BARS
-
రాజధానిలో పెరిగిపోయిన బౌన్సర్ల సంస్కృతి
ప్రజల పట్ల దురుసుగా ప్రవర్తిస్తే భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) 115 (2), లాఠీలు, కర్రలు వినియోగించి దాడి చేస్తే 118 సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామంటున్నారు. సాక్షి, హైదరాబాద్: పహాడీషరీఫ్ పోలీసుస్టేషన్ పరిధిలో ఉన్న జల్పల్లిలోని ‘మంచు టౌన్’ కేంద్రంగా ఇటీవల జరిగిన భారీ హంగామాకు ఓ రకంగా బౌన్సర్లే కారణమయ్యారు. కేవలం ఈ ఒక్క ఉదంతంలోనే కాదు... దాదాపు ప్రతి చోటా ‘పెద్దల’ వెనక బౌన్సర్లు కామన్ అయ్యారు. ఇటీవల కాలంలో కొందరు లేడీ బౌన్సర్లు కూడా తెరపైకి వస్తున్నారు. తమ వారి రక్షణ పేరుతో వీళ్లు చేసే హడావుడి, దౌర్జన్యాలు వీధి రౌడీలకు తీసిపోకుండా ఉంటున్నాయి. అత్యధిక బౌన్సర్లు జిమ్ల ద్వారా రిక్రూట్ అవుతుండటంతో 2005 నాటి ది ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీస్ (రెగ్యులరేషన్) యాక్ట్లోని (పస్రా) నిబంధనలు వీరికి పట్టట్లేదు. తమకు అనుకూలంగా మార్చుకుని.. ప్రీ రిలీజ్ ఫంక్షన్లు, ప్రీమియర్ షోలు, ప్రారం¿ోత్సవాలతో సహా సినీ తారలతో ముడిపడి ఉన్న కార్యక్రమాలు, సభలు, సమావేశాలతో పాటు భారీ సంస్థల ఈవెంట్లకు నిర్వాహకులు పోలీసుల నుంచి అనుమతి తీసుకుంటూ ఉంటారు. ఎలాంటి టికెట్లు లేకుండా చేసే కార్యక్రమాలను పోలీసు విభాగమే భద్రత ఏర్పాటు చేస్తుంది. టికెట్లు విక్రయించే కార్యక్రమాలతో పాటు మరికొన్నింటికి నిరీ్ణత మొత్తం వసూలు చేస్తుంది. దీనికి తోడు పోలీసు విభాగంలో ఉన్న సిబ్బంది కొరత నేపథ్యంలో ఆయా సందర్భాల్లో అధికారులు అవసమైన స్థాయిలో ప్రైవేట్ సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవాలంటూ షరతు విధిస్తుంది. ఈ మాటను అడ్డం పెట్టుకుని బౌన్సర్లు, సెక్యూరిటీ గార్డులు, వ్యక్తిగత అంగరక్షకుల పేరుతో వీళ్లు చేసే జులుం అంతా ఇంతా కాదు. భద్రత పేరుతో ఈ గార్డులు బలప్రయోగం చేస్తుంటారు. చట్టప్రకారం ఇది నేరమే అంటున్న పోలీసులు బాధితులు ఫిర్యాదు చేస్తేనే చర్యలు తీసుకునే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నారు.ఫిర్యాదు చేస్తే కేసులు.. భద్రత కల్పించడానికి, ప్రజలకు అదుపులో పెట్టడానికి బౌన్సర్లు, ప్రైవేటు సెక్యూరిటీ గార్డులను యాజమాన్యాలు, వ్యక్తులు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇలా విధుల్లోకి వస్తున్న గార్డులు అనేక సందర్భాల్లో చేతివాటం ప్రదర్శిస్తున్నారు. కార్యక్రమాలకు హాజరైన, తమ యజమాని ఆదేశాల మేరకు ప్రజలతో దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఒక్కోసారి ఏకంగా లాఠీలు చేతపట్టుకుని ఆహూతులపై విరుచుకుపడుతున్నారు. వీఐపీలకు ఉండే పలుకుబడిని దృష్టిలో పెట్టుకునే సామాన్యులు వీటన్నింటినీ మౌనంగా భరిస్తున్నారు. కేవలం అక్కడక్కడ మాత్రమే నిరసన గళం విప్పుతున్నారు. కాగా.. దురుసుగా ప్రవర్తించే అధికారం ప్రైవేటు సెక్యూరిటీ గార్డులకు లేదని పోలీసులు అంటున్నా... ఫిర్యాదు చేస్తే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోలేమని స్పష్టం చేస్తున్నారు. బార్లతో మొదలై..బౌన్సర్... ఈ పేరు పబ్స్, బార్స్కు తరచు వెళ్లే వారికి సుపరిచితమే. ఈ సంస్కృతి సైతం ముంబైలోని డాన్స్ బార్లలో ప్రారంభమైంది. మితిమీరి ప్రవర్తించే వారిని, హద్దు మీరి మద్యం తాగి గొడవలు చేసేవారిని కట్టడి చేయడానికి శాశ్వత ప్రాతిపదికన యాజమాన్యాలు వీరిని నియమించుకుంటాయి. కండలు తిరిగిన శరీరం, కళ్లల్లో చురుకుతనం, చిరునవ్వు కూడా కనిపించని ముఖం, నల్లటి యూనిఫాం (సాధారణంగా షర్టు, టీషర్టు మాత్రమే నల్లవి ధరిస్తారు)లతో వీరు దర్శనం ఇస్తుంటారు. ఆపై వీరిని రెస్టారెంట్లు, మాల్స్ యాజమాన్యాలు సైతం ఏర్పాటు చేసుకోవడం ప్రారంభించాయి. ఆపై సెక్యూరిటీ గార్డులుగా మారిన ఈ బౌన్సర్లు ప్రముఖుల రాక, భారీ స్థాయిలో సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాటు తదితర సందర్భాల్లో రక్షణ కోసం రంగంలోకి దిగడం ప్రారంభించారు. ఇప్పుడైతే అనేక మంది వీఐపీల వెంటే ఉండటం ప్రారంభమైంది. దేహ దారుఢ్యంతో పాటు కాస్త చురుకుదనం, సమయస్ఫూర్తి మాత్రమే ప్రధాన అర్హతలు కావడంతో జిమ్స్తో టచ్లో ఉండే అనేక మంది యువకులు తాత్కాలిక బౌన్సర్లుగా ఉండటానికి ఆసక్తి చూపిస్తున్నారు. వీరిలోనే కొందరు శాశ్వత ప్రాతిపదికన సెక్యూరిటీ గార్డులుగానూ పని చేస్తున్నారు. -
హైదరాబాద్ పబ్బుల్లో దాడులు.. ఆరుగురికి డ్రగ్స్ పాజిటివ్
హైదరాబాద్, సాక్షి: హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అర్ధరాత్రి మరోసారి పబ్బులు, బార్లలో పోలీసులు దాడులచేశారు. టీజీనాబ్, ఎక్సైజ్ పోలీసులు సంయుక్తంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలోని 25 పబ్బులపై ఆకస్మిక తనిఖీలు చేశారు. పబ్బుల్లో 107 మందికి అనుమానితులకు డ్రగ్స్ డిటెక్షన్ కిట్లతో పరీక్షలు చేయగా.. ఐదుగురికి పాజిటివ్గా తేలింది. శుక్రవారం రాత్రి 11 గంటల నుండి ఒంటి గంట వరకు పోలీసులు తనిఖీలు కొనసాగించారు. ఎక్సోరాలో గంజాయి పరీక్షల్లో ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. రంగరెడ్డి జిల్లాలో బార్లలో మరో ముగ్గురు వ్యక్తులు పాజిటివ్గా తేలారు. మొదటిసారి తనిఖీల్లో డ్రగ్ డీటెక్షన్ పరీక్షల్లో పాజిటివ్ రావడంతో ఆ వ్యక్తులను టీజీనాబ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఆరు కేసుల్లో జీ 40లో ఇద్దరికి, విస్కీ సాంబ పబ్బులో ఇద్దరికి, జోరా పబ్బులో ఒకరికి, క్లబ్ రొగ్లో ఒకరికి డ్రగ్స్ తీసుకున్నట్లు పాజిటివ్ వచ్చినట్లు అధికారుల తెలిపారు. -
144 ఏళ్ల మెడికల్ స్టోర్ ఎలా బయటపడింది? దానిలో ఏమేమి ఉన్నాయి?
చరిత్రకు సంబంధించిన పలు అంశాలు ఎప్పటికీ ఆసక్తికరంగానే ఉంటాయి. తాజాగా 114 ఏళ్ల క్రితం నాటి మెడికల్ స్టోర్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 1880లో ప్రారంభమైన ఈ స్టోర్ 1909 వరకూ సవ్యంగానే నడిచింది. ఈ స్టోర్ను బ్రిటన్లో విలియం వైట్ అనే వ్యక్తి నిర్వహించేవాడు. అతని మరణానంతరం ఈ స్టోర్ మూతపడింది. ఇన్నాళ్ల తరువాత ఈ స్టోర్ తలుపులు తెరవగానే లోపల ఆశ్చర్యం కలిగించే పలు వస్తువులు కనిపించాయి. మెట్రో యూకే తెలిపిన వివరాల ప్రకారం ఈ మెడికల్ స్టోర్ గురించి 80 ఏళ్ల క్రితమే వెల్లడయ్యింది. అయితే విలియం వైట్ మనుమడు 1987లొ దీని గురించి బహిరంగంగా తెలియజేశాడు. తరువాత దీనిని ప్రజల సందర్శనార్థం తెరిచాడు. ఈ స్టోర్లో లిక్విడ్ మెడిసిన్తో నిండిన జార్లు, స్కేళ్లు, వైట్ రైటర్ మొదలైనవి లభ్యమయ్యాయి. విలియం వైట్ మరణానంతరం అతని ఇంటిని విక్రయించే సమయంలో ఈ రహస్య గదిని కనుగొన్నారు. అప్పుడు వైట్ కుమారుడు చార్లెస్ ఈ స్టోర్ను మూసివేశాడు. ఒక పరిశోధకుడు చెప్పిన దాని ప్రకారం స్టొర్లోని సామాను పరిశీలించి చూస్తే, విలియం ఒక కెమిస్ట్ అని తెలుస్తోంది. అలాగే అతను గ్రోసరీ సామాను కూడా భద్రపరిచేవాడు. అయితే నాటి వస్తువులు ఇప్పుడు ప్రమాదకరంగా పరిణమించాయి. ఈ దుకాణంలో కొన్ని వనమూలికలు కూడా లభించాయి. ఈ దుకాణాన్ని చూసేందుకు జనం తరలివస్తున్నారు. ఇది కూడా చదవండి: హిట్లర్ విషాహార భయాన్ని ఎలా దాటాడు? చివరికి ఎలా మరణించాడు? -
రెస్టారెంట్లలో సర్వీస్ చార్జ్ చెల్లిస్తున్నారా..? కేంద్ర ప్రభుత్వం క్లారిటీ
పెద్దపెద్ద హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లు వంటి వాటికి వెళ్లినప్పుడు కొన్నింటిలో అక్కడ తిన్నవాటికి, తాగినవాటికి బిల్తో పాటు అదనంగా సర్వీస్ చార్జ్ వసూలు చేస్తుంటారు. చాలా మంది ఇది తప్పనిసరేమో అనుకుని మారు మాట్లాడకుండా కట్టేసి వస్తుంటారు. అయితే ఈ సర్వీస్ చార్జ్ అన్నది తప్పసరా.. కాదా.. అని మరోసారి చర్చ జరుగుతోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం కూడా తాజా స్పష్టత ఇచ్చింది. గత వారం నోయిడాలోని ప్రముఖ స్పెక్ట్రమ్ మాల్లోని ఒక రెస్టారెంట్లో హింసాత్మక ఘటన జరిగింది. అక్కడికి వచ్చిన ఓ కుటుంబానికి, రెస్టారెంట్ సిబ్బందికి మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. రెస్టారెంట్ వేసిన సర్వీస్ ఛార్జీని చెల్లించడానికి నిరాకరించడంతో రెస్టారెంట్ సిబ్బంది కస్టమర్లతో దురుసుగా ప్రవర్తించారు. మాల్ లోపల జరిగిన హింసాత్మక ఘర్షణకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. సర్వీస్ ఛార్జ్కు సంబంధించి దేశంలో ఉన్న చట్టాలు, రెస్టారెంట్లు, బార్ బిల్లులపై సర్వీస్ ఛార్జీలు చెల్లించడం తప్పనిసరి కాదా అనే దానిపై చాలా ప్రశ్నలు తలెత్తాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మాల్లో జరిగిన ఘర్షణను దృష్టిలో ఉంచుకుని రెస్టారెంట్, బార్లలో సర్వీస్ ఛార్జీల చెల్లింపునకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నేతృత్వంలోని వినియోగదారుల వ్యవహారాల శాఖ ఒక ముఖ్యమైన నోటిఫికేషన్ను విడుదల చేసింది. సర్వీస్ ఛార్జ్ తప్పనిసరి కాదా? డిపార్ట్మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ జారీ చేసిన నోటీసు ప్రకారం.. రెస్టారెంట్లు సర్వీస్ ఛార్జీలు చెల్లించాలని కస్టమర్లను బలవంతం చేయకూడదు. ఎందుకంటే దీనిని విచక్షణా ఛార్జ్ అని పిలుస్తారు. అంటే తన విచక్షణ మేరకు రెస్టారెంట్ లేదా బార్లలో అందించిన సేవతో సంతృప్తి చెందితేనే దీన్ని చెల్లిస్తారు. వారి సేవతో సంతృప్తి చెందకపోతే బలవంతంగా విధించకూడదు. దీనర్థం రెస్టారెంట్, బార్ బిల్లుల్లో సర్వీస్ ఛార్జ్ తప్పనిసరి కాదు. ఇదీ చదవండి: Fact Check: బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ రూ.30వేలకు మించితే క్లోజ్! నిజమేనా? -
ఐఐఎఫ్ఎల్పై సెబీ కొరడా.. కొత్త క్లయింట్ల చేరికపై రెండేళ్ల నిషేధం
న్యూఢిల్లీ: రెండేళ్లపాటు కొత్త క్లయింట్లను చేర్చుకోవద్దంటూ బ్రోకరేజీ సంస్థ ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ను క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆదేశించింది. గతంలో ఇండియా ఇన్ఫోలైన్గా కార్యకలాపాలు నిర్వహించిన కంపెనీపై క్లయింట్ నిధుల అక్రమ వినియోగం కేసులో సెబీ తాజాగా చర్యలు చేపట్టింది. 2011 ఏప్రిల్ నుంచి 2017 జనవరి మధ్య కంపెనీ ఖాతా పుస్తకాలను పలుమార్లు పరిశీలించాక సెబీ క్లయింట్ల చేరికపై నిషేధం విధించింది. 2011 ఏప్రిల్– 2014 జూన్ మధ్య కాలంలో క్లయింట్ల క్రెడిట్, డెబిట్ బ్యాలన్స్లను అక్రమంగా వినియోగించినట్లు దర్యాప్తులో సెబీ గుర్తించింది. ఇదే విధంగా 2015–16, 2016–17 మధ్య కాలంలోనూ నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు సెబీ పేర్కొంది. వెరసి స్టాక్ బ్రోకర్గా రెండేళ్లపాటు కొత్త క్లయింట్లను చేర్చుకోవద్దంటూ సెబీ ఆదేశించింది. క్లయింట్ నిధుల అక్రమ వినియోగంపై 2022 మే నెలలో కంపెనీపై సెబీ రూ. కోటి జరిమానా విధించిన సంగతి తెలిసిందే. -
మందుబాబులకు గుడ్ న్యూస్.. ఉదయం 3 వరకు బార్లు ఓపెన్.. ఎక్కడంటే?
చండీగఢ్: కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్ అడ్మినిస్ట్రేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకై బార్లు ఉదయం 3 గంటల వరకూ తెరచి ఉంచేందుకు అనుమతి ఇచ్చింది. ఇందుకు సంబంధించిన కొత్త ఎక్సైజ్ పాలసీ 2023-24ను బుధవారం విడుదల చేసింది. అలాగే మద్యంపై 'కౌ సెస్'ను తగ్గించింది. కొత్తగా 'క్లీన్ ఎయిర్ సెస్'ను తీసుకొచ్చింది. చండీగఢ్లో ఇంతకుముందు అర్ధరాత్రి ఒంటిగంట వరకే బార్లకు అనుమతి ఉండేది. కొత్త ఎక్సైజ్ పాలసీలో కౌ సెస్ను తగ్గించారు. స్వదేశంలో తయారైన 750 ఎంఎల్ లిక్కర్ బాటిల్పై కౌ సెస్ గతంలో రూ.5 ఉండగా.. ఇప్పుడు రూ.1కి తగ్గించారు. అలాగే బీరుపై కూడా రూ.5గా ఉన్న ఈ సెస్ను రూ.1కి పరిమితం చేశారు. ఇక 750/700 ఎంఎల్ విస్కీపై కౌ సెస్ను రూ.10 నుంచి రూ.2కి తగ్గించారు. అలాగే ఎక్సైజ్ డ్యూటీలోనూ ఎలాంటి మార్పు చేయలేదు. తక్కువ ఆల్కహాల్ డ్రింక్స్ను ప్రోత్సహించడానికి బీర్, వైన్ వంటి వాటిపై లైసెన్స్ ఫీజులు పెంచలేదు. చదవండి: ‘వారి టార్గెట్ నేను కాదు.. మీరే!’ రాజీనామా లేఖలో మనీష్ సిసోడియా -
‘వర్క్ ఫ్రమ్ పబ్’.. మందేస్తూ, చిందేస్తూ పని చేయ్..!
లండన్: కరోనా కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్(ఇంటి నుంచే పని)కి చాలా సంస్థలు మొగ్గు చూపాయి. అయితే, ఇంట్లో ఒంటరిగా కూర్చిని పని చేయాలంటే ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. చాలా కాలంగా వర్క్ ఫ్రమ్ హోమ్తో విసుగు చెందటం సహజమే. అయితే, అలాంటి వారి కోసమే ఈ బంపర్ ఆఫర్. బ్రిటన్లో ఇప్పుడు ‘వర్క్ ఫ్రమ్ పబ్’ అనే సరికొత్త ట్రెండ్ నడుస్తోంది. వర్క్ అండ్ ప్లే అనే కాన్సెప్ట్తో బార్లు, పబ్లులు ఇంటి నుంచే పని చేసే ఉద్యోగులను ఆకట్టుకుంటున్నాయి. కరోనా కారణంగా బిజినెస్ లేక పబ్బులు దివాలా తీసే పరిస్థితులు వచ్చాయి. ఈ క్రమంలోనే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వారిని ఆకట్టుకునే పనిలో పడ్డాయి యూకేలోని పబ్బులు. ‘వర్క్ అండ్ ప్లే’ ప్యాకేజీలను అందిస్తున్నాయి. యూకేలోని ‘యంగ్’ పబ్ దేశవ్యాప్తంగా ఉన్న తమ ప్రాంచైజీల్లో ఈ ‘వర్క్ అండ్ ప్లే’ ప్యాకేజీని అందిస్తోంది. పని చేసుకునేందుకు ప్రత్యేక స్థలం, లంచ్లో సాండ్విచ్, అన్లిమిటెడ్ టీ, కాఫీలు కేవలం రోజుకు 15పౌండ్లు(రూ.1,300)లకే అందిస్తోంది. వర్క్ ఫ్రమ్ పబ్ కల్చర్ విస్తరిస్తుండటంతో నలుగురితో కలిసి పనిచేయాలని కోరుకునే ఉద్యోగాలు.. పబ్బుల దారిపడుతున్నారు. ఈ ప్యాకేజీల్లో పవర్ సాకెట్స్, నిశబ్దంగా ఉండే క్యాబిన్లతో పాటు షిఫ్ట్ అయిపోగానే జిన్, పింట్, టోనిక్ వంటి వాటిని సైతం సేవించవచ్చు. అయితే, ఈ స్కీమ్ను 2020లోనే యంగ్ పబ్ లాంచ్ చేసింది. మంచి ఆదరణ లభిస్తుండటంతో ఇప్పుడు మొత్తం 185 ప్రాంచైజీల్లో అమలు చేస్తోంది. తాము పబ్లో ఉండే వాతావరణానికే మొగ్గు చూపుతామని కొందరు వర్క్ ఫ్రమ్ పబ్ వినియోగదారులు చెబుతున్నారు. లండన్, గ్రీన్విచ్లోని కట్టి సార్క్ పబ్లో ‘వర్క్ ఫ్రమ్ పబ్’ చేస్తున్న ఎడ్యుకేషన్ కాపీరైటర్ జెన్ పలు విషయాలు పంచుకున్నారు. తాను 200 ఏళ్లనాటి వాతవరణాన్ని ఆఫీస్కు తీసుకెళ్లాలనుకుంటున్నట్లు చెప్పారు. ఈ ప్యాకేజీ వాటర్ కూలర్ను దెబ్బ తీస్తుందని చమత్కరించారు. యూకేలోని ఇతర పబ్బులు సైతం ఇలాంటి ఆఫర్లే ఇస్తున్నాయి. ఫుల్లర్ పబ్ తన 380 ప్రాంచైజీల్లో రోజుకు 10పౌండ్లు(రూ.900)లకే లంచ్, డ్రింక్ అందిస్తోంది. అలాగే బ్రేవ్హౌస్ అండ్ కిచెన్ 10పౌండ్లకే వర్క్ స్పేస్తో పాటు వైఫై, పవర్ సాకెట్స్, అన్లిమిటెడ్ హాట్ అండ్ సాఫ్ట్ డ్రింక్, ప్రింటింగ్ సైతం అందిస్తోంది. ఇదీ చదవండి: 1161 కిలోల ‘జంబో’ గుమ్మడి.. జాతీయ రికార్డు బద్దలు! -
AP: దూర దూరం.. బార్లు
సాక్షి, అమరావతి: కొత్త బార్ల పాలసీకి అనుగుణంగా బార్ల కేటాయింపు కోసం ఇ–వేలం నిర్వహణకు ఎక్సైజ్ శాఖ సన్నద్ధమవుతోంది. పూర్తి పారదర్శకంగా బార్ల కేటాయింపు కోసం ఇ–వేలం విధి విధానాలను ఖరారు చేసింది. రాష్ట్రంలో బార్ల సంఖ్యను పెంచకూడదని ప్రభుత్వం ఇప్పటికే విధాన నిర్ణయం తీసుకుంది. అదే విధానం ప్రాతిపదికన సామాన్యులకు ఇబ్బందులు లేకుండా బార్లను కేటాయించే రీతిలో మార్గదర్శకాలు రూపొందించింది. పట్టణాలు, నగరాల్లో సామాన్యులకు ఇబ్బంది తలెత్తకుండా బార్ల కేటాయింపు ఉండేలా ఎక్సైజ్ శాఖ జాగ్రత్తలు తీసుకుంటోంది. సెప్టెంబర్ 1 నుంచి కొత్త బార్లు అమలులోకి వచ్చేలా ఇ–వేలం నిర్వహణ షెడ్యూల్ను ఖారారు చేస్తూ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ను సూత్రప్రాయంగా ఆమోదించింది. తుది ఆమోదం తర్వాత ఈనెల 21న నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. బార్ల సంఖ్య పెంచని ప్రభుత్వం ఐదేళ్లుగా రాష్ట్రంలో 840 బార్లు ఉన్నాయి. ప్రస్తుతం కూడా వాటి సంఖ్యను పెంచకుండా కొత్త లైసెన్సులను 840 బార్లకే పరిమితం చేయనున్నారు. దగ్గర దగ్గరగా బార్ల ఏర్పాటుతో సామాన్యులు ఇబ్బంది ఎదుర్కొంటున్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించి బార్లు దూర దూరంగా ఉండేలా విధి విధానాలను ఖరారు చేసింది. గత ఐదేళ్లుగా 106 మున్సిపల్ కార్పొరేషన్లు/ మున్సిపాలిటీల్లో 840 బార్లు ఉన్నాయి. సూత్రప్రాయంగా ఆమోదించిన నోటిఫికేషన్ ప్రకారం అవే 840 బార్లను 130 మున్సిపల్ కార్పొరేషన్లు/ మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేయనున్నారు. అందుకోసం ఇప్పటివరకు ఉన్న నగరాలు, పట్టణాల్లో బార్ల సంఖ్యను తగ్గించారు. కొత్త మున్సిపాలిటీలు, డివిజన్ కేంద్రాల్లో ఏర్పాటుకు లైసెన్స్లు జారీ చేస్తారు. దీంతో ఒకే మున్సిపల్ కార్పొరేషన్/మున్సిపాలిటీ పరిధిలో బార్ల సంఖ్య తగ్గుతుంది. మున్సిపల్ కార్పొరేషన్లో 10 కి.మీ. పరిధిలో, మున్సిపాలిటీల్లో 3 కి.మీ. పరిధిలో బార్లను ఏర్పాటు చేసుకునే వెసులుబాటు కల్పించారు. జిల్లా పరిధి మాత్రం దాటకూడదు. ఈ రెండు నిబంధనలతో బార్ల మధ్య దూరం ఎక్కువగా ఉంటుంది. పక్కాగా సుప్రీం మార్గదర్శకాలు అమలు బార్ల కేటాయింపులో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ప్రభుత్వం కచ్చితంగా పాటించనుంది. విద్యా సంస్థలు, ప్రార్థనా మందిరాలు, జాతీయ రహదారికి సమీపంలో బార్లను అనుమతించరు. ఈ నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ నోటిఫికేషన్లో విధివిధానాలను నిర్దేశించనున్నారు. పూర్తి పారదర్శకంగా బార్ల లైసెన్సుల కేటాయింపునకు ఎక్సైజ్ శాఖ సన్నాహాలు చేస్తోంది. ఇ–వేలం ద్వారా లైసెన్సులు కేటాయిస్తారు. ఎవరు ఎంత కోట్ చేశారన్న వివరాలు ఆన్లైన్లో ఉంటాయి. ఎక్సైజ్ శాఖ సూత్రప్రాయంగా ఆమోదించిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ వివరాలు ఇలా... ఈ నెల 22 నుంచి 27 వరకు బార్ లైసెన్సుల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియతోపాటు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ నెల 30, 31వ తేదీల్లో ఇ–వేలం నిర్వహిస్తారు. ఇ–వేలంలో ఒకరికంటే ఎక్కువమంది ఒకే మొత్తాన్ని కోట్ చేస్తే లాటరీ విధానంలో లైసెన్స్ కేటాయిస్తారు. వేలంలో లైసెన్స్ పొందినవారు అనంతరం ఒక రోజులో నిర్దేశిత మొత్తాన్ని చెల్లించాలి. లేదంటే ఆ కేటాయింపును రద్దు చేసి మళ్లీ ఇ–వేలం నిర్వహిస్తారు. లైసెన్సులు పొందినవారు తమకు కేటాయించిన మున్సిపల్ కార్పొరేషన్/ మున్సిపాలిటీ పరిధిలో నోటిఫికేషన్లో పేర్కొన్న ప్రమాణాల ప్రకారం బార్లు ఏర్పాటు చేసుకోవాలి. సెప్టెంబర్ 1 నుంచి కొత్త బార్లను నిర్వహించుకునేందుకు అనుమతి. లైసెన్స్ కాల పరిమితి మూడేళ్లు ఉంటుంది. మున్సిపాలిటీలు/ నగర పంచాయతీలవారీగా బార్లు ఆమదాలవలస 2, పలాస కాశీబుగ్గ 2, ఇచ్ఛాపురం 2, సాలూరు 3, పార్వతీపురం 4, పాలకొండ 1, నెల్లిమర్ల 1, బొబ్బిలి 3, రాజాం 4, అమతమవారివలస(టూరిజం రిసార్ట్) 1, ఎస్.కోట (టూరిజం రిసార్ట్)1, నర్సీపట్నం 2, యలమంచిలి 1, సామర్లకోట1, పిఠాపురం1, గొల్లప్రోలు 1, పెద్దాపురం 1, తుని 1, మండపేట 2, అమలాపురం 3, ముమ్మడివరం 1, రామచంద్రాపురం 3, నిడదవోలు 3, కొవ్వూరు 2, కడియపులంక (టూరిజం రిసార్ట్) 1, జంగారెడ్డిగూడెం 2, నూజివీడు 3, చింతలపూడి 1, తణుకు 5, పాలకొల్లు 6, నరసాపురం 2, తాడేపల్లిగూడెం 4, భీమవరం 6, తాడిగడప 12, పెడన 1, గుడివాడ 10, ఉయ్యూరు 1, మంగినపూడి(టూరిజం సెంటర్) 1, అవనిగడ్డ( టూరిజం సెంటర్)2, జగ్గయ్యపేట 2, నందిగామ 1, తిరువూరు 1, కొండపల్లి 8, తెనాలి 20, పొన్నూరు 4, బాపట్ల 5, రేపల్లె 5, చీరాల 6, అద్దంకి 1, నరసరావుపేట 16, చిలకలూరిపేట 11, సత్తెనపల్లి 4, పిడుగురాళ్ల 6, గురజాల 2, దాచేపల్లి 3. మాచర్ల 3, వినుకొండ 8, మార్కాపురం 5, చీమకుర్తి 1, కనిగిరి 1, గిద్దలూరు 1, పొదిలి 1, దర్శి 1, ఆత్మకూరు 1, కావలి 6, కందుకూరు 3, బుచ్చిరెడ్డిపాలెం 1, అల్లూరు 1, పుంగనూరు 1, పలమనేరు 1, నగరి 1, కుప్పం 1, పుత్తూరు 1, శ్రీకాళహస్తి 3, తొండవాడ( టూరిజం రిసార్ట్) 1, గూడూరు 3, నాయుడుపేట 1, సూళ్లూరుపేట 1, వెంకటగిరి 1, మదనపల్లి 4, బి.కొత్తకోట 1, పీలేరు 1, రాయచోటి 2, రాజంపేట 2, ప్రొద్దుటూరు 8, బద్వేల్ 2, మైదుకూరు 1, జమ్మలమడుగు1, ఎర్రగుంట్ల 1, పులివెందుల 1, కమలాపురం 1, ఆదోని 5, ఎమ్మిగనూరు 3, గూడూరు 1, నంద్యాల 15, డోన్ 2, ఆళ్లగడ్డ 1, నందికొట్కూరు 1, ఆత్మకూరు( నంద్యాల జిల్లా) 1, బేతంచర్ల 1, గుంతకల్ 3, తాడిపత్రి 3, రాయదుర్గం 1, గుత్తి 1, కల్యాణదుర్గం 1, హిందూపూర్ 3, కదిరి 3, ధర్మవరం 2, పెనుకొండ 2, మడకశిర 1. గ్రేటర్ విశాఖ 134 (అనకాపల్లి పరిధిలో 6) విజయవాడ 110 శ్రీకాకుళం 12 విజయనగరం 17 కాకినాడ 11 రాజమహేంద్రవరం 16 ఏలూరు 10 మచిలీపట్నం 10 గుంటూరు 67 మంగళగిరి 17 ఒంగోలు 15 నెల్లూరు 35 తిరుపతి 16 చిత్తూరు 7 కడప 12 కర్నూలు 18 అనంతపురం 10 -
బార్లకేమో బంపర్ ఆఫర్.. దీక్షపై ఆంక్షలా?: బండి సంజయ్
సాక్షి,కాగజ్నగర్: ప్రజలు తాగి ఊగాలని నూతన సంవత్సర వేడుకల సందర్భంగా అర్ధరాత్రి వరకూ వైన్స్లు, బార్లకు ప్రభుత్వం అనుమతులిచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజమెత్తారు. ‘మేం నిరుద్యోగదీక్ష చేపడతామంటే ఒమిక్రాన్ పేరుతో అనుమతి ఇవ్వలేదు. ఇప్పుడు అర్ధరాత్రి వరకూ జనం తాగి ఊగితే వైరస్ వ్యాప్తిచెందదా?’అని ప్రశ్నించారు. మద్యం అమ్మకాల మీద వచ్చే పైసల కోసమే ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని సీఎం కేసీఆర్పై మండిపడ్డారు. కాగజ్నగర్లో నిర్వహించిన ఆ పార్టీ జిల్లాస్థాయి శిక్షణ తరగతులకు బుధవారం ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో పచ్చిబియ్యం ఎంతైనా కొంటామని కేంద్రం స్పష్టంగా చెప్పిందని తెలిపారు. ‘బాయిల్డ్ రైస్ నువ్వు తినవు, కానీ పక్క రాష్ట్రంలో తినాలా’ అని సీఎంను నిలదీశారు. ‘మీ ఫాంహౌస్లో మీరు చేస్తున్నదమేమిటీ.. అక్కడ వరి పండిస్తూ, రైతులు పండిస్తే మాత్రం ఉరి అంటారా’అని మండిపడ్డారు. -
గబ్బు గబ్బుగా హైదరాబాద్ పబ్ లు
-
హైదరాబాద్: పబ్బులు, బార్లకు హైకోర్టు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ప్రాంతంలోని పబ్బులు, బార్ల నుంచి శబ్ధకాలుష్యం వస్తోందంటూ దాఖ లైన పిటిషన్పై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని జీహెచ్ఎంసీ, నగర పోలీసు కమిషనర్తోపాటు ప్రతివాదులుగా ఉన్న పబ్బులు, బార్ల యజమానులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. తమ నివాస ప్రాంతాలకు సమీపంలో ఏర్పాటు చేసిన పబ్బులు, బార్లతో తీవ్రమైన శబ్ధకాలుష్యం ఏర్పడుతోందని జూబ్లీహిల్స్ రెసిడెంట్స్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన న్యాయమూర్తి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. చదవండి: తెలంగాణ: రైళ్ల వేళల్లో మార్పులు.. కొత్త టైంటేబుల్ విడుదల.. -
బార్లు,రెస్టారెంట్లు,నైట్క్లబ్లకు క్యూ కట్టిన నార్వే ప్రజలు
-
క్లబ్బులు, అన్ని రకాల బార్లు ఇక ఓపెన్..
సాక్షి, హైదరాబాద్: కరోనా లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో గత ఆరు నెలలుగా (మార్చి 14 నుంచి) మూతబడిన బార్లు, క్లబ్బులు ఎట్టకేలకు తెరుచుకోనున్నాయి. తెలంగాణవ్యాప్తంగా ఉన్న బార్లు, క్లబ్బులను తక్షణమే తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలోని అన్ని బార్లు, క్లబ్బులు, టూరిజం క్లబ్బులను తక్షణమే తెర వచ్చు. అయితే ఆయా ప్రదేశాల్లో సమూహాల ఏర్పాటు, మ్యూజికల్ ఈవెంట్లు, డ్యాన్స్ ఫ్లోర్లపై నిషేధం కొనసాగుతుంది. దీంతో పబ్బులు మళ్లీ తెరుస్తారా లేదా అన్న దానిపై సందిగ్ధత నెల కొంది. అయితే బార్లకు అనుమతిచ్చిన ప్రభు త్వం వైన్షాపుల వద్ద పర్మిట్ రూంలపై ఉన్న నిషేధాజ్ఞలను ఎత్తేయలేదు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు పర్మిట్ రూంలపై నిషేధం కొనసాగు తుందని ఉత్తర్వుల్లో సీఎస్ పేర్కొన్నారు. ప్రభుత్వం విధించిన షరతులు... ►బార్లలో ప్రవేశద్వారం వద్దే థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించాలి. థర్మల్ స్క్రీనింగ్ స్పర్శరహితంగా ఉండాలి. ►బార్లు, క్లబ్బుల్లో పరిశుభ్రత పాటించాలి. నిబంధనలకు అనుగుణంగా క్యూ పద్ధతి పాటించాలి. ►పార్కింగ్ ప్రదేశాల్లో ఎక్కువ మంది గుమికూడకుండా చూడాలి. ►హ్యాండ్ శానిటైజర్లు అందుబాటులో ఉంచాలి. బార్ సిబ్బంది కచ్చితంగా మాస్క్లు ధరించి సర్వీసు చేయాలి. ►ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం రెండుసార్లు బార్ ప్రాంగణాన్ని పూర్తిస్థాయిలో శుభ్రపరచాలి. కస్టమర్ మారే ప్రతిసారీ సీట్లను శానిటైజ్ చేయాలి. ►బార్లు, క్లబ్బుల ప్రాంగణాల్లో గాలి, వెలుతురు వచ్చేలా చర్యలు చేపట్టాలి. -
మద్యం వినియోగాన్ని నిరుత్సాహ పరిచేందుకే..
సాక్షి, విజయవాడ: మద్యం వినియోగాన్ని నిరుత్సాహ పరిచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగా బార్ లైసెన్సులను పెంచుతున్నట్లు ప్రకటించింది. కాగా బార్ లైసెన్స్ రిజిస్ట్రేషన్ చార్జీలను 10 శాతం పెంచుతూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు బార్ల లైసెన్స్ పై 20 శాతం కోవిడ్ ఫీజులను వసూలు చేయాలని నిర్ణయించింది. దేశంలో తయారైన విదేశీ మద్యం, బీర్లు, రెడీ టు డ్రింక్ మద్యంపైనా 10 శాతం ఏఈఆర్టీ విధిస్తూ నోటిఫికేషన్ విడుదల చేస్తు, 2021 జూన్ 30 వరకు బార్లను కొనసాగిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. -
బార్లు, పబ్లకు అనుమతి
బెంగళూరు : కేంద్ర ప్రభుత్వం పలు సడలింపులతో ప్రకటించిన అన్లాక్ 4.0 మార్గదర్శకాలు సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానుండగా అదేరోజు నుంచి పబ్లు, బార్లు, క్లబ్లకు అనుమతించాలని కర్ణాటక నిర్ణయించింది. అన్లాక్ 4.0 మార్గదర్శకాలకు అనుగుణంగా పబ్లు, బార్లు, క్లబ్బులను తెరిచేందుకు కర్ణాటక ఎక్సైజ్ శాఖ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. బార్లు, క్లబ్బులు, పబ్ల్లో మద్యం విక్రయాలను అనుమతిస్తామని, అయితే వాటి సీటింగ్ సామర్థ్యంలో సగం ఖాళీగా ఉంచాలని కర్ణాటక ఎక్సైజ్ మంత్రి హెచ్ నాగేష్ పేర్కొన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో సీటింగ్ సామర్థ్యంలో 50 శాతం మాత్రమే వారు అనుమతించాలని, భౌతిక దూరం సహా ఇతర కోవిడ్-19 నిబంధనలను పాటించాలని స్పష్టం చేశారు. కాగా కరోనా వైరస్ నేపథ్యంలో మద్యం అమ్మకాలు నిలిచిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటివరకూ 1435 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని అంచనా. గత ఏడాది ఇదే సమయంలో ప్రభుత్వానికి వచ్చిన రాబడితో పోల్చితే ఇంతమొత్తంలో ప్రభుత్వానికి నష్టం వాటిల్లిందని అంచనా వేశామని మంత్రి తెలిపారు. మద్యం విక్రయాలకు అనుమతించనిపక్షంలో నష్టాలు 3000 కోట్ల రూపాయలు దాటతాయని చెప్పారు. ఇక ఈ ఏడాది జూన్లో కర్ణాటక ప్రభుత్వం వైన్ షాపులను తెరిచేందుకు అనుమతించింది. చదవండి : కార్యాలయంలో రాసలీలలు -
1 నుంచి మెట్రో సర్వీసులు
న్యూఢిల్లీ: సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ప్రారంభంకానున్న అన్లాక్–4 ప్రక్రియలో మెట్రో రైళ్లు తిరిగి పట్టాలెక్కనున్నాయి. అయితే, స్కూళ్లు, కాలేజీలను తెరిచే అవకాశాలు ఇప్పటికిప్పుడు లేవని అధికారవర్గాలంటున్నాయి. ఐఐటీలు, ఐఐఎంల వంటి వాటిని ప్రారంభించేందుకు గల అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోందని సమాచారం. ఇప్పటిదాకా మూతపడి ఉన్న బార్లు కూడా తెరుచుకోనున్నాయి. అయితే, కేవలం కౌంటర్పై మద్యం విక్రయాలను మాత్రమే అనుమతించేందుకు వీలుంది. బార్లో కూర్చుని మద్యం తాగేందుకు అవకాశం ఉండదు. మెట్రో రైళ్ల పునఃప్రారంభంపై వివిధ వర్గాలతో సంప్రదింపులు ముమ్మరంగా కొనసాగుతున్నట్లు అధికార వర్గాలు అంటున్నాయి. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా.. టోకెన్లకు బదులు మెట్రో కార్డుల ద్వారానే ప్రయాణానికి అనుమతించడం, స్టేషన్లలో రైలు ఆగే సమయాన్ని పెంచడం వంటి మార్పులు ఉంటాయని సమాచారం. -
మద్యం ప్రియులకు మరో శుభవార్త
జైపూర్: కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో లాక్ డౌన్ నిబంధనలు అమలైన విషయం తెలిసిందే. తాజాగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్డౌన్ నిబంధనలు సడలింపు ఇవ్వడంతో సోమవారం రోజున రాజస్థాన్ ప్రభుత్వం బార్లు తిరిగి తెరచుకోవడానికి అనుమతులు ఇచ్చింది. జూన్ 8 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లు, మద్యం దుకాణాలు ప్రారంభమైనప్పటికీ.. బార్లపై ఎటువంటి నిర్ణయం వెలువడకపోవడంతో ఇప్పటివరకు మూసేఉన్నాయి. అయితే ప్రభుత్వం తాజా ఉత్తర్వుల నేపథ్యంలో బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా బార్లు తెరుచుకోనున్నాయి. సామాజిక దూరం పాటిచండం, శానిటైజేషన్ ప్రక్రియ చేపట్టడం వంటి నిబంధనలతో బార్లకు అనుమతులు ఇచ్చింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల దాకా కర్ఫ్యూ యధావిధిగా అమలు కానుండటంతో.. ఉన్న తక్కువ సమయంలోనే తగినంత ఆదాయాన్ని పొందడానికి యజమానులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. కాగా.. మాల్స్, రెస్టారెంట్లు మొదలైన వాటికి ప్రభుత్వం అనుమతులు ఇచ్చినా కరోనా వైరస్ ప్రమాదం దృష్ట్యా ప్రజలు బయటకు రావడానికి ఆసక్తి చూపకపోవడం గమనార్హం. చదవండి: మద్యం హోం డెలివరీకి గ్రీన్సిగ్నల్.. -
ఇప్పటివరకు 129.. ఇక 68
మహారాణిపేట(విశాఖ దక్షిణ): మద్యం నిషేధం దశల వారీగా అమలు చేయడానికి ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. ఇప్పటికే విక్రయాలతో పాటు టైమింగ్స్ కూడా తగ్గించింది. ఇక బార్లకు కూడా కళ్లెం వేయనుంది. నూతన బార్ పాలసీలో 2020 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుంది. ప్రభు త్వం 40 శాతం బార్లు తగ్గించాలని ఇప్పటికే నిర్ణయించడంతో జిల్లా ఎ క్సైజ్ అధికారులు ఇప్పటికే ఆ ప్రకియ ప్రారంభించారు. ఎక్కడెక్కడ ఉంచాల్లో ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ప్రభుత్వ ఆదేశాలు వచ్చిన వెంటనే అమలు చేయడానికి సిద్ధమయ్యారు. డిసెంబర్తో లైసెన్స్లు పూర్తి.. ప్రస్తుతం నడుస్తున్న బార్ల లైసెన్సులు డిసెంబర్ 31తో రద్దు అవుతాయి. వాస్తవానికి ప్రస్తుత బార్ల లైసెన్సులు 2020 జూన్ ఆఖరి వరకు ఉన్నాయి. మద్యపాన నిషేధంలో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మిగిలిన రోజులకు సంబంధించి లైసెన్స్ ఫీజును ప్రభుత్వం బార్ యజమానులకు తిరిగి చెల్లిస్తుంది. ఇక 68 బార్లే.. ప్రస్తుతం జిల్లాలో 129 బార్లు ఉన్నా యి. ప్రభుత్వం 40 శాతం తగ్గించాలని ఆదేశాలు జారీ చేయడంతో 68 బార్లు మాత్రమే జనవరి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవి విశాఖ నగర పరి«ధి(జీవీఎంసీ)లో 66 ,యలమంచలి,నర్సీపట్నం మున్సిపాలిటీల్లో ఒక్కొక్కటి ఏర్పాటు కానున్నాయి. ఫీజుల పెంపు మరో వైపు 2020 జనవరి 1 నుంచి ప్రారంభం కానున్న బార్ల లైసెన్స్ ఫీజులు ప్రభుత్వం పెంచింది. 50 వేల లోపు జనాభా ఉన్న మున్సిపాలిటీలో బార్ ఏర్పాటు చేయాలంటే రూ.25 లక్షలు, 50 వేల నుంచి 5 లక్షల వరకు జనాభా ఉన్న మున్సిపాలిటీలో రూ.50 లక్షలు, 5 లక్షలకు పైగా ఉన్న జనాభా ఉన్న మున్సిపాలిటీ/నగర పాలక సంస్థలో బార్ ఏర్పాటు చేయాలంటే రూ.75 లక్షలు లైసెన్స్ ఫీజులు చెల్లించాలి. ఈ ప్రాతిపదికన విశాఖ నగర పరిధిలో బార్ ఏర్పాటు చేయాలంటే రూ.75 లక్షలుగా నిర్ణయించారు. ఆన్లైన్లో దరఖాస్తులు.. బార్ లైసెన్స్ల కోసం ఆసక్తి ఉన్న వారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేయాల్సి వుంది. ఎక్సైజ్ శాఖ వెబ్సైట్ ద్వారా డిసెంబర్ 6లోగా (మధ్యాహ్నం మూడు గంటలు) ఆన్లైన్లో దరఖాస్తు చేయాల్సి ఉంది. 7న డ్రా తీస్తారు. అలాగే ఒక కాపీని ఎక్సైజ్ కార్యాలయంలో అందజేయాలి. అన్ని డాక్యుమెంట్లు,బార్ నడిపే ఇంటి యజమాని నుంచి లేఖ, ఇతర డాక్యుమెంట్లు తప్పని సరిగా సమర్పించాలి. మార్గదర్శకాలు రాగానే.. నూతన మద్యం పాలసీలో భాగంగా బార్ల తగ్గింపుపై ప్రభుత్వం జీవో విడుదల చేసింది. దీనిపై శుక్రవారం రాజపత్రం కూడ ప్రభుత్వం విడుదల చేసింది. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాన్ని పక్కాగా అమలు చేసేందుకు సిబ్బందిని సమాయత్తం చేస్తున్నాం. ఏడాది పాటు బార్లు నడపడానికి లైసెన్స్ కోసం దరఖాస్తు చేయాలి. బార్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేయాలనుకున్న వారు రూ.10 లక్షల డీడీ సమర్పించాలి. బార్లు కంటే ఎక్కువ దరఖాస్తులు వస్తే డ్రా ద్వారా ఎంపిక చేస్తాం. -టి.శ్రీనివాసరావు, ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ డిప్యూటీ కమిషనర్, విశాఖపట్నం. -
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
సాక్షి, అమరావతి: మద్య నియంత్రణలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. బార్ల సంఖ్యను తగ్గించాలని సీఎం ఆదేశించారు. జనవరి 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి తీసుకురావాలన్నారు. ప్రభుత్వానికి వస్తున్న ఆదాయాలపై గురువారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమీక్షించారు. శాఖల వారీగా ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం, ప్రస్తుత పరిస్థితులను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ప్రజలకు ఇబ్బందిలేని ప్రాంతాల్లో మాత్రమే బార్లు ఉండాలని సీఎం చెప్పారు. బార్లకు అనుమతి ఇచ్చే ప్రదేశాల్లో అధికారులు జాగ్రత్తలు వహించాలని సూచించారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరుకే మాత్రమే బార్లలో మద్యం అమ్మకాలు సాగించాలని స్పష్టం చేశారు. ఆ మేరకు విధివిధానాలు ఖరారు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. -
12:00 కాదు 1:00
సాక్షి, హైదరాబాద్: నగరంలో వీకెండ్ మరింత మత్తెక్కించనుంది. జీహెచ్ఎంసీతోపాటు 5 కి.మీ. పరిధిలోని బార్లలో శుక్ర, శనివారాల్లో రాత్రి ఒంటి గంట వరకు మద్యం అమ్మకాలకు అనుమతిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉదయం 10 నుంచి రాత్రి 12 గంటల వరకే అనుమతి ఉంది. తాజాగా మరో గంట అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జీహెచ్ఎంసీ పరిధిలో 400 వరకు పబ్బులు, బార్లు ఉన్నాయి. నిత్యం లక్ష లీటర్ల మద్యం, 5 లక్షల లీటర్ల బీర్ల విక్రయం జరుగుతోంది. తాజా నిర్ణయం వల్ల అమ్మకాలు పెరగొచ్చని ఎక్సైజ్శాఖ అంచనా వేస్తోంది. ఎక్సైజ్ కమిషనర్ సోమేశ్కుమార్ మాట్లాడుతూ ‘అమ్మకాల సమయం పెంచాలని హోటళ్ల యాజమాన్యాలు కోరుతున్నాయి. దేశంలోని మెట్రో నగరాల్లో అమ్మకాలను పరిశీలించి వారంలో 2 రోజులు గంటపాటు అదనంగా అమ్మకాలకు అనుమతించాం’ అని అన్నారు. -
వేడుకలు రెండ్రోజులు వైన్స్, బార్లు బంద్
సాక్షి, సిటీబ్యూరో: హోలీ వేడుకలు నగరంలో రెండు రోజులు జరగనున్నాయి. రాజ్భవన్లో గురువారం వేడుకలు నిర్వహించనుండగా... రవీంద్రభారతి, ఇందిరాపార్కు, నెక్లెస్ రోడ్, లలిత కళాతోరణం, మాదాపూర్ ఇమేజ్ గార్డెన్స్, శిల్పారామం తదితర ప్రాంతాల్లో శుక్రవారం నిర్వహించనున్నారు. సిటీలో హోలీ పండగకే కేరాఫ్ అడ్రస్గా నిలిచే మార్వాడీలు, రాజస్థాన్ వాసులు శుక్రవారమే హోలీ ఆడాలని నిర్ణయించారు. ఇదిలా ఉండగా గురువారం ఉదయం 6గంటల నుంచి శనివారం ఉదయం 6గంటల వరకు నగరంలో వైన్స్, బార్లు పూర్తిగా బంద్ చేయాలని పోలీసులు ఆదేశాలిచ్చారు. రాజేంద్రనగర్: రంగుల పండగకురంగం సిద్ధమైంది. కలర్ఫుల్ఈవెంట్లో ఆడిపాడేందుకు సిటీసన్నద్ధమైంది. కానీ.. రసాయనరంగులతో ఎన్నో అనర్థాలు పొంచి ఉన్న నేపథ్యంలో సహజ రంగులతోనే హోలీ ఆడుకోవాలని నిపుణులుసూచిస్తున్నారు. సిటీజనుల్లోనూఈ స్పృహ పెరిగింది. ప్రకృతి సిద్ధంగా తయారైన రంగులను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇందుకనుగుణంగానే ప్రొఫెసర్ జయశంకర్ రాష్ట్ర వ్యవసాయవిశ్వవిద్యాలయం పరిధిలోని హోమ్సైన్స్ కళాశాల సహజ రంగులు సిద్ధం చేసింది. గతేడాది 4టన్నులు తయారు చేయగా, ఈ ఏడాది 7టన్నులుఅందుబాటులో ఉంచింది. రంగులు లభించే ప్రాంతాలు.. సైఫాబాద్ హోమ్సైన్స్ కళాశాల, రాజేంద్రనగర్లోని తయారీ యూనిట్, లోయర్ ట్యాంక్బండ్లోని రామకృష్ణ మఠం, ఎమరాల్డ్ స్వీట్ హౌస్, హైదర్నగర్లోని 24మంత్ర ఆర్గానిక్ షాప్ తదితర ప్రాంతాల్లో వీటిని విక్రయించనున్నారు. కిలో రూ.400 హోమ్సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఐదు రకాల రంగులు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆరెంజ్, ఎల్లో, బ్లూ, గ్రీన్, పింక్ కలర్లు ఉన్నాయి. కిలో రంగును రూ.400 విక్రయిస్తున్నారు. పావు కిలో, అర్ధ కిలో, కిలో చొప్పున ప్యాకింగ్లు కూడా చేశారు. మరిన్ని వివరాలకు: 7032823265, 7331175251, 040–23244058. పెరుగుతున్న డిమాండ్.. ప్రకృతి సిద్ధంగా తయారు చేస్తున్న రంగులపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ప్రతి ఏడాది రంగుల ఉత్పత్తి పెరుగుతోంది. ప్రజల నుంచి వస్తున్న డిమాండ్కు అనుగుణంగా రంగులను తయారు చేస్తున్నాం. మార్కెట్లో విక్రయించేందుకు కొన్ని స్టాల్స్ ఏర్పాటు చేశాం. – గీతారెడ్డి, సహజ రంగుల ప్రాజెక్ట్ ప్రిన్సిపల్, హోమ్సైన్స్ కాలేజీ ఉపయోగాలు... ♦ ఈ రంగుల్లో ఎలాంటి రసాయనాలు ఉండవు. ♦ శరీరానికి, కళ్లకు ఎలాంటి హానీ చేయవు. ♦ పర్యావరణంపై ప్రభావం చూపవు. ♦ శుభ్రపరుచుకోవడం చాలా తేలిక. ♦ నీరు ఆదా అవుతుంది.. ఖర్చు తక్కువ. ♦ భూమిలో ఈ రంగుల నీరు ఇంకడం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు. ఇక వాడం.. సహజ రంగులతోనే హోలీ ఆడాలని నిర్ణయించాం. ఇక నుంచి రసాయన రంగులు వాడం. రాజేంద్రనగర్లోని తయారీ యూనిట్లో రంగులు కొనుగోలు చేశాం. – కె.వనజ, హైదర్గూడ -
పబ్లు, బార్లలో జర జాగ్రత్త..!
సాక్షి, బెంగళూరు: ముంబైలోని కమల మిల్స్ భవనంపై ఉన్న పబ్లో జరిగిన అగ్ని ప్రమాదంతో నగర అగ్నిమాపక శాఖ విభాగం అప్రమత్తమైంది. ముంబై ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. నగరంలోని బహుళ అంతస్తుల భవనాలు ముఖ్యంగా ఇటువంటి భవనాల్లో ఉన్న పబ్లు, బార్లు, రెస్టోరెంట్లలో తనిఖీని ముమ్మరం చేసింది. ముఖ్యంగా న్యూ ఇయర్ సంబరాలకు ఎక్కువ మంది పబ్లు, బార్లలలో నిర్వహించుకోవడానికి యువత ఇష్టపడుతుందన్న విషయం తెలిసిందే. అయితే నగరంలోని చాలా పబ్లు, బార్లు అగ్నిమాపశాఖ నుంచి నో అబ్జక్షన్ సర్టిఫికెట్ను పొందకుండానే వాణిజ్య కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. నెటిజన్లు ట్వీట్లతో సమాచారం.. ఈ నేపథ్యంలో అనేకమంది నెటిజన్లు నగరంలోని ఏఏ రెస్టారెంట్లలో ఎటువంటి పరిస్థితి ఉందన్న విషయమై రాష్ట్ర అగ్నిమాపక శాఖ డీజీ ఎం.ఎన్ రెడ్డికి ట్వీట్లతో సమాచారం అందించారు. ముఖ్యంగా వైట్ఫీల్డ్లోని ఓ ప్రముఖ మాల్లోని రెస్టారెంట్తో పాటు రూఫ్ టాప్ పబ్లకు అనుమతి లేదని తెలిపారు. మరోవైపు ఇందిరానగరలోని అనేక పబ్లు ఇళ్లకు అనుమతులు పొంది అందులో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ఎం.ఎన్ రెడ్డికి సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన అగ్నిమాపక శాఖ అధికారులు ఎం.జీరోడ్, బ్రిగేడ్రోడ్, ఇందిరానగర్లో విస్తృత తనిఖీలు చేస్తున్నారు. ఈ విషయంపై ఎం.ఎన్ రెడ్డి మాట్లాడుతూ... ‘15 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తున్న భవనాలను బహుళ అంతస్తుల భవనాలుగా పరిగణిస్తారు. ఇందులో ప్రమాదం జరిగినప్పుడు త్వరగా కిందికి రావడానికి వీలుగా అత్యవసర మెట్లు ఉండాలి. అంతేకాక అటువంటి భవనాల ముందు అగ్నిమాపక వాహనాల నిలుపుదలకు వీలుగా విశాలమైన స్థలం ఉండాలి. ప్రతి అంతస్తులో అగ్నినిరోదక వస్తువులు తప్పక ఉండాలి. ఈ ఏర్పాట్లు లేని వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.’ అని తెలిపారు. అధికారులు ప్రజలకు చెబుతున్న జాగ్రత్తలు .. ∙పబ్లు, బార్లలో కిచెన్కు దగ్గరగా సిటింగ్ టేబుల్పై కూర్చొకపోవడమే ఉత్తమం. ∙మద్యానికి దగ్గరగా సిగరెట్ వంటి వస్తువులు ఉండకుండా చూడాలి. ∙పబ్కు, రెస్టారెంట్కు వెళ్లే సమయంలోనే అత్యవసర ద్వారాలు ఉన్నాయో లేదో చూసుకోవాలి ∙అగ్ని ప్రమాదం జరిగినప్పుడు లిఫ్ట్ను ఉపయోగించకపోవడమే మేలు -
న్యూ ఇయర్ స్పెషల్ బార్లు..బార్లా!
గ్రేటర్ హైదరాబాద్ నగరంలో కొత్త సంవత్సర జోష్ మొదలైంది. వేడుకల కోసం ఎక్కడికక్కడ భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈసారి ఇప్పటికే 134 పార్టీలకు పోలీసు, ఆబ్కారీశాఖ అనుమతులు ఇచ్చాయి. ఈ ఈవెంట్లు మాత్రమే కాకుండా హైదరాబాద్వ్యాప్తంగా 542 బార్లు, పబ్బులు, పెద్దసంఖ్యలో ఉన్న క్లబ్బులు, రిసార్టుల్లో మద్యం పొంగిపొర్లనుంది. గత వేడుకలకు రూ.100 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరగ్గా.. ఈసారి రూ.120 కోట్ల మేర మద్యం అమ్మకాలు జరుగుతాయని ఎక్సైజ్ శాఖ అధికారుల అంచనా. ఇటీవల మద్యం ధరలు పెరిగిన నేపథ్యంలో.. అమ్మకాలు మరింత ఎక్కువగా ఉండవచ్చని భావిస్తున్నారు. నగరంలోని మద్యం దుకాణాలు, బార్లు ఇప్పటికే అదనంగా మద్యం ఆర్డర్లు ఇచ్చాయని.. లిక్కర్ డిపోల్లోనూ ఫుల్లుగా స్టాకు ఉందని పేర్కొంటున్నారు. మరోవైపు మద్యం తాగి రహదారులపై దూసుకెళ్లే వాహనదారులకు కళ్లెం వేసేందుకు పోలీసు శాఖ ఏర్పాట్లు చేపట్టింది. పార్టీలు, ఈవెంట్లలో డ్రగ్స్ వినియోగంపైనా నిఘా పెడుతోంది. – సాక్షి, హైదరాబాద్ రాత్రి ఒంటిగంట వరకు బార్లు, పబ్లు బార్లా..! నూతన సంవత్సర వేడుకలను రాత్రి ఒంటిగంట వరకు మాత్రమే నిర్వహించాలని పోలీసు, ఆబ్కారీ శాఖలు స్పష్టం చేస్తున్నాయి. సాధారణ రోజుల్లో రాత్రి 12 గంటల వరకు మాత్రమే పార్టీల నిర్వహణకు అనుమతి ఉంది. నూతన సంవత్సర వేడుకలు కావడంతో మరో గంటపాటు మినహాయింపునిచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. కానీ దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం రాలేదని ఎక్సైజ్ వర్గాలు పేర్కొంటున్నాయి. మందుబాబులకు ఓలా బంపర్ ఆఫర్! బార్లు, పబ్లు, నూతన సంవత్సర పార్టీలో పీకలదాకా తాగిన మందుబాబులను సురక్షితంగా ఇంటికి చేర్చేందుకు ప్రముఖ క్యాబ్ సంస్థ ఓలా ఆఫర్లు ప్రకటించింది. ‘ఏపీఐ ఇంటిగ్రేషన్–మిషన్ స్మార్ట్రైడ్ పథకం’లో భాగంగా రూపొందించిన ‘స్మార్ట్ వెయిటర్ యాప్’నుంచి యూజర్లు నేరుగా ఓలా క్యాబ్ను బుక్ చేసుకునే ఏర్పాటు చేసింది. ఆయా బార్లు, పబ్బుల్లో పార్టీ నిర్వాహకుల సహకారంతో క్యాబ్ను బుక్ చేసుకోవచ్చని ఆ సంస్థ వెల్లడించింది. అధికంగా మద్యం తాగి డ్రైవింగ్ చేయడాన్ని నిరోధించడంతోపాటు క్షేమంగా ఇంటికి చేరుకునేలా చర్యలు చేపట్టామని తెలిపింది. ప్రత్యేక రాయితీలు, కూపన్లను కూడా అందజేస్తున్నట్లు పేర్కొంది. శ్రుతి మించితే అరదండాలే! కొత్త సంవత్సర వేడుకల్లో యువత శ్రుతి మించకుండా పోలీస్ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. పార్టీల్లో మద్యం తాగి రహదారులపైకి దూసుకొచ్చే వాహనదారులను కట్టడి చేసేందుకు.. రాత్రి ఒంటి గంట తరవాత బహిరంగ ప్రదేశాలు, నివాస జోన్ల పరిధిలో డీజేల హోరును నియంత్రించేందుకు చర్యలు చేపడుతోంది. ఇందుకోసం హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 50 బృందాలు, సైబరాబాద్ పరిధిలో 120 ప్రత్యేక బృందాలను గురువారం రాత్రి నుంచే రంగంలోకి దింపారు. ఇక కొత్త సంవత్సర వేడుకలు జరిగే ఆదివారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు హుస్సేన్సాగర్ పరిసరాల్లో ట్రాఫిక్ మళ్లించనున్నారు. ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్రోడ్, ట్యాంక్బండ్లపై వాహనాల రాకపోకలను పూర్తిగా నిషేధించనున్నారు. ఇదే సమయంలో నగరంలోని దాదాపు అన్ని ఫ్లైఓవర్లను మూసేయాలని అధికారులు నిర్ణయించారు. ప్రత్యామ్నాయ మార్గాలు లేని, కింద రైల్వేట్రాక్స్ ఉన్న బేగంపేట, డబీర్పుర, సనత్నగర్ వంటి ఫ్లైఓవర్లపై మాత్రమే రాకపోకలు ఉంటాయి. భారీ వాహనాల రాకపోకలను నిషేధించనున్నారు. ఇక ఔటర్ రింగ్ రోడ్డుపైనా వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. విమానాశ్రయానికి వెళ్లే వారిని టికెట్ ఉంటేనే అనుమతిస్తారు. ఇక కొత్త సంవత్సర వేడుకల్లో డ్రగ్స్ వినియోగించేవారిని గుర్తించేందుకు పోలీసు, ఆబ్కారీశాఖలు ప్రత్యేక టాస్క్ఫోర్స్ బృందాలను రంగంలోకి దించాయి. పార్టీలు జరిగే ప్రాంతాలతోపాటు అన్ని బార్లపై దృష్టి సారించాయి. ప్రత్యేక బృందాలతో విస్తృత తనిఖీలు కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో ఎక్సైజ్ అధికారులతో కలసి 50 ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేస్తున్నాం. వారు సాధారణ దుస్తుల్లో పబ్బులు, బార్లలో సంచరిస్తూ.. మైనర్ల కదలికలు, వారికి మద్యం సరఫరాపై నిఘా పెడతారు. విస్తృత డ్రంకెన్ డ్రైవ్లు చేపడుతున్నాం.. – వీవీ శ్రీనివాసరావు, హైదరాబాద్ ఇన్చార్జి పోలీస్ కమిషనర్ మద్యం తాగి వాహనాలు నడపొద్దు నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఎలాంటి అపశ్రుతులు, ప్రమాదాలు జరగకుండా ప్రజలంతా పోలీసులకు సహకరించాలి. మద్యం తాగి నడిపితే వాహనాలను సీజ్ చేస్తాం. బార్లు, పబ్బులు, వైన్షాపులను సమయానికి మించి కొనసాగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.. – సందీప్ శాండిల్య, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ -
తాగినోళ్లకు తాగినంత..!?
సాక్షి, బెంగళూరు : న్యూ ఇయర్ సందర్భంగా బెంగళూరు నగరంలో పబ్బులు, రెస్టారెంట్లు, బార్ల క్లోజింగ్ టైమ్లో ప్రభుత్వం మినహాయింపులు ఇచ్చింది. బార్లు, పబ్బులును ఉదయం రెండు గంటలకు వరకూ తెరిచివుంచేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే బార్లు, పబ్బుల్లో స్త్రీ, పురుషులకు ప్రత్యేక గదులను కేటాయించడంతో పాటు, పిల్లలతో వచ్చే తల్లులకు రిజర్వ్డ్ స్థలాన్ని ఏర్పాటు చేయాలని బెంగళూరు పోలీసులు బార్లు, పబ్బులు, రెస్టారెంట్ల యజమానులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. న్యూ ఇయర్ వేడుకలను సామరస్యంగా, ఆహ్లాదపూరిత వాతావరణంలో నిర్వహించుకోవాలని బెంగళూరు పోలీస్ కమిషనర్ టీ సునీల్ కుమార్ ప్రజలను కోరారు. మద్యం మత్తులో అసభ్యంగా, అశ్లీలంగా ప్రవర్తించేవారిని అక్కడికక్కడే అరెస్ట్ చేస్తామని ఆయన తెలిపారు. న్యూ ఇయర్ వేడుకలకు దూరంగా ఉంటున్న వారికి బలంవంతంగా విషెస్ చెప్పడం, అల్లరి చేష్టలకు దిగినవారిని కూడా అరెస్ట్ చేస్తామని ఆయన చెప్పారు. నగరంలోని ఎంజీ రోడ్, బ్రిగేడ్ రోడ్, చర్చ్ స్ట్రీట్, ఇతర ముఖ్యమైన ప్రాంతాల్లో 24 గంటల పాటు సీసీటీవీలో మానిటరింగ్ ఉంటుందని ఆయన చెప్పారు. న్యూ ఇయర్ సందర్భంగా అల్లర్లు జరగవచ్చన్న ఉద్దేశంతో ఇప్పటికే పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు ఆయన చెప్పారు. అందులో భాగంగా 15 వేల మంది పోలీసులు వినిమోగిస్తున్నట్లు ఆయన తెలిపారు. -
బార్లు, పబ్బులు నిబంధనలు పాటించాల్సిందే
హైదరాబాద్: బార్లు, పబ్బులు, వైన్ షాపులు, స్పాల యాజమాన్యాలు నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ సిపి సందీప్ శాండిల్య హెచ్చరించారు. సైబరాబాద్ పరిధిలోని బార్లు, పబ్బులు, వైన్ షాపులు, స్పాల యాజమాన్యాలు/మేనేజర్లతో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మసాజ్ సెంటర్లు, పార్లర్లలో ఇటీవల అసాంఘిక కార్యకలాపాలు జరగుతుండడం ఆందోళన కలిగిస్తోందన్నారు. మసాజ్ సెంటర్లు నిర్వహించడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే నియమ నిబంధనలను తప్పక పాటించాలని అన్నారు. మసాజ్ సెంటర్లను మసాజ్ సెంటర్లు గానే కొనసాగించాలని, వీటి ముసుగులో వ్యభిచారం, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే నేరమని తెలిపారు. స్పాలకు నిబంధనలు స్పాలలో తప్పనిసరిగా రిజిస్టర్ నిర్వహించాలన్నారు. ఇందులో స్పాలకు వచ్చే వారి పేరు, ఫోన్ నంబర్లను విధిగా నమోదు చేయాలన్నారు. స్పాలలో పడకల వాడకం అవసరం లేదన్నారు. సాధ్యమైనంత వరకూ క్రాస్ మసాజ్లకు అనుమతించవద్దని, 18 ఏళ్లకు తక్కువ ఉన్నవారిని అనుమతించొద్దని, సిసి కేమరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. విజిటింగ్ వీసాలపై వచ్చిన ఇతర దేశాల వారిని స్పాలల్లో నియమించుకోవద్దన్నారు. స్పాలల్లో తలుపులు పారదర్శకంగా ఉండాలన్నారు. తలుపులకు ఎలాంటి బోల్టులను బిగించరాదన్నారు. వీలుంటే గాజు పార్టిషన్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. బార్లు, పబ్బులు, వైన్ షాపులకు నిబంధనలు బార్లు, పబ్బులు, వైన్ షాపుల యజమానులు కచ్చితంగా ట్రేడ్ లైసెన్స్, లిక్కర్ లైసెన్స్, పోలీస్ లైసెన్స్లను తీసుకోవాలన్నారు. సమయపాలన పాటించాలని, రాత్రి 12 గంటల తర్వాత ఎట్టి పరిస్థితిలో షాపులను తెరిచి ఉంచొద్దని సూచించారు. పై నిబంధనలు అతిక్రమిస్తే మొదటిసారి సీపీ కార్యాలయానికి లేదా పోలీస్ స్టేషన్కు రావాల్సి ఉంటుందని, రెండోసారి అయితే 2, 3 రోజులు జైలు శిక్ష తప్పదని శాండిల్య హెచ్చరించారు. కేసుల నమోదుతోపాటు లైసెన్సుల రద్దుకు సిఫారసు చేస్తామని స్పష్టం చేశారు. అనంతరం సమావేశంలో పాల్గొన్న వారి పేర్లు, ఫోన్ నంబర్లు, ఫోటోలు తీసుకున్నారు. వ్యాపారులు కనీస నైతికత పాటించాలని, సామాజిక హితాన్ని కొంతైనా పాటించాలని సూచించారు. సమావేశంలో జాయింట్ సీపీ షానవాజ్ ఖాసీం, మాదాపూర్ డిసిపి విశ్వప్రసాద్, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
జేపీ అసోసియేట్కు మరో షాక్
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని నొయిడా ప్రాంతంలో ఫ్లాట్ల అమ్మకాల్లో అక్రమ పద్దతులు పాటించిన జై ప్రకాశ్ (జెపి) అసోసియేట్స్ కు సుప్రీం కోర్టులో మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. జేపీ అసోసియేట్స్ లిమిటెడ్ (జైపీ ఇన్ఫ్రాటెక్ మాతృ సంస్థ) స్వతంత్ర డైరెక్టర్లు, కుటుంబ సభ్యులు తమ అనుమతి లేకుండా ఎలాంటి వ్యక్తిగత ఆస్తులను బదిలి చేయడానికి వీల్లేదని ఆదేశించింది. గృహ యజమానుల ప్రయోజనాలను కాపాడేందుకు అత్యున్నత న్యాయస్థానం బుధవారం ఈ ఆదేశాలను జారీ చేసింది. ఈ సందర్భంగా సంస్థ ప్రమోటర్లపై సుప్రీం కోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. గృహకొనుగోలుదారుల ఖర్చుతో మీరు పెరిగారంటూ సుప్రీం ప్రధానన్యాయమూర్తి దీపాక్ మిశ్రా వ్యాఖ్యానించారు. మంచివాళ్లలాగా డబ్బులు చెల్లించండి..మధ్యతరగతి గృహ కొనుగోలుదారుల జీవితకాలం పొదుపు సొమ్మును నాశనం చేయొద్దు.. కొనుగోలుదారులు డబ్బును తిరిగి చెల్లించాల్సిందేనని పేర్కొన్నారు. అప్పు తెస్తారో.. మీ కుటుంబ బంగారు నగలు అమ్ముతారో కానీ... గృహకొనుగోలుదారులకు చెల్లించాలని ఆదేశించింది. అలాగే కోర్టు అనుమతి లేకుండా మొత్తం డైరెక్టర్లు ప్రమోటర్లు వ్యక్తిగత ఆస్తులు బదిలీ చేయకుండా నిషేధాన్ని విధించింది. ఈ ఆదేశాలను ఉల్లంఘింస్తే తీవ్ర పరిణామాలుంటాయని దీపాక్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ హెచ్చరించింది. బుధవారం కోర్టు రిజిస్ట్రీతో కంపెనీ రూ .275 కోట్లు డిపాజిట్ చేయగా, కంపెనీ చెల్లించాల్సిన మొత్తం రూ. 1725 కోట్లకు చేరింది. అలాగే రూ. 2,000 కోట్లను వాయిదాల పద్ధతిమీద చెల్లించేందుకు కోర్టు అనుతినిచ్చింది. డిసెంబర్ 14 నాటికి రూ.150 కోట్లను , డిసెంబరు మాసాంతానికి మరో రూ.125 కోట్లను చెల్లించాలని సుప్రీం ఆదేశించింది. తదుపరి విచారణను జనవరి 10వ తేదీకి వాయిదా వేసింది. 13 స్వతంత్ర డైరెక్టర్లు, ప్రమోటర్లు కూడా హాజరు కావాలని ఆదేశించింది. ఇవాల్టి విచారణకు ఎనిమిది స్వతంత్ర దర్శకులు, ఐదుగురు ప్రమోటర్లు వ్యక్తిగతంగా హాజరయ్యారు. కాగా మొత్తం రూ.2వేల కోట్ల బకాయిలో రూ .400 కోట్ల చెల్లిస్తామన్న జైప్రకాశ్ అసోసియేట్స్ ప్రతిపాదనను గత విచారణలో తిరస్కరించింది. సెప్టెంబర్ 4న జేపీ అసోసియేట్ కంపెనీపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ జారీ చేసిన దివాలా చట్ట విచారణపై సుప్రీంకోర్టు స్టే విధించడంతో పాటు జేపీ అసోసియేషన్స్ సిస్టర్ కంపెనీ జేపీ ఇన్ఫ్రాటెక్ ఎండీ, డైరెక్టర్లు ముందస్తు అనుమతి లేకుండా దేశం విడిచి విదేశాలకు వెళ్లడానికి వీల్లేదనిన స్పష్టం చేసిన విషయం తెలిసిందే. -
పబ్లపై సిట్ కొరడా
-
ఏపీలో మద్యంపై కదం తొక్కిన మహిళలు
-
ఊరిలో బార్... దారిలో బెల్ట్!
⇔ రేపటి నుంచి నూతన మద్యం పాలసీ అమలు ⇔ జాతీయ, రాష్ట్ర రహదారులకు 500 మీటర్ల దూరంలోనే దుకాణాలు ⇔ కొత్త షాపులు, బార్ల ఏర్పాటులో వ్యాపారులు బిజీ ⇔ హైవే పక్కన ఇక బెల్టు షాపులు ! ⇔ ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్న వ్యాపారులు ⇔ ఇళ్ల మధ్య మద్యం షాపులు పెట్టవద్దని ఫిర్యాదుల వెల్లువ మచిలీపట్నం : ఇప్పటి వరకు బెల్ట్ షాపులు గ్రామాల్లో ఇళ్ల మధ్య ఉండేవి. గుట్టుగా మద్యం విక్రయించేవారు. బార్ అండ్ రెస్టారెంట్లు ఊరికి దూరంగా... రహదారులకు దగ్గరగా ఉండేవి. ఇప్పుడా పరిస్థితి పూర్తిగా మారనుంది. గుడి, బడి, నివాసాల సమీపానికి మద్యం షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లు రానున్నాయి. యథేచ్ఛగా మద్యం విక్రయించనున్నారు. బెల్ట్ షాపులు మాత్రం ఇళ్లకు దూరంగా.. రహదారులకు దగ్గరగా చేరనున్నాయి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం జూలై ఒకటో తేదీ నుంచి జాతీయ, రాష్ట్ర రహదారులకు 500మీటర్ల దూరంలో మద్యం, బార్ అండ్ రెస్టారెంట్లను ఏర్పాటు చేయాల్సి ఉండటమే ఇందుకు కారణం. రహదారులకు దూరంగా బార్లు, మద్యం షాపులు పెడితే వ్యాపారం తగ్గిపోతుందని భావించిన వ్యాపారులు... కొత్త పాలసీ ప్రకారం షాపులు, బార్లు ఏర్పాటు చేస్తూనే, పాత వాటిని బెల్ట్ షాపులుగా కొనసాగించాలని పథకం రచించినట్లు విశ్వసనీయ సమాచారం. ఒక్కరోజే గడువు ... సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మద్యం, బార్ అండ్ రెస్టారెంట్లను రహదారులకు దూరంగా మార్చేందుకు ఒక్క రోజే సమయం ఉంది. ఈ క్రమంలో మూడు నెలలు గడువు ఇవ్వాలని మద్యం వ్యాపారులు హైకోర్టును ఆశ్రయించారు. అదే సమయంలో నూతన ఎక్సైజ్ పాలసీ–2017 ప్రకారం రెన్యూవల్ కోసం దరఖాస్తు కూడా చేయలేదు. అయితే, వ్యాపారుల అప్పీలును హైకోర్టు గురువారం ఉదయం తిరస్కరించింది. మరోవైపు నూతన ఎక్సైజ్ పాలసీ–2017 ప్రకారం రెన్యూవల్, కొత్త వాటికి లైసెన్స్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు కూడా గురువారం సాయంత్రం 5 గంటలకు వరకు మాత్రమే గడువు ఉంది. దీంతో బార్ అండ్ రెస్టారెంట్ యజమానులు హడావుడిగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. మచిలీపట్నం ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలో 25, విజయవాడ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలో 126 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. వీటన్నింటికి రెన్యూవల్, లైసెన్స్ల కోసం దరఖాస్తులు రావడంతో వాటి పరిశీలనను మచిలీపట్నం, విజయవాడ ఎక్సైజ్ ఈఎస్లు పూర్తి చేశారు. వ్యూహాత్మకంగా... జాతీయ, రాష్ట్ర రహదారులకు ఇరువైపులా 500 మీటర్ల దూరంలో మద్యం షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లను ఏర్పాటు చేయాల్సి రావడంతో ఆ పనిలో వ్యాపారులు బిజీగా ఉన్నారు. విజయవాడలో అత్యధికంగా బార్ అండ్ రెస్టారెంట్లు ఉండటంతో వీటిని ఎక్కడకు తరలించాలి, ఎక్కడ మద్యం విక్రయాలు చేయాలి.. అనే అంశాలపై మల్లగుల్లాలు పడుతున్నారు. బార్ అండ్ రెస్టారెంట్లకు పెద్ద భవనం కావాల్సి ఉండటంతో సమస్యలు తలెత్తుతున్నాయి. గృహాల మధ్యలో మద్యం దుకాణాలా... నూతన నిబంధనల ప్రకారం జిల్లాలోని 343 మద్యం దుకాణాల్లో అధిక శాతం ఇళ్ల మధ్యనే ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. విజయవాడ ఈఎస్ పరిధిలో 168, మచిలీపట్నం ఈఎస్ పరిధిలో 175 షాపులు ఉన్నాయి. వీటిని గృహాల మధ్య ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తుండటంతో ఎక్సైజ్ అధికారులకు స్థానిక ప్రజల నుంచి ఫిర్యాదు వస్తున్నాయి. మొవ్వ మండలం పెదపూడి గ్రామంలో ఇళ్లు, అంగన్వాడీ, రామాలయం దగ్గరలో మద్యం దుకాణం ఏర్పాటు చేస్తున్నారని మచిలీపట్నం ఎక్సైజ్ ఈఎస్కు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ప్రజలు ఫిర్యా దు చేస్తే ఇళ్ల మధ్య మద్యం దుకా ణాలను తొలగిస్తామని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. -
మందుబాబులకు పోలీసుల సూపర్ ఆఫర్
కోల్కతా(పశ్చిమబెంగాల్): బార్లలో అతిగా మద్యం తాగేవారిని సురక్షితంగా ఇంటికి చేర్చేందుకు కోల్కతా పోలీసులు సరికొత్త ఆలోచన చేశారు. బార్లలో తాగిపడిపోయిన వారిని ఇంటికి చేర్చేందుకు అదనంగా వాహన డ్రైవర్లను అందుబాటులో ఉంచుకోవాలని కోల్కతా పోలీసులు ప్రముఖ బార్ల యజమానులకు ఆదేశాలు జారీ చేశారు. నగరంలో అర్థరాత్రి దాకా పనిచేసేందుకు అనుమతివ్వాలని దాదాపు 30 వరకు ఉన్న బార్లు, క్లబ్బులు, రెస్టారెంట్ల యజమానులు దరఖాస్తు చేసుకోవటంతో శనివారం వారితో పోలీసు అధికారులు సమావేశమై ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. బార్ల నిర్వాహకులు బ్రీత్ ఎనలైజర్లను కూడా దగ్గర ఉంచుకోవాలని సూచించారు. ఇంతేకాకుండా, బార్ల వద్ద మందుబాబులను తరలించేందుకు వాహనాలను సిద్ధంగా ఉంచాలని.. ఇందుకోసం ఓలా, ఉబర్ వంటి క్యాబ్ సంస్థలతో అవగాహన కుదుర్చుకోవాలని సూచించారు. ఈ ఉత్తర్వులను 15 రోజుల్లోగా అమలు చేయాలని, అలా చేయని బార్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కోల్కతా నగర పరిధిలో ఈ ఉత్తర్వులను ముందుగా అమలు చేసి, క్రమంగా మిగతా ప్రాంతాల్లోనూ అమలయ్యేలా చూస్తామని అదనపు పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్ వెల్లడించారు. -
బీర్ అయితనే బాగుంటది!
రాష్ట్రంలో భారీగా పెరిగిన వినియోగం - మండుటెండల్లో నచ్చిన బీర్తో మందుబాబుల మజా - ఒక్క ఏప్రిల్లోనే 40 లక్షల కేసుల బీర్లు అమ్మకం - దక్షిణాదిన ఉత్పత్తి, అమ్మకాల్లో తెలంగాణ టాప్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బీర్లు పొంగి పొర్లుతున్నాయి. ఒకవైపు మండుటెండలు ఠారెత్తిస్తుండటం.. మరోవైపు 40 డిగ్రీలు దాటుతున్న ఉష్ణోగ్రతలతో పెరుగుతున్న ఉక్కపోతతో మందుబాబులు రూటు మార్చా రు. వేసవి తాపాన్ని చల్లార్చుకునేందుకు బీరు బాట పట్టారు. నచ్చిన బీర్లతో మజా చేస్తున్నారు. ఈ పరిణామాలతో రాష్ట్రంలో బీర్ల వినియోగం అనూహ్యంగా పెరిగింది. బీర్ల ఉత్పత్తి, అమ్మకాల్లో దక్షిణాదిలోనే తెలం గాణ అగ్రస్థానంలో నిలిచింది. ఏప్రిల్ నెల లోనే రాష్ట్రవ్యాప్తంగా 40 లక్షల కేసుల బీర్లు అమ్ముడవడం గమనార్హం. ఒక్కో కేసుకు 12 సీసాల చొప్పున మొత్తంగా 4.80 కోట్ల సీసాల బీరును మందుబాబులు గుటకాయస్వాహా చేసేశారు. దక్షిణాదిలో తెలంగాణ నంబర్ వన్.. బీర్ల ఉత్పత్తి, వినియోగంలో తెలంగాణ దక్షి ణాదిలో నంబర్వన్గా నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా 2,200 మద్యం దుకాణాలు, 1,300 వరకు ఉన్న బార్లలో బీర్ల అమ్మకాలు ఉప్పొంగాయి. ఏప్రిల్ అమ్మకాల్లో 9.11 శాతం వృద్ధిరేటుతో తెలంగాణ అగ్రభాగాన నిలిచింది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ రెండోస్థానాన్ని దక్కించుకుంది. తమిళనాడు, కర్ణాటక మూడు, నాలుగు స్థానాలను దక్కిం చుకున్నాయి. కేరళ ఐదో స్థానంలో నిలిచింది. ఏప్రిల్లో ఆయా రాష్ట్రాల్లో బీర్ల అమ్మకాల్లో వృద్ధి, మందుబాబుల తలసరి బీరు వినియోగం ఇలా ఉంది. ఉత్పత్తిలోనూ అగ్రభాగమే.. బీర్ల ఉత్పత్తిలోనూ తెలంగాణ దక్షిణాదిలో అగ్రభాగాన నిలిచింది. రాష్ట్రంలోని ఐదు బీర్ల ఉత్పత్తి సంస్థలు(బ్రూవరీస్) 17 రకాల పేర్లతో బీర్లను తయారు చేస్తున్నాయి. రాష్ట్రంలో నెలవారీగా సగటున 25–30 లక్షల కేసుల బీరు అమ్ముడవుతుంది. ఏప్రిల్లో మండుటెండలకు అదికాస్తా.. 40 లక్షల కేసులకు చేరింది. రాష్ట్ర అవసరాలకు సరిపడా బీర్లను ఉత్పత్తి చేయడంతోపాటు.. మరో 15 లక్షల కేసుల బీర్లను కేరళ, కర్ణాటక, ఏపీలకు ఎగుమతి చేస్తుండడం విశేషం. సాధారణ రోజుల్లో రాష్ట్రంలో మద్యం అమ్మకాలు 65 శాతం.. బీర్ల అమ్మకాలు 35 శాతం ఉంటాయి. కానీ మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో మద్యం అమ్మకాలు.. బీర్ల అమ్మకాలు 50 శాతం ఉన్నట్లు ఆబ్కారీ శాఖ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఏటేటా ఛీర్స్లో వృద్ధి.. మద్యం అమ్మకాల్లో రాష్ట్రంలో ఏటా పెరుగుదల నమోదవుతోంది. ఐదేళ్లుగా రాష్ట్రంలో కేసులకొద్దీ బీర్లు, మద్యాన్ని మందుబాబులు స్వాహా చేస్తున్నట్లు ఆబ్కారీ శాఖ తాజా నివేదిక వెల్లడించింది. గతేడాది సుమారు రూ.12,706 కోట్ల విలువైన మద్యం, బీర్లను తాగేశారు. ఏటా వెయ్యి నుంచి రూ.2 వేల కోట్ల మేర అమ్మకాల్లో పెరుగుదల నమోదవుతోంది. క్షణాల్లో బీ(రు)రెడీ.. ఇక బీర్ల వినియోగంలో గ్రేటర్ హైదరా బాద్ రాష్ట్రంలోనే తొలిస్థానంలో నిలిచింది. దేశ, విదేశాలకు చెందిన బీర్లతోపాటు మన కళ్లముందే క్షణాల్లో తయారుచేసి ఫ్రెష్గా ముందుంచే పలు బార్లు, పబ్లు, రెస్టారెంట్లు నగరంలో కొలువుదీరాయి. హైటెక్సిటీ, బంజారాల్స్, మాదాపూర్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ఇవి అత్యధికంగా ఉండడం విశేషం. ఇటీవలికాలంలో 11 మినీ బ్రూవరీస్ సైతం సిటీలో ఏర్పాట య్యాయి. ఇక్కడ అమెరికా, మెక్సికో, ఇటలీ, ఫ్రాన్స్, బ్రిటన్ తదితర దేశాలకు చెందిన పలు బీర్ల వెరైటీలు లభ్యమవు తున్నాయి. రేంజ్ను బట్టి వీటి ధర రూ.500 నుంచి రూ.2 వేల వరకు ఉంది. -
తలుపులు బార్లా!
⇒మహానగరంలో ‘మద్య’భారతం ⇒రాత్రీ పగలు మందుబాబుల స్వైర విహారం ⇒వేళలు పాటించని వైన్ షాపులు, బార్లు ⇒అధిక ధరలతో అర్ధరాత్రీ అమ్మకాలు ⇒అవినీతి మత్తులో ఎక్సైజ్ శాఖ మహానగరంలో మందుబాబుల ఆగడాలు మితిమీరుతున్నాయి. రాత్రీ పగలూ.. రహదారుల వెంట..వీధులు..కాలనీలు..నడిరోడ్లపై.. ఎక్కడ పడితే అక్కడ మద్యం తాగుతూ న్యూసెన్స్ సృష్టిస్తున్నారు. దీంతో ఆయా ప్రాంతాల గుండా వెళ్లాలంటేనే మహిళలు, వృద్ధులు, చిన్నారులు హడలిపోతున్నారు. కాసుల కక్కుర్తితో వేళలు పాటించకుండా బార్లు, వైన్ షాపుల్లో ఎప్పుడు పడితే అప్పుడు మద్యం విక్రయిస్తున్నారు. అవినీతికి మరిగిన ఎక్సైజ్ శాఖ వీటిని పట్టించుకోక పోవడంతో మద్యం విక్రేతలు అధిక ధరలకూ విక్రయిస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు. ఉదయం 9 గంటల నుంచి అర్ధరాత్రి వరకూ వివిధ రేట్లలో మద్యం విక్రయాలు జరుపుతున్నారు. మహానగరవ్యాప్తంగా అసాంఘిక శక్తులు, మందుబాబుల ఆగడాలకు నిలయంగా మారిన మద్యం దుకాణాలు, బార్ల వద్ద పరిస్థితిని గురువారం రాత్రి, శుక్రవారం ‘సాక్షి’ బృందం విస్తృతంగా పరిశీలించింది. ఆయా ప్రాంతాల్లో పరిస్థితులపై.. లైవ్ రిపోర్ట్... నగరంలో చాలా చోట్ల మద్యం షాపులు, బార్ల వద్ద బహిరంగంగానే మద్యం తాగుతూ మందుబాబులు రెచ్చిపోతున్నారు. దీంతో ఆ దారుల గుండా వెళ్లాలంటేనే జనం జంకుతున్నారు. నిబంధనలను తుంగలో తొక్కుతూ మద్యం షాపులు, బార్లను అర్ధరాత్రి వరకు తెరిచి ఉంచుతున్నారు. కొందరు దొడ్డిదారిలో యథేచ్ఛగా మద్యం విక్రయిస్తూ అధికరేట్లు వసూలు చేస్తున్నారు. మద్యం షాపుల వద్ద పరిస్థితిపై సాక్షి లైవ్ రిపోర్టు ఇదీ... సాక్షి, సిటీబ్యూరో: రూట్ 1 ప్రాంతాలు: దిల్సుఖ్నగర్, చైతన్యపురి, ఎల్బీనగర్, వనస్థలిపురం, హస్తినాపురం, బీఎన్రెడ్డి నగర్ లైవ్రిపోర్ట్ నిబంధనలకు విరుద్ధంగా భారీ విస్తీర్ణంలో పర్మిట్రూంలు ఉన్నాయి. రాత్రి 9.30 తరువాత తలుపులు మూసి లైట్లు ఆర్పి.. అర్ధరాత్రి 12 వరకు మద్యం సరఫరా అవుతోంది. రాత్రి 10 తరవాత కూడా వనస్థలిపురం ప్రధాన రహదారిపై ఉన్న ఓ వైన్స్ సమీపంలో రోడ్డుపక్క నిలబడి మందుబాబులు బీర్లు తాగుతూ కనిపించారు. రూట్ 2 ఏరియా: మాదాపూర్ ప్రాంతాలు: మాదాపూర్ పరిసరాలు లైవ్రిపోర్ట్: ఐటీసంస్థలకు నిలయంగా మారిన ఈ ప్రాంతంలో మద్యం దుకాణాలు వేళాపాళా లేకుండా కొనసాగుతున్నాయి. మహిళా ఉద్యోగులు రాకపోకలు సాగించే ఈ మార్గంలో రోడ్డుపైనే మందుబాబుల ఆగడాలు కనిపించాయి. మాదాపూర్ అయ్యప్ప సొసైటీ వంద అడుగుల రోడ్డులోని మద్యం దుకాణం ముందు వాహనాలు ఆపి బహిరంగంగా మద్యం సేవిస్తున్నారు. మద్యం మత్తులో పాదచారుల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారని స్థానికులు చెప్పారు. కొన్ని ప్రైవేట్ ట్రావెల్స్కు చెందిన బస్సు డ్రైవర్లు బస్సుల్ని ఆపి మరీ మద్యం కొనుగోలు చేస్తున్న దృశ్యాలు కనిపించాయి. రూట్ 3 ఏరియా: మారేడ్పల్లి లైవ్రిపోర్ట్: మారేడుపల్లిలో ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న ఓ మద్యం దుకాణం వద్ద ప్రజలు బహిరంగంగా మద్యం సేవిస్తూ కనిపించారు. వైన్షాపు సిబ్బంది కానీ, స్థానిక పోలీసులు కానీ చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. మందుబాబుల ఆగడాలతో పాదచారులు ఇబ్బందులు పడుతూ రాకపోకలు సాగించడం కనిపించింది. కొన్ని చోట్ల మద్యం షాపులు, బార్లు వేళాపాళా లేకుండా తెరవడం, మూయడం కన్పించింది. కనీస వేళలను ఎవరూ పట్టించుకోవడం లేదు. రూట్ 4 లైవ్రిపోర్ట్: రాత్రి 10 గంటలు దాటినా మద్యం దుకాణాల వద్ద హడావిడి కనిపించింది. పర్మిట్ రూమ్లు నిబంధనలకు విరుద్ధంగా విశాలంగా నిర్మించారు. రూట్ 5 ఏరియా: పాతబస్తీ ప్రాంతాలు: లాల్దర్వాజా, ఛత్రినాక, ఉప్పుగూడ, శంషీర్గంజ్, చాంద్రాయణగుట్ట, ఫలక్నుమా, ఫిసల్బండ లైవ్రిపోర్ట్: లాల్దర్వాజా మోడ్ ప్రాంతంలోని ఓ వైన్స్ వద్ద న్యూసెన్స్ ఉంటుండడంతో అక్కడే బస్టాప్లో ఉంటున్న ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఛత్రినాక చౌరస్తాలోని ఓ వైన్స్ ముందు మందుబాబులు తిష్ట వేస్తుండడంతో పక్కన ఉన్న గల్లీలోకి స్థానికులు వెళ్లలేని దుస్థితి. ఉప్పుగూడలోని ఓ వైన్స్ ముందు కూడా పార్కింగ్ సమస్య కారణంగా వాహనదారులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. శంషీర్గంజ్లోని ఓ వైన్స్, నాగులబండలోని వైన్స్ల వద్ద పర్మిట్ రూమ్ 10 బై 10 కాకుండా అతి పెద్ద విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. చాంద్రాయణగుట్టలోని పరిధిలోని రెండు మద్యం దుకాణాలు ఉదయం 10 గంటల కన్నామముందే తెరచుకుంటున్నాయి. కొన్ని బార్లు అర్ధరాత్రి అనంతరం కూడా అమ్మకాలు కొనసాగించాయి. ►గ్రేటర్ పరిధిలో మద్యం దుకాణాలు: 400 ►బార్లు: 540 -
బార్లు ఆ పరిధిలోకి రావు: ఏజీ
సాక్షి, హైదరాబాద్: జాతీయ రహదారులకు 500 మీటర్ల లోపు ఉన్న మద్యం షాపులన్నిం టినీ మూసేయాలంటూ సుప్రీంకోర్టు ఇటీ వల ఇచ్చిన తీర్పుపై ఆందోళన చెందుతున్న బార్ అండ్ రెస్టారెంట్ల యాజమానులకు అటార్నీ జనరల్ (ఏజీ) ముకుల్ రోహత్గీ తీపి కబురు చెప్పారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు జాతీయ రహదారుల వెంట 500 మీటర్ల లోపు ఉన్న బార్ అండ్ రెస్టారెంట్లకు వర్తించదని, కేవలం మద్యం దుకాణాలకే వర్తిస్తుందని స్పష్టం చేశారు. సుప్రీం తీర్పు నేపథ్యంలో జాతీయ రహదారుల వెంట ఉన్న మద్యం దుకాణాలను ఈ నెలాఖరు కల్లా మూసివేయాలి. ఈ తీర్పు వల్ల తమకు ఆదాయపరంగా భారీ నష్టం కలుగుతుం దని, బార్ అండ్ రెస్టారెంట్ల విషయంలో తమకు కొంత స్పష్టతనివ్వాలంటూ కేరళ ప్రభుత్వం ఇటీవల ఏజీ అభిప్రాయాన్ని కోరింది. దీంతో బుధవారం ఆయన ఈ మేరకు కేరళ ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా తన అభిప్రాయాన్ని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పులో ఎక్కడా బార్ అండ్ రెస్టారెంట్ల గురించి చెప్పలేదని, మద్యం దుకాణాల మూసివేత గురించే చెప్పిందని వివరించారు. మద్యం దుకాణాలకు, బార్ అండ్ రెస్టారెంట్లకు వ్యత్యాసం ఉందన్న ఆయన, తీర్పు పరిధిలోకి బార్ అండ్ రెస్టారెంట్లు రావని స్పష్టం చేశారు. ఈ అభిప్రాయాన్ని దేశంలోని మిగిలిన రాష్ట్రాలు కూడా వర్తింపజేసుకోవచ్చు. -
ఏప్రిల్ లో కొత్త మద్యం విధానం
మహానంది: ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఏపీలో కొత్త మద్యం విధానం అమల్లోకి రానుందని ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఆయన కుటుంబసభ్యులతో కలసి మహానంది క్షేత్రానికి చేరుకున్నారు. దర్శనానంతరం విలేకరులతో మాట్లాడారు. మద్యాన్ని అధిక ధరలకు విక్రయించినందుకు ప్రస్తుతం ఉన్న రూ. లక్ష జరిమానాను రూ. 5 లక్షలకు పెంచినట్లు తెలిపారు. హోలోగ్రాఫిక్ లేబుళ్లతో పాటు ట్రాక్ అండ్ ట్రేస్, బిల్లింగ్ స్కానింగ్ వంటి ఆధునాతన విధానాలను బార్లు, రెస్టారెంట్లు, వైన్స్లో అమల్లోకి తేనున్నట్లు వెల్లడించారు. -
‘గ్రేటర్’లో బార్లకు గేట్లు బార్లా!
- తాజాగా 88 కొత్త బార్లకు నోటిఫికేషన్ విడుదల - ఈనెల 18 వరకు దరఖాస్తుల జారీ - డిసెంబర్ 8 నుంచి 20 వరకు లెసైన్సుల జారీ సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్లో కొత్త బార్లకు గేట్లు బార్లా తెరుచుకున్నారుు. నూతన ఆబ్కారీ పాలసీ ప్రకారం.. 11 వేల జనాభాకు ఒకటి చొప్పున మహానగరంలో సుమారు 659 బార్లు ఏర్పాటు చేయవచ్చని సర్కారు నిర్ణరుుంచింది. ఈ నేపథ్యంలో నూతనంగా 88 బార్లకు తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. వీటి ఏర్పాటుకు సంబంధించి ఈనెల 10 నుంచి దరఖాస్తుల విక్రయం ప్రారంభమైందని.. 18 వరకు ఒక్కోటి రూ. 50 వేల చొప్పున విక్రరుుంచనున్నట్లు నగర ఎకై ్సజ్ విభాగం డిప్యూటీ కమిషనర్ వివేకానందరెడ్డి తెలిపారు. ఈనెలాఖరు వరకు మూల్యంకన ప్రక్రియ పూర్తిచేసి డిసెంబర్ 8 తరువాత కొత్త లెసైన్సులు జారీ చేస్తామన్నారు. నూతన బార్లకు లెసైన్సు ఫీజు ఏడాదికి రూ.40 లక్షలు ఉంటుందని తెలిపారు. ఇప్పటికే రెస్టారెంట్ ఉండి.. అవసరమైన స్థలం అందుబాటులో ఉన్నవారు, ట్రేడ్ లెసైన్సు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. కాగా తాజాగా ప్రభుత్వం కొత్త బార్లకు నోటిఫికేషన్ జారీ చేయడం పట్ల మహిళా, ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నారుు. పదకొండు వేలకు ఒకటి చొప్పున... మహానగరం పరిధిలో 2011 జనాభా లెక్కల ప్రకారం 72.44 లక్షల జనాభా ఉండగా.. ఇందులో 11 వేలకు ఒకటి చొప్పున బార్లుండాలని ప్రభుత్వం నూతన ఆబ్కారీ పాలసీలో పేర్కొంది. ఈలెక్కన 659 బార్ల ఏర్పాటుకు అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న 571 బార్లకు అదనంగా మరో 88 బార్ల ఏర్పాటుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 145 బార్లకు నోటిఫికేషన్ ఇవ్వగా.. అందులో సగానికి పైగా గ్రేటర్లోనే ఉండడం గమనార్హం. మినీ బ్రేవరేజెస్కు స్పందన అంతంతే...! మందుబాబులకు క్షణాల్లో తాజా బీరును అందించేందుకు గ్రేటర్ పరిధిలో 20 మినీ బ్రేవరేజెస్కు ఆబ్కారీ శాఖ అనుమతిం చినప్పటికీ నగరంలో మూడు చోట్ల మాత్రమే అవి తెరచుకున్నట్లు ఎకై ్సజ్శాఖ వర్గాలు తెలిపారుు. వీటి ఏర్పాటుకు రూ.6 లక్షలు లెసైన్సు ఫీజు అరుునప్పటికీ ఉత్పత్తిపై విధిం చే అప్ఫ్రంట్ ట్యాక్స్ అధికంగా ఉండడం, వీటి ఏర్పాటుకు వినియోగించే యంత్ర పరిక రాల ఖరీదు రూ.7 కోట్ల వరకు ఉండడంతో నిర్వాహకులు ముందుకురావడం లేదన్నారు. నోట్ల ఎఫెక్ట్.. తగ్గిన మద్యం అమ్మకాలు... రూ.500, రూ.వెరుు్య నోట్ల రద్దుతో నగరంలోని మద్యం దుకాణాలు, బార్లకు గడిచిన నాలుగు రోజులుగా గిరాకీ 50 శాతం మేర తగ్గినట్లు వ్యాపారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. చేసేదిలేక పలు బార్లు, మద్యం దుకాణాల్లో క్రెడిట్, డెబిట్ కార్డుల వినియోగంతో సైతం మద్యం సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. కాగా కార్మికులు, కూలీలు అధికంగా కొనుగోలు చేసే చీప్లిక్కర్ అమ్మకాలు భారీగా పడిపోరుునట్లు వాపోయారు. కొత్త బార్లకు అనుమతులిలా... గ్రేటర్లో ప్రస్తుతం ఉన్న బార్ల సంఖ్య: 571 నూతనంగా ఏర్పాటు కానున్న బార్లు: 88 కొత్త బార్లకు దరఖాస్తుల గడువు: నవంబర్ 10 నుంచి 18 వరకు దరఖాస్తుల మూల్యంకనం: నవంబర్ 19 నుంచి 24 వరకు దరఖాస్తుల తిరస్కరణ, ఆమోదం: నవంబర్ 28 పోటీ అధికంగా ఉండే బార్లకు డ్రా తీసే తేదీ: డిసెంబర్ 5 నూతన బార్లకు లెసైన్సుల మంజూరు: డిసెంబర్ 8 నుంచి 20 వరకు లెసైన్సు ఫీజు: ఏడాదికి రూ.40 లక్షలు దరఖాస్తు ఫీజు: రూ.50 వేలు -
బార్లపై పోలీసుల దాడి.. 50 మంది అరెస్ట్
వరంగల్: నగరంలో నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న బార్ అండ్ రెస్టారెంట్లపై పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించారు. ఉదయం 5 గంటలకే బార్లను తెరిచి నడిపిస్తున్న యజమానులపై కేసు నమోదు చేశారు. బార్లలో ఉన్న 50 మంది మద్యంప్రియులను, బార్ల యజమానులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 100పైగా మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. -
మద్యం కల్తీ.. వ్యాపారుల కక్కుర్తి
ప్రొద్దుటూరు క్రైం: కడప, ప్రొద్దుటూరు, రాజంపేట, రాయచోటి తదితర ప్రాంతాలలో గతంలో కల్తీ మద్యం కేసులు నమోదు అయ్యాయి. జిల్లాలోని కడప, ప్రొద్దుటూరు ఎక్సైజ్ డివిజన్ల పరిధిలో 214 మద్యం షాపులు, 18 బార్లు ఉన్నాయి. ప్రొద్దుటూరు పరిధిలో 8 బార్లు, 112 మద్యం దుకాణాలు ఉండగా, కడప ఈఎస్ పరిధిలో 10 బార్లు, 102 వైన్ షాపులు ఉన్నాయి. కల్తీ ఘటనలు ఎన్నెన్నో.. ప్రొద్దుటూరులో ఈఎస్ కార్యాలయంతో పాటు ఎక్సైజ్ పోలీస్స్టేషన్ ఉంది. కల్తీ మద్యం, సారా, అక్రమ మద్యాన్ని నియంత్రించడానికి డీటీఎఫ్ స్క్వాడ్ ఉంది. అయినప్పటికీ ఇక్కడి కొన్ని దుకాణాలు, బార్లల్లో మద్యం కల్తీ జరుగుతున్నట్లు మద్యం ప్రియులు వాపోతున్నారు. మూడు రోజుల క్రితం రెడ్డిబార్లో కల్తీ జరుగుతోందని సమాచారం రావడంతో విజయవాడకు చెందిన ఎస్టì ఎఫ్ అధికారులు దాడులు చేశారు. నీళ్లు కలిపిన 68 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. గతంలో కూడా ఇదే బార్పై ఎస్టిఎఫ్ అధికారులు దాడులు చేసి కేసు నమోదు చేశారు. ఆ సమయంలో అధికారులు, బార్లో పని చేస్తున్న సిబ్బంది మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా అధికారుల వాహనాలు కూడా ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనపై టూ టౌన్ పోలీస్స్టేషన్లో కేసు కూడా నమోదైంది. రామేశ్వరం రోడ్డులో మద్యం కల్తీ చేస్తుండగా అప్పటి ఎక్సైజ్ సూపరింటెండెంట్ శంభూప్రసాద్ స్వయంగా దాడి చేసి పెద్ద ఎత్తున కల్తీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అప్పట్లో గాంధీరోడ్డు, రామేశ్వరం రోడ్డు, మైదుకూరు రోడ్డులలో ఉన్న మద్యం షాపులపై కేసులు నమోదు కాగా, రూ. 1 లక్ష జరిమానాతో పాటు వారం–పది రోజుల పాటు దుకాణాలు కూడా మూత పడ్డాయి. అధికారుల చర్యలు శూన్యం.. స్థానికంగానే అధికారులందరూ ఉన్నప్పటికీ కల్తీ మద్యాన్ని నియంత్రించడం లేదనే విమర్శలు జోరుగా విమర్శలు వినిపిస్తున్నాయి. ఎక్సైజ్ పోలీసులతో పాటు డీటీఎఫ్ స్క్వాడ్ అధికారులు ప్రతి రోజూ మద్యం షాపులపై నిఘా పెట్టాల్సి ఉంది. కొన్ని మద్యం సీసాలను తీసుకొని వాటిని పరీక్షలు కూడా చేస్తుండాలి. అయితే వ్యాపారులతో ఉన్న మామూళ్ల సంబంధం కారణంగా ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేయడంలేదనే విమర్శలు వినిస్తున్నాయి. ఎక్కువగా సామాన్యులు సేవించే 180 ఎంఎల్ చీఫ్ లిక్కర్ కల్తీ జరుగుతున్నట్లు సమాచారం. తనిఖీలు చేస్తున్నాం.. బార్లు, మద్యం షాపుల్లో నిత్యం తనిఖీలు చేస్తున్నాం. రెండు, మూడు రోజులకు ఒక సారి ప్రతి షాపులోనూ షాంపిల్స్ తీస్తున్నాం. నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారాలు చేస్తే ఎవ్వరినీ ఉపేక్షించేది లేదు. కేసులు నమోదు చేసి, అవసరమైతే దుకాణాలను సీజ్ చేస్తాం. – ఫణీంద్ర, ఎక్సైజ్ సీఐ, ప్రొద్దుటూరు. -
41 మద్యం దుకాణాలు సిద్దిపేటకు బదిలీ
కరీంనగర్ క్రై: జిల్లా మద్యం డిపో పరిధిలో ఉన్న 41 మద్యం దుకాణాలు, 5 బార్లను మెదక్ జిల్లా సిద్దిపేటలో కొత్తగా ప్రారంభంకానున్న మద్యం డిపోకు బదిలీచేస్తూ బుధవారం రాత్రి ఎకైసజ్శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గంభీరావుపేట మండలం పరిధిలోని 9 దుకాణాలు, సిరిసిల్ల ఎకై ్సజ్ పోలీస్స్టేషన్ పరిధిలోని 15 మద్యం దుకాణాలు, 3 బార్లు, వేములవాడ ఎకై ్సజ్ ఠాణా పరిధిలోని 17 మద్యం దుకాణాలు, 2 బార్లను బదిలీ చేశారు. ఆగస్టు 1 నుంచి వీటికి సిద్దిపేట డిపో నుంచి మద్యం సరఫరా చేస్తారు. ఈ మేరకు జగిత్యాల ఎకై ్సజ్ సూపరింటెండెంట్కు ఉత్తర్వులు పంపించారు. దీంతో ఆయా మద్యం దుకాణాలు, బార్లకు ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ఉత్తర్వులు జారీ చేశారు. -
21 ఏళ్లలోపు వారికి మద్యం అమ్మితే కేసులే!
రాష్ట్రంలోని అన్ని బార్లు, మద్యం దుకాణాలకు ఆబ్కారీ శాఖ హెచ్చరిక సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లోని బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 1లో ఈనెల 1న కొందరు ఇంజనీరింగ్ విద్యార్థులు మద్యం సేవించి కారు నడపటం వల్ల జరిగిన ప్రమాదంలో ఓ చిన్నారి, మరో వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో ఆబ్కారీ శాఖ మేల్కొంది. 21 సంవత్సరాల వయస్సు లోపు వారికి మద్యం విక్రయించకూడదన్న నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని నిర్ణయించింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు హాపీ అవర్స్ పేరుతో మద్యం, బీర్లపై ఆఫర్లు ఇచ్చే బార్లు, ఈవెంట్ నిర్వాహకులకు ఆబ్కారీ చట్టం సెక్షన్ 3 కింద నోటీసులు పంపించింది. 21 ఏళ్లలోపు వారికి మద్యం విక్రయిస్తే కేసులు నమోదు చేయడంతోపాటు ఆయా బార్ల లెసైన్సులను రద్దు చేయాలని కూడా నిర్ణయించింది. బుధవారం ఈ మేరకు అధికారులతో సమావేశమైన ఎక్సైజ్ కమిషనర్ ఆర్.వి.చంద్రవదన్.. ఎక్సైజ్ చట్టంలో మార్పులు తీసుకురావాలని నిర్ణయించారు. సీనియర్ అధికారులతో కమిటీని ఏర్పాటు చేసి 21 ఏళ్లలోపు వయస్సు వారికి మద్యం విక్రయం, మద్యం సేవించి వాహనాలు నడపటం వంటి అంశాలను పునస్సమీక్షించాలని నిర్ణయించారు. అలాగే తమిళ నాడు, కర్ణాటక, కేరళల్లో ఉన్న నిబంధనలు, చట్టాలను అధ్యయనం చేయనున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రత్యేక నిఘా: మద్యం సేవించి వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్న కేసులు ఎక్కువగా జరుగుతుండటంపై ఎక్సైజ్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 522 బార్లు, పబ్బులపై తరచూ దాడులు జరపాలని నిర్ణయించారు. బార్లకు వచ్చే వారిపై అనుమానం వస్తే వయస్సు ధ్రువీక రించే పత్రాలను పరిశీలించిన తర్వాతే లోపలికి అనుమతి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. బుధవారం 61 బార్లలో తనిఖీలు జరిపారు. ప్రతి రోజు తనిఖీలు కొనసాగాలని ఆదేశిస్తూ.. బాధ్యతను ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి అప్పగించారు. 1968 ఎక్సైజ్ చట్టం సెక్షన్ 36 (ఎఫ్) ప్రకారం ఎక్సైజ్ అధికారులకు బ్రీత్ అనలైజర్లు అందించే అంశాన్ని సీరియస్గా పరిశీలించాలని ప్రతిపాదించారు. ప్రతి బార్, రెస్టారెంట్, పబ్బుల్లో సీసీటీవీలను తప్పనిసరిగా ఏర్పాటు చేయించడంతోపాటు పోలీస్ శాఖ తరహాలో సెంట్రల్ మానిటరింగ్ సిస్టం ఏర్పాటు చేసే అంశంపైనా సమీక్షించారు. 15వ తేదీ సాయంత్రం 3 గంటలకు బార్లు, పబ్బులు, హోటళ్లు, రిసార్టుల యజమానులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి, హెచ్చరికలు జారీ చేయనున్నారు. పోస్టర్లు విడుదల: 21 ఏళ్లలోపు వారికి మద్యం విక్రయించడం నేరమని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదన్న నినాదాలతో రూపొందించిన పోస్టర్లను ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ విడుదల చేశారు. ప్రతి మద్య విక్రయ కేంద్రం, బార్ల వద్ద వీటిని ఏర్పాటు చేయడంతో పాటు ప్రజల్లో అవగాహన పెంచేందుకు రేడియోలు, టీవీల ద్వారా ప్రచారం చేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. -
21 ఏళ్లలోపు వారికి మద్యం అమ్మితే కేసులే!
-
21 ఏళ్లలోపు వారికి మద్యం అమ్మితే కేసులే!
రాష్ట్రంలోని అన్ని బార్లు, మద్యం దుకాణాలకు ఆబ్కారీ శాఖ హెచ్చరిక సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్లోని బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 1లో ఈనెల 1న కొందరు ఇంజనీరింగ్ విద్యార్థులు మద్యం సేవించి కారు నడపటం వల్ల జరిగిన ప్రమాదంలో ఓ చిన్నారి, మరో వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో ఆబ్కారీ శాఖ మేల్కొంది. 21 సంవత్సరాల వయస్సు లోపు వారికి మద్యం విక్రయించకూడదన్న నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని నిర్ణయించింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు హాపీ అవర్స్ పేరుతో మద్యం, బీర్లపై ఆఫర్లు ఇచ్చే బార్లు, ఈవెంట్ నిర్వాహకులకు ఆబ్కారీ చట్టం సెక్షన్ 3 కింద నోటీసులు పంపించింది. 21 ఏళ్లలోపు వారికి మద్యం విక్రయిస్తే కేసులు నమోదు చేయడంతోపాటు ఆయా బార్ల లెసైన్సులను రద్దు చేయాలని కూడా నిర్ణయించింది. బుధవారం ఈ మేరకు అధికారులతో సమావేశమైన ఎక్సైజ్ కమిషనర్ ఆర్.వి.చంద్రవదన్.. ఎక్సైజ్ చట్టంలో మార్పులు తీసుకురావాలని నిర్ణయించారు. సీనియర్ అధికారులతో కమిటీని ఏర్పాటు చేసి 21 ఏళ్లలోపు వయస్సు వారికి మద్యం విక్రయం, మద్యం సేవించి వాహనాలు నడపటం వంటి అంశాలను పునస్సమీక్షించాలని నిర్ణయించారు. అలాగే తమిళ నాడు, కర్ణాటక, కేరళల్లో ఉన్న నిబంధనలు, చట్టాలను అధ్యయనం చేయనున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రత్యేక నిఘా : మద్యం సేవించి వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్న కేసులు ఎక్కువగా జరుగుతుండటంపై ఎక్సైజ్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 522 బార్లు, పబ్బులపై తరచూ దాడులు జరపాలని నిర్ణయించారు. బార్లకు వచ్చే వారిపై అనుమానం వస్తే వయస్సు ధ్రువీక రించే పత్రాలను పరిశీలించిన తర్వాతే లోపలికి అనుమతి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. బుధవారం 61 బార్లలో తనిఖీలు జరిపారు. ప్రతి రోజు తనిఖీలు కొనసాగాలని ఆదేశిస్తూ.. బాధ్యతను ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి అప్పగించారు. 1968 ఎక్సైజ్ చట్టం సెక్షన్ 36 (ఎఫ్) ప్రకారం ఎక్సైజ్ అధికారులకు బ్రీత్ అనలైజర్లు అందించే అంశాన్ని సీరియస్గా పరిశీలించాలని ప్రతిపాదించారు. ప్రతి బార్, రెస్టారెంట్, పబ్బుల్లో సీసీటీవీలను తప్పనిసరిగా ఏర్పాటు చేయించడంతోపాటు పోలీస్ శాఖ తరహాలో సెంట్రల్ మానిటరింగ్ సిస్టం ఏర్పాటు చేసే అంశంపైనా సమీక్షించారు. 15వ తేదీ సాయంత్రం 3 గంటలకు బార్లు, పబ్బులు, హోటళ్లు, రిసార్టుల యజమానులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి, హెచ్చరికలు జారీ చేయనున్నారు. పోస్టర్లు విడుదల: 21 ఏళ్లలోపు వారికి మద్యం విక్రయించడం నేరమని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదన్న నినాదాలతో రూపొందించిన పోస్టర్లను ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ విడుదల చేశారు. ప్రతి మద్య విక్రయ కేంద్రం, బార్ల వద్ద వీటిని ఏర్పాటు చేయడంతో పాటు ప్రజల్లో అవగాహన పెంచేందుకు రేడియోలు, టీవీల ద్వారా ప్రచారం చేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. -
హుక్కా.. లేదు లెక్క!
బార్లను మించిపోతున్న ‘సెంటర్లు’ మైనర్లపైనే గురి నిబంధనలు గాలికొదిలి ‘పొగాకు, గంజాయి సరఫరా? సరైన ‘సెక్షన్లు’ లేకపోవడంతో పోలీసులకు తలనొప్పులు సిటీబ్యూరో: నగరంలోని హుక్కా సెంటర్లు బార్లు, పబ్బులను మించిపోతున్నాయి. వినోదం ముసుగులో అనుమతులు తీసుకుంటున్న ఈ సెంటర్లు మాయమాటలతో యువతకు వల వేస్తూ వారి జీవితాలను నిర్వీర్యం చేస్తున్నాయి. ఇక్కడ వివిధ ఫ్లేవర్ల పేరుతో పొగాకు, గంజాయి తదితరాలను వినియోగిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. వీటన్నింటికీ మించి ఈ సెంటర్లలోకి మైనర్లను విచ్చలవిడిగా అనుమతిస్తున్నారు. వీటిని పరిగణలోకి తీసుకున్న పశ్చిమ మండల పోలీసులు శనివారం అర్దరాత్రి వరుసదాడులు చేశారు. కమిషనరేట్ పరిధిలో హుక్కా సెంటర్లు వందల సంఖ్యలో ఉన్నట్లు అంచనా. బిలియడ్స్ తరహా ఆటలు నిర్వహిస్తామంటూ రిక్రియేషన్ సెంటర్ల పేరుతో అనుమతులు తీసుకుంటున్న ఈ కేంద్రాలు నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయి. కేవలం యాపిల్, మింట్, పాన్ మసాలా, చాకో, బెర్రీస్ ఇలాం టి రకాలైన ఫ్లేర్లను మాత్రమే హుక్కాల్లో వినియోగిస్తామంటున్న నిర్వాహకులు వినియోగదారులు అవసరా న్ని బట్టి ‘మెనూ’ మారుస్తున్నారు. పొగాకుతో పాటు గంజాయి, మాదకద్రవ్యాలు సైతం సరఫరా చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. నిబంధనలను సైతం తుంగలో తొక్కి మైనర్లు, యువతులను అనుమతిస్తూ వారినీ బానిసలుగా మారుస్తున్నారు. ఈ మత్తుకు అలవాటు పడినయువత రెగ్యులర్ కస్టమర్లుగా మారిపోతున్నారు. బానిసల్లో మైనర్లే ఎక్కువ ... చట్ట ప్రకారం హుక్కా పీల్చడం తప్పుకాదనే విషయాన్ని అడ్డం పెట్టుకుని నగరంలోని హుక్కా సెంటర్లు చేస్తున్న ఉల్లంఘనలు అన్నీ ఇన్నీ కావు. హుక్కాకు బానిసవుతున్న వారిలో సగానికి సగం మైనర్లే ఉంటున్నారు. మేజర్లు మద్యం కోసం బార్లు, పబ్బులకు వెళ్తుండగా ఆ అవకాశం లేని మైనర్లు హుక్కా దారి పడుతున్నారు. ఈ హుక్కా పైపుల్లో పొగాకు వాడకూడదని నిబంధనలు చెప్తున్నా ఫ్లేవర్ల కంటే నికోటిన్ కూడిన వాటికే డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. హుక్కా ద్వారా వచ్చే పొగ నీటిలో శుద్ధి అవుతూ పైపు ద్వారా నోటిలోకి వస్తుందని, దీని వల్ల నికోటిన్ వంటిని శరీరంలోకి చేరవని, ఎలాంటి హానీ ఉండదనీ మాయమాటలు చెప్తూ సెంటర్ల నిర్వాహకులు యువతను ఆకర్షిస్తున్నారు. ఈ మాటలు నమ్మి మైనర్లు ఆయా సెంటర్ల మెట్లు ఎక్కుతున్నారు. సిటిరెట్ కన్నా హుక్కా ప్రమాదకరమైందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దీన్ని పీల్చడం ద్వారా పొగ నేరుగా ఊపిరితిత్తుల్లోకి చేరుతుందంటున్నారు. అధికమొత్తంలో కార్బన్మోనాక్సైడ్ శరీరంలోకి చేరుతుందని, సిగరెట్ కన్నా ఎన్నో రెట్లు ఇది హానికమని చెప్తున్నారు. ఒకే హుక్కా గొట్టాన్ని అనేక మంది వాడటం, పూర్తిస్థాయిలో శుభ్రం చేయకపోవడం వల్ల ఇన్ఫెక్షన్స్తో పాటు నోటి సంబంధ వ్యాధులు వస్తామని హెచ్చరిస్తున్నారు. ఏ చట్టం కింద కేసు పెట్టాలి..? హుక్కా సెంటర్ల ఉల్లంఘనలు, కల్పిస్తున్న అదనపు సౌకర్యాల విషయం తెలిసిన పోలీసు అధికారులు ఇటీవల దాడులు ముమ్మరం చేశారు. వెస్ట్జోన్ పోలీసులు శనివారం రాత్రి హుక్కా సెంటర్ల మీద వరుస దాడులు చేశారు. వీటిపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నా... ఎక్సైజ్ అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. పశ్చిమ మండల అధికారులు శనివారం చేసిన దాడుల్లో అనేక సెంటర్ల నుంచి నమూనాలు సేకరించారు. ఇతర వరకు బాగానే ఉన్నా... నిబంధనలు ఉల్లంఘిస్తున్న నిర్వాహకులు, అక్కడకు వస్తున్న మైనర్లపై ఏ చట్టం కింద, ఏ సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేయాలన్నది అంతు చిక్కట్లేదు. సదరు సెంటర్లో మాదకద్రవ్యాలు వినియోగిస్తుంటే ఆ చట్టం కింద కేసులు పెట్టచ్చు. అయితే మైనర్లను అనుమతిస్తున్నారనో, మరో ఉల్లంఘనలకు పాల్పడుతున్నారనో తేలితే ఎలాంటి కేసులు పెట్టాలి? ఏ చర్యలు తీసుకోవాలి అనే విషయంపై స్పష్టత లేక పోలీసులే తలలు పట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఐపీసీలోని సెక్షన్ 188తో (ప్రభుత్వ అధికారి ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేయడం) పాటు సీఆర్పీసీ, సీపీ యాక్ట్ల్లోని సెక్షన్లతో సరిపెట్టాల్సి వస్తోంది. ఇవేవీ కఠిన శిక్షలు, చర్యలకు ఉపకరించే కాకపోవడం గమనార్హం. -
భార్య పని చేయడం లేదని..
తన భార్య ఇంటి పని, వంట పని సరిగా చేయట్లేదంటూ.. కుటుంబ కష్టాలపై ఓ భర్త కోర్టుకెక్కాడు. 'మిస్ ట్రీట్మెంట్ ఆఫ్ ది ఫ్యామిలీ' అంటూ తాను పడుతున్న కష్టాలను వివరించాడు. అయితే ఇదే సందర్భంలో భర్త వల్ల ఆమె ఆరేళ్లుగా నాలుగు గోడల మధ్య అనుభవిస్తున్న నరకం కూడా బయటపడింది. 40 ఏళ్ల వయసున్న తన భార్య.. పనిచేయడంలో వెనుకబడిందని, కుటుంబాన్ని సరిగా చూడట్లేదని ఓ భర్త కోర్టుకెక్కాడు. వంట పనిలోనూ, ఇల్లు శుభ్రపరిచే విషయంలోనూ ఆమె పరమవీక్ అంటూ ఫిర్యాదు చేశాడు. తన భార్య అపరిశుభ్రతను, బద్ధకాన్ని భరింలేకపోతున్నానని, ఇలాంటి పరిస్థితుల్లో జీవించలేకపోతున్నానని వాపోయాడు. రెండేళ్లుగా ఈ పరిస్థితులతో తీవ్రకష్టాలు అనుభవిస్తున్నట్లు కోర్టుకు తెలిపాడు. అయితే స్థానికులు మాత్రం అతడి ఆరోపణలు నిజం కాదంటున్నారు. భర్త తరచుగా భార్యను వేధిస్తుంటాడని, కొని తెచ్చిన వంటకాలను దూరంగా విసిరి పారేస్తాడని, ఆమే వంట చేయాలంటాడని తెలిపారు. లేదంటే ఆమెను శారీరకంగా హింసిస్తుంటాడని కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో కోర్టుకు పత్రాలు సమర్పించిన బాధితురాలు.. తనపై వచ్చిన ఆరోపణలను తిరస్కరించింది. భర్త చేస్తున్న ఫిర్యాదులు నిజం కాదంది. ఆరేళ్లుగా అతనితో నరకం అనుభవిస్తున్నాని, కోర్టుకు వచ్చేముందు కూడా తనను కొట్టాడని తెలిపింది. ఇటలీ సొన్నినో లాజియోకి చెందిన ఆమె... ఆరేళ్లుగా భర్త వేధింపులను భరిస్తూ కాలం గడుపుతున్నానని, తనపై తప్పుడు ప్రచారం చేయడం సరికాదని న్యాయస్థానానికి విన్నవించింది. ప్రస్తుతం ఆ భార్య భర్తల వివాదంలో విచారణను కోర్టు అక్టోబర్ నాటికి వాయిదా వేసింది. -
15 రోజుల్లోగా ఎత్తేయండి!
జాతీయ, రాష్ట్ర రహదారులపై ఉన్న బార్లు, వైన్షాపులకు ఎక్సైజ్ శాఖ నోటీసులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జాతీయ, రాష్ట్ర రహదారులకు వంద మీటర్ల లోపు నెలకొల్పిన మద్యం విక్రయ కేంద్రాలను తొలగించే దిశగా ఎక్సైజ్ శాఖ అడుగులు వేస్తోంది. రహదారి భద్రతపై ఏర్పాటైన సుప్రీంకోర్టు కమిటీ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా జాతీయ, రాష్ట్ర హైవేలపై ఏర్పాటు చేసిన బార్లతో పాటు మద్యం దుకాణాలను 15 రోజుల్లోగా తొలగించి, అదే ప్రాంతంలో హైవేలకు 100 మీటర్ల దూరంలో ఏర్పాటు చేయాలని నోటీసులు జారీ చేసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని వైన్షాపులు, బార్లతో పాటు అన్ని జిల్లాల్లో ఈ మేరకు ఎక్సైజ్ సూపరింటెండెంట్లు తాఖీదులు పంపించారు. దీంతో గత అక్టోబర్లోనే కొత్త లెసైన్సులు తీసుకొని మద్యం దుకాణాలు ఏర్పాటు చేసిన వారితో పాటు గత కొన్నేళ్లుగా రహదారులకు ఇరువైపులా బార్లు ఏర్పాటు చేసిన వారు కూడా ఎక్సైజ్ నోటీసులతో ఆందోళన చెందుతున్నారు. సుప్రీం కోర్టు కమిటీ ఆదేశాలు జాతీయ, రాష్ట్ర రహదారులకు వంద మీటర్ల లోపు మత్తు పానీయాల విక్రయాలు జరపకూడదని జస్టిస్ కె.ఎస్. రాధాకృష్ణన్ చైర్మన్గా రోడ్సేఫ్టీపై ఏర్పాటైన సుప్రీంకోర్టు కమిటీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. నూతన ఎక్సైజ్ పాలసీతో సంబంధం లేకుండా వెంటనే హైవేలలో మద్యం విక్రయాలపై నిషేధం విధించాలని, ఇప్పటికే ఏర్పాటైన దుకాణాలను తొలగించాలని ఆదేశించింది. ఈ మేరకు గత నెలలో ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలిస్తూ, తీసుకున్న చర్యలపై ఈ నెల 30వ తేదీలోగా పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. రహదారుల నిబంధనకు పక్క‘దారి’ జాతీయ, రాష్ట్ర రహదారులకు వంద మీటర్ల లోపు మద్యం అమ్మకాలు ఉండకూడదనే నిబంధన ఎక్సైజ్ పాలసీలో ఉంది. అయితే ఆయా రహదారులు గ్రామాలు, పట్టణాల మధ్య నుంచి వెళుతున్నప్పుడు మాత్రం అనుమతి ఇవ్వవచ్చనే ‘అనుకూలమైన’ సవరణ చేర్చుకున్న ఎక్సైజ్ శాఖ తదనుగుణంగా అనుమతులు ఇస్తూ వస్తోంది. పనిలో పనిగా ఊళ్లతో సంబంధం లేకుండా జాతీయ రహదారులపై బార్లు, మద్యం దుకాణాలు ఏర్పాటయ్యాయి. జూలైలో లేఖ రాసినా... సెప్టెంబర్లో కొత్త అనుమతులు హైవేలకు 100 మీటర్లలోపు మద్యం అమ్మకాలను నిషేధించి, దుకాణాలను తొలగించాలని జస్టిస్ కేఎస్ రాధాకష్ణన్ చైర్మన్గా ఏర్పాటైన సుప్రీంకోర్టు కమిటీ సూచనలను ఆ కమిటీ కార్యదర్శి ఎస్.డి. బంగా గత జూలై 8న ట్రాన్స్పోర్టు జాయింట్ కమిషనర్కు లేఖ ద్వారా తెలిపారు. రాష్ట్రంలో 2,495.63 కిలోమీటర్ల మేర 13 జాతీయ రహదారులు ఉండగా, పది జిల్లాల్లో 2,023 కి. మీ. మేర 17 రాష్ట్ర రహదారులు ఉన్నాయి. రాష్ట్రంలోని 2,216 మద్యం దుకాణాలకు గాను 500కు పైగా హైవేలపైనే ఉన్నాయి. బార్లు గత కొన్నేళ్లుగా రహదారులపైనే కొనసాగుతున్నాయి. కొత్త ఎక్సైజ్ పాలసీ కోసం వేచి చూడకుండా తక్షణమే హైవేలలో ఆల్కహాల్ విక్రయాలను రద్దు చేసి, సెప్టెంబర్ 30లోగా నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు కమిటీ జూలైలో సర్కార్కు రాసిన లేఖలో ఆదేశించింది. అయితే సెప్టెంబర్ 30 నాటికి సుప్రీంకోర్టు కమిటీకి నివేదిక ఇవ్వకుండా, ఆ తేదీ నాటికి రాష్ట్రంలో 2015-17 సంవత్సరాల కోసం (రెండేళ్లు) కొత్తగా మద్యం దుకాణాలకు అనుమతిచ్చారు. దీంతో అక్టోబర్ 1 నుంచి నూతన ఎక్సైజ్ పాలసీ ద్వారా వందలాది మద్యం దుకాణాలు హైవేలపై ఏర్పాటయ్యాయి. ఈ నేపథ్యంలో రహదారులపై ఆల్కహాల్ విక్రయాల నిషేధానికి తీసుకున్న చర్యలపై ఈ నెల 30లోగా నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు కమిటీ కోరింది. గ్రేటర్ వ్యాపారుల ఆందోళన సుప్రీంకోర్టు నిబంధనల నేపథ్యంలో హైవేలపై ఉన్న మద్యం విక్రయ కేంద్రాలను 100 మీటర్ల దూరానికి తరలించాలన్న ఆదేశాల నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని వ్యాపారులు కొంత ఆందోళనకు గురయ్యారు. ఏడాదికి రూ. కోటీ ఎనిమిది లక్షలు లెసైన్సు ఫీజుగా చెల్లిస్తూ లక్షలాది రూపాయల అడ్వాన్సులు, అద్దెలు చెల్లించే వీరు ప్రత్యామ్నాయ కోసం కొత్త దారులు వెతుక్కుంటున్నారు. -
హెచ్ఐవి పాజిటివ్ అని గెంటేశారు
కోలకత్తా: హెచ్ఐవి పాజిటివ్ అని తేలిన ఓ చిన్నారిని స్కూలు నుంచి గెంటేసిన వైనం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ పాఠశాలలో చోటు చేసుకుంది. ఓ వైపు ఎయిడ్స్ అంటువ్యాధి కాదని ప్రభుత్వాలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తోంటే, మరోవైపు ప్రభుత్వ పాఠశాల ఇంత అమానుషంగా ప్రవర్తించడం వివాదాన్ని రేపింది. రాష్ట్ర రాజధాని నగరం కోలకతాకు కూతవేటు దూరంలో ఉన్న ఓ ప్రభుత్వ పాఠశాలలో ఒకటవ తరగతి చదువుతున్న విద్యార్థిని స్కూలు నుంచి గెంటేశారు. కాగా ఆ విద్యార్థి తల్లి ....తనకు, తన కుమారుడికి వ్యాధి ఉన్న సంగతిని ముందే స్కూలు యాజమాన్యానికి తెలిపింది. తాను ఎయిడ్స్ వ్యాధి అవగాహన సంస్థలో పనిచేస్తున్నాననే సమాచారాన్ని కూడా ఇచ్చింది. అయితే ముందు ఎలాంటి అభ్యంతరం చెప్పని యాజమాన్యం, తరువాత నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించి, పిల్లవాడిని క్లాసులకు రావద్దంటూ ఆదేశించింది. తోటి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు... బాధిత విద్యార్థిని అందరూ చూస్తుండగానే రకరకాలు వ్యాఖ్యలు చేస్తున్నా స్కూల్ యాజమాన్యం ఏమాత్రం అడ్డుకోలేదు. దీనికితోడు మళ్లీ స్కూలు రావద్దంటూ ఆచిన్నారిని ఆదేశించి దారుణంగా అవమానించింది. విద్యార్థుల తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేయడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని తన చర్యను యాజమాన్యం సమర్ధించుకుంది. దీనిపై విద్యార్థి తల్లి అభ్యంతరం వ్యక్తం చేసింది. పిల్లల తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించాల్సిన ప్రభుత్వ అధికారులు అమానుషంగా ప్రవర్తించడాన్ని తప్పు బట్టింది. -
బార్ల కోసం బారులు...
130 బార్ల కోసం వెల్లువెత్తిన దరఖాస్తులు చివరి రోజు 1,500 వరకు దరఖాస్తులు సాక్షి, హైదరాబాద్: కొత్త బార్ల కోసం వ్యాపారులు బారులు తీరారు. బార్ల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకునేందుకు గురువారం చివరి రోజు కావడంతో హైదరాబాద్ నాంపల్లిలోని ఆబ్కారీ భవన్లో జాతర వాతావరణం నెలకొంది. గ్రేటర్ హైదరాబాద్తో పాటు అన్ని జిల్లాల నుంచి వ్యాపారులు క్యూ కట్టారు. ఎక్సైజ్ అధికారులు రెండు కౌంటర్లను ఏర్పాటు చేసి రాత్రి వరకు దరఖాస్తులను స్వీకరిస్తూనే ఉన్నారు. గురువారం ఒక్కరోజే 1,200 నుంచి 1,500 వరకు దరఖాస్తులు వచ్చినట్లు తెలిసింది. వీటితో కలిపి మొత్తం 2,500 వరకు దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 700కు పైగా బార్లకు తోడు కొత్తగా మరో 130 బార్లకు లెసైన్సులు జారీ చేయాలని ఎక్సైజ్ శాఖ భావించింది. ఈ మేరకు గతవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. 130 బార్లలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 60 ఉండగా, మిగిలినవి కొత్తగా ఏర్పాటైన నగర పంచాయతీలు, కార్పొరేషన్ల పరిధిలో ఏర్పాటుకానున్నాయి. కాగా, నగర పంచాయతీల్లో కొత్తగా బార్లు ఏర్పాటు చేసేందుకు పెద్ద ఎత్తున ముందుకు వచ్చినట్లు దరఖాస్తులను బట్టి తెలుస్తోంది. దరఖాస్తు రుసుము రూ. 5 వేలు కావడంతో ఒక్కో నగర పంచాయతీ నుంచి పదుల సంఖ్యలో వచ్చాయి. డ్రా పద్ధతిలోనే కేటాయింపు భారీగా దరఖాస్తులు రావడంతో మద్యం దుకాణాల తరహాలోనే బార్లను కూడా డ్రా పద్ధతిలోనే కేటాయించనున్నారు. గురువారం వరకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, నిబంధనలకు అనుగుణంగా లేని వాటిని ముందుగా తిరస్కరిస్తారు. అనంతరం గ్రేటర్ పరిధిలో 13 వేల జనాభా, నగర పంచాయతీల్లో 30 వేల జనాభా ప్రాతిపదికన బార్లను డ్రా పద్ధతిలో కేటాయిస్తారు. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు నెలరోజులు పడుతుందని ఎక్సైజ్ అధికారి ఒకరు తెలిపారు. -
తెలంగాణలో కొత్త మద్యం విధానం
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కొత్త మద్యం విధానం ప్రకటించింది. జీహెచ్ ఎంసీ, మున్సిపాలిటీల్లో కొత్త మద్యం విధానం ఖరారు చూస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్ ఎంసీ పరిధిలో13 వేల జనాభా ఒక బార్ ఏర్పాటు చేయనున్నారు. మున్సిపాలిటీ, నగర పంచాయతీల్లో ప్రతి 30 వేల జనాభాకు ఒక బార్ పెట్టనున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో బార్ లు కేటాయించారు. 30 వేల నుంచి 60 వేల జనాభా ఉంటే 2 బార్లు పెట్టనున్నారు. ప్రతి త్రిస్టార్ హోటల్ కు ఒక బార్ కేటాయించనున్నారు. డ్రా ద్వారా బార్లు కేటాయిస్తారు. -
రోడ్ల పక్కన వైన్ కేఫ్లు.. మాల్స్లో బార్లు!
-
రోడ్ల పక్కన వైన్ కేఫ్లు.. మాల్స్లో బార్లు!
రాష్ట్రంలో ఏపీ తరహా మద్యం పాలసీ? •నూతన ఎక్సైజ్ విధానంపై విస్తృత చర్చ •60 దుకాణాల నిర్వహణకు సర్కారు నిర్ణయం •పాలసీపై 3 రకాల ఆప్షన్లు సిద్ధం చేస్తున్న అధికారులు •జిల్లాలవారీగా డీసీలు, ఈఎస్లతో •ఎక్సైజ్ కమిషనర్ భేటీ •నేడు టీఎస్బీసీఎల్ అధికారులతో సమావేశం హైదరాబాద్: రోడ్ల పక్కన వైన్ కేఫ్లు... షాపింగ్ మాల్స్, మల్టిప్లెక్స్లలో బార్లు, మద్యం షాపులు! అక్టోబర్ నుంచి రాష్ట్రంలో కనిపించనున్న దృశ్యాలివే!! మహారాష్ట్రను అనుసరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిన ‘అందరికీ అందుబాటులో మద్యం’ దిశగానే రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు విస్తృతంగా చర్చ జరుగుతోంది. హైదరాబాద్తోపాటు కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ వంటి కార్పొరేషన్ల పరిధిలో వైన్ కేఫ్లు, మల్టీప్లెక్స్లు, మాల్స్లలో బార్లు, వైన్ షాపులు ఏర్పాటు చేసే దిశగా కొత్త మద్యం విధానానికి మెరుగులు దిద్దుతున్నట్లు తెలుస్తోంది. అలాగే జిల్లాల్లో జనాభా, స్థానిక ఆర్థిక వనరులు, సామాజిక స్థితిగతులను బేరీజు వేసుకొని వైన్షాపులు పెంచాలని, నగర పంచాయతీలు, మున్సిపాలిటీలతోపాటు హైవేలపై బార్లకు అనుమతులు ఇవ్వాలని భావిస్తోంది. రాష్ట్రంలో అక్టోబర్ నుంచి అమల్లోకి రానున్న నూతన మద్యం విధానాన్ని రూపకల్పనపై ఎక్సైజ్ యంత్రాంగం గురువారం నుంచి కసరత్తు ప్రారంభించింది. ప్రభుత్వ పెద్దల ఆలోచనలకు అనుగుణంగా మద్యం విధానాన్ని అమలు చేసేందుకు ఇప్పటికే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో అధ్యయనం చేసిన ఎక్సైజ్ అధికారులు అక్కడి విధానాలపై మేలోనే ఎక్సైజ్ కమిషనర్కు నివేదికలు అందజేశారు. మహారాష్ట్రలో అమలవుతున్న మద్యం విధానాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయించారు. అయితే జూన్లో సీఎం సూచనల మేరకు సమగ్ర విధానం రూపకల్పన కోసం మూడు నెలలు గడువు కోరిన అధికారులు ప్రస్తుతం అదే పనిలోపడ్డారు. ఈ మేరకు గురువారం ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ జిల్లాల్లోని డిప్యూటీ కమిషనర్లు, ఎక్సైజ్ సూపరింటెండెంట్లతో సమావేశమయ్యారు. ఆయా జిల్లాల్లో ప్రస్తుతమున్న మద్యం దుకాణాలు, కొత్త వాటికిగల అవకాశాలు, వైన్ కేఫ్లు, మాల్స్లో బార్లు ఏర్పాటు చేసే ప్రయత్నాలపై చర్చించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పట్టణాలు, మండల కేంద్రాల్లో ఉన్న వైన్స్, బార్ల వివరాలను పరిశీలించారు. ఆయా జిల్లాల్లోని పట్టణాలు, మండలాలవారీగా కొత్తగా వైన్స్ ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలపై సమగ్ర నివేదికలు అందజేయాలని ఆదేశించారు. కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో వైన్ కేఫ్లు, మాల్స్లలో బార్లు ఏర్పాటు చేయించే బాధ్యతలను అధికారులకు అప్పగించినట్లు సమాచారం. శుక్రవారం టీఎస్బీసీఎల్ అధికారులతో చంద్రవదన్ సమావేశం కానున్నారు. గ్రామీణ స్థాయికి మద్యం మహారాష్ట్రలో మూడు రకాల మద్యం లెసైన్సులు మంజూరు చేస్తున్నారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో ఐఎంఎఫ్ఎల్, ఐఎంఎల్ మద్యంతోపాటు బీర్లు, వైన్, కంట్రీ లిక్కర్ అమ్మకాలకు అనుమతి ఉంది. తాలూకా స్థాయిల్లో ఐఎంఎల్తోపాటు బీర్లు, వైన్, కంట్రీలిక్కర్ అందుబాటులో ఉంటుంది. మేజర్ గ్రామ పంచాయితీలు, ప్రధాన రోడ్ల పక్కన వైన్, బీర్లనే విక్రయిస్తున్నారు. ఇదే తరహాలో రాష్ట్రంలో కూడా కార్పొరేషన్లపై ప్రత్యేక దృష్టి పెట్టి వైన్ కేఫ్లను ఏర్పాటు చేయాలని, ఇందులో వైన్, బీర్లనే విక్రయించేలా ఏర్పాట్లు చేయాలని అధికార యంత్రాంగం తమ ప్రతిపాదనల్లో పేర్కొంది. గ్రామాల్లో కంట్రీ లిక్కర్(చీప్ లిక్కర్)తోపాటు బీర్లు అందుబాటులో ఉండేలా పాలసీలో మార్పులు చేయాలని, రాష్ట్రంలోని అన్ని వైన్షాపులు, బార్లలో చీప్ లిక్కర్ను 90 ఎంఎల్,180 ఎంఎల్ సీసాల ద్వారా విక్రయించాలని సూచించింది. సర్కారీ షాపులు 60కిపైగానే.. కొన్ని జిల్లాల్లో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలతో కుమ్ముక్కయిన మద్యం వ్యాపారులు కొన్ని చోట్ల వైన్షాపులు ఏర్పాటు చేయకుండా అడ్డుపడుతున్నారని కమిషనర్ చంద్రవదన్ భావిస్తున్నారు. ఇటీవల వైన్షాపుల లెసైన్స్లను మూడు నెలలు పొడిగించగా 60 షాపుల వాళ్లు లెసైన్సులను రెన్యూవల్ చేయించుకోలేదు. దానికితోడు గ్రేటర్ హైదరాబాద్, దాని సరిహద్దుకు 5 కి.మీ. పరిధిలోని పెరిఫెరల్ ఏరియాల్లో వైన్షాపుల లెసైన్స్ ఫీజు రూ. 90 లక్షలు ఉండగా 103 దుకాణాలను ఎవరూ తీసుకోలేదు. ఇది కూడా వైన్షాపుల యజమానులు, ఎక్సైజ్ స్థానిక అధికారుల కుమ్ముక్కు ఫలితమేనని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త ఎక్సైజ్ పాలసీలో కనీసం 60 దుకాణాలను బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారానే నిర్వహించాలని నిర్ణయించారు. -
'కేరళ బార్లకు సెప్టెంబర్ 12న లాస్ట్బెల్'
తిరువనంతపురం: కేరళ మందుబాబులకు ప్రభుత్వం చేదు వార్త అందించింది. సెప్టెంబర్ 12 నుంచి మద్యం అమ్మకాలను పూర్తిగా నిషేధించనున్నట్టు ఊమెన్ చాందీ సర్కారు ప్రకటించింది. రాష్ట్రంలో ఉన్న 730 బార్లలో 418 బార్ల లైసెన్సులు పునరుద్దరించలేదని ఎక్సైజ్ మంత్రి కె. బాబు తెలిపారు. మిగిలిన 312 బార్లు, 20 స్టార్ హోటళ్లలో మద్యం అమ్మకాలను వచ్చే నెల 12 నుంచి నిషేధించనున్నట్టు ప్రకటించారు. వీటికి 15 రోజులు ముందుగా నోటీసు ఇవ్వాలని యోచిస్తున్నట్టు వెల్లడించారు. పదేళ్లలో దశలవారీగా మద్యనిషేధం అమలుచేయాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. కాగా, తాము చేపట్టబోయే కొత్త ఎక్సైజ్ విధానాన్ని హైకోర్టుకు ప్రభుత్వం వెల్లడించింది. దీనిపై నిర్ణయాన్ని కోర్టు సెప్టెంబర్ 17కు వాయిదా వేసింది. -
బార్లు వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి
-
ఒకటి రెండుసార్లు నేను కూడా కొన్నాను
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ శాసనసభలో సోమవారం హైవేలు, రోడ్డు ప్రమాదాల నివారణపై చర్చ జరిగింది. అలాగే జాతీయ రహదారులపై బార్లు వల్ల కూడా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని విశాఖ ఉత్తర బీజేపీ ఎమ్మెల్యే పెన్మెత్స విష్ణుకుమార్ రాజు ఈ సందర్భంగా సభ దృష్టికి తీసుకు వచ్చారు. వాహనాలు నడిపే డ్రైవర్లు కొందరు మద్యానికి బానిసలై వుండడంతో రాత్రిపూట హైవేలపై ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయన్నారు. బార్లు ఆకర్షించేలా ఉండటం వల్ల ....తాను కూడా ఒకటి, రెండుసార్లు మద్యం కొన్నానని విష్ణుకుమార్ రాజు అన్నారు. దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని, బార్లను నియంత్రించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సభ్యుల అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. హైవేలు, రోడ్డు ప్రమాదాల నివారణకు కచ్చితమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం వెల్లడించింది. రోడ్డు ప్రమాదాల్లో రోజూ పదుల సంఖ్యలో ప్రజలు చనిపోతున్నారని.. పలువురు సభ్యులు ప్రశ్నోత్తరాల్లో ప్రస్తావించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ సభ్యులు ఎ.సురేష్, గొట్టిపాటి రవికుమార్తో పాటు, పి.విష్ణుకుమార్రాజు, రామారావు, ధూళిపాళ్ల నరేంద్ర తదితరులు ఇదే విషయంపై వివరణ కోరారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ఇప్పటికే కొన్ని చర్యలు తీసుకున్నామని.. భవిష్యత్లో మరింత దృష్టి పెడతామని ప్రభుత్వం సమాధానమిచ్చింది. -
ఉమా.. ఏంటీ డ్రామా!?
ఎంపీలు, ఎమ్మెల్యేలు సూచించే పనులపై ఆరా అభివృద్ధి పనుల గురించి తనకు తెలియాలని హుకుం మండిపడుతున్న ప్రజాప్రతినిధులు సాక్షి, విజయవాడ : జిల్లాపై పట్టు కోసం రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్ని విషయాల్లోనూ జోక్యం చేసుకోవడం తరచూ వివాదాస్పదమవుతోంది. జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ అధికారులంతా తాను చెప్పినట్లే వినాలని ఉమా చెబుతుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు రాష్ట్రంలోని అన్ని సమస్యలపై మిగిలిన ఇద్దరు మంత్రులకన్నా ముందుగానే స్పందిస్తూ మీడియాను ఉపయోగించుకుని హడావుడి చేస్తున్నారు. ఉమా వ్యవహారశైలి టీడీ పీ ప్రజాప్రతినిధులకే మింగుడు పడటం లేదు. బార్లు, ఇసుక రీచ్లు ఉమా అనుచరులకే..! బార్లు, ఇసుక రీచ్ల కేటాయింపు విషయంలో దేవినేని ఉమా కీలకంగా వ్యవహరించారని సమాచారం. తనకు అనుకూలంగా ఉండే వారికే బార్లు దక్కేవిధంగా అధికారులకు పలు సూచ న లు చేసినట్లు తెలిసింది. ఇంద్రకీలాద్రి, రైతుబజార్లు వంటి ఆదాయాలు వచ్చే విభాగాల కార్యకలాపాల గురించి కూడా ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ అధికారులకు ఆదేశాలు జారీచేస్తున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు మండిపడుతున్నారు. నియోజకవర్గాలపై పట్టు కోసం తహతహ ! జిల్లాలో ఎమ్మెల్యేలు సూచించే పనులను తనకు చెప్పకుండా చేయవద్దంటూ మంత్రి ఉమా అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ఈ విషయం పసిగట్టిన నగరానికి సమీపంలో ఉన్న నియోజకవర్గ ఎమ్మెల్యే ఒకరు తన సహచర శాసనసభ్యుల వద్ద తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసినట్లు సమాచారం. ముఖ్యమంత్రి చెప్పిన విధంగా తాము ప్రజల్లోకి వెళ్లినప్పుడు అక్కడ వారు చెప్పిన సమస్యలను పరిష్కరించాలని అధికారులకు చెప్పిన తర్వాత మళ్లీ మంత్రి సమీక్షించడం ఎంతవరకు సమంజసమంటూ కొత్తగా ఎన్నికైన ఆ ఎమ్మెల్యే వాపోతున్నారు. నందిగామ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకర్ చనిపోవడంతో ఆ నియోజకవర్గంపై ఉమా పూర్తిగా పట్టు బిగించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉప ఎన్నిక జరిగితే ప్రభాకర్ కుమార్తె రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఉమా మాత్రం తాను సూచించిన వ్యక్తికే టికెటు వచ్చేలా పావులుకదుపుతున్నట్లు సమాచారం. తిరువూరు నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ గెలవడంతో అక్కడ జరిగే అభివృద్ధి పనులన్నీ తన దృష్టికి తీసుకురావాలని అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. కేశినేని నానికి చెక్! ఎన్నికలకు ముందు నుంచి ఎంపీ కేశినేని శ్రీనివాస్(నాని), మంత్రి దేవినేని ఉమా మధ్య ఆధిపత్యపోరు సాగుతోంది. ఇప్పుడు కేశినేని నానికి చెక్ పెట్టేందుకు దేవినేని ఉమా ప్రయత్నిస్తున్నారు. దుర్గగుడి వద్ద ఫ్లై ఓవర్ నిర్మించడంపై కేశినేని నాని రెండు ప్రణాళికలు ఇప్పటికే సిద్ధం చేసుకోగా, ఇటీవల జరిగిన ఇరిగేషన్ అధికారులు సమావేశంలో ఫ్లై ఓవర్ గురించి ప్రణాళికలు సిద్ధం చేయాలని మళ్లీ దేవినేని ఉమా ఆదే శాలు జారీచేశారు. దీంతో అధికారులు కంగుతిన్నారు. ఫ్లై ఓవర్ వంటి కీలక విషయాల్లోనే ఇద్దరు ముఖ్య నేతల మధ్య ఐక్యత లేకపోవడం చర్చనీయాశంగా మారింది. ఉమా వ ర్గీయులకు నామినేటేడ్ పదవులు దక్కుతాయా! ప్రస్తుతం ఉన్న పలు పాలకవర్గాలను రద్దు చేసి కొత్తగా కమిటీలను నియమించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్ధమవుతున్నారు. ఈ దశలో జిల్లాపై దేవినేని ఉమా పట్టు కోసం పాకులాడటం మిగిలిన ప్రజా ప్రతినిధులకు రుచించడం లేదు. ఉమా సూచించిన వ్యక్తులకే కీలక పదవులు దక్కితే, తమను నమ్ముకున్న వారి పరిస్థితి ఏమిటని ముఖ్య నేతలు పేర్కొంటున్నారు. నామినేటెడ్ పదవులు కేటాయించే నాటికి ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లేందుకు కొందరు ప్రజాప్రతినిధులు ప్రయత్నిస్తున్నారు. ఉమాకు వ్యతిరేకంగా ఒక బలమైన వర్గాన్ని తయారుచేయాలని వారు చర్చించుకుంటున్నారు. -
పంచ్లు ఇవ్వండి...పైసలు కూడా ఇవ్వండీ!
సమ్థింగ్ స్పెషల్ ‘‘నేను మనిషిని కాదు. పంచ్ బ్యాగ్ను. గట్టిగా పంచ్లు ఇవ్వండి. ఆ తరువాత మీకు తోచిన డబ్బులు ఇవ్వండి’’ అంటున్నాడు షుపింగ్. చైనాలోని వుహన్ నగరంలోని బార్లు, నైట్క్లబ్లు, వీధుల్లో నిల్చొని ‘‘కమాన్.. రండీ’’ అని పిలుపునిస్తుంటాడు నలభై ఎనిమిది సంవత్సరాల షుపింగ్. ఇదేదో సరదాగా ఉందనుకొని దారిన పోయే దానయ్యలు షుపింగ్కు పంచ్లు ఇచ్చి ఆ తరువాత డబ్బు ఇస్తారు. మొత్తానికైతే పింగ్ బాగానే సంపాదిస్తున్నాడు. అయితే పింగ్ చేస్తున్న పని అతని భార్యా బిడ్డలకు బొత్తిగా నచ్చడం లేదు. ‘‘వద్దు మొర్రో’’ అంటున్న వినిపించుకోవడం లేదు పింగ్. ఒక సూపర్ మార్కెట్ ప్రమోషన్ షోలో భాగంగా ‘హూమన్ పంచ్’ అవతారం ఎత్తాడు. మంచి స్పందన లభించడంతో దీన్నే వృత్తిగా ఎందుకు ఎంచుకోకూడదు అనుకున్నాడు షుపింగ్. ‘‘మొదట నేను దీన్ని జీవికగా ఎంచుకోవాలనుకోలేదు. ఒకసారి ప్రయత్నించి చూద్దాం అనుకున్నాను. డబ్బులు బాగానే వస్తున్నప్పుడు... వేరే వృత్తి ఎంచుకోవడం ఎందుకని ఇదే వృత్తిలో స్థిరడ్డాను’’ అంటున్న షుపింగ్ తన వృత్తిని ‘అసాధారణమైన వృత్తి’ అని అభివర్ణిస్తుంటాడు. -
స్వేచ్ఛానుభూతి
బార్లు, రెస్టారెంట్ల సమయాన్ని రాత్రి ఒంటి గంట వరకు పొడిగించడంతో నగర వాసులు కొత్త అనుభవాన్ని చవి చూశారు. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత శుక్రవారం ‘స్వేచ్ఛ’ లభించినట్లుగా అనుభూతిని పొందారు. అయితే బార్ల యజమానుల్లో నెలకొన్న గందరగోళం, ప్రజల్లో అవగాహనా లోపం వల్ల తొలి రోజు మిశ్రమ స్పందన లభించింది. చాలా వరకు బార్లు యధావిధిగా 11 గంటలకే మూతపడ్డాయి. రాత్రి సమయం పొడిగింపుపై అవగాహన కలిగిన మందు బాబులు మాత్రం జల్సా చేశారు. తొలి రోజు బాగా వ్యాపారం జరుగుతుందనే అంచనాతో ఉత్సాహంతో ఎదురు చూసినా ఫలితం లేకపోయిందని పలువురు బార్ యజమానులు తెలిపారు. సమయం పొడిగింపు గురించి తెలియని చాలా మంది అర్ధ రాత్రికే ఇంటికి చేరుకున్నారని చెప్పారు. అయితే మున్ముందు ‘మంచి రోజులు’ ఉంటాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. నగరంలోని చాలా మంది బార్ల యజమానులు తమ రెగ్యులర్ కస్టమర్లకు సమయం పొడిగింపుపై ఎస్ఎంఎస్ల ద్వారా ‘అవగాహన’ కల్పించారు. కాగా అనేక మంది మందు ప్రియులు తొలి రోజున బాగా ఎంజాయ్ చేయడానికి ‘లేట్ నైట్ పార్టీ’పై మిత్రులకు ఫేస్ బుక్లో ఆహ్వానాన్ని పోస్ట్ చేశారు. హడావుడి తప్పింది వివిధ రంగాల్లోని యువత సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికి చేరుకుంటారు. కాసేపు గడిపాక బార్లకు దారి తీస్తుంటారు. గంటల తరబడి బార్లలో కాలక్షేపం చేసే వారికి 11 గంటల గడువు మింగుడు పడకుండా ఉండేది. వారంతా ప్రస్తుతం సంబరాల్లో మునిగి తేలుతున్నారు. రాత్రి పొద్దు గడిచే కొద్దీ బార్ల వైపు మళ్లే వారు కొందరైతే, మిత్రులందరినీ కలుపుకొని వెళ్లే వారు మరికొందరు. ఇలాంటి స్వేచ్ఛా జీవులకు పొడిగింపు సమయం వరంలా పరిణమించింది. రాత్రి 11 గంటల వరకు డ్యూటీలలో ఉండే వారు సైతం కొత్త పొడిగింపు వేళలతో సంబర పడిపోతున్నారు. హోటళ్లను 11 గంటలకే మూసివేయడంతో చాలా మంది కడుపు మాడ్చుకునో లేక ఇంటిలో తయారు చేసుకునే అల్పాహారంతోనో కడుపు నింపుకునే వారు. అలాంటి వారికి ఇప్పుడు కోరిన ఆహారం లభిస్తుంది. హోటళ్లు, తిను బండారాల కేంద్రాలు మాత్రం వారమంతా రాత్రి ఒంటి గంట వరకు తెరిచి ఉంటాయి. మరో వైపు బర్త్ డే పార్టీలు జరుపుకొనే వారికి కూడా ఈ పొడిగింపు సమయం సంబరాన్ని కలిగిస్తోంది. సాధారణంగా బార్లలో ఇలాంటి పార్టీలు జరుపుకొనే వారు 11 గంటల లోగా సంబరాలను ముగించాల్సి ఉంటుంది. అంటే...గంటకు ముందే పుట్టిన రోజు జరుపుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడా ఇబ్బంది తప్పిందని అనేక మంది ఉత్సాహ పడుతున్నారు. -
పెరగనున్న నేరాలు!
నైట్ లైఫ్ పొడిగింపుపై సర్వత్రా వ్యతిరేకత సర్కార్ అనుమతిపై బార్లు, రెస్టారెంట్ల యజమానుల అసంతృప్తి క్షీణించనున్న శాంతి భద్రతలు టెక్కీల ఓట్ల కోసం ఎన్నికల గిమ్మిక్కా...? సాక్షి ప్రతినిధి, బెంగళూరు : నగరంలో రాత్రి జీవనం (నైట్ లైఫ్)ను పొడిగించడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. బార్లు, రెస్టారెంట్లు శుక్ర, శనివారాల్లో, హోటళ్లు, తిను బండారాల విక్రయ కేంద్రాలు వారమంతా రాత్రి ఒంటి గంట వరకు వ్యాపారం చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. వారానికి రెండు రోజులే ఆయినప్పటికీ బార్లు, రెస్టారెంట్ల యజమానులు, సిబ్బంది మాత్రం ప్రభుత్వ నిర్ణయంపై అసంత ృప్తి వ్యక్తం చేస్తున్నారు. 11 గంటల తర్వాత బార్లు, రెస్టారెంట్లకు వచ్చే వారిలో అధిక శాతం మంత్రి నేర స్వభావం కలిగిన వారై ఉంటారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాంటి వారంతా గొడవ పడడానికే బార్లకు వస్తుంటారని వాపోతున్నారు. యాజమాన్యాలు నిర్బంధంగా ఒంటి గంట వరకు పని చేయాలని పట్టుబడితే ప్రస్తుతం నగరంలోని బార్లు, రెస్టారెంట్లలో పని చేస్తున్న వారిలో చాలా మంది నిలిచిపోయే అవకాశం ఉందని కోరమంగలలో ఓ బారులో పని చేస్తున్న చంద్రు తెలిపాడు. పూటుగా తాగిన వారితో తాము గొడవ పడలేమని, ఒక్కో సందర్భంలో తమ ప్రాణాలకు ముప్పు వాటిల్లవచ్చని ఆందోళన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం రాత్రి వేళలను ఇలా పొడిగించడం సరికాదని అతను అభిప్రాయపడ్డాడు. ఎన్నికల జిమ్మిక్కా...? యువతను ఆకర్షించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం నైట్ లైఫ్ పొడిగింపు ప్రతిపాదనకు ఆమోదం తెలిపిందని వినవస్తోంది. ఎన్నో ఏళ్లుగా ఐటీ, బీటీ, ఇతర పారిశ్రామిక వర్గాల నుంచి నైట్ లైఫ్ను పొడిగించాలన్న డిమాండ్ వస్తున్నప్పటికీ, శాంతి భద్రతల దృష్ట్యా గత ప్రభుత్వాలు సమ్మతించ లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు పూర్తయింది. ఇన్నాళ్లుగా లేనిది, హఠాత్తుగా ఎన్నికల సమయంలో అనుమతి ఇవ్వడానికి ఓట్లే కారణమనే విమర్శలూ వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని పోలీసు శాఖ అతి కష్టం మీద జీర్ణం చేసుకోవాల్సి వస్తోంది. నైట్ లైఫ్ విస్తరణకు ఆది నుంచీ పోలీసు శాఖ అభ్యంతరం చెబుతూ వస్తోంది. రాత్రి బీట్లు చూసే పోలీసు సిబ్బందికి తోడుగా 2,500 మంది హోం గార్డులను నియమిస్తామని హోం శాఖ మంత్రి కేజే. జార్జ్ ప్రకటించినప్పటికీ పోలీసు శాఖకు ఈ నిర్ణయం మింగుడు పడలేదు. ఆ శాఖను పూర్తిగా పక్కన పెట్టి ప్రభుత్వమే నిర్ణయం తీసుకున్నదనే అపవాదు రాకుండా, మూడు నెలలు ప్రయోగాత్మకంగా నైట్ లైఫ్ను పొడిగిస్తామని జార్జ్ చెప్పారు. అనంతరం యధావిధిగా రాత్రి 11 గంటల గడువు కొనసాగుతుందని పోలీసు అధికారులు ఘంటాపథంగా చెబుతున్నారు. -
అర్థరాత్రి పుడ్
హోటళ్లు, రెస్టారెంట్లకు రాత్రి 1 వరకు అనుమతి బార్లు, పబ్లకు వారాంతాల్లో మాత్రమే అనుమతించిన సర్కార్ మూడు నెలల పాటు ప్రయోగాత్మంగా అమలు శాంతి భద్రతల సమస్య తలెత్తితే పునరాలోచన అక్రమ మైనింగ్పై దర్యాప్తునకు ప్రత్యేక బృందాలు హోం శాఖ మంత్రి కేజే. జార్జ్ వెల్లడి సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాత్రి జీవనం (నైట్ లైఫ్) గురించి కలలు కంటున్న టెక్కీల కోరికలు ఎట్టకేలకు ఫలించనున్నాయి. రాత్రి ఒంటి గంట వరకు హోటళ్లు, రెస్టారెంట్లను తెరచి ఉంచడానికి ప్రభుత్వం అనుమతించింది. బార్లు, పబ్లు వారాంతాల్లో మాత్రమే ఒంటి గంట వరకు తెరచి ఉంచాలి. కొన్ని సంఘాలు, సంస్థల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని హోం శాఖ మంత్రి కేజే. జార్జ్ వెల్లడించారు. ఈ రోజు (శనివారం) నుంచే ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని చెప్పారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన గట్టిగా సమర్థించుకున్నారు. ఇతర మెట్రో నగరాల్లో కూడా ఒంటి గంట వరకు నైట్ లైఫ్ను విస్తరించారని తెలిపారు. మూడు నెలల పాటు ప్రయోగాత్మంగా ఈ నిర్ణయాన్ని అమలు చేస్తామని చెప్పారు. శాంతి భద్రతల సమస్య తలెత్తితే దీనిపై పునరాలోచిస్తామని వెల్లడించారు. నగర పోలీసు కమిషనర్ సహా సీనియర్ పోలీసు అధికారులు నైట్ లైఫ్ను విస్తరించడాన్ని వ్యతిరేకిస్తున్న విషయాన్ని ఆయన దృష్టికి తీసుకు వచ్చినప్పుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో దీనిపై సాధక బాధలను చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. శాంతి భద్రతలను కాపాడడానికి ఇప్పుడున్న పోలీసులు సరిపోరనే అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని రెండు వేల మంది హోం గార్డులను నియమించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. జరగబోయే నేరాలను ఆపడం ఎవరికీ సాధ్యం కాదని, అయితే నేరాల సంఖ్యను గణనీయంగా తగ్గించడానికి తగు చర్యలు చేపడతామని చెప్పారు. ప్రత్యేక బృందాలు : రాష్ట్రంలో అక్రమ మైనింగ్పై దర్యాప్తు జరపడానికి రెండు, మూడు రోజుల్లో ప్రత్యేక బృందాలను నియమిస్తామని ఆయన తెలిపారు. లోకాయుక్త ప్రతిపాదనల మేరకు వీటిని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. కాగా శాంతి భద్రతలను కాపాడే దిశగా అదనపు డీజీపీ స్థాయి అధికారులను జిల్లాల ఇన్ఛార్జిలుగా నియమించనున్నట్లు వెల్లడించారు. నిర్జన ప్రదేశాల్లో ఏటీఎంలకు సాయుధ సిబ్బందిని కాపలాగా నియమించాలని ఆయా బ్యాంకులకు సూచించామని ఆయన తెలిపారు. -
గోవాలో అర్ధరాత్రి మందుకు బ్రేక్
గోవా... ఈ పేరు చెప్పగానే మంచి వెన్నెలలో.. సముద్ర తీరాన బ్రహ్మాండమైన మందు పార్టీలు, హడావుడే గుర్తుకొస్తాయి. కానీ, ఇవన్నీ గత చరిత్రగానే మిగిలిపోనున్నాయి. ఎందుకంటే, తొందర్లోనే గోవాలో ఉన్న మొత్తం మందు షాపులు, బార్లు అన్నీ రాత్రి తొమ్మిది గంటలకల్లా మూతపడిపోతున్నాయి. ఈ మేరకు గురువారం రాత్రి గోవా రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆదేశాలు జారీ చేశారు. బహిరంగ ప్రదేశాల్లో రాత్రిపూట మద్యసేవనాన్ని అరికట్టేందుకే ఇలా చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇన్నాళ్లూ రాత్రి 11 గంటల వరకు గోవాలో మద్యం అమ్ముకోడానికి అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు దాన్ని రాత్రి 9 గంటలకు పరిమితం చేశారు. బార్లు, రెస్టారెంట్లు కూడా ఈ ఉత్తర్వుల పరిధిలోకే వస్తాయని గోవా రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ మెనినో డిసౌజా చెప్పారు. బార్లు, రెస్టారెంట్లలో ఇంతకు ముందు తెల్లవారుజామున ఐదు గంటల వరకు మద్యం అమ్ముకోడానికి వీలుండేదని, కానీ ఇప్పుడు రాత్రి ఒంటిగంట వరకు అమ్ముకోవచ్చు గానీ.. అందుకు ప్రత్యేక అనుమతి తీసుకోవాలని ఆయన తెలిపారు. ఇంతకుముందు భారీ లైసెన్సు ఫీజులు చెల్లించిన పక్షంలో గోవాలోని బార్లు, రెస్టారెంట్లలో ఉదయం 5 గంటల వరకు మద్యం అమ్ముకోడానికి వీలుండేది. ఇప్పుడు కేవలం 5 స్టార్ రెస్టారెంట్లు, హోటళ్లను మాత్రమే తెల్లవారుజాము వరకు తెరిచి ఉంచడానికి అనుమతిస్తారు. ఈ చర్య వల్ల, చీప్ లిక్కర్ కోసం గోవాకు తరలివచ్చే లో బడ్జెట్ పర్యాటకుల సందడి కొంతవరకు తగ్గుతుందని ఆర్థిక మంత్రిత్వశాఖ అధికారి ఒకరు తెలిపారు. రాత్రిపూట గోవా బీచ్లలో పరుగులు తీస్తూ మద్యం తాగే పురుషుల వల్ల తమ భద్రతకు ప్రమాదం ఉందని పలువురు పర్యాటకులు ఫిర్యాదు చేయడంతో ఈ చర్య తీసుకున్నామన్నారు. దేశంలోనే అత్యంత చవకైన మద్యం గోవాలో దొరుకుతుంది.