపాయలను ఇప్పించి, ఎప్పటికీ తిరిగి చెల్లించేవారు కాదు. అప్పట్లో జరిగిన ఫోన్ బ్యాంకింగ్ స్కాం అతిపెద్ద కుంభకోణం. అది దేశ బ్యాంకింగ్ వ్యవస్థ వెన్ను విరిచేసింది’అని ప్రధాని తెలిపారు. ఇప్పుడు అందరూ ఫోన్ బ్యాంకింగ్ను వాడుకుంటున్నారు. కానీ, అప్పట్లో జరిగింది వేరని వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే పటిష్టమైన బ్యాంకింగ్ వ్యవస్థ ఉన్న దేశాల్లో భారత్ కూడా ఉందన్నారు. తమ ప్రభుత్వం తీసుకున్న బ్యాంకుల నిర్వహణను బలోపేతం చేయడం, బ్యాంకులను విలీనం చేయడం, ఈ రంగంలో వృత్తినైపుణ్యంను పెంచడం వంటి అనేక చర్యలతో ఇది సాధ్యమైందని వివరించారు. గతంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు వేలాది కోట్ల నిరర్ధక ఆస్తులతో కునారిల్లుతూ ఉండేవి. కానీ, నేడవి రికార్డు స్థాయిలో లాభాలను ఆర్జిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజలకు సేవలందించడంలో, ముద్ర వంటి వివిధ ప్రభుత్వ పథకాలను అమలు చేయడంలో బ్యాంకింగ్ రంగ ఉద్యోగులు శ్రమిస్తున్న తీరు, నిబద్ధతలను ఆయన కొనియాడారు. వాతావరణ కార్యాచరణలో భారత్ ముందుంది పణజి: వాతావరణ కార్యాచరణలో భారతదేశం ముందుండి నడిపిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. హరితాభివృద్ధి, ఇంధన పరివర్తన వంటి వాతావరణ పరిరక్షణ హామీలను ఒక్కటొక్కటిగా నెరవేరుస్తోందని అన్నారు. శనివారం ప్రధాని గోవాలో జరుగుతున్న జీ20 కూటమి దేశాల ఇంధన మంత్రుల సమావేశాన్ని ఉద్దేశించి వర్చువల్గా మాట్లాడారు. స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యంలో 50 శాతం మృత్తికేతర ఇంధన వనరుల నుంచి 2030నాటికి సాధించాలన్న లక్ష్యం కోసం భారత్ ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. పవన, సౌర విద్యుదుత్పాదనలో సైతం అగ్రగామి దేశాల సరసన భారత్ నిలిచిందని తెలిపారు. వీటితోపాటు తక్కువ వడ్డీకే రుణాలివ్వడం ద్వారా అభివృద్ధి చెందుతున్న దేశాలకు చేయూతనివ్వాల్సిన బాధ్యత ఉందని చెప్పారు. ‘సాంకేతికతలో అంతరాలను పూడ్చటం, ఇంధన భద్రత పెంపు, సరఫరా గొలుసుల్లో వైవిధ్యత వంటివాటి కోసం నూతన మార్గాలను అన్వేషించాల్సి ఉంది. భవిష్యత్తు ఇంధనాల కోసం సహకారాన్ని బలోపేతం చేసుకోవాల్సి ఉంది. ఇంధన భద్రతను పెంచుకునేందుకు దేశాల మధ్య గ్రిడ్లు, అనుసంధానతలపై దృష్టి సారించాలి. పరస్పరం అనుసంధానించిన గ్రీన్గ్రిడ్లు గొప్ప మార్పును తీసుకువస్తాయి’అని ప్రధాని మోదీ అన్నారు. వీటివల్ల వాతావరణ లక్ష్యాలు, హరిత పెట్టుబడుల సాధన, కోట్లాదిమందికి హరిత ఉద్యోగావకాశాల కల్పనకు వీలవుతుందని తెలిపారు. ‘ఇంధనం లేనిదే అభివృద్ధి, భవిష్యత్తు స్థిరత్వంపై చర్చ పూర్తికాదు. వ్యక్తుల నుంచి దేశాల వరకు అభివృద్ధిలో అన్ని స్థాయిల్లోనూ ఇంధన కీలకంగా మారిందని పేర్కొన్నారు. -
భారత్ ఆర్థిక వ్యవస్థ పటిష్టం
ముంబై: భారత్ ఎకానమీ పటిష్టంగా, నిలకడగా పురోగమిస్తోందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఫైనాన్షియల్ స్టెబిలిటీ నివేదిక (ఎఫ్ఎస్ఆర్) ఉద్ఘాటించింది. తగిన మూలధనం, అలాగే మొండిబకాయిలు (ఎన్పీఏ) బహుళ సంవత్సర కనిష్ట స్థాయికి తగ్గుతూ కొనసాగుతున్న పటిష్ట బ్యాంకింగ్ వ్యవస్థ, ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు వంటి ఆర్థిక మూలస్తంభాల పటిష్టత వంటి అంశాలు ఎకానమీకి వెన్నుదన్నుగా నిలుస్తున్నట్లు నివేదిక వివరించింది. ఈ మేరకు ఆర్థిక స్థిరత్వం, అభివృద్ధి మండలి (ఎఫ్ఎస్డీసీ) సబ్–కమిటీ ఇచి్చన నివేదికలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ముందుమాట రాస్తూ, అంతర్జాతీయంగా తీవ్ర అనిశ్చితి నెలకొన్నప్పటికీ, భారత్ ఎకానమీ పటిష్ట రికవరీ బాటన పయనిస్తోందన్నారు. ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఎకానమీల్లో ఒకటి నిలుస్తోందని పేర్కొన్నారు. ఆర్థిక స్థిరత్వం అనే అంశంపై రాజీపడే ప్రశ్నేలేదని, ఈ వ్యవస్థలోని అన్ని స్థాయిల్లోని వారు ఇందుకు తగిన కృషి చేయాలని అన్నారు. సవాళ్లను ఎదుర్కొనడానికి ఇది అవసరమనీ ఉద్ఘాటించారు. నివేదికలోని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ► 2018 మార్చిలో బ్యాంకింగ్ వ్యవస్థలో స్థూల మొండి బకాయిలు, నికర మొండిబకాయిలు వరుసగా 11.5 శాతం, 6.1 శాతాలుగా ఉన్నాయి. 2023 మార్చిలో ఇవి వరుసగా 3.9 శాతం, 1 శాతానికి తగ్గాయి. ► రిటర్న్ ఆన్ అసెట్స్ (ఆర్ఓఏ) 2018లో కనిష్ట స్థాయి – 0.2 శాతం నుండి 2023లో 1.1 శాతానికి పెరగడంతో బ్యాంకింగ్ వ్యవస్థ లాభదాయకత మెరుగుపడింది. ► బ్యాంకింగ్ బ్యాలెన్స్ షీట్మెరుగుపడ్డం విస్తృత స్థాయిలో అన్ని రంగాలకూ బ్యాంకింగ్ రుణ వృద్ధినీ పెంచుతోంది. ► 2022–23లో బ్యాంకింగ్ డిపాజిట్ల వృద్ధి 10 శాతం. 2023 జూన్ తొలి నాళ్లలో ఈ రేటు 11.8 శాతానికి పెరిగింది. రూ.2000 నోట్ల ఉపసంహరణా దీనికి ఒక కారణం. ► రిటైల్ రుణాలు మార్చి 2021 నుండి మార్చి 2023 వరకు 24.8 శాతం వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్)ను నమోదుచేసుకున్నాయి. స్థూలంగా చూస్తే ఈ వృద్ధి రేటు 13.8 శాతంగా ఉంది. ► సైబర్ దాడులు, వాతావరణ మార్పు వంటి ఇతర సవాళ్లను పరిష్కరించడానికి అంతర్జాతీయ పరస్పర సహకారం అవసరం. ► జీ 20కి భారత్ నేతృత్వం వహిస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రపంచ దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి తగిన కృషి చేస్తుంది. ‘ఒక భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు’ థీమ్తో సవాళ్లపై పోరాటానికి దేశాల మధ్య పరస్పర సహకారానికి, సమన్వయ చర్యలకు భారత్ ప్రయతి్నస్తుంది. -
బలహీన విధానాలతోనే బ్యాంకింగ్ సంక్షోభం
ముంబై: బలహీన వ్యాపార విధానాలే అమెరికాలో బ్యాంకింగ్ సంక్షోభానికి కారణమై ఉండొచ్చని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ అన్నారు. ఈ నేపథ్యంలో దేశీయ బ్యాంకుల వ్యాపార విధానాలను తాము సునిశితంగా పరిశీలిస్తున్నట్టు చెప్పారు. అదే సమయంలో భారత బ్యాంకులు బలంగానే ఉన్నట్టు స్పష్టం చేశారు. అమెరికాలో ఇటీవలే సిలికాన్ వ్యాలీ బ్యాంకులో నిధుల సమస్య తలెత్తడం తెలిసిందే. డిపాజిటర్లలో అభద్రతకు దారితీసి, ఆ ప్రభావం ఇతర బ్యాంకులకూ విస్తరించడం తెలిసిందే. ఈ క్రమంలో శక్తికాంతదాస్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. ‘‘అమెరికాలో ఇటీవలి పరిణామాలు చూస్తే అక్కడ విడిగా ఒక్కో బ్యాంకుల వారీ వ్యాపార విధానాలు సరిగ్గానే ఉన్నాయా? లేవా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. భారత బ్యాంకుల వ్యాపార విధానాలను ఆర్బీఐ మరింత పరిశీలనగా చూడడం మొదలు పెట్టింది. ఒకవేళ లోపాలు ఉంటే అది సంక్షోభానికి దారితీయవచ్చు’’అని శక్తికాంతదాస్ చెప్పారు. ముంబైలో ఓ అంతర్జాతీయ సదస్సును ప్రారంభించిన సందర్భంగా దాస్ ఈ అంశంపై మాట్లాడారు. ‘‘బ్యాంకులు అనుసరించే వ్యాపార విధానాల వల్ల కొన్ని సందర్భాల్లో వాటి బ్యాలెన్స్ షీట్లలోని కొన్ని భాగాల్లో సమస్యలు ఏర్పడొచ్చు. అవి ఆ తర్వాత పెద్ద సంక్షోభానికి కారణం కావచ్చు. అమెరికా, యూరప్ బ్యాంకింగ్లో ఇటీవలి పరిణామాలు గమనిస్తే వాటి బ్యాలెన్స్ షీట్లలో సురక్షిత ఆస్తులు అనుకున్న వాటి నుంచే సమస్యలు ఎదురవుతున్నాయని తెలుస్తోంది’’అని దాస్ పేర్కొన్నారు. అమెరికాలో సిలికాన్ వ్యాలీ బ్యాంకు సంక్షోభానికి ఆస్తుల, అప్పుల మధ్య అసమతుల్యత వల్లేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతుండడం తెలిసిందే. -
బ్యాంకింగ్ మ్యూచువల్ ఫండ్స్కు నష్టాలు
న్యూఢిల్లీ: అమెరికా బ్యాంకుల సంక్షోభం మన దేశంలో బ్యాంకింగ్ స్టాక్స్పై ప్రభావం చూపిస్తోంది. ఫలితంగా బ్యాంకింగ్ స్టాక్స్లో పెట్టుబడులు పెట్టే పథకాల విలువ గత వారంలో సుమారు 6 శాతం క్షీణించింది. అమెరికాలో సిలికాన్ వ్యాలీ బ్యాంక్ కుప్పకూలిపోవడం, ఆ తర్వాత సిగ్నేచర్ బ్యాంక్ కూడా సంక్షోభంలో పడిపోవడం.. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సేవల రంగంపై ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దెబ్బతీసేలా చేసింది. స్విట్జర్లాండ్కు చెందిన క్రెడిట్ సూసె సైతం నిధుల కటకటను ఎదుర్కోగా.. ఏకంగా ఆ దేశ కేంద్రబ్యాంక్ జోక్యం చేసుకుని నిధులు సమకూరుస్తామని హామీ ఇవ్వా ల్సి వచ్చింది. ఈ పరిణామాలతో మన దేశ బ్యాంక్ స్టాక్స్ 3–13 శాతం మధ్యలో నష్టపోయాయి. ప్రభావం పెద్దగా ఉండదు.. కానీ విదేశాల్లో బ్యాంకుల సంక్షోభాల ప్రభావం నేరుగా మన బ్యాంకులపై ఏమీ ఉండదని నిపుణులు చెబుతున్నారు. బ్యాంకింగ్ రంగ మ్యూచువల్ ఫండ్స్లో 16 పథకాలు ఉంటే, ఇవన్నీ కూడా మార్చి 17తో ముగిసిన వారంలో 1.6–6 శాతం మధ్య నష్టాలను చూశాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు చూస్తే వీటిల్లో నికర నష్టం 8–10% మధ్య ఉంది. ఇలా నష్టపోయిన వాటిల్లో ఆదిత్య బిర్లా సన్లైఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్, టాటా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్, హెచ్డీఎఫ్సీ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్, ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్, నిప్పన్ ఇండియా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్ ఉన్నాయి. అయితే, ఏడాది కాలంలో ఈ పథకా లు నికరంగా 12 శాతం రాబడిని ఇవ్వడం గమనించొచ్చు. ‘‘స్టాక్ మార్కెట్లలో అస్థిరతలు, వడ్డీ రేట్ల పెరుగుదల ఈ థీమ్యాటిక్ ఫండ్స్ నష్టపోవడానికి కారణాలుగా ఫయర్స్ రీసెర్చ్ హెడ్ గోపాల్ కావలిరెడ్డి తెలిపారు. వడ్డీ రేట్ల పెరుగుదల తర్వాత తక్కు వ వడ్డీ మార్జిన్లు, నిధుల వ్యయాలు పెరగడం, రుణాల వృద్ధిపై ప్రభావం పడినట్టు చెప్పారు. -
డాయిష్ బ్యాంక్ 14% డౌన్
ఫ్రాంక్ఫర్ట్: అంతర్జాతీయంగా బ్యాంకింగ్ వ్యవస్థ సంక్షోభంపై ఆందోళన నెలకొన్న నేపథ్యంలో జర్మనీకి చెందిన డాయిష్ బ్యాంక్ షేర్లపైనా ప్రభావం పడింది. బ్యాంకు షేర్లు శుక్రవారం ఒక దశలో 14 శాతం క్షీణించాయి. ఆ తర్వాత కొంత కోలుకుని సుమారు 9 శాతం క్షీణతతో 8.52 యూరోల వద్ద ట్రేడయ్యాయి. బాండ్లను బీమా చేసేందుకయ్యే వ్యయాలు పెరిగిపోవడం డాయిష్ బ్యాంక్ పరిస్థితిపై ఆందోళనకు కారణమైనట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇటీవల స్విస్ బ్యాంక్ క్రెడిట్ సూసీ పతనానికి ముందు కూడా ఇలాంటి పరిణామమే చోటు చేసుకోవడం గమనార్హం. అయితే డాయిష్ బ్యాంక్ మరో క్రెడిట్ సూసీ కావచ్చన్న ఆందోళనలను జర్మనీ చాన్స్లర్ ఒలాఫ్ షోల్జ్ తోసిపుచ్చారు. బ్యాంక్ పటిష్టంగానే ఉందని స్పష్టం చేశారు. -
అదానీ-హిండెన్బర్గ్ వివాదం: ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు
సాక్షి,ముంబై: అదానీ గ్రూపు- హిండెన్బర్గ్ రిపోర్ట్ వివాదం నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ పరోక్షంగా స్పందించారు. అదానీ గ్రూప్ పేరును నేరుగా ప్రస్తావించకుండానే అదానీ గ్రూప్పై ఆరోపణలు, బ్యాంకింగ్ రంగంపై ప్రభావంపై గవర్నర్ శక్తికాంత దాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగత సంఘటన లేదా కేసు ద్వారా బ్యాంకులు ప్రభావితం అయ్యే అవకాశం లేదని అన్నారు. భారత బ్యాంకింగ్ వ్యవస్థ బలంగా ఉందని, మరింత బలోపేతం చేసుకునేందుకే చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆర్బీఐ పాలసీ ప్రకటనల అనంతరం విలేకరుల సమావేశంలో శక్తికాంత దాస్మాట్లాడుతూ, నిర్దిష్ట కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా బ్యాంకులు రుణాలు ఇవ్వవని పేర్కొన్నారు. వాటి బలం, ఫండమెంటల్స్, నగదు ప్రవాహం, ఇతర అంశాల ఆధారంగా రుణాలు ఇస్తారని చెప్పారు. కార్పొరేట్ల కంపెనీల రుణాలపై మాట్లాడుతూ అన్ని బ్యాంకులు పెద్ద ఎక్స్పోజర్ మార్గదర్శకాలను పాటించాయని కూడా ఆయన స్పష్టం చేశారు. అలాగే సంక్షోభం అంచున ఉన్న అదానీ గ్రూప్కు ఇచ్చిన రుణాల గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన పని లేదని శక్తికాంత దాస్ పేర్కొన్నారు. దేశంలోని బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు నిలకడగా కొనసాగుతున్నాయని ప్రకటించరాఉ. -
ఎడ్యుకేషన్లోన్ కావాలా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..
విదేశాల్లో చదువుకుని, కెరీర్ను గ్రాండ్గా మొదలు పెట్టాలన్నది చైతన్య (24) డ్రీమ్. బీటెక్ చేసిన తర్వాత రెండేళ్లపాటు సాఫ్ట్వేర్ డెవలపర్గా పనిచేశాడు. ఫ్రాన్స్లోని మాంట్పెల్లియర్ బిజినెస్ స్కూల్లో ఎంఎస్సీ డిగ్రీ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్నాడు. డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ కోర్సుకు పాక్షికంగా స్కాలర్ షిప్ రావడంతో అతడు ఎంతో సంతోషించాడు. కానీ, అప్పుడే అసలు సవాలు ఎదురైంది. వచ్చిన స్కాలర్షిప్ కొద్ది మొత్తమే, మిగిలిన మొత్తాన్ని రుణం ద్వారా సమకూర్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. విద్యా రుణం సులభంగా లభిస్తుందని అనుకోవచ్చు. కానీ, ఆచరణలో ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. నెల రోజుల పాటు ప్రశాంతత కోల్పోయి అతడు చేసిన ప్రయత్నం ఫలించింది. ప్రతిష్టాత్మక విద్యా సంస్థలో సీటు కావడంతో బ్యాంకు విద్యా రుణానికి ఓకే చెప్పింది. అందుకే, విద్యా రుణం పొందడం అనుకున్నంత సులభం కాదు. రుణం ఇచ్చే సంస్థ అన్ని విషయాలను స్పృశిస్తుంది. ఎలా వ్యవహరిస్తే సులభంగా రుణం లభిస్తుంది? ఈ విషయంలో ఉన్న సవాళ్లు, వాటిని అధిగమించడంపై అవగాహన కల్పించే కథనమే ఇది. ఏటా వేలాది మంది భారత విద్యార్థులు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళుతున్నారు. విదేశాంగ శాఖ వద్దనున్న తాజా సమాచారం మేరకు.. కరోనా తర్వాత కూడా విదేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్యలో వృద్ధి కనిపిస్తోంది. 2021లో 11 లక్షల మంది భారత విద్యార్థులు విదేశీ చదువుల కోసం వెళ్లారు. 2024లో భారత్ నుంచి సుమారు 18 లక్షల మంది విదేశాల్లో ఉన్నత విద్యను ఎంపిక చేసుకోవచ్చని కన్సల్టెన్సీ సంస్థ రెడ్సీర్ అంచనా. వారు చేసే ఖర్చు వార్షికంగా 80 బిలియన్ డాలర్లు (రూ.6.16 లక్షల కోట్లు) ఉంటుందని ఈ సంస్థ పేర్కొంది. విద్యా రుణాన్ని నమ్ముకుని విదేశీ విద్యకు ప్లాన్ చేసుకునే వారు ముందుగానే ఇందుకు సంబంధించి వాస్తవ అంశాలను, పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాలి. క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా విచారించుకోవాలి. ‘‘ముఖ్యంగా బ్యాంకింగ్ రంగం విద్యా రుణాలను పరిమితంగానే మంజూరు చేస్తోంది. వచ్చిన ప్రతి దరఖాస్తుకు ఆమోదం చెప్పడం లేదు. గుర్తింపు పొందిన యూనివర్సిటీలు, విద్యా సంస్థల పూర్తి జాబితానే చాలా బ్యాంకుల వద్ద లేదంటే విద్యా రుణాల విషయంలో వాటికి ఎంత ఆసక్తి ఉందో అర్థం చేసుకోవచ్చు’’అని లాంచ్మైకెరీర్ అనే కెరీర్ కౌన్సెలింగ్ ప్లాట్ఫామ్ గ్లోబల్ లీడర్ సుష్మాశర్మ తెలిపారు. బ్యాంకును గుర్తించడం.. విద్యా సంస్థలు, దేశాలకు సంబంధించి పరిమితులు ఉన్నాయి. తమ ముందుకు వచ్చే ప్రతి విదేశీ విద్యా రుణ దరఖాస్తును బ్యాంకులు ఆమోదించవు. పైగా ఒక బ్యాంకుకు సంబంధించి కూడా అన్ని శాఖలు ఈ వ్యాపారం చూడడం లేదు. చైతన్య ముందుగా ఎన్బీఎఫ్సీ నుంచి రుణం తీసుకుందామని అనుకున్నాడు. సులభంగా, వేగంగా వస్తుందని అనుకుని కొన్ని ఎన్బీఎఫ్సీలను సంప్రదించాడు. కానీ, ఒక్కటంటే ఒక్కటీ చైతన్య సీటు సంపాదించిన యూనివర్సిటీ కోర్సులకు రుణాలను ఆఫర్ చేయడం లేదని తెలిసి ఆశ్చర్యపోయాడు. చివరికి ఎస్బీఐని సంప్రదించగా అతడి ప్రయత్నం ఫలించింది. అదీ మెయిన్ బ్రాంచ్కు వెళ్లాల్సి వచ్చింది. కావాల్సినంత రుణం.. విదేశీ విద్యా కోర్సు అంటే ఫీజులకే బోలెడు ఖర్చు అవుతుంది. ఇదే పెద్ద సవాలు. విదేశీ విద్యా సంస్థల్లో సీటు కోసం దరఖాస్తు చేసుకునే ముందే ట్యూషన్ పీజులతోపాటు అక్కడ నివసించేందుకు అయ్యే వ్యయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సుష్మాశర్మ సూచించారు. ఇక కావాల్సినంత రుణం లభించక, తాము సొం తంగా సమకూర్చుకోలేని సందర్భాల్లో విద్యార్థులు రాజీమార్గాలను అనుసరించడాన్ని గమనించొచ్చు. కావాల్సి నంత రుణం/నిధులు సమకూరని సందర్భంలో అవసరమైతే కోర్సును లేదంటే విద్యా సంస్థను మార్చే వారు కూడా ఉన్నట్టు ఫ్లై మాస్టర్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ ఎండీ రాజేష్ వర్మ తెలిపారు. ఉద్యోగ అవకాశాలు.. రుణం ఇచ్చే ముందు ఏ బ్యాంకు అయినా, మరో సంస్థ అయినా ఏం చూస్తుంది..? రుణం తీసుకున్న వ్యక్తికి తిరిగి చెల్లించే సామర్థ్యం ఉందా..? అనే కదా.. అలాగే, విద్యా రుణం విషయంలో బ్యాంకులు అభ్యర్థి చేస్తున్న కోర్సు, ఉద్యోగ మార్కెట్లో ఆ కోర్సుకు ఉన్న డిమాండ్ను పరిశీలిస్తాయి. ఇందులో భాగంగా విద్యార్థి చదవబోయే విద్యాసంస్థకు ఉన్న పేరు, గుర్తింపు, అందులో చదివిన వారికి ఉపాధి అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి? ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుంటాయి. ‘‘విద్యార్థి కేంబ్రిడ్జ్ లేదా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ వంటి విద్యా సంస్థలకు వెళ్లొచ్చు. కానీ, ఈ తరహా ప్రతిష్టాత్మక, పేరొందిన ఇనిస్టిట్యూషన్స్కు నేరుగా దరఖాస్తు చేసుకోవడానికి బదులు విద్యార్థులు ఏజెన్సీలను ఆశ్రయిస్తుంటారు. దాంతో చివరికి పెద్దగా తెలియని యూనివర్సిటీలో అడ్మిషన్తో వారు సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. అటువంటప్పుడు విద్యా రుణం కష్టంగా మారుతుంది’’ అని విద్యా రుణాల మార్కెట్ప్లేస్ అయిన విమేక్స్కాలర్స్ సహ వ్యవస్థాపకుడు అర్జున్ ఆర్ కృష్ణ తెలిపారు. పేపర్ వర్క్ కావాల్సిన డాక్యుమెంట్లను సిద్ధం చేసుకోవడం ముఖ్యమైన కార్యక్రమం. డాక్యుమెంట్ ప్రక్రియ ఎంత క్లిష్టమో ఇప్పటికే రుణం తీసుకుని విదేశీ విద్యా కోర్సు చేస్తున్న వారిని అడిగితేనే తెలుస్తుంది. విభా షణ్ముఖ్ (33) యూఎస్లోని రైస్ యూనివర్సిటీలో పీహెచ్డీ చదువుతున్నారు. డాక్యుమెంటేషన్ ప్రక్రియ ఎంత క్లిష్టతరమో తన అనుభవాన్ని వెల్లడించారు. డల్లాస్లోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్లో ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదివేందుకు 2013లో ఆయన ఓ ప్రభుత్వ రంగ బ్యాం కులో రుణానికి దరఖాస్తు చేసుకున్నారు. ‘‘బ్యాంకు అడిగిన అన్ని పత్రాలను తీసుకెళ్లి ఇచ్చాను. అయినా కానీ, కోర్సుకు అయ్యే ఖర్చు, ఇతర వ్యయాలకు సంబంధించి యూనివర్సిటీ నుంచి ధ్రువీకరణ పత్రం కావాలని బ్యాంకు అడిగింది. కానీ యూనివర్సిటీల నుంచి ఈ తరహా పత్రాలు పొందడం అదిపెద్ద సవాలు’’అని షణ్ముఖ్ తెలిపారు. తాకట్టు.. దేశీ యూనివర్సిటీల్లో కోర్సుల కోసం రుణాలు తీసుకునేట్టు అయితే బ్యాంకులు తనఖా కోరవు. కానీ, విదేశీ వర్సిటీల్లో విద్య కోసం తీసుకునే రుణాలకు సంబంధించి తనఖా పెట్టాలని బ్యాంకులు అడుగుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వరంగ బ్యాంకులు తనఖా కోరుతున్నాయి. తనఖా కింద స్తిరాస్థి, ప్రావిడెంట్ ఫండ్ లేదా సెక్యూరిటీ డిపాజిట్ ఇస్తే సరిపోతుంది. చాలా ఎన్బీఎఫ్సీలు, ప్రైవేటు బ్యాంకులు తనఖా అడగడం లేదు. మాస్టర్స్ కోర్సులకు తనఖా లేకుండానే ఇవి రుణాలు ఇస్తున్నాయి. వివరాలు సమగ్రంగా తెలుసుకుని ముందడుగు వేయాలి. అధిక వ్యయాలు ప్రభుత్వరంగ బ్యాంకుల్లో విద్యా రుణానికి డాక్యుమెంట్లు సమర్పణ, ఆమోదం ప్రక్రియ కొద్దిగా కష్టం అనిపిస్తుంది. అదే ఎన్బీఎఫ్సీలు, ప్రైవేటు బ్యాంకుల నుంచి విద్యా రుణం సులభంగానే లభిస్తుంది. కాకపోతే ప్రభుత్వరంగ బ్యాంకులతో పోలిస్తే వీటిల్లో వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ చార్జీలు ఎక్కువగా ఉంటుంటాయి. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో విద్యా రుణాలపై రేట్లు 6.9 శాతం నుంచి 12.5 శాతం మధ్య ఉన్నాయి. ప్రైవేటు బ్యాంకుల్లో 10.5 శాతం నుంచి 13 శాతం మధ్య ఉన్నాయి. ఎన్బీఎఫ్సీలు, ప్రైవేటు బ్యాంకులు (ఎక్కువ శాతం) ఇచ్చే విద్యా రుణాలకు మారటోరియం ఉండడం లేదు. దీంతో రుణం మంజూరు చేసిన మరుసటి నెల నుంచే చెల్లింపులు మొదలు పెట్టాల్సి ఉంటుంది. మారటోరియం అంటే.. కోర్సు కాల వ్యవధికి ముగిసిన తర్వాత ఆరు నెలల వరకు రుణానికి చెల్లింపులు చేయక్కర్లేదు. కోర్సు అనంతరం ఉద్యోగం పొందేందుకు వీలుగా ఆరు నెలల వ్యవధి ఉంటుంది. దీనివల్ల విద్యార్థి కుటుంబానికి ఎంతో ఉపశమనం ఉంటుంది. అందుకుని రుణానికి వెంటనే చెల్లింపులు చేయలేని వారు ప్రభుత్వరంగ బ్యాంకుల్లో మారటోరియంతో కూడిన విద్యా రుణానికే ప్రయత్నించాలి. రుణానికి ముందే ప్రణాళిక ఉండాలి.. సాధారణంగా విద్యార్థులు తమ బడ్జెట్ కోణం నుంచి విదేశాల్లో ప్రవేశాలకు ప్రయత్నిస్తుంటారు. అంటే తక్కువ వ్యయాలు అయ్యే ప్రాంతాలను ఎంపిక చేసుకుంటుంటారు. దీనివల్ల అంతగా ప్రాచుర్యం లేని దేశం లేదా విద్యా సంస్థలో చేరాల్సి వస్తుంది. అందుబాటు ధరలు ఏ దేశంలో ఉన్నాయో విచారించుకుని అక్కడ విద్యాసంస్థను ఎంపిక చేసుకుంటున్నారు. ‘‘ఉదాహరణకు ఒక విద్యార్థి రూ.20లక్షలు ఖర్చు చేయగలనని అనుకుంటే ఆమె లేదా అతడు జర్మనీలో ప్రవేశం కోసం ప్రయత్నిస్తున్నారు. అంతకంటే ఎక్కువ బడ్జెట్ పెట్టుకోగలిగితే యూఎస్ లేదా యూకేలో ప్రవేశం కోసం ప్రయత్నం చేస్తున్నారు. విద్యా రుణం పొందే విషయంలో పేరున్న యూనివర్సిటీయే కాకుండా, దేశానికీ ప్రాధాన్యం ఉంటుంది’’అని కృష్ణ వివరించారు. విద్యా సంస్థలు పేరున్నవి, ప్రతిష్టాత్మకమైనవి అయితే బ్యాంకులు తనఖా కోరడం లేదు. ప్రభుత్వరంగ బ్యాంకులు అయితే యూనివర్సిటీలు, కోర్సులతో జాబితాను నిర్వహిస్తున్నాయి. ఏఏ వర్సిటీలు, ఏ కోర్సులకు తక్కువ వడ్డీ రేటు రుణాలు, తక్కువ తనఖాతో మంజూరు చేయాలో ఈ జాబితానే వాటికి ప్రామాణికంగా ఉంటోంది. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలతోపాటు ప్రొడిగీ ఫైనాన్స్, ఎంపవర్ ఫైనాన్సింగ్ తదితర అంతర్జాతీయ సంస్థలు సైతం విద్యా రుణాలు ఇస్తున్నాయి. కొన్ని యూనివర్సిటీలు విదేశీ విద్యార్థులకు విద్యారుణాల పరంగా సాయాన్ని అందిస్తున్నాయి. ‘‘గ్రామీణ ప్రాంతాల్లో ఆస్తులు ఉన్నవారు, సరైన పత్రాలను అందించలేని వారికి విద్యా రుణం పరంగా ప్రైవేటు బ్యాంకులు సౌకర్యం’’అని కృష్ణ తెలిపారు. స్కాలర్షిప్ ‘‘విదేశీ విద్య కోసం వెళ్లే వారిలో కోర్సుకు అయ్యే వ్యయం మేర పూర్తి స్కాలర్షిప్ పొందే అవకాశం 2–3 శాతం మందికే ఉంటుంది. కానీ, పాక్షిక స్కాలర్షిప్ను అందించే విద్యా మండళ్లు, ఇనిస్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి’’అని కృష్ణ తెలిపారు. దరఖాస్తు సమయంలోనే స్కాలర్షిప్ కోసం ప్రయత్నించాలని ఆయన సూచించారు. ఇందుకోసం ఎన్నో పథకాలు అవకాశాలున్నట్టు చెప్పారు. సున్నా వడ్డీ రుణాలు, విరాళాలు కూడా అందుబాటులో ఉన్నట్టు తెలిపారు. టాటా ఫౌండేషన్, అగాఖాన్ ఫౌండేషన్ తదితర సంస్థలు సాయం అందిస్తున్నాయి. స్కాలర్షిప్ పొందడంలో సాయపడే జ్ఞాన్ధన్, విమేక్ సొల్యూషన్స్ తదితర సంస్థలు కూడా ఉన్నాయి. క్రెడిట్ స్కోరు విద్యా రుణం విషయంలోనూ మంచి క్రెడిట్ స్కోరు సాయపడుతుంది. దరఖాస్తు ఆమోదానికే ఎక్కువ అవకాశం ఉంటుంది. కనుక పిల్లలను ఉన్నత విద్య కోసం విదేశాలకు పంపించాలనుకునే వారు మంచి క్రెడిట్ స్కోరు ఉండేలా చర్యలు తీసుకోవాలి. కాలేజీకి వచ్చిన పిల్లలు ‘బై నౌ పే లేటర్’ సదుపాయాలను విచ్చలవిడిగా ఉపయోగించుకుని చెల్లించకుండా వదిలేస్తున్నారు. ఈ తరహా చర్యలు రుణాలకు అడ్డంకిగా మారతాయి. విదేశ విద్య ప్రణాళిక ఉన్న వారు ఎట్టి పరిస్థితుల్లోనూ క్రెడిట్ హిస్టరీలో మచ్చ పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. తల్లిదండ్రులూ ఈ విషయంలో పిల్లల వ్యయాల పట్ల శ్రద్ధ చూపాలి. డాక్యుమెంట్లు విద్యా రుణానికి కేవైసీ డాక్యుమెంట్లు అన్నీ సిద్ధం చేసుకోవాలి. కేవైసీ అంటే గుర్తింపు, వయసు, చిరునామాను ధ్రువీకరించేవి. వీటితోపాటు గ్రాడ్యుయేషన్ మార్కుల మెమో షీటు, సెకండరీ స్కూల్, హైస్కూల్ ఇలా విద్యకు సంబంధించి అన్ని మెమో పత్రాలను దగ్గర ఉంచుకోవాలి. తల్లిదండ్రులు లేదంటే సంరక్షకుల ఆదాయ రుజువు సర్టిఫికెట్ అవసరం. తనఖా కోసం ఉంచతగిన ఇల్లు, పొలం, ప్లాట్, ఫిక్స్డ్ డిపాజిట్ లేదంటే పీపీఎఫ్ ఖాతా పాస్ బుక్, యూనివర్సిటీలో ప్రవేశాన్ని ధ్రువీకరిస్తూ మంజూరు చేసే లేఖ, కోర్సు ఫీజుల చెల్లింపుల షెడ్యూల్, స్కాలర్షిప్ లెటర్, రుణ గ్రహీత బ్యాంకు స్టేట్మెంట్ (చివరి ఆరు నెలలు), తల్లిదండ్రి లేదా సంరక్షకుడి బ్యాంకు ఖాతా స్టేట్మెంట్, ఆదాయపన్ను రిటర్నుల పత్రాలు, తల్లిదండ్రుల ఆదాయపన్ను రిటర్నుల పత్రాలు సిద్ధం చేసుకోవాలి. కొన్ని బ్యాంకులు రుణ దరఖాస్తుదారుడి వాటా కింద చెల్లించే మొత్తానికి మూలాన్ని అడుగుతాయి. అవి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఉద్యోగ అవకాశాలు చూడాలి రుణం సాయంతో విదేశీ విద్య కోసం ప్రయత్నించే వారు చూడాల్సిన ముఖ్యమైన వాటిల్లో.. కోర్సు అనంతరం ఉపాధి అవకాశాలు ఒకటి. దీనివల్ల తీసుకునే రుణాన్ని తిరిగి తీర్చివేసే సామర్థ్యాలపై స్పష్టత తెచ్చుకోవచ్చు. విద్యా రుణాల్లో పెరుగుతున్న ఎగవేతలు ఈ విషయంలో ముందు జాగ్రత్త అవసరమని తెలియజేస్తన్నాయి. ప్రభుత్వరంగ బ్యాంకులు ఇచ్చిన విద్యా రుణాల్లో 9.55 శాతం నిరర్థక ఆస్తులుగా (ఎన్పీఏలు) 2020లో వర్గీకరించినట్టు 2021 పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం స్వయంగా తెలిపింది. కోర్సు అనంతరం అక్కడే కొంతకాలంపాటు ఉండి ఉపాధి అవకాశాన్ని సొంతం చేసుకోవాలన్నది నిపుణుల సూచన. ‘‘గతంలో అయితే కొన్ని దేశాలు కోర్సు అనంతరం కేవలం కొన్ని నెలల పాటే ఉపాధి అవకాశాల అన్వేషణకు వీలుగా ఉండనిచ్చేవి. కానీ, ఇప్పుడు బ్రిటన్ సహా చాలా దేశాలు గ్రాడ్యుయేట్ రూట్ ప్రోగ్రామ్లను ప్రవేశపెట్టాయి. వీటి కింద ఉన్నతవిద్య అనంతరం అక్కడే కొన్నేళ్లపాటు ఉండి ఉద్యోగం చేసుకోవచ్చు’’అని ఓ కన్సల్టెన్సీ అధినేత తెలిపారు. -
రూ.500 దొంగనోట్లు పెరుగుతున్నాయ్: తస్మాత్ జాగ్రత్త!
ముంబై: బ్యాంకింగ్ వ్యవస్థ మార్చితో ముగిసిన 2021–22 ఆర్థిక సంవత్సరంలో 79,669 రూ. 500 డినామినేషన్ నకిలీ కరెన్సీ నోట్లను గుర్తించింది. 2020–21 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఈ సంఖ్య రెట్టింపని ఆర్బీఐ వార్షిక నివేదిక తెలిపింది. ఇక రెండువేల నోట్ల విషయంలో గుర్తించిన నకిలీ సంఖ్య 13,604గా ఉంది. 2020–21తో పోల్చితే ఈ సంఖ్య 54.6 శాతం అధికం. 2016లో అమలులో ఉన్న రూ. 500, రూ. 1,000 నోట్ల రద్దు ప్రధాన లక్ష్యాలలో ఒకటి నకిలీ కరెన్సీ నోట్ల చెలామణిని అరికట్టడం కావడం గమనార్హం. కాగా, ఇందుకు సంబంధించి తాజా పరిస్థితి ఏమిటన్నది గణాంకాల్లో పరిశీలిస్తే... ► 2020–2021 ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా 2,08,625 నకిలీ నోట్లను గుర్తిస్తే, 2021–22లో ఈ సంఖ్య 2,30,971కి చేరింది. ► 2020–21తో పోల్చితే 2021–22లో రూ.10, రూ.20, రూ.200, రూ.500 (కొత్త డిజైన్), రూ. 2,000ల విలువ కలిగిన నకిలీ నోట్లలో వరుసగా 16.4 శాతం, 16.5 శాతం, 11.7 శాతం, 101.9 శాతం, 54.6 శాతం పెరుగుదల నమోదైంది. ► అయితే ఇదే కాలంలో రూ.50, రూ.100 దొంగ నోట్లు వరుసగా 28.7%, 16.7% తగ్గడం గమనార్హం. ► 2021–22లో గుర్తించిన మొత్తం నకిలీ నోట్లలో 6.9 శాతం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గుర్తించగా, 93.1 శాతం నోట్లను ఇతర బ్యాంకులు పసిగట్టాయి. ► 2021 ఏప్రిల్ నుండి 2022 మార్చి 31 వరకు కరెన్సీ ప్రింటింగ్పై చేసిన మొత్తం వ్యయం రూ. 4,984.8 కోట్లు. అంతకుముందు సంవత్సరం (2020 జూలై 1 నుండి 2021 మార్చి 31 వరకు) ఈ మొత్తం రూ. 4,012.1 కోట్లు. 2021 మార్చికి ముందు ఆర్బీఐ జూలై–జూన్ మధ్య కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణించేది. అయితే 2021 ఏప్రిల్ నుంచి ‘ఏప్రిల్–మార్చి’ని ఆర్థిక సంవత్సరంగా మార్చారు. ► 2021–22 ఆర్థిక సంవత్సరంలో పాడైపోయిన నోట్లను వెనక్కు తీసుకోడానికి సంబంధించిన సంఖ్య 88.4 శాతం పెరిగి 1,878.01 కోట్లకు చేరింది. 2020–21లో ఈ సంఖ్య 997.02 కోట్లు. -
బ్యాంకింగ్ వ్యవస్థలో చేరిపోనున్న పోస్టాఫీసులు
సాక్షి, హైదరాబాద్: బ్యాంకు లావాదేవీలకు దూరంగా ఉంటూ... పోస్టాఫీసునే బ్యాంకుగా భావించే కోట్ల మందికి ఇది నిజ్జంగా శుభవార్తే. ఎందుకంటే కొన్నేళ్లుగా ‘పోస్టల్ బ్యాంక్’ మాట వినిపిస్తున్నా బ్యాంకుకు ఉండాల్సిన చాలా లక్షణాలు పోస్టాఫీసులకింకా రాలేదు. ఇదిగో... వీటన్నిటినీ కోర్ బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకొస్తామని నిర్మల హామీనిచ్చారు. అంటే పోస్టాఫీసు ఖాతాదారులంతా ఇకపై ఎక్కడి నుంచైనా ఆన్లైన్లో డిపాజిట్లు చేయొచ్చు. వేరే ఖాతాలకు నగదు బదిలీ చేయొచ్చు. ఆర్డీ, ఎఫ్డీ సహా బ్యాంకుల నుంచి పొందే ఆన్లైన్ సేవలన్నీ పొందొచ్చు. కాలం చెల్లిన సేవలకు క్రమంగా స్వస్తి చెబుతూ...ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్నీ అందిపుచ్చుకొని వినూత్న ఆలోచనలు, సరికొత్త సేవలతో ముందడుగు వేస్తున్న పోస్టాఫీసులకు మహర్దశ పట్టనుంది. ఇప్పటికే వాణిజ్య బ్యాంకులకు దీటుగా ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబి) ఏర్పాటు చేసి దాని ద్వారా పోస్టాఫీసుల్లో ప్రాథమిక బ్యాంకింగ్ కార్యకలాపాలకు శ్రీకారం చుట్టింది. పోస్టాఫీసులతో పాటు ఇంటి వద్దకు కూడా బ్యాంకింగ్ సేవలు అందిస్తోంది. తాజాగా కేంద్ర బడ్జెట్– 2022లో పోస్టాఫీసుల్లో పూర్తి స్థాయిలో బ్యాంకింగ్ సేవలు ప్రవేశ పెడుతున్నట్లు ప్రకటించడం మరింత కలిసి వచ్చే అంశం. ఇక పోస్టాఫీసుల ద్వారా ఆన్లైన్ బ్యాంకింగ్,నెట్ బ్యాంకింగ్, ఏటీఎం సేవలు అందుబాటులో రానున్నాయి. ఇప్పటికే ఐపీపీ బ్యాంక్ పోస్టాఫీసుల ద్వారా మూడు రకాల జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ ఖాతాల సేవలు అందిస్తోంది. చదవండి: బ్యాంకులు, ఏటీఎంలకు వెళ్లకుండానే పీఎం కిసాన్, రైతుబంధు డబ్బులు -
డిపాజిట్ బీమాతో బ్యాంకులపై ధీమా
న్యూఢిల్లీ: ప్రభుత్వం ప్రవేశపెట్టిన డిపాజిట్ బీమా సంస్కరణలు .. బ్యాంకింగ్ వ్యవస్థపై ఖాతాదారుల్లో విశ్వాసాన్ని మరింతగా పెంచగలవని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భవిష్యత్తులో బ్యాంకు విఫలమైనా, డిపాజిటర్ల సొమ్ము భద్రంగా ఉంటుందనే భరోసా ఈ సంస్కరణలతో లభించిందని ’డిపాజిటర్స్ ఫస్ట్’ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. బ్యాంకు డిపాజిట్లకు సంబంధించి బీమా పరిమితిని ప్రభుత్వం ఇటీవల రూ. 5 లక్షలకు పెంచిన సంగతి తెలిసిందే. సంక్షోభంలో ఉన్న బ్యాంకుపై ఆర్బీఐ మారటోరియం విధించిన పక్షంలో ఈ స్థాయి వరకూ డిపాజిట్లు ఉన్న వారు.. 90 రోజుల్లోగా తమ డబ్బు పొందేందుకు ఇది ఉపయోగపడుతుంది. సంబంధిత చట్టాన్ని అమల్లోకి తెచ్చాక గత కొద్ది రోజుల్లో సుమారు 1 లక్ష మంది పైగా ఖాతాదారులకు రూ. 1,300 కోట్ల పైచిలుకు అందిందని ప్రధాని చెప్పారు. ఆర్బీఐ మారటోరియం ఆంక్షలు ఎదుర్కొంటున్న మిగతా బ్యాంకుల్లోని మరో 3 లక్షల మంది ఖాతాదారులకు కూడా త్వరలో వారి డిపాజిట్ మొత్తం లభించగలదని ఆయన తెలిపారు. 16 పట్టణ సహకార బ్యాంకుల డిపాజిట్దారుల నుంచి వచ్చిన క్లెయిమ్స్కు సంబంధించి తొలి విడత చెల్లింపులను డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ఇటీవలే విడుదల చేసిందని మోదీ చెప్పారు. రెండో విడత డిసెంబర్ 31న విడుదల కానున్నట్లు పేర్కొన్నారు. డిపాజిటర్ల ప్రయోజనాలపై ప్రత్యేక దృష్టి..: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఖాతాదారుల ప్రయోజనాలను పరిరక్షించడంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెడుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. దేశ పురోగతిలో బ్యాంకులు కీలక పాత్ర పోషిస్తాయని, బ్యాంకులు బాగుండాలంటే డిపాజిటర్ల సొమ్ము సురక్షితంగా ఉండటం కూడా చాలా ముఖ్యమని ఆమె పేర్కొన్నారు. అటు మధ్యతరగతి గృహ కొనుగోలుదారుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని .. ఆర్థిక సమస్యలతో నిల్చిపోయిన పలు హౌసింగ్ ప్రాజెక్టులకు నిధులు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు. అధిక వడ్డీలకు ఆశపడితే రిస్కు: ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ అధిక వడ్డీ రాబడుల కోసం ఆశపడితే అసలుకే ఎసరు వచ్చే ముప్పు ఉంటుందని డిపాజిట్దారులను రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ హెచ్చరించారు. అధిక రాబడులు లేదా అధిక వడ్డీ రేట్లతో రిస్కులు కూడా ఎక్కువగానే ఉంటాయన్న సంగతి గుర్తుంచుకోవాలని ’డిపాజిటర్స్ ఫస్ట్’ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సూచించారు. -
బ్యాంకింగ్ లిక్విడిటీలో తీవ్ర ఒడిదుడుకులు!
ముంబై: బ్యాంకింగ్ లిక్విడిటీ (ద్రవ్య లభ్యత)లో గత నెల నవంబర్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. బ్యాంక్ డిపాజిట్లు 2021 నవంబర్ 5తో ముగిసిన 15 రోజుల్లో భారీగా రూ.3.3 లక్షల కోట్లు పెరిగాయి. పక్షం రోజుల్లో ఇంత స్థాయిలో డిపాజిట్ల పెరుగుదల 24 సంవత్సరాల్లో (1997 తరువాత) ఇది ఐదవసారి. అయితే నవంబర్ 5 నుంచి మరో పక్షం రోజులు గడిచేసరికి అంటే 2021 నవంబర్ 19వ తేదీ నాటికి బ్యాంక్ డిపాజిట్లు భారీగా రూ.2.7 లక్షల కోట్లు క్షీణించాయి. ఒక్కసారిగా ఇలా బ్యాంక్ డిపాజిట్ల పెరుగుదల– క్షీణతలకు కారణమేమిటన్న అంశంపై ఎస్బీఐ రిసెర్చ్ దృష్టి సారించింది. నిజానికి దీపావళి వారంలో కరెన్సీ డిపాజిట్ల ఒడిదుడుకులకు కారణం ఏమిటన్నది నివేదిక దృష్టి సారించిన అంశం. స్టాక్ మార్కెట్ ర్యాలీ అంచనాలుసహా పలు అంశాలను నివేదిక ప్రస్తావించింది. స్టేట్ బ్యాంక్ గ్రూప్ ముఖ్య ఆర్థిక సలహాదారు సౌమ్య కాంతి ఘోష్ ఈ నివేదికాంశాలను వెల్లడించారు. ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ►భారీ డిపాజిట్లు కేవలం కొన్ని సందర్భాల్లోనే చోటుచేసుకున్నాయి. 1997లో ఈ తరహా భారీ డిపాజిట్ల పరిణామం చోటుచేసుకుంది. అటు తర్వాత 2016 నవంబర్ 25 వరకు అంటే పెద్ద నోట్ బ్యాన్ తర్వాత పక్షం రోజులలో రూ. 4.16 లక్షల కోట్ల డిపాజిట్లు జరిగాయి. అంతక్రితం 26 సెప్టెంబర్ 2016 వరకు జరిగిన పక్షం రోజుల్లో రూ. 3.55 లక్షల కోట్ల డిపాజిట్లు వచ్చాయి. 29 మార్చి 2019 నాటికి పక్షం రోజుల్లో రూ. 3.46 లక్షల కోట్లు డిపాజిట్లు జరిగాయి.అంతక్రితం ఏప్రిల్ 1, 2016తో ముగిసిన పక్షం రోజుల్లో రూ. 3.41 లక్షల కోట్ల డిపాజిట్లు వచ్చాయి. మళ్లీ అంత స్థాయిలో 2021 నవంబర్ 5తో ముగిసిన 15 రోజుల్లో భారీగా రూ.3.3 లక్షల కోట్ల డిపాజిట్లు జరిగాయి. ►2016 నవంబర్ 25తో ముగిసిన పక్షం రోజుల్లో జరిగిన భారీ డిపాజిట్లు (రూ.4.16 లక్షల కోట్లు) పెద్ద నోట్ల రద్దు ప్రభావమన్నది సుస్పష్టం. అదే ఏడాది ఏప్రిల్ 1తో ముగిసిన పక్షం రోజుల్లో జరిగిన డిపాజిట్లు (రూ.3.41 లక్షల కోట్లు) సీజనల్ సంవత్సరాంత అధిక డిపాజిట్లుగా భావించవచ్చు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి మూడు నెలల ముందు (26 సెప్టెంబర్ 2016 వరకు జరిగిన పక్షం రోజుల్లో రూ. 3.55 లక్షల కోట్ల డిపాజిట్లు) భారీ డిపాజిట్లు జరగడం గమనార్హం. ►డిపాజిట్లు, ఉపసంహరణల్లో భారీ ఒడిదుడుకుల పరిస్థితులు లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) నిర్వహణ, ఆర్థిక స్థిరత్వం లేదా డిజిటలైజేషన్ ద్వారా కస్టమర్ చెల్లింపు అలవాట్లలో ప్రవర్తనా ధోరణిలో మార్పు వంటి అంశాలను నిశితంగా గమనించాల్సిన అవసరాన్ని ప్రతిబింబిస్తోంది. ►కంపెనీల ఐపీఓలు, స్టాక్ మార్కెట్లు భారీగా పెరగవచ్చన్న అంచనాలు నవంబర్ 5తో ముగి సన పక్షం రోజుల్లో డిపాజిట్లు భారీగా పెరగడానికి కారణం కావచ్చు. అటువంటి ర్యాలీ కార్యరూపం దాల్చకపోవడంతో డిపాజిట్లు భారీగా వెనక్కు మళ్లి ఉండచచ్చు. ►ఎన్ఎస్ఈ డేటా ప్రకారం, 2021 సెప్టెంబర్లో నెలవారీ ఇన్వెస్టర్ రిజిస్ట్రేషన్ల సంఖ్య రికార్డు స్థాయిలో 15.6 లక్షలకు చేరింది. 2021 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య దాదాపు 50 లక్షల మం ది అదనపు కొత్త ఇన్వెస్టర్లు రిజిస్టర్ అయ్యారు. ►బ్యాంకుల్లో భారీ డిపాజిట్ల నేపథ్యంలో స్థిర రివర్స్ రెపో విండో (బ్యాంకులు తమ అదనపు నిధులను ఆర్బీఐ వద్ద డిపాజిట్ చేయడానికి ఉద్దేశించింది. దీనిపై వడ్డీరేటు ప్రస్తుతం 3.35 శాతం) మొత్తాలు భారీగా పెరిగాయి. అక్టోబర్ 19న రివర్స్ రెపో పరిమాణం 0.45 లక్షల కోట్లయితే, నవంబర్ 19 నాటికి ఈ పరిమాణం రూ.2.4 లక్షల కోట్లకు ఎగసింది. 2021 డిసెంబర్ 1 వరకూ ఈ పరిమాణం దాదాపు ఇదే స్థాయిలో కొనసాగుతోంది. ►2021 నవంబర్ 19 నుంచి 2022 మార్చి 25 వరకూ బ్యాంకుల్లో డిపాజిట్లు, రుణ వృద్ధి రూ. 5 లక్షల కోట్లమేర నమోదయితే, 2021–22 ఆర్థిక సంవత్సరంలో డిపాజిట్ల వృద్ధి దాదాపు 12 శాతంగా, రుణ వృద్ధి 8.5 శాతంగా ఉంటుంది. -
బ్యాంకుల ప్రైవేటీకరణకు త్వరలో చట్ట సవరణ!
న్యూఢిల్లీ: బ్యాంకింగ్లో మెజారిటీ వాటాల విక్రయానికి అనుగుణంగా బ్యాంకింగ్ చట్ట సవరణ బిల్లు, 2021ను 29వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెట్టడానికి కేంద్రం సిద్ధమవుతోంది. తాజా చట్ట సవరణ బిల్లులో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కనీస ప్రభుత్వ వాటాను 51 శాతం నుండి 26 శాతానికి తగ్గించే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి. అయితే దీనిపై ఇంకా కేంద్ర మంత్రివర్గం ఒక తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలుస్తోంది. రూ.1.75 లక్షల కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియలో భాగంగా రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రైవేటీకరించాలని 2021–22 బడ్జెట్ నిర్దేశించిన సంగతి తెలిసిందే. -
మరో సంక్షోభం దిశగా అఫ్గన్! ఐరాస హెచ్చరిక
తాలిబన్ల ఆక్రమణ, అల్లకల్లోల పరిస్థితులు, బయటి దేశాలతో వర్తక వాణిజ్యాలు నిలిచిపోవడం.. తదితర కారణాలతో అఫ్గనిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కుదేలుకు లోనైంది. ఈ తరుణంలో అఫ్గనిస్తాన్ పై మరో పిడుగు పడనుంది. ఊహించని స్థాయిలో ఆర్థిక సంక్షోభం అఫ్గన్ను ముంచెత్తే అవకాశాలున్నాయంటూ హెచ్చరించింది ఐక్యరాజ్య సమితి. యూఎన్ డెవలప్మెంట్ ప్రొగ్రాం(UNDP) సోమవారం మూడు పేజీలతో కూడిన ఒక నివేదికను రిలీజ్ చేసింది. బ్యాంకింగ్ వ్యవస్థ కుప్పకూలే పరిస్థితులు నెలకొన్నాయని, తద్వారా ఆర్థిక తలెత్తే అవకాశం ఉందని, ఆ ప్రతికూల ప్రభావం సొసైటీపై ఊహించని స్థాయిలో చూపించ్చొచ్చని అభిప్రాయపడింది ఐరాస. కిందటి ఏడాది 7 బిలియన్ డాలర్ల విలువైన గూడ్స్, ఉత్పత్తులను, సేవలను అందించింది అఫ్గనిస్తాన్. ఎలాంటి అవాంతరాలు లేకుండా లావాదేవీలు జరగడానికి కారణం.. అక్కడి బ్యాంకింగ్ వ్యవస్థే. అయితే చాలామంది లోన్లు తిరిగి చెల్లించకపోవడం, తాలిబన్ల ఆక్రమణ తర్వాత నగదు విత్డ్రా, అదే సమయంలో డిపాజిట్లు తక్కువగా వస్తుండడం, అవసరాలకు సరిపడా కరెన్సీ నిల్వలు లేకపోవడంతో.. కొద్దినెలల్లోపే ఈ సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని ఐరాస యూఎన్డీపీ నివేదికలో పేర్కొంది. ఇప్పటికైనా తేరుకుని బ్యాంకింగ్ వ్యవస్థను బలపర్చాలని తాలిబన్ ప్రభుత్వానికి సూచించింది ఐక్యరాజ్య సమితి. ఇందుకోసం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలు సైతం సహకరించాలని యూఎన్డీపీ అభిప్రాయపడింది. మరోవైపు కఠిన ఆంక్షల విధింపు, విదేశీ నిధులు నిలిచిపోవడం, తాలిబన్ల ఆక్రమణ టైంలో వర్తకవాణిజ్యాలు ఆగిపోవడంతో పాటు అఫ్గన్కు రావాల్సిన బకాయిలు నిలిచిపోవడంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ చాలావరకు దెబ్బతింది. ఈ తరుణంలో బ్యాంకింగ్, డిపాజిట్ ఇన్సూరెన్స్ స్కీమ్ వ్యవస్థలు సైతం దెబ్బతింటే గనుక.. ఆదుకోవడానికి ప్రపంచ దేశాలు ముందుకొచ్చినా ఆ సంక్షోభం నుంచి కోలుకోవడానికి దశాబ్దాల సమయం పట్టే అవకాశం ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. -
రిస్కలను సరిగ్గా అంచనావేయకపోతే ఇబ్బందులు
కోల్కతా: వ్యవస్థలో నగదు లభ్యత సమృద్ధిగా ఉన్నందున సమస్యలను (రిస్కలను) సరిగ్గా అంచనా వేయకపోతే ఆందోళనకు దారితీస్తుందన్నారు ఎస్బీఐ చైర్మన్ దినేష్ ఖారా. ‘‘బ్యాంకింగ్ వ్యవస్థలోకి డిపాజిట్లు వచి్చపడుతున్నాయి. కానీ, రుణాల వృద్ధి పుంజుకోవాల్సి ఉంది. దీంతో బ్యాంకులు ప్రత్యామ్నాయ పెట్టుబడి వేదికలైన టీ బిల్లులవైపు చూడాల్సి వస్తుంది. కానీ, ఈ ప్రత్యామ్నాయ మార్కెట్ పరిధి తక్కువ. దీంతో రిస్్కలను సరిగ్గా అంచనా వేయలేకపోవడానికి అవకాశం ఉంటుంది. కానీ, బ్యాంకింగ్ వ్యవస్థ నిరర్థక ఆస్తుల (ఎన్పీఏలు) రూపంలో తగినంత అనుభవాలు నేర్చుకున్నందున.. అండర్రైటింగ్ ప్రమాణాల విషయంలో రాజీ ఉంటుందని నేను అనుకోవడం లేదు’’ అని ఖారా బెంగాల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇం డస్ట్రీ నిర్వహించిన వెబినార్లో భాగంగా చెప్పారు, -
రిటైల్ రుణాలు.. రయ్రయ్!
గతంలో ఎన్నడూ ఎరుగని విధంగా కొద్ది నెలలనుంచీ దేశీ బ్యాంకింగ్ వ్యవస్థలో సరికొత్త ట్రెండ్ కనిపిస్తోంది. ఇటీవల పలు బ్యాంకింగ్ దిగ్గజాలు కార్పొరేట్ విభాగానికి బదులుగా రిటైల్ రుణాలకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నాయి. దీంతో బ్యాంకింగ్ వ్యవస్థలో రిటైల్ రుణ విభాగం పైచేయి సాధించనున్నట్లు అంచనాలు నెలకొన్నాయి. వెరసి కార్పొరేట్ రుణాలను మించి అగ్రస్థానానికి చేరే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ముంబై: దేశీ బ్యాంకింగ్ వ్యవస్థలో మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరం(2020–21).. కీలక మార్పులకు వేదిక కానుంది. కొన్ని నెలలుగా గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డులు తదితరాలపట్ల బ్యాంకులు అత్యంత ఆసక్తి చూపుతున్నాయి. దీంతో కార్పొరేట్ రంగ డెట్ను వ్యక్తిగత రుణ విభాగం అధిగమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఏడాది తొలి 9 నెలల్లో(ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ 18వరకూ) బ్యాంకింగ్ వ్యవస్థలో మొత్తం(అవుట్స్టాండింగ్) పారిశ్రామిక, కార్పొరేట్ రుణాలు 1.2 శాతం తగ్గి రూ. 27.6 లక్షల కోట్లకు చేరాయి. ఇదే సమయంలో వ్యక్తిగత రుణాలు 9.5 శాతం జంప్చేసి రూ. 26.6 లక్షల కోట్లను తాకాయి. ఇక సర్వీసుల రంగ రుణాలు 25.8 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. వెరసి దేశ బ్యాంకింగ్ వ్యవస్థలో వ్యక్తిగత రుణ విభాగం సర్వీసుల రంగ రుణాలను మించి రెండో ర్యాంకుకు చేరింది. వెనకడుగులో..: పారిశ్రామిక, కార్పొరేట్ రుణ విభాగాలలో 2014–15 మొదలు రికవరీ కనిపించడంలేదని బ్యాంకింగ్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంకులు వ్యక్తిగత రుణ విభాగంపై ప్రత్యేక దృష్టిని సారించినట్లు తెలియజేశాయి. ఫలితంగా గృహ, ఆటో రుణాలు, క్రెడిట్ కార్డులు వృద్ధి బాటలో సాగుతున్నట్లు నార్నోలియా సెక్యూరిటీస్ సీఐవో శైలేంద్ర కుమార్ పేర్కొన్నారు. ఆర్బీఐ నివేదిక ప్రకారం పారిశ్రామిక, కార్పొరేట్ లోన్బుక్ నీరసిస్తూ వస్తోంది. తాజా రుణ మంజూరీకంటే చెల్లింపులు పెరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. గత 9 నెలల్లో పారిశ్రామిక రుణాలు 5 శాతం క్షీణించగా.. సర్వీసుల రంగ రుణాలు 0.6 శాతం మందగించాయి. అయితే వ్యక్తిగత రుణాలు 4.3 శాతం పుంజుకున్నాయి. వ్యవసాయ రుణాలైతే 7.6 శాతం ఎగశాయి. దీంతో సమీప కాలంలో రిటైల్ లోన్ పోర్ట్ఫోలియో దేశ బ్యాంకింగ్ వ్యవస్థలో అతిపెద్ద విభాగంగా ఆవిర్భవించే వీలున్నట్లు పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు. ఐఐపీ వీక్... కొంతకాలంగా తయారీ, పారిశ్రామిక రంగాలలో క్షీణత కొనసాగుతుండటంతో ఇండస్ట్రియల్ క్రెడిట్ వెనకడుగు వేస్తున్నట్లు బ్యాంకింగ్ రంగ విశ్లేషకులు పేర్కొన్నారు. కొన్నేళ్లుగా తయారీ రంగం నీరసిస్తుండటంతో కొత్త పెట్టుబడి ప్రణాళికలు కరువైనట్లు తెలియజేశారు. దీంతో కార్పొరేట్ క్రెడిట్కు డిమాండ్ తగ్గినట్లు ఈక్వినామిక్స్ రీసెర్చ్ వ్యవస్థాపక ఎండీ జి.చొక్కలింగం వివరించారు. సాధారణంగా సామర్థ్య విస్తరణ, కొత్త ప్రాజెక్టులు, ప్లాంట్ల ఏర్పాటు తదితరాల కారణంగా కార్పొరేట్ రుణాలకు డిమాండ్ పుట్టుకొస్తుందని తెలియజేశారు. కారణాలివీ... ఇటీవల వడ్డీ రేట్లు తగ్గడం, టెక్నాలజీ ఆధారిత (ఆన్లైన్) రుణ మంజూరీ పెరగడం వంటి అంశాలు రిటైల్ విభాగంలో రుణ వృద్ధికి దోహదపడుతున్నాయి. ఈ విభాగంలో క్రెడిట్ కార్డులు, ఇతర వ్యక్తిగత అన్సెక్యూర్డ్ రుణాలు అత్యంత వేగంగా విస్తరిస్తున్నాయి. అయితే మొత్తం వ్యక్తిగత పోర్ట్ఫోలియోలో చూస్తే సెక్యూర్డ్ విభాగంలోని గృహ రుణాలు, ఆటో రంగ రుణాలు నెమ్మదిస్తున్నాయి. వ్యక్తిగత పోర్ట్ఫోలియోలో ఆర్బీఐ గణాంకాల ప్రకారం గృహ, వాహన రుణాలు, క్రెడిట్ కార్డులు మూడు పెద్ద విభాగాలుగా ఆవిర్భవించాయి. హౌసింగ్ వాటా 52.3 శాతంకాగా.. గత ఐదేళ్లలో క్రెడిట్ కార్డులు తదితర రుణాలు వేగంగా వృద్ధి చెందుతున్నాయి. ఫలితంగా క్రెడిట్ కార్డుల రుణాల వాటా 4.1 శాతానికి చేరడం గమనార్హం! -
జనవరి 1నుంచి చెక్కు చెల్లింపులకు కొత్త రూల్స్
ముంబై, సాక్షి: వచ్చే(2021) జనవరి 1నుంచి చెక్కుల చెల్లింపులకు కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. సానుకూల చెల్లింపుల(పాజిటివ్ పే) విధానం పేరుతో రిజర్వ్ బ్యాంక్ ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసింది. తాజా నిబంధనలలో భాగంగా ఇకపై రూ. 50,000కు మించిన చెక్కుల చెల్లింపుల విషయంలో బ్యాంకులు కొన్ని కీలక అంశాలను మరోసారి ధృవ పరచుకోవలసి ఉంటుంది. ఇతర వివరాలు ఇలా.. (బ్యాంకింగ్: డిజిటల్ సేవల్లో సవాళ్లేంటి?) అవకతవకలకు చెక్ పాజిటివ్ పేలో భాగంగా క్లియరింగ్ కోసం వచ్చిన చెక్కుకు సంబంధించి ప్రధాన సమాచారాన్ని బ్యాంకులు తిరిగి ధృవ పరచుకోవలసి ఉంటుంది. ఉదాహరణకు చెక్కు సంఖ్య, తేదీ, చెల్లింపుదారుడి పేరు, ఖాతా నంబర్, చెల్లించవలసిన మొత్తం వంటి అంశాలను పునఃసమీక్షించవలసి ఉంటుంది. తద్వారా మోసపూరిత లావాదేవీలకు చెక్ పెట్టేందుకు ఆర్బీఐ పాజిటివ్ పే వ్యవస్థను రూపొందించినట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఈ విధానం రూ. 50,000.. అంతకుమించిన పెద్ద మొత్తాల చెక్కులకు మాత్రమే వర్తింపచేయనున్నట్లు తెలుస్తోంది. (హెచ్డీఎఫ్సీ బ్యాంక్కు ఆర్బీఐ షాక్) పలు విధాలుగా చెక్కును జారీ చేసిన వ్యక్తి లేదా సంస్థ లబ్దిదారుడి పేరు, సొమ్ము మొత్తం తదితర వివరాలను వివిధ మార్గాల ద్వారా చెల్లించే(డ్రాయీ) బ్యాంకుకు తెలియజేయవలసి ఉంటుంది. ఈ వివరాలను ఎస్ఎంఎస్, మొబైల్ యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం తదితరాల ద్వారా అందించవచ్చు. ఈ సమాచారాన్ని జమ చేసిన చెక్కు వివరాలతో చెక్ క్లియరింగ్ సిస్టమ్స్(సీటీఎస్) పోల్చి చూసుకునేందుకు వీలుంటుంది. ఎప్పుడైనా సమాచారం సరిపోలకుంటే డ్రాయీ బ్యాంకు, ప్రెజంటింగ్ బ్యాంకులకు సీటీఎస్ తెలియపరుస్తుంది. తద్వారా చెక్కుల పరిష్కారానికి బ్యాంకులు తగిన చర్యలు తీసుకునేందుకు వీలుంటుంది. ఎన్పీఎస్ ద్వారా సీటీఎస్లలో పాజిటివ్ పే వ్యవస్థను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ అభివృద్ధి చేయడంతోపాటు.. పార్టిసిపేటింగ్ బ్యాంకులకు సైతం అందించవలసి ఉంటుంది. వెరసి ఈ వ్యవస్థను బ్యాంకులు ఖాతాదారులందరికీ అమలు చేయవలసి ఉన్నట్లు బ్యాంకింగ్ నిపుణులు పేర్కొన్నారు. రూ. 50,000, అంతకుమించి విలువగల చెక్కులకు ఈ వ్యవస్థ అమలుకానుంది. అయితే ఈ వ్యవస్థను రూ. 5 లక్షల లోపు సొమ్ము విషయంలో ఖాతాదారుని అభీష్టంమేరకే అమలు చేయవలసి ఉంటుందని తెలుస్తోంది. రూ. 5 లక్షల మొత్తానికి మించిన చెక్కులకు బ్యాంకులు ఈ విధానాన్ని తప్పనిసరి చేయనున్నట్లు సంబంధితవర్గాలు తెలియజేశాయి. -
డిపాజిట్ దారులకు గుడ్ న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ : బ్యాంకు డిపాజిట్ దారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. డిపాజిట్ దారులకు ఇచ్చే బీమాను రూ.లక్ష నుంచి రూ.5లక్షలకు పెంచారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల బలోపేతానికి బడ్జెట్లో రూ.3,50లక్షల కోట్లు కేటాయించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కేంద్ర ఆర్థికమంత్రిగా రెండోసారి ఆమె శనివారం లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా నిర్మాలా సీతారామన్ ప్రసంగిస్తూ...బ్యాంకింగ్ రంగంలో రావాల్సిన అవసరం ఉందన్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమల రుణ పునరుద్ధరణ గడువును 2021వరకు పొడగించినట్లు ప్రకటించారు. దీని ద్వారా 5లక్షల చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు లబ్ది చేకూరుతుందని మంత్రి పేర్కొన్నారు. వేధింపులను కేంద్రం ఉపేక్షించదు స్వచ్ఛమైన, అవినీతరహిత పాలనను అందించడమే తమ ప్రభుత్వ లక్షమని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. పన్నుల పేరుతో వేధింపులను కేంద్రం ఉపేక్షించదన్నారు. ‘అవినీతి రహిత భారత్’ తమ ప్రభుత్వ నినాదమని మంత్రి తెలిపారు. పారిస్ పర్యావరణ ఒడంబికకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. నగరాల్లో పరిశుభ్రతమైన గాలి కోసం రూ.4400 కోట్లతో మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతామన్నారు. 2020లో జీ20 సదస్సుకు రూ.100 కోట్లను ప్రకటించారు. లఢక్ అభివృద్ధికి రూ.5958 కోట్లు, జమ్మూకశ్మీర్ కోసం రూ.38,757 కోట్లు కేటాయించారు. చదవండి : విద్యారంగానికి భారీ కేటాయింపు డీబీఐ, ఎల్ఐసీలో వాటా అమ్మకం కొత్తగా 5 స్మార్ట్ నగరాలు.. -
బ్యాంకింగ్లో కార్పొరేట్ గవర్నెన్స్ కీలకం
అహ్మదాబాద్: దేశంలోని బ్యాంకింగ్ రంగం మెరుగైన సేవలు అందివ్వాలంటే కార్పొరేట్ గవర్నెన్స్ ముఖ్య పాత్ర పోషించాలని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు. అహ్మదాబాద్లో మాట్లాడుతూ బ్యాంకింగ్ వ్యవస్థపై ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బ్యాంకింగ్ వ్యవస్థ పుంజుకోవాలంటే కార్పొరేట్ గవర్నెన్స్ సమర్థవంతమైన పాత్ర పోషించాలని లేకుంటే గదిలోని ఏనుగులా ఏమి ఉపయోగముండదని వ్యాఖ్యానించారు. మరోవైపు నిరర్ధక ఆస్తులు (ఎన్పీఏ) మూలధన కొరత, నిర్వహణ నైపుణ్యం కొరవడటం లాంటి సమస్యలు తలెత్తుతాయని అన్నారు. స్వతంత్ర బోర్డులను ఏర్పాటు చేసి వ్యాపార వృద్ధిని పెంచుకోవాలని అన్నారు. బ్యాంకింగ్ రంగంలో సరైన నియంత్రణ వ్యవస్థలు, సమర్థవంతమైన ఆడిట్ నిర్వహించాలని పేర్కొన్నారు. గత సంవత్సర కాలంగా ఎన్పీఏలు 60.5శాతం నుంచి 48.3శాతం తగ్గాయని దాస్ తెలిపారు. అయితే బ్యాంకింగ్ వ్యవస్థలో మూలధన నిష్పత్తి బాసిల్ అవసరాల కంటే ఎక్కువగానే నమోదయిందన్నారు. -
అమెరికాలో 400 మందికి కుచ్చుటోపీ
వాషింగ్టన్: అమెరికా బ్యాంకింగ్ వ్యవస్థలో చిన్న లోపాన్ని గుర్తించిన ఓ భారతీయ యువకుడు భారీ మోసానికి తెరలేపాడు. దాదాపు 400 మంది భారత సంతతి వ్యక్తులకు రూ.5.59 కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టాడు. దీంతో నిందితుడిని జనవరి 25 అరెస్ట్ చేసిన పోలీసులు కనక్టికట్లోని ఓ కోర్టులో హాజరుపర్చి రిమాండ్కు తరలించారు. 2013లో కిశోర్బాబు అమ్మిశెట్టి(30) అనే వ్యక్తి అమెరికాకు స్టూడెంట్ వీసాపై వచ్చాడు. ఇక్కడి బ్యాంకులు పాటించే ప్రొవిజినల్ క్రెడిట్ విధానం కిశోర్ను ఆకర్షించింది. దీని కింద నగదు చెల్లింపులు జరిగినా రిజిస్టర్ కాకపోతే బ్యాంకులు ఆ మొత్తాన్ని కస్టమర్ల ఖాతాకు జమచేస్తాయి. ఈ నేపథ్యంలో వస్తువుల అమ్మకం, అద్దె ఇళ్లు ప్రకటనలు ఇచ్చే భారత సంతతి వారిని కిశోర్ టార్గెట్ చేసుకున్నాడు. వారి బ్యాంక్ అకౌంట్ వివరాలను తెలుసుకుని.. ఆ బ్యాంకుకు ఫోన్ చేసి కస్టమర్గా నటించేవాడు. తన ఖాతాకు డబ్బులు పంపినా ఇంకా రిజిస్టర్ కాలేదని బుకాయించేవాడు. దీంతో బ్యాంకులు ప్రొవిజినల్ క్రెడిట్ కింద ఆ మొత్తాన్ని ఖాతాల్లో డిపాజిట్ చేసేవి. అనంతరం ఆ డిపాజిట్ దారులకు ఫోన్ చేసి పొరపాటున వారి అకౌంట్లలో నగదు జమ చేశానని చెప్పేవాడు. బాధితులు నిజమని నమ్మి భారీగా నగదును సమర్పించుకున్నారు. ఈ ఖాతాలను సమీక్షించిన బ్యాంకులు, ఎలాంటి బదిలీలు జరగకపోవడంతో డిపాజిట్లను వెనక్కు తీసుకున్నాయి. దీంతో మోసం వెలుగులోకి వచ్చింది. -
కేంద్రంతో ఆర్బీఐకి భిన్నాభిప్రాయాలు సహజమే..
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్కి మధ్య భిన్నాభిప్రాయాలు ఉండటం సహజమేనని, ఇది ఆరోగ్యకరమైన ధోరణేనని ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ ఆర్ గాంధీ వ్యాఖ్యానించారు. అయితే, రెండు పక్షాలు తరచూ చర్చించుకుంటే ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, ఆర్బీఐ తమ డిమాండ్లకు తలొగ్గేలా చేసేందుకు కేంద్రం సెక్షన్ 7ని ప్రయోగించడమనేది తీవ్ర చర్చనీయాంశంగా మారడం దురదృష్టకరమని గాంధీ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వాలు స్వల్పకాలిక దృక్పథంతో ఆలోచిస్తే.. రిజర్వ్ బ్యాంక్ మాత్రం ఎకానమీ శ్రేయస్సు కోసం దీర్ఘకాలిక దృష్టికోణం నుంచి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. ‘ఏదైనా అంశంపై భిన్నాభిప్రాయాల కారణంగా ఒక్కోసారి అంగీకారం కుదరకపోవచ్చు. ఇవి కొత్తేమీ కాదు. అయితే, ప్రభుత్వం, ఆర్బీఐ మధ్యమధ్యలో చర్చించుకున్న పక్షంలో ప్రస్తుతం నెలకొన్న వివాదంలాంటివి తలెత్తవు’ అని గాంధీ పేర్కొన్నారు. ఆర్బీఐ స్వయంప్రతిపత్తిపై కేంద్రం దాడి చేస్తోందన్న వివాదం నెలకొన్న నేపథ్యంలో గాంధీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. డిమాండ్లన్నీ అంగీకరించాలనేమీ లేదు.. బ్యాంకింగ్ వ్యవస్థకు సంబంధించి నిబంధనలు సడలించాలంటూ ఆర్బీఐని కేంద్రం కోరుతున్న అంశంపై స్పందిస్తూ.. ప్రభుత్వ డిమాండ్లన్నింటినీ రిజర్వ్ బ్యాంక్ అంగీకరించాలని లేదన్నారు. సంబంధిత వర్గాలన్నింటి అభిప్రాయాలు సేకరించి, ఎకానమీకి మేలు చేసే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుం దని చెప్పారు. నవంబర్ 19న జరిగే రిజర్వ్ బ్యాంక్ బోర్డు సమావేశంలోనే వివాదాస్పద అంశాలన్నీ పరి ష్కారం కావాలనేమీ లేదని, కొన్నింటిని ఆ తర్వాత రోజుల్లోనైనా చర్చించుకునే అవకాశం ఉందని గాంధీ చెప్పారు. మరోవైపు, వార్షిక ఆడిట్ తర్వాత ఆర్బీఐ తన దగ్గరున్న మిగులు నిధుల నుంచి ప్రభుత్వానికి తగు వాటాలను బదలాయిస్తుందని ఆయన తెలిపారు. దీనిపై నిర్దిష్ట ఫార్ములా ఉండాలంటూ ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ గతంలోనే సూచించారని తెలిపారు. కానీ అప్పట్లో దీనికి అంగీకరించని ప్రభుత్వం ఇప్పుడు అలాంటి ఫార్ములానే కావాలని కోరుతోందని పేర్కొన్నారు. దీనిపై చర్చ జరిగి, తగు విధివిధానాలు రూపొందించుకుంటే ఆర్బీఐ వాటికి కట్టుబడి ఉంటుందని చెప్పారు. -
‘దిద్దుబాటు చర్యల’ మార్గదర్శకాల్లో మార్పులు!
న్యూఢిల్లీ: ఆర్థికంగా బలహీనంగా ఉన్న బ్యాంకులను చక్కదిద్దడానికి ఉద్దేశించిన ‘దిద్దుబాటు చర్యల’ (పీసీఏ) మార్గదర్శకాల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొన్ని మార్పులు చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం... ఇప్పటి వరకూ తీసుకున్న చర్యలు, వాటి ఫలితాలను సమీక్షించిన అనంతరం, బ్యాంకింగ్ విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు ఉంటాయి. కొద్ది వారాల్లో ఇందుకు సంబంధించి నిర్ణయాలు వెలువడతాయి. మంగళవారం జరిగిన ఆర్బీఐ 18 మంది సభ్యుల బోర్డ్ సమావేశం ఈ వార్తల నేపథ్యం. పీసీఏ నిబంధనల గురించి ఈ బోర్డ్ సమావేశం చర్చించినట్లు తెలుస్తోంది. పీసీఏ మార్గదర్శకాల పరిధిలో దాదాపు 11 బ్యాంకులు ఉన్నాయి. దేనాబ్యాంక్, అలహాబాద్ బ్యాంక్తోపాటు యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేషన్ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్, యుకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఈ పదకొండు బ్యాంకుల్లో ఉన్నాయి. వీటిలో రెండు బ్యాంకులు– దేనాబ్యాంక్, అలహాబాద్ బ్యాంక్ వ్యాపార విస్తరణ నియంత్రణలను సైతం ఎదుర్కొంటున్నాయి. ఈ మార్గదర్శకాలు కొంత సరళతరం చేయాలని బ్యాంకులు ఇప్పటికే విజ్ఞప్తి చేసినప్పటికీ, ఇందుకు ఆర్బీఐ ససేమిరా అంది. కాగా జూన్ త్రైమాసికం ముగిసేనాటికి బ్యాంకింగ్ వ్యవస్థ రుణాల్లో మొండిబకాయిలు 11.6 శాతం దాటిన (రూ.12 లక్షల కోట్లు) సంగతి తెలిసిందే. పలు భారీ మొండి అకౌంట్లు ఎన్సీఎల్టీ విచారణలో ఉన్నాయి. -
మొండి బాకీలను ముందే ఎందుకు గుర్తించలేదు?
న్యూఢిల్లీ: దేశ బ్యాంకింగ్ వ్యవస్థలో ఎన్పీఏల నిరోధానికి ముందుగానే చర్యలు తీసుకోవడంలో ఆర్బీఐ వైఫల్యాన్ని పార్లమెంటరీ ప్యానల్ ప్రశ్నించింది. ఆర్బీఐ గవర్నర్గా రఘురామ్ రాజన్ హయాంలో 2015 డిసెంబర్లో చేపట్టిన బ్యాంకుల ఆస్తుల నాణ్యత సమీక్షతో (ఆక్యూఆర్) మొండి బకాయిల (ఎన్పీఏలు) పుట్ట కదిలిన విషయం తెలిసిందే. కానీ, ఈ ఆస్తుల నాణ్యత సమీక్షకు పూర్వమే ఒత్తిడిలో ఉన్న రుణాలకు సంబంధించి ముందస్తు సంకేతాలను ఎందుకు పసిగట్టలేకపోయిందో ఆర్బీఐ వెల్లడించాల్సి ఉందని ఆర్థిక శాఖ స్టాండింగ్ కమిటీ తన నివేదికలో పేర్కొన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఈ నివేదికను కాంగ్రెస్ నేత వీరప్పమొయిలీ అధ్యక్షతన గల స్టాండింగ్ కమిటీ సోమవారమే ఆమోదంలోకి తీసుకుందని, శీతాకాల సమావేశాల్లో పార్లమెంటు ముందుంచే అవకాశం ఉందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఈ కమిటీలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సైతం సభ్యుడిగా ఉన్నారు. పునరుద్ధరణ పథకాల ద్వారా ఒత్తిడిలోని రుణాలను ఎప్పటికప్పుడు కొనసాగించడం వెనుక కారణాలను ఈ కమిటీ ప్రశ్నించింది. ఎన్పీఏ విషయంలో ఆర్బీఐ పాత్ర ఆశించిన స్థాయిలో లేదని కమిటీ అభిప్రాయపడింది. 2015 మార్చి, 2018 మార్చి మధ్య ప్రభుత్వరంగ బ్యాంకుల ఎన్పీఏలు రూ.6.2 లక్షల కోట్ల మేర పెరిగిపోయిన నేపథ్యంలో కమిటీ ఆర్బీఐ పాత్రపై సంతృప్తిగా లేనట్టు తెలుస్తోంది. జీడీపీ రేషియోలో రుణాల జారీ 2017 డిసెంబర్ నాటికి చైనాలో 208 శాతం, బ్రిటన్లో 170 శాతం, అమెరికాలో 152 శాతంగా ఉంటే, మన దేశంలో తక్కువగా 54.5 శాతమే ఉండడాన్ని కమిటీ ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో ఇతర దేశాల్లో ఉన్న అస్సెట్, క్యాపిటల్ లెవరేజ్ నిష్పత్తిని (ఆస్తులు, నిధుల మధ్య అంతరం) ఆర్బీఐ పరిశీలించడం ద్వారా, బ్యాంకుల నిధుల పరిమాణాన్ని పెంచే మార్గాలను అన్వేషించాలని సూచించింది. బ్యాంకుల్లో రూ.250 కోట్లకు మించిన ఎన్పీఏ ఖాతాలను ప్రత్యేకమైన ఏజెన్సీల ద్వారా పర్యవేక్షించాల్సిన అవసరాన్ని ప్రస్తావించింది. ఇందుకోసం నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీని ఏర్పాటు చేయాలని సూచించింది. -
‘బ్యాడ్ బ్యాంక్’కు బ్యాంకర్ల సై
ముంబై: బ్యాంకింగ్ వ్యవస్థలో భారీగా పేరుకుపోతున్న మొండిబాకీల సమస్య పరిష్కారం కోసం ప్రత్యేకంగా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ (ఏఎంసీ) లేదా అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ (ఏఆర్సీ)ని ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు బ్యాంకర్ల నుంచి మద్దతు లభించింది. వ్యావహారికంగా ’బ్యాడ్ బ్యాంక్’ కింద పరిగణిస్తున్న ఈ సంస్థ సాధ్యాసాధ్యాలు పరిశీలించేందుకు ఏర్పాటైన సునీల్ మెహతా కమిటీ ఇందుకు సంబంధించిన నివేదికను కేంద్ర ఆర్థిక శాఖకు సోమవారం సమర్పించింది. ఇప్పటికే బ్యాంకులు ప్రమోట్ చేస్తున్న అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ ఆర్సిల్ కింద ఈ తరహా ఏఎంసీని ఏర్పాటు చేయొచ్చని పేర్కొంది. అలాగే, ఇందులో వెలుపలి నిపుణులను నియమించాలని ఇందులో సిఫార్సు చేసింది. అలాగే కొన్ని వర్గాలు సూచిస్తున్నట్లుగా.. దీని ఏర్పాటుకు ప్రజాధనం లేదా విదేశీ మారక నిల్వల నిధులను వినియోగించుకోవడం కాకుండా బ్యాంకులు, విదేశీ ఇన్వెస్టర్ల నుంచి నిధులను సమకూర్చుకోవాలని సిఫార్సు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఏఎంసీ పనితీరు ఇలా.. కమిటీ సిఫార్సుల ప్రకారం చూస్తే ప్రతిపాదిత నేషనల్ ఏఎంసీ పనితీరు ఇలా ఉండవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ♦ బ్యాంకుల నుంచి కొనుగోలు చేసే మొండి ఖాతాలను మదింపు చేసిన తర్వాత నేషనల్ ఏఎంసీ నిర్దిష్ట ధరను ఖరారు చేస్తుంది. ♦ సదరు అసెట్కి సంబంధించి ముందస్తుగా 15 శాతం మొత్తాన్ని బ్యాంకులకు చెల్లిస్తుంది. ♦ ఆ తర్వాత అసెట్ విక్రయానికి ప్రైవేట్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీలు, అసెట్ ఫండ్స్ మొదలైన వాటి నుంచి స్విస్ చాలెంజ్ పద్ధతిలో బిడ్లు ఆహ్వానిస్తుంది. ♦ ఒకవేళ ప్రైవేట్ సంస్థ గానీ బిడ్ దక్కించుకున్న పక్షంలో.. నేషనల్ ఏఎంసీ ముందస్తుగా బ్యాం కులకు ఇచ్చిన 15% మొత్తాన్ని కూడా దానికి తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అలా కాకుండా వేలంలో ప్రైవేట్ బిడ్డరు ఎవరూ ముందుకు రాని పక్షంలో బ్యాంకులకు ఇవ్వాల్సిన మిగతా 85% మొత్తాన్ని ఏఎంసీనే చెల్లించేస్తుంది. ♦ ఆ తర్వాత బ్యాంకుల నుంచి తీసుకున్న అసెట్స్ను నిపుణుల పర్యవేక్షణలో క్రమానుగతంగా విక్రయించి నిధులు రాబట్టుకుంటుంది. గుదిబండలా మొండిబాకీలు .. ప్రస్తుతం బ్యాంకింగ్ వ్యవస్థలో మొండి బాకీలు 11.6 శాతానికి ఎగిశాయి. ఇవి వచ్చే మార్చి నాటికి 12.2 శాతానికి ఎగియొచ్చంటూ ఆర్థిక స్థిరత్వ నివేదికలో రిజర్వ్ బ్యాంక్ అంచనా వేస్తోంది. సుమారు రూ. 11 లక్షల కోట్ల పైగా పేరుకుపోయిన మొండిబాకీల్లో.. భూషణ్ స్టీల్, అలోక్ ఇండస్ట్రీస్, ఎస్సార్ స్టీల్ వంటి కేవలం 40 కంపెనీల వాటానే దాదాపు 40 శాతం పైచిలుకు ఉంది. రిజర్వ్ బ్యాంక్ నిబంధనలు కఠినతరం చేయడంతో వీటి నుంచి బకాయిలు రాబట్టుకునే ప్రక్రియ కొనసాగుతోంది. మొండి బాకీల సమస్యను వేగవంతంగా పరిష్కరించే దిశగా స్వతంత్ర అసెట్ మేనేజ్మెంట్ సంస్థలను (ఏఎంసీ), స్టీరింగ్ కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి పియుష్ గోయల్ వెల్లడించారు. రూ. 500 కోట్ల పైబడిన నిరర్ధక ఆస్తుల (ఎన్పీఏ) పరిష్కారానికి ఏఎంసీ లేదా ప్రత్యామ్నాయ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ను నెలకొల్పాలంటూ సునీల్ మెహతా కమిటీ సిఫార్సు చేసిందని ఆయన పేర్కొన్నారు. ఈ కోవకి చెందిన ఖాతాలు దాదాపు 200 పైచిలుకు ఉన్నాయి. ఈ సంస్థలు బ్యాంకులకు సుమారు రూ. 3.1 లక్షల కోట్లు బాకీపడ్డాయి. మెహతా కమిటీ నిర్దిష్టంగా బ్యాడ్ బ్యాంక్ను సిఫార్సు చేయలేదని, ఏఎంసీ ఏర్పాటే ప్రతిపాదించిందని మంత్రి తెలిపారు. కమిటీ సిఫార్సుల ప్రకారం రూ. 50 కోట్ల దాకా మొండిబాకీలపై స్టీరింగ్ కమిటీలు, రూ. 50 కోట్ల నుంచి రూ. 500 కోట్ల దాకా బాకీలపై అంతర్బ్యాంకుల కమిటీలు నిర్ణయాలు తీసుకుంటాయి. -
మొండిబాకీలు మరింత పెరుగుతాయ్..
ముంబై: దేశీ బ్యాంకింగ్ వ్యవస్థలో స్థూల మొండిబాకీలు (జీఎన్పీఏ) ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి 11.5 శాతానికి చేరొచ్చని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇవి 11.2 శాతంగా ఉన్నాయి. 2017 మార్చి 31తో ముగిసిన సంవత్సరంలో రూ. 8 లక్షల కోట్లుగా (ఇచ్చిన రుణాల్లో 9.5 శాతం)గా ఉన్న జీఎన్పీఏలు గత ఆర్థిక సంవత్సరంలో 10.3 లక్షల కోట్లకు (11.2 శాతం) చేరాయి. ఈసారి 11.5 శాతానికి చేరిన తర్వాత నుంచి జీఎన్పీఏలు క్రమంగా తగ్గుముఖం పట్టగలవని క్రిసిల్ పేర్కొంది. మొండిబాకీలు, ప్రొవిజనింగ్ వ్యయాలు భారీగా ఎగియడంతో గత ఆర్థిక సంవత్సరం బ్యాంకింగ్ వ్యవస్థలో ఏకంగా రూ. 40,000 కోట్ల పైచిలుకు నష్టాలు నమోదయ్యాయి. దివాలా చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత.. ఫిబ్రవరిలో రిజర్వ్ బ్యాంక్ వివిధ రుణ పునర్వ్యవస్థీకరణ పథకాలను ఉపసంహరించడం కూడా.. మొండిబాకీల్లో అయిదో వంతుకు కారణమయ్యాయని క్రిసిల్ వివరించింది. మరోవైపు, ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) .. బాసెల్ త్రీ నిబంధనలను పాటించాలంటే అదనపు మూలధనం కోసం కేంద్రంపైనే ఎక్కువగా ఆధారపడాల్సి రావొచ్చని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం నష్టాలు ఊహించిన దానికి మించిన నేపథ్యంలో.. కేంద్రం ప్రకటించిన రూ. 2.1 లక్షల కోట్ల అదనపు మూలధనం నిధులు పీఎస్బీల అవసరాలకు సరిపోకపోవచ్చని క్రిసిల్ తెలిపింది. తగ్గనున్న ఎన్పీఏలు.. ఎన్పీఏల పెరుగుదల గరిష్ట స్థాయికి చేరిందని, ఇక మెల్లగా తగ్గుముఖం పట్టవచ్చనేది క్రిసిల్ అంచనా. ఎన్పీఏల నుంచి రికవరీలు మెరుగ్గా ఉండటం, ప్రొవిజనింగ్ తగ్గే అవకాశాలు మొదలైనవి బ్యాంకులకు సానుకూలాంశాలుగా పేర్కొంది. స్పెషల్ మెన్షన్ అకౌంట్2 కింద వర్గీకరించిన 60–90 రోజుల మేర బకాయిల పరిమాణం గత ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి సుమారు సగం తగ్గి 0.8%కి చేరింది. అంతక్రితం ఏడాది ఇది 2 శాతంగా నమోదైంది. ఎన్పీఏలుగా మారే అవకాశాలు ఉన్న రుణాలు తగ్గుతున్నాయనడాన్ని తాజా పరిణామం సూచిస్తోందని క్రిసిల్ తెలిపింది. ఇక, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) విచారణ జరుపుతున్న మొండి బాకీ కేసుల నుంచి కూడా బ్యాంకులకు మెరుగ్గానే రికవరీ కాగలదని అంచనా వేస్తున్నట్లు క్రిసిల్ సీనియర్ డైరెక్టర్ కృష్ణన్ సీతారామన్ తెలిపారు. ఎన్సీఎల్టీ ముందున్న మొత్తం 3.3 లక్షల కోట్ల రుణాలకు సంబంధించిన కేసుల్లో సుమారు పావు వంతు కేసులు ఉక్కు సంస్థలవే ఉన్నాయి. ఉక్కు రంగం పరిస్థితులు మెరుగుపడుతున్న నేపథ్యంలో వేలంలో ఈ సంస్థలపై మంచి ఆసక్తి వ్యక్తమవుతుండటం సానుకూల అంశమని కృష్ణన్ చెప్పారు. -
‘మోదీ బ్యాంకింగ్ వ్యవస్థను ధ్వంసం చేశారు’
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఏటీఎంల్లో నగదు కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ విమర్శలతో విరుచుకుపడ్డారు. మోదీజీ దేశ బ్యాంకింగ్ వ్యవస్థను ధ్వంసం చేశారని ధ్వజమెత్తారు. పీఎన్బీ స్కామ్ను ప్రస్తావిస్తూ డైమండ్ వ్యాపారి నీరవ్ మోదీ రూ 30,000 కోట్లతో విదేశాలకు ఉడాయించినా ప్రధాని మౌనంగా ఉన్నారని ట్వీట్ చేశారు. నోట్ల రద్దులో భాగంగా రూ 500, రూ 1000 నోట్లను నిర్మూలించిన ప్రధాని వాటిని నీరవ్ మోదీకి అప్పగించారని ఆరోపించారు. మరోవైపు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, వారణాసి, వదోదర, భోపాల్, పాట్నా, ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఏటీఎంలో నగదు నిల్వలు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బ్యాంక్ బ్రాంచ్లకూ ఖాతాదారులు నగదు కోసం బారులు తీరుతున్నారు. కాగా బెయిల్ఇన్ బిల్లు ఆందోళన నేపథ్యంలో ప్రజలు భారీ మొత్తంలో నగదు విత్డ్రాలకు దిగుతుండటంతో నగదు కొరత ఏర్పడిందని బ్యాంకు అధికారులు చెబుతున్నట్టు వార్తలు రావడం కలకలం రేపుతోంది. -
రద్దు చేసిన రుణాలు 13 శాతం!
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ వ్యవస్థలో రుణాల రైటాఫ్ క్రమంగా తగ్గుతోంది. గతేడాది మార్చి ఆఖరుకి స్థూల మొండిబాకీల్లో.. రద్దు చేసిన రుణాల పరిమాణం 13%కి తగ్గింది. రిజర్వ్ బ్యాంక్ గణాంకాల ప్రకారం 2011 మార్చిలో ఇది గరిష్టంగా 25% స్థాయిలో నమోదైంది. 2006లో స్థూల ఎన్పీఏల్లో రైటాఫ్ చేసిన రుణాల పరిమాణం 21% ఉండగా, 2011 మార్చి నాటికి ఇది 25%కి ఎగిసింది. రైటాఫ్లు ఆ తర్వాత 2015 మార్చికి 18%, గతేడాది మార్చి నాటికి 13%కి తగ్గాయి. సాధారణంగా పన్ను ప్రయోజనాలకు, మూలధనాన్ని మరింత మెరుగ్గా ఉపయోగించుకోవడం తదితర అవసరాల కోసం మొండిబాకీలను రద్దు చేయడం ద్వారా బ్యాంకులు తమ బ్యాలెన్స్ షీట్స్ను ప్రక్షాళన చేసుకుంటూ ఉంటాయి. అయితే, ఖాతాల్లో రైటాఫ్ చేసినప్పటికీ.. రుణగ్రహీత సదరు రుణాలను తిరిగి చెల్లించాల్సిందే. దివాలా చట్టం, డెట్ రికవరీ ట్రిబ్యునల్ తదితర మార్గాల్లో బాకీలను వసూలు చేసుకునేందుకు బ్యాంకుల ప్రయత్నాలు కొనసాగుతూనే ఉంటాయి. 2014–15 ఆర్థిక సంవత్సరం నుంచి 2017 సెప్టెంబర్ దాకా ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ. 2,41,911 కోట్లు రైటాఫ్ చేశాయి. -
త్వరలో గరిష్ట స్థాయికి ఎన్పీఏలు
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మధ్యనాటికల్లా బ్యాంకింగ్ వ్యవస్థలో మొండిబాకీలు (ఎన్పీఏ) గరిష్ట స్థాయికి ఎగియనున్నాయి. ఆ తర్వాత నుంచి క్రమంగా తగ్గుముఖం పట్టనున్నాయి. అయితే, బ్యాంకర్లపై మోసాలు, కుంభకోణాల ఆరోపణల నేపథ్యంలో రుణాల వృద్ధిపై ప్రతికూల ప్రభావం పడనుంది. రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ ఒక నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. మొండిబాకీల సమస్య పరిష్కారానికి సంబంధించి ఫిబ్రవరి 12న ప్రకటించిన నిబంధనలతో మార్చి త్రైమాసికంలో ఎన్పీఏలు భారీగా పెరుగుతాయని, 2018–19 మధ్యలో గరిష్ట స్థాయికి చేరుకుంటాయని క్రిసిల్ పేర్కొంది. గతేడాది మార్చి క్వార్టర్తో పోలిస్తే ఈ మార్చి త్రైమాసికంలో స్థూల ఎన్పీఏలు 9.4 శాతం నుంచి 11 శాతానికి పెరగొచ్చని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 11.5 శాతానికి ఎగిసి, క్రమంగా 2019 మార్చి నాటికి 10.3 శాతానికి తగ్గొచ్చని క్రిసిల్ సీనియర్ డైరెక్టర్ సోమశేఖర్ వేమూరి వివరించారు. ఎన్పీఏ సమస్యలు తగ్గిన తర్వాత నుంచి మళ్లీ రుణాల వృద్ధి, నిర్వహణ లాభాలు మొదలైన అంశాలపైకి దృష్టి మళ్లగలదని ఆయన చెప్పారు. అయితే, పంజాబ్ నేషనల్ బ్యాంక్లో రూ. 12,900 కోట్ల నీరవ్ మోదీ కుంభకోణం, ఐసీఐసీఐ బ్యాంక్లో క్విడ్ ప్రో కో ఆరోపణలు మొదలైనవి రుణ వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. -
ఐసీఐసీఐలో ‘కొచర్’ దుమారం
-
ఐసీఐసీఐలో ‘కొచర్’ దుమారం
ముంబై, న్యూఢిల్లీ : కార్పొరేట్లు, బ్యాంకర్లు కుమ్మక్కై బ్యాంకింగ్ వ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్నారన్న ఆరోపణలకు బలమిస్తూ.. మరో కుంభకోణం!! ఈ సారి బయటపడింది ప్రయివేటు దిగ్గజం ఐసీఐసీఐలో. దేశంలోనే రెండో అతి పెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో చందా కొచర్.. క్విడ్ ప్రో కో విమర్శలకు కేంద్ర బిందువయ్యారు. వీడియోకాన్ గ్రూప్నకు రుణాలిచ్చినందుకు కొచర్ కుటుంబం లబ్ధి పొందిందనే ఆరోపణల వెనకున్న ఆధారాలు చూస్తుంటే... ప్రైవేట్ బ్యాంకుల్లోనూ కార్పొరేట్ గవర్నెన్స్ సందేహాస్పదమయిందని అనిపించకమానదు. ఒక పరిశోధనాత్మక కథనం ప్రకారం డిసెంబర్ 2008లో ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో, ఎండీ చందా కొచర్ భర్త దీపక్ కొచర్తో పాటు ఆమె మరో ఇద్దరు బంధువులతో కలసి వీడియోకాన్ గ్రూప్ ప్రమోటరు వేణుగోపాల్ ధూత్.. న్యూపవర్ గ్రూప్ను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత తన సొంత కంపెనీ నుంచి ఈ కొత్త సంస్థకు రూ.64 కోట్ల రుణమిచ్చిన ధూత్... ఆపై కేవలం రూ.9 లక్షలకు న్యూపవర్లోని తన వాటాలు, యాజమాన్య అధికారాలన్నీ దీపక్ కొచర్కి బదలాయించేశారు. అయితే, వీడియోకాన్ గ్రూప్నకు ఐసీఐసీఐ బ్యాంకు నుంచి రూ. 3,250 కోట్ల మేర రుణం మంజూరైన ఆరు నెలల్లోనే ‘న్యూపవర్’ కంపెనీ చేతులు మారటం చర్చనీయమైంది. ఇందులో లబ్ధిదారు చందా కొచర్ భర్త దీపక్ కొచర్, ఇతర కుటుంబీకులు కావడంతో ఆమె పాత్రపై సందేహాలు తలెత్తుతున్నాయి. మరోవైపు, వీడియోకాన్ తీసుకున్న రుణ మొత్తంలో ఇప్పటికీ 86 శాతం భాగం (సుమారు రూ.2,810 కోట్లు) కట్టనే లేదు. 2017లో వీడియోకాన్ ఖాతాను మొండిపద్దుగా వర్గీకరించారు. తాజా ఆరోపణల నేపథ్యంలో ఈ వ్యవహారంపై దర్యాప్తు ఏజెన్సీలు కూడా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. న్యూపవర్ ఆర్థిక పరిస్థితి ఇదీ.. 2008 డిసెంబర్లో ఏర్పాటైన న్యూపవర్.. గత ఆరు ఆర్థిక సంవత్సరాలుగా నష్టాలు ప్రకటిస్తూనే ఉంది. 2012–17 మధ్య కంపెనీ నష్టాలు రూ.78 కోట్ల మేర పేరుకుపోయాయి. 2017లో రూ.14.3 కోట్ల నష్టం ప్రకటించింది. 2016 మార్చి 31 నాటి దాకా సుప్రీమ్ ఎనర్జీ, పినాకిల్ ఎనర్జీలతో పాటు కొచర్కి న్యూపవర్లో 96.23 శాతం వాటాలు ఉన్నాయి. అయితే, 2017 మార్చి నాటికి సుప్రీమ్, పినాకిల్తో కలిపి ప్రత్యక్షంగా, పరోక్షంగా దీపక్ కొచర్ వాటాలు 43.4 శాతంగా ఉన్నాయి. మిగతా వాటాలు మారిషస్కి చెందిన డీహెచ్ రెన్యూవబుల్స్ చేతిలో ఉన్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ ఏమంటుందంటే.. తాజా వ్యవహారంపై ఐసీఐసీఐ స్పందిస్తూ... ‘‘2012లో ఎస్బీఐ సారథ్యంలో 20 బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కన్సార్షియంగా ఏర్పడి చమురు, గ్యాస్ ఉత్పత్తి కార్యకలాపాల కోసం వీడియోకాన్కు సుమారు రూ.40,000 కోట్లు రుణాలిచ్చాయి. ఇందులో మా వాటా కేవలం రూ.3,250 కోట్లే. మిగిలిన బకాయి రూ.2,810 కోట్లు.. వడ్డీతో కలసి వీడియోకాన్ చెల్లించాల్సింది రూ.2,849 కోట్లు. 2017లో గ్రూప్ ఖాతాను మొండి పద్దుగా వర్గీకరించాం’’ అని వివరణిచ్చింది. దీనిపై ఐసీఐసీఐ చైర్మన్ ఎం.కె. శర్మ మాట్లాడుతూ... కన్సార్షియంలో ఎస్బీఐ, ఐడీబీఐ బ్యాంకులు రుణాలు మంజూరు చేశాకే 2012లో ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కమిటీ తన వంతు రుణం మంజూరు చేసిందని చెప్పారు. సదరు కమిటీకి అప్పట్లో చందా కొచర్ చైర్పర్సన్గా లేరని స్పష్టం చేశారు. బ్యాంకులో ఏ స్థాయి ఉద్యోగైనా సరే రుణ నిర్ణయాలను ప్రభావితం చేయలేరని పేర్కొన్నారు. 2009లోనే వదిలేశా: ధూత్ ‘‘నేను 2009లోనే న్యూపవర్ రెన్యువబుల్స్, సుప్రీమ్ ఎనర్జీ సంస్థల నుంచి వైదొలిగాను. న్యూపవర్లో 24,996 షేర్లను, సుప్రీమ్ ఎనర్జీలో 9,990 షేర్లను అమ్మేసి పూర్తి హక్కులను వదులుకున్నాను. చమురు, టెలికం వ్యాపారాలతో బిజీ అయిపోవడంతో.. ఆ రోజు నుంచి రెండు కంపెనీలతో సంబంధాలు వదులుకున్నాను’’ అని ధూత్ వివరించారు. కానీ ఆర్ఓసీలో దాఖలు చేసిన ఫైలింగ్స్ ప్రకారం చూస్తే 2010 అక్టోబర్ దాకా సుప్రీం ఎనర్జీకి ఆయన యజమానిగా కొనసాగినట్లు, 2010 నవంబర్లో మాత్రమే తన షేర్లను అనుచరుడు పుంగ్లియాకు బదలాయించినట్లుగా తెలుస్తోంది. న్యూపవర్ వివరణ ఇదీ.. ఈ లావాదేవీల్లో పరస్పరం ప్రయోజనాలు పొందారనడానికేమీ లేదని న్యూపవర్ వివరణనిచ్చింది. అసలు పినాకిల్ ఎనర్జీ ట్రస్టుకు గానీ, సుప్రీమ్ ఎనర్జీకి గానీ ఐసీఐసీఐ బ్యాంకుతో ఎలాంటి వ్యాపార సంబంధాలూ లేవని స్పష్టం చేసింది. లావాదేవీలు జరిగాయిలా.. ♦ 2008 డిసెంబర్లో దీపక్ కొచర్, వేణుగోపాల్ ధూత్లు కలసి న్యూపవర్ రెన్యూవబుల్స్ (ఎన్ఆర్పీఎల్) ఏర్పాటు చేశారు. ఇందులో ధూత్, ఆయన కుటుంబ సభ్యులు, ఇతర సంబంధీకులకు 50 శాతం వాటాలుండేవి. అలాగే దీపక్ కొచర్కి, ఆయన తండ్రికి చెందిన పసిఫిక్ క్యాపిటల్ సంస్థకు, చందా కొచర్ సోదరుడి భార్యకు మిగతా 50 శాతం వాటాలుండేవి. ♦ 2009 జనవరిలో న్యూపవర్ డైరెక్టర్ పదవికి ధూత్ రాజీనామా చేశారు. రూ. 2.5 లక్షల మొత్తానికి కంపెనీలో తనకున్న 24,999 షేర్లను దీపక్ కొచర్కి బదలాయించారు. ♦ 2010 మార్చిలో సుప్రీమ్ ఎనర్జీ అనే సంస్థ నుంచి న్యూపవర్కి రూ.64 కోట్ల రుణం (ఫుల్లీ కన్వర్టబుల్ డిబెంచర్ రూపంలో) లభించింది. ఈ సుప్రీమ్ ఎనర్జీలో ధూత్కి 99.9 శాతం వాటాలు ఉన్నాయి. ♦ ధూత్ నుంచి కొచర్కి.. ఆ తర్వాత కొచర్ కుటుంబీకులకు చెందిన పసిఫిక్ క్యాపిటల్ నుంచి షేర్లు సుప్రీమ్ ఎనర్జీకి ఒక ఒక పద్ధతి ప్రకారం న్యూపవర్ షేర్ల బదలాయింపు జరిగింది. ఫలితంగా 2010 మార్చి ఆఖరుకు న్యూపవర్లో సుప్రీమ్ ఎనర్జీ 94.99 శాతం వాటాదారుగా అవతరించింది. మిగతా వాటాలు కొచర్ పేరిటే ఉండిపోయాయి. ♦ 2010 నవంబర్లో ధూత్ సుప్రీమ్ ఎనర్జీలో తనకున్న మొత్తం వాటాలను.. తన అనుచరుడు మహేష్ చంద్ర పుంగ్లియాకు బదలాయించారు. ♦ ఈ పుంగ్లియా.. 2012 సెప్టెంబర్ 29 నుంచి 2013 ఏప్రిల్ 29 మధ్య తన వాటాలను పినాకిల్ ఎనర్జీ అనే ట్రస్టుకు బదలాయించారు. దీనికి మేనేజింగ్ ట్రస్టీగా దీపక్ కొచర్ ఉన్నారు. ఈ షేర్ల విలువ రూ.9 లక్షలుగా చూపించారు. అంటే న్యూపవర్కి రూ. 64 కోట్ల రుణాలిచ్చిన ధూత్ సంస్థ సుప్రీమ్ ఎనర్జీ .. మూడేళ్ల వ్యవధిలో దీపక్ కొచర్కి చెందిన పినాకిల్ ఎనర్జీ అనే కంపెనీలో కలిసిపోయింది. ఐసీఐసీఐ బ్యాంకుకు రూ.59 కోట్ల జరిమానా బాండ్ల విక్రయ నిబంధనలు ఉల్లంఘించినందుకే... ముంబై: ప్రైవేటు రంగ ఐసీఐసీఐ బ్యాంకుపై ఆర్బీఐ రూ.58.9 కోట్ల జరిమానా విధించింది. హెచ్టీఎం (హెల్డ్ టు మెచ్యూరిటీ) సెక్యూరిటీలను నేరుగా విక్రయించే విషయంలో మార్గదర్శకాలను ఐసీఐసీఐ బ్యాంకు ఉల్లంఘించినట్టు ఆర్బీఐ పేర్కొంది. అయితే, ఆర్బీఐ మార్గదర్శకాలు ఎప్పటి నుంచి అమలయ్యేవనే విషయాన్ని పొరపాటుగా అర్థం చేసుకోవడం వల్లే ఈ ఉల్లంఘన చోటు చేసుకున్నట్లు ఐసీఐసీఐ బ్యాంకు వివరణ ఇచ్చింది. నియంత్రణపరమైన మార్గదర్శకాలను పాటించేందుకు ఎంతో ప్రాధాన్యమిస్తామని బ్యాంకు తెలిపింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్స్ యాక్ట్ 1949 ప్రకారం తనకు లభించిన అధికారాల మేరకు, తాను జారీ చేసిన మార్గదర్శకాలను ఐసీఐసీఐ బ్యాంకు పాటించకపోవడంతో జరిమానా విధించినట్టు ఆర్బీఐ స్పష్టం చేసింది. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం బ్యాంకులు పెట్టుబడులను హెల్డ్ ఫర్ ట్రేడింగ్ (హెచ్ఎఫ్టీ), అవైలబుల్ ఫర్ సేల్ (ఏఎఫ్ఎస్), హెల్డ్ ఫర్ మెచ్యూరిటీ (హెచ్టీఎం) అని మూడు వర్గీకరణలు చేయాల్సి ఉంటుంది. హెచ్టీఎం కేటగిరీలో సెక్యూరిటీలు కాల వ్యవధి తీరే వరకు వాటికి కొనసాగించాలి. ఒకవేళ ఈ విభాగం నుంచి సెక్యూరిటీలను విక్రయించినట్టయితే, అది ఈ విభాగంలో అవసరమైన పెట్టుబడుల్లో 5 శాతానికి మించితే ఆర్బీఐకి తెలియజేయాలి. కానీ, ఐసీఐసీఐ బ్యాంకు తెలియజేయలేదు. -
వృద్ధి వేగానికి బ్యాంకింగ్ కష్టాలు అడ్డు!
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ వ్యవస్థలో నెలకొన్న ప్రతికూల పరిస్థితులు భారత్ వృద్ధికి విఘాతం కలిగించనున్నట్లు అంతర్జాతీయ బ్యాంకింగ్ సేవల దిగ్గజం– గోల్డ్మన్ శాక్స్ విశ్లేషిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి అంచనాలనూ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ డౌన్గ్రేడ్ చేసింది. 2019 మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరానికి వృద్ధి అంచనాలను 7.6 శాతానికి తగ్గించింది. ఇంతక్రితం ఈ అంచనా 8 శాతం. ప్రభుత్వ రంగంలో రెండవ బ్యాంకింగ్ దిగ్గజం– పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)లో దాదాపు రూ.13,000 కోట్ల కుంభకోణం గోల్డ్మన్ శాక్స్ తాజా అంచనాలకు నేపథ్యం... రెండేళ్ల కాలానికి రూ.2.11 లక్షల కోట్ల తాజా మూలధనాన్ని బ్యాంకింగ్కు ప్రకటిస్తూ, రుణ వృద్ధికి, ఉద్యోగ కల్పనకు ఈ చర్య దోహదపడుతుందని ప్రకటిస్తున్న కేంద్రానికి గోల్డ్మన్ శాక్స్ తాజా నివేదిక ఆందోళన కలిగించేదే. బ్యాంక్ విడుదల చేసిన అంచనాల్లో ముఖ్యాంశాలను చూస్తే... ♦ ఆర్థిక కుంభకోణాల నేపథ్యంలో...బ్యాంకింగ్ రంగంలో కఠినతరమైన నియంత్రణ విధానాలను అమల్లోకి తెచ్చే అవకాశం ఉంది. ఇది రుణ వృద్ధికి తద్వారా ఆర్థిక వేగానికి విఘాతం కలిగిస్తుంది. ♦ ఇక బ్యాంకులపై మొండిబకాయిల భారం ఇప్పటికిప్పుడు తగ్గే అవకాశాలు కనిపించడం లేదు. బ్యాంకు బ్యాలన్స్ షీట్లలో ఉన్న రూ.8.5 లక్షల కోట్ల ఎన్పీఏల తీవ్రత ఇంకా ఎక్కువగానే ఉంది. ♦ మొండిబకాయిలకు ప్రొవిజనింగ్లు పెంచాల్సి రావడం, రుణ వృద్ధిపై పరోక్షంగా తీవ్ర ప్రభావాన్నే చూపుతుంది. ♦ భారత్ వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 6.6 శాతం వృద్ధి సాధించే అవకాశం ఉంది. 2019–20లో 8.3 శాతం వృద్ధి నమోదవుతుందన్న తొలి అంచనాల్లో ఇప్పటికి ఎటువంటి మార్పూ లేదు. -
డిపాజిట్ రేట్లు పెంచిన ఎస్బీఐ
ముంబై: బ్యాంకింగ్ వ్యవస్థలో ఇక నుంచి వడ్డీ రేట్ల పెరుగుదలకు సూచనగా.. ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) డిపాజిట్ రేట్లను పెంచింది. వివిధ కాలావధులకు సంబంధించి రిటైల్, బల్క్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 0.75 శాతం దాకా పెంచుతున్నట్లు బుధవారం ప్రకటించింది. పెంచిన రేట్లు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపింది. గడిచిన నాలుగు నెలల్లో ఎస్బీఐ.. బల్క్ టర్మ్ డిపాజిట్ రేట్లు సవరించడం ఇది మూడోసారి. నవంబర్ ఆఖర్లో తొలిసారి రేటు సవరించిన ఎస్బీఐ ఆతర్వాత జనవరిలోనూ మార్చింది. తాజా పరిణామంతో రుణాలపై వడ్డీ రేట్లు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం వీటిని నిర్ణయించడానికి మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ అంశాన్ని ప్రాతిపదికగా తీసుకుంటున్న సంగతి తెలిసిందే. దీంతో డిపాజిట్ రేట్ల పెంపు సహా నిధుల సమీకరణ వ్యయాలు పెరిగిన పక్షంలో ఆ మేరకు ఆటోమేటిక్గా రుణాలపై వడ్డీ రేట్ల పెరుగుదలకు కూడా దారి తీస్తుంది. గత త్రైమాసికం నుంచి పలు బ్యాంకులు క్రమంగా డిపాజిట్, లోన్ రేట్లు పెంచుకుంటూ వస్తున్నాయి. పెరుగుదల ఇలా.. రెండేళ్ల నుంచి పదేళ్ల దాకా కాలవ్యవధి ఉండే రూ. 1 కోటి లోపు రిటైల్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు 0.50 శాతం మేర పెంచుతున్నట్లు ఎస్బీఐ తెలిపింది. దీంతో ఇప్పటిదాకా 6 శాతంగా ఉన్న రేటు 6.50 శాతానికి చేరుతుంది. అలాగే, ఒక్క సంవత్సరం పైబడి.. రెండేళ్ల కన్నా తక్కువ కాలవ్యవధి ఉండే డిపాజిట్స్పై రేటు 0.15 శాతం మేర పెరుగుతుంది. ఫలితంగా ఇప్పటిదాకా 6.25 శాతంగా ఉన్నది ఇకపై 6.40 శాతానికి చేరుతుంది. మరోవైపు, ఏడాది పైబడి.. రెండేళ్ల లోపు మెచ్యూరిటీ ఉండే రూ. 1 కోటి– రూ. 10 కోట్ల దాకా ఉండే బల్క్ డిపాజిట్లపై వడ్డీ రేటు 0.50 శాతం పెరిగి.. 6.25 శాతం నుంచి 6.75 శాతానికి చేరుతుంది. రెండేళ్ల పైబడి.. మూడేళ్ల లోపు కాలవ్యవధి ఉండే బల్క్ డిపాజిట్స్పై పెరుగుదల 0.75 శాతంగా ఉంటుంది. -
స్కాం పుట్టలో... బయటపడని పాములెన్నో
ఏడేళ్లు ఒకేచోట ఎలా సాధ్యం? గోకుల్నాథ్ శెట్టి దాదాపు ఏడేళ్లపాటు ఒకే స్థానంలో కదలకుండా ఉండి.. నీరవ్ మోదీకి, గీతాంజలి జెమ్స్కు బ్యాంకు తరఫున లెటర్ ఆఫ్ అండర్టేకింగ్లను (ఎల్ఓయూ) జారీ చేశారు. ఈ ఏడేళ్లలో ఒక్కసారి కూడా విషయం బయటకు రాలేదు. ఎవరికంటా పడలేదు. పోనీ ఈ ఏడేళ్లలో ఆయన కొన్నిరోజులు సెలవు పెట్టడం చేసుంటారు కదా? అప్పుడైనా ఆయన స్థానంలో వచ్చినవారికి విషయం తెలియాలి కదా? అయినా తరచూ కీలక స్థానాల్లోని వారిని మార్చే బ్యాంకుల్లో.. గోకుల్ శెట్టి ఏడేళ్ల పాటు ఒకే స్థానంలో ఎలా ఉండగలిగారు? అసలు మార్చేదే రుణగ్రహీతలతో సంబంధాల్ని దూరం చేయటానికి కదా! మరి గోకుల్ శెట్టిని మాత్రం ఎందుకు మార్చలేదు? కోర్ బ్యాంకింగ్ సిస్టమ్లో ప్రతి లావాదేవీ నమోదవుతుంది కదా? స్విఫ్ట్ ఆధారిత లావాదేవీలూ సీబీఎస్లో భాగమే కదా? వీటిలో ఏ ఒక్కటీ జరగలేదెందుకు? పెద్దలకు తెలియకుండానే జరిగిందా? ఈ కేసులో మనోజ్ కారత్ అనే మరో సింగిల్ విండో అధికారిని కూడా సీబీఐ అరెస్టు చేసింది. ఆయన గోకుల్ శెట్టితో కలిసి ఈ మోసానికి పాల్పడ్డారన్నది అభియోగం. ఈ ఇద్దరినీ ఏడేళ్ల పాటు మార్చకుండా అదే ఉద్యోగాల్లో కొనసాగించారా? పైపెచ్చు ప్రతి అధికారికీ తన పరిధిలో ఎంత రుణాన్ని ఆమోదించాలి? ఎంత మేరకు ఎల్ఓయూలను జారీ చేయొచ్చు? అన్న నిబంధనలుంటాయి కదా! వీరిద్దరూ వారి పరిమితులను దాటి వందలు, వేల కోట్ల మేర ఎల్ఓయూలను జారీ చేసినా వేరెవరికీ తెలియలేదంటే ఏమనుకోవాలి? పెద్దలు కొందరికి సంబంధం లేదనుకోవాలా? సాఫ్ట్వేర్లో మార్పులు చేశారా? స్విఫ్ట్ ఆధారిత లావాదేవీల్లోనూ అన్నీ ప్రశ్నలే! వివిధ బ్యాంకుల్లోని సీనియర్ అధికారుల సమాచారం ప్రకారం.. కొన్నాళ్ల కిందటివరకూ స్విఫ్ట్ లావాదేవీల్ని ధ్రువీకరించటానికి కనీసం ఇద్దరు అధికారుల అనుమతి ఉండాలి. అంటే ఎవరైనా ఒకరు తప్పు చేస్తే మరో అధికారి సరిదిద్దటానికన్న మాట. దీన్ని బట్టి గోకుల్ శెట్టి ఒక్కరే ఈ లావాదేవీలకు ఆమోదం తెలపలేరన్నది నిజం. మరి వాటిని ఆమోదించిన రెండో అధికారి ఎవరు? ఒకవేళ రెండో అధికారి లేకుండా శెట్టి ఒక్కరే ఇలా చేసి ఉంటే.. అది సాఫ్ట్వేర్ను మార్చటం వల్లే సాధ్యమవుతుంది. అలా చేసి ఉంటారా? మరి సాఫ్ట్వేర్లో మార్పులు చేస్తే ఆ విషయం కోర్ బ్యాంకింగ్ సాఫ్ట్వేర్ను అందజేసిన ఇన్ఫోసిస్కు తెలియకుండా ఉంటుందా? లేదా ఇన్ఫోసిస్ ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదా? ఆడిట్ నుంచి మినహాయించారా? సీనియర్ బ్యాంకు అధికారులు చెప్పే మరో విషయమేంటంటే.. ఎల్ఓయూ అంటే బ్యాంకు గ్యారంటీ లాంటిదే. దాదాపు 110 శాతం మొత్తాన్ని మార్జిన్ మనీగా డిపాజిట్ చేస్తే తప్ప వీటిని జారీ చెయ్యరు. అంటే మనకు కోటి రూపాయల మేర ఎల్ఓయూ కావాలంటే... సదరు బ్యాంకులో రూ.1.10 కోట్లు డిపాజిట్ చేసి ఉండాలి. వాటిని హామీగా ఉంచుకునే సదరు బ్యాంకు ఈ ఎల్ఓయూను జారీ చేస్తుంది. తాజాగా నీరవ్ మోదీ కంపెనీలు పీఎన్బీలో ఎల్ఓయూ కావాలని అడిగితే.. బ్యాంకు ఈ డిపాజిట్ కోసమే పట్టుబట్టింది. అదేమీ లేదని తమకు చాన్నాళ్ల నుంచీ డిపాజిట్లు లేకుండానే ఎల్ఓయూ జారీ చేస్తున్నారని మోదీ గ్రూపు చెప్పటంతోనే తీగ కదిలి... డొంక బయటపడింది! మరి మార్జిన్ మనీ ఏమాత్రం లేకుండానే ఎల్ఓయూలను జారీ చేశారనే విషయం ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా.. బ్యాంకు విధిగా జరిపే ఆడిటింగ్లో కూడా బయట పడలేదెందుకు? బహుశా!! నీరవ్ మోదీలాంటి కుబేరుల ఖాతాలుండే బ్రాంచీలను ఆడిట్ నుంచి మినహాయిస్తారేమో! ఏమో!! అదృశ్య హస్తాలు లేవా? అంతర్గత ఆడిటర్లు గానీ, ఆర్బీఐ గానీ ఎవ్వరూ ఆరేడేళ్ల పాటు ఇంతటి భారీ లావాదేవీలను ఏమాత్రం కనుగొనలేదంటే ఏమనుకోవాలి? విదేశాల్లోని భారతీయ బ్యాంకులు సైతం ఇన్ని నిబంధనల్ని ఉల్లంఘించిన ఎల్ఓయూలపై కిమ్మనకుండా నగదు మంజూరు చేసేశాయంటే ఏమనుకోవాలి? పై స్థాయిలో అదృశ్య హస్తాలు లేవనుకోవాలా? ‘విన్సమ్’ నుంచి పాఠం నేర్వలేదెందుకు? కొన్నాళ్ల కిందట విన్సమ్ డైమండ్స్ సైతం లెటర్ ఆఫ్ క్రెడిట్లను దుర్వినియోగం చేసి భారతీయ బ్యాంకులకు ఏకంగా రూ.6,800 కోట్ల మేర టోపీ పెట్టింది. దీన్లో పీఎన్బీ వాటా రూ.1,800 కోట్లు. అవన్నీ ఇపుడు ఎన్పీఏలుగా మారిపోయాయి. మరి అంతటి దారుణం జరిగాక కూడా పీఎన్బీలో నియంత్రణ వ్యవస్థలు ఏమాత్రం మెరుగుపడలేదనుకోవటానికి తాజా ఉదాహరణ చాలదా? కొసమెరుపు.. కీలకమైన ఇలాంటి కుంభకోణాలన్నీ ప్రధాన నిందితులు దేశం దాటిపోయాకే బయటపడతాయెందుకు? నీరవ్ మోదీ దేశం వదిలివెళ్లాకే వ్యవహారం బయటికొచ్చిందంటే ఆయనకు ఇవన్నీ ముందే తెలుసా? ఇవన్నీ సందేహాలే. ఇప్పటిదాకా సాగిన దర్యాప్తులో వీటిలో ఏ ఒక్కదానికీ జవాబు లేదు. విదేశాల్లోని మన బ్యాంకులు ఎలా ఇచ్చాయి? విదేశాల్లోని మన భారతీయ బ్యాంకులు ఈ ఎల్ఓయూల ఆధారంగా అక్కడి ఎగుమతిదారులకు చెల్లింపులు చేసేశాయి. నిజానికి ఈ ఎల్ఓయూలను 90 రోజుల గడువుకే జారీ చేయాలన్నది నిబంధన. అంటే ఆ 90 రోజుల్లోగా ఎల్ఓయూ జారీ చేయించుకున్న కంపెనీ/వ్యక్తి బ్యాంకుకు ఆ మొత్తం నగదు చెల్లించి వాటిని వెనక్కు తీసుకోవాలి. లేకపోతే తను మార్జిన్ మనీగా ఉంచిన మొత్తాన్ని బ్యాంకు మినహాయించుకుంటుంది. కాకపోతే ఇక్కడ మార్జిన్ మనీగా రూపాయి కూడా లేకుండా వేల కోట్ల ఎల్ఓయూలను జారీ చేశారు. పైపెచ్చు ప్రతి ఎల్ఓయూను ఏడాది కాల వ్యవధికి జారీ చేశారు. 90 రోజుల వ్యవధికి జారీ చేయాల్సిన ఎల్ఓయూను ఏడాదికి జారీ చేశారంటే దాన్ని ఉంచుకుని డబ్బులిచ్చిన విదేశాల్లోని భారతీయ బ్యాంకులకు విషయం తెలిసి ఉంటుంది కదా!! వీటిని నిబంధనలకు విరుద్ధంగా జారీ చేశారనే విషయాన్ని ఏ బ్యాంకూ గమనించలేదా? ఒకటి రెండు సార్లంటే గమనించకపోయి ఉండొచ్చు. కానీ ఆరేడేళ్ల పాటు ఆ నిబంధనను పట్టించుకోకుండా... వాటి ఆధారంగా అక్కడి ఎగుమతిదార్లకు నిధులిచ్చేశాయంటే ఏమనుకోవాలి? ఆయా బ్యాంకుల్లోని పెద్దలకు ఈ కుంభకోణంతో సన్నిహిత సంబంధాలు లేవనుకోవాలా? పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ)ను నీరవ్ మోదీ, గీతాంజలి జెమ్స్ కలిసి ముంచేసిన వ్యవహారంలో రోజులు గడుస్తున్న కొద్దీ.. దొరుకుతున్న జవాబులకన్నా పుట్టుకొస్తున్న ప్రశ్నలే ఎక్కువవుతున్నాయి! ఈ స్కాంలో బ్యాంకుకు సంబంధించి ఇప్పటిదాకా సీబీఐ అరెస్టు చేసింది ఇద్దరినే. ఒకరు రిటైర్డ్ డిప్యూటీ మేనేజర్ గోకుల్నాథ్ శెట్టి, రెండోది సింగిల్ విండో ఆపరేటర్ మనోజ్ కారత్. – సాక్షి, బిజినెస్ విభాగం -
వేగంగా మొండిబాకీల పరిష్కారం
ముంబై: బ్యాంకింగ్ వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తున్న మొండిబాకీల సమస్యను మరింత వేగవంతంగా పరిష్కరించే దిశగా రిజర్వ్ బ్యాంక్ మరిన్ని చర్యలు చేపట్టింది. మొండిబాకీలుగా మారే ఖాతాలను బ్యాంకులు మరింత ముందుగానే గుర్తించి, సత్వరం తగు చర్యలు తీసుకునే విధంగా నిబంధనలను కఠినతరం చేసింది. ప్రస్తుతం అమలు చేస్తున్న పలు రుణ పునర్వ్యవస్థీకరణ స్కీములను రద్దు చేసింది. సవరించిన కొత్త మార్గదర్శకాల ప్రకారం రూ.2,000 కోట్లకు పైగా రుణాలు తీసుకున్న సంస్థ ఖాతా మొండిపద్దుగా మారిన పక్షంలో.. డిఫాల్ట్ అయిన నాటి నుంచి 180 రోజుల్లోగా బ్యాంకులు పరిష్కార ప్రణాళిక అమలు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ కుదరకపోతే దివాలా చట్టం కింద సత్వరం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. నిర్దేశిత మార్గదర్శకాలను ఉల్లంఘించే బ్యాంకులపై జరిమానాలు కూడా విధించడం జరుగుతుందని రిజర్వ్ బ్యాంక్ ఒక నోటిఫికేషన్లో పేర్కొంది. వారంవారీ నివేదికలు.. ప్రస్తుతం అమల్లో ఉన్న కార్పొరేట్ రుణ పునర్వ్యవస్థీకరణ పథకం, వ్యూహాత్మక రుణ పునర్వ్యవస్థీకరణ పథకం (ఎస్డీఆర్) తదితర స్కీమ్లను రిజర్వ్ బ్యాంక్ ఉపసంహరించింది. ఈ స్కీములు ఇంకా అమల్లోకి రాని మొండిబాకీల ఖాతాలన్నింటికీ కొత్త మార్గదర్శకాలు వర్తిస్తాయని పేర్కొంది. మొండిబాకీల పరిష్కారానికి ఉద్దేశించిన జాయింట్ లెండర్స్ ఫోరం (జేఎల్ఎఫ్) విధానాన్ని కూడా ఉపసంహరిస్తున్నట్లు ఆర్బీఐ పేర్కొంది. ఏప్రిల్ 1 నుంచి బ్యాంకులన్నీ ప్రతి నెలా సెంట్రల్ రిపాజిటరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ లార్జ్ క్రెడిట్స్ (సీఆర్ఐఎల్సీ)కి నివేదిక పంపించాల్సి ఉంటుంది. కొత్త నిబంధనల ప్రకారం రూ.5 కోట్లకు పైగా రుణాలు తీసుకున్న రుణగ్రహీతల డిఫాల్ట్ల వివరాలను బ్యాంకులు ప్రతి శుక్రవారం తెలియజేయాలి. ఒకవేళ శుక్రవారం సెలవైతే అంతకు ముందు రోజు పంపాలి. వారం వారీ నివేదికల నిబంధన ఫిబ్రవరి 23 నుంచే అమల్లోకి వస్తుంది. ఒక్క దెబ్బతో ప్రక్షాళన..: కొత్త నిబంధనలు డిఫాల్టర్లకు ‘మేల్కొలుపు’ లాంటివని కేంద్ర ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి రాజీవ్ కుమార్ వ్యాఖ్యానించారు. మొండిబాకీల సమస్య పరిష్కారాన్ని పదే పదే వాయిదా వేయకుండా, ఒక్క దెబ్బతో ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. బ్యాంకుల ప్రొవిజనింగ్ నిబంధనలపై ఆర్బీఐ నిర్ణయం పెద్దగా ప్రభావం చూపబోదని రాజీవ్ కుమార్ తెలిపారు. మొండిబాకీలుగా మారే అవకాశమున్న పద్దులను బ్యాంకులు మరింత ముందుగా గుర్తించి, నిర్దిష్ట గడువులోగా పరిష్కార ప్రణాళికలను అమలు చేసేలా కొత్త మార్గదర్శకాలు దోహదపడతాయని ఆయన చెప్పారు. 2017 సెప్టెంబర్ 30 నాటికి స్థూలంగా ఎన్పీఏలు ప్రభుత్వ బ్యాంకుల్లో రూ. 7,33,974 కోట్ల మేర, ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో రూ. 1,02,808 కోట్ల మేర పేరుకుపోయిన సంగతి తెలిసిందే. భారీగా పేరుకుపోయిన మొండిబాకీల సమస్య పరిష్కారం కోసం రిజర్వ్ బ్యాంక్కు ప్రభుత్వం మరిన్ని అధికారాలు కట్టబెట్టింది. జీఎస్టీతో త్వరలో పన్నుల పంట! పటిష్ట చర్యలతో నెలకు రూ. లక్ష కోట్లపైన వసూళ్ల అంచనా న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) ద్వారా పన్నుల వసూళ్లు వచ్చే ఆర్థిక సంవత్సరం (2018–19) చివరికల్లా గణనీయంగా పెరుగుతాయన్న విశ్వాసాన్ని కేంద్ర ఆర్థికశాఖ అధికారులు వ్యక్తం చేస్తున్నారు. పన్ను ఎగవేతల నివారణకు ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలన్నీ త్వరలోనే ఫలించబోతున్నాయని, దీనితో వచ్చే ఆర్థిక సంవత్సరం చివరికల్లా జీఎస్టీ వసూళ్లు నెలకు సగటున లక్ష కోట్ల రూపాయలు దాటడం ఖాయమని వారు అంచనావేస్తున్నారు. పన్ను డేటాను అన్ని కోణాల్లో సరిచూసుకోవడం, ఈ–వే బిల్ వంటి పన్ను ఎగవేత నిరోధక చర్యలను ఈ సందర్భంగా వారు ప్రస్తావిస్తున్నారు. జీఎస్టీ రిటర్న్ ఫైలింగ్ ప్రక్రియ ఒకసారి పూర్తిగా స్థిరీకరణ జరిగితే, దాఖలైన ఆదాయపు పన్ను రిట ర్న్స్తో జీఎస్టీ ఫైలింగ్ డేటాబేస్ మొత్తాన్ని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ అనలటిక్స్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ (డీజీఏఆర్ఎం) మదింపుచేయగలుగుతుందని, దీనితో ఎగవేతలకు ఆస్కారం లేని పరిస్థితి ఏర్పడుతుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటి అంచనాలు ఇలా... 2018–19తో జీఎస్టీ ద్వారా దాదాపు రూ.7.44 లక్షల కోట్లు వసూలు కావాలని బడ్జెట్ నిర్దేశించుకుంది. జూలైలో జీఎస్టీ ప్రారంభమైననాటి నుంచీ ఇప్పటి వరకూ (దాదాపు ఎనిమిది నెలలు) జీఎస్టీ వసూళ్ల అంచనా రూ.4.44 లక్షల కోట్లు. వచ్చే ఆర్థిక సంవత్సరం చివరికల్లా ఈ పరిమాణం మరింత పెరగడం ఖాయమన్నది నిపుణుల విశ్లేషణ. 2017 డిసెంబర్ నాటికి దేశంలోని 98 లక్షల వ్యాపార సంస్థలు జీఎస్టీ కింద రిజిస్టర్ అయ్యాయి. బంగారంపై దృష్టి... పసిడి, ఆభరణాల పరిశ్రమలో పన్నుల వసూళ్లకు సంబంధించి చోటుచేసుకుంటున్న లోపాలపై కూడా ఆదాయపు పన్ను శాఖ దృష్టి సారిస్తోందని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ‘‘10% కస్టమ్స్ సుంకం ఉన్నప్పటికీ, పసిడి దిగుమతులు ప్రతినెలా పెరుగుతున్నాయి. అయితే దిగుమతి అయి న ఈ బంగారం ఎటు పోతోంది? తుది సరఫరాదారు ఎవరన్న విషయాన్ని జీఎస్టీ వల్ల గుర్తించగలుగుతాం’’అని ఉన్నతాధికారి తెలిపారు. -
చౌక ద్రవ్య విధానం అంటే?
ఆధునిక ప్రపంచంలో ప్రతి దేశం ఒక కేంద్ర బ్యాంకును స్థాపించుకుంది. ఇది దేశంలోని ద్రవ్య మార్కెట్కు నాయకత్వం వహించడంతో పాటు ద్రవ్య విధానాన్ని రూపొందిస్తుంది. దీంతోపాటు దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థ, ఆర్థిక సంస్థల కార్యకలాపాల పర్యవేక్షణ, నియంత్రణ బాధ్యతలను నిర్వర్తిస్తుంది. ప్రపంచంలో మొట్టమొదట కేంద్ర బ్యాంకుగా స్వీడన్లోని ‘రిక్స్ బ్యాంకు’ను పేర్కొంటారు. దీన్ని 1656లో ‘స్టాక్హోమ్ బ్యాంకు’ పేరుతో ‘జొహన్ పామ్స్ట్రచ్’ నెలకొల్పాడు. అధిక కరెన్సీ ముద్రణ వల్ల నష్టాలు రావడంతో పార్లమెంటు తీర్మానం ద్వారా 1668, సెప్టెంబర్ 17న ‘రిక్స్ బ్యాంకు’గా అవతరించింది. కేంద్ర బ్యాంకు నిర్వహించే విధుల దృష్ట్యా 1694లో స్థాపించిన ‘బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్’ను మొదటి కేంద్ర బ్యాంకుగా గుర్తించారు. అమెరికాలో 1913, డిసెంబర్ 23న ఫెడరల్ రిజర్వ్ సిస్టం రూపంలో ఒక కేంద్ర బ్యాంకు వ్యవస్థను నెలకొల్పి, దీనికి అనుబంధంగా 12 ప్రాంతీయ ఫెడరల్ బ్యాంకులను ఏర్పాటుచేశారు. ‘బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్’ను ఆదర్శంగా తీసుకొని 1935లో మన దేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)ని ఏర్పాటు చేశారు. 926లో రాయల్ కమిషన్ ఆన్ ఇండియన్ కరెన్సీ లేదా హిల్టన్–యంగ్ కమిషన్ మన దేశంలో కేంద్ర బ్యాంకును స్థాపించాలని సలహా ఇచ్చింది. 1931లో ఏర్పాటుచేసిన ‘ఇండియన్ సెంట్రల్ బ్యాంకింగ్ ఎంక్వైరీ కమిటీ’ సైతం కేంద్ర బ్యాంకు ఏర్పాటు చేయాల్సిందిగా సూచించింది. ఫలితంగా 1934 మార్చిలో రిజర్వ్ బ్యాంకు చట్టం రూపొందింది. 1935, ఏప్రిల్ 1న మన దేశ కేంద్ర బ్యాంకుగా ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ రూ.5 కోట్ల మూలధనంతో ఏర్పాటైంది. దీన్ని 1949, జనవరి 1న జాతీయం చేశారు. ఆర్బీఐ ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. కోల్కతా, చెన్నై, న్యూఢిల్లీల్లో ప్రాంతీయ బోర్డు కార్యాలయాలు ఉన్నాయి. ∙రిజర్వ్ బ్యాంకు గవర్నర్.. ముఖ్య కార్యనిర్వహణాధికారిగా వ్యవహరిస్తారు. ఆయనతోపాటు నలుగురు డిప్యూటీ గవర్నర్లు, 15 మంది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఉంటారు. రిజర్వ్ బ్యాంకు మొదటి గవర్నర్గా ఓ.స్మిత్ వ్యవహరించారు. ప్రస్తుత గవర్నర్ ఉర్జిత్ పటేల్ 2016, సెప్టెంబర్ 4న ఆర్బీఐ 24వ గవర్నర్గా నియమితులయ్యారు. ఆర్బీఐ.. ప్రభుత్వ విధానాలను అమలు చేస్తుంది. దీంతోపాటు ప్రభుత్వానికి కోశ వ్యవహారాల్లో మధ్యవర్తిగా వ్యవహరిస్తూ దేశ ద్రవ్య విధానాన్ని సమర్థంగా నిర్వహిస్తోంది. ఆర్బీఐ విధులను స్థూలంగా రెండు రకాలుగా పేర్కొనవచ్చు. 1. సంప్రదాయక విధులు 2. అభివృద్ధిపరమైన విధులు సంప్రదాయక విధులు కరెన్సీ నోట్ల జారీ: రిజర్వ్ బ్యాంక్ చట్టం –1934లోని సెక్షన్ 22 ప్రకారం మన దేశంలో రూ.2 నుంచి రూ. 10,000 లోపు విలువ కలిగిన కరెన్సీ నోట్లను జారీ చేసే గుత్తాధికారం ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’కు ఉంది. అలాగే సెక్షన్ 26 ప్రకారం రిజర్వ్ బ్యాంకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వం కరెన్సీ నోట్లను రద్దు చేయొచ్చు. 1938లో జారీ చేసిన రూ.10,000, రూ.5,000, రూ.1,000 కరెన్సీ నోట్లను 1946లో రద్దు చేశారు. మళ్లీ 1954లో ప్రవేశపెట్టారు. జనతా ప్రభుత్వం 1978, జనవరి 16న ఈ నోట్ల రద్దుకు ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. మోదీ ప్రభుత్వం 2016, నవంబరు 8న రూ.500, రూ.1000 కరెన్సీ నోట్లను రద్దు చేసింది. వీటి స్థానంలో కొత్తగా రూ.2000 నోట్ను జారీ చేసింది. కరెన్సీ నోట్ల జారీకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రత్యేకంగా ఒక జారీ డిపార్ట్మెంట్ను ఏర్పాటు చేసింది. మన దేశంలో కరెన్సీ నోట్ల జారీకి 1935 నుంచి 1956 వరకు నైష్పత్తిక రిజర్వ్ పద్ధతిని అనుసరించారు. దీని ప్రకారం కరెన్సీ జారీకి 40 శాతం బంగారాన్ని నిల్వ ఉంచాలి. 1956, అక్టోబర్ 10 నుంచి కనిష్ట నిధుల పద్ధతి అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం మొత్తం రూ.200 కోట్ల నిల్వల పరిమాణంలో రూ.115 కోట్ల విలువైన బంగారాన్ని, రూ.85 కోట్ల విదేశీ మారకద్రవ్యాన్ని నిల్వగా ఉంచాలి. ప్రభుత్వ బ్యాంకు: ఆర్బీఐ కేంద్ర ప్రభుత్వానికి బ్యాంకర్గా, ప్రతినిధిగా, సలహాదారుగా వ్యవహరిస్తుంది. వాణిజ్య బ్యాంకులు ఖాతాదారులకు ఎలాంటి బ్యాంకింగ్ సౌకర్యాలు కల్పిస్తాయో అవే సౌకర్యాలను రిజర్వ్ బ్యాంక్ ప్రభుత్వానికి కల్పిస్తుంది. ప్రభుత్వ రుణాలను దీని ద్వారా జారీ చేస్తారు. ప్రభుత్వం ఇతర దేశాలకు చేయాల్సిన చెల్లింపుల కోసం ఆర్బీఐ విదేశీ మారక ద్రవ్యాన్ని సరఫరా చేస్తుంది. ప్రభుత్వం తరఫున విదేశీ కరెన్సీ కొనుగోలు, అమ్మకాలను చేపట్టడంతోపాటు ప్రభుత్వ బంగారం నిల్వలను పరిరక్షిస్తుంది. దేశ ఆర్థిక పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ద్రవ్యోల్బణం, ప్రతి ద్రవ్యోల్బణం, కరెన్సీ మూల్యహీనీకరణ, లోటు ద్రవ్యవిధానం, చెల్లింపుల శేషం తదితర విషయాల్లో ప్రభుత్వానికి సలహాలు ఇస్తుంది. బ్యాంకులకు బ్యాంకు: రిజర్వ్ బ్యాంకు వాణిజ్య బ్యాంకులకు నాయకత్వం వహిస్తుంది. అవి స్వీకరించిన డిపాజిట్లలో కొంత భాగాన్ని రిజర్వ్ బ్యాంకులో నిల్వ ఉంచాలి. దీన్నే నగదు నిల్వల నిష్పత్తి అంటారు. ఆర్బీఐ.. వాణిజ్య బ్యాంకుల కార్యకలాపాలను నియంత్రిస్తుంది. వాణిజ్య బ్యాంకులకు అవసరమైనప్పుడు వాటి వద్ద ఉన్న ప్రభుత్వ బాండ్లను, ట్రెజరీ బిల్లులను రీ డిస్కౌంట్ చేసే సౌకర్యం కల్పిస్తుంది. అందుకే దీన్ని అంతిమ రుణదాతగా పేర్కొంటారు. రిజర్వ్ బ్యాంకు క్లియరింగ్ హౌజ్ను నిర్వహిస్తూ బ్యాంకుల మధ్య జరిగే లావాదేవీలను పర్యవేక్షిస్తుంది. విదేశీ నిధుల పరిరక్షణ: విదేశీ మారక నియంత్రణ చట్టాన్ని ప్రవేశపెట్టిన తర్వాత విదేశీ మారక నిల్వలన్నీ రిజర్వ్ బ్యాంకు అధీనంలోకి వచ్చాయి. ఈ చట్టం ప్రకారం అనుమతిలేనివారు విదేశీ మారకాన్ని అమ్మడానికి/కొనడానికి వీల్లేదు. విదేశీ ద్రవ్య వ్యవహారాలన్నీ ఆర్బీఐ ద్వారానే జరుగుతాయి. మారకపు రేటులో స్థిరత్వ సాధన: మన దేశానికి అంతర్జాతీయ ద్రవ్యనిధిలో సభ్యత్వం ఉంది. అందువల్ల ఇతర దేశాలతోపాటు కరెన్సీ మారకపు రేటులో స్థిరత్వ సాధన రిజర్వ్ బ్యాంకు బాధ్యత. దీంతో అంతర్జాతీయ కరెన్సీలకు సంబంధించి రిజర్వ్ బ్యాంకు.. రక్షకుడిగా వ్యవహరిస్తుంది. పరపతి నియంత్రణ: వాణిజ్య బ్యాంకులు తాము స్వీకరించిన ప్రాథమిక డిపాజిట్ల ఆధారంగా పరపతి ద్రవ్యాన్ని సృష్టిస్తాయి. పరపతి ద్రవ్యం ఎక్కువైనప్పుడు ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణ పరిస్థితులు ఏర్పడతాయి. పరపతి ద్రవ్యం తక్కువైనప్పుడు ఆర్థిక వ్యవస్థలో ప్రతి ద్రవ్యోల్బణ పరిస్థితులు తలెత్తుతాయి. దీని దృష్ట్యా రిజర్వ్ బ్యాంకు పరిమాణాత్మక, గుణాత్మక పరపతి నియంత్రణ సాధనాలను ఉపయోగించి పరపతిని నియంత్రిస్తుంది. అభివృద్ధి పరమైన విధులు బ్యాంకింగ్ వ్యవస్థ అభివృద్ధి: రిజర్వ్ బ్యాంకు దేశంలోని బ్యాంకుల కార్యకలాపాలను పర్యవేక్షించడంతోపాటు బ్యాంకింగ్ వ్యవస్థలో నూతన మార్పులను ప్రవేశపెడుతుంది. బ్యాంకుల అభివృద్ధికి బ్యాంకింగ్ కార్యకలాపాల శాఖను ఏర్పాటు చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ శాఖల ఏర్పాటును ప్రోత్సహిస్తోంది. వ్యవసాయ పరపతికి ప్రోత్సాహం: రిజర్వ్ బ్యాంకు గ్రామీణ, వ్యవసాయ పరపతిని అందించడంలో పరోక్షంగా కృషి చేçస్తుంది. ఇందులో భాగంగా రాష్ట్ర సహకార బ్యాంకులకు, వ్యవసాయ పరపతిని అందించే విత్త సంస్థలకు ఆర్థిక సహాయం అందిస్తుంది. తద్వారా వ్యవసాయదారులకు స్వల్ప, మధ్య, దీర్ఘకాలికరుణ సౌకర్యాల కల్పనకు తోడ్పడుతుంది. గ్రామీణ పరపతిలో శిఖరాగ్ర బ్యాంకుగా వ్యవహరించే నాబార్డు మూలధనంలో 50 శాతాన్ని రిజర్వ్ బ్యాంకే సమకూర్చింది. పారిశ్రామిక ప్రగతికి తోడ్పాటు: రిజర్వ్ బ్యాంకు పెద్ద పరిశ్రమల అభివృద్ధికి తోడ్పడుతూనే చిన్న పరిశ్రమల అభివృద్ధికి సైతం కృషి చేస్తుంది. భారత పారిశ్రామికాభివృద్ధి బ్యాంకు, భారత పారిశ్రామిక విత్త సంస్థ, రాష్ట్ర విత్త సహాయ సంస్థల కార్యకలాపాల్లో రిజర్వ్ బ్యాంకు పాత్ర కీలకం. పారిశ్రామిక విత్త సహాయం నిమిత్తం రిజర్వ్ బ్యాంకు యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాను నెలకొల్పింది. బిల్ మార్కెట్ అభివృద్ధికి కృషి: ఆర్బీఐ 1952లో బిల్ మార్కెట్ పథకాన్ని ప్రారంభించింది. తద్వారా సమర్థవంతమైన ద్రవ్య మార్కెట్కు పునాదులు వేసింది. నరసింహం కమిటీ సిఫారసుల మేరకు 1970లో కొత్త బిల్ మార్కెట్ పథకాన్ని ప్రారంభించడం ద్వారా రీ డిస్కౌంటింగ్ పద్ధతులను సులభతరం చేసింది. తద్వారా రుణాల మంజూరీలో అనవసర జాప్యాన్ని నివారించింది. సిబ్బందికి శిక్షణ సౌకర్యాలు: దేశీయ బ్యాంకింగ్ రంగంలో పనిచేస్తున్న సిబ్బందికి శిక్షణ కోసం ఆర్బీఐ మూడు కళాశాలలను నిర్వహిస్తోంది. అవి.. 1. బ్యాంకర్ల శిక్షణ కళాశాల (ముంబై) 2. వ్యవసాయ బ్యాంకింగ్ కళాశాల (పుణె ) 3. రిజర్వ్ బ్యాంకు సిబ్బంది కళాశాల (చెన్నై). ద్రవ్య విధానం ఒక దేశ ఆర్థిక వ్యవస్థ పనితీరు ఆ దేశ ద్రవ్య విధానంపై ఆధారపడి ఉంటుంది. ద్రవ్య విధానం ఆర్థిక విధానంలో అంతర్భాగం. ద్రవ్య విధాన రూపకల్పనలో రిజర్వ్ బ్యాంకు పాత్ర విశిష్టమైంది. ఆర్బీఐ ఆర్థిక వ్యవస్థలో పరపతిని క్రమబద్ధం చేస్తూ ద్రవ్య సరఫరాను అదుపులో ఉంచుతుంది. తద్వారా సాధారణ ధరల స్థాయిలో సుస్థిరత తీసుకొస్తుంది. ఆర్థికాభివృద్ధి ప్రక్రియను వేగవంతం చేయడమే ద్రవ్య విధాన ముఖ్య లక్ష్యం. పరపతిని నియంత్రించేందుకు రెండు రకాల సాధనాలు ఉన్నాయి. అవి.. 1. పరిమాణాత్మక నియంత్రణ సాధనాలు 2. గుణాత్మక నియంత్రణ సాధనాలు పరిమాణాత్మక నియంత్రణ సాధనాలు బ్యాంకు రేటు: వాణిజ్య బ్యాంకులు తమ వద్ద ఉన్న వినిమయ బిల్లుల్ని డిస్కౌంట్ చేయడం ద్వారా లేదా సెక్యూరిటీలను హామీగా ఇవ్వడం ద్వారా రిజర్వ్ బ్యాంకు నుంచి రుణాలు పొందుతాయి. ఈ రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీ రేటును బ్యాంకు రేటు అంటారు. దీన్నే ‘రీ డిస్కౌంటింగ్ రేటు’గా కూడా పేర్కొంటారు. ఆర్థిక వ్యవస్థలో పరపతి పరిమాణం ఎక్కువగా ఉండి ద్రవ్యోల్బణ పరిస్థితులు ఏర్పడినప్పుడు ద్రవ్య çసరఫరాను తగ్గించేందుకు రిజర్వ్ బ్యాంకు.. బ్యాంకు రేటును పెంచుతుంది. దీన్ని ఖరీదైన ద్రవ్య విధానం అంటారు. ఆర్థిక వ్యవస్థలో పరపతి పరిమాణం తక్కువగా ఉండి ప్రతిద్రవ్యోల్బణ పరిస్థితులు ఏర్పడినప్పుడు రిజర్వ్ బ్యాంకు ద్రవ్య çసరఫరాను పెంచేందుకు బ్యాంకు రేటును తగ్గిస్తుంది. దీన్ని చౌక ద్రవ్య విధానం అంటారు. ప్రస్తుతం బ్యాంకు రేటు 6.25 శాతంగా, రెపో రేటు 6 శాతంగా, రివర్స్ రెపో రేటు 5.75 శాతంగా ఉంది. -
విదేశాల్లో 16 వేల కోట్ల నల్లధనం
రాజ్యసభకు తెలిపిన ఆర్థిక మంత్రి న్యూఢిల్లీ: హెచ్ఎస్బీసీ (హాంకాంగ్ షాంఘై బ్యాకింగ్ కార్పొరేషన్), ఐసీఐజేలు ఇచ్చిన జాబితాలపై విచారణ జరిపి భారతీయులు విదేశాల్లో దాచిన రూ.16,200 కోట్ల నల్లడబ్బును గుర్తించామని ప్రభుత్వం తెలిపింది. హెచ్ఎస్బీసీ బ్యాంకు విదేశీ శాఖల్లో భారతీయులు దాచిన రూ.8,200 కోట్ల నల్లడబ్బును గత రెండేళ్లలో పన్ను పరిధిలోకి తెచ్చామని జైట్లీ రాజ్యసభలో తెలిపారు. మరో రూ.8,000 కోట్లను రుణంగా తీసుకున్నట్లు గుర్తించామన్నారు. భారతీయులు దాచిన నల్లడబ్బుపై కచ్చితమైన సమాచారం ప్రభుత్వం వద్ద లేదన్నారు. పెద్దనోట్ల రద్దు తరువాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చేపట్టిన దాడుల్లో ఇప్పటి వరకు రూ.7.3 కోట్ల నగదు, 5.5 కిలోల బంగారాన్ని జప్తుచేశామని కేంద్రం ప్రకటించింది. 18 మంది అరెస్టయ్యారనీ, మనీలాండరింగ్ కార్యకలాపాలకు పాల్పడుతున్న మరో 17 మందిని గుర్తించినట్లు అరుణ్ జైట్లీ చెప్పారు. అక్రమ పద్ధతులను గుర్తించడం, నిఘా సమాచారం ఆధారంగా ఆదాయపు పన్ను శాఖ 2016 నవంబర్ 9 నుంచి 2017 జనవరి 19 మధ్య కాలంలో 1100 కేసుల్లో దాడులు జరిపిందని వివరించారు. అదే కాలంలో బ్యాంకుల్లోకి వచ్చిన అనుమానాస్పద డిపాజిట్లపై వివరణ కోరుతూ 5,100 నోటీసులు జారీచేసినట్లు తెలిపారు. కొత్త నోట్లు రూ. 6.78 లక్షల కోట్లు న్యూఢిల్లీ: రద్దయిన పెద్ద నోట్ల స్థానంలో 2016 నవంబర్ 10 నుంచి జనవరి 13 మధ్య రూ. 6.78 లక్షల కోట్ల విలువైన కొత్త నోట్లను బ్యాంకింగ్ వ్యవస్థలో ప్రవేశపెట్టామని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్రామ్ మేఘవాల్ రాజ్యసభకు తెలిపారు. ప్రస్తుతం దేశంలో 9.1 లక్షల కోట్ల నోట్లు చలామణిలో ఉన్నాయన్నారు. 2016 డిసెంబర్ 10 నాటికి రద్దయిన రూ. 500, రూ.1,000 నోట్లు రూ. 12.44 లక్షల కోట్ల మేర ఆర్బీఐకి చేరాయి. నగదు బదిలీతో 21వేల కోట్లు మిగులు ప్రత్యక్ష నగదు బదిలీ పథకాన్ని అమలు చేయడం వల్ల 3.3 కోట్ల నకిలీ గ్యాస్ కనెక్షన్లను అరికట్టామని, తద్వారా ప్రభుత్వానికి రెండేళ్లలో రూ.21 వేల కోట్ల సబ్సిడీ మిగిలిందని కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. తాము అధికారంలోకి వచ్చేనాటికి ఎల్పీజీ సబ్సిడీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందన్నారు. 2014లో ప్రత్యక్ష నగదు బదిలీ పథకాన్ని ప్రారంభించడం ద్వారా ఎల్పీజీ సబ్సిడీ నేరుగా బ్యాంకు ఖాతాలకే వెళ్లేలా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. దీనివల్ల మొత్తం ప్రక్రియ పారదర్శకమైందని, తద్వారా నకిలీ కనెక్షన్ల ద్వారా జరుగుతున్న సబ్సిడీ వృథాను నియంత్రించగలిగినట్లు చెప్పారు. ఈ పథకం ద్వారా రెండేళ్లలో 17.6కోట్ల మంది వినియోగదారులకు సబ్సిడీ కింద రూ.40 వేల కోట్లు బదిలీ చేసినట్లు వెల్లడించారు. కాగా, 1.2కోట్ల మంది స్వచ్ఛందంగా సబ్సిడీని వదులు కున్నట్లు తెలిపారు. 2015 – 16లో దాదాపు 60లక్షల బీపీఎల్ కుటుంబాలకు కొత్తగా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చినట్లు చెప్పారు. వచ్చే మూడేళ్లలో 5 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. డెబిట్ కార్డు చార్జీలు తగ్గే అవకాశం: జైట్లీ డిజిటల్ లావాదేవీల్ని ప్రోత్సహించే ఉద్దేశంతో డెబిట్ కార్డు చార్జీల్ని తగ్గించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని జైట్లీ తెలిపారు. రూ. 2 వేలకు మించి జరిపే డెబిట్ కార్డు లావాదేవీలపై మార్జినల్ డిస్కౌంట్ చార్జీల్ని తగ్గించే దిశగా ఆర్బీఐ కృషిచేస్తుందన్నారు. డిజిటల్ లావాదేవీలు పెరిగితే చార్జీలు తగ్గుతాయన్నారు. పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్స్ యాక్ట్ మేరకు రూ. వెయ్యి వరకూ ఎండీఆర్ చార్జీల్ని 0.25 శాతంగా ఆర్బీఐ నిర్ణయించిందని, రూ. 2 వేల వరకూ 0.5 శాతం వసూలు చేస్తున్నారని జైట్లీ తెలిపారు. ఈ చార్జీలు జనవరి 1, 2017 నుంచి అమల్లోకి వచ్చాయని, మార్చి 31, 2017 వరకూ అమల్లో ఉంటాయన్నారు. -
ఆర్బీఐని, బ్యాంకులను ఎలా నమ్మాలి?
కొచ్చి: ఆర్బీఐ, బ్యాంకులు లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ మాటల దాడి చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు అనే విపత్కర నిర్ణయం కారణంగా దేశ ప్రజలకు ఆర్బీఐ, బ్యాంకింగ్ వ్యవస్థపై నమ్మకం పోయిందని అన్నారు. కేరళలో జరిగిన ఓ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఆనంద్ శర్మ మాట్లాడుతూ ‘కోట్లకు కోట్లు కొత్తగా ప్రింట్ చేసిన నోట్లు వెనుక డోర్ల నుంచి బయటకు వెళ్లిపోతున్నాయి. కానీ, పేద ప్రజలు కష్టపడి సంపాధించుకున్న కొద్దిపాటి మొత్తం కూడా బ్యాంకుల నుంచి డ్రా చేసుకోలేకపోతున్నారు. వాస్తవానికి భారత ప్రజలకు ఆర్ధిక సంక్షోభం సమయంలో కూడా బ్యాంకింగ్ వ్యవస్థపై నమ్మకం ఉంది. ఆ సమయంలో బ్యాంకులు తమ విశ్వాసాన్ని నిరూపించుకున్నాయి. కానీ, ఇప్పుడు మాత్రం ఆర్బీఐ, బ్యాంకులపై నమ్మకం పోయింది. ఈ విషయం ఎందుకు చెబుతున్నానంటే ఎంతో కష్టపడి పేద ప్రజలు తాము సంపాధించుకున్న కొంతమొత్తం డబ్బును సేవింగ్ ఖాతాల్లో జమ చేసుకుంటారు. ఎందుకుంటే వారికి బ్యాంకులపై నమ్మకం. ఎప్పుడంటే అప్పుడు తీసుకునేందుకు అవకాశం ఉంటుందని భావిస్తారు. కానీ, ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉంది. ప్రజలు ఆ డబ్బును తీసుకోలేకపోతున్నారు. ఎందుకంటే బ్యాంకుల్లో డబ్బు లేదు. ఏటీఎంలలో లేదు. కానీ, కొంతమందికి మాత్రం బ్యాక్ డోర్ల ద్వారా కోట్లలో కొత్తగా ముద్రిస్తున్న నోట్లు ఏ సమస్య లేకుండా వెళ్లిపోతున్నాయి. ఇలాంటప్పుడు ప్రజలు ఎలా బ్యాంకులను, ఆర్బీఐని విశ్వసిస్తారు’ అని ఆనంద్ శర్మ అన్నారు. -
షేర్లలోనూ ‘రాణి’స్తున్నారు...
స్టాక్స్ ట్రేడింగ్లోనూ మహిళల ముందంజ చిన్న మొత్తాలతో సిప్ చేస్తూ పెద్ద సంపద మార్కెట్లు పడ్డా భయపడకుండా పెట్టుబడి దీర్ఘకాలం వేచి ఉండటంతోనే విజయం మన పార్లమెంట్లో సార్వత్రిక బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశమైతే ఇప్పటిదాకా మహిళలకు రాలేదు. కాకపోతే ప్రతి ఇంట్లోనూ బడ్జెట్ చూసేది మహిళలే. అదేకాదు!!దేశ ఆర్థిక వ్యవస్థ... ప్రత్యేకించి బ్యాంకింగ్ వ్యవస్థ విపరీతమైన కుదుపులకు లోనవుతున్న ఈ తరుణంలో దేశంలో దాదాపు ప్రభుత్వ, ప్రైవేటు అగ్రశ్రేణి బ్యాంకులన్నిటినీ విజయవంతంగా నడిపిస్తున్నదీ మహిళలే. అరుంధతీ భట్టాచార్య (ఎస్బీఐ), ఉషా అనంత సుబ్రమణియన్ (పీఎన్బీ), ప్రైవేటు బ్యాంకుల్ని చందా కొచ్చర్ (ఐసీఐసీఐ), శిఖా శర్మ (యాక్సిస్), నైనాలాల్ కిద్వాయ్ (హెచ్ఎస్బీసీ), కల్పనా మోర్పారియా (జేపీ మోర్గాన్)... ఇలా చెప్పుకొంటూ పోతే ఈ జాబితాకు అంతుండదు. అంతెందుకు!! స్టాక్ మార్కెట్ దిగ్గజం ఎన్ఎస్ఈకి సారథ్యం వహిస్తున్న చిత్రా రామచంద్రన్ దాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. బ్యాంకుల్ని, ఆర్థిక సంస్థల్ని నడిపించటమే కాదు... సాధారణ ఇన్వెస్టర్లుగానూ రాణించగలమని నిరూపిస్తున్నారు కొందరు మహిళలు. ఖాళీ సమయం, చేతిలో మిగిలే డబ్బు... ఈ రెండింటినీ పెట్టి చక్కగా ఆర్జిస్తున్నారు. అలాంటి నలుగురు మహిళల ఆర్థిక అనుభవాలు... ‘మహిళా దినోత్సవం’ సందర్భంగా ఈ వారం ప్రాఫిట్ ప్లస్లో మీ కోసం... - సాక్షి పర్సనల్ ఫైనాన్స్ విభాగంట పడినప్పుడు భయపడలేదు... స్టాక్ మార్కెట్లన్నాక హెచ్చుతగ్గులు సహజం. నేను గత ఇరవై ఏళ్లుగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఎగుడు దిగుళ్లు చూశా. కానీ స్వల్పకాలిక ఒడిదుడుకులకు భయపడకుండా ధైర్యంగా నిలబడ్డా. ఇన్వెస్ట్ చేయటం మాత్రం మానలేదు. అందుకే మంచి లాభాలను ఆర్జించాను. ముఖ్యంగా 2002, 2008లో వచ్చిన సంక్షోభ సమయాల్లో నేను ఇన్వెస్ట్ చేసిన షేర్లు బాగా పడిపోయాయి. భయపడి నష్టానికి విక్రయించకుండా ఓపిగ్గా ఎదురు చూశా. ఇప్పుడవి తిరిగి లాభాల్లోకి వచ్చాయి. ఇలా ఒడిదుడుకుల సమయంలో ఇన్వెస్ట్మెంట్కు దూరంగా ఉండి... వేచి చూసే ధోరణి అవలంబించడమే నా విజయ సూత్రంగా భావిస్తా. ఇరవై ఏళ్ల క్రితం సుమారు రూ.5లక్షలతో మొదలు పెట్టిన పెట్టుబడి విలువ ఇప్పుడు రూ.కోటి దాటిందంటే ఓపిక, సహనమే కారణమంటాను. కేవలం ఒకే రంగానికి సంబంధించిన షేర్లలో ఇన్వెస్ట్ చేయకుండా పోర్ట్ఫోలియోను డైవర్సిఫై చేసుకున్నా. ఇందుకోసం పేపర్లు, టీవీలతో పాటు జెన్మనీ సూచనలు కూడా తీసుకున్నా. ప్రస్తుతం నా పోర్ట్ఫోలియోలో 20కిపైగా కంపెనీల షేర్లున్నాయి. కొన్ని షేర్లలో నేను కొన్నాక ట్రేడింగ్ కూడా ఆగిపోయినవి ఉన్నాయి. అందుకే ఫండమెంటల్గా పటిష్టంగా ఉన్న షేర్లకే ఎక్కువ ప్రాధాన్యమిస్తాను. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవారికి నేను చెప్పే సలహా ఏమిటంటే.. ఎవరో కొన్నారని కొనడం కాకుండా, నిపుణుల సలహా తీసుకోవాలి. స్వల్పకాలంలో ఎక్కువ సంపాదిద్దామనే అత్యాశకు పోకుండా దీర్ఘకాలం వేచి చూస్తే తప్పక లాభాలొస్తాయి. - జి.రామలక్షి, హైదరాబాద్ మార్కెట్లు పడ్డప్పుడు ఇన్వెస్ట్ చేయండి... ఎంసీఏ పూర్తి చేశాక ఏదైనా ప్రొఫెషనల్ కోర్సు చెయ్యాలనిపించింది. ఇంటీరియర్ డిజైనింగ్ కోర్స్ చేశా. మిగిలిన మహిళల్లానే ఉద్యోగం చేసి సొంత కాళ్లపై నిలబడాలన్నది నా ఆలోచన. కానీ పిల్లలపైన, వారి చదువుపైన ఫోకస్ చెయ్యటంతో ఉద్యోగం కుదరలేదు. అందుకే ఇంటి దగ్గర కూర్చొని ఎంతో కొంత సంపాదించడం ఎలా?... అని ఆలోచిస్తున్న తరుణంలో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయమని మా వారు సూచించారు. దీంతో మూడేళ్లుగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్చే యడం మొదలు పెట్టా. ఇన్వెస్ట్మెంట్తో పాటు ట్రేడింగ్ కూడా చేస్తున్నా. ఇందుకోసం నేనైతే ఎవరి సలహాలూ తీసుకోవటం లేదు. ప్రతి రోజూ వార్తలు చూడటం, పేపర్లు చదవడం ద్వారా ప్రపంచంలో జరుగుతున్న ఆర్థిక పరిణామాలపై అవగాహన పెంచుకుంటున్నా. దానికి అనుగుణంగా లావాదేవీలు నిర్వహిస్తున్నా. మార్కెట్లు బాగా ఒడిదుడుకులకు లోనైనప్పుడు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ట్రేడింగ్ చేస్తుంటాను. అదే స్టాక్ మార్కెట్ పడినప్పుడు దీర్ఘకాలిక దృష్టితో షేర్లు కొంటాను. వేరెవరితోనూ సంబంధం లేకుండా... పిల్లలు స్కూలుకు వెళ్ళి వచ్చేలోపు ఉన్న ఖాళీ సమయంలోనే ట్రేడింగ్ చేస్తుంటా. ప్రస్తుతం నా పోర్ట్ఫోలియోలో రూ.4 లక్షల విలువైన షేర్లున్నాయి. బ్యాంకులు, సీడ్ కంపెనీలు, ఐటీ రంగ షేర్లలో ఎక్కువగా ఇన్వెస్ట్ చేశా. నా మూడేళ్ల అనుభవంలో అర్థమైన విషయం ఏమిటంటే... ట్రేడింగ్లో ఏమీ మిగలదని. ట్రేడింగ్లో ఒకేరోజు రూ. 3 లక్షలు లాభం వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ... మిగిలిన రోజుల్లో వచ్చిన నష్టాలను కలుపుకుంటే దానికది సరిపోతుంది. అందుకే నేను మిగిలిన మహిళలకు ఇచ్చే సలహా ఏంటంటే... ట్రేడింగ్కు దూరంగా ఉండండి. మార్కెట్లు బాగా పడినప్పుడు షేర్లు కొనండి. ఇతర ఇన్వెస్ట్మెంట్ సాధనాల కంటే షేర్లే ఎక్కువ రాబడిని అందిస్తాయని నేైనె తే గట్టిగా నమ్ముతున్నాను. - వై. హరిప్రియ రెడ్డి, హైదరాబాద్ ఫండ్స్తో నెలవారీ ఖర్చులు.. నెలనెలా కొంచెం కొంచెం పెట్టుబడి పెడితే చాలు. దీర్ఘకాలంలో చక్కని నిధి ఏర్పడుతుంది. ఈ విషయం మనకు మ్యూచ్వల్ ఫండ్లు నేర్పిస్తాయి. గృహిణినే అయినా నేను మ్యూచువల్ ఫండ్స్ ద్వారా రెగ్యులర్ ఆదాయాన్ని ఆర్జిస్తున్నా. దీనికోసం నేను పెద్దగా ఇన్వెస్ట్ చేసింది కూడా లేదు. ప్రతి నెలా ఇంటి ఖర్చులకు పోగా మిగిలిన దాన్లో కొంత మొత్తాన్ని సిప్ ఫండ్స్లో కొద్దికొద్దిగా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తున్నా. 1995లో కేవలం రూ.500తో మొదలు పెట్టా. ఇపుడు నా పోర్ట్ఫోలియో రూ. 7 లక్షలు దాటింది. అంతే కాదు!! ప్రతినెలా డివిడెండ్ రూపంలో వస్తున్న డబ్బులు నా ఖర్చులకు అక్కరకొస్తున్నాయి. సిప్ విధానంలో మూడేళ్లలో రూ.15,000 ఇన్వెస్ట్ చేస్తే అది ఐదేళ్లకు మూడు రెట్లయింది. ఆ మొత్తాన్ని నేను లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ ఫండ్స్లో... డివిడెండ్ చెల్లించే వాటిలో తిరిగి ఇన్వెస్ట్ చేశాను. 2008 నాటికి నేను ఇన్వెస్ట్ చేసిన మొత్తం డివిడెండ్ రూపంలో వెనక్కి వచ్చేసింది. ఇప్పుడు నా పోర్టుఫోలియోలో ఉన్నదల్లా లాభమే. అది కూడా అసలుకన్నా ఎక్కువ పెరిగింది. అలాగే పుట్టిన రోజున పుట్టింటివారు ఇచ్చిన డబ్బులను కూడా ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటాను. కొన్ని సందర్భాల్లో చీరల వంటి అనవసర ఖర్చులు తగ్గించుకొని మరీ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటాను. ఇక నా పోర్ట్ఫోలియో విషయానికొస్తే ఎక్కువ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయలేదు. కేవలం ఐదు ఫండ్స్తో డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియోను నిర్వహిస్తున్నా. దీర్ఘకాలం డివిడెండ్ల కోసం మంచి రేటింగ్ ఉన్న లార్జ్, మిడ్ క్యాప్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశా. ఇవి మార్కెట్ బాగున్నప్పుడు ఏటా యూనిట్కు 4-5 శాతం డివిడెండ్ అందిస్తాయి. అదే మార్కెట్ పరిస్థితులు బాగోలేనప్పుడు డివిడెండ్ ఒక శాతం లోపు ఉంటుంది. అలాగే నెలావారి ఖర్చుల కోసం బ్యాలెన్స్డ్ ఫండ్, తక్కువ కాలపరిధి ఉన్న డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశా. ఇవి బ్యాంకు వడ్డీ కంటే ఎక్కువ రాబడినే అందిస్తున్నాయి. నేను మార్కెట్ ఒడిదుడుకులను అసలు పట్టించుకోను. మార్కెట్ పెరిగిందా? పడిందా? అన్నది చూడకుండా డబ్బు ఉన్నప్పుడల్లా ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటాను. నా సుదీర్ఘ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అనుభవాన్ని బట్టి నేను చెప్పేది ఏమిటంటే.. స్వల్ప కాలంలో రెట్టింపు డబ్బును సంపాదించాలన్న అత్యాశతో కాకుండా దీర్ఘకాలిక దృష్టితో ఇన్వెస్ట్ చేస్తే చాలు. బ్యాంకు వడ్డీరేటు కంటే ఎక్కువ రాబడి తప్పకుండా వస్తుంది. చాలామంది స్టాక్ మార్కెట్లో పెట్టుబడులంటే ఇన్వెస్ట్మెంట్ మొత్తం జీరో అయిపోతుందని చెబుతుంటారు. దాంతో నేను ఏకీభవించను. ఇన్వెస్ట్ చేసి కనీసం నాలుగేళ్లు వేచి ఉండగలిగితే నష్టాలుండవు. అదే ఎనిమిదేళ్లు దాటితే రెట్టింపు లాభాలను అందుకోగలమన్నది నా అభిప్రాయం. - ఎ.కవితా రాణి, హైదరాబాద్ -
ఆర్బీఐ, బ్యాంకుల పనితీరు.. ప్చ్!
♦ మొండి బకాయిలపై పార్లమెంటరీ కమిటీ అసంతృప్తి ♦ బ్యాంకింగ్ వ్యవస్థ స్థిరత్వానికి విఘాతమని విశ్లేషణ ♦ పార్లమెంటుకు నివేదిక సమర్పించిన స్థాయీ సంఘం న్యూఢిల్లీ: మొండి బకాయిల (ఎన్పీఏ) సమస్య విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), బ్యాంకుల పనితీరుపై పార్లమెంటరీ ఆర్థిక వ్యవహారాల స్థాయీ సంఘం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. పెద్ద భారంగా మారిన మొండిబకాయిల సమస్య- సంబంధిత నిర్వహణా యంత్రాంగం విశ్వసనీయతనే ప్రశ్నిస్తోందని, బ్యాంకింగ్ వ్యవస్థ స్థిరత్వానికి ముప్పుగా ఉందని నివేదిక పేర్కొంది. మొండి బకాయిల పరిష్కారం దిశలో తన నిబంధనల అమలులో ఆర్బీఐ అంతగా విజయం సాధించలేదని పేర్కొంది. 2015 సెప్టెంబర్ నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకుల నికర మొండిబకాయిల విలువ రూ.2,05,024 కోట్లుకాగా, స్థూలంగా ఇవి రూ.3,69,990 కోట్లుగా నమోదైంది. 2014 మార్చి నాటికి మొండిబకాయిలుగా మారే అవకాశం ఉన్న రుణాల పరిమాణం 10 శాతంగా ఉంటే... 2015 మార్చి నాటికి ఇది 11 శాతానికి పెరిగింది. 2015 సెప్టెంబర్తో ముగిసిన ఏడాది కాలంలో మొండిబకాయిలుగా మారే అవకాశాలు ఉన్న రుణ పరిమాణం రూ.5.91 లక్షల కోట్ల నుంచి రూ.6.8 లక్షల కోట్లకు ఎగసింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎం వీరప్ప మొయిలీ నేతృత్వంలో... మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్సహా 31 మంది సభ్యులతో కూడిన స్థాయీ సంఘం ఇచ్చిన నివేదికలో ముఖ్యాంశాలు ... ♦ {పస్తుత ఆర్థిక సంవత్సరం(2015-16) ముగిసే నాటికి స్థూలంగా మొండి బకాయిలు రూ.4 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉందని వెలువడుతున్న కొన్ని అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రభుత్వం, ఆర్బీఐ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నప్పటికీ, ఈ బకాయిలు పెరిగిపోతుండడం ఆందోళనకు ప్రధాన కారణం. ♦ దేశం వేగంగా వృద్ధి చెందుతోందని, అభివృద్ధి చెందిన దేశాలకు పోటీపూర్వకంగా మారుతోందని ఒకపక్క చెప్పుకుంటున్నాం. అయితే మరోవైపు నెలకొన్న మొండిబకాయిల తీవ్రత ‘వృద్ధి కథనాన్ని’ దెబ్బతీస్తోంది. ♦ మొండిబకాయిల సమస్య పరిష్కారానికి ఆర్బీఐ ఇస్తున్న మార్గదర్శకాలు లక్ష్యాలను సాధించడం లేదు. సమస్యపై ఆర్బీఐ కఠిన చర్యలు తీసుకున్నట్లు కనిపించడం లేదు. సవాలును ఎదుర్కొనే అంశాన్ని బ్యాంకుల బోర్డు డెరైక్టర్ల నిర్ణయానికి వదిలివేయకుండా ఆర్బీఐ తనకుతాను కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. ♦ ఇప్పటికైనా సాధ్యమైనంత త్వరగా, సకాలంలో సమస్య పరిష్కారం తీసుకోకపోతే... పరిస్థితి మరింత తీవ్రతకు దారితీస్తుంది. ♦ ఈ మొత్తం అంశాన్ని పరిశీలించడానికి, తగిన నిర్ణయాలు తీసుకోడానికి ఆర్బీఐ, బ్యాంకులు, రుణ గ్రహీత స్థాయిల్లో మూడు ప్రత్యేక సాధికార కమిటీలను ఏర్పాటు చేయాలి. ♦ సమస్య విషయంలో బ్యాంకు బోర్డుల్లో ఆర్బీఐ, ఆర్థికమంత్రిత్వశాఖ నామినీ డెరైక్టర్లు, సీఎండీ, ఎండీలను కూడా బాధ్యులుగా చేయాలి. ♦ మంజూరీ నిబంధనల్లో లోపాల వల్ల రుణాలు తీసుకున్న కొందరు ప్రమోటర్లు ఈ నిధులను వ్యాపారేతర కార్యకలాపాలకు మళ్లించారన్న ఆరోపణలు ఉన్నాయి. మొండిబకాయిలు తీవ్రంగా పెరగడానికి కారణం ఇదేనన్న వాదనా ఉంది. ఈ పరిస్థితుల్లో రుణ తీరుపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలి. ♦ రుణ పునర్వ్యవస్థీకరణ కోరుకుంటున్న కంపెనీలు ఆయా అంశాలను బహిరంగపరచాలి. వీటిని రహస్యంగా ఉంచడంలో ఎటువంటి అర్థం లేదు. ఎస్బీఐలో ఉద్దేశ్యపూర్వక ఎగవేతలు రూ.11,700 కోట్లు! న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో దాదాపు 1,164 ఖాతాల విషయంలో ఉద్దేశ్యపూర్వక ఎగవేతలు చోటుచేసుకున్నాయి. ఇందుకు సంబంధించి మొండిబకాయిలుగా మారిన మొత్తం రుణ విలువ 2015 సెప్టెంబర్ నాటికి రూ.11,700 కోట్లు. ఆర్థిక మంత్రిత్వశాఖ సమీకరించిన గణాంకాలు ఈ అంశాన్ని పేర్కొన్నాయి. సర్వీసులు నిలిచిపోయిన కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ వాటా ఇందులో రూ.1,600 కోట్లు. ఈ రుణ మొత్తానికి గ్యారెంటార్లుగా యూబీ హోల్డింగ్స్, విజయ్మాల్యాలు ఉన్నారు. ఎస్బీఐ ఐదు అనుబంధ బ్యాంకుల్లో విల్ఫుల్ డిఫాల్టర్ల సంఖ్య అత్యధికంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ కలిగిఉంది. బ్యాంకుకు సంబంధించి 197 కేసుల్లో రూ.2,088 కోట్ల బకాయిలు ఉన్నాయి. తరువాతి స్థానాల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్లు ఉన్నాయి. ఎస్బీఐ స్థూల మొండిబకాయిల మొత్తం డిసెంబర్ నాటికి రూ.72,792 కోట్లు. పీఎస్యూ బ్యాంకులకు రేటింగ్ ముప్పు ♦ బడ్జెట్లో మరిన్ని కేటాయింపులు లేకపోతే కష్టం ♦ మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ హెచ్చరిక న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులకు (పీఎస్బీ) మరింత మూలధనం అందించేందుకు రాబోయే బడ్జెట్లో ప్రభుత్వం తగు చర్యలు తీసుకోని పక్షంలో వాటి రేటింగ్స్పై ప్రతికూల ప్రభావం పడగలదని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ హెచ్చరించింది. నిరర్ధక ఆస్తుల (ఎన్పీఎల్)కు ముందస్తుగా ప్రొవిజనింగ్ చేయడం వల్ల పీఎస్బీలకు మరింత అధికంగా మూలధనం సమకూర్చాల్సిన అవసరం ఉంటుందని మూడీస్ వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ వడ్లమాని తెలిపారు. దేశీయంగా 11 పీఎస్బీలకు మూడీస్ రేటింగ్స్ ఇస్తోంది. సంస్థ అంచనా ప్రకారం 2019 మార్చి 31తో ముగిసే నాలుగేళ్ల వ్యవధిలో ఈ బ్యాంకులకు కనీసం రూ. 1.45 లక్షల కోట్లు అవసరమవుతాయి. వేల్యుయేషన్లు తక్కువగా ఉన్న నేపథ్యంలో పీఎస్బీలు సమీప భవిష్యత్లో క్యాపిటల్ మార్కెట్ల నుంచి నిధులు సమీకరించగలిగే అవకాశాలు తక్కువేనని మూడీస్ పేర్కొంది. దీంతో రాబోయే 18 నెలల్లో మరిన్ని నిధుల కోసం ఈ బ్యాంకులు ప్రభుత్వం వైపే చూడొచ్చని వివరించింది. 2019 మార్చి నాటికి పీఎస్బీలకు దాదాపు రూ. 70,000 కోట్లు మూలధనం సమకూర్చాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో 2015-16, 2016-17లో రూ. 25,000 కోట్లు చొప్పున, అటు పైన రెండేళ్లు ఏడాదికి రూ. 10,000 కోట్లు చొప్పున అందించనుంది. -
బ్యాంకు షేర్లు బేజార్..
♦ ఏడాదిలో 50-66 శాతానికి పైగా నష్టం ♦ 20 పీఎస్యూ బ్యాంకుల ఉమ్మడి విలువ హెచ్డీఎఫ్సీ కన్నా తక్కువే ♦ వివిధ ఒత్తిళ్లతో భారీగా రుణాలు తీసుకుని ఎగ్గొట్టిన కార్పొరేట్లు ♦ షేర్ల పతనానికి ఎన్పీఏలే ప్రధాన కారణమంటున్న విశ్లేషకులు ♦ అవసరమున్నా... నిధులు సమీకరించలేని దుస్థితి మన బ్యాంకింగ్ వ్యవస్థ చాలా గట్టిది. ప్రభుత్వ బ్యాంకులు అంత బలంగా ఉండటం వల్లే ఇప్పటికీ కింది స్థాయి వరకూ కొంతలో కొంతైనా రుణాలందుతున్నాయి. కాకపోతే ఆ బ్యాంకులకిపుడు నిరర్థక ఆస్తుల సెగ తీవ్రంగానే తగులుతోంది. రాజకీయ ఒత్తిళ్లు, ఇతర ప్రభావాలతో బడా బాబులకు ఇచ్చిన రుణాలు వసూలు కాకపోవటంతో అవి కొండలా పేరుకుపోతున్నాయి. ప్రభుత్వం కఠిన నిబంధనలు తెస్తుండటంతో... రాబోయే రోజుల్లో ఎన్పీఏలు మరింత పెరిగే అవకాశాలూ కనిపిస్తున్నాయి. ఫలితం... స్టాక్ మార్కెట్లో వీటిపై ఇన్వెస్టర్ల విశ్వాసం సన్నగిల్లుతూ... నానాటికీ పాతాళానికి పడిపోతున్నాయి. హైదరాబాద్, బిజినెస్ బ్యూరో :రెండేళ్ల కిందట మోదీ ప్రభుత్వం అధికారంలోకి రాబోతోందన్న అంచనాలు... ఆ అంచనాలకు తగ్గట్టే భారీ మెజారిటీతో మోదీ అధికారంలోకి రావటం... ఇవన్నీ గతంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లను పరుగులు పెట్టించాయి. ప్రభుత్వం మారినా బ్యాంకుల్లో పరిస్థితి మారకపోవటంతో ఇన్వెస్టర్లు వాస్తవంలోకి వచ్చారు. దీంతో దాదాపు అన్ని పీఎస్యూ బ్యాంకుల షేర్లూ ఇపుడు నాలుగైదేళ్ల కనిష్ట స్థాయిల వద్ద ట్రేడవుతున్నాయి. గడిచిన ఏడాది కాలంలో నిఫ్టీ 17 శాతం నష్టపోతే... పీఎస్యూ బ్యాంక్ సూచీ మాత్రం 47 శాతం నష్టపోయింది. వీటిలో పది బ్యాంకులైతే 50 నుంచి 66 శాతం వరకూ నష్టపోయాయి. ఒక్క జనవరి నెలలోనే పీఎస్యూ బ్యాంకులు 20 శాతానికి పైగా పతనమయ్యాయి. ప్రస్తుతం చాలా పీఎస్యూ బ్యాంకులు వాటి పుస్తక విలువ(బుక్ వేల్యూ) కంటే మూడు నుంచి నాలుగు రెట్ల కనిష్ట స్థాయిలో కదులుతున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఎస్బీఐ మినహా ఇతర పీఎస్యూ బ్యాంకులన్నిటి మార్కెట్ విలువ... ప్రైవేటు రంగంలోని ఒక్క హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ విలువ కంటే తక్కువ ఉందంటే ఈ షేర్లు ఏ విధంగా పతనమయ్యాయో అర్థం చేసుకోవచ్చు. చాలా పీఎస్యూ బ్యాంకుల షేర్ల ధరలు ఇపుడు ఆకర్షణీయంగా కనిపిస్తున్నా... ఇంకా కిందకు పడే అవకాశాలున్నాయన్న భయాలు ఇన్వెస్టర్లను వెంటాడుతుండటంతో కొనుగోళ్లకు వెనకడుగు వేస్తున్నారు. మొండి బకాయిలే అసలు సమస్య.. మొండి బకాయిల సమస్య తీరిపోయినట్లేనని బ్యాంకులు ఐదేళ్ల నుంచి ప్రకటిస్తున్నా.,. వాస్తవం మాత్రం దీనికి భిన్నంగా ఉంది. ప్రస్తుతం పీఎస్యూ బ్యాంకుల స్థూల నిరర్థక ఆస్తుల విలువ 6 శాతం దాటిపోయింది. ఇప్పుడు ఆర్బీఐ పీఎస్యూ బ్యాంకుల ప్రక్షాళనకు చేపట్టిన ఇంద్రధనుష్ కార్యక్రమం ఎన్పీఏలు మరింత పెరిగేటట్లు చేస్తోంది. 2017వ సంవత్సరం మార్చి నాటికల్లా బ్యాలెన్స్ షీట్లను ప్రక్షాళన చేయాలని, తద్వారా మొండి బకాయిల సమస్యను పూర్తిగా పరిష్కరించుకోవాలని బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించింది. అంతేకాకుండా 150 కార్పొరేట్ సంస్థలకు ఇచ్చిన అన్ని రకాల రుణాలకూ పూర్తి స్థాయిలో ప్రొవిజనింగ్ కేటాయింపులు చేయాలని కూడా చెప్పింది. దీంతో ఇంతకాలం వడ్డీలు కడుతూ... పునర్ వ్యవస్థీకరణ పేరుతో స్టాండర్డ్ అసెట్స్గా చూపిస్తున్న వాటిని కూడా ఇప్పుడు ఎన్పీఏలుగా ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక కంపెనీ తీసుకున్న రుణం ఎన్పీఏగా మారకుండా ఉండాలంటే కనీసం వడ్డీనైనా చెల్లించాలి. కొన్ని కంపెనీలు ఆ వడ్డీ కూడా చెల్లించకపోవటంతో... అందుకోసం బ్యాంకులు కొత్త రుణాలిచ్చేవి. ఆర్బీఐ ఆదేశాలతో ఇక ఇలా చేయటం కుదరదు. దీంతో కలుగులో దాక్కున్న ఎన్పీఏలు కూడా బయటకు వస్తున్నాయని కార్వీ ఫండమెంటల్ రీసెర్చ్ హెడ్ జగన్నాథం తూనుగుంట్ల చెప్పారు. ఈ ఏఎన్పీఏలకు ప్రొవిజనింగ్ కేటాయింపుల వల్ల ఈసారి చాలా బ్యాంకులు నష్టాలను ప్రకటించే అవకాశం ఉందన్నారు. ఈ చర్యలన్నిటి వల్లా పీఎస్యూ బ్యాంకుల ఎన్పీఏలు 8-9 శాతానికి చేరవచ్చనే అంచనాలున్నాయి. బ్యాంకులపై పెరుగుతున్న ఒత్తిడి అంతర్జాతీయంగా వృద్ధిరేటు మందగించటం, రాజకీయ ఒత్తిళ్లతో అడ్డగోలుగా కార్పొరేట్ సంస్థలకు రుణాలివ్వడం వంటి కారణాల వల్ల పీఎస్యూ బ్యాంకులు అధిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఇన్ఫ్రా, విద్యుత్ పంపిణీ, మెటల్ రంగాలకు పీఎస్యూ బ్యాంకులు అధికంగా రుణాలిచ్చాయి. దీనికి భిన్నంగా ప్రైవేటు బ్యాంకులు రిటైల్ రుణాలను ఎక్కువగా నమ్ముకోవడం వలే ్ల ప్రైవేటు బ్యాంక్ షేర్లు అంతగా పతనం కాలేదని విశ్లేషకులు చెబుతున్నారు. ఎన్పీఏలు, బాసెల్ 3 నిబంధనలకు అనుగుణంగా మూలధనం సమకూర్చుకునేంత వరకు పీఎస్యూ బ్యాంకులపై ఒత్తిడి ఇదే విధంగా ఉంటుందని జెన్మనీ జేఎండీ కె.సతీష్ చెప్పారు. పీఎస్యూ బ్యాంకుల్లో రిస్క్ చాలా ఉంది కాబట్టి వీటికి దూరంగానే ఉండమని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. నిధుల సేకరణ కష్టమే.. పెరుగుతున్న ఎన్పీఏలను సర్దుబాటు చేయటానికి, బాసెల్-3 నిబంధనలను అమలు చేయడానికి ప్రభుత్వరంగ బ్యాంకులకు భారీ నిధులు అవసరమవుతాయి. వచ్చే నాలుగేళ్లలో పీఎస్యూ బ్యాంకులకు రూ.1.72 లక్షల కోట్ల అదనపు మూలధనం అవసరమవుతుందని అంచనా. ఇందులో రూ.70,000 కోట్లను కేంద్ర ప్రభుత్వమే సమకూర్చాల్సి ఉంది. ఈ ఏడాది రూ.25,000 కోట్లు సమకూరుస్తామని కేంద్రం చెప్పగా ఇప్పటి వరకు 13 పీఎస్యూ బ్యాంకులకు రూ.20,088 కోట్ల మూలధనాన్ని కేటాయించింది. వివిధ మార్గాల ద్వారా బ్యాంకులు ఇంకా రూ.1.1 లక్షల కోట్లు సమకూర్చుకోవాలి. కానీ ఇప్పటికే షేర్ల ధరలు బాగా పడిపోవడం, పుస్తక విలువ కంటే చాలా తక్కువ రేట్లలో ట్రేడ్ అవుతుండటంతో బ్యాంకులకు నిధుల సేకరణ కష్టంగా మారింది. బ్యాంకుల నిరర్థక ఆస్తులు తగ్గించుకొని, నికర వడ్డీ లాభదాయకత పెంచుకుంటేనే ఈ రంగ షేర్లు పుంజుకుంటాయని జగన్నాథం చెప్పారు. -
ఉగ్ర భూతానికి నిధులిలా..
ప్రపంచవ్యాప్తంగా ఉగ్రకోరలు చాస్తోన్న ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) పారిస్ దాడి ద్వారా పాశ్చాత్యదేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. యూరప్ దేశాలన్నీ కనివినీ ఎరుగని రీతిలో తమ దేశాల్లోని పట్టణాల్లో భద్రతాబలగాలను మోహరించాయి. భారత్లో కూడా ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీఅయ్యాయి. ఇటీవల టర్కీలో సమావేశమైన జీ-20 దేశాలు ఈ ఉగ్రభూతానికి నిధులు అందకుండా కట్టడి చేయాలని పిలుపునిచ్చాయి. ఆర్థికమూలాలపై దెబ్బకొడితే... ఐఎస్ఐఎస్ను కట్టడి చేయవచ్చని భావిస్తున్నాయి. కానీ బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా కాకుండా... ఇతరత్రా మార్గాల్లోనే ఎక్కువగా నిధులను తరలిస్తున్న ఐఎస్ఎస్ను ఆర్థికంగా దెబ్బతీయడం అంత తేలికేమీ కాదు. ఈ ఉగ్రసంస్థ వనరుల సమీకరణ కూడా చాలా భిన్నంగా ఉంది. సిరియా, ఇరాక్లలో దీని అధీనంలో ఉన్న భూభాగంలో 80 లక్షల నుంచి కోటి మంది దాకా నివసిస్తున్నట్లు అంచనా. ఈ జనాభాకు అవసరమైన మౌలిక సదుపాయాలు చూడటం, పాఠశాలలు, ఇస్లామిక్ కోర్టులు నడపటం, ఉద్యోగులు, ఐఎస్ఐఎస్ తరఫున పోరాడే వారికి జీతాలు... చాలా ఖర్చు ఉంటుంది. అలాగే ఆయుధాలు, వాహనాలు సమకూర్చుకోవడం, అంతర్జాతీయ దాడులు, ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకొని సంస్థకు ప్రచారం చేసుకోవడం, రిక్రూట్మెంట్లు... ఇలా చాలా వాటిపై ఐఎస్ఐఎస్ భారీగానే ఖర్చుపెడుతోంది. దాదాపు 40,000 మంది సాయుధ సిబ్బంది ఉన్నట్లు అంచనా. భారీగా ఆర్థిక అవసరాలున్న ఐఎస్ఐఎస్కు నిధులు ఎలా అందుతున్నాయో చూద్దాం... ఇం‘ధనం’- రూ. 3,650 కోట్లు ఇరాక్లో ఐఎస్ఐఎస్ అధీనంలో ఉన్న ప్రాంతంలోని చమురు బావుల్లో మంచి ఉత్పత్తి జరుగుతోంది. ముడిచమురును చిన్నచిన్న రిఫైనరీల్లో, మొబైల్ రిఫైనరీల్లో శుద్ధిచేసి... టర్కీ సరిహద్దుకు తరలిస్తోంది. ఈ ఉగ్రసంస్థ చమురు అంతా బ్లాక్మార్కెట్కే తరలుతోంది. అధికారికంగా ఏ దేశమూ వీరి చమురును కొనదు కాబట్టి బ్లాక్మార్కెట్లో సగం ధరకే ఐఎస్ఐఎస్ చమురును అమ్ముతోంది. టర్కీలోని బ్రోకర్లు ట్యాంకర్లలో వచ్చే చమురును అమ్మిపెడతారు. కువైట్ దినార్లు, సౌదీ అరేబియా రియాళ్లు, స్థానిక కరెన్సీలోనే నగదు చెల్లింపులు జరుగుతాయి. బ్యాంకుల ప్రమేయం ఉండదు. నగదు తరలింపునకు కూడా నెట్వర్క్ ఉంటుంది. అవసరమైతే నగదుకు బదులు ఆయుధాలు, వాహనాల్లాంటివి కూడా స్మగ్లర్లు సమకూర్చుతారు. రోజుకు పది కోట్ల చొప్పున ఏడాదికి 3,650 కోట్ల రూపాయలను చమురు అమ్మకాల ద్వారా ఆర్జిస్తోంది. * ఈ ఏడాది ఆరంభం వరకు చమురు అమ్మకాల ద్వారా ఐఎస్ఐఎస్ ప్రతిరోజు మూడు మిలియన్ డాలర్లు (దాదాపు 20 కోట్ల రూపాయలు)ఆర్జించేది. * అమెరికా ఆధ్వర్యంలోని సంకీర్ణ సేనలు ఇరాక్లోని చమురు బావులే లక్ష్యంగా వైమానిక దాడులు జరుపుతున్నాయి. ఈ దాడుల్లో సగం చమురు ఉత్పత్తి సామర్థ్యాన్ని ఐఎస్ఐఎస్ కోల్పోయిందని అంచనా. * మరోవైపు అంతర్జాతీయంగా చమురు ధరల పతనం కూడా వీరి ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపింది. ఇరాకీ బ్యాంకుల లూటీ 3,300 కోట్లు మోసుల్, తిక్రిత్ పట్టణాలను స్వాధీనం చేసుకున్నపుడు ఐఎస్ఐఎస్ అక్కడి ఇరాకీ బ్యాంకులను లూటీ చేసింది. దాదాపు 50 కోట్ల డాలర్ల (3,300 కోట్ల రూపాయల) విలువైన స్థానిక కరెన్సీని ఈ ఉగ్రసంస్థ బ్యాంకుల నుంచి దోచుకుందని అమెరికా ఇంటెలిజెన్స్ సంస్థల అంచనా. ఆస్తుల అమ్మకం... అంతర్యుద్ధంలో చనిపోయిన, పారిపోయిన వారి ఆస్తులను ఐఎస్ఐఎస్ స్వాధీనం చేసుకుంటోంది. అలాగే ఇరాకీ ప్రభుత్వ యంత్రాగానికి చెందిన అధికారుల ఆస్తులనూ స్వాధీనం చేసుకుంది. వీటిని అమ్మివేస్తోంది. కొన్నిచోట్ల అద్దెకు ఇస్తోంది. ఇరాక్లోనైతే తాము స్వాధీనం చేసుకున్న అమెరికా వాహనాలు, నిర్మాణసామగ్రి, ఫర్నిచర్ను అమ్మేసింది. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని సురక్షిత ప్రదేశాలకు తరలిపోయిన వారి ఆస్తులనూ తమ అధీనంలోకి తీసుకొంటోంది. ఆస్తుల అమ్మకాల ద్వారా కూడా ఆదాయాన్ని గడిస్తోంది. విరాళాలు... 264 కోట్లు * సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, యూఏఈలలోని బడా వ్యాపారులు, ధనవంతులు ధార్మిక కార్యక్రమాలకు విరివిగా విరాళాలు ఇస్తుంటారు. * సిరియా అధ్యక్షుడు అసద్ను గద్దె దింపాలనే లక్ష్యంతో ఆయన వ్యతిరేకులకు ఆర్థికసాయం చేస్తున్న వారూ ఉన్నారు. * తీవ్రవాదులకు ఆర్థికసాయంపై అంతర్జాతీయంగా ఒత్తిడి రావడంతో సౌదీ అరేబియా 2013లో ఐఎస్ఐఎస్కు సాయమందించడం నేరంగా పరిగణించే చట్టాన్ని తెచ్చింది. అయితే కువైట్, ఖతార్ బ్యాంకుల నుంచి మాత్రం సిరియాకు నిధుల ప్రవాహం స్వేచ్ఛగా సాగుతోంది. * ఇస్లామిక్ రాజ్యస్థాపనను కాంక్షిస్తూ దాతలు సాయపడుతున్నారు. * కనీసం రిజిస్టర్ కూడా చేసుకోని పలు స్వచ్ఛంద సంస్థలకు ఈ విరాళాలు వెళతాయి. తర్వాత ఇవి వాటి ఖాతాల్లోంచి ఐఎస్ఐఎస్కు చేరతాయి. * 2013-14లో ఈ సంస్థకు 40 మిలియన్ల డాలర్లు (దాదాపు 264 కోట్ల రూపాయలు) విరాళాల రూపంలో అందినట్లు ఒక అంచనా. * 2011లో సిరియాలో అంతర్యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా 1,320 కోట్లు ఇలా లెక్కాపత్రం లేకుండా అనామక సంస్థలకు విరాళాల రూపంలో అందినట్లు ఐక్యరాజ్యసమితికి చెందిన ‘ఫైనాన్షియల్ ట్రాకింగ్ సర్వీసు’ తేల్చింది. పురాతన వస్తువుల అమ్మకం... రూ.660 కోట్లు * ఇరాక్, సిరియాల్లో తమ అధీనంలోని మ్యూజియాల ను ఐఎస్ఐఎస్ లూటీ చేసింది. ఎన్నో చారిత్రక ప్రదేశాలను ధ్వంసం చేసి అక్కడి వస్తు వులను కొల్లగొట్టింది. పురాతన వస్తువులను తవ్వి వెలికితీసే పని కూడా చేస్తోంది. * వందలు, వేల ఏళ్ల కిందటి అమూల్యమైన ఈ సంపద... టర్కీ, జోర్డాన్ మీదుగా బ్రోకర్ల చేతులు మారి యూరప్కు తరలివెళుతున్నాయి. * వేలం సంస్థలు వీటిని అమ్మిపెడుతున్నాయి. * పురాతన వస్తువుల విక్రయం ద్వారా ప్రతియేటా ఐఎస్ఐఎస్ 100 మిలియన్ డాలర్లు (దాదాపు 660 కోట్ల రూపాయలు) ఆర్జిస్తున్నట్లు అమెరికా అంచనా. పంట శిస్తు... రూ.1,300 కోట్లు సిరియా, ఇరాక్లలో అత్యంత సారవంతమైన భూమి ఐఎస్ఐఎస్ ఆధీనంలో ఉంది. గోధు మలు, బార్లీ పండుతాయి. రైతులు తమ మొత్తం దిగుబడిలో పదిశాతం శిస్తుగా చెల్లించాలి. ఈ వ్యవసాయ ఉత్పత్తులను బ్లాక్మార్కెట్లో సగం ధరకు అమ్ముకున్నా 1,300 కోట్ల రూపాయల వార్షిక ఆదాయం ఐఎస్ఐఎస్కు వస్తుందని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. ఫాస్పేట్, సల్ఫర్ అమ్మకం... 2,330 కోట్లు ఐఎస్ఐఎస్ అధీనంలో ఉన్న ప్రాంతంలో సహజ వనరులు నిక్షేపాలు సమృద్ధిగా ఉన్నాయి. * ఫాస్పేట్ అమ్మకం ద్వారా 330 కోట్లు, సల్ఫరిక్ యాసిడ్ అమ్మకం ద్వారా దాదాపు 2,000 కోట్ల రూపాయలు ఈ ఉగ్రసంస్థ ఏటా సంపాదిస్తోందని రాయిటర్స్ అంచనా. ఇవి కాకుండా స్థానిక ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు ఎలాగూ ఉంటుంది. కిడ్నాప్లు బడా వ్యాపార కుటుంబాలను టార్గెట్ చేస్తూ ఐఎస్ఐఎస్ కిడ్నాప్లకు పాల్పడుతోంది. భారీ మొత్తాల్లో వసూలు చేసి విడిచిపెడుతోంది. వీరి ఆదాయవనరుల్లో కిడ్నాప్లు కూడా ప్రధానమైనవే. ఈ ఏడాది ఇప్పటిదాకా కిడ్నాప్ల ద్వారా 130 కోట్లు ఐఎస్ఐఎస్ ఆర్జించిందని అమెరికా ఆర్థిక నిఘా విభాగాల అంచనా. ఆపడం ఎందుకు కష్టమంటే... టర్కీ సరిహద్దు పట్టణాల్లోని బ్రోకర్లపై తాజాగా అమెరికా నిఘా పెట్టింది. వీరి సమాచారాన్ని టర్కీకి అందజేస్తోంది. ఇరాక్ కూడా ఐఎస్ఐఎస్తో అక్రమ లావాదేవీలు జరుపుతున్న తమ పౌరులను పలువురిని నిర్భందించింది. ఐఎస్ఐఎస్ ఏది అమ్మినా... బ్లాక్మార్కెట్లోనే, అదీ దాదాపు సగం ధరకే. కొనుగోళ్లు, చెల్లింపులు అన్నీ గుట్టుగా జరిగిపోతుంటాయి. సగం ధరకే ఐఎస్ఐఎస్ దగ్గర కొన్న బ్రోకర్లు వీటిని మార్కెట్ ధరకు అమ్ముకొని భారీగా లాభపడుతున్నారు. కాబట్టే పాశ్చాత్యదేశాలు ఎంతగా ఆర్థికవనరులను కట్టడి చేయడానికి ప్రయత్నించినా ఐఎస్ఐఎస్కు నిరంతరా యంగా డబ్బు అందుతూనే ఉంది. - సాక్షి స్పెషల్ డెస్క్ -
సెన్సెక్స్ కీలక స్థాయి 25,300 పాయింట్లు
మార్కెట్ పంచాంగం అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వు ప్రతి నెల బ్యాంకింగ్ వ్యవస్థలోకి ప్రవహింపజేసే నిధుల్ని (ఉద్దీపన ప్యాకేజీ) నిలిపివేయనున్నట్లు 2013 ప్రథమార్థంలో సంకేతాలు ఇచ్చింది. అప్పట్లో ఈ సంకేతాలకు ప్రపంచ స్టాక్ మార్కెట్లన్ని కొద్ది వారాలు పాటు క్షీణించాయి. దాదాపు అదే తరహాలో ఇప్పటి డౌన్ట్రెండ్ కొనసాగుతోంది. ఈ సెప్టెంబర్ 17 నాటి ఫెడ్ సమావేశంలో వ డ్డీరేట్ల పెంపు నిర్ణయాన్ని తీసుకోవచ్చనే భయాలతో ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లు పడుతున్నాయి. ఒకరకంగా ఇది ఫెడ్కు మార్కెట్ శక్తుల బెదిరింపు అస్త్రం కావచ్చు. 2013లో డౌన్ట్రెండ్ దెబ్బకు ఉద్దీపన ప్యాకేజ్ ఉపసంహరణను కొద్ది నెలలపాటు ఫెడ్ వాయిదా వేసింది. ఈ దఫా వడ్డీరేట్ల పెంపు నిర్ణయాన్ని వాయిదా వేయించేందుకే ఇప్పటి ఈక్విటీల పతనమన్న విశ్లేషణలను అత్యధిక మార్కెట్ నిపుణులు వ్యక్తంచేస్తున్నారు. ఇక భారత్ సూచీల సాంకేతికాంశాలకు వస్తే... సెన్సెక్స్ సాంకేతికాంశాలు సెప్టెంబర్ 4తో ముగిసిన వారంలో బీఎస్ఈ సెన్సెక్స్ 4.5 శాతం నష్టపోయి 25,202 వద్ద ముగిసింది. ఈ క్రమంలో గత మార్కెట్ పంచాంగంలో దీర్ఘకాలిక మద్దతుగా ప్రస్తావించిన 25,300 పాయింట్ల స్థాయి దిగువున ముగిసింది. గతేడాది ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో విజయం సాధించిన రోజైన మే 16 నాటి గరిష్ట స్థాయే ఈ 25,300 పాయింట్ల స్థాయి. రానున్న రోజుల్లో సెన్సెక్స్ మరింత పతనమైన తిరిగి వేగంగా ఈ స్థాయి పైకి వచ్చి స్థిరపడగలిగితే కొద్ది వారాల్లో అప్ట్రెండ్లోకి మళ్లే వీలుంటుంది. లేకపోతే కొద్ది నెలలపాటు మార్కెట్ బేర్ కక్ష్యలో చిక్కుకుపోయే ప్రమాదం ఉంది. ప్రపంచ మార్కెట్ల ట్రెండ్కు అనుగుణంగా ఈ సోమవారం సెన్సెక్స్ గ్యాప్డౌన్తో మొదలైతే 24,745 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు పొందవచ్చు. ఈ స్థాయిని కోల్పోతే 24,420-24,160 పాయింట్ల శ్రేణి వద్దకు పతనం కావచ్చు. ప్రస్తుత స్థాయి నుంచి లేదా పైన ప్రస్తావించిన తొలి మద్దతు నుంచి సెన్సెక్స్ కోలుకుంటే 25,550 పాయింట్ల వద్దకు పెరగవచ్చు. ఆపైన స్థిరపడితే 25,840 పాయింట్ల స్థాయిని అందుకోవచ్చు. అటుపైన 26,140 పాయింట్ల వరకు ర్యాలీ జరిపే అవకాశం ఉంటుంది. నిఫ్టీ మద్దతు 7,563-నిరోధం 7,750 క్రితం వారం ఎన్ఎస్ఈ నిఫ్టీ 347 పాయింట్ల నష్టంతో 7,655 పాయింట్ల వద్ద ముగిసింది. 2014 మే 16 నాటి గరిష్ట స్థాయిని సెన్సెక్స్ కోల్పోయినా, నిఫ్టీ ఇంకా ఆ స్థాయిని (7,563 పాయింట్లు) పరీక్షించలేదు. ఈ కారణంగా నిఫ్టీకి ఇదే తక్షణ మద్దతు స్థాయి. ఈ మద్దతును కోల్పోతే 7,380 పాయింట్ల వద్దకు తగ్గవచ్చు. ఈలోపున 7,200-7,118 పాయింట్ల మద్దతు శ్రేణికి పతనం కావచ్చు. ఈ వారం తొలి రెండు మద్దతు స్థాయిల్లో ఏదోఒక స్థాయి నుంచి నిఫ్టీ పెరిగితే 7,750 పాయింట్ల నిరోధ స్థాయిని చేరవచ్చు. ఈ స్థాయిని అధిగమించి స్థిరపడితే 7,845 పాయింట్ల వద్దకు పెరగవచ్చు. అటుపైన ముగిస్తే 7,930 పాయింట్ల వరకు ర్యాలీ జరపవచ్చు. -
ప్రస్తుత బ్యాంకులకు పేమెంటు బ్యాంకులు పోటీరావు: క్రిసిల్
ముంబై : ప్రస్తుతం కార్యకలాపాలు నిర్వహిస్తున్న బ్యాంకులకు త్వరలో రానున్న పేమెంట్ బ్యాంకులు(పీబీ) పోటీ కాబోవని శుక్రవారం విడుదల చేసిన ఒక నివేదికలో రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అభిప్రాయపడింది. బ్యాంకింగ్ వ్యవస్థ అంతగా బలపడని తూర్పు, ఈశాన్య, మధ్య ప్రాంతాలపై పేమెంట్ బ్యాంకులు ప్రధానంగా దృష్టి పెట్టే అవకాశం ఉందని తెలిపింది. రానున్న పేమెంట్ బ్యాంకుల గురించి ప్రస్తుత బ్యాంకులు ఎటువంటి ఆందోళనా చెందనక్కర్లేదని క్రిసిల్ చీఫ్ విశ్లేషకులు పవన్ అగర్వాల్ పేర్కొన్నారు. పైగా పీబీలతో ప్రస్తుత బ్యాంకులు అవగాహన కుదుర్చుకుని, అన్బ్యాంకింగ్ ప్రాంతాల్లో ‘వ్యయ భారాలు లేని’ సేవల విస్తరణ దిశగా ప్రయోజనం పొందవచ్చని తెలిపారు. 11 పేమెంట్ బ్యాంకులకు రెండు రోజుల క్రితం ఆర్బీఐ లెసైన్సులివ్వడం తెలిసిందే. -
భారీ వృద్ధి బాటన భారత్
కేంద్ర మంత్రి జయంత్ సిన్హా ♦ పెట్టుబడుల వృద్ధి, ద్రవ్యోల్బణం ♦ కట్టడి ధ్యేయమని వివరణ న్యూఢిల్లీ : భారత్ ఆర్థిక రంగం భారీ వృద్ధి దిశలో ఉందని ఆర్థిక శాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా శుక్రవారం పేర్కొన్నారు. పెట్టుబడులను భారీగా ఆకర్షించడం, ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడం కేంద్రం ప్రధాన లక్ష్యమని వివరించారు. ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచుతూ, సాధించే అభివృద్ధి పటిష్టంగా ఉంటుందని, తద్వారా ‘వృద్ధి బుడగ పేలడం’ తరహా పరిస్థితి ఉత్పన్నం కాదని అన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల చీఫ్ విజిలెన్స్ అధికారుల 6వ సదస్సును ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ‘నిర్ణయాత్మక నాయకత్వం కేంద్రంలో ఉంది. వృద్ధికి సంబంధించి విధాన పరమైన కార్యాచరణను మేము రూపొం దించాం. మేము చాలా విశ్వసనీయతతో ముందుకు వెళుతున్నామన్న అంశం దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులకు చాలా స్పష్టంగా అర్థమైంది. భారత్ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ బాటలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది’’ అన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులకు తగిన మద్దతు అందించడానికి కేంద్రం కట్టుబడి ఉన్నదని సిన్హా అన్నారు. మొండిబకాయిల కేసుల్లో కఠిన చర్యలుండాలి: సిన్హా బ్యాంకింగ్ వ్యవస్థలో దాదాపు రూ. 2.22 లక్షల కోట్ల మేర మొండిబకాయిలు (ఎన్డీఏ) పేరుకు పోవడానికి దారి తీసిన బ్యాంకింగ్ మోసాల్లాంటి వాటికి చెక్ పెట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సీబీఐ డెరైక్టర్ అనిల్ సిన్హా చెప్పారు. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల్లో మోసాలను ముందస్తుగా గుర్తిం చేందుకుపై అన్ని స్థాయిల్లో సిబ్బంది ఆర్థిక క్రమశిక్షణతో వ్యవహరించేలా చూడాల్సి ఉందని సదస్సులో తెలిపారు. ఎన్పీఏలుగా మారే రుణాల ముప్పు గురించి ముందస్తుగానే అప్రమత్తయ్యేందుకు రెడ్ ఫ్లాగ్ అకౌంట్స్ విధానాన్ని ఆర్బీఐ ప్రవేశపెట్టిందని అనిల్ సిన్హా పేర్కొన్నారు. -
డెబిట్ కార్డుతో పుస్తకాలపై డిస్కౌంట్
- రచయిత అమీష్ త్రిపాఠీతో జట్టు - కో-బ్రాండెడ్ కార్డును ఆవిష్కరించిన కోటక్ బ్యాంక్ - కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా సేవల్లో మార్పు - బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సుమిత్ బాలి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్యాంకింగ్ వ్యవస్థలో కస్టమర్ల అభిరుచులు వేగంగా మారుతున్నాయని, వారికి తగ్గట్టు బ్యాంకింగ్లో తాము పలు మార్పులు తీసుకొస్తున్నామని కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సుమిత్ బాలి చెప్పారు. కస్టమర్లతో మరింత బలమైన అనుబంధం కోసం వారికిష్టమైన పుస్తకాల్ని వారి ఇళ్లకే అందించేందుకు రచయితలతో ఒప్పందాలు చేసుకుంటున్నట్లు తెలియజేశారు. ప్రముఖ రచయిత, ‘శివ ట్రయాలజీ’ సృష్టికర్త అమీష్ త్రిపాఠీ రాసిన తాజా పుస్తకం ‘సియాన్ ఆఫ్ ఇక్ష్వాకు’ ముఖచిత్రంగా కో-బ్రాండెడ్ డెబిట్ కార్డును మంగళవారమిక్కడ ఆయన ఆవిష్కరించారు. ఈ కార్డు సాయంతో మిగిలిన బ్యాంకింగ్ కార్యకలాపాలతో పాటు అమీష్ త్రిపాఠీ పుస్తకాలపై 15 శాతం డిస్కౌంట్ పొందవచ్చని వెల్లడించారు. ‘‘ఈ పుస్తకాన్ని మా బ్యాంక్ మొబైల్ యాప్ ద్వారా కానీ, వెబ్సైట్ ద్వారా కానీ ఆర్డర్ చేయొచ్చు. అమెజాన్తో ఒప్పందం ద్వారా సదరు పుస్తకాలను నేరుగా కస్టమర్ల ఇళ్లకు డెలివరీ చేస్తాం’’ అని సుమిత్ బాలి వివరించారు. వినియోగదారుల అభిరుచులు మారుతున్నాయని, వారితో బలమైన బంధం కోసం తాము గతంలో పీవీఆర్ కో-బ్రాండెడ్ కార్డులు ప్రవేశపెట్టామని, చెన్నై మారథాన్ కార్డులు కూడా తెచ్చామని, ఇవన్నీ విజయం సాధించటంతో కస్టమర్లు పుస్తకాలంటే ఎక్కువ ఇష్టపడుతున్నారని గ్రహించి తాజా సేవలు ఆరంభించామని చెప్పారు. ఈ పుస్తకాన్ని ట్వీటర్లో కూడా ఆర్డర్ చేయొచ్చన్నారు. డిజిటల్ బ్యాంకింగ్ గురించి మాట్లాడుతూ... బ్రాంచీల వెలుపలే అత్యధిక లావాదేవీలు జరిగే పరిస్థితులు ఏర్పడుతున్నాయని, ఫేస్బుక్, ట్వీటర్ వంటి సోషల్ మీడియా ద్వారా లావాదేవీలు సురక్షితంగా జరుపుకోవటానికి తాము ప్లాట్ఫామ్ను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. ఐఎన్జీ టేకోవర్ వల్ల తాము దక్షిణాదిలో బాగా బలపడ్డామని, ఈ టేకోవర్ 2015 ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి వచ్చిందని చెప్పారు. ఈ సంవత్సరం 2015-16 బ్యాలెన్స్ షీట్లో ఉమ్మడి ఫలితాలు ప్రతిఫలిస్తాయని తెలియజేశారు. తొలి క్వార్టర్ ఫలితాలు కూడా ఉమ్మడిగానే ఉంటాయన్నారు. ఐఎన్జీ కలయికతో తమ ఉద్యోగుల సంఖ్య 40వేలకు చేరుకుందని, బ్యాలెన్స్ షీట్ రూ.2 లక్షల కోట్లకు చేరిందని వెల్లడించారు. బ్యాంకింగ్ మారుతోంది... రచయిత అమీష్ త్రిపాఠీ మాట్లాడుతూ... తాను రచయితగా మారక ముందు మూడు బ్యాంకుల్లో ఉద్యోగాలు చేశానని, తాను ఐడీబీఐలో చేసినపుడు ఆ బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ విలువ కేవలం రూ.60 వేల కోట్లని చెప్పారు. అయితే 60 వేల కోట్లకు చేరటానికి ఆ బ్యాంకుకు చాలా సమయం పట్టిందని, కానీ కోటక్ అతి తక్కువ కాలంలో 2 లక్షల కోట్లకు చేరిందని తెలియజేశారు. ‘సియాన్ ఆఫ్ ఇక్ష్వాకు’ కో-బ్రాండెడ్ కార్డును ఆవిష్కరించాక మాట్లాడుతూ... ఈ సిరీస్లో ఇది తొలి పుస్తకమని, మరో 4 పుస్తకాలు రానున్నాయని తెలిపారు. ఈ-బుక్ల ప్రవేశంతో మామూలు పుస్తకాలు చదివే అలవాటు తగ్గుతోందన్న వాదనను ఆయన తోసిపుచ్చారు. ‘‘సంప్రదాయ పుస్తక పఠనం కూడా పెరుగుతోంది. అయితే ఈ-బుక్ రీడింగ్ ఇంకా వేగంగా పెరుగుతోంది. నేను రాసిన శివ ట్రయాలజీ 25 లక్షల కాపీలు అమ్ముడుపోవటమే దీనికి నిదర్శనం’’ అన్నారాయన. -
బ్యాంకింగ్కు మరింత మూలధనం!
♦ ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ ♦ వర్షపాతంపై ఆశావహ ధోరణి కాలిఫోర్నియా : బ్యాంకింగ్కు తాజా మూలధనం కేటాయింపులపై నిర్దిష్టంగా ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ పేర్కొన్నారు. భారత్కు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా అమెరికాలో 10 రోజుల పర్యటన జరుపుతున్న జైట్లీ, తాజాగా ప్రతిష్టాత్మక స్టన్ఫోర్ట్ విశ్వవిద్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో భారత్ ఆర్థిక వ్యవస్థ పురోభివృద్ధిపై ప్రసంగించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ, భారత్ ఆర్థిక వ్యవస్థ పురోగతిలో బ్యాంకింగ్ వ్యవస్థ కీలకమైన పాత్ర పోషిస్తోందని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బ్యాంకులకు తాజా మూలధనం కేటాయింపులకు సంబంధించి ఇంకా నిర్దిష్టంగా ఒక నిర్ణయం ఏదీ తీసుకోలేదని వెల్లడించారు. బడ్జెట్లో కొంత మొత్తాలను (దాదాపు రూ.7,940 కోట్లు) ప్రకటించినా, అంతకుమించి మరింత తాజా మూలధనం అందించాలన్నది లక్ష్యమని తెలిపారు. బ్యాంకుల్లో ప్రభుత్వ వాటాను 52 శాతానికి తగ్గించి, ప్రైవేటు కేపిటల్ను సైతం భారీగా వ్యవస్థలోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలన్నది ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రైవేటు రంగ బ్యాంకులు సైతం పోటీతత్వంతో ధీటుగా పనిచేస్తున్నాయని జైట్లీ అన్నారు. దేశంలో ప్రస్తుత వర్షపాత పరిస్థితులు ఆశాజనకంగా ఉన్నాయని ఆర్థిక వ్యవస్థకు కలిసివచ్చే అంశం ఇదని పేర్కొన్నారు. -
సీఆర్ఆర్ కోత చాన్స్: ఎస్బీఐ
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ వ్యవస్థలో నగదు లభ్యత ప్రధాన ధ్యేయంగా త్వరలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక చర్య తీసుకునే అవకాశం ఉందని ఎస్బీఐ నివేదిక ఒకటి బుధవారం తెలిపింది. ఇందులో భాగంగా నగదు నిల్వల నిష్పత్తిని (సీఆర్ఆర్) కొంత తగ్గించవచ్చని పేర్కొంది. ఏప్రిల్ 7 తదుపరి పాలసీ సమీక్షకు ముందే ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకోవచ్చనీ అభిప్రాయపడింది. బ్యాంకులు తమ మొత్తం డిపాజిట్లలో కొంత మొత్తాన్ని తప్పనిసరిగా ఆర్బీఐ వద్ద ఉంచాల్సి ఉంటుంది. దీనినే సీఆర్ఆర్గా వ్యవహరిస్తారు. ప్రస్తుతం ఇది 4%గా ఉంది. సీఆర్ఆర్ను అర శాతం తగ్గిస్తే, బ్యాంకింగ్ వ్యవస్థలోకి రూ.45,700 కోట్ల నిధులు అందుబాటులోకి వస్తాయి. గడచిన రెండు నెలల్లో ఆర్బీఐ కీలకమైన రెపో రేటును రెండు దఫాలుగా పావుశాతం చొప్పున తగ్గించింది. దీనితో ఈ రేటు ప్రస్తుతం 7.5 శాతానికి చేరింది. -
రీషెడ్యూల్ చేస్తేనే రుణమాఫీ
కరీంనగర్ అగ్రికల్చర్: సర్కారు నిర్ణయాలు కరీంనగర్ జిల్లా రైతుల పాలిట శాపంగా మారుతున్నాయి. ఇచ్చినట్లే ఇచ్చి ఎంతో కొంత తిరిగి రాబట్టుకునేందుకు కొర్రీలు పెడుతోంది. ఈ నెలాఖరులోగా రీషెడ్యూల్ చేసుకున్న రైతులకే రుణమాఫీ వర్తిస్తుందంటూ సర్కారు స్పష్టం చేసింది. అన్నదాతలకు అవగాహన లేక, రీషెడ్యూల్ ప్రక్రియ విధానం తెలియక కరీంనగర్ జిల్లాలో 70వేల మంది అందుకు దూరంగానే ఉన్నారు. వ్యవసాయ శాఖ, బ్యాంకర్లు కనీస చర్యలకు పూనుకోకపోవడంతో వీరందరికి రుణామాఫీ ప్రశ్నార్థకంగా మారుతోంది. డెడ్లైన్ గడువు మరో 48 గంటలే ఉండడంతో రైతులందరికీ రీషెడ్యూల్ జరుగుతుందా అనేది అనుమానంగా ఉంది. టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన తర్వాత గతేడాది ఆగస్టులో పంట రుణాల మాఫీని ప్రకటించింది. జిల్లాలో రూ.లక్ష లోపు రుణం పొందిన 3,80,203 మంది రైతులను గుర్తించగా, వీరికి రూ.1694 కోట్ల పంట రుణాలను మాఫీ చేస్తామని పేర్కొంది. అయితే ఈ మొత్తాన్ని నాలుగు దఫాలుగా మాఫీ చేస్తున్నట్టు ప్రకటించింది. మొదటి విడతగా 25 శాతం అంటే రూ.423.56 కోట్ల రుణమాఫీని రైతుల ఖాతాల్లో జమ చేసింది. అయితే సర్కారు తీరుతో విడుదలైన 25శాతం సొమ్ము కూడా రైతులకు దక్కే పరిస్థితి కనిపించడం లేదు. రుణమాఫీ వర్తించాలంటే రీషెడ్యూల్ తప్పనిసరి అని ప్రభుత్వం స్పష్టం చేస్తుండడం అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తోంది. కరీంనగర్ జిల్లాలో ఖరీఫ్, రబీ సీజన్లలో పంట రుణాల లక్ష్యం రూ.2300 కోట్లకు కాగా, ఇప్పటివరకు రూ.1600 కోట్లు మాత్రమే రుణాలిచ్చారు. రుణమాఫీ అర్హత పొందిన 3,80,203 మంది రైతుల్లో 3,10,000 మంది మాత్రమే రీషెడ్యూల్ చేసుకున్నారు. పంట రుణాలు, బంగారం తాకట్టు పెట్టి పంట రుణం తీసుకుని రుణమాఫీ అర్హత ఉన్నవారంతా రీషెడ్యూల్లో భాగంగా రూ.1560 కోట్ల పంట రుణాలు పొందినట్లు బ్యాంకర్లు చెబుతున్నారు. జిల్లాలో 70,203 మంది రైతులు ఈ ఏడాది పంట రుణాలు తీసుకోలేదు. ప్రభుత్వం మాత్రం వారిని రుణమాఫీకి అర్హులుగా గుర్తించి వారి బ్యాంకు ఖాతాల్లో 25శాతం సొమ్మును జమచేసింది. గడువు రెండు రోజులే.. రైతులకు రుణమాఫీ వర్తించాలంటే రుణాలు రీషెడ్యూల్ చేసుకుని బ్యాంకర్లు ఇచ్చే మొత్తాన్ని తీసుకోవాలి. అప్పుడే 2015-16, 2016-17, 2017-18 సంవత్సరాల్లో మిగిలిన రుణమాఫీ మొత్తాన్ని ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. ఇప్పుడు వేసిన మొత్తానికి అనుగుణంగా మళ్లీ రుణాలు పొందలేకపోతే ప్రభుత్వం ఈ మొత్తాన్ని వెనక్కు తీసుకుంటుందని వ్యవసాయాధికారులు స్పష్టం చేస్తున్నారు. అప్పుడు రుణం మొత్తాన్ని రైతులే చెల్లించాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఈనెల 31లోగా రైతులంతా రుణాలు రీషెడ్యూల్ చేసుకోవాల్సి ఉంది. గడువు ఇంకా రెండు రోజులే ఉండగా, వ్యవసాయశాఖ, బ్యాంకర్లు చివరి నిమిషంలో హడావుడి చేయడం విమర్శలకు తావిస్తోంది. బ్యాంకర్లు, వ్యవసాయ శాఖ మధ్య సమన్వయలోపం కారణంగా 70వేల మంది రీషెడ్యూల్ చేసుకోలేకపోయారు. వీరిలో భూమి తన పేరు మీద ఉండి ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లినవారు, చాలా కాలంగా రుణాలు చెల్లించకుండా పెండింగ్లో ఉండి చనిపోయినవారు, అర్హత కార్డులు లేని కౌలురైతులే ఎక్కువగా ఉన్నారు. ఈ క్రమంలో అధికారులు వ్యవసాయం చేసుకుంటున్న వారి సంబంధీకులకు వారికి ఉన్న భూమి ఆధారంగా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంటరుణం ఇచ్చే చర్యలకు పూనుకుంటున్నారు. ఈ విషయమై లీడ్ బ్యాంకు మేనేజర్ డీఏ.చౌదరి మాట్లాడుతూ ఈనెల 31లోగా పంట రుణాలను రెన్యువల్ చేసుకున్న రైతులకే రుణమాఫీ వర్తిస్తుందని, వందశాతం రీషెడ్యూల్ జరిగేలా బ్యాంకర్లకు ఆదేశాలున్నాయని, ఈ రెండు రోజుల్లో ఆ దిశగా చర్యలు తీసుకుంటామని అన్నారు. -
రీ షెడ్యూలు చేసుకుంటేనే రుణమాఫీ
పంట రుణాలు రీ షెడ్యూలు చేసుకోవాల్సిందేనన్న ప్రభుత్వ ప్రకటనతో రుణాల మాఫీ వ్యవహారం మరోమారు తెరమీదకొచ్చింది. రీషెడ్యూలు గడువు రెండు రోజులు మాత్రమే ఉండటంతో రైతులు ఉరుకులు, పరుగులు పెడుతున్నారు. రుణాల మాఫీ ప్రక్రియపై మొదటి నుంచి అధికారులు అస్పష్ట ప్రకటనలు చేస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఓ వైపు అధికారుల హెచ్చరికలు, మరోవైపు బ్యాంకర్ల వైఖరితో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రుణమాఫీ ప్రక్రియపై రైతులకు అవగాహన లేకపోవడం, కొందరు చనిపోవడం, మరికొందరు వలస వెళ్లడం వంటి కారణాలతో పంట రుణాల రీ షెడ్యూలు జిల్లాలో పూర్తిస్థాయిలో జరగలేదు. జిల్లాలో 6.07లక్షల మంది రైతులు రూ.2725.83 కోట్ల మేర పంట రుణాల మాఫీకి అర్హులుగా తేల్చారు. అయితే ప్రభుత్వం విడతల వారీగా రుణమాఫీకి శ్రీకారం చుట్టడంతో గత ఏడాది సెప్టెంబర్లో తొలి విడత కింద రూ.681.45 కోట్లు బ్యాంకుల ఖాతాల్లో జమచేశారు. 4.55 లక్షల మంది రైతులు రూ.1917 కోట్ల మేర రుణాలను రీ షెడ్యూలు చేసుకున్నారు. సుమారు 1.50లక్షల మంది రైతుల్లో కొందరు అవగాహన లోపంతో, మరికొందరు మళ్లీ రుణం అవసరం లేదనే ఉద్దేశంలో రీ షెడ్యూలు చేసుకోలేదు. పంట రుణాలు రీ షెడ్యూలు చేసుకుంటేనే రుణమాఫీ వర్తిస్తుందని తాజాగా అధికారులు ప్రకటనలు చేస్తున్నారు. లేనిపక్షంలో తొలి విడత కింద రైతుల ఖాతాలో జమ చేసిన 25శాతం రుణ మొత్తం తిరిగి తీసుకుంటామని చెబుతున్నారు. కొన్నిచోట్ల రీ షెడ్యూలు ఫారాలపై సంతకాలు చేయాలంటూ బ్యాంకర్లు తమ ఏజెంట్ల ద్వారా ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. సహకరించని బ్యాంకర్లు రుణమాఫీ వ్యవహారంతో తమకు సంబంధం లేదని బహిరంగంగా చెబుతున్న బ్యాంకర్లు రీ షెడ్యూలు కోసం వెళ్తున్న రైతులను ఇక్కట్లకు గురి చేస్తున్నారు. తగినన్ని కౌంటర్లు, సిబ్బందిని ఏర్పాటు చేయకపోవడంతో పాటు నిర్లక్ష్యంగా సమాధానాలు ఇస్తున్నారు. ఓ వైపు రీ షెడ్యూలు గడువు ముంచుకొస్తుండడం, మరోవైపు బ్యాంకర్ల సహాయ నిరాకరణతో లబ్ధి పొందలేక పోతున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు. రుణమాఫీ లబ్ధిదారుల్లో సుమారు 56వేల మంది బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నారు. ఆంధ్రాబ్యాంకుతో సహా కొన్ని బ్యాంకులు బంగారం రుణాలను రీ షెడ్యూలు చేస్తుండగా ఎస్బీఐ మాత్రం నిరాకరిస్తోంది. పంట రుణాల మాఫీని సాకుగా చూపుతూ వార్షిక ప్రణాళికలో నిర్దేశించిన పంట రుణాల లక్ష్యాన్ని కూడా బ్యాంకర్లు పట్టించుకోవడం లేదు. జిల్లాలో వివిధ బ్యాంకులకు 349 శాఖలుండగా ఖరీఫ్, రబీలో కలిపి రూ.2804 కోట్లను పంట రుణాల లక్ష్యం గా నిర్దేశించారు. ఖరీఫ్లో రూ.1542 కోట్ల లక్ష్యానికి రూ.625 కోట్లు, రబీలో రూ.1262 కోట్లకు రూ.860 కోట్లు మాత్రమే పంట రుణాల వితరణ జరి గింది. కొత్త రుణాల మంజూరు, పంట రుణాల రీ షెడ్యూలుపై అంతా సానుకూలంగా ఉన్నట్లు బ్యాంకర్లు ప్రకటనలు ఇస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. రీ షెడ్యూలు గడువు పెంచడంతో పాటు బ్యాంకుల్లో శాఖల వారీగా పంట రుణాల మంజూరు, రైతుల కోసం బ్యాంకులు చేస్తున్న ఏర్పాట్లపై సమీక్ష జరిగితేనే ప్రయోజనం నెరవేరేలా ఉంది. -
బ్యాంకింగ్ వ్యవస్థలోకి 99.74 శాతం కుటుంబాలు
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి జన ధన యోజన కింద ఇప్పటికి దాదాపు 11.5 కోట్ల బ్యాంక్ ఖాతాలు ప్రారంభమైనట్లు ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ సోమవారం తెలిపారు. లక్ష్యం 10 కోట్లకన్నా ఇది అధికమన్న విషయాన్ని ఆర్థికమంత్రి గుర్తుచేసారు. పాత ఖాతాలతో సహా తాజా జనధన ఖాతాలతో 99.74 శాతం కుటుంబాలకు సంబంధించి బ్యాంక్ అకౌంట్లు ప్రారంభమైనట్లయ్యిందని ఆయన సూచనాప్రాయంగా తెలిపారు. భారత్ యావత్తూ దాదాపు బ్యాంకింగ్ వ్యవస్థతో అనుసంధానించినట్లయ్యిందని కూడా పేర్కొన్నారు. జన ధన అకౌంట్లలో రూ.9,000 కోట్లకు పైగా డిపాజిట్ అయినట్లు ఆర్థికమంత్రి తెలిపారు. దేశంలో ప్రజలందరినీ ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములను చేయడం లక్ష్యంగా జన ధన పథకాన్ని గత ఏడాది స్వాతంత్య్ర దినోత్సవంనాడు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. 2015 జనవరి 26 నాటికి పేదల చేత 7.5 కోట్ల అకౌంట్లను ప్రారంభించాలన్నది ఆగస్టు 28న ప్రారంభమైన ఈ పథకం లక్ష్యం. ఆ తర్వాత లక్ష్యాన్ని 10 కోట్లకు పెంచారు. గిన్నిస్ రికార్డు... ఇదిలావుండగా ప్రధాని జనధన యోజన కింద ఒకేవారంలో అత్యధిక బ్యాంకు అకౌంట్లు ప్రారంభం కావడం గిన్నిస్ రికార్డుల్లో కూడా నమోదయ్యిందని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి హాస్ముఖ్ అధియా తెలిపారు. 2014 ఆగస్టు 23 నుంచి 29వ తేదీల మధ్య 1,80,96,130 అకౌంట్లు ప్రారంభమయ్యాయని, ఇందుకు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సేవల శాఖకు వరల్డ్ గిన్నిస్ రికార్డుల్లో స్థానం లభించిందన్నారు. గొప్ప మార్పు: ప్రధాని జన్ధన్ యోజన మంచి ఫలితాలను సాధించిందని ప్రధాని నరేంద్రమోదీ కూడా ట్వీట్ చేశారు. కేవలం నాలుగు నెలల్లో ఈ విజయాన్ని సాధించిన విషయాన్ని ప్రస్తావించారు. ఆర్థిక వ్యవస్థలో ప్రజలందరి భాగస్వామ్యం దేశ ఆర్థిక విజయానికి దోహదపడే అంశమని పేర్కొన్నారు. -
చంద్రబాబు దొంగాట
రుణమాఫీ ప్రకటనతో సరి విముక్తి కల్పించినట్టు బాబు హడావుడి విడుదల కాని విధివిధానాలు అదెలా సాధ్యమని బ్యాంకర్ల విస్మయం రుణమాఫీ చేస్తున్నట్టు ప్రకటిస్తే చాలా?... బ్యాంకుల్లో రూపాయి జమ చేయలేదు. రుణమాఫీపై విధివిధానాలు జారీ కాలేదు. రైతులు, మహిళలకు రుణ విముక్తి కల్పించేశామని చంద్రబాబు చెప్పుకొంటున్నారు. టీడీపీ శ్రేణులైతే భారీఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. ‘అదెలా సాధ్యమో అర్థం కావడం లేదు.. ఇలాంటి ప్రకటనలతో రైతుల నుంచి సొమ్ము వసూలు కాదంటున్నారు’ బ్యాంకర్లు. ప్రభుత్వ తీరుపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకింగ్ వ్యవస్థకు మంచిది కాదని హితవు పలుకుతున్నారు. విశాఖ రూరల్: రుణ మాఫీపై ప్రభుత్వం తీరు రైతులకు తీవ్ర నష్టాన్ని తెచ్చిపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. రుణ మాఫీ ఇప్పట్లో జరిగే అవకాశం లేదని నిన్నమొన్నటి వరకు ప్రభుత్వం ప్రకటించడంతో.. రుణాల రీషెడ్యూల్పై రిజర్వ్బ్యాంకు సానుకూల నిర్ణయం తీసుకుంటుదన్న వార్తలు వినిపించాయి. ఒకవేళ రుణాలు రీషెడ్యూల్ చేసినా రైతులపై 12 శాతం వడ్డీ భారం పడుతుంది. అయినప్పటికీ కొత్త రుణాలు వస్తాయనుకున్న సమయంలో రుణ మాఫీ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. రైతు కుటుంబంలో రూ.లక్షన్నర, డ్వాక్రా సంఘానికి రూ.లక్షలోపు రుణం మాఫీ చేస్తామంటూ చెప్పుకొచ్చారు. కానీ పైసా కూడా బ్యాంకుల్లో నిధులు జమ చేయలేదు. మంత్రులు, టీడీపీ శ్రేణులు మాత్రం రుణాలు మాఫీ చేసేశామంటూ మిఠాయిలు పంచుకుంటూ పెద్ద హడావుడే సృష్టించారు. వాస్తవానికి నిజంగా రుణాల మాఫీ జరిగితే రుణాల రీషెడ్యూల్ అవసరమే ఉండదు. రుణ మాఫీ కోసం ఎర్రచందనం అమ్మకాలు, గనులు, ఇతరత్రా మార్గాల నుంచి నిధులు సమీకరిస్తామని ప్రభుత్వం చెబుతోంది. దీనికి ఎంత సమయం పడుతుందన్న విషయంలో ప్రభుత్వానికి కూడా స్పష్టత లేదు. రుణాలు మాఫీ చేయకుండానే ఏదో జరిగిపోయినట్లు ప్రభుత్వం ప్రకటించడం వల్ల రుణాల రీషెడ్యూల్కు రిజర్వ్బ్యాంక్ అంగీకరించే అవకాశముండదన్న ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. వనరులు అమ్ముకొని సొమ్ము చేసుకునేలోపు ఖరీఫ్ సీజన్ ముగిసిపోతుంది. ఈలోగా కొత్త రుణాలు అందే అవకాశముండదు. ఫలితంగా రైతులు తీవ్రంగా నష్టపోవలసి ఉంటుంది. బ్యాంకులకు సమాచారమే లేదు : రుణ మాఫీకి సంబంధించి బ్యాంకులకు ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం అందలేదు. కనీసం జిల్లాలో రూ.లక్షన్నర లోపు రుణాలు పొందిన రైతుల జాబితా కూడా అధికారుల వద్ద లేదు. రాష్ర్ట స్థాయిలో బ్యాంకర్ల నుంచి తీసుకున్న సమాచారాన్ని కూడా జిల్లా అధికరులకు అందించడం లేదు. రుణ మాఫీ ప్రకటనలో స్పష్టత లేకపోవడంతో బ్యాంకర్లు నోరు మెదపలేకపోతున్నారు. కుటుంబంలో ఒకరికా లేదా కుటుంబం మొత్తం మీద రూ.లక్షన్నర వరకు మాఫీ జరుగుతుందన్న విషయంపై గందరగోళం నెలకొంది. జిల్లాలో గత ఏడాది మొత్తంగా రూ.1040 కోట్ల రుణాలు అందించారు. ఇందులో రూ.లక్షన్నరలోపు ఎంతమంది రుణాలు పొందారో లీడ్ బ్యాంక్ అధికారుల వద్ద కూడా సమాచారం లేదు. రుణ మాఫీపైనే కాకుండా కనీసం రుణాల రీషెడ్యూల్పై కూడా రిజర్వు బ్యాంకు నుంచి బ్యాంకులకు ఎలాంటి మార్గదర్శకాలు అందలేదు. డ్వాక్రాలోను గందరగోళమే డ్వాక్రా రుణాల విషయంలో గందరగోళం నెలకొంది. జిల్లాలో మొత్తంగా డ్వాక్రా రుణ బకాయిలు రూ.853 కోట్లు ఉన్నాయి. ఇందులో జీవీఎంసీ పరిధిలో 18,500 మహిళా స్వయం సహాయ సంఘాలు రూ.260 కోట్లు మేర చెల్లించాల్సి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో డీఆర్డీఏ పరిధిలో 37,634 మహిళా సంఘాలు రూ.593 కోట్లు బ్యాంకులకు బకాయి పడ్డాయి. ఇందులో రూ.లక్షలోపు రుణాలు పొందిన సంఘాలు కేవలం 9758 మాత్రమే ఉన్నాయి. మిగిలిన సంఘాలు మాత్రం రుణాలు చెల్లించాల్సి ఉంటుంది. రుణ మాఫీ ప్రకటన చేసినప్పటికీ బ్యాంకులు కొత్త రుణాలు అందించడం లేదు. ప్రభుత్వం రుణాలను బ్యాంకుల్లో జమ చేసిన తరువాతే కొత్త రుణాలపై నిర్ణయం తీసుకుంటామని బ్యాంకర్లు చెబుతున్నారు. దీన్నిబట్టి చూస్తే మహిళా సంఘాలకు ఇప్పట్లో రుణాలు అందే అవకాశం కనిపించడం లేదు. -
ప్రజలపై మొండి బాకీల బండ !
విశ్లేషణ: బ్యాంకింగ్ వ్యవస్థపై ఆర్బీఐకి సంపూర్ణ నియంత్రణాధికారం ఉంటుంది. ప్రతి బ్యాంకు నిర్వహణకు ఒక బోర్డు, దానిలో ఆర్బీఐ అధికారి సభ్యుడిగా ఉంటారు. బ్యాంకింగ్ వ్యవస్థ దారితప్పుతుంటే ఆర్బీఐ ప్రతినిధులు నిద్రపోతున్నారా లేక వారు కూడా బ్యాంకుల యాజమాన్యాలతో కుమ్మక్కయ్యారా? బకాయిలు పెరిగిపోతుంటే ఆర్బీఐ ఏం చేస్తోంది? అమెరికాలో 2008లో బడా బ్యాంకుల్లో మొండి బాకీలు పేరుకుపోవడంతో ప్రపంచ ఆర్థిక సంక్షోభం తలెత్తింది. ఇప్పుడు మన దేశంలో కూడా బ్యాంకింగ్ వ్యవస్థను మొండి బకాయిలు తీవ్రంగా కుదిపేస్తున్నాయన్న విషయంలో స్వయంగా కేంద్ర ఆర్థిక మంత్రి పీ చిదంబరం ఆవేదన వ్యక్తం చేశారు. గత రెండేళ్లలో మూడునాలుగుసార్లయినా ఆయన బ్యాంకర్లతో సమావేశాలు జరిపి బ్యాంకులను హెచ్చరిస్తూ వచ్చారు. ఒకపక్క ఎన్ని హెచ్చరికలు చేసినా మరోవైపు మొండి బకాయిలు పెరిగిపోతూనే ఉన్నాయి. ఉదాహరణకు నాలుగేళ్ల క్రితం బ్యాంకులిచ్చిన రుణాల్లో మొండి బకాయిల శాతం 2.4 శాతం ఉండగా నేడది 4.5 శాతానికి పెరిగింది. దీనికి ప్రధానంగా నాలుగు కారణాలు కనిపిస్తాయి. బ్యాంకుల అస్తవ్యస్త నిర్వహణ, రాజకీయ ఒత్తిళ్లు, రిజర్వు బ్యాంకు వైఫల్యం, అవినీతి అసలు కారణాలు. దేశంలో మాంద్య పరిస్థితులు నెలకొనటంతో రుణాలు తీసుకున్నవారు తిరిగి చెల్లించలేకపోవడం వల్లనే మొండి బాకీలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్న చిదంబరమే పరోక్షంగా అప్పులు ఎగవేస్తున్నవారికి వత్తాసు పలుకుతున్నారు. ఈ మొండి బకాయిలు రూ. లక్షల కోట్లలో ఉన్నాయి. రుణాలమీద వడ్డీలను తగ్గించాలని గట్టిగా పట్టుబడుతున్న కార్పొరేట్లు వడ్డీల భారాన్ని తట్టుకోలేక తాము రుణాలను చెల్లించలేకపోతున్నామని చెపుతున్నారు. దువ్వూరి సుబ్బారావు రిజర్వు బ్యాంకు గవర్నర్గా ఉన్నప్పుడు వడ్డీ రేట్లు తగ్గించడం కన్నా ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికే అధిక ప్రాధాన్యమిచ్చారు. కాని ఆర్థిక మంత్రి చిదంబరం మాత్రం కార్పొరేట్ రంగానికి దన్నుగా నిలిచారు. వడ్డీ రేట్లు తగ్గించి కార్పొరేట్లకు ఉపశమనం కలిగించాలని బాహాటంగా ఆర్బీఐకి విజ్ఞప్తి చేశారు. అప్పట్లో ఆయన్ని దువ్వూరి ఖాతరు చే యలేదు. వీరిద్దరి మధ్య వివాదం కొన్ని నెలలపాటు కొనసాగింది. ఈ వివాదాన్ని వాటంగా తీసుకున్న కార్పొరేట్లు అసలుకూ, వడ్డీకీ ఎసరు పెట్టడం ప్రారంభించారు. ఇలా మొండి బకాయిలు పెరగడానికి కేంద్రమే కారణమని చెప్పాలి. ప్రపంచ కుబేరుల జాబితాలోకి ఎక్కిన కార్పొరేట్లకూ, సంపన్నులకూ ఈ దేశంలో రూ. రెండు లక్షల కోట్లకుపైగా ఉన్న మొండి బకాయిలను చెల్లించడం ఒక లెక్కా? వీరు ఆఫ్రికాలో భూములు కొనడానికీ, విదేశాల్లో కంపెనీలను కొనేయడానికీ ముందుకు దూసుకుపోతున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో తాము ఎన్నికకావటానికి, తమ విధానాన్ని సమర్థించేవారికి రూ. లక్షల కోట్ల అందించేవారికి బ్యాంకులకు రూ. రెండు లక్షల కోట్లు చెల్లించటం ఒక లెక్కా? ప్రభుత్వ నేతలే తమకు వత్తాసు పలుకుతుంటే వారు బ్యాంకులను ఎందుకు ఖాతరు చేస్తారు? రాజకీయ నాయకులకూ, మంత్రులకూ, ఇటు కేంద్రంలో, అటు బ్యాంకుల్లో ఉన్నతస్థాయిలో ఉన్న అధికారులకు ఉన్న సంబంధాల దృష్ట్యా బ్యాంకుల్లో కూడా అవినీతి చోటుచేసుకుంది. ప్రభుత్వరంగంలో బ్యాంకులు ఉండటం కేంద్రంలో నేతలకు ఎంతో అవసరం. అయి తే ఇక్కడ మరో వాదన ఉంది. విదేశీ బ్యాంకులు మన దేశంలో అనుబంధ బ్యాంకులను తెరవడానికీ, దేశంలో ప్రైవేటురంగంలో కొత్త బ్యాంకింగ్ లెసైన్సులు ఇవ్వడానికీ ప్రభుత్వరంగ బ్యాంకులు అవరోధాలు కల్పించాయి. ప్రభుత్వరంగంలోనే బ్యాంకింగ్ వ్యవస్థ కొనసాగాలని ఉద్యోగులు కూడా గట్టిగా పోరాడుతున్నారు. మొండిబకాయిలను ఇలాగే పెరగనిచ్చి ప్రభుత్వరంగ బ్యాంకులకు అసమర్థత అంటగట్టి ప్రైవేటీకరణ కూ, విదేశీ బ్యాంకుల ప్రవేశానికీ రాచబాట వేస్తున్నారా? పెరుగుతున్న మొండి బకాయిలను మరిం తగా పెరగనివ్వటంలో ఇలాంటి కుట్ర ఏమైనా ఉందా? నయా ఉదారవాదవిధానాన్ని తమ ప్రభుత్వవిధానంగా చేపట్టడంలో ఇలాంటి మతలబులు అతిసామాన్యం. బ్యాంకింగ్ వ్యవస్థపై రిజర్వు బ్యాంకుకు సంపూర్ణ నియంత్రణాధికారం ఉంటుంది. ప్రతి బ్యాంకు నిర్వహణకు ఒక బోర్డు, దానిలో ఆర్బీఐ అధికారి సభ్యుడిగా ఉంటారు. బ్యాంకింగ్ వ్యవస్థ దారితప్పుతుంటే ఆర్బీఐ ప్రతినిధులు నిద్రపోతున్నారా లేక వారు కూడా బ్యాంకుల యాజమాన్యాలతో కుమ్మక్కవుతున్నారా? మొండి బకాయిలు కొండలా పెరిగిపోతుంటే ఆర్బీఐ ఏం చేస్తోంది? మీ ఇంట్లో చోరీ చేయబోయిన వ్యక్తి పట్టుబడితే ఓ స్తంభానికి కట్టేసి చిత గ్గొడతారు. తర్వాతే పోలీసులకు అప్పగిస్తారు కదా. ఇదే బ్యాంకింగ్ రంగానికి వర్తింప చేయండి. కంపెనీలు బ్యాంకుల నుండి కోట్లాది రూపాయలు రుణాలు తీసుకుని మాంద్య పరిస్థితులను బూచిగా చూపించి తిరిగి చెల్లించకుండా తాత్సారం చేస్తున్నాయి. కాని ఆ కంపెనీల లాభాలు మాత్రం తగ్గటం లేదు. రుణం చెల్లించనివారెవరో తెలుసు. ఎంత చెల్లించాలో కూడా తెలుసు. అయినా గప్చుప్ సాంబారుబుడ్డి అన్నట్లు ఆ రుణాల మొత్తం పెరిగిపోతోం ది. అలా ఎగ్గొట్టినవాళ్లు భుజాలెగరేసుకుని తిరుగుతున్నారు. వారి ఆస్తులను వేలం వేసి రుణం చెల్లింపులో జమ చేయవచ్చుకదా? పైన చెప్పిన ఉదాహరణలో దొంగను పోలీసుకు అప్పచెప్పినట్లు ప్రభుత్వంగాని, బ్యాంకు యాజమాన్యాలుగాని ఎందుకు చర్య తీసుకోవు? ఒక బడుగు రైతు అప్పు తీసుకుని తిరిగి చెల్లించకపోతే, అతని ఇంట్లో వస్తువులను బయటకు విసిరేసి, ఇంటికి తాళం వేస్తారే! అదే పని కార్పొరేట్ల విషయంలో ఎందుకు చెయ్య రు? పాలకులకూ, కార్పొరేట్లకూ మధ్య ఉన్న బీరకాయ పీచు చుట్టరికం అలాంటిది. రుణం తీర్చలేక పరువు పోతుందని లక్షలాదిమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కార్పొరేట్లకు ఆపాటి పరువుమర్యాదలుండవా? రుణ గ్రహీతలు సకాలంలో చెల్లించకపోతే ఏం చేయాలో ఆర్బీఐ కొన్ని మార్గదర్శకాలు రూపొందించింది. కొన్ని వ్యవస్థలను ఏర్పాటు చేసింది. వడ్డీ చెల్లించనక్కర్లేదు, అసలైనా చెల్లించవచ్చని రుణగ్రహీతలకు వెసులుబాటు కల్పించింది. సకాలంలో చెల్లించని వారి రుణాల పునర్వ్యవస్థీకరణకు బ్యాంకు బోర్డులకు అధికారమిచ్చింది. ఒక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొండి బకాయిలే రూ. 67,799 కోట్లుగా ఉన్నాయని అంచనా. దేశంలో మొత్తం బ్యాంకుల మొండి బాకీలు రూ.రెండు లక్షల కోట్లు. ఇలాంటి రుణాలను కొన్ని సంస్థలు రిస్కుతో తక్కువ రేటుకు కొనుగోలు చేసి తర్వాత తమదైన పద్ధతిలో వాటిని వసూలు చేసుకుంటాయి. భవిష్యత్తులో బ్యాంకులు కూడా తమ రుణాలను ఈ దారిలో అమ్మకానికి పెట్టుకుని తమ భారాన్ని వదిలించుకుంటాయి. దీనర్ధం ఏమంటే... కార్పొరేట్లపై ఎలాంటి భారం పడదు. వారు క్షేమంగానే ఉంటారు. పోయేది ప్రజల డబ్బే. పెద్ద చేప చిన్న చేపను మింగేసినట్లు బడా పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్లు క్షేమంగానే ఉంటారని ఈ విశ్లేషణ తెలియజేస్తుంది. అసలు కేంద్రమే పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయింది. ప్రపంచబ్యాంకు బిలియన్ డాలర్లమేర రుణాలిస్తూనే ఉంది. వాటిపై ఏటా కేంద్రం కోట్లాది రూపాయలు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఆ బ్యాంకు అసలు మొత్తం వసూలు గురించి పట్టించుకోదు. ఎందుచేతనంటే అసలు చెల్లింపు పట్టించుకోనంతకాలం కేంద్రప్రభుత్వం జుట్టు ఆ బ్యాంకు చేతుల్లో ఉంటుంది మరి. ప్రభుత్వరంగ బ్యాంకులో తమ సొమ్ముకు భద్రత ఉంటుందన్న నమ్మకంతో దేశంలోని ప్రజలు తమ డిపాజిట్ల ద్వారా లక్షల కోట్ల రూపాయలను దాచుకుంటున్నారు. కార్పొరేట్లకూ, కుబేరులకూ బ్యాంకులు ఇచ్చే రుణాలు ఈ మొత్తం నుంచే. వారు రుణం చెల్లించకపోతే ప్రమాదంలో పడేది ప్రజల డబ్బే. ప్రజల డబ్బు సురక్షితంగా ఉండాలన్న లక్ష్యం కోసమే బ్యాంకు అధికారులూ, ఉద్యోగులూ సమ్మెలు చేస్తుంటారు. ఈ రుణాల వసూలు విషయంలో ప్రస్తుత సర్కారు మెతకవైఖరి అవలంబిస్తోంది. ఈ మొండి బకాయిలు చెల్లించనివారే మోడీ పల్లకీ మోస్తున్నారు. ఆ మోడీతో ఈ ఎన్నికల్లో చేతులు కలుపుతున్నది చంద్రబాబు, లోక్సత్తా, కుర్ర‘నాయకుడు’ పవన్. వీరిని మళ్లీ గద్దెనెక్కించి మరో ఐదేళ్లు కుంపటినెత్తిన పెట్టుకుంటారో... లేదో... మీ ఇష్టం. - (వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్) వి.హనుమంతరావు -
మొండి బకాయిల బండ రూ. 2.22 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ వ్యవస్థలో మొండి బకాయిలు (ఎన్పీఏ) పేరుకుపోతున్నాయని ప్రభుత్వం పార్ల్లమెంటులో అంగీకరించింది. రాజ్యసభలో ఆర్థిక మంత్రి పి.చిదంబరం ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. వివరాలు సంక్షిప్తంగా... 40 లిస్టెడ్ బ్యాంకుల స్థూల మొండి బకాయిలు 2013 సెప్టెంబర్ నాటికి 2.22 లక్షల కోట్లకు చేరాయి. 2012 సెప్టెంబర్లో ఇవి రూ.1.62 లక్షల కోట్లు. అంటే ఏడాది వ్యవధిలో 36.9 శాతం పెరిగిపోయాయి. ఇదే కాలంలో యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థూల ఎన్పీఏలు 160 శాతం ఎగసి రూ.2,418 కోట్ల నుంచి రూ.6,286 కోట్లకు చేరాయి. ఇండియన్ బ్యాంక్ పరిమాణం ఈ విషయంలో 110 శాతం పెరిగి రూ.1,789 కోట్ల నుంచి రూ.3,765 కోట్లకు చేరింది. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ స్థూల ఎన్పీఏలు 109 శాతం పెరిగి రూ.1,071 కోట్ల నుంచి రూ.2,240 కోట్లకు ఎగశాయి. మూలధనానికి ఇబ్బంది ఉండదు... కాగా ఆర్థికశాఖ సహాయమంత్రి నమో నారాయణ్ మీనా మరో ప్రత్యేక సమాధానం ఇస్తూ, ప్రభుత్వ రంగ బ్యాంకులకు అవసరమైన మూలధనాన్ని సమకూర్చడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నట్లు తెలిపారు. ప్రత్యేకించి ఉత్పాదక రంగాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ రుణ లభ్యత కొరతను ప్రభుత్వం రానీయబోదని పేర్కొంది. 2004-05 నుంచి 2013-14 మధ్య కాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు సమకూర్చిన మొత్తం మూలధనం విలువ రూ. 62,234 కోట్లని తెలిపారు. ఈ నిధుల వెచ్చింపు వల్ల బ్యాంకుల్లో ప్రభుత్వ వాటా కూడా పెరుగుతోందని పేర్కొన్నారు. మూలధనం చెల్లింపులను పెంచడం వల్ల బ్యాంకుల రుణ సామర్థ్యం పెరగడమే కాకుండా, బ్యాంకులు పొందిన లాభాలపై డివిడెండ్, డివిడెండ్ పంపిణీ పన్ను, కార్పొరేట్ ట్యాక్స్ రూపాల్లో ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుందని మంత్రి తెలిపారు. -
అర్థక్రాంతి భాజపా భ్రాంతేనా!
బ్యాంకింగ్ వ్యవస్థ పరిపూర్ణంగా పల్లె పల్లెకు, మనిషి మనిషికి విస్తరించని భారతావనిలో బ్యాంకింగ్ లావాదేవీల మీద పన్ను విధింపు, అమలు ఎంత సొగసుగా ఉండగలదో ఊహించవచ్చు. గూడ్స్, సర్వీసెస్ పన్నును తిరస్కరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు పన్ను విధించే తమ అధికారాలను కేంద్రానికి ధారాదత్తం చేస్తాయా? ప్రభుత్వం విధించే విభిన్న పన్నుల మిశ్రమం గురించీ, వాటి సాపేక్ష ప్రాధాన్యం గురించీ తెలియచేసేదే పన్నుల వ్యవస్థ. కాలక్ర మంలో ఈ వ్యవస్థకి సహజమైన, మానవ ప్రేరితమైన మార్పులు రెండూ అనివార్యమే. పుష్పం నుంచి తేనెటీగ మకరందాన్ని సేకరిం చుకున్నంత సున్నితంగా ప్రభుత్వాలు పన్నులు వసూలు చేయా లన్నది దేశంలో పురాతన కాలం నుంచీ వస్తున్న సూత్రం. సమాజ శ్రేయస్సు, ప్రభుత్వ ఆయుష్షు ఈ వ్యవస్థ మీదే ఆధారపడి ఉన్నాయి. అందుకే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే, పన్నుల వ్యవస్థలో భారీ మార్పులు జరుగుతాయని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ అప్పుడే సూచించారు. 2025 విజన్ డాక్యుమెంట్లో మరిన్ని వివరాలు పొందుపరచాలనేది బీజేపీ ఆలోచన. పెట్రో విధానం ద్వారా, బ్యాంకు లావాదేవీల ద్వారా రూ. 40 వేల కోట్లు సేకరించాలని ఆ పార్టీ ఉద్దేశం. బీజేపీ విజన్ ప్రకారం సూత్రబద్ధమైన మూలధన నిర్మాణం ఉండాలి. సమర్థ పాలనకు అవసరమైన రెవెన్యూ రాబడి కూడా అందులో ఉంది. ఈ అంశాలు ఉన్న అర్థక్రాంతి ఆశయం 2005లోనే వెలుగు చూసింది. ప్రజలకు భారంగా మారిపోయిన ఈ పన్నుల విధానంలో సంస్కరణలు ఉద్దేశం కావచ్చు. ఈ ఆలోచన స్వాగతించదగినదే అయినా, దాని మార్గం గురించి చర్చించక తప్పదు. పన్నుల సేకరణ ఎలా? పన్నుల వ్యవస్థ-వ్యయ విధానాలు - కోశ విధాన సాఫల్యానికి పన్నుల విధింపు ప్రధాన సాధనం. ఇతర సాధనాలు ప్రభుత్వ పరంగా, వ్యయం చేయడం, అప్పులు తీసుకోవడం, తిరిగి చెల్లించడం, వస్తు సేవల అమ్మకాలు, కొనుగోళ్లు ఈ నేపథ్యంలో భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం, చిన్న, పెద్ద రాష్ట్రాలు పన్నుల ద్వారా ఎంత మొత్తం సేకరిస్తున్నాయో గమనిద్దాం. 2010-11 సం.లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రూ. కోట్లలో పన్నుల ద్వారా సేకరించిన రాబడి : 12,71,666 2011-12 సంవత్సరానికి సవరించిన అంచనా : 14,75,032 2012-13 బడ్జెట్ అంచనా : 17,51,123 ఇందులో 2012-13 బడ్జెట్ ప్రకారం ప్రత్యక్ష పన్నుల రాబడి : 5,78,364 పరోక్ష పన్నుల రాబడి : 11,72,759 మొత్తం 17,51,123 2012-13లో బడ్జెట్ అంచనాల ప్రకారం. కేంద్రం పన్నుల రాబడి నికరంగా (44 శాతం) : 7,71,071 రాష్ట్రాల మొత్తం పన్నుల రాబడి (56 శాతం) : 9,80,052 మొత్తం : 17,51,123 రాష్ట్రాలు సొంతంగా విధించే పన్నులు : 6,73,511 (69 శాతం) కేంద్రం పన్నుల రాబడి మొత్తం : 3,06,541 (31 శాతం) రాష్ట్రాల మొత్తం పన్ను రాబడి : 9,80,052 రాష్ట్రాలు తమ స్థూల రాష్ట్రీయోత్పత్తిలో పన్నుల ద్వారా 2010-11 సంవత్స రంలో సుమారు 9.00 శాతం సేకరించగా కేంద్ర ప్రభుత్వం దేశీయ స్థూల ఉత్ప త్తిలో సేకరించిన పన్నుల శాతం 7.31. అంటే మొత్తం (దేశీయ స్థూల ఉత్పత్తి జీడీపీ) 16.31 శాతం. (జీడీపీ 2012-13లో సుమారు 1,02,59,894 కోట్లు). 2011-12 సవరించిన అంచనాల ప్రకారం : 16.44 2012-13 బడ్జెట్ అంచనాల ప్రకారం : 17.24 2011లో భారతదేశ జనాభా 121 కోట్లు : (121,01,93,422) 2013లో భారతదేశ జనాభా 122 కోట్లు : (122,04,00,000) 2014లో భారతదేశ జనాభా 126 కోట్లు : (126,34,37,611) 2012-13లో పన్నుల రాబడి అంచనా రూ.17,51,123 కోట్లు. జనాభా 126.34 కోట్లు అని భావిస్తే, ఒక సగటు పౌరుడు ఒక సంవత్సరంలో చెల్లించే పన్ను మొత్తం సుమారు రూ. 38. పన్నుల వ్యవస్థకు ఇంత ప్రాముఖ్యం ఉంది. అర్థక్రాంతి ప్రతిపాదనలు అర్థక్రాంతి ప్రతిపాదనలను వివరంగా పరిశీలించేముందు ప్రస్తుత పన్నుల వ్యవస్థలోని విభిన్న పన్నుల సాపేక్ష ప్రాముఖ్యాన్ని పరిశీలిద్దాం. 2013-14 బడ్జెట్ అంచనాల ప్రకారం యూనియన్ ప్రభుత్వానికి అందవలసిన రాబడి / వసూళ్ల అంచనా, రూ. 16 లక్షల 65 వేల కోట్లు కాగా, పన్నుల ద్వారా, నికరంగా లభించేది 8 లక్షల 84 వేలు. అంటే సుమారు 53 శాతం. అప్పుల ద్వారా సేకరించేది 5 లక్షల 42 వేలు. 33 శాతం పన్నేతర రాబడి / ఆదాయం (నాన్ ట్యాక్స్ ఆదాయం) 1 లక్షా, 72 వేలు (10 శాతం). పన్నుల రాబడిలో ప్రము ఖమైనవి. కార్పొరేషన్ పన్ను, ఆదాయపు పన్ను, కస్టమ్స్ పన్ను, ఎగుమతి, దిగుమతి సుంకాలు. యూనియన్ ఎక్సైజ్ సుంకాలు, సేవా పన్ను. భారత దేశంలో, ఆదాయంపై పన్ను చెల్లించే వారి శాతం (మొత్తం జనాభాలో) 3 మాత్రమే. అంటే పన్నుల రాబడి అధిక భాగం సామాన్య ప్రజానీకం నుంచి పరోక్ష పన్నులైన ఎక్సైజ్, అమ్మకం, వ్యాట్ల ద్వారా చేకూరుతున్నది. అర్థక్రాంతి ప్రతిపాదనలలో పంచసూత్రాలు ఉన్నాయి. 1. ప్రస్తుత పన్నుల వ్యవస్థలోని కస్టమ్స్ (ఎగుమతి, దిగుమతి సుంకాలు) తప్ప అన్ని పన్నులు తొల గించాలి. 2. బ్యాంకుల లావాదేవీలపై ఒక నిర్దిష్ట శాతంలో, ఒకే స్థాయిలో సింగిల్ పాయింట్ పన్ను విధించాలి. బ్యాంకుల ద్వారా జరిగే ప్రతి లావాదేవీపై ఈ పన్ను శాతం 2 అనుకుందాం. రూ.2,000 మించిన నగదు లావాదేవీలను ప్రభు త్వం నిషేధిస్తుంది. ఈ 2 శాతం పన్నును కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు 0.7, 0.6 0.35 నిష్పత్తిలో పంచుకుంటాయి. ప్రత్యక్ష పరోక్ష పన్నులుండవు. 3. నగదు లావాదేవీలపై పన్నులు ఉండవు. 4. అంటే రూ.2 వేలకు మించిన నగదు లావా దేవీలకు ప్రభుత్వ రక్షణ ఉండదు. 5. ముఖ విలువ రూ.50లకు మించిన కరెన్సీ నోట్లను ఉపసంహరిస్తారు. అవి చలామణిలో ఉండవు. అసమానతలతో కూడిన పన్నుల వ్యవస్థ స్థానంలో న్యాయమైన పన్నుల వ్యవస్థ మరో లక్ష్యం. నల్లధనం మాటేమిటి? మరి నల్లధనం సంగతేమిటన్న ప్రశ్న సహజం. 1983-84 ఎన్ఐపీఎఫ్పీ అంచ నాల ప్రకారం నల్ల ఆదాయపు ఆవిర్భావం జీడీపీలో కనీసం 18 శాతమని, నల్ల ధనం అంచనాలపై భారత ప్రభుత్వం 2011లో నియమించిన 3 సంస్థల నుంచి ఎన్ఐపీఎఫ్పీ, ఎన్జీఏఈఆర్, ఎన్ఐఎఫ్ఎంల వివరాలు 2013 డిసెంబర్ చివ రన లభిస్తాయని ఆశించారు. అయితే లభ్యమైన కొన్ని అంచనాల ప్రకారం నల్ల ధనం జీడీపీలో 3వ వంతు 33 శాతం. అంటే సుమారు రూ. 30 లక్షల కోట్లు. దీనిపై 33 శాతం విధించినా రూ.10 లక్షల కోట్లు ప్రభుత్వానికి లభించాలి. మరి కొన్ని అంచనాల ప్రకారం ఇది రూ.45 లక్షల కోట్లు. యూనియన్ ప్రభుత్వ వార్షిక బడ్జెట్కు 3 రెట్లు. యూనియన్ ప్రభుత్వం 2012లో నల్లధనంపై విడుదల చేసిన శ్వేత పత్రం ప్రకారం నల్లధన నియంత్రణకు నాలుగు స్తంభాల వ్యూహం ఉంది. అర్థక్రాంతి పరిష్కారమా? ఈ నేపథ్యంలో అర్థక్రాంతి ప్రతిపాదనలు ఎంత వరకు పన్నుల వ్యవస్థను మెరు గుపరచగలవనే విషయాన్ని పరిశీలించాలి. అభిలషణీయమైన పన్నుల వ్యవస్థలో విధించే పన్నుల సంఖ్య కూడా మరీ తక్కువ లేదా హెచ్చుగా ఉండరాదు. ఒకే పన్ను విధిస్తే పన్ను చెల్లింపు నుంచి తప్పించుకోవడానికి లేదా ఎగవేతకు మరింత అవకాశం ఉంటుంది. పన్నుల పరిధిని పెంచే ఉద్దేశంతో 1950 దశకంలో నికోలస్ కాల్డర్ ఆదాయంపై పన్నును వ్యతిరేకిస్తూ వ్యయంపై పన్నుతో పాటుగా సంపద పైన, బహుమానాలపైనా, ఆస్తులపైనా పన్నును సూచించారు. కానీ ఈ ప్రత్యా మ్నాయాలేవీ ఆదరణ పొందలేకపోయాయి. 14 ఏళ్లుగా అర్థక్రాంతి ప్రతిపాద నలు ఉన్నప్పటికీ, భారతదేశంలో కూడా దీనిని పెద్దగా పట్టించుకున్న దాఖలా కనిపించదు. ఆర్థిక మంత్రి చిదంబరం కూడా 2005లో బ్యాంకింగ్ లావాదేవీల పన్ను విధించి 2008-09 బడ్జెట్లో ఉపసంహరించుకున్నారు. అర్థక్రాంతి విషయంలో ఏకాభిప్రాయ సాధన అవసరమని బీజేపీ కూడా భావిస్తున్నట్లుంది. బ్యాంకింగ్ వ్యవస్థ పరిపూర్ణంగా పల్లె పల్లెకు, మనిషి మనిషికి విస్తరించని భారతావనిలో బ్యాంకింగ్ లావాదేవీల మీద పన్ను విధింపు, అమలు ఎంత సొగసుగా ఉండగలదో ఊహించవచ్చు. గూడ్స్, సర్వీసెస్ పన్నును తిరస్క రిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు తమ పన్ను విధించే అధికారాలను కేంద్రానికి ధారా దత్తం చేస్తాయా? నేటి ఫెడరల్ వ్యవస్థలో ఇది సాధ్యమా? ఆచరణలో సాధ్యం కాని సంస్కరణలు ప్రతిపాదనలు హర్షణీయమా? - ప్రొఫెసర్ ఎం.ఎల్. కాంతారావు -
సహకార స్ఫూర్తికి విఘాతం
నర్సీపట్నం, న్యూస్లైన్ : సహకార స్ఫూర్తికి విఘాతం ఏర్పడింది. బక్షీ కమిటీ సిఫారసు మేరకు మూడంచెల వ్యవస్థలోని సొసైటీలపై ప్రభుత్వం వేటు వేసింది. కొత్త బ్యాం కింగ్ విధానాలు అమలు కాలేదంటూ.. వాటి యావదాస్తులను డీసీసీబీలో విలీనానికి నిర్ణయం తీసుకుంది. ఇది చిన్న, సన్నకారు రైతులకు గొడ్డలిపెట్టని చెప్పక తప్పదు. వారంతా రుణ పరపతి కోల్పోవడమే కాకుండా, సంఘాల్లోని ఉద్యోగులు రోడ్డున పడునున్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు(పీఏసీఎస్)లు ఇంతకాలం రైతుల పాలిట కల్పతరువులా ఉండేవి. చిన్న, సన్నకారు రైతులకు సకాలంలో రుణాలిచ్చి ఆదుకునేవి. అలాంటి వాటికి మంగళం పాడేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పన్నాయి. మూడంచెల విధానం, స్వల్పకాలిక సహకార పరపతి వ్యవస్థ పనితీరుపై నాబార్డు చైర్మన్ ప్రకాష్ బక్షి అధ్యక్షతన రిజర్వ్ బ్యాంకు ఒక కమిటీని నియమించింది. దాని సూచనల ఆధారంగా వీటిని రద్దుచేసేందుకు నిర్ణయం తీసుకున్నాయి. ప్రస్తుతం జిల్లాలో 98 పీఏసీఎస్లు ఉన్నాయి. వీటిలో సుమారు 3లక్షల మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. వారికి ప్రస్తుతం సుమారు రూ. 250కోట్ల మేరు రుణాలివ్వగా, మరో రూ. 60కోట్లు వరకు డిపాజిట్లు చేశారు. డీసీసీబీలో విలీనం మూడంచెల విధానం, సహకార పరపతి వ్యవస్థ పనితీరు సంతృప్తికరంగా లేదని, వీటిలో నూతన బ్యాంకింగ్ విధానాలు అమలు కావడం లేదంటూ కమిటీ వెల్లడించింది. అదే విధంగా వీటిలో కోర్ బ్యాంకింగ్ పద్ధతి పూర్తిస్థాయిలో నిర్వహించడం లేదని తేల్చిచెప్పింది. దీంతో పీఏసీఎస్లన్నింటినీ జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల్లో విలీనానికి రెండు ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఈమేరకు వాటికి సంబంధించిన ఆస్తులు, అప్పులు, డిపాజిట్లు సైతం డీసీసీబీలకు సంక్రమిస్తాయి. రైతుల రుణాలకు ఇబ్బంది వాస్తవంగా చిన్న, సన్నకారు రైతులకు రుణాలిచ్చేవి కేవలం పీఏసీఎస్లే. ఏటా రైతులకు స్వల్ప, దీర్ఘకాలిక రుణాలను ఇచ్చి కొంతమేర ఆదుకుంటూ వస్తున్నాయి. వీటిని డీసీసీబీలో విలీనం చేస్తే, ఆ ప్రభావం రైతుల రుణాలపై పడుతుంది. అన్నదాతలకు రుణాలివ్వడంలో జాతీయ బ్యాంకుల శల్యసారథ్యం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం జిల్లాలోని సొసైటీల్లో సుమారు 300 మంది పనిచేస్తున్నారు. సొసైటీల ఆస్తులను విలీనంతో వారికి ఎటువంటి పని ఉండదు. వారిని డీసీసీబీకి బిజినెస్ కరస్పాండెంట్లుగా ఉండాలంటూ నిబంధనల్లో పేర్కొంది. అలా అయితే ఉద్యోగులందరికీ పని ఉండదు. ఈ పరిస్థితుల్లో ఆయా కుటుంబాలన్నీ రోడ్డున పడే ప్రమాదముంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు వారంతా ఆందోళన బాట పట్టారు. అలాగే ఇటీవల ఎన్నికయిన పీఏసీఎస్ల అధ్యక్షులు సైతం ఉత్సవ విగ్రహాలుగానే మిగిలిపోతారు. -
రుపీ షాక్.. మార్కెట్ క్రాష్
గరిష్టం నుంచి సెన్సెక్స్ 760 పాయింట్లు పతనం నిఫ్టీ నష్టం 245 పాయింట్లు ఎగిసిపడిన బ్యాంకింగ్ షేర్లు ఎఫ్ఐఐల అమ్మకాలు రూ.792 కోట్లు విధానకర్తలు, ఇన్వెస్టర్లు, కార్పొరేట్లు.. ఇలా అందరినీ ఆందోళనలో ముంచెత్తుతూ ఇటు స్టాక్మార్కెట్లు, అటు రూపాయి అడ్డూ, అదుపూ లేకుండా అదే పనిగా క్షీణిస్తున్నాయి. పతనానికి వెన్స్డే వర్రీ లాంటి కొంగొత్త విశేషణాలను జోడించుకుంటూ పడిపోతున్నాయి. బుధవారం మార్కెట్లు సానుకూలంగానే ప్రారంభమైనప్పటికీ విదేశీ ఇన్వెస్టర్లు యథాప్రకారం అమ్మకాలకు దిగడంతో ప్రధాన సూచీ సెన్సెక్స్ గరిష్ట స్థాయి నుంచి ఏకంగా 760 పాయింట్ల మేర పతనమైంది. ఇన్వెస్టర్ల సంపద మరో రూ. 1 లక్ష కోట్లు హరించుకుపోయింది. ఇక, డాలర్తో పోలిస్తే ఇంకో కొత్త కనిష్టం 64.54 స్థాయినీ తాకిన రూపాయి.. బ్రిటిష్ పౌండ్తో పోలిస్తే సెంచరీ దాటేసింది. బ్లాక్ ఫ్రైడే..పానిక్ మండే...ఆ రెండురోజుల్లో నిలువునా పతనమైన మార్కెట్ తీరును ఇన్వెస్టర్లు మర్చిపోకముందే...వెన్స్డే వర్రీని పెంచేసింది. మూడు రోజుల క్షీణత తర్వాత బుధవారం ట్రేడింగ్ తొలిదశలో 321 పాయింట్లు ర్యాలీ జరిపిన బీఎస్ఈ సెన్సెక్స్ మధ్యాహ్న సెషన్ నుంచి నాటకీయంగా పతనబాటపట్టి మరో 340 పాయింట్లు పతనమయ్యింది. బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీని పెంచడానికి క్రితం రోజు రిజర్వుబ్యాంక్ బాండ్ల కొనుగోలును ప్రకటించడంతో తొలుత 18,567 పాయింట్లకు ర్యాలీ జరిపింది. అటుతర్వాత విదేశీ ఇన్వెస్టర్లు ఎడతెరిపిలేకుండా అమ్మకాలు జరపడంతో 17,807 పాయింట్ల కనిష్టస్థాయికి పడిపోయింది. చివరకు 340 పాయింట్ల నష్టంతో 11 నెలల కనిష్టస్థాయి 17.906 పాయింట్ల వద్ద ముగిసింది. రోజులో గరిష్టస్థాయి నుంచి 760 పాయింట్లు సూచీ పతనమయ్యింది. గతేడాది ఆగస్టు 21న 17,885 పాయింట్ల వద్ద ముగిసిన సెన్సెక్స్, ఈ ఏడాది ఇదేరోజున అదేస్థాయి వద్ద క్లోజ్కావడం కాకతాళీయంగా జరిగింది. ఇదేబాటలో ఎన్ఎస్ఈ నిఫ్టీ 5,504 పాయింట్ల గరిష్టం నుంచి 5,260 పాయింట్ల కనిష్టస్థాయికి పడిపోయింది. చివరకు 99 పాయింట్ల నష్టంతో ఏడాది కనిష్టస్థాయి 5,302 పాయింట్ల వద్ద ముగిసింది. బుధవారం సైతం రూ. లక్ష కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. రూపాయిని బలోపేతం చేసే ఉద్దేశ్యంతో రిజర్వుబ్యాంక్, కేంద్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా, కరెన్సీ విలువ నానాటికీ కొత్త కనిష్టస్థాయికి పతనంకావడంతో ఆందోళన చెందుతున్న ఇన్వెస్టర్లు అమ్మకాలకు పాల్పడుతున్నారని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. ముఖ్యంగా అధిక నష్టాల్ని చవిచూస్తున్న విదేశీ ఇన్వెస్టర్లు మార్కెట్లో షేర్లను కుమ్మరిస్తున్నారని ఆ వర్గాలు వివరించాయి. బుధవారం విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ. 792 కోట్ల విలువైన నికర విక్రయాలు జరపగా, దేశీయ సంస్థలు రూ. 775 కోట్ల షేర్లను నికరంగా కొనుగోలుచేశాయి. ఆర్థిక ఉద్దీపనలో భాగంగా బాండ్ల కొనుగోళ్ల ద్వారా బ్యాంకింగ్ వ్యవస్థలోకి ప్రతీ నెలా అమెరికా కేంద్ర బ్యాంక్ విడుదల చేస్తున్న భారీ నిధుల మొత్తాన్ని వచ్చే నెల నుంచి క్రమేపీ తగ్గిస్తుందన్న భయాలు కూడా విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలకు కారణమని, దేశీయ స్టాక్ మార్కెట్ నుంచి వీరి నిధుల ఉపసంహరణ ఫలితంగా రూపాయి మరింత పడిపోతున్నదని విశ్లేషకులు చెప్పారు. రిలయన్స్, ఐటీసీ కలిసి... 3-4% క్షీణించిన రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీలు కలిసి సెన్సెక్స్లో 176 పాయింట్లను నష్టపర్చాయి. అన్నింటికంటే అధికంగా ర్యాన్బాక్సీ 10% పతనంకాగా, మరో ఫార్మా షేరు సన్ఫార్మా 4% తగ్గింది. సిమెంటు షేర్లు ఏసీసీ, గుజరాత్ అంబూజా 5% చొప్పున పతనమయ్యాయి. సేసా గోవా 9%, భారతీ 5% తగ్గాయి. బ్యాంకింగ్ షేర్లు స్వల్పలాభాలతో ముగిసినా, రోజులో గరిష్టస్థాయి నుంచి 5% పైగా పడిపోయాయి. యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్ తదితర పీఎస్యూ బ్యాంకు షేర్లయితే గరిష్టం నుంచి 15 శాతంపైగా పతనమయ్యాయి. 193 షేర్లు 52 వారాల కనిష్టస్థాయికి పడిపోయాయి. 100 బిలియన్ డాలర్లు...4.35 లక్షల కోట్లు ఇన్వెస్టర్ల సంపద ఈ నాలుగు రోజుల్లో 100 బిలియన్ డాలర్లకుపైగా ఆవిరైపోయింది. రూపాయిల్లో ఈ విలువ రూ. 4.35 లక్షల కోట్లు. గత 4 ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 1,400 పాయింట్లు పతనంకాగా, 1,025 బిలియన్ డాలర్ల నుంచి 900 బిలియన్ డాలర్లకు లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ హరించుకుపోయింది. రూపాయిల్లో మార్కెట్ ప్రస్తుత విలువ రూ. 58,60,000 కోట్లు. రూపాయి క్షీణించిన కారణంగా విదేశీ ఇన్వెసర్లకు నష్టం ఎక్కువగా వచ్చింది. శుక్రవారం నుంచి ఇప్పటివరకూ భారత్ స్టాక్ మార్కెట్ 7.56 శాతం నష్టపోగా, రూపాయి మారకపు విలువ 61.80 నుంచి 64.11 స్థాయికి పతనంకావడంతో విదేశీ ఇన్వెస్టర్లకు నష్టం 11 శాతంపైగా వుంది. ఇది ఎలాగంటే...ఉదాహరణకు ఐసీఐసీఐ బ్యాంక్ 100 షేర్లను గత గురువారం రూపాయి విలువ 61.80 వున్నపుడు రూ. 900 ధరతో కొంటే 1456 డాలర్లు (90,000) అవసరమవుతుంది. ఈ బుధవారం ఆ షేరును రూ. 830 వద్ద విక్రయిస్తే 1,294 డాలర్లు మాత్రమే (రూపాయి విలువ 64.11 ప్రకారం) వస్తాయి. అంటే ఆ షేరులో 162 డాలర్లు (11.12%) నష్టపోవాల్సివస్తుంది.