Benami
-
హైదరాబాద్లో 11 చోట్ల ఈడీ సోదాలు
సాక్షి,హైదరాబాద్ : హైదరాబాద్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహించింది. విదేశాల నుంచి విరాళాలు తీసుకుని దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు రావడంతో ఆపరేషన్ మోబిలైజేషన్ గ్రూప్ పై 11చోట్ల ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.16 దేశాల్లోని పిల్లలకు ఆహారం, విద్య అందిస్తామని మోబిలైజేషన్ గ్రూప్ విదేశాల నుంచి రూ.300 కోట్ల విరాళాలు సేకరించింది. ఆ నిధుల్ని ఓం ఫౌండేషన్ పేరుతో దుర్వినియోగం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈడీ అధికారులు ఏపీ, తెలంగాణ, కేరళ మహారాష్ట్ర,కర్ణాటకలో ఈడీ సోదాలు జరిపారు.ఈ సోదాల్లో బినామీ పేర్లతో నిధుల్ని స్వాహా చేసినట్లు అధికారులు గుర్తించారు. -
గ్యాంగ్ ఆఫ్ పెత్తందార్స్
రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే అమరావతి అమరావతి రాజధాని నిర్మాణాన్నిచేపడతానని 2024 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన చంద్రబాబు.. సంపద సృష్టించి, సంక్షేమ పథకాలను అమలు చేస్తానని బీరాలు పలికారు. కానీ.. అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనకే చంద్రబాబు లెక్క ప్రకారం రూ.లక్ష కోట్లు అవసరం. జాప్యం జరిగితే ఆ వ్యయం మరింత అధికం కావచ్చు. రాష్ట్ర బడ్జెట్ను పరిగణనలోకి తీసుకుంటే మౌలిక సదుపాయాల కల్పనకే 20 ఏళ్లు పడుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. మిగతా ప్రాంతాల ప్రజల నోట్లో మట్టి కొట్టి, అమరావతిలో మౌలిక సదుపాయాలకు ఆ స్థాయిలో నిధులు ఖర్చు చేసినా రాష్ట్రానికి సంపద పెరగదు.చంద్రబాబు, బినామీలు, వందిమాగధుల భూముల ధరలే పెరుగుతాయి. వాటిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుని రూ.లక్షల కోట్లు కొల్లగొట్టాలన్నదే చంద్రబాబు ఎత్తుగడ. సాక్షి, అమరావతి : నోరు తెరిస్తే చాలు సంపద సృష్టిస్తానని బీరాలు పలుకుతున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు.. అది తన బినామీల కోసమేనని ఎన్నికల ప్రచారంలో పరోక్షంగా చాటిచెబుతున్నారు. తాను అధికారంలో ఉన్నప్పుడు అమరావతిలో భూముల ధరలు అమాంతం పెరిగితే.. ఇప్పుడు పడిపోయాయని గుంటూరులో బుధవారం నిర్వహించిన ప్రజాగళం సభలో చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేయడమే అందుకు నిదర్శనం.అమరావతి ఔటర్ రింగ్ రోడ్డును 185 కి.మీల పొడవున నిర్మించడానికి ప్రణాళిక రచించానని చెబుతూ రాజధాని నిర్మాణం కొనసాగి ఉంటే ఈపాటికి ప్రపంచ స్థాయి నగరం కళ్ల ముందుకు వచ్చేదని గ్రాఫిక్స్ కథలు వల్లె వేశారు. సీఎం జగన్ తన కలలను వమ్ము చేశారని.. అధికారంలోకి రాగానే అమరాతి నిర్మాణం చేపట్టడమే తన సంకల్పమని పునరుద్ఘాటించారు.అంటే.. ప్రభుత్వ ఖజానా నుంచి రూ.లక్ష కోట్లను వెదజల్లి అమరావతిలో మౌలిక సదుపాయాలను కల్పించి ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా తాను, తన బినామీలు, వందిమాగధులు కాజేసిన భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి రూ.లక్షల కోట్లు కొల్లగొట్టడానికి కట్టుబడి ఉన్నట్లుగా చంద్రబాబు తేటతెల్లం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో హైటెక్ సిటీ ముసుగులో మురళీమోహన్ వంటి బినామీలతో కలిసి కాజేసిన భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి రూ.వేలాది కోట్లు నొక్కేసిన తరహాలోనే ఇప్పుడూ అమరావతి పేరుతో రూ.లక్షల కోట్లు కొల్లగొట్టేందుకు స్కెచ్ వేశారు. రహాలోనే ఇప్పుడూ అమరావతి పేరుతో రూ.లక్షల కోట్లు కొల్లగొట్టేందుకు స్కెచ్ వేశారు. అంతర్జాతీయ కుంభకోణం రాజధాని లేకుండా విభజించి రాష్ట్రాన్ని కేంద్రం సంక్షోభంలోకి నెట్టిందని.. దాన్ని అవకాశంగా మల్చుకుని అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని నిర్మిస్తామని 2014 ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు ప్రకటించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని నిర్మాణం మాటేమోగానీ ఆ ముసుగులో అంతర్జాతీయ కుంభకోణానికి పాల్పడ్డారు. 2014 జూన్ 8న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు.. ఓత్ ఆఫ్ సీక్రసీకి తుట్లూ పొడిచి, రాజధాని ఏర్పాటు చేసే ప్రాంతంపై బినామీలు, వందిమాగధులకు లీకులు ఇచ్చారు. ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా రైతుల నుంచి తక్కువ ధరలకే తన గ్యాంగ్ ద్వారా భారీ ఎత్తున భూములు కాజేశాక రాజధానిని ప్రకటించారు.ఆ ప్రాంతానికి కనీసం రహదారి సౌకర్యం కల్పించకుండానే.. భూముల ధరలు పెంచడం కోసం తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ భవనాల నిర్మాణం చేపట్టి కమీషన్లు దండుకున్నారు. స్విస్ ఛాలెంజ్ విధానానికి తూట్లు పొడుస్తూ 1691 ఎకరాల్లో రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు నిర్మాణ పనులను సింగపూర్ ప్రైవేటు సంస్థల కన్సార్షియంకు కట్టబెట్టి.. ఆ ప్రాజెక్టుకు ప్రభుత్వ ఖజానా నుంచి రూ.5,500 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అంగీకరించారు. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి రూ.లక్ష కోట్లు కాజేయడానికి స్కెచ్ వేశారు.మూడు రాజధానులతో సమగ్రాభివృద్ధి భూ సమీకరణలో రైతులు ఇచ్చిన 33 వేల ఎకరాలు, అటవీ భూములు సహా మొత్తం 50 వేల ఎకరాల్లో రాజధాని నిర్మాణాన్ని చేపట్టాలని గత టీడీపీ సర్కార్ నిర్ణయించింది. నల్లరేగడి భూములతో కూడిన ఆ ప్రాంతంలో రహదారులు, డ్రైనేజీలు, విద్యుత్ సౌకర్యం వంటి కనీస మౌలిక సదుపాయాలను కల్పించి, అభివృద్ధి చేయడానికి ఎకరాకు రూ.2 కోట్లు వ్యయం అవుతుందని అప్పటి సీఎం చంద్రబాబు ప్రకటించారు. అంటే అమరావతిలో కేవలం కనీస మౌలిక సదుపాయాల కల్పనకే రూ.లక్ష కోట్లు అవసరం.కానీ.. రాష్ట్ర బడ్జెట్ నుంచి ఆ మేరకు కేటాయింపులు చేయడం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో నిపుణుల కమిటీ సూచనల మేరకు రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. విశాఖపట్నంను పరిపాలన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇదే అంశాన్ని 2024 ఎన్నికల మేనిఫెస్టోలోనూ సీఎం జగన్ పొందుపరిచారు. -
బాబు మార్కు దందా.. బినామీలకే సంపద
రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే అమరావతి అమరావతి రాజధాని నిర్మాణాన్నిచేపడతానని 2024 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన చంద్రబాబు.. సంపద సృష్టించి, సంక్షేమ పథకాలను అమలు చేస్తానని బీరాలు పలికారు. కానీ.. అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనకే చంద్రబాబు లెక్క ప్రకారం రూ.లక్ష కోట్లు అవసరం. జాప్యం జరిగితే ఆ వ్యయం మరింత అధికం కావచ్చు. రాష్ట్ర బడ్జెట్ను పరిగణనలోకి తీసుకుంటే మౌలిక సదుపాయాల కల్పనకే 20 ఏళ్లు పడుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. మిగతా ప్రాంతాల ప్రజల నోట్లో మట్టి కొట్టి, అమరావతిలో మౌలిక సదుపాయాలకు ఆ స్థాయిలో నిధులు ఖర్చు చేసినా రాష్ట్రానికి సంపద పెరగదు.చంద్రబాబు, బినామీలు, వందిమాగధుల భూముల ధరలే పెరుగుతాయి. వాటిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుని రూ.లక్షల కోట్లు కొల్లగొట్టాలన్నదే చంద్రబాబు ఎత్తుగడ. సాక్షి, అమరావతి : నోరు తెరిస్తే చాలు సంపద సృష్టిస్తానని బీరాలు పలుకుతున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు.. అది తన బినామీల కోసమేనని ఎన్నికల ప్రచారంలో పరోక్షంగా చాటిచెబుతున్నారు. తాను అధికారంలో ఉన్నప్పుడు అమరావతిలో భూముల ధరలు అమాంతం పెరిగితే.. ఇప్పుడు పడిపోయాయని గుంటూరులో బుధవారం నిర్వహించిన ప్రజాగళం సభలో చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేయడమే అందుకు నిదర్శనం.అమరావతి ఔటర్ రింగ్ రోడ్డును 185 కి.మీల పొడవున నిర్మించడానికి ప్రణాళిక రచించానని చెబుతూ రాజధాని నిర్మాణం కొనసాగి ఉంటే ఈపాటికి ప్రపంచ స్థాయి నగరం కళ్ల ముందుకు వచ్చేదని గ్రాఫిక్స్ కథలు వల్లె వేశారు. సీఎం జగన్ తన కలలను వమ్ము చేశారని.. అధికారంలోకి రాగానే అమరాతి నిర్మాణం చేపట్టడమే తన సంకల్పమని పునరుద్ఘాటించారు. అంటే.. ప్రభుత్వ ఖజానా నుంచి రూ.లక్ష కోట్లను వెదజల్లి అమరావతిలో మౌలిక సదుపాయాలను కల్పించి ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా తాను, తన బినామీలు, వందిమాగధులు కాజేసిన భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి రూ.లక్షల కోట్లు కొల్లగొట్టడానికి కట్టుబడి ఉన్నట్లుగా చంద్రబాబు తేటతెల్లం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో హైటెక్ సిటీ ముసుగులో మురళీమోహన్ వంటి బినామీలతో కలిసి కాజేసిన భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి రూ.వేలాది కోట్లు నొక్కేసిన తరహాలోనే ఇప్పుడూ అమరావతి పేరుతో రూ.లక్షల కోట్లు కొల్లగొట్టేందుకు స్కెచ్ వేశారు. రహాలోనే ఇప్పుడూ అమరావతి పేరుతో రూ.లక్షల కోట్లు కొల్లగొట్టేందుకు స్కెచ్ వేశారు. అంతర్జాతీయ కుంభకోణం రాజధాని లేకుండా విభజించి రాష్ట్రాన్ని కేంద్రం సంక్షోభంలోకి నెట్టిందని.. దాన్ని అవకాశంగా మల్చుకుని అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని నిర్మిస్తామని 2014 ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు ప్రకటించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని నిర్మాణం మాటేమోగానీ ఆ ముసుగులో అంతర్జాతీయ కుంభకోణానికి పాల్పడ్డారు. 2014 జూన్ 8న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు.. ఓత్ ఆఫ్ సీక్రసీకి తుట్లూ పొడిచి, రాజధాని ఏర్పాటు చేసే ప్రాంతంపై బినామీలు, వందిమాగధులకు లీకులు ఇచ్చారు. ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా రైతుల నుంచి తక్కువ ధరలకే తన గ్యాంగ్ ద్వారా భారీ ఎత్తున భూములు కాజేశాక రాజధానిని ప్రకటించారు.ఆ ప్రాంతానికి కనీసం రహదారి సౌకర్యం కల్పించకుండానే.. భూముల ధరలు పెంచడం కోసం తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ భవనాల నిర్మాణం చేపట్టి కమీషన్లు దండుకున్నారు. స్విస్ ఛాలెంజ్ విధానానికి తూట్లు పొడుస్తూ 1691 ఎకరాల్లో రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు నిర్మాణ పనులను సింగపూర్ ప్రైవేటు సంస్థల కన్సార్షియంకు కట్టబెట్టి.. ఆ ప్రాజెక్టుకు ప్రభుత్వ ఖజానా నుంచి రూ.5,500 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అంగీకరించారు. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి రూ.లక్ష కోట్లు కాజేయడానికి స్కెచ్ వేశారు.మూడు రాజధానులతో సమగ్రాభివృద్ధి భూ సమీకరణలో రైతులు ఇచ్చిన 33 వేల ఎకరాలు, అటవీ భూములు సహా మొత్తం 50 వేల ఎకరాల్లో రాజధాని నిర్మాణాన్ని చేపట్టాలని గత టీడీపీ సర్కార్ నిర్ణయించింది. నల్లరేగడి భూములతో కూడిన ఆ ప్రాంతంలో రహదారులు, డ్రైనేజీలు, విద్యుత్ సౌకర్యం వంటి కనీస మౌలిక సదుపాయాలను కల్పించి, అభివృద్ధి చేయడానికి ఎకరాకు రూ.2 కోట్లు వ్యయం అవుతుందని అప్పటి సీఎం చంద్రబాబు ప్రకటించారు. అంటే అమరావతిలో కేవలం కనీస మౌలిక సదుపాయాల కల్పనకే రూ.లక్ష కోట్లు అవసరం.కానీ.. రాష్ట్ర బడ్జెట్ నుంచి ఆ మేరకు కేటాయింపులు చేయడం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో నిపుణుల కమిటీ సూచనల మేరకు రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. విశాఖపట్నంను పరిపాలన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇదే అంశాన్ని 2024 ఎన్నికల మేనిఫెస్టోలోనూ సీఎం జగన్ పొందుపరిచారు. -
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
సాక్షి, అమరావతి: ఈ ఎన్నికలు పెత్తందారులు, పేదలకు మధ్య పోటీ.. ఆర్థిక నేరగాళ్లతో నిండిన టీడీపీ కూటమికి.. పేదల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా జైత్రయాత్ర చేస్తున్న ఈ ప్రభుత్వానికి మధ్య పోటీ.. ఈ ఎన్నికల్లో ఆర్థిక నేరగాళ్లకు చంద్రబాబు టికెట్లు కట్టబెట్టడమే కాకుండా..తన బినామీలను పక్క పార్టీలోకి పంపి అక్కడ కూడా వారిని బరిలో నిలిపారు. వ్యాపార వేత్తల ముసుగులో బ్యాంకుల నుంచి వందల కోట్ల రుణాలు తీసుకుని ఎగ్గొట్టిన ఈ వైట్కాలర్ ఆర్థిక నేరగాళ్లు సూచించిన వారికీ చంద్రబాబు టికెట్లిచ్చారు. రుణాల పేరుతో బ్యాంకులకు కన్నం పెట్టిన ఈ కేటుగాళ్లలో భీమిలి నుంచి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఉండి నుంచి రఘురామకృష్ణరాజు టీడీపీ నుంచి పోటీ చేస్తుండగా.. 2019 వరకు టీడీపీ రాజ్యసభ ఎంపీగా ఉన్న సీఎం రమేశ్, సుజనా చౌదరిలను బీజేపీలోకి పంపిన చంద్రబాబు.. వారికి టికెట్లు దక్కేలా ప్లాన్ చేశారు. అనకాపల్లి పార్లమెంటు నుంచి సీఎం రమేశ్, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి సుజనా చౌదరి పోటీ చేస్తున్నారు. ఈ నలుగురు బ్యాంకుల నుంచి సుమారు రూ.4,563 కోట్ల రుణాలు ఎగ్గొట్టి, సీబీఐ ఈడీ, బ్యాంకు జప్తు కేసులు ఎదుర్కొంటున్నారు. మోసాల్లో దిట్ట రఘురామకృష్ణరాజు రుణాల ఎగవేతలో విజయ్ మాల్యా, నీరవ్మోదీ సరసన నిలిచే కేటుగాడు రఘురామ కృష్ణరాజు. ఇండ్ భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్ పేరుతో రఘురామకృష్ణరాజు వివిధ బ్యాంకుల నుంచి సుమారు రూ.1,383 కోట్ల రుణాలు తీసుకున్నాడు. వీటిని కంపెనీ అవసరాలకు వాడకుండా వేరే ఖాతాల్లోకి మళ్లించి బ్యాంకుల్ని మోసగించాడు. పంజాబ్ నేషనల్ బ్యాంకు, దాని అనుబంధ బ్యాంకుల నుంచి ఇండ్–భారత్ థర్మల్ పవర్ పేరిట తీసుకున్న రూ.826.17 కోట్ల రుణాన్ని పక్కదారి పట్టించాడు. వడ్డీ కూడా చెల్లించలేదు. దీంతో బ్యాంకులు సీబీఐని ఆశ్రయించడంతో అతని మోసాలు వెలుగులోకి వచ్చాయి. తనఖాగా పెట్టిన భూముల్ని మోసపూరితంగా అమ్మేశాడని, 95 శాతం బొగ్గు తరిగిపోయిందని చెప్పి దాన్ని తగలబెట్టేశారని పంజాబ్ నేషనల్ బ్యాంకు ఫిర్యాదుతో సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. 2020 అక్టోబర్లో రఘురామకృష్ణరాజుకు చెందిన ఇళ్లు, కంపెనీలు, కార్యాలయాల్లో 11 సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందాలు సోదాలు నిర్వహించి పలు ఫైళ్లు, హార్డ్ డిస్కులు స్వా«దీనం చేసుకున్నాయి. కంపెనీకి చైర్మన్గా ఉన్న రఘురాజుతో పాటు ఆయన భార్య, కుమార్తె ఇతర డైరెక్టర్లపై కేసులు నమోదు చేశారు. ఇండ్–భారత్ సన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట విదేశాల్లో తీసుకున్న రుణాల్ని భారత్కు అక్రమంగా తరలించడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. 2011లో మారిషస్కు చెందిన స్ట్రాటజిక్ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ అనే కంపెనీ నుంచి రూ.202 కోట్లు రుణం తీసుకున్నారు. ఆ నిధులు అందిన మరుసటి రోజే రూ.200 కోట్లను ఇండ్ – భారత్ ఎనర్జీ లిమిటెడ్(ఉత్కళ్)కు తరలించేశారు. ఈ వ్యవహారం మొత్తం ఫారెన్ ఎక్స్చేంజ్ మైయింటెనెన్స్ యాక్ట్(ఫెమా) దృష్టిలో పడింది. ఫెమా అధికారులు మారిషస్ కంపెనీ నుంచి రూ.202 కోట్లు ఇండ్ భారత్ సన్ ఎనర్జీకి అందినట్లు గుర్తించారు. మరుసటి రోజే బదిలీ చేసినట్లు నిర్ధారించారు. ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్లు నిర్ధారణ కావడంతో ఈడీ రఘురామ కంపెనీకి రూ.40 కోట్లు పెనాల్టీ విధించింది. సుజనా చౌదరి.. ఎగవేతలో నంబర్ వన్ బ్యాంకుల నుంచి రూ. వేల కోట్ల రుణాలు తీసుకుని మోసగించిన ఘనుడు సుజనా చౌదరి. ఈ కేసులో ఈడీ దర్యాప్తుతో అతని మోసాలు వెలుగులోకి వచ్చాయి. రూ.1,289 కోట్ల జీఎస్టీ ఎగవేతతో పాటు రూ.700 కోట్ల బ్యాంకు రుణాల ఎగవేత కేసులున్నాయి. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత అనేక డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి ఎలాంటి వ్యాపారాలు చేయకుండానే రూ.1,289 కోట్ల ఇన్వాయిస్లు సుజనా కంపెనీలు తయారుచేశాయి.ఈ మొత్తంపై రూ.224 కోట్ల ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకున్నా్చ్ఠరు. దొంగ ఇన్వాయిస్లు చూపి బ్యాంకుల నుంచి రూ.700 కోట్ల రుణాలు తీసుకున్నారు. జీఎస్టీ విభాగం దర్యాప్తులో ఈ మోసం బయటపడటంతో గ్రూపునకు చెందిన డైరెక్టర్లను అరెస్ట్ చేశారు. బ్యాంకు రుణాలు తీర్చడం లేదని నల్లగొండ జిల్లాలో ఉన్న స్టీల్ ప్లాంటును బ్యాంకులు సీజ్ చేశాయి. విదేశీ బ్యాంకులకు కూడా సుజనా టోపీ పెట్టారు. మారిషస్ బ్యాంక్ నుంచి రూ.100 కోట్ల రుణం తీసుకొని చెల్లించకపోవడంతో ఆ బ్యాంక్ హైదరాబాద్ కోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో కోర్టు ఏకంగా అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. బ్యాంకుల నుంచి రుణాలు ఎగ్గొట్టిన వారికి కేంద్ర మంత్రి వర్గంలో చోటు ఇవ్వడానికి ప్రధాని మోదీ నిరాకరించినా చంద్రబాబు అతనికే ఇవ్వాలని పట్టుబట్టారు.బీజేపీ తీర్థం పుచ్చుకొని విజయవాడ పశ్చిమ నుంచి పోటీ చేస్తున్నారు. రూ. 500 కోట్లు ఎగవేతకు సంబంధించి ఎన్సీఎల్టీ(నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్)లో ఎస్బీఐ 2021లో దివాలా పిటిషన్ దాఖలు చేసింది. దీనిని పరిశీలించిన ఎన్సీఎల్టీ ఆ పిటిషన్కు అనుమతిస్తూ తాజాగా ఉత్తర్వులిచి్చంది.బినామీ ‘బాబు’..సీఎం రమేశ్చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, బినామీ సీఎం రమే‹శ్.. అతని అక్రమ లావాదేవీలను ఆదాయపన్ను శాఖ వెలికి తీసింది. సబ్ కాంట్రాక్టర్ల ముసుగులో పనులు చేయకుండానే చేసినట్లు చూపి రూ.800 కోట్ల నిధులు సొంత ఖాతాల్లోకి మళ్లించారు. పనులు చేయకుండానే చేసినట్లు బిల్లులు తీసుకుని వాటిని చిరునామా లేని కంపెనీల్లోకి మళ్లించి ఆ కంపెనీల నుంచి సీఎం రమే‹శ్ సంస్థ నగదును వెనక్కి తీసుకుంది. అతనికి చెందిన నిర్మాణ రంగ కంపెనీ రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సుమారు రూ.800 కోట్ల నిధులను వివిధ కంపెనీల ద్వారా దారి మళ్లించినట్లు ఐటీ శాఖ అధికారులకు ఆధారాలు లభించాయి. గత ఆరేళ్లలో ఎడ్కో(ఇండియా) అనే సబ్కాంట్రాక్టర్కు రూ.12 కోట్లు చెల్లించినట్లు పుస్తకాల్లో చూపారు. రికార్డుల్లో పేర్కొన్న నాలుగు చిరునామాల్లో ఆ కంపెనీ ఆనవాళ్లు ఎక్కడా కనిపించలేదు. రిత్విక్ ప్రాజెక్టులో అకౌంటెంట్గా పనిచేస్తున్న సాయిబాబా వద్ద ఎడ్కో కంపెనీకి చెందిన స్టాంపులు, సీల్ దొరకడంతో గుట్టు రట్టయ్యింది. దొంగ వ్యాపారాల ద్వారా సంపాదించిన మొత్తాన్ని పార్టీకి ఇచ్చి వరుసగా రెండుసార్లు రాజ్యసభ సీటు దక్కించుకున్నారనేది అందరికీ తెలిసిందే. కేసుల నుంచి తప్పించుకోవడానికి బీజేపీలో చేరి.. ఇప్పుడు ఆ పార్టీ నుంచి అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తున్నారు. గంటా శ్రీనివాసరావు.. రూ.390.7 కోట్ల ఎగవేత టీడీపీ హయాంలో మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాసరావు బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకొని తిరిగి చెల్లించకుండా ముప్పతిప్పలు పెడుతున్నారు. ప్రభుత్వ బ్యాంకుల నుంచి సుమారు రూ.390.7 కోట్ల రుణాలను తిరిగి చెల్లించకపోవడంతో అతని ఆస్తులను స్వా«దీనం చేసుకోవడానికి బ్యాంకులు ఐదేళ్లుగా పోరాడుతున్నాయి. గంటాకు సంబంధించిన ప్రత్యూష గ్రూపు కంపెనీలు వివిధ బ్యాంకులకు వడ్డీతో కలిపి రూ.390.7 కోట్లకుపైగా రుణం తీసుకొని ఇంతవరకు ఒక్క వాయిదా కూడా చెల్లించలేదు. ఆస్తుల స్వాధీనానికి ఇండియన్ బ్యాంకు రంగంలోకి దిగింది. ఈ రుణానికి గంటా హామీ ఉండడంతో ఆయనకు చెందిన ఆస్తులు స్వాధీనం చేసుకుంటున్నట్లు పత్రికా ప్రకటనలు జారీ చేసింది. గత నెలలో ఇండియన్ బ్యాంకు విశాఖలోని బాలయ్య శాస్త్రి లేఅవుట్లోని గంటా స్థలాన్ని వేలం వేసేందుకు పత్రికా ప్రకటన ఇచ్చింది. -
మాజీ ఎమ్మెల్యే బినామీకి రూ.61 కోట్ల జరిమానా
ధర్మవరం మాజీ ఎమ్మెల్యే అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. రోడ్డు మెటల్ క్వారీలను బినామీల పేరిట లీజుకు పొందారు. అక్రమంగా ఖనిజ రవాణా చేస్తున్న ఆయన ఇన్నేళ్లు అధికారులను భయభ్రాంతులకు గురి చేసి క్వారీల వైపు రాకుండా తన చీకటి వ్యాపారాన్ని సాగించారు. ఇటీవలే గనులశాఖ అధికారులు ఆ మాజీ ఎమ్మెల్యే స్టోన్ క్రషర్ యూనిట్ను తనిఖీ చేసి రోడ్డు మెటల్ నిల్వల్లో వ్యత్యాసాన్ని గుర్తించి రూ.1.60 కోట్ల జరిమానా విధించిన విషయం విదితమే. తాజాగా మాజీ ఎమ్మెల్యే బినామీ పేరిట ఉన్న రోడ్డు మెటల్ క్వారీని గనుల శాఖ అధికారుల బృందం తనిఖీ చేసి.. అక్రమ తవ్వకాలను గుర్తించింది. అనంతపురం టౌన్: క్వారీల మాటున ధర్మవరం మాజీ ఎమ్మెల్యే సాగిస్తున్న అక్రమ ఖనిజ రవాణా దందాలో కొండలను సైతం పిండి చేసేశారు. ప్రభుత్వానికి పైసా చెల్లించకుండా రోడ్డు మెటల్ తరలించి సొమ్ము చేసుకున్నారు. అనంతపురం రూరల్ మండలం చియ్యేడు పొలం సర్వే నంబర్ 231లో 4.6 హెక్టార్ల రోడ్డు మెటల్ కొండకు ఆ మాజీ ఎమ్మెల్యే బినామీగా పేరున్న కె.సాంబశివుడు లీజు పొందారు. లీజు పొందిన ప్రాంతంలో రోడ్డు మెటల్ తవ్వకాలను చేపట్టి.. మాజీ ఎమ్మెల్యే స్టోన్ క్రషర్ యూనిట్కు తరలించారు. లీజు పొందిన ప్రాంతంలో ఖనిజ నిల్వలు తగ్గిపోవడంతో పక్కనే ఉన్న మరో 1.5హెక్టార్లలో లీజు అనుమతులు లేకుండానే తవ్వకాలు చేపట్టి భారీగా రోడ్డు మెటల్ తరలించారు. ఏడాది కాలంగా ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించకుండా 6 లక్షల క్యూబిక్ మీటర్లకు పైగా రోడ్డు మెటల్ను తన క్రషర్కు తరలించి భారీగా సోమ్ము చేసుకున్నట్లు గనులశాఖ అధికారుల తనిఖీల్లో తేలింది. రూ.61.35 కోట్ల జరిమానా.. మాజీ ఎమ్మెల్యే బినామీ సాంబశివుడు క్వారీలో అక్రమ తవ్వకాలు చేసి రోడ్డు మెటల్ తరలించారు. దీంతో గనులశాఖ అధికారులు లీజు తీసుకున్న ప్రాంతానికి వెళ్లి కొలతలు తీశారు. లీజు ప్రాంతంతోపాటు పక్కనే ఉన్న మరో ప్రాంతంలో 1.5 హెక్టార్లలో అంటే 3.75 ఎకరాల విస్తీర్ణంలో తవ్వకాలు చేపట్టి 6.35 లక్షల క్యూబిక్ మీటర్ల రోడ్డు మెటల్ను తరలించినట్లు గుర్తించి క్వారీ నిర్వాహకునికి నోటీసులు జారీ చేశారు. అయితే నోటీసులకు ఎటువంటి స్పందనా లేకపోవడంతో రూ.61.35 కోట్ల జరిమానా విధిస్తూ.. ఆ మొత్తం చెల్లించాలని డిమాండ్ నోటీసు జారీ చేయడంతో పాటు రోడ్డు మెటల్ క్వారీని సీజ్ చేశారు. సీజ్ చేసినా ఆగని ఖనిజ రవాణా జరిమానా చెల్లించే వరకు ఖనిజం తవ్వకాలు చేపట్టరాదని గనులశాఖ అధికారులు నోటీసులు జారీ చేసి, క్వారీని సీజ్ చేసినా నిర్వాహకులు బేఖాతరు చేస్తున్నారు. క్వారీలో రాత్రి పూట అక్రమ తవ్వకాలు చేపట్టి రోడ్డు మెటల్ను మాజీ ఎమ్మెల్యే స్టోన్ క్రషర్ యూనిట్కు తరలిస్తున్నారు. సీజ్ చేసిన తర్వాత గనుల శాఖ అధికారులు క్వారీ వైపు కన్నెత్తి చూడడం లేదు. ఇదే అదనుగా భావించిన క్వారీ నిర్వాహకులు తవ్వకాలు చేపట్టి ఖనిజాన్ని తరలిస్తున్నారు. గనులశాఖ ఉన్నతాధికారులు స్పందించి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. పరిమితికి మించి తవ్వకాలు క్వారీ లీజు తీసుకున్న ప్రాంతంలో కాకుండా మరో ప్రాంతంలో తవ్వకాలు చేపట్టి రోడ్డు మెటల్ను తరలించినట్లు గుర్తించాం. దాదాపు 6.35 లక్షల క్యూబిక్ మీటర్ల మేర మెటల్ తరలించారు. దీంతో క్వారీ నిర్వాహకుడు సాంబశివుడికి రూ.61.35 కోట్ల జరిమానా విధించి క్వారీని సీజ్ చేశాం. సీజ్ చేసిన ప్రాంతంలో తవ్వకాలు జరుగుతున్న విషయం మాకు తెలియదు. మరోమారు క్వారీని పరిశీలిస్తాం. అక్రమంగా తవ్వకాలు చేపడితే క్రిమినల్ కేసుకు సిఫార్సు చేస్తాం. – నాగయ్య, గనులశాఖ డిప్యూటీ డైరెక్టర్ -
టెండర్లకే టెండర్ పెట్టారు
ఎక్కడైనా ఏవైనా పనులు చేపట్టాలంటే ముందుగా ఎంత ఖర్చవుతుందని అంచనా (ఎస్టిమేషన్) వేసుకోవాలి... ♦ ఆ తర్వాత ప్రభుత్వం నుంచి పరిపాలనాపరమైన అనుమతులు తీసుకోవాలి. ♦ అటు తర్వాత అంచనాకు అనుగుణంగా టెండర్లను ఆహ్వానించాలి. ♦ ఈ మేరకు నిర్దేశిత తేదీతో టెండర్ నోటిఫికేషన్ వేయాలి. ♦ దాఖలైన టెండర్లను పరిశీలించి కాంట్రాక్ట్ సంస్థను ఖరారు చేయాలి. ♦ అనంతరం వారితో ఒప్పందం కుదుర్చుకోవాలి. అప్పుడు పనులు మొదలెట్టాలి ♦ ఆ తర్వాత దశల వారీగా బిల్లులు చెల్లించుకుంటూ పోవాలి. ఏమిటీ నమ్మశక్యంగా లేదా.... అయితే ఒక్కసారి ఈ ఫొటో చూడండి.. ఇది వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని మర్రికుంట చెరువు. పైన చెప్పిన నిబంధనలేవీ పాటించకుండానే,టెండర్లు పిలవకుండానే దీన్ని ట్యాంక్ బండ్గా అభివృద్ధి చేయడంతోపాటు సుందరీకరణ పనులు కొనసాగించేస్తున్నారు. ఇలా అభివృద్ధి పనుల పేరిట నిబంధనలకు నీళ్లొదిలి.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ దోపిడీ పర్వానికి తెరలేపిన తీరుపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. ఎక్కడైనా.. ఏ ఊళ్లో అయినా ఇదే లెక్క.. అయితే వనపర్తి జిల్లాలోని మంత్రి ఇలాకాలో మాత్రం లెక్క వేరేగా ఉంటుంది. ♦ ముందుగానే పనులు చేపడతారు. ♦ పనులు పూర్తయ్యే దశలో అంచనాలు రూపొందిస్తారు. ♦ ఆ తర్వాత ప్రభుత్వం నుంచి పరిపాలనా అనుమతులుపొందుతారు. పోటీ లేకుండా గుట్టుచప్పుడు కాకుండాటెండర్ ప్రక్రియ ముగిస్తారు. ♦ బిల్లులు చేయించి.. డబ్బులు తీసేసుకుంటారు. ‘బినామీ’ కాంట్రాక్టర్లు..? నిబంధనల ప్రకారం ఒక్కోవర్క్ రూ.5 లక్షల వరకు అయితే నామినేషన్ పద్ధతిన కేటాయింపులు చేయాలి. అంతకంటే మించి అయితే టెండర్ పద్ధతిన కాంట్రాక్ట్లు అప్పగించాలి. కానీ వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన నాలుగు చెరువుల సుందరీకరణకు సంబంధించి ఒక్కో దానికి సుమారు రూ.30 లక్షలకు పైబడి వ్యయమవుతుందని అంచనా. ఈ మేరకు టెండర్ తప్పనిసరి కాగా.. పిలిస్తే పోటీ ఎక్కువ ఉంటుందనే ఉద్దేశంతో గుట్టుచప్పుడు కాకుండా కానిచ్చినట్లు తెలుస్తోంది. లోలోపల టెండర్ దక్కించుకున్న ప్రముఖ కాంట్రాక్టర్లు అధికార పారీ్టకి చెందిన నాయకులేనని తెలుస్తోంది. వీరంతా ఓ ముఖ్య నేతకు ప్రధాన అనుచరులుగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. నోరు మెదపని అధికారులు.. ప్రభుత్వం నుంచి అనుమతులు రాకుండానే పనులు ప్రారంభించడం.. పర్యవేక్షించాల్సిన ఇరిగేషన్, పంచాయతీరాజ్, అటవీ, మున్సిపల్ అధికారులు నోరు మెదపకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యనేత ఆదేశాల నేపథ్యంలో వారు నిబంధనలకు నీళ్లు వదిలినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. పనులు పూర్తయి న క్రమంలో వ్యయానికి మించి అంచనాలు రూపొందించి.. ఎక్కువ మొత్తంలో దండుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది లక్షి్మకుంట. 20వేల క్యూసెక్కుల నీటి సామర్థ్యంతో కూడిన ఈ చెరువు సుందరీకరణ పనులు 2021లో ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత సుమారు ఎనిమిది నెలల అనంతరం రూ.31.75 లక్షల వ్యయం అవుతుందని అంచనా వేశారు. 2022 సెప్టెంబర్లో పరిపాలనా అనుమతులు రాగా.. గత నెల 14న రూ.29.59 లక్షలు మంజూరయ్యాయి. పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో పనులు కొనసాగగా.. అటవీ శాఖ కు సంబంధించి కంపా నిధులు వెచ్చించారు. ఇది రాజనగరం చెరువు. ట్యాంక్ బండ్ నిర్మాణంతో పాటు సుందరీకరణ పనులు గత ఏడాది జనవరిలో ప్రారంభమయ్యాయి. సుమారు రూ.49 లక్షల వ్యయంతో అదే ఏడాది ఫిబ్రవరిలో ఎస్టిమేషన్ (అంచనా) వేయగా.. అదే నెలలో పరిపాలనాపరమైన అనుమతులు లభించాయి. మార్చిలో కాంట్రాక్ట్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోగా.. జూన్లో కొంత మేర బిల్లులు మంజూరయ్యాయి. 2021 ఆగస్టులో తాళ్లచెరువు సుందరీకరణ పనులు ప్రారంభం కాగా..గత ఏడాది ఫిబ్రవరిలో అంచనా వేసి ప్రభుత్వానికి పంపించారు.అనుమతులు రాగా.. మార్చిలో టెండర్ ప్రక్రియ పూర్తయి ఒప్పందం చేసుకున్నారు. ఆ తర్వాత జూన్లో బిల్లులు మంజూరయ్యాయి. -
శశికళకు షాక్
చెన్నై: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళకు చెందిన సుమారు రూ.15 కోట్లను ఆదాయ పన్నుల శాఖ జప్తు చేసింది. చెన్నై టీ నగర్లో ఆమె బినామీకి చెందిన ఆంజనేయ ప్రింటర్స్ బిల్డింగ్ను శుక్రవారం మనీల్యాండరింగ్ చట్టం కింద సీజ్ చేసింది. 2017-21 మధ్య దివంగత జయలలిత, శశికళలకు చెందిన రూ.2 వేల కోట్ల విలువైన ఆస్తులు జప్తు అయిన సంగతి తెలిసిందే. 2017 నుంచి 150 కంటే ఎక్కువ ప్రాంతాల్లో ఐటీ రైడ్లు జరిగాయి. ఆ సమయంలో ఆమె బెంగళూరు జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. 2020లో ఐటీ శాఖ.. శశికళ, ఆమె బంధువులకు చెందిన 84 ప్రాపర్టీలను రెండు ఫేజ్ల రైడ్లలో జప్తు చేసింది.నిందులో సిరుసతవూర్ ఫామ్ హౌజ్తో పాటు కొడనాడు ఎస్టేట్లోని ఆమె వాటా సైతం ఉన్నాయి. అక్రమాస్తుల కేసులో జయలలితతో పాటు శశికళ, ఇళవరసై, సుధాగరన్ పేర్లు ప్రముఖంగా తెరపైకి వచ్చాయి. -
Putin: ఇక పుతిన్ ఆస్తుల మీద వేట షురూ!
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. ఉక్రెయిన్ పరిణామాల తర్వాత ప్రపంచం మొత్తం ఆయన గురించి తెలుసుకోవాలనే ఆరాటపడుతోంది. అయితే Putin రాజకీయనేత మాత్రమే కాదు.. ఈ భూమ్మీద అత్యంత సంపద ఉన్న వ్యక్తుల్లో ఒకడు కూడా. ఆ విలువ కొన్ని ప్రపంచదేశాల వార్షిక బడ్జెట్ కంటే ఎక్కువనే ప్రచారం నడుస్తుంటుంది. తాజాగా డెయిలీ మెయిల్ వెబ్సైట్ మెయిల్ ఆన్లైన్ తాజాగా.. పుతిన్ ఆస్తుల మీద ఓ కథనం ఆసక్తికర ప్రచురించింది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ పై రష్యా దురాక్రమణ నేపథ్యంలో.. అమెరికా, పాశ్చాత్య దేశాలు ఇప్పుడు పుతిన్ ఆస్తులపై కన్నేసినట్లు ఆ కథనం పేర్కొంది. పుతిన్ ఆస్తుల విలువపై స్పష్టత కొరవడినప్పటికీ.. ఆయన ఆ ఆస్తుల్ని మొత్తం బినామీల రూపంలో భద్రపరుస్తున్నాడట. కుటుంబ సభ్యుల మొదలు.. చిన్ననాటి స్నేహితులు, కొందరు కేజీబీ సహచరుల పేరిట భద్రపరిచారని ఆ సంచలన కథనం వివరించింది. అంతేకాదు రష్యాలో ప్రతి ఒక్క రూబుల్(రష్యా కరెన్సీ)లో.. 50 శాతం వాటాను ఆయన తన బినామీల పేర బదలాయిస్తున్నారని పేర్కొంది. పుతిన్ మేనల్లుడు, అంతెందుకు పుతిన్ స్నేహితుడి కొడుకు సైతం 500 మిలియన్ డాలర్ల సంపదను కలిగి ఉండడం మాత్రమే కాదు.. రష్యా ధనికుల లిస్ట్లో వాళ్ల పేర్లు ఉండడం గమనార్హం. పుతిన్ మొత్తం ఆస్తుల విలువ రూ.15 లక్షల కోట్లు ఉండొచ్చని అంచనా వేసింది మెయిల్ ఆన్ లైన్ కథనం. బినామీల పేరిట విలాసవంతమైన భవనాలు, 700కి పైగా లగ్జరీ కార్లు, 58 విమానాలు ఉన్నట్టు వివరించింది. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా పుతిన్ కు భవంతులు, కంపెనీలు, వ్యాపారాలు ఉన్నట్టు తెలిపింది. రష్యాలోని అతిపెద్ద చమురు, సహజవాయువు కంపెనీలను వాడుకుని... పుతిన్ తన బినామీ సంస్థల ద్వారా పెద్దఎత్తున ఆస్తులు పోగేసినట్టు మెయిల్ ఆన్ లైన్ ఆరోపించింది. పుతిన్ అక్రమాస్తులపై ప్రశ్నించినందుకే.. రష్యా విపక్ష నేత అలెక్సీ నావల్నీని జైలుపాలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి కూడా. అంతేకాదు పన్నుల ఎగవేత, రష్యా చట్టాల నుంచి తప్పించుకునేందుకు ఈ భారీ బినామీ వ్యవహారానికి తెర తీసినట్లు ప్రచురించింది. ఇంగ్లండ్ లోని సర్రే ప్రాంతంలో పుతిన్ కుమార్తెలు నివసిస్తుండగా, వారి పేరు మీద పెద్ద మొత్తంలో ఆస్తులు ఉన్నట్టు ఎన్సీఏ భావిస్తోందని మెయిల్ ఆన్ లైన్ పేర్కొంది. అమెరికా.. మిత్ర దేశాలు పుతిన్ బినామీ ఆస్తులను లక్ష్యంగా చేసుకున్నాయని మెయిల్ ఆన్ లైన్ తన కథనంలో పేర్కొంది. ఈ బినామీ ఆస్తులు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుని, స్తంభింపజేసేందుకు వేట మొదలైందని వెల్లడించింది. ప్రస్తుతం బ్రిటన్ లోని పుతిన్ బినామీ ఆస్తులపై ఆ దేశ జాతీయ క్రైమ్ ఏజెన్సీ (ఎన్సీఏ) దర్యాప్తు ప్రారంభించిందని వెల్లడించింది. -
సర్దుకుంటున్న బినామీ డీలర్లు!
సాక్షి, అమరావతి: అధికారం అండతో పేదల నోళ్లుకొట్టి ఇన్నాళ్లూ దోచుకున్న పౌరసరఫరాల శాఖలోని కొందరు బినామీ డీలర్లు ఇప్పుడు బిక్కుబిక్కుమంటున్నారు. ఇప్పటివరకు చేసిన అక్రమాలు ఎక్కడ బయటపడతాయోనని బెంబేలెత్తిపోతున్నారు. కొత్త ప్రభుత్వంతో తమకు ఎలాంటి ఇబ్బందులు వస్తాయోననే భయంతో ఒక్కొక్కరు స్వచ్ఛందంగా తప్పుకుంటున్నారు. ఇందులో భాగంగానే అనంతపురం, కృష్ణా, గుంటూరుతో పాటు పలు జిల్లాల్లో దాదాపు 200 మంది బినామీ డీలర్లు ఇప్పటికే సర్దుకున్నట్లు సమాచారం. బ్లాక్మార్కెటింగ్లో నిష్ణాతులు పేదలకు అందాల్సిన సబ్సిడీ బియ్యం పంపిణీ చేయకుండా బ్లాక్ మార్కెట్కు తరలించి జేబులు నింపుకోవడంలో ఈ బినామీలు సిద్ధహస్తులు. ఇదే విషయాన్ని జిల్లా కలెక్టర్ల సమావేశంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనేకసార్లు చంద్రబాబునాయుడు దృష్టికి తెచ్చినా అలాంటివి ఎక్కడా జరగలేదని మంత్రులే అడ్డుపడేవారు. దీంతో వారి ఆగడాలకు అంతులేకుండాపోయింది. పలువురు ప్రజాప్రతినిధులకు కూడా వీరి దందాలో భాగం ఉండటంతో బినామీలు ఆడింది ఆట.. పాడింది పాటగా సాగింది. విజిలెన్స్ విభాగం సైతం చోద్యం చూసినట్లు వ్యవహరించిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. పక్కదారి ఎలా పట్టించారంటే.. ఈ–పోస్ మిషన్లకు సంబంధించిన సాఫ్ట్వేర్ను మార్పులుచేసి రాష్ట్రవ్యాప్తంగా ఈ బియ్యాన్ని పక్కదారి పట్టించారు. ఇందులో దాదాపు 260మంది రేషన్ డీలర్లతోపాటు పలువురు ప్రజాప్రతినిధుల ప్రమేయం ఉందని తేల్చినా వారిపై ఎలాంటి క్రిమినల్ చర్యలు తీసుకోలేదు. ప్రతినెలా 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు లబ్ధిదారులకు సబ్సిడీ సరుకులు పంపిణీ చేస్తారు. ఈ–పోస్ టెక్నీషియన్ల సహాయంతో పంపిణీకి ఆఖరి రెండ్రోజుల్లో అంటే 13, 14 తేదీల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన ఆధార్ నంబర్లను ఈ–పోస్ యంత్రాలకు అనుసంధానం చేసి గుట్టుచప్పుడు కాకుండా ఆ రేషన్ను పక్కదారి పట్టించారు. ఇందులో అనంతపురం, కర్నూలు జిల్లాలకు చెందిన నాయకులు, రేషన్ డీలర్ల ప్రమేయం ఉందని గతంలో గుర్తించారు. రూ.8కి కొనుగోలు చేసి.. ఇదిలా ఉంటే.. బినామీ డీలర్లపై ఎలాంటి చర్యలు లేకపోవడంతో వారు మరింత చెలరేగిపోయారు. సబ్సిడీ బియ్యాన్ని కార్డుదారుల నుంచే ఏకంగా కిలో రూ.8 చొప్పున కొనుగోలు చేసి వాటిని నేరుగా మిల్లర్లకు రూ.15కు విక్రయిస్తున్నారు. ఆ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి తిరిగి ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. పేదల బియ్యాన్ని కొనుగోలు చేసే రేషన్ డీలర్, బియ్యం విక్రయించిన లబ్ధిదారుడిపై కేసులు నమోదు చేస్తామని సర్కారు జారీచేసిన జీఓ కాగితాలకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కొత్త సర్కారు ఏర్పడుతుండడంతో మున్ముందు చర్యలు ఎలా ఉంటాయోనన్న అనుమానంతో బినామీ డీలర్లు ఒకొక్కరుగా తప్పుకుంటున్నారు. 805 షాపులకు బినామీ డీలర్లు రాష్ట్రం మొత్తం మీద 29 వేల మంది రేషన్ డీలర్లు ఉంటే ఇందులో 805 రేషన్ షాపులకు బినామీ డీలర్లు ఉన్నారు. ఈ షాపులకు వెంటనే రెగ్యులర్ డీలర్లను నియమిస్తే అక్రమాలకు అడ్డుకట్ట వేయొచ్చని అధికారులు ఎన్నిసార్లు మొత్తుకున్నా చంద్రబాబు సర్కారు పట్టించుకున్న దాఖలాల్లేవు. దీంతో నాలుగేళ్లుగా బినామీ డీలర్లు సబ్సిడీ బియ్యాన్ని బొక్కేస్తూ వచ్చారు. ఆ శాఖకు ప్రాతినిధ్యం వహించిన మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సొంత జిల్లా గుంటూరులోనే అత్యధికంగా 302 మంది బినామీ డీలర్లు ఉన్నారు. ఆ జిల్లాలో విచ్చలవిడిగా సబ్సిడీ బియ్యం పక్కదారి పడుతోందనే ఆరోపణలు ఉన్నా అధికారులు చేసేదిలేక మిన్నకుండిపోయారు. నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో అయితే.. రేషన్ మాఫియాను నడుపుతున్న టీడీపీ నాయకుడు బాబూరావును గతంలో పోలీసులు అరెస్టుచేసినా ఫలితంలేదు. -
బినామీ పేరుతో ఎమ్మెల్యే సబ్సిడీ వాహనాలు
-
ఉప్పులేటి కల్పనా.. మజాకానా !
సాక్షి, అమరావతి బ్యూరో : పేదల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలు చేస్తున్న పలు పథకాలను అధికార టీడీపీ ప్రజాప్రతినిధులు చేజిక్కించుకుని లక్ష్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కృష్ణాజిల్లా పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన కేంద్రప్రభుత్వ నిధులతో మంజూరైన రాయితీ వాహనాన్ని బినామీ పేరుతో తీసుకుని దర్జాగా వాడుకుంటున్న వైనం వెలుగుచూసింది. నిబంధనలకు పాతర.. కేంద్రప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ యువతకు ఉపాధి కోసం నేషనల్ షెడ్యూల్ క్యాస్ట్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎన్ఎస్ఎఫ్డీసీ) ద్వారా సబ్బిడీతో వాహనాలను అందజేస్తోంది. మొవ్వ గ్రామానికి చెందిన దగాని క్రాంతికిరణ్ ఎన్ఎస్ఎఫ్డీసీ పథకం ద్వారా దరఖాస్తు చేయగా సుమారు రూ.20 లక్షల విలువైన ఇన్నోవా వాహనాన్ని మంజూరు చేశారు. ఆ వాహనాన్ని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ పేరుతో ఏపీ 16టీపీ 0661 నంబర్తో ఈ ఏడాది మార్చి ఒకటిన గుడివాడ ఆర్టీఏ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేశారు.అయితే రిజిస్ట్రేషన్ చేయడంలో నిబంధనలు పాటించలేదు. ట్యాక్సీ ట్రావెల్ కింద చూపితే ఎల్లో ప్లేట్ ఉండాలి. కానీ కారు యజమానిగా చూపి వైట్ ప్లేట్ వేయించుకుని నిబంధనలు ఉల్లంఘించారు. పామర్రు ఎమ్మెల్యే దగ్గరుండి రిజిస్ట్రేషన్ చేయించుకుని ఇన్నోవా వాహనంపై పామర్రు ఎమ్మెల్యేగా స్టిక్కర్ వేయించుకుని తిరుగుతున్నారు. దగాని క్రాంతికిరణ్ ఎమ్మెల్యే బినామీ మాత్రమేనని నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. అతని పేరుతో రాయితీతో కూడిన భూమి కొనుగోలు పథకం, వ్యక్తిగత రుణాలు మంజూరు చేయించి వాడుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ వెబ్సైట్లో కారు రిజిష్ట్రేషన్ వివరాలు. ఇందులోనే కారు యజమాని దగాని క్రాంతి కిరణ్ పేర్కొన్న దృశ్యం సొమ్మొకరిది సోకు మరొకరిది కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్ కులాలలో పేదవర్గాలకు ఎన్ఎస్ఎఫ్డీసీ పథకం కింద అందించే వాహనాలకు నిధులు పూర్తిస్థాయిలో కేంద్ర ప్రభుత్వమే భరిస్తోంది. ఈ పధకం ద్వారా మంజూరైన వాహనానికి 35% సబ్సిడీ ఉంటుంది. 2% మాత్రం లబ్ధిదారుని వాటాగా చెల్లించాలి. మిగిలిన 63% రుణ సౌకర్యం కల్పిస్తారు. వాహనాన్ని ట్రావెల్స్లో తిప్పి రుణం చెల్లించాల్సి ఉంది. కానీ రాష్ట్రప్రభుత్వం ఈ వాహనాలను తామే ఇస్తున్నట్లు బిల్డప్ ఇచ్చేలా వాహనంపై థ్యాంక్యూ సీఎం సార్ పేరుతో స్టిక్కర్లు వేసి పంపిణీ చేశారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ గతంలో వాహనంపై సీఎం స్టిక్కర్ తొలగిస్తే వాహనాన్ని స్వాధీనం చేసుకుంటామని చెప్పడం వివాదమైంది. గతంలోనూ నెల్లూరు జిల్లాలో టీడీపీ మాజీ మంత్రి తన డ్రైవర్ పేరుతో ఇన్నోవా వాహనం తీసుకున్న విషయం వెలుగులోకి వచ్చింది. పేదవర్గాల పేరుతో రాయితీ పథకాలను టీడీపీ నేతలు బొక్కేయడంపై దళితులు మండిపడుతున్నారు. పేదలకు పంపిణీ చేశాం కృష్ణా జిల్లాలో ఎన్ఎస్ఎఫ్డీసీ ద్వారా దరఖాస్తులు చేసుకున్న వారికి వాహనాలు పంపిణీచేశాం. నిబంధనల మేరకే వాహనాలను మంజూరు చేశాం. లబ్ధిదారుల్లో ప్రజాప్రతినిధుల బినామీలు ఉన్నారన్న విషయం మాకు తెలియదు. – సత్యనారాయణ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ, కృష్ణాజిల్లా -
ఆ అనుబంధానికి సాక్ష్యం ఇదే..
దేవరపల్లి: గోపాలపురం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుకు కాంట్రాక్టర్ రాజేష్ బినామీగా వ్యవహరిస్తున్నట్టు ఇటీవల అధికారపార్టీ నాయకులు బాహాటంగా ఆరోపించారు. రాజేష్ ఎవరో తనకు తెలియదని, అతను తన బంధువు కాదని ఇటీవల ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు ప్రకటించారు. ‘అభివృద్ధి ముసుగులో అవినీతి దందా’ శీర్షికన ‘సాక్షి’లో గత వారం కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు తనకు రాజేష్తో ఎటువంటి అనుంబంధం లేదని విలేకరుల సమావేశం నిర్వహించి మరీ చెప్పారు. అయితే ఎమ్మెల్యే ముప్పిడితో రాజేష్కు గల అనుబం«ధానికి నిదర్శనంగా ఈ చిత్రం చూడవచ్చు. మరి ఇదే రకమైన అనుబంధమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. -
‘సీఎం’ల బినామీ శేఖర్రెడ్డి
సాక్షి ప్రతినిధి, చెన్నై: రాష్ట్రంలో సాగుతున్న ఇసుక అమ్మకాలు అక్రమాల్లో సీఎం ఎడపాడి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్సెల్వంలకు ఇసుక కాంట్రాక్టర్ శేఖర్రెడ్డి బినామీ కథనాయకుడని డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షులు స్టాలిన్ ఆరోపించారు. శేఖర్రెడ్డికున్న రాజకీయ అండదండల వల్లనే రూ.33.6 కోట్ల విలువైన కొత్త కరెన్సీ ఆయనకు ఎలా దక్కిందనే విషయం బయటకు రావడం లేదని స్టాలిన్ గురువారం విడుదల చేసిన ప్రకటనలో వ్యాఖ్యానించారు. ఎస్ఆర్ఎస్ కంపెనీ పేరున రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక క్వారీలు నడిపే కాంట్రాక్టర్ శేఖర్రెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ అధికారులు గత ఏడాది డిసెంబరు 8వ తేదీన దాడులు నిర్వహించి రూ.170 కోట్ల నగదు, రూ.178 కిలోల బంగారును స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తంలో రూ.33.6 కోట్ల విలువైన రూ.2000 నోట్ల కొత్త కరెన్సీ ఉండడం కేసు తీవ్రతను పెంచింది. శేఖర్రెడ్డి చేతికి ఇంత భారీ మొత్తంలో కొత్త కరెన్సీ ఎలా వచ్చిందో తమకు తెలియదని సీబీఐకి ఆర్బీఐ సమాధానం చెప్పడం మరింత కలకలం రేపింది. ఈ కేసు విచారణపై స్టాలిన్ స్పందిస్తూ, ఆర్బీఐ అదుపాజ్ఞల్లో పనిచేసే కరెన్సీ ముద్రణాలయాలు, బ్యాంకుల ద్వారా మాత్రమే శేఖర్రెడ్డి భారీ మొత్తంలో సొమ్ము ముట్టే అవకాశం ఉంది, అయితే ఆ సొమ్ము ఎలా చేరిందో తమకు తెలియదని ఆర్బీఐ చెప్పడం ఆశ్చర్యమే కాదు తనను దిగ్బ్రాంతికి గురిచేసిందని అన్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లోని కరెన్సీ ముద్రణాలయాలు కేంద్రప్రభుత్వం, కర్ణాటక, పశ్చిమబెంగాల్లోని ముద్రణాలయాలు ఆర్బీ ఐ అదుపాజ్ఞల్లో పనిచేస్తాయని ఆయన అన్నారు. రూ. 33.6 కోట్లు ఏ ప్రెస్, బ్యాంకు నుంచి శేఖర్రెడ్డికి చేరా యో సీబీఐ కనుగొనలేక పోవడం నమ్మశక్యంగా లేదని అన్నారు. శేఖర్రెడ్డి కేసులో ఆధారాలు దొరకలేదు, రాష్ట్రంలో గుట్కా అక్రమ అమ్మకాల విచారణలో ఐటీ అధికారులు అందజేసిన ప్రకటన కనపడటం లేదు, గడిచిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో కంటైనర్ ద్వా రా రూ.570 కోట్ల రవాణా అయిన సంగతి ఎన్నికల కమిషన్కు,ఆర్బీఐకి తెలియకపోవడం విచిత్రమన్నారు. ఐటీ అధికారుల దాడులన్నీ అంతరంగికం తమిళనాడుకు సంబంధించి ఐటీ అధికారులు జరిపిన దాడులన్నీ అంతరంగికంగా మారడం గమనార్హమని స్టాలిన్ ఆరోపించారు. రాష్ట్రంలోని అక్రమ ఆర్థిక లావాదేవీలన్నీ పథకం ప్రకారం అటకెక్కడంపై ప్రభుత్వం వద్ద సమాధానం లేదని, ఈ పరిస్థితుల్లో సీఎం ఎడపాడి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్సెల్వంల అక్రమార్జనకు శేఖర్రెడ్డి బినామీ కథానాయకుడన్న సంగతిని గుర్తు చేసుకోవాలని చెప్పారు. ఆర్థిక అవకతవకలపై తమ పార్టీ వచ్చేనెల 8వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా బ్లాక్డే అనుసరిస్తుండగా, తమకు పోటీగా అదే రోజున దేశవ్యాప్తంగా నల్లధన నిర్మూల దినం పాటిస్తున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ ప్రకటించడం రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలు సృష్టించడానికేనని విమర్శించారు. శేఖర్రెడ్డికి రూ.33.6 కోట్లు ఎలా వచ్చాయా తెలియని స్థితిలో ఆర్బీఐ ఉన్నపుడు కేంద్రప్రభుత్వ నల్లధన నిర్మూలన ఏ రీతిలో సాగుతోందో అర్థం అవుతోందని ఎద్దేవా చేశారు. శేఖర్రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేల అక్రమార్జనలపై జరిపిన ఐటీ దాడులపై వెంటనే చర్య తీసుకునేలా నల్లధన నిర్మూలనం రోజున కేంద్రం ఒక ప్రకటన చేయాలని ఆయన కోరారు. అలాగే, శేఖర్రెడ్డికి రూ.2000 కొత్త నోట్లు ఎలా వచ్చాయనే వివరాలను ఆర్బీఐ అధికారులు వెంటనే సీబీఐకి అందజేసి చార్జీషీటు దాఖలుకు సహకరించాలని స్టాలిన్ విజ్ఞప్తి చేశారు. -
భూమంత్రకాళీ
♦ చూడు జాగ..వేసెయ్ పాగా ♦ చిరమనలో 55 ఎకరాలకు పైగా భూమి హాంఫట్ ♦ మార్కెట్ విలువ రూ.3 కోట్లకు పైనే ♦ రెవెన్యూ అధికారులు, నాయకుల నిర్వాకం రెవెన్యూ అధికారులు.. నాయకులు ఏకమయ్యారు. 55 ఎకరాల ప్రభుత్వ భూమిని బినామీ పేర్లతో కట్టబెట్టేశారు. పట్టాదార్ పాస్ పుస్తకాలు సైతం జారీ చేశారు. ఏఎస్ పేట మండలం చిరమన గ్రామంలో ఈ భారీ కుంభకోణం వెలుగు చూసింది. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లినా పట్టించుకోవడం లేదు. ఆత్మకూరు రూరల్ : సెంటు భూమి కోసం పేదోళ్లు కాళ్లరిగేలా తిరిగినా పట్టించుకోరు. ప్రభుత్వ ఉత్తర్వులు రావాల్సి ఉందని.. అప్పటివరకు ఆగాలని కుంటిసాకులు చెబుతారు. నాయకులకు మాత్రం ఎకరాలకు ఎకరాలు కట్టబెట్టేస్తున్నారు. ఏఎస్ పేట మండలంలోనూ ఇలాంటి కుంభకోణం వెలుగు చేసింది. ఎంపీటీసీ సభ్యుడిగా వ్యవహరిస్తున్న టీడీపీ నాయకుడొకరు రెవెన్యూ అధికారులను మచ్చిక చేసుకుని ఏఎస్ పేట మండలం చిరమన గ్రామంలో 40ఎకరాలకు పైగా భూమిని.. అతడి శిష్యుడు చిరమన మజరా కన్నెదారి వారిపల్లెలో 14.73 ఎకరాల భూమిని హస్తగతం చేసుకున్నారు. బినామీ పేర్లతో భూములు పొందిన నేతలు తమ గుప్పెట్లో పెట్టుకున్నారు. చిరమన గ్రామంలోని సర్వే నంబర్ 878/3, 881లలో లేబూరు పరమేశ్వర్లు పేరుతో 4.69 ఎకరాలు, సర్వే నంబర్ 882లో వాయిలేటి వీరయ్య పేరుతో 4.36 ఎకరాలు, 883/1లో జులుమూడి రాధయ్య పేరుతో 5 ఎకరాలు, 882/2, 884లో నలగండ్ల సుందరయ్య పేరుతో 4.85 ఎకరాలు, 885/1లో వాయిలేటి రమణయ్య పేరుతో 4.16 ఎకరాలు, 885/2లో లేబూరి ప్రభాకర్ పేరుతో 4.76 ఎకరాలు, 879లో నాటకరాని వెంకటయ్య పేరుతో 4.32 ఎకరాలు, సర్వే నంబర్ 886/2లో 4 ఎకరాలు కలిపి 36.13 ఎకరాల సీజేఎఫ్ఎస్ భూమిని టీడీపీ నేత పొందారు. ఇదే గ్రా మంలో మరికొంత భూమిని కూడా కబ్జా చేశాడు. సర్వే నంబర్ 882లోని భూమిని తన కోడలు, సర్వే నంబర్ 885/1లో భూమిని తన కుమార్తె పేరిట ఇటీవల మార్పించుకున్నాడు. సదరు నాయకుడికి గ్రామంలో 50 ఎకరాలకు పైగా భూమి ఉండగా.. ప్రభుత్వ భూమిని సైతం హస్తగతం చేసుకున్నాడు. వాళ్లెవరో.. భూములు పొందిన బినామీదారులకు చిరమన గ్రామంతో అసలు సంబంధమే లేదు. వారికి గ్రామంలో ఓట్లు, రేషన్కార్డులు గాని లేవు. వారు ఏ గ్రామానికి చెందిన వారో కూడా ఎవరికీ తెలియదు. అయితే సదరు నేత తనకున్న రాజకీయ, ఆర్థిక బలంతో రెవెన్యూ అధికారులను లోబరుచుకుని ప్రభుత్వ భూములను కాజేశాడు. వాటికి హక్కులు పొంది అనుభవిస్తున్నాడు. ఐదేళ్లుగా ఆ భూములు ఆయన ఆధీనంలోనే ఉన్నాయి. అదే బాటలో శిష్యుడు ఆ నాయకుడికి శిష్యుడైన మరో టీడీపీ నేత ఆయన అండదండలతో చిరమన పంచాయతీ పరిధిలోని కన్నెదారివారిపల్లెలో 14.73 ఎకరాలను కబ్జా చేశాడు. సర్వే నంబర్ 1028/1లో దాసరి శ్రీరాములు పేరుతో 3.28 ఎకరాలు, 1028/2లో 11.45 ఎకరాల ప్రభుత్వ భూమిని మరో పేరుతో కాజేశాడు. అయితే దాసరి శ్రీరాములు అనే వ్యక్తి ఆ గ్రామంలోనే లేడు. ఈ భూమిలో బోరు వేసుకున్న ఆయనకు విద్యుత్ కనెక్షన్ మంజూరు చేసేందుకు అధికారులు సిఫార్సు చేయడం గమనార్హం. వివిధ పేర్లతో అనుభవదారులుగా సృష్టించుకుని సుమారు రూ.3 కోట్ల విలువ గల ఆ భూములను టీడీపీ నాయకులిద్దరూ హస్తగతం చేసుకున్న వైనంపై జిల్లా కలెక్టర్కు, భూ పరిపాలన శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం కొసమెరుపు. -
బినామీ లావాదేవీలు చేస్తే భారీ జరిమానా
న్యూఢిల్లీ: బినామీ లావాదేవీలు నిర్వహిస్తే ఏడేళ్ల వరకు కఠిన కారాగార శిక్షతో పాటు భారీ జరిమానా ఉంటుందని ఆదాయ పన్నుల (ఐటీ) శాఖ హెచ్చరించింది. ఈ మేరకు శుక్రవారం ప్రకటన జారీ చేసింది. బినామీ ప్రాపర్టీ ట్రాన్సాక్షన్స్ చట్టం- 1988 ప్రకారం ఎవరూ బినామీ లావాదేవీలు జరపడానికి వీల్లేదని, ఈ చట్టం 2016 నవంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిందని పేర్కొంది. దీని ప్రకారం బినామీగా వ్యవహరించిన వ్యక్తి, వాస్తవ ఆస్తిపరుడు, సాయం చేసిన వారు అందరూ శిక్షార్హులే. అటువంటి వారికి 7 ఏళ్ల వరకు జైలు, బినామీ ఆస్తి మార్కెట్ ధరలో 25 శాతం జరిమానా కట్టాల్సి ఉంటుందని ఐటీ శాఖ తెలిపింది. ఒకవేళ అధికారులకు బినామీ ఆస్తులకు సంబంధించి తప్పుడు సమాచారం ఇస్తే ఐదేళ్ల వరకు జైలు శిక్ష, ఆస్తి మార్కెట్ ధరలో 10 శాతం జరిమానా కట్టాల్సి ఉంటుందని పేర్కొంది. అలాగే, సంబంధిత బినామీ ఆస్తిని గుర్తిస్తే ప్రభుత్వం దాన్ని జప్తు చేస్తుందని వెల్లడించింది. ఈ చట్టం గతేడాది అమల్లోకి వచ్చినప్పుటి నుంచి దేశవ్యాప్తంగా 230 కేసులు రిజిస్ట్రర్ కాగా, రూ. 55 కోట్ల విలువైన ఆస్తులు అటాచ్ అయ్యాయి. అలాగే రూ. 200 కోట్ల ఆస్తులకు సంబంధించి ఐటీ శాఖ 140 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 124 కేసులకు సంబంధించి ఇప్పటి వరకు రూ. 55 కోట్ల విలువైన బినామీ ఆస్తులను అటాచ్ చేసినట్లు ఐటీ శాఖ తన ప్రకటనలో పేర్కొంది. అటాచ్ అయిన ఆస్తుల్లో బ్యాంకు డిపాజిట్లు, వ్యవసాయ, ఇతర భూములు, ప్లాట్లు, జ్యువెలరీ మొదలైనవి ఉన్నాయని అధికారులు వెల్లడించారు. -
అధికారి.. అడ్డదారి
⇒ బినామీ పేర్లతో భూకబ్జాకు పాల్పడుతున్న రెవెన్యూ యంత్రాంగం ⇒ ఇటీవల పుల్లంపేటలో బయటపడిన వ్యవహారమే నిదర్శనం ⇒ మరి కొన్నిచోట్ల భూఆక్రమణల్లో వీఆర్వోలు, ఇతర అధికారులు ⇒ వివాదాస్పదమవుతున్న ఆక్రమణల వ్యవహారం ⇒ పలుచోట్ల భూములు, స్థలాలు లాగేసుకుంటున్న తమ్ముళ్లు ⇒ ఉన్నతాధికారులు కొరడా ఝుళిపిస్తేనే ఫలితం సాక్షి, కడప/ పుల్లంపేట: ప్రజల ఆస్తులకు, భూములకు రక్షణ లేకుండా పోతోంది. ఒకపక్క తెలుగుదేశం పార్టీ నాయకులు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని భూకబ్జాలకు పా ల్పడుతుండగా, వారికి తామేమీ తక్కువ కాదన్నట్లు జిల్లాలో పనిచేస్తున్న కొంతమంది రెవెన్యూ అధికారులు ఆక్రమణలకు పాల్పడుతున్నారు. ఏకంగా కొంతమంది అధికారులు బినామీ పేర్లతో భూములను పోగుచేసుకోవడం వివాదాస్పదమవుతోంది. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన అధికారులే అక్రమాలకు పాల్పడుతున్నారు. జిల్లాలో ఇలాంటి వ్యవహారాలు అక్కడక్కడా వెలుగుచూస్తున్నా ఉన్నతాధికారులు కొరఢా ఝళిపించకపోవడం విమర్శలకు తావిస్తోంది. బినామీల పేరుతో అక్రమణలు జిల్లాలో ఒకప్పుడు ఎక్కడచూసినా బంజరు భూమి కనిపించేది. పెరిగిపోయిన ప్రజావసరాల దృష్ట్యా రానురాను భూమి తరిగిపోయింది. అయితే ఇదే అదునుగా కొంతమంది అక్రమాలకు తెరలేపారు. బినామీలుగా బంధువులను, అనుకూలమైన వారిని ఎంపిక చేసుకుని ఏదో ఒకచోట పాగా వేస్తున్నారు. ఆక్రమణలను అడ్డుకోవాల్సిన అధికారులే అక్రమార్కులతో చేతులు కలిపి ఇలా చేస్తుండడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. పుల్లంపేట, పోరుమామిళ్ల, కాశినాయన, మైలవరం ఇలా అనేకచోట్ల రెవెన్యూ యంత్రాంగం అందినకాడికి ఆక్రమించుకునే పనిలో పడినట్లు ఆ శాఖలోనే చర్చ జరుగుతోంది. ఆన్లైన్ పేరుతో దోపిడీ జిల్లాలో విలువైన భూములున్న ప్రాంతాల్లో తహసీల్దార్లు ఆన్లైన్ దోపిడీకి తెరలేపుతున్నారు. ఎంతోకొంత ముట్టజెప్పందే భూములను ఆన్లైన్లో ఎక్కించడం లేదన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. బద్వేలు నియోజకవర్గంతోపాటు కమలాపురం, రాయచోటి, మైదుకూరు నియోజకవర్గాల్లో ఎక్కువగా ఆన్లైన్ పేరుతో దోపిడీ వ్యవహారాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏది ఏమైనా ఉన్నతాధికారులు దృష్టిసారిస్తే తప్ప అనేక అంశాలు బయటపడవు. కొత్తగా వచ్చిన డీఆర్వోనైనా ఆక్రమణలు, భూకబ్జాలాంటి వ్యవహారాలపై ప్రత్యేక పరిశీలన జరిపితే కొత్త కోణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. -
230 కేసులు.. 55 కోట్ల జప్తు
బినామీ లావాదేవీల చట్టం కింద నమోదు చేసిన ఆదాయ పన్ను శాఖ న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు అనంతరం తీసుకున్న చర్యల్లో భాగంగా బినామీ లావా దేవీల చట్టం కింద దేశవ్యాప్తంగా 230 కేసులను ఆదాయ పన్ను శాఖ నమోదు చేసింది. సుమారు రూ.55 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. ‘ఫిబ్రవరి రెండో వారం నాటికి సుమారు 230కి పైగా కేసు లు నమోదు చేశాం. అందులో 140 కేసుల కు సంబంధించి రూ.200 కోట్ల విలువైన ఆస్తుల జప్తునకు షోకాజ్ నోటీసులు జారీ చేశాం. ఇప్పటివరకు 124 కేసుల్లో రూ.55 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేశాం’ అని ఆదాయ పన్ను శాఖ తన నివేదికలో పేర్కొంది. బ్యాంకు ఖాతాలు, వ్యవసాయ, ఇతర భూములు, ఇళ్లు, ఆభరణాలు తదితరాలు జప్తు చేసిన ఆస్తుల్లో ఉన్నాయని అధికారులు తెలిపారు. గత నవంబర్ 1 నుంచే అమల్లోకి వచ్చేలా బినామీ లావాదేవీల చట్టాన్ని కేంద్రం రూపొందిం చింది. ఈ చట్టాన్ని అతిక్రమించిన వారికి భారీ జరిమానాతోపాటు, ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించే అవకాశం ఉంది. -
బినామీలే!
సగం రేషన్ షాపులు బినామీల చేతుల్లోనే.. ఏళ్లుగా ఇదే వ్యవహారం కామారెడ్డి :జిల్లాలో 575 రేషన్ షాపుల పరిధిలో 2,28,260 ఆహారభద్రత కార్డులు, 16,419 అంత్యోదయ కార్డులు, 1,090 అన్నపూర్ణ కార్డులు ఉన్నాయి. నెలలో పక్షం రోజుల పాటు రేషన్ సరకులు సరఫరా చేయాల్సిన డీలర్లు.. కొన్ని చోట్ల రెండు, మూడు రోజులు మాత్రమే దుకాణాలను తెరుస్తున్నారని తెలుస్తోంది. జిల్లాలో 575 రేషన్ షాపుల్లో దాదాపు సగం దుకాణాలు బినామీల ఆధ్వర్యంలోనే కొనసాగుతున్నాయని తెలుస్తోంది. జిల్లా కేంద్రమైన కామారెడ్డి పట్టణంలో సగానికిపైగా షాపులను బినామీలే నిర్వహిస్తున్నారు. రేషన్ డీలర్లుగా స్థిరపడిన కొందరు.. అధికారులతో కుమ్మక్కై ఒక్కొక్కరు నాలుగైదు రేషన్ షాపుల బాధ్యతలు చూస్తున్నారు. వీరు అసలు డీలర్లకు ఎంతోకొంత కమీషన్ ఇచ్చి ఆయా షాప్లను తమ గుత్తాధిపత్యంలోకి తీసుకుంటున్నారు. ఏదైనా కేసుల్లో ఇరుక్కుని డీలర్లు సస్పెండ్ అయితే.. వాటిని కూడా తమ అధీనంలోకి తెచ్చుకుంటున్నారు. జిల్లా అంతటా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అధికారులతో పాటు అధికార పార్టీ నేతలను ప్రసన్నం చేసుకుని తమ బినామీ దందాను యథేచ్ఛగా సాగిస్తున్నారు. చాలా రేషన్ షాపులు మహిళల పేరిట ఉన్నాయి. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తమ కూతుళ్ల పేరిట రేషన్ షాప్ అనుమతులు పొందినవారు.. కూతుళ్ల వివాహమయ్యాక కూడా ఆ షాప్లను తమ అధీనంలోనే ఉంచుకుని బినామీ డీలర్లుగా కొనసాగుతున్నారు. దారిమళ్లుతున్న సరకులు బినామీ డీలర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ పేదలకు అందాల్సిన రేషన్ సరకులను నల్లబజారుకు తరలిస్తున్నారు. ప్రధానంగా జిల్లా కేంద్రమైన కామారెడ్డి పట్టణంలో బినామీ డీలర్ల హవా కొనసాగుతోంది. ఒక్కొక్కరు రెండు, మూడు షాపులు నిర్వహిస్తూ పెద్ద ఎత్తున సరకులను రవాణా చేస్తున్నారు. బినామీ డీలర్లు అసలు డీలర్లకు నెలనెలా రూ. 3 వేల నుంచి రూ. 6 వేల దాకా కమీషన్ ఇస్తున్నారని తెలిసింది. అలాగే అధికారులకు మామూళ్లు ఇస్తూ బినామీ డీలర్లుగా తమ అక్రమాలు కొనసాగిస్తున్నారు. చర్యలు తీసుకుంటాం రేషన్ షాప్ ఎవరి పేరిట ఉందో వారే నిర్వహించాలి. బినామీలతో నిర్వహిస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే కొన్ని షాపులపై చర్యలు తీసుకున్నాం. రేషన్ సరకులను లబ్ధిదారులకు అందించకుండా నల్లబజారుకు తరలిస్తే లైసెన్సులు రద్దు చేస్తాం. బినామీ షాపుల గురించి వివరాలు సేకరిస్తున్నాం. త్వరలోనే చర్యలు తీసుకుంటాం. – రమేశ్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి, కామారెడ్డి -
ఇక బినామీల భరతం!
• ఆ ఆస్తులపై త్వరలోనే కఠినచట్టం తీసుకొస్తాం: మోదీ • నోట్లరద్దు నియమాల మార్పుల్లో మేం చేస్తోంది కరెక్టే! • అవినీతి, నల్లధనాన్ని సమర్థిస్తున్నవారే ప్రభుత్వ విధానాలను తప్పుబడుతున్నారు • యుద్ధం నుంచి వెనక్కుతగ్గే ప్రసక్తే లేదని స్పష్టీకరణ • ప్రజల సాయంతోనే అక్రమార్కుల ఆట కట్టిస్తున్నామన్న ప్రధాని అవినీతిపై పోరాటంలో ఇది మొదటి అడుగు మాత్రమే. మనం ఈ యుద్ధాన్ని గెలిచి తీరాల్సిందే. దీన్ని ఆపడం, పలాయనం చిత్తగించడం వంటి ప్రశ్నలకు చోటే లేదు. మేం బినామీ చట్టాన్ని పలు మార్పులతో మళ్లీ తీసుకురానున్నాం. త్వరలోనే ఈ చట్టం అమలు మొదలవుతుంది. దేశం కోసం, దేశ ప్రజల కోసం చేయాల్సిన, జరగాల్సిన పనులన్నీ ప్రాధాన్యతతో పూర్తి చేస్తాం. – ‘మన్కీ బాత్’లో ప్రధాని మోదీ న్యూఢిల్లీ: నోట్ల రద్దు పథకం అమలు తర్వాత పరిస్థితిని బట్టి నియమ నిబంధనల్లో తీసుకొస్తున్న మార్పులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమర్థించుకున్నారు. అవినీతి, నల్లధనాన్ని సమర్థిస్తున్నవారే నిరంతరం ప్రభుత్వ విధానాలను తప్పుబడుతున్నారన్నారు. మాసాంతపు మన్కీ బాత్ కార్యక్రమం సందర్భంగా ఆదివారం దేశ ప్రజలనుద్దేశించి చేసిన రేడియో ప్రసంగంలో.. నోట్లరద్దు, భవిష్యత్తులో తీసుకోబోయే నిర్ణయాలు తదితర అంశాలపై తన అభిప్రాయాలను మోదీ వెల్లడించారు. బినామీ ఆస్తులపై కఠినచట్టాన్ని తీసుకొచ్చి పకడ్బందీగా అమలుచేస్తామని స్పష్టం చేశారు. ‘అవినీతిపై పోరాటంలో ఇది మొదటి అడుగు మాత్రమే. మనం ఈ యుద్ధాన్ని గెలిచి తీరాల్సిందే. దీన్ని ఆపటం, పలాయనం చిత్తగించటం వంటి ప్రశ్నలకు చోటే లేదు’ అని మోదీ వెల్లడించారు. నల్లధనానికి అడ్డుకట్ట వేసే ప్రయత్నంలో భాగంగా నోట్లరద్దు నిర్ణయం తర్వాత డిపాజిట్లు, విత్డ్రాయల్స్పై తరచూ నిబంధనలు మార్చటం సరైనదేనన్నారు. ప్రజల సమస్యలను తగ్గించి.. నోట్లరద్దును వ్యతిరేకిస్తున్న శక్తుల ఆటకట్టించేందుకే నిబంధనలు మార్చాల్సి వచ్చిందన్నారు. ప్రజలే పట్టిస్తున్నారు ‘సున్నితమైన ప్రభుత్వంగా.. ప్రజల సమస్యలను తెలుసుకుని ఎప్పటికప్పుడు వీటికి పరిష్కారం సూచిస్తూ ముందుకెళ్లటం మా కర్తవ్యం. అదే సమయంలో అవినీతికి పాల్పడుతున్నవారు, విశ్వాసఘాతకుల కుట్రలనూ భగ్నం చేస్తున్నాం’ అని ప్రధాని తెలిపారు. అవినీతిపై చేస్తున్న యుద్ధంలో ప్రజలంతా సహకరించాలని మోదీ కోరారు. నోట్ల రద్దు తర్వాత కొందరు అక్రమార్కుల గురించి ప్రజలే సమాచారం ఇచ్చారని ప్రశంసించారు. తమను తప్పుదోవ పట్టిస్తున్న వారికీ సరైన బుద్ధి చెబుతున్నారన్నారు. రాజకీయ పార్టీలు అన్ని రకాల మినహాయింపులను పొందుతున్నాయంటూ వస్తున్న వదంతుల్లో వాస్తవం లేదని.. చట్టం ముందు అందరూ సమానులేనన్నారు. నోట్లరద్దుపై రకరకాల కుట్రలు పన్నుతున్నారని చివరకు మతం రంగు కూడా పులిమారన్నారు. ఇలాంటి వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు అవినీతి, అక్రమ వ్యాపారాలు, నల్లధనం వివరాలను బయటపెట్టాల్సిన అవసరం ఉందన్నారు. విపక్షాల తీరు బాధాకరం పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో విపక్షాలు వ్యవహరించిన తీరు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతితోపాటు ప్రజలకు తీవ్ర అసంతృప్తిని మిగిల్చిందన్నారు. ప్రభుత్వం నోట్లరద్దుతోపాటు రాజకీయ పార్టీలకు నిధులపైనా చర్చజరగాలని కోరుకుందని మోదీ తెలిపారు. 1988లోనే కాంగ్రెస్ పార్టీ బినామీ చట్టం తీసుకొచ్చినప్పటికీ ఇంతవరకు దీని అమలుకు సంబంధించిన నిబంధనలను సిద్ధం చేయలేదన్నారు. ‘మేం బినామీ చట్టాన్ని పలు మార్పులతో మళ్లీ తీసుకురానున్నాం. త్వరలోనే ఈ చట్టం అమలు మొదలవుతుంది. దేశం కోసం, దేశ ప్రజల కోసం చేయాల్సిన, జరగాల్సిన పనులన్నీ ప్రాధాన్యతతో పూర్తి చేస్తాం’ అని మోదీ స్పష్టం చేశారు. -
జన్ధన్ ఎంత?
నవంబర్ 8న ప్రధాని నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించాక... పేదలకు చెందిన జన్ధన్ బ్యాంకు ఖాతాలకు బినామీలను ఉపయోగించుకుంటున్నారనే వార్తలు వచ్చాయి. దానికి బలం చేకూర్చేటట్లుగా తొలి వారంలోనే (నవంబరు 8-15) ఈ అకౌంట్లలో ఏకంగా రూ. 20,206 కోట్లు డిపాజిట్ల రూపంలో వచ్చారుు. దీంతో ప్రభుత్వం వీటిపై దృష్టిపెట్టింది. జన్ధన్ ఖాతాలను దుర్వినియోగపర్చే వారికి శిక్ష తప్పదని ఓ సభలో ప్రధాని మోదీ స్వయంగా హెచ్చరించారు. ఈ ఖాతాల నుంచి నెలకు రూ. 10 వేలు మించి ఉపసంహరణకు అనుమతించబోమని పరిమితి కూడా విధించారు. ఈ నేపథ్యంలో దేశంలో ఉన్న జన్ధన్ ఖాతాలు, వాటిల్లోని డిపాజిట్ల వివరాలు చూద్దాం.. - సాక్షి నాలెడ్జ సెంటర్ -
బినామీలుగా మారితే సమస్యలే!
• ఎవరి ఆస్తులకు, డబ్బులకు వారే లెక్కచెప్పాల్సుంటుంది • ఇన్కంటాక్స్ ప్రిన్సిపల్ కమిషనర్ సీహెచ్ ఓంకారేశ్వర్ సాక్షి, కరీంనగర్: ఎవరి ఆస్తులు, డబ్బులు వాళ్ల ఖాతాలోనే వేసుకోవాలని, ఇతరుల ఆస్తులకు, లావాదేవీలకు బినామీగా వ్యవహరిస్తే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని ఇన్కంటాక్స్ ప్రిన్సిపల్ కమిషనర్ సీహెచ్.ఓంకారేశ్వర్ అన్నారు. శుక్రవారం కరీంనగర్లో ఆయన విలేకరులతో రూ. 500, 1000 నోట్ల రద్దు గురించి మాట్లాడారు. నోట్ల రద్దు నిర్ణయం వల్ల దేశం అభివృద్ధి బాటలో పయనిస్తుందన్నారు. నల్లడబ్బు మొత్తం బయటకు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. మనదేశంలో కరెన్సీ మొత్తం రూ.17 లక్షల కోట్లు ఉండగా, ఇందులో రూ. 14.5 లక్షల కోట్లు 500, 1000 రూపాయల నోట్ల రూపంలో ఉన్నాయన్నారు. ఇప్పటివరకు రూ. 6 లక్షల కోట్లు డిపాజిట్ కాగా రూ. 1.5 లక్షల కోట్లు మళ్లీ విత్డ్రా రూపంలో ప్రజలకు చేరుకున్నాయన్నారు. ఇంకా 9.5 లక్షల కోట్లు రావాల్సి ఉందన్నారు. ప్రస్తుతం డిపాజిట్ అరుున డబ్బులకు వారే లెక్క చెప్పాల్సి ఉంటుందన్నారు. దీనికి సంబంధించిన అన్ని లావాదేవీలు జరిపినట్లు రుజువుచేసుకోవాలని వాటి ద్వారా వచ్చే లాభాలను కూడా లెక్కలోకి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. విదేశాల్లో ఉన్న బ్లాక్మనీ నిల్వలున్న వారు వారంతట వారే రూ. 7 వేల కోట్లు చెల్లించారని, సెప్టెంబర్, 2016 వరకు ఇన్కం డిక్లరేషన్ స్కీం ద్వారా 70 వేల కోట్లు వచ్చిందని తెలిపారు. 25 లక్షల కోట్ల జనధన్ అకౌంట్లుండగా వాటిలో రూ. 21 వేల కోట్లు వచ్చి పడ్డాయన్నారు. జనధన్ ఖాతాల ద్వారా రూ. 50 వేలు మాత్రమే వేసుకోవచ్చని అంతకు మించి డబ్బులుంటే వాటికి లెక్కచూపించాలన్నారు. -
కరెన్సీకి కమీషన్
► రూ.4వేలకు రూ.500' ► పేదలే పెద్దలకు బినామీలు ► వేలిపై గుర్తుతో చెక్ ‘ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే చోరీకి వల్ల కాక మరొకడు ఏడ్చాడు’ అనేది ప్రజల నోళ్లలో తరచూ నానుతుండే సామెత. ప్రజలు ఎదుర్కొంటున్న కరెన్సీ కష్టాలు ఆ సామెతను తలపిస్తున్నారుు. చెల్లని నోట్లను మార్చుకోలేక పేదలు అల్లాడుతుంటే బినామీలుగా మారిన వారికి కమీషన్లు అంటూ పెద్దలు ప్రలోభపెడుతున్నారు. సాక్షి ప్రతినిధి, చెన్నై సాక్షి ప్రతినిధి, చెన్నై: ఇటీవలి వరకు చెలామణిలో ఉన్న రూ.500, రూ.1000 నోట్లను ఈనెల 8వ తేదీన కేం ద్ర ప్రభుత్వం రద్దు చేసింది. బ్యాంకుల ద్వారా 10వ తేదీ నుంచి పాత నోట్ల స్థానంలో కొత్త నోట్ల ను మార్చుకోవచ్చంటూ చేసిన ప్రకటనతో ప్రజలు ఉరకలెత్తారు. పరిమితమైన నోట్లను కలిగి ఉన్న ప్ర జలు బ్యాంకుల వద్ద బారులు తీరగా భారీ మొత్తం లో నగదును దాచిపెట్టిన ధనికులు బావురుమన్నా రు. రూ.2.5లక్షలకు పైగా బ్యాంకుల్లో జమ చేస్తే లెక్కలు చూపాల్సి ఉంటుంది. అంతేగాక 200 శాతం ఆదాయపు పన్ను కట్టక తప్పదు. బ్యాంకుల్లో జమ చేస్తే ఆదాయపు పన్నుశాఖ తంటా కావడంతో అక్రమార్కులంతా వక్రమార్గం వైపు కదులుతున్నారు. తమకు నమ్మకమై పేదలను, సన్నిహితులను బినామీలుగా మార్చుకుని వారి బ్యాంకు ఖాతాల్లో సొమ్మును జమచేరుుస్తున్నారు. చెన్నైలోని అనేక ప్రాంతాల్లో ధనికులు తాము ఎంచుకున్న పేదలను ఉదయాన్నే ఇంటికి పిలిపించుకుంటున్నారు. వారి చేతిలో రూ. 4,500 పెట్టి మార్చుకుని రమ్మని చెబుతున్నారు. ఈ పని పూర్తి చేసిన వారికి రూ.300 నుంచి రూ. 500 వరకు కమిషన్ ఇస్తున్నారు. సాయంత్రానికి నాలుగుసార్లు వెళితే రూ.2వేలు కమీషన్గా గిట్టుతోంది. ఇలా ఎన్నిసార్లరుునా బ్యాంకులకు వెళ్లేందుకు పేదలు సిద్ధం కావడంతో గట్టిపోటీ ఏర్పడింది. కరెన్సీ మార్పిడి చేసే పేదలు, కూలీలకు గిరాకీ ఏర్పడడంతో వారిని సరఫరా చేసేందుకు సహజంగానే బ్రోకర్లు తయారయ్యారు. ’ఎదావదు ఇరుందాల్ సొల్లుంగ...సత్తమిల్లామల్ ముడిచ్చిడలాం’ (ఏదైనా ఉంటే చెప్పండి గుట్టుగా పూర్తిచేసుకువస్తా) అనే కోడ్ భాష చెలామణిలోకి వచ్చింది. నేటి నుంచి వేలిపై గుర్తు: నల్లధనాన్ని వెలికి తీసేందుకు చేస్తున్న ప్రయత్నాలకు బినామీలతో గండికొట్టకుండా కేంద్ర ప్రభుత్వం జాగ్రత్తపడింది. ఒకే వ్యక్తి పదేపదే బ్యాంకులకు వస్తూ కరెన్సీని మార్చడాన్ని నిరోధించనుంది. ఓటు హక్కును వినియోగించుకునే తరహాలో బ్యాంకులో నగదును జమ చేసిన వ్యక్తి వేలిపై ముద్ర వేసే విధానాన్ని బుధవారం నుంచి ప్రవేశపెడుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. మంగళవారమే కొన్ని బాంకుల్లో వేలిముద్ర విధానం అమలులోకి వచ్చినట్లు సమాచారం. అలాగే ఇతరుల ఖాతాలో డబ్బును జమ చేయాలంటే ఖాతాదారుడు నేరుగా రావడమో లేదా అతని స్వదస్తూరితో ఉత్తరం జమ చేయడమో తప్పనిసరి చేశారు. తప్పని తిప్పలు: కరెన్సీ నోట్లు రద్దరుు ఆరు రోజులు దాటుతున్నా బ్యాంకుల వద్ద ప్రజల తిప్పలు తప్పడం లేదు. చాంతాడంత క్యూలో నిల్చుని కౌంటర్ వద్దకు చేరుకునేసరికి క్యాష్ అరుుపోందని కొన్ని బ్యాంకుల్లో వెనక్కుపంపుతున్నారు. ఇక ఏటీఎంలో పెట్టిన లక్షలాది రూపాయలు నిమిషాల వ్యవధిలో ఖాళీ అరుుపోతున్నారుు. ప్రస్తుతం ఏటీఎంలలో రూ.2 వేలనోట్లు మాత్రమే లభ్యమవుతుండగా, రూ.500ల కొత్త నోట్లు మూడు రోజుల్లో అందుబాటులోకి వస్తాయని బ్యాంకు వర్గాలు చెబుతున్నారుు. చిల్లర కోరేవారికి కొన్ని చోట్ల రూ.5, రూ.10ల నాణేలను అందజేస్తున్నారు. చెన్నై కార్పొరేషన్లో ఆస్తిపన్ను చెల్లింపునకు పాత నోట్లు స్వీకరించడంతో సోమవారం ఒకే రోజు రూ.8 కోట్లు వసూలైంది. -
పుష్కర పనుల టెండ‘రింగ్’
ప్రజారోగ్యశాఖలో రూ.21.71 కోట్లతో టెండర్లు బినామీ పేర్లతో టీడీపీ ప్రజాప్రతినిధుల మాయాజాలం చక్రం తిప్పిన ఇద్దరు మహిళా కార్పొరేటర్లు, బ్రోకర్ అధికారి చాంబర్లోనే బేరసారాలు కృష్ణా పుష్కరాల్లో పారిశుధ్య పనులకు టీడీపీ ప్రజాప్రతినిధులు టెండ ‘రింగ్’ పెట్టారు. రూ.21.71 కోట్ల రూపాయల పనుల్ని బినామీ పేర్లతో ఎగరేసు పోయేందుకు పక్కా స్కెచ్ వేశారు. బయటి కాంట్రాక్టర్లకు చాన్స్ ఇవ్వకుండా రింగ్ చేశారు.ఇద్దరు మహిళా కార్పొరేటర్లు, ఒక బ్రోకర్ చక్రం తిప్పుతున్నారనే విమర్శలు వెల్లువె త్తుతున్నాయి. ముఖ్య అధికారి వారి కనుసన్నల్లో పాలన సాగించడం పలు అనుమానాలకు తావిస్తోంది. విజయవాడ సెంట్రల్ : పుష్కర పనులు టీడీపీ ప్రజాప్రతినిధులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. అధికార దర్పంతో అడ్డగోలు దోపిడీకి తెగబడుతున్నారు. టీడీపీకి చెందిన ఇద్దరు మహిళా కార్పొరేటర్లు, ఒక బ్రోకర్ కలిసి ప్రజారోగ్య శాఖలో దందా చలాయిస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కోట్ల విలువైన టెండర్లను బినామీ పేర్లతో దక్కించుకున్నారని సమాచారం. కృష్ణా పుష్కరాల నేపథ్యంలో పకడ్బందీగా శానిటేషన్ పనుల్ని చేపట్టేందుకు ప్రజారోగ్య శాఖ కు రూ.21.70 కోట్లు కేటాయించారు. ఫినాయిల్, కర్రలు, చీపుర్లు, మందులు కొనుగోలు చేయడంతోపాటు 15 వేల మంది తాత్కాలిక సిబ్బంది నియామకం, మలేరియా నివారణ చర్యలు, కోతులు, కుక్కలు, పందుల్ని పట్టడం తదితర పనులు చేపట్టాలని నిర్ణయించారు. 61 ప్యాకేజీలుగా విభజించి ఈ మేరకు ఈ నెల తొమ్మిదో తేదీన టెండర్లు పిలిచారు. 37 ప్యాకేజీలకు సంబంధించి టెండర్లు దాఖలయ్యాయి. పదో తేదీన వీటిని పరిశీలించిన ప్రజారోగ్యశాఖ అధికారులు తుది ఆమోదం కోసం కమిషనర్ టేబుల్పైకి పంపారు. టెండ‘రింగ్’ టెండర్లను దక్కించుకొనేందుకు టీడీపీ ప్రజాప్రతినిధులు బ్రోకర్తో కలిసి హైడ్రామా నడిపారు. టెండర్ల నిర్వహణకు సంబంధించి ప్రజారోగ్యశాఖ అధికారి ముందుగా కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించారు. అందులో 80 శాతం మంది బ్రోకర్ మనుషులే అని తెలుస్తోంది. టెండర్లు దాఖలు చేసే సమయంలో సైతం బ్రోకర్ హల్చల్ చేశాడని పలువురు కాంట్రాక్టర్లు వాపోతున్నారు. టెండర్లు వేయకుండా తమను అడ్డుకున్నారని, తమ మాట విన్న వారిని రింగ్ చేసి టెండర్లు దాఖలు చేయించారని బాధిత కాంట్రాక్టర్లు చెబుతున్నారు. గతంలో బ్రోకర్ ఎంపీ కేశినేని నాని కార్యాలయంలో హవా చలాయించేవాడని, అంగన్వాడీ ఉద్యోగం ఇప్పిస్తానని ఒక మహిళ వద్ద రూ.10 వేలు వసూలు చేయడంపై వివాదమూ ఉందని తెలిసింది. ఈ ఘటన తరువాత ఎంపీ దూరంగా పెట్టడంతో ఇద్దరు మహిళా కార్పొరేటర్లతో కలిసి ప్రజారోగ్య శాఖలో దందా చలాయిస్తున్నట్లు సమాచారం. శానిటరీ ఇన్స్పెక్టర్ల డివిజన్ల మార్పులు, చేర్పులతో భారీ డీల్స్ చేస్తున్నాడని భోగట్టా. ముఖ్య అధికారి చాంబర్లో మహిళా కార్పొరేటర్లతో కలిసి తిష్ట వేసి బేరసారాలు సాగించడం కార్పొరేషన్లో హాట్ టాపిక్గా మారింది. వీరితో అధికారి సుదీర్ఘ సమావేశం కారణంగా వివిధ పనులపై లోనికి వెళ్లలేకపోతున్నామని ఉద్యోగులు వాపోతున్నారు. అధికారి బర్త్డే వేడుకల్ని ఇటీవల బ్రోకర్ ఘనంగా నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. లెస్ టెండర్ల మాయాజాలం పుష్కరాల్లో పారిశుధ్య విధులు నిర్వహించేందుకు 15 వేల మంది తాత్కాలిక కార్మికుల్ని నియమించాలని నిర్ణయించారు. వీరికి రోజుకు రూ.425 చొప్పున ఇచ్చే విధంగా టెండర్లో అధికారులు పొందుపరిచారు. రింగ్ అయిన కాంట్రాక్టర్లు రూ.403 నుంచి రూ.424 వరకు ధరను కోట్ చేసినట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం. లెస్ టెండర్లుగా బయటకు కనిపిస్తున్న వీటి వెనుక పెద్ద మాయాజాలమే దాగుంది. ప్రజారోగ్య శాఖలో ఏళ్ల తరబడి విధులు నిర్వహిస్తున్న కార్మికులకు రోజుకు రూ.365 చొప్పున చెల్లిస్తున్నారు. తాత్కాలిక కార్మికులకు మాత్రం రూ.425 ధర నిర్ణయించారు. ఇందుకు ఒక రూపాయి అటు ఇటుగా టెండర్లను ఓకే చేస్తారు. తాత్కాలిక కార్మికులకు కాంట్రాక్టర్ నిర్ణయించిన ధర మాత్రమే చెల్లిస్తాడు. అదనపు ధర కాంట్రాక్టర్ల లబ్ధి కోసమే అన్న విషయం స్పష్టమవుతోంది. ప్రస్తుతం 7,500 మంది కార్మికుల్ని సరఫరా చేసేందుకు టీడీపీ అండ్ కో టెండరేసింది. ఇవి ఓకే అయితే భవిష్యత్ కార్యాచరణ రూపొందించాలన్నది వారి వ్యూహంగా తెలుస్తోంది. ప్రజారోగ్యశాఖలో అవినీతి కంపుపై కమిషనర్ దృష్టి సారిస్తే మరిన్ని నిజాలు వెలుగు చూసే అవకాశముంది. బయటి విషయాలు అనవసరం పుష్కర పనులకు సంబంధించి లెస్ టెండర్లే వచ్చాయి. కాంట్రాక్టర్లు రింగ్ అయిన విషయం నాకు తెలియదు. బయట జరిగే విషయాలు నాకు అనవసరం. మొత్తం 61 ప్యాకేజీల్లో 19 ప్యాకేజీలకు సంబంధించి టెండర్లు దాఖలు కాలేదు. మరోసారి పిలిచాం. గోదావరి పుష్కరాల్లో అప్సెట్ వ్యాల్యూ ఆధారంగానే టెండర్లు పిలిచాం. ప్రస్తుతం కమిషనర్ పరిశీలనలో ఉన్నాయి. - ఎం.గోపీనాయక్, చీఫ్ మెడికల్ ఆఫీసర్, నగరపాలక సంస్థ -
నా కుమారుడి పేరిట భూములు కొన్నా..
టీడీపీ నేత పయ్యావుల కేశవ్ వెల్లడి సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర నూతన రాజధానిలోఉండాలనే ఉద్దేశంతో మగాడిలా భూములను కొనుక్కున్నానని ఎమ్మెల్సీ, టీడీపీ నేత పయ్యావుల కేశవ్ చెప్పారు. తాను తన కొడుకు పేరిట ఆ భూములను కొన్నానని, బినామీల పేరుతో కొనలేదని అన్నారు. గురువారం ఎన్టీఆర్ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి దమ్ముంటే, ఆయనలో రాయలసీమ రక్తం ఉంటే ఆయన తన మూడుతరాల ఆస్తులపై ప్రకాశం బ్యారేజీ మీద చర్చకు రావాలని సవాల్ చేశారు. తన పేరిట ఉన్న ఆస్తులను ఎన్నికల అఫిడవిట్లో, అసెంబ్లీకి సమర్పించే ఆస్తుల వివరాల్లో పేర్కొనలేని దౌర్భాగ్య స్థితి జగన్దని అన్నారు. తనతో పాటు మంత్రులు పుల్లారావు, నారాయణ తదితరులపై సాక్షిలో వచ్చిన వార్తలపై శుక్రవారం నుంచి సమగ్ర వివరాలు వెల్లడిస్తానని చెప్పారు. -
గ్రీన్జోన్ పేరుతో మాయాజాలం
చంద్రబాబు, బినామీలు ఆడిన (భూ) మాయా నాటకంలో జోన్ల వర్గీకరణ మరో కీలక అంకం. రాజధాని ప్రాంతంలో ఎక్కడ ఏ జోన్ ఉండాలో.. ఏ జోన్లో ఏం ఉండాలో ముందే నిర్ణయించారు.. . అగ్రికల్చర్ (గ్రీన్) జోన్, కమర్షియల్ జోన్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ జోన్ ఇలా.. ఏడు జోన్లుగా వర్గీకరించారు. ఈ జోన్ల వర్గీకరణలోనే భారీ కుంభకోణం దాగి ఉంది. పెదబాబు, చినబాబు, వారి బినామీలు, తెలుగుదేశంలో కీలక నాయకులు భూములు కొనుగోలు చేసిన ప్రాంతాలలోనే భూముల విలువ పెరిగేందుకు గాను కమర్షియల్, ఇండస్ట్రీస్ జోన్లు వచ్చేలా చూశారు. ఏ జోన్ ఎక్కడ వస్తుందో వారికి ముందే తెలుసు కాబట్టి ఆ ప్రాంతాలలోనే పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. వారికి భూములు లేని ప్రాంతాలన్నీ కలిపి అగ్రికల్చర్ జోన్గా ప్రకటించారు. అగ్రికల్చర్ జోన్గా ప్రకటించిన ప్రాంతాల్లో అనేక షరతులు విధించారు. కొనుగోలు అమ్మకాలపైనా నిషేధాజ్ఞలున్నాయి. పంటలు పండినా పండకపోయినా ఆ భూముల్లో వ్యవసాయం మాత్రమే చేయాలి. దాంతో భూముల విలువ దారుణంగా పడిపోయింది. రాజధాని పేరుతో చంద్రబాబు అండ్ కో సాగిస్తున్న ఈ దుర్మార్గాలపై రైతులంతా తీవ్రంగా మండిపడుతున్నారు. ఇదీ గ్రీన్జోన్ .. గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని 58 మండలాల్లో 8,603.32 చదరపు కిలోమీటర్ల పరిధిలో సీఆర్డీఏ విస్తరించింది. ఇందులో 5,940.26(63.23 శాతం) చదరపు కిలో మీటర్ల ప్రాంతాన్ని ముసాయిదా ప్రణాళికలో వ్యవసాయ పరిరక్షణ మండలాలుగా పేర్కొం ది. ఇది 15 లక్షల ఎకరాలకు సమానం. ఈ మం డలాలు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో విస్తరించాయి. వ్యూహాత్మకంగా భూములు కొన్న నేతలు.. రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ(సీఆర్డీఏ) పరిధిలోని అనేక ప్రాంతాలతో పాటు వ్యవసాయ పరిరక్షణ జోన్-2, 3లోని మండలాల పరిధిలోనూ టీడీపీ ముఖ్య నేతలు, వారి అస్మదీయులు బినామీ పేర్లతో పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారు.ఇవి దాదాపు 10,000 ఎకరాలు ఉండవచ్చని అంచనా. కారణం ఆ ప్రాంతంలో రాజధాని రాబోతోందని వారికి ముందుగానే ఉప్పందింది. అంతేకాదు ఏ ప్రాంతంలో ఏ జోన్ రాబోతుందన్న విషయమూ వారికి ప్రభుత్వ బహిరంగ ప్రకటనకన్నా ముందే తెలుసు. వారికి అనుకూలంగానే రాజధాని పర్స్పెక్టివ్ ప్లాన్ రూపుదిద్దుకుంది. ఆ జోన్లలో ఏయే అభివృద్ధి ప్రాజెక్టులు రావాలో ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లే ప్రణాళికాకర్తలు సిద్ధం చేశారు. జోన్- 2, 3లో భవిష్యత్తులో పట్టణ అభివృద్ధి ప్రాంతం (ఫ్యూచర్ అర్బనైజ్డ్ డెవలపబుల్ ఏరియా)గా నిర్ధేశించారు. రాజధాని నగర పరిధి (క్యాపిటల్ సిటి) అభివృద్ధి తరువాత పై ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేది ప్రభుత్వ ప్రణాళిక. తద్వారా టీడీపీ అనుయాయులకు అయాచిత లబ్ధి చేకూర్చాలనేది ప్రభుత్వ వ్యూహంగా కనిపిస్తోంది. అంటే.. టీడీపీ నేతలు కొనుగోలు చేసిన ప్రాంతాల్లో భవనాలను నిర్మించవచ్చు. ఇది టీడీపీ నేతలకు రియల్ ఎస్టేట్ బూమ్ను అందివ్వడమేనని చెబుతున్నారు. జోన్-1లో కేవలం వ్యవసాయమే.. వ్యవసాయ పరిరక్షణ జోన్-1లో వ్యవసాయం, ఉద్యానవన పంటలు, పాడిపరిశ్రమ, కోళ్ల పరిశ్రమ, మత్స్య పరిశ్రమలకు మాత్రమే అనుమతిస్తారు. ఈ మేరకు పర్స్పెక్టివ్ ప్లాన్లో స్పష్టంగా పేర్కొన్నారు. జోన్- 1 ప్రాంతం సారవంతమైన భూములు కనుకే వ్యవసాయ పరిరక్షణ జోన్లో చేర్చినట్లు పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ గతంలో ప్రకటించారు. అయితే వాటికన్నా అన్నివిధాలుగా మెరుగైన భూమి జోన్-2, జోన్-3లో ఉండటం పరిశీలనాంశం. ఏపీసీఆర్డీఏ చట్టంలోని సెక్షన్- 38 ప్రకారం పర్స్పెక్టివ్ ప్లాన్ను ప్రతి పది సంవత్సరాలకు, మాస్టర్ప్లాన్ను ప్రతి అయిదు సంవత్సరాలకు మాత్రమే మార్పులు జరిగేందుకు వీలుండేలా నిబంధన పెట్టడం కూడా టీడీపీ నేతలకు లబ్ధి చేకూర్చడానికేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జోన్- 2, జోన్-3లో అధిక భాగం గుంటూరు జిల్లా పరిధిలో ఉంది. జోన్-1ను ఎక్కువగా కృష్ణా జిల్లాలో చూపడం ఆ జిల్లా వాసులకు ఆవేదన మిగుల్చుతోంది. అక్కడ వృద్ధి నామమాత్రమే... వ్యవసాయ పరిరక్షణ జోన్-1లో కేవలం వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు మాత్రమే ఉండాలని పర్స్పెక్టివ్ ప్లాన్లో పేర్కొన్నారు. ఆర్థిక, వ్యాపార, సేవా రంగాలకు సంబంధించిన అంశాలు ఈ ప్రాంతంలో రావు. ఇందువల్ల ఈ ప్రాంతం ఆర్థికాభివృద్ధికి అవకాశాలు నామమాత్రం కానున్నాయి. క్యాపిటల్ సిటీలో రైతులకు కేటాయించనున్న ప్లాట్లకు డిమాండ్ పెరగాలనే ఉద్ధేశంతో రీజియన్ పరిధిలోని మిగతా మండలాలను వ్యవసాయ పరిరక్షణ జోన్లలో చేర్చడం వల్ల ఆయా ప్రాంతాల రైతులు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంది. క్యాపిటల్ సిటీ పరిధిలోని భూములు కొనుగోలు చేసిన వారికి, కొందరు రైతుల కోసం తాము బలికావలసి వస్తోందని వ్యవసాయ పరిరక్షణ పరిధిలోకి చేరిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పడిపోయిన ధరలు.. నిలిచిన క్రయవిక్రయాలు.. అగ్రికల్చర్జోన్గా ప్రకటించక ముందు జోన్ - 1 ప్రాంత గ్రామాలలో ఎకరా భూమి మూడు కోట్లు పలికింది. రాజధాని ప్రాంతంలో కూడా ఇదే ధర పలికింది. నావల్లనే ఈ భూముల ధరలు ఈ స్థాయిలో పెరిగాయని సీఎం చంద్రబాబు ప్రచారం చేశారు. అయితే ఇప్పుడు గ్రీన్జోన్ ప్రాంతాలలో భూముల విలువ పూర్తిస్థాయిలో పడిపోయింది. ఎకరా రూ. 50 లక్షలకు మించి కొనేవారు కనిపించడం లేదు. గ్రామాలకు దూరంగా ఉంటే ఎకరా 20 నుంచి 30 లక్షల లోపు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. చాలా మంది అసలు కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం లేదు. పచ్చని పంట పొలాలు లాక్కొని విదేశీయులతో ప్రభుత్వ పెద్దలు ‘రియల్’ వ్యాపారాలు చేస్తున్నారు. సింగపూర్, జపాన్ కంపెనీలకు అడిగినంత ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. గ్రామాల్లో రైతుల భూములను మాత్రం గ్రీన్జోన్ పేరుతో క్రయ విక్రయాలు స్తంభించిపోయేలా చేశారు. భూముల ధరలు పూర్తిస్థాయిలో పడిపోయిన తరువాత వేల ఎకరాలు టీడీపీ నేతలు కొనుగోలు చేసి పరిశ్రమల పేరుతో విదేశీయులకు అమ్ముకునే వ్యూహాన్ని రూపొందించారు. కంకిపాడు, ఉయ్యూరు, పెగంచిప్రోలు, జగ్గయ్యపేట, నందిగామ, కంచికచర్ల, వీరులపాడు తదితర మండలాల్లోని గ్రామాల్లో ఇప్పటికే పలువురు టీడీపీ నేతలకు వేల ఎకరాల్లో బినామీ భూములు ఉన్నాయి. ఆందోళనబాటలో రైతులు.... గ్రీన్ జోన్ పేరుతో చంద్రబాబు ప్రభుత్వం ఆడుతున్న నాటకాలు చూసి రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మూడుపంటలు పండే భూములను బలవంతంగా లాక్కుని కమర్షియల్ జోన్గా ప్రకటించడం, వర్షం పడితే తప్ప పండే పరిస్థితి లేని మెట్టభూములను గ్రీన్జోన్గా ప్రకటించడం వెనక దారుణమైన కుట్ర దాగి ఉందని రైతులు అంటున్నారు. ఇటీవల కృష్ణా, గుంటూరు జిల్లాల్లో చాలా చోట్ల వైఎస్ఆర్సీపీ నాయకత్వంలో రైతులు ఆందోళనలు చేపట్టారు. కంకిపాడు, ఉయ్యూరు, నందిగామ, జగ్గయ్యపేట, జి కొండూరు, కంచికచర్ల మండలాల పరిధిలో రైతులు ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. పలువురు రైతులు సీఆర్డీఏ కార్యాలయాన్ని ముట్టడించారు. జోన్ ప్రకటన వల్ల కలగనున్న నష్టాలను వ్యవసాయరంగ నిపుణులు, రైతు సంఘాల నాయకులు రైతులకు వివరిస్తూ సీఆర్డీఏ అధికారులకు అభ్యంతరాల లేఖలు పంపాలని సూచిస్తున్నారు. ఒక నెల రోజుల వ్యవధిలోనే రెండు వేల అభ్యంతరాలు వచ్చాయంటే వ్యతిరేకత ఎంత తీవ్రంగా ఉందో అర్థం అవుతుంది. రాజకీయాలకు అతీతంగా గ్రామ పంచాయతీలు తీర్మానం చేస్తూ ప్రభుత్వానికి పంపుతున్నాయి. దీనిపై పునరాలోచన చేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని రైతులు హెచ్చరిస్తున్నారు. వ్యవసాయ పరిరక్షణ మండలం-1 కృష్ణా జిల్లాలోని మోపిదేవి, చల్లపల్లి, ఘంటసాల, మొవ్వ, పమిడిముక్కల, తోట్లవల్లూరు, ఉయ్యూరు, కంకిపాడు, పెదపా రుపూడి, గుడివాడ రూరల్, నందివాడ, వీరులపాడు, వత్సవాయి, పెనుగంచిప్రోలు, మైలవరం, జి.కొండూరు, నూజివీడు పూర్తిగా, పామర్రు, ఉంగుటూరు, బాపులపాడు, ఆగిరిపల్లి, నూజివీడు, ఇబ్రహీం పట్నం పాక్షికంగా ఉన్నాయి. గుంటూరు జిల్లాలో ప్రత్తిపాడు, వట్టి చెరుకూరు, చేబ్రోలు, చుండూరు, అమృతలూరు, కొల్లూరు, తెనాలి రూరల్, కొల్లిపర, వేమూరు, చేబ్రోలు, భట్టిప్రోలు పూర్తిగా, పొన్నూరు, పెదకాకాని, దుగ్గిరాల మండలాలు ఈ జోన్ కిందకు తెచ్చారు. వ్యవసాయ పరిరక్షణ మండలం-2 కృష్ణా జిల్లాలోని చందర్లపాడు పూర్తిగా, కంచికచర్ల, జగ్గయ్యపేట మండలాలను పాక్షికంగా తెచ్చారు. ఇక గుంటూరు జిల్లాలోని యడ్లపాడు, ఫిరంగిపురం, క్రోసూరు, అచ్చంపేట మండలాలు పూర్తిగానూ, మేడికొండూరు, పెదకూరపాడు పాక్షికంగానూ ఈ జోన్ కిందకు తెచ్చారు. వ్యవసాయ పరిరక్షణ మండలం-3 కృష్ణా జిల్లాలో కంచికచర్ల మండలం పాక్షికంగానూ, గుంటూరు జిల్లాలో తాడికొండ, మేడికొండూరు మండలాలు పూర్తిగానూ, పెదకూరపాడు, అమరావతి మండలాలు పాక్షికంగానూ ఈ జోన్ కిందకు తెచ్చారు. ఈ ప్రాంతమంతా రాజధాని నగరానికి దక్షిణం, పశ్చిమ దిక్కున ఉన్నాయి. భవిష్యత్ను ప్రశ్నార్థకం చేసిన ‘గ్రీన్జోన్’ విజయవాడ ఆటోనగర్లో ఓ ఫౌండ్రీలో పనిచేస్తున్నాను. అద్దె ఇంట్లో ఉంటున్నాం. ముత్యాలంపాడు గ్రామంలో 2006లో 80 సెంట్లు పొలం కొన్నాం. పిల్లల చదువుతో పాటు సొంత ఇల్లు, ఫౌండ్రీ షెడ్డు కోసం పొలం అమ్మాను. ఎకరం రూ.80 లక్షలకు కోనుగోలు చేసిన వారు రూ 15 లక్షలు ఇచ్చి అగ్రిమెంట్ రాయించుకున్నారు. వచ్చిన డబ్బులతో నిడమానురులో కొత్త ఇల్లు నిర్మాణం చేపట్టాం. ఇప్పుడు గ్రీన్ జోన్ రావటంతో పొలాల ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. అగ్రిమెంట్ రాయించుకున్న వారు ఇపుడు ఎకరం రూ. 40 లక్షలకు మించి ఇవ్వమంటున్నారు. లేకపోతే అడ్వాన్సు వెనక్కు ఇవ్వాలంటూ మెలిక పెడుతున్నారు. డబ్బులు వస్తున్నాయి కదా అని అప్పు చేసి ఇంటి నిర్మాణం చేపట్టాం. ఏం చేయాలో అర్థం కావటం లేదు. భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. ఎస్. రాంబాబు, ఫౌండ్రీ కార్మికుడు, విజయవాడ రైతు పరిస్థితి అగమ్యగోచరం.. గతంలో రూ 2. కోట్లు ఉన్న భూమి ప్రస్తుతం రూ కోటికి చేరింది. మాకు భూమి ఒక్కటే ఆధారం. అమ్ముకునేందుకు, వ్యవసాయేతర భూమిగా మార్చుకునేందుకు అవకాశం లేకపోతే భూమి ఉండి కూడా ఏం ఉపయోగం? విజయవాడకు దగ్గరలోనే ఉన్నాం. కానీ గ్రీన్జోన్ పేరుతో షరతులు పెట్టడం సరైంది కాదు. నిబంధనలు సడలించకపోతే రైతు పరిస్థితి అగమ్యగోచరమే. బొమ్మారెడ్డి శ్రీనివాసరెడ్డి, రైతు, చలివేంద్రపాలెం అమ్మాయి పెళ్లి చేయలేకపోతున్నా మాకు ఆత్మహత్యే శరణ్యం. గుర్రాజుపాలెం గ్రామానికి గత రెండు పర్యాయాలుగా సర్పంచ్గా కొనసాగుతున్నాను. ఉన్న ఎకరం పొలంలోనే మిరప, పత్తి పండిస్తుంటాను. గ్రీన్ జోన్ రాకముందు పొలాల ధరలు బాగా ఉండటంతో పొలం అమ్మి అమ్మాయి పెళ్లి చేద్దామనుకున్నా. ఎకరం రూ. 60 లక్షల వరకు అడిగారు. రూ 75 లక్షలు అయితే ఇస్తానని బేరం పెట్టా. జి.కొండూరు మండలం గ్రీన్ జోన్లోకి చేర్చడంతో రేట్లు దారుణంగా పడిపోయాయి. రెండు రోజుల క్రితం ఎకరా రూ. 18 లక్షలకు అడిగారు. తమటం వెంకట్రామయ్య, సర్పంచ్ గుర్రాజుపాలెం (కృష్ణాజిల్లా) ఇబ్బంది పెట్టేందుకే.. 2050 సంవత్సరం దాకా గ్రీన్ బెల్ట్లో ఉన్న భూములలో పంటలు మాత్రమే పండించాలం టున్నారు. రైతు వారీగా కోట్ల రూపాయలు పెట్టి కొనే వాళ్లు ముందుకు రావడం లేదు. పిల్లల చదువుల కోసం, పెళ్లిళ్ల కోసం అమ్ముకోవాలంటే రేట్లు పూర్తిగా దిగజారిపోయాయి. ఏడాదిలోనే పొలాల రేట్లు సగానికి సగం పడిపోయాయి. ఎక్కువ రేటుకు కొనేవారు రావడం లేదు. పడిపోయిన రేటుకు అమ్ముకోలేకపోతున్నాం. -మందాళ వీరారెడ్డి, రైతు, నంబూరు -
పేదల భూముల్లో రాబందులు
⇒కొట్టేసిన లంక భూములు 1,250 ఎకరాలు ⇒లబ్ధి చేకూరింది... 2,500 కోట్ల రూపాయలుట ⇒కాజేసిన అసైన్డ్ భూములు 1,848 ఎకరాలు ⇒లాభం 3,234 కోట్ల రూపాయలు కానలలో కనిపించే రాబందులు కళేబరాలను మాత్రమే పీక్కుతింటాయి.. జీవం ఉన్నవాటి జోలికి రావు. రాజధానిలో వాలిన ‘భూ’ రాబందులు బతికి ఉండగానే బడుగురైతులను పీక్కుతింటున్నాయి.. పాపం-పుణ్యం ఆలోచించవు.. బినామీ పేర్లతో రైతుల భూములను బిట్లు బిట్లుగా కాజేసిన భూ బకాసురులు అవి సరిపోక అసైన్డ్, లంక భూములను కాజేయడానికి అంతర్జాతీయ స్థాయి స్కెచ్ వేశారు.. రాజధానిని ప్రకటించి... సమీకరణ నాటకాలు మొదలుపెట్టడానికి మునుపే అసైన్డ్, లంక భూములపై ‘పెద్దలంతా’ కన్నేశారు. పరిహారం ఇవ్వకుండానే లాక్కుంటారన్న ప్రచారాలతో పాటు సామదానభేద దండోపాయాలెన్నో ప్రయోగించారు. రైతులను భయపెట్టి.. వారంతట వారే అయినకాడికి పొలాలు అమ్ముకునేలా చేశారు. అంతా అయ్యాకపరిహారాలు, ప్యాకేజీలు ప్రకటించుకున్నారు. ఐదూపది లక్షలిచ్చి సొంతం చేసుకున్న భూములు ఇపుడు కోట్లు పలుకుతున్నాయి. దళిత రైతులపై కూడా ఇలాంటి మాయోపాయాలే ప్రయోగించి అసైన్డ్ భూములనూ మింగేశారు. ఆ భూముల రిజిస్ట్రేషన్లను ‘చట్టబద్ధం’ చేసేశారు. ఇక జోన్ల పేరుతో చేసిన వంచన మరీ ఘోరం. అంతర్జాతీయ నిపుణులను నియమించి కోట్లు వెచ్చించి ‘మాస్టర్ప్లాన్’లు తయారుచేయించారు. బినామీలకు అచ్చివచ్చేలా నచ్చినచోట ఇష్టం వచ్చిన జోన్ను ప్రకటించుకున్నారు. వారి భూములున్న చోట్ల ‘డెవలప్మెంట్’ జోన్లు- పక్కా ‘కమర్షియల్’ జోన్లు. పేదరైతుల భూములున్న చోట గ్రీన్ జోన్లు. వారి భూముల ధరలు కోట్లకు చేరుకోగా రైతుల భూముల ధరలు లక్షలకు పడిపోయాయి. ధర లేకపోయినా అమ్ముకోకుండా కఠిన నిబంధనలు, వ్యవసాయం తప్ప మరో కార్యానికి పనికిరాకుండా కండిషన్లు అమల్లోకొచ్చాయి. ఇదీ రాజధాని పేరుతో ‘పెద్దలు’ ఆడుతున్న రాక్షసక్రీడ.. ►రాజధాని ప్రాంతంలోని లంక భూములు, అసైన్డ్ భూములు తొలుత భూ సమీకరణలో లేవు. ►‘భూ’ బకాసురుల కుట్రలు ఫలించే వరకు వాటిని పక్కనుంచారు.. ►పరిహారం ఇవ్వకుండా లాక్కుంటారని అనుచరులతో ప్రచారాలు చేయించారు ►దాంతో నిజమేననుకుని రైతులు భయపడ్డారు. ►భూములను వచ్చిన రేటుకు అమ్మేసుకున్నారు. ►పెద్దలంతా బినామీ పేర్లతో 1249.54 ఎకరాల భూములను సొంతం చేసుకున్నారు. ►ఆ తర్వాత లంక భూముల సమీకరణకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ►ఎకరా ధర రూ. 1.75 కోట్లు పలికింది.. ‘పెద్దలు’ రూ. 2,500 కోట్లకు పైగా లాభపడ్డారు. ►అసైన్డ్ భూములూ అంతే.. బినామీ పేర్లతో 1,848 ఎకరాలు కైంకర్యం చేశారు. ►ప్యాకేజీ ప్రకటించిన తర్వాత వాటి ధరలు అమాంతం పెరిగాయి. ►ఎకరా రూ. 1.5కోట్లు నుంచి రూ. 1.75 కోట్లు పలుకుతున్నాయి. ‘పెద్దల’కు రూ. 3,234 కోట్లమేర లబ్ధి చేకూరింది. పేద రైతుల పొట్టగొట్టిన గ్రీన్జోన్! ►అమరావతిలో పెద్దలు వేసిన జోన్ల ‘పథకం’ పేద రైతుల పొట్ట కొట్టింది. ►ఎకరా రూ. 4 కోట్లు ఉన్న భూమి ధర రాత్రికి రాత్రి రూ. 40 లక్షలకు పడిపోయింది. ►రూ. 2 కోట్లు పలికిన భూమిని రూ. 20 లక్షలకు కూడా కొనేవాళ్లు లేరు. ►విచిత్రమేమిటంటే పక్కపక్కనే ఉన్న భూములు కూడా ఇలా రకరకాల రేట్లు పలుకుతున్నాయి. ►ఒకరి భూమి కోట్లు పలుకుతుంటే పక్కనే ఉన్న మరొకరి భూమి లక్షలకు కూడా కొనేవారు లేరు. ►రాజధాని భూములను జోన్ల వారీగా వర్గీకరించిన ఫలితమిది. ►ఏ జోన్లో ఏం రాబోతున్నదనే విషయాన్ని గోప్యంగా ఉంచి అనుయాయుల చేత భూములు కొనిపించారు... ► బాబుగారి బినామీల భూములున్న చోట కమర్షియల్ జోన్.. పేదరైతుల భూములున్న చోట అగ్రికల్చర్ జోన్... ►దాంతో బాబుల భూముల ధరలకు రెక్కలొచ్చాయి..అగ్రికల్చర్ జోన్లోని పేద రైతుల భూముల ధరలు పడిపోయాయి.. ►పెద్దల ఆర్జన వేల కోట్లకు పెరిగింది.. పేద రైతుల జీవితాలు ఊబిలో దిగబడ్డాయి... అదీ వాళ్ల స్కెచ్. -
కబ్జా చక్రవర్తి లింగమనేని (సీఎంగారికి వెరీక్లోజ్)
⇒‘సాక్షి’ వద్ద పేదలిచ్చిన డాక్యుమెంట్లు.. ⇒ఎస్టేట్లో పేదల భూములు స్వాహా.. ⇒ 300 ఎకరాల కబ్జా భూములు.. ⇒వాటి విలువ రూ. 1,500 కోట్లు పైనే... ⇒సమీకరణ నుంచి ఎస్టేట్కు మినహాయింపు ⇒ కొద్ది దూరంలో ఆగిపోయిన రాజధాని సరిహద్దు ఎవరీ లింగమనేని?... జస్ట్ ఎయిర్ కోస్టా విమానాలకు బాస్ మాత్రమేనా..? కాదు. చట్టాన్ని ఎగతాళి చేస్తూ, కృష్ణా నదిని కూడా కబ్జా చేసి ప్యాలెస్ లాంటి భవంతి కట్టుకున్న ‘పనిమంతుడు’ మాత్రమే కాదు. ఆ భవంతిని తన ఇష్టదైవం లాంటి రాష్ట్ర ముఖ్యమంత్రికి సమర్పించుకున్న భక్త ‘హనుమంతుడు’ మాత్రమే కాదు.... కోస్తాంధ్రలోని రెండు ప్రధాన పట్టణాలయిన విజయవాడ - గుంటూరుల నట్టనడుమ మూడు వందల ఎకరాల విలువైన భూమిని అవలీలగా చెరబట్టిన కబ్జా కాలకేయుడు కూడా. కబ్జా చేసుకున్న భూమికి సరిహద్దు గోడను కూడా నిర్మించుకున్న సమర్ధుడు. ఎంత సమర్ధుడంటే.. భూ సమీకరణ చట్టం ఆయన సరిహద్దు గోడదాకా వచ్చి వంగి సలామ్ కొట్టి పక్కకు తిరిగి వెళ్లింది... రాజధాని అమరావతిలో ‘బాబు’ల బినామీ భూ బాగోతాలు కోకొల్లలుగా బైటపడుతున్నాయి. లింగమనేని రమేష్కు ముఖ్యమంత్రి చంద్రబాబుకు మధ్య ఉన్న బంధాన్ని రుజువుచేసే మరో పక్కా ఆధారం గురువారం ‘సాక్షి’కి లభించింది. ఈ ఆధారం ‘సాక్షి’ తవ్వితీసింది కాదు. పేదలు స్వయంగా వచ్చి ‘సాక్షి’ చేతికి అందించింది. పేదల భూములను లింగమనేని కలిపేసుకున్నారని తెలిపే ఆధారాలవి. భూ సమీకరణ విషయంలో బినా మీలైతే ఒకరకంగా.. బడుగు రైతులైతే మరో రకంగా బాబు వ్యవహరించారనేందుకు అనేక ఆధారాలు న్నాయి. మూడు పంటలు పండే పేదల భూములను బలవంతంగా సమీకరించిన చంద్రబాబు ప్రభుత్వం లింగమనేని వంటివారిని మాత్రం ‘దయ’తో వదిలేసింది. నిడమర్రు సమీపంలోని లింగమనేని ఎస్టేట్ను రాజధాని భూ సమీకరణనుంచి తప్పిం చడం... ప్రతిఫలంగా లింగమనేనివారు ముఖ్య మంత్రికి కృష్ణానదీ గర్భంలో అక్రమంగా నిర్మించిన గెస్ట్హౌస్ను నజరానాగా సమర్పించడం మనకు తెలిసిన విషయాలే. ఈ ఎస్టేట్లో 300 ఎకరాల పేదల భూములు కలిపేసుకున్న విషయం తెలిసినా ఎలాంటి చర్యలూ తీసుకోకుండా లింగమనేని విషయంలో చంద్రబాబు ఉదారంగా వ్యవహరిం చారు. ఆ వివరాలు చూద్దామా.. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజ గ్రామంలో సుమారు 300 ఎకరాల్లో సున్నపురాయి నిక్షేపాలు ఉన్నాయి. వీటిని 1937వ సంవత్సరంలో గుర్తించిన బాంబేకు చెందిన అసోసియేట్స్ సిమెంట్స్ కంపెనీ లిమిటెడ్ (ఏసీసీ) యాజమాన్యం ఈ భూములను రైతుల దగ్గర నుంచి 99 ఏళ్ళ లీజు విధానంలో సేకరించింది. అప్పట్లో ఏసీసీ సిమెంట్స్ ఎండీ డబ్ల్యూహెచ్ బెన్నిట్స్ తరఫున కూర్మరాజు గోపాలస్వామి రైతులందరి భూములు కేవలం విక్రయ కాంట్రాక్ట్ మాత్రమే తీసుకుంటున్నట్లు రైతులకు అగ్రిమెంట్ (ఒప్పంద పత్రం) రాసిచ్చారు. సిమెంట్ కంపెనీ యాజమాన్యం సున్నపురాయి నిక్షేపాలు తవ్వడం ఆపివేసిన పక్షంలో.. లీజు కాలం వరకూ ఈ భూముల్లో పంటలు వేసుకునేందుకు రైతులకు హక్కు కల్పించారు. లీజు గడువు ముగిసిన తరువాత ఆ భూములు వాటి యజమానులైన రైతుల స్వాధీనంలోకి వచ్చేలా విక్రయ కాంట్రాక్ట్ ఒప్పందంలో స్పష్టంగా పేర్కొన్నారు. అయితే అసలు మతలబు ఇక్కడే జరిగింది. లీజు గడువుకు ముందే ఏసీసీ లిమిటెడ్ ఈ భూముల్లో తవ్వకాలు నిలిపివేసి సిమెంట్ కంపెనీని తరలిపోయింది. చంద్రబాబు అధికారంలోకి రాగానే.. పేదల భూములను ఆక్రమించిన లింగమనేని.. చంద్రబాబు అధికారంలోకి రావడంతోనే అనేక చర్యలు తీసుకున్నారు. రైతులను మభ్యపెట్టి, మాయచేసి, బెదిరించి ఖాళీ స్టాంప్ పేపర్లపై సంతకాలు చేయించుకున్నారు. అనంతరం ఆ స్టాంప్ పేపర్లలో తమకు నచ్చినట్లు రాసుకుని ముఖ్యమంత్రి అండతో రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల సహకారంతో రూ.1500 కోట్ల విలువ చేసే భూముల్ని తన వశం చేసుకున్నారు. రాజధాని ప్రాంతం ప్రకటనకు కొద్ది రోజుల ముందే లింగమనేని ఈ 300 ఎకరాల విలువైన భూములను ఓ ఎస్టేట్ మాదిరిగా మార్చారు. భద్రతా సిబ్బంది, సీసీ కెమెరాలు, ఎక్కడికక్కడ చెక్పోస్టులతో పటిష్ట నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసింది. ఎస్టేట్ మొత్తాన్ని రియల్ ఎస్టేట్ వెంచర్గా మార్చేందుకు వీలుగా ఏర్పాట్లు చేసింది. ఇక్కడ ఎకరం రూ.ఐదు కోట్ల వర కూ పలుకుతోంది. కాజ గ్రామానికి చెందిన కొంత మంది రైతుల వద్ద ఇంకా లీజు అగ్రిమెంట్లు ఉండటంతో లింగమనేని కబ్జా భాగోతం వెలుగులోకి వచ్చింది. ఈ భూముల పక్కనే ‘చినబాబు’ కొట్టేసిన అగ్రిగోల్డ్ హాయ్ల్యాండ్ కూడా ఉండటం గమనార్హం. లీజుకు ఇచ్చిన తమ భూములు ఎక్కడు న్నాయో తెలుసుకునేందుకు కాజ గ్రామస్తులు ప్రయత్నించగా, లింగమనేని ఎస్టేట్లో ఉన్నట్లు తేలింది. పేదల వద్ద పక్కా ఆధారాలు... లింగమనేని ఎస్టేట్స్ యాజమాన్యం అధీనంలో ఉన్న భూముల్లో తమ భూములు కూడా ఉన్నాయని, వాటికి సంబంధించిన పక్కా ఆధారాలు తమ వద్ద ఉన్నాయని బాధిత రైతులు తెలిపారు. అయితే తమ భూములను చూసేందుకు కూడా వీలు లేకుండా ప్రై వేట్ సైన్యాన్ని పెట్టి బెదిరింపులకు దిగుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై రెవెన్యూ అధికారులకు, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోతోందని వాపోతున్నారు. సీఎం చంద్రబాబు అండదండలు ఉండటం వల్లే లింగమనేని ఎస్టేట్స్ వైపు కన్నెత్తి చూసేందుకు అటు రెవెన్యూ.. ఇటు పోలీసు అధికారులు సాహసించడం లేదు. సర్వే నెంబరు 191, 192, 226 ఇలా అనేక సర్వే నెంబర్లలో ఉన్న 300 ఎకరాల భూమిని లింగమనేని యాజమాన్యం కొట్టేసిందని బాధితుల కథనం. రాజధాని దురాక్రమణపై ‘సాక్షి’లో వరుస కథనాలు రావడంతో బాధితులు తమ వద్ద ఉన్న విక్రయ డాక్యుమెంట్ల ఆధారాలతో ‘సాక్షి’ ప్రతినిధులను ఆశ్రయించడంతో లింగమనేని గ‘లీజు’ దందా వెలుగులోకి వచ్చింది. -
అక్కడ భూములు కొన్నది నిజమే: పయ్యావుల
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో భూములు కొన్నది వాస్తవమేనని టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ అంగీకరించారు. 'సాక్షి' కథనంపై స్పందించిన ఆయన గురువారమిక్కడ మాట్లాడుతూ బినామీ పేరుతో కాదని, తన కొడుకు పేరుతోనే భూములు కొన్నానని తెలిపారు. కాగా కోర్ కేపిటల్లోని తుళ్లూరుకు అతి దగ్గరగా ఉండే అయినవోలు గ్రామంలో పయ్యావుల 4.09 ఎకరాలు కొనుగోలు చేశారు. సర్వే నెంబరు 48/3లో 2.13ఎకరాలు, సర్వే నెంబరు 49/3లో 1.96 ఎకరాలు కలిపి మొత్తం 4.09 ఎకరాల భూమిని 2014 అక్టోబరు 13న కేశవ్ పెద్దకుమారుడు పయ్యావుల విక్రమసింహ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఎకరం 3.7 లక్షల చొప్పున 4.09 ఎకరాలను 12.27లక్షల రూపాయలకే కొనుగోలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. కానీ అయినవోలులో ప్రస్తుతం మార్కెట్ విలువ ఎకరా రూ.2కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. అంటే ఏడాది వ్యవధిలో పయ్యావుల భూములకు 50 రెట్లకు పైగా ధర పలుకుతోంది. మరోవైపు రైతుల వద్ద భూములు కొంటే తప్పేంటని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర అన్నారు. రాజధానిలో ఎంతోకొంత భూమి ఉండాలని ఎవరైనా కోరుకుంటారని, 2,3 ఎకరాలు కొనుక్కోలేని పరిస్థితిలో తాము ఉన్నామా అని ఎదురు ప్రశ్నించారు. కాగా నంబూరులో సర్వే నెంబరు 274లోని 3.89 ఎకరాల వాగు పోరంబోకు భూమిని తన సమీప బంధువు దేవర పుల్లయ్య పేరుతో సొంతం చేసుకోవడానికి ధూళిపాళ వ్యూహాత్మకంగా పావులు కదిపారు. రెవిన్యూ అధికారులపై ఒత్తిడి తీసుకు వచ్చి రెండుమూడు చేతులు మార్చినట్లుగా చూపి డాక్యుమెంట్ నెంబర్లు 2638, 2639, 2640లలో 3.89 ఎకరాల భూమిని తమ బినామీదారుల పేర్లపై రిజిస్ట్రేషన్ చేసేసుకున్నారు. -
ఓ చిరుద్యోగి 30 ఎకరాలు కొనగలడా?
0.25, 0.32, 0.45, 0.87, 1.5... ఏమిటీ అంకెలనుకుంటున్నారా..? ► ఓ కాలేజీలో కరెంటు మరమ్మతు పనులు చూసే మునిశంకర్ అనే చిరుద్యోగి పేరున ఉన్న పొలం బిట్లు ఇవి. బిట్లు బిట్లుగా రాజధాని గ్రామాల్లో ఈయన పేరున దాదాపు 30 ఎకరాల పొలం ఉంది. ఎకరా రూ. 3 కోట్లు చొప్పున 30 ఎకరాలంటే రూ. 90 కోట్లవుతుంది కదా... ఓ చిరుద్యోగి అన్ని కోట్లతో కొనగలడా? ► రాపూరు సాంబశివరావు అనే మరో వ్యక్తి పేరుతో కూడా రాజధానిలో బిట్లు బిట్లుగా 29 ఎకరాలకు పైగా భూములున్నాయి. పోతూరి ప్రమీల అనే మహిళ పేరుతో 15 ఎకరాలున్నాయి. ► మునిశంకర్ మంత్రి నారాయణకు వరసకు బావమరిది.. సాంబశివరావు సొంత బావమరిది... కాగా ప్రమీల మంత్రిగారి సన్నిహితురాలు.. ► వీరెవరికీ కోట్లు పోసి కొనే శక్తి లేదు. వీరంతా మంత్రిగారి బినామీలని మీకీపాటికే అర్థమైఉండాలి. ► మంత్రిగారి బినామీలు కాబట్టే వారి పేరుతో ఎకరాలకు ఎకరాలు రిజిస్టరయ్యాయి. ►రాజధాని భూ సమీకరణలో ముఖ్యభూమిక పోషించిన మంత్రి పి.నారాయణ ఇలా 29 గ్రామాల్లోనూ దాదాపు 3,129 ఎకరాల విలువైన వ్యవసాయ భూములను, నివేశన స్థలాలను కొనుగోలు చేశారు. బిట్టుబిట్టుగా భూములన్నీ తన కాలేజీల్లో పనిచేసే ఉద్యోగుల పేర్లమీద, దూరపు బంధువుల పేర్లమీద ఆయన కొనుగోలు చేశారు... ఇక రాజధాని ప్రకటనకు ముందే రైతుల వద్ద భూములు కొన్న నారాయణ వారితో ఒప్పందాలు చేసుకుని వారి పేరుతోనే సమీకరణకు భూములిప్పించారు.. పరిహారం మాత్రం ఆయన ఖాతాకు చేరబోతున్నది. అలా వచ్చే పరిహారం విలువే రూ. 400 కోట్ల వరకు ఉంటుందని అంచనా..! 425 కోట్ల రూపాయలు హాయ్ల్యాండ్ కొట్టేశారు.. ►ప్రభుత్వ ‘పెద్ద’ కన్నుపడిందంటే అది కైంకర్యమే... ►రూ. 425 కోట్ల విలువైన 85.13 ఎకరాల హాయ్ల్యాండ్పై ‘బాబు’లు కన్నేశారు. ►రూపాయి రూపాయి కూడబెట్టి డిపాజిట్లు కట్టిన 32 లక్షల మంది ఖాతాదారులకు రూ. 6,850 కోట్ల మేర శఠగోపం పెట్టిన అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని కేసుల నుంచి తప్పిస్తామని, అందుకు ప్రతిఫలంగా హాయ్ల్యాండ్ ఇవ్వాలని బేరంపెట్టారు. ►బేరం కుదిరింది.. హాయ్ల్యాండ్ ‘చినబాబు’ సొంతమైంది.. ►రాజధాని పేరుతో భారీ దోపిడీ చేసిన ప్రభుత్వ పెద్దలు అంది వచ్చిన ఏ అవకాశాన్నీ వదులుకోలేదనడానికి హాయ్ల్యాండ్ భూములే ఉదాహరణ. 17.3 ఎకరాలు పీఏ పేరుతో కొన్నది ►అతను ఓ ప్రముఖుడి వ్యక్తిగత సహాయకుడు... ►పీఏకి ఎంత జీతం వస్తుంది..? మహా అయితే రూ. 15 వేలు.. ►ఆ పీఏ రాజధానిలో ఏకంగా 17.3 ఎకరాలు కొనేశాడు. ►ఎకరం రేటెంతో తెలుసా? రూ. 1.50 కోట్లు. అంటే మొత్తం రూ. 25.95 కోట్లు ►అంటే బినామీ అని అర్థం కావడం లేదూ..? చిత్రమేమంటే ఆ పీఏ పేరున ఓ సంస్థ ఉందండోయ్... ►ఆ ప్రముఖుడెవరంటే.. స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమారుడు శివరామకృష్ణ.. పీఏ పేరు నాగప్రసాద్. 210 కోట్ల రూపాయలు తప్పించుకున్న ‘వెంచర్’ ► ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యే.. కొమ్మాలపాటి శ్రీధర్ ► రాజధాని ప్రకటించగానే తన రియల్ ఎస్టేట్ వెంచర్లో రిజిస్ట్రేషన్లు ఆపేశారు.. ► నెలనెలా వాయిదాలు కట్టిన దాదాపు 3వేల మంది లబోదిబోమంటున్నారు.. ► మొత్తం 42 ఎకరాల్లో ఆ వెంచర్ ఉంది. ‘చినబాబు’ చెప్పడంతో దానిని సమీకరణ నుంచి తప్పించారు.. ► ఫలితంగా ఆ వెంచర్లో ‘చినబాబు’కు వాటాలందినట్లు పక్కా సమాచారం.. ► ఆ భూమి విలువ ఇపుడు రూ.210 కోట్లు... 53 ఎకరాలు పోరంబోకు భూముల కబ్జా ► అది ఊరందరికీ తెలిసిన వాగు పోరంబోకు భూమి.. ►రాజధాని ప్రకటనతో ఎమ్మెల్యే కన్ను దానిపై పడింది.. ►బంధువు పేరుతో డాక్యుమెంట్లు సృష్టించారు. ఆయన ఇంకొకరికి అమ్మినట్లు.. వారు మరొకరికి అమ్మినట్లు పత్రాలు పుట్టుకొచ్చాయి. అలా లింక్ డాక్యుమెంట్లకు ఊపిరి పోశారు. ►చివరకు బంధువు పేరుతో రిజిస్ట్రేషన్ చేయించేశారు. ►అలా 3.89 ఎకరాల పోరంబోకు భూమి కాస్తా పక్కా రిజిస్ట్రేషన్ భూమిగా మారిపోయింది. ►ఇది ఎమ్మెల్యే ధూళిపాళ్ల ‘పోరంబోకు భూమి’ కథ. ఇది కాక ఒక్క పెదకాకాని మండలంలోనే 50 ఎకరాల వరకు పోరంబోకు భూములు కబ్జా చేసినట్లు ఆరోపణలున్నాయి. ఉప్పందిన వెంటనే నాలుగెకరాలు దొరికాయి.. ► రాజధాని తుళ్లూరు దగ్గర వస్తుందని అధికారపార్టీ ముఖ్యులకు మాత్రమే తెలుసు.. ► కానీ నాగార్జున వర్సిటీ దగ్గర అని కొన్నాళ్లు..నూజివీడు దగ్గర అని కొన్నాళ్లు... ప్రచారం చేశారు.. ► ఈలోగా తుళ్లూరు సమీపంలో భూములను కారుచౌకగా కొనేశారు.. అందినవారికి అందినంత... ► టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్కు తుళ్లూరు మండలం అయినవోలులో అలా 4.09 ఎకరాలు దొరికాయి. ► ఎకరా రూ.3.7 లక్షల చొప్పున 4.09 ఎకరాలను ఆయన రూ. 12 లక్షలకే కొట్టేశారు. ► ఇపుడు ఆ భూమి విలువ దాదాపు రూ. 7 కోట్లు పలుకుతోంది... పచ్చి మోసం.. దగా ఇది రైతుల మాట... భయపడి అమ్ముకున్నాం సాక్షిలో ప్రచురితమైన భూ దురాక్రమణ కథనం చదివాం. అన్నీ వాస్తవాలే. ఎందుకంటే భూ సమీకరణ తొలి రోజుల్లో సమీకరణకు ఇవ్వకుంటే, బలవంతంగా భూసేకరణ జరుపుతామని, ఎకరాకు రూ. 20 లక్షలు రావని ప్రభుత్వ పెద్దలు భయాందోళనలకు గురి చేయడంతో గత్యంతరం లేక అమ్ముకోవాల్సి వచ్చింది. అప్పట్లో ఎకరా తక్కువ రేటుకే అమ్ముకున్నాం. ఇప్పుడు రూ. 1.40 కోట్లకు చే రింది. - కొమ్మారెడ్డి పిచ్చిరెడ్డి, నిడమర్రు, మంగళగిరి మండలం ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరించింది రాజధాని ప్రకటన నాటి నుంచి ప్రభుత్వం రైతుల పట్ల మోసపూరితంగానే వ్యవహరించింది. భూములు ఇవ్వనంతకాలం బెదిరించి, భయపెట్టి రైతులను అమ్ముకునే విధంగా చేశారు. తక్కువ ధరలకే ప్రభుత్వ పెద్దలు, మంత్రులు కొనుగోలు చేసి భూ సమీకరణ పూర్తయిందని రైతులను ఆందోళనకు గురి చేసి మిగిలిన రైతులను సైతం భూములను అమ్ముకునేలా చేశారు. దీంతో రైతులు నష్టపోగా కొనుగోలు చేసిన వారు లబ్ధి పొందారు. - కొప్పోలు వెంకటేశ్వర్లు, బేతపూడి, మంగళగిరి మండలం నాటకాలాడుతున్నారు బుధవారం సాక్షిలో ప్రచురితమైన భూ దందా కథనాలు నూరుశాతం నిజం. రాజధాని నిర్ణయం జరుగకముందు ఇక్కడి ప్రాంతానికి వచ్చిన పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు రైతులను భయబ్రాంతులకు గురి చేసి భూములను కొన్నారు. ఇప్పుడు మాత్రం మాటతప్పి నాటకాలు ఆడుతున్నారు. ఆర్థికంగా మేము చాలా నష్టపోయాం. భూములు కొనుగోలు చేసిన నేతల భాగోతాలపై విచారణ జరపాలి. - జొన్నా శివశంకర్, ఉండవల్లి, తాడేపల్లి మండలం ఇష్టం లేకపోయినా ఒప్పించారు ఏడాది పొడవునా మూడు పంటలూ పండే భూములు మావి. సమీకరణకు ఇచ్చేందుకు మాకు ఇష్టం లేకపోయినా ప్రభుత్వం, అధికారులు భయపెట్టడం కారణంగానే అమ్ముకోవాల్సి వచ్చింది. తక్కువ ధరలకే కొనుగోలు చేసిన వారు భూ సమీకరణకు ఇచ్చి మమ్మల్ని మోసగించారు. - బేతపూడి సాంబయ్య, నిడమర్రు, మంగళగిరి మండలం. అసైన్డ్కు పరిహారం లేదన్నారు! అసైన్డ్ భూములకు ప్యాకేజీ విషయంలో ప్రభుత్వం ఆలస్యం చేసింది. తీరా అసైన్డు రైతులు తక్కువ ధరలకు భూములు అమ్ముకోగానే ప్యాకేజీ ప్రకటించింది. దీంతో మేము తీవ్రంగా నష్టపోయాం. 83 సెంట్ల భూమిని కేవలం రూ. 39 లక్షలకు అమ్ముకున్నా. ఇప్పుడు మార్కెట్ ధర ప్రకారం రూ. 1.20 కోట్ల వరకు పలుకుతోంది. తలుచుకుంటే ముద్ద కూడా దిగడం లేదు. - రావూరి ప్రభుదాస్, కురగల్లు, మంగళగిరి మండలం ఆందోళనతోనే అమ్ముకున్నాం భూ సమీకరణ విధానం ద్వారా భూములు తీసుకున్న ప్రభుత్వం భవిష్యత్తులో కౌలు పరిహారం చెల్లిస్తుందో, లేదో అనే ఆందోళనతో తక్కువకే భూమి అమ్ముకోవాల్సి వచ్చింది. ఆరు నెలల క్రితం అరెకరా రూ. 18 లక్షలకు అమ్ముకున్నా. ప్రస్తుతం ఆ భూమి ధర రూ. 60 లక్షల నుంచి రూ. 70 లక్షల వరకు పలుకుతోంది. జరిగిన నష్టాన్ని తలచుకుంటేనే బాధ వేస్తోంది. - చెంచు రామారావు, కురగల్లు, మంగళగిరి మండలం నేతల మాటలతో మోసపోయాం రాయపూడిలో నేను ఎకరా రూ. 40లక్షలతో భూములు కొనుగోలు చేశాను. ల్యాండ్ పూలింగ్ పరిధిలో వున్న ఈ పొలం రోడ్డు విస్తరణ కింద పోవడం ఖాయమని అధికార పార్టీ నేతలు భయపెట్టారు. పైగా నేను కొనుగోలు చేసిన రూ. 40 లక్షలకే కొంటామన్నారు. రెండవ సారి రూ. 35లక్షలకే అడిగారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల అనుచరులే ఇక్కడ భూముల ధరలు నిర్ణయించారు. దీంతో నష్టపోవాల్సి వచ్చింది. - దాసరి ఆంజనేయులు, ఉండవల్లి, తాడేపల్లి మండలం రేట్లు తగ్గించి కొన్నారు రాజధాని ప్రకటనకు ముందు ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లో ఎకరం రూ. 5 కోట్లుండగా రాజధాని ప్రకటించాక టీడీపీ నేతలు అపోహలు సృష్టించారు. రైతులు అవసరమై పొలం అమ్ముదామనుకుంటే ఎకరాకు కోటి కంటే ఎక్కువ పలకలేదు. బినామీ పేర్లతో ఎక్కువ భూములు కొనుగోలు చేశారు. న్యాయం కోసం కోర్టును ఆశ్రయించాల నుకుంటున్నాం. - మేకా ప్రభాకరరెడ్డి, పెనుమాక, తాడేపల్లి మండలం -
బిట్టు బిట్టుకో బినామి
⇒ పెద్దల ‘భూ’మాయకు ఆధారాలెన్నో.. ⇒ ఓ చిరుద్యోగి 30 ఎకరాలు కొనగలడా..? 15 ఎకరాలు కొన్న ప్రమీల ఎవరు? ⇒ బావమరిది పేరుతో 29 ఎకరాలు కొన్నదెవరు? ⇒ నారాయణ భూ దందాలో పాత్రధారులెందరో... ⇒ రూ. 425 కోట్ల హాయ్ల్యాండ్ను కొట్టేసిన ‘చినబాబు’ ⇒ పీఏ పేరుతో 17.3 ఎకరాలు కొన్న కోడెల కుమారుడు ⇒ వాగు పోరంబోకును బంధువు పేరుతో రిజిస్ట్రేషన్ చేయించిన ధూళిపాళ్ల ⇒ సమీకరణ నుంచి ఎమ్మెల్యే ‘వెంచర్’ తప్పించినందుకు ‘చినబాబు’కు వాటాలు ⇒ రాజధాని ఉప్పందుకున్న పయ్యావుల కేశవ్ కొన్నది 4.09 ఎకరాలు.. రాజధాని ‘భూమాయ’లు ఒకటో రెండో కాదు. తవ్విన కొద్దీ బైటపడుతున్నాయి. రకరకాల మాయోపాయాలతో రాజధాని రైతన్న పొట్టగొట్టి వేల ఎకరాలను కాజేసిన పెద్దల ‘ఘన’కార్యాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అధికారాన్ని అడ్డుపెట్టుకుని పచ్చదండు ఆడిన వికృత క్రీడకు వేలమంది రైతులు బలైపోయారు. రాజధాని ఎక్కడ అనే దానిపై గందరగోళం సృష్టించడంతో అమాయక రైతులు అయినకాడికి భూములు అమ్మేసుకున్నారు. రైతులను మోసగించి కారుచౌకగా కొట్టేసిన భూములు ఇపుడు పెద్దలకు కోట్లు కురిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి సారథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఆడిన ‘బినామీ’ నాటకాలు చూస్తే మనకు కళ్లు తిరగడం ఖాయం.. ► రాజధానిగా ప్రకటించనున్న ప్రాంతంలో మంత్రి నారాయణ బిట్లు బిట్లుగా దొరికినచోట దొరికినట్లు భూములు కొనేశారు. అరెకరం, 45 సెంట్లు, 87 సెంట్లు ఇలా ముక్క దొరికితే చాలు కారుచౌకగా స్వాహా చేశారు. పనివాళ్లు, బంధువులు, ఉద్యోగులు ఇలా అందరి పేర్లను వాడేసుకున్నారు. రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లోనూ మంత్రిగారు బినామీ పేర్లతో పాగా వేశారు. మంత్రిగారి దూకుడు, పనితనం గమనించిన ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని వ్యవహారాలన్నీ దగ్గరుండి పర్యవేక్షించే బాధ్యతలను ఆయన భుజస్కం ధాలపైనే పెట్టేశారు. అలా మంత్రులు, ఎమ్మెల్యేలందరికీ రాజధానిలో ఆయనే పెద్దదిక్కు అయ్యారు. ► స్పీకర్ కోడెల శివప్రసాద్ కుమారుడు తన వ్యక్తిగత కార్యదర్శి పేరుతో 17.3 ఎకరాలు కొన్నారు.. ► ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రచౌదరి రూ. 5 కోట్ల విలువైన వాగు పోరంబోకును కబ్జాచేసి బంధువు పేర రిజిస్ట్రేషన్ చేయించారు.. ► రైతుల భూములు బలవంతంగా లాక్కున్న పెద్దలు.. అధికారపార్టీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ రియల్ఎస్టేట్ వెంచర్ను పూలింగ్ నుంచి తప్పించేశారు. ► రాజధాని ఎక్కడ వస్తుందో ముందే ఉప్పందుకున్న ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్... తన కుమారుడి పేరుతో భూములు కొన్నారు... ►ఆ ఇంద్రుడి రాజధాని అమరావతి.. ‘అమృతం’, ‘ఐరావతం’ ‘పారిజాతం’ నిలయం.. కాగా ఈ చంద్రుడి రాజధాని అమరావతి ‘బినామీలు’, భూబకాసురులు, దొంగ జీపీఏలు, రైతుల పొట్టగొట్టి కారుచౌకగా కాజేసిన వేల ఎకరాల రిజిస్ట్రేషన్ పత్రాల వలయం... నారాయణ.. నారాయణ! • కొనుగోలు 3,129 ఎకరాలు • చెల్లించినది 432 కోట్లు • ప్రస్తుత విలువ 10,000 కోట్లకు పైగా... రాజధాని భూసమీకరణలో ప్రధాన భూమిక పోషించిన పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ.. భూదందాలోనూ ముందున్నారు. రెండేళ్ల కిందటి వరకు విద్యాసంస్థల అధిపతిగానే తెలిసిన నారాయణ 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి భారీగా నిధులందించారనీ, అందుకు ప్రతిఫలంగానే ఎమ్మెల్సీ, మంత్రి పదవీ అందుకున్నారనేది జగమెరిగిన సత్యం. అది నిజమేనన్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెవెన్యూ మంత్రిని కాదని రాజధాని ప్రాంతంలో భూసమీకరణ బాధ్యతలను తన ప్రధాన బినామీ నారాయణకే అప్పగించారు. భూసమీకరణలో భాగంగా ఆయన రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లోనూ మకాం వేసి.. విస్తృతంగా పర్యటించారు, గ్రామ సభలు నిర్వహించారు. ఈ క్రమంలోనే టీడీపీ సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీల ద్వారా అసైన్డు, లంక భూముల రైతులను గుర్తించి, వారి ఆర్థిక పరిస్థితిపై ఆరా తీశారు. అసైన్డు, లంక భూములకు ఎలాంటి పరిహారం చెల్లించకుండా ప్రభుత్వం ఉత్తినే లాక్కుంటుందంటూ తన అనుచరులతో విస్తృతంగా ప్రచారం చేయించారు. ఆందోళన చెందుతున్న దళిత రైతుల వద్దకు తన ప్రతినిధులతో బేరసారాలు సాగించారు. ఎకరం కనిష్టంగా రూ.పది లక్షల నుంచి గరిష్టంగా రూ.15 లక్షల చొప్పున 3,129 ఎకరాలు బినామీల పేరుతో కొనుగోలు చేశారు. ఈ ప్రాంతంలో కమతాలు చిన్న చిన్నవి కావడంతో కనిష్టంగా 0.25 ఎకరాల నుంచి గరిష్టంగా 1.5 ఎకరాల వరకూ బిట్లు బిట్లుగా కొనుగోలు చేశారు. 3,129 ఎకరాలు కొనుగోలు భూముల కొనుగోలులో నారాయణ తన తెలివిని జాగ్రత్తగా ఉపయోగించారు. భూమిని విక్రయించిన రైతులకు అడ్వాన్సు కింద రూ.రెండు లక్షలు ముట్టజెప్పి.. తన బినామీల పేర్లతో రహస్య అగ్రిమెంట్లు చేయించుకున్నారు. అసైన్డు, లంక భూముల సమీకరణకు ఇటీవల సీఎం చంద్రబాబునాయుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం.. ఆ భూములపై కొనుగోలుదారులకు హక్కులు కూడా కల్పించడానికి కసరత్తు చేస్తోన్న నేపథ్యంలో తక్కిన మొత్తాన్ని కూడా తనకు భూమిని అమ్మిన వారికి ముట్టజెప్పేశారు. ఆ రైతుల నుంచి జీపీఏ (జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ) తన బినామీల పేర్లపై చేయించుకున్నారు. సమీప బంధువులు, నారాయణ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పేరు మీద ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయించారు. భూముల కొనుగోళ్లు, రిజిస్ట్రేషన్లు బయటకు పొక్కకుండా ఆన్లైన్ రిజిస్ట్రేషన్, రిప్రజెంటేటివ్ విధానాన్ని అనుసరించారు. దీనితో భూమిని విక్రయించిన రైతు కొనుగోలుదారుణ్ణి ప్రత్యక్షంగా చూడకుండానే రిజిస్ట్రేషన్ జరిగిపోయింది. బినామీల పేరుతో భారీ కొనుగోళ్లు... మంత్రి నారాయణ బినామీ వ్యవహారానికి ఆకుల మునిశంకర్, రావూరు సాంబశివరావు, పొత్తూరి ప్రమీల తదితరుల భూముల కొనుగోళ్లను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. నెల్లూరుకు చెందిన మునిశంకర్ కోర్ కేపిటల్కు అతి సమీపంలో ఉన్న మందడం గ్రామంలో సర్వే నెంబరు 126లో నూతక్కి నరసింహనాయుడుకు చెందిన 1.50 ఎకరాల భూమిని రూ.2.25 కోట్లు చెల్లించి 1.50 ఎకరాలు కొన్నాడని గ్రామస్తులు తెలిపారు. కానీ ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఎకరం ధర రూ.6 లక్షలు ఉండగా.. మార్కెట్ విలువను కేవలం రూ.తొమ్మిది లక్షలుగా చూపించారు. అలాగే లింగాయపాలెంలో సర్వే నెంబరు 109/1లో బోడిపూడి వెంకటరమణ నుంచి 0.56 ఎకరాలు, మందడంలో సర్వే నెంబరు 15/1లో బోరుగడ్డ రాంప్రకాష్ నుంచి 0.37 ఎకరాలు, లింగాయపాలెంలో సర్వే నెంబరు 140/ఏలో కొత్తపల్లి రాధారాణి నుంచి 0.45 ఎకరాలు, సర్వే నెంబరు 188లో కొండెపాటి వెంకాయమ్మ నుంచి 0.28 ఎకరాలు, రాయపూడిలో సర్వే నెంబర్లు 119/ఏ, 119/ఎఫ్లలో షేక్ హస్రఫ్ ఉన్నీసా తదితరుల నుంచి 0.75 ఎకరాలు, సర్వే నెంబరు 354/1ఏ, 354/1బీలలో లంబు వెంకటేశ్వర్లు తదితరుల నుంచి 0.87 ఎకరాలు, సర్వే నెంబరు 360/1లో వెలగలేటి రమాదేవి నుంచి 0.25 ఎకరాలు ఇలా బిట్లు బిట్లుగా ఆకుల మునిశంకర్ 30 ఎకరాలకుపైగా కొనుగోలు చేశారు. మంత్రి నారాయణకు స్వయానా బావమరిది రావూరు సాంబశివరావు తుళ్లూరు మండలం మందడంలో సర్వే నెంబరు 465/3బీలో 0.32 ఎకరాలు.. బిట్లు బిట్లుగా 29 ఎకరాలకుపైగా భూమిని కొనుగోలు చేశారు. మంత్రికి సన్నిహితురాలైన పోతూరి ప్రమీల తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెంలో సర్వే నెంబరు 51/బీ, 51/సీల్లో 0.98 ఎకరాలు, సర్వే నెంబరు 95/సీలో 0.45 ఎకరాలు, లింగాయపాలెంలో 157/2లో 0.9 ఎకరాలు, సర్వే నెంబరు 118/ఏలో 0.5 ఎకరాలు, మందడంలో సర్వే నెంబరు 26/1లో 0.88 ఎకరాలు ఇలా బిట్లు బిట్లుగా 15 ఎకరాలకుపైగా కొనుగోలు చేశారు. ఆర్థిక స్థోమత రీత్యా రావూరు సాంబశివరావు, పోతూరు ప్రమీలకు కోట్లాది రూపాయలు వెచ్చించి పదుల ఎకరాల్లో భూమి కొనుగోలు చేసే తాహతులేదని చెబుతున్నారు. వీరే కాక, ఇలాంటి చాలామంది బంధువులు, సన్నిహితుల పేరుతో నారాయణ రాజధాని గ్రామాల్లో 3,129 ఎకరాల భూములను కొనుగోలు చేసినట్లు రాజధాని వ్యవహారాలను అతి సమీపం నుంచి పర్యవేక్షించే ఓ సీనియర్ అధికారి ‘సాక్షి’కి చెప్పారు. 400 ఎకరాలు ఖాయం... తుళ్లూరు మండలం బోరుపాలెం ల్యాండ్ పూలింగ్ పరిధిలోకి రాదు. కాబట్టి నారాయణ ఆ గ్రామంలో అసైన్డు భూములపై ప్రధానంగా దృష్టి సారించారు. ఒక్క బోరుపాలెంలోనే 50 ఎకరాల అసైన్డు భూమిని కొనుగోలు చేశారు. తుళ్లూరు మండలం రాయపూడి లంకల్లోని సర్వే నెంబరు 250 నుంచి 400 వరకూ వివిధ సర్వే నెంబర్ల పరిధిలోని మరో 50 ఎకరాలపైగా భూమిని కొనుగోలు చేశారు. బోరుపాలెం, రాయపూడి గ్రామాలకు చెందిన తోకల పేతురు, తోకల అంకులు, మెండెం నాగేశ్వరరావు, మెండెం కోటేశ్వరరావు, బుల్లెద్దుల చిన్నప్ప, వలపర్ల రామయ్య, లాలాది ఆదేయ్య, లాలాది సుందరరావు అనే రైతులు తమ భూములను మంత్రి నారాయణకు విక్రయించామని.. ఆ భూములకు సంబంధించిన పత్రాలన్నీ వారికే అప్పగించామని ‘సాక్షి’తో చెప్పారు. భూసమీకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత.. రాజధాని గ్రామాల్లో ఎక్కడ భూములు ఉన్నా.. ఒకే ప్రాంతంలో ఇంటి ప్లాట్లు, వాణిజ్య స్థలం కేటాయించేలా దరఖాస్తు చేసుకుంటే ఆ మేరకు ఇచ్చేందుకు అంగీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం వెనుక మంత్రి నారాయణ హస్తం ఉందని సమాచారం. అలా రాజధాని నగరంలో మంత్రి నారాయణ కోరుకున్న ప్రాంతం లో ఇంటి ప్లాట్లు, వాణిజ్య ప్లాట్ల రూపంలో 400 ఎకరాల భూమి దక్కనుందని ఓ సీనియర్ అధికారి ‘సాక్షి’కి చెప్పారు. మంత్రి నారాయణ బినామీల్లో మచ్చుకు ముగ్గురు ఆవుల మునిశంకర్ మంత్రి నారాయణకు దూరపు బంధువు. వరుసకు బావమరిది అవుతారు. నాలుగేళ్లపాటు నెల్లూరులో వీఆర్సీ కాలేజీలో కాంట్రాక్టు లెక్చరర్గా పనిచేశారు. నారాయణ మంత్రి పదవి చేపట్టిన నాలుగు నెలల తర్వాత తన మెడికల్ కాలేజీలో విద్యుత్ మరమ్మతుల బాధ్యతలను మునిశంకర్కు అప్పగించారు. అయితే అతని వేతనానికి సంబంధించిన సమాచారం తమ వద్ద లేదని.. మునిశంకర్కు అవసరమైనప్పుడు మంత్రి నారాయణ వద్ద కొంత మొత్తం తీసుకుంటుంటారని ఆ కాలేజీ వర్గాలు తెలిపాయి. మధ్యతరగతి కుటుంబానికి చెందిన మునిశంకర్ నారాయణ మెడికల్ కాలేజీకి సమీపంలోని ప్రైవేటు అపార్ట్మెంట్లో అద్దెకు ఉంటున్నారు. రాజధాని ప్రాంతంలో కోట్లాది రూపాయలు వెచ్చించి భూములు కొనుగోలు చేసే స్థోమత మునిశంకర్కు ఉంటుందా? రాపూరు సాంబశివరావు మంత్రి నారాయణకు స్వయాన బావమరిది. మంత్రి నారాయణకు చేదోడువాదోడుగా వ్యవహరిస్తుంటారు. ఆయనకు సంబంధించిన వ్యవహారాలను సాంబశివరావే చక్కదిద్దుతుంటారు. రాపూరు సాంబశివరావు పేరు మంత్రి నారాయణ భారీ ఎత్తున ఆస్తులు కూడగట్టినట్లు నెల్లూరు వాసులు చెబుతున్నారు. ఇదే రీతిలో రాజధాని ప్రాంతంలోనూ ఆయన పేరుతో భూములు కొన్నారు. పొత్తూరి ప్రమీల మంత్రి నారాయణకు సన్నిహితురాలు. కర్ణాటక, తమిళనాడుల్లో నారాయణ కాలేజీల వ్యవహారాలను ఆమె పర్యవేక్షిస్తుంటారు. మధ్య తరగతి కుటుంబానికి చెందిన ప్రమీల ఆదాయం అంతంత మాత్రమే. సాధారణ కుటుంబానికి చెందిన ప్రమీలకు కోట్లాది రూపాయలు వెచ్చించి రాజధానిలో భూములు కొనుగోలు చేసే ఆర్థికస్థోమత ఉంటుందంటారా? రామకృష్ణార్పణం • రియల్ వెంచర్ 179.54 ఎకరాలు • అసైన్డ్ భూములు 54 ఎకరాలు రాజధాని ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ప్రభుత్వ పెద్దలు కుమ్మక్కవడంతో అక్రమాలకు అడ్డే లేకుండా పోతోంది. దళితులకు కేటాయించిన అసైన్డ్ భూముల్లో రియల్ వెంచర్ వేసిన సంస్థనుంచి భారీగా ముడుపులు అందుకున్న సర్కారు పెద్దలు అక్రమాన్ని సక్రమం చేసేశారు. వివరాల్లోకి వెళితే... రాజధాని ప్రాంతానికి అత్యంత సమీపంలో పెదకాకాని మండలం నంబూరు గ్రామ పరిధిలో కోల్కత-చెన్నై జాతీయ రహదారి పక్కనే, నాగార్జున విశ్వవిద్యాలయం వెనుక రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ సుమారు 179.54 ఎకరాల్లో ప్లాట్లు, విల్లాలు, అపార్టుమెంట్లు నిర్మించడానికి ప్రణాళిక రచించింది. కాజా గ్రామం లోని సర్వే నెంబర్లు 78 నుంచి 107 వరకు 94 ఎకరాలను రియల్ ఎస్టేట్ సంస్థ కొనుగోలు చేయగా మిగతా 76 ఎకరాలను నంబూరు గ్రామానికి చెందిన దళిత, పేద రైతుల నుంచి కొనుగోలు చేసింది. ఇందులో సుమారు 54 ఎకరాలకుపైగా అసైన్డ్ భూ ములు ఉన్నాయి. ఈ భూములను రిజిస్ట్రేషన్ చేసే అవకాశం లేకపోయినా పెదకాకాని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది, అధికారులకు భారీగా ముడుపులు చెల్లించి సంస్థ పేరున రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. రిజిస్టర్ అయిన భూముల్లో లే అవుట్లు వేయడానికి ఎటువంటి అభ్యంతరాలు లేకపోవడంతో వీజీటీఎం నుంచి అనుమతి లభించింది. భారీ ప్రచారం, మార్కెటింగ్ సిబ్బంది సహకారంతో అనతికాలంలోనే స్థలాలు, విల్లాల విక్రయానికి తెర తీసింది. చినబాబుకు భారీ వాటాలు రాజధాని ఏర్పాటు నేపథ్యంలో ప్రభుత్వ పెద్దలు రంగంలోకి దిగారు. రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ భూముల్లో అసైన్డ్ భూములున్నాయనీ, ఆ భూమిని ల్యాండ్ పూలింగ్ కింద తీసుకుంటామంటూ యాజమాన్యాన్ని బెదిరించారు. ఆ తర్వాత ఓ కేంద్ర మంత్రి మధ్య వర్తిత్వంతో రాయబేరాలు కుదరడంతో.. రియల్ దందాకు ప్రభుత్వ పెద్దలు దన్నుగా నిలిచారు. దీంతో ఆ వెంచర్లో చదరపు గజం రూ. 4 వేలకు ప్రారంభించి పెరిగిన డిమాండ్కు అనుగుణంగా రూ. 25 వేల వరకు విక్రయిస్తూ సంస్థ సొమ్ము చేసుకుం టోంది. రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తమను మోసం చేసి అసైన్డు భూములు కొనుగోలు చేసిందని నంబూరుకు చెందిన డేవిడ్ ఆధ్వర్యంలో దళిత పేద రైతులు గుంటూరు జిల్లా అధికార యం త్రాంగానికి ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ వ్యవహారంలో చినబాబుకు భారీ ఎత్తున వాటాలు దక్కడంవల్లే గుంటూరు జిల్లా కలెక్టరు విచారణను అటకెక్కించారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై మంగళగిరి తహశీల్దార్ విజయలక్ష్మిని ‘సాక్షి’ వివరణ కోరగా కాలువలు పోరంబోకు భూములు ఉన్నట్టుగా గుర్తించామని చెప్పడం గమనార్హం. పయ్యావుల వాలారు! • కొనుగోలు 4.09 ఎకరాలు • చెల్లించినది 12.27 లక్షలు • ప్రస్తుత విలువ 8 కోట్లు ప్రభుత్వ పెద్దలు, టీడీపీ నాయకులు రాజధాని ప్రాంత రైతులను మోసగించి తక్కువ ధరలకు భూములు కొనుగోలు చేశారనడానికి టీడీపీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ భూముల కొనుగోళ్లే మరో ఉదాహరణ. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టగానే అంతర్జాతీయ స్థాయిలో రాజధాని నిర్మిస్తానంటూ ఆర్భాటంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ ఎక్కడ నిర్మిస్తారో స్పష్టంగా చెప్పకుండా ముచ్చటగా మూడు పేర్లు ప్రజలను గందరగోళానికి గురిచేశారు. కానీ తన అనుయాయులకు మాత్రం రాజధాని ప్రాంతం విషయంలో ముందుగానే స్పష్టతనిచ్చారు. ఇంకేం అనంతపురానికి చెందిన టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ రాజధాని ప్రాంతంలో వాలిపోయారు. ఎక్కడ భూములు తక్కువ ధరకు లభిస్తాయో, ఏ భూములు కొంటే ఎక్కువ లాభం చేసుకోవచ్చో దగ్గరగా పరిశీలించారు. కోర్ కేపిటల్ లోని తుళ్లూరుకు అతి దగ్గరగా ఉండే అయినవోలు గ్రామంలో 4.09 ఎకరాలు కొనుగోలు చేశారు. సర్వే నెంబరు 48/3లో 2.13ఎకరాలు, సర్వే నెంబరు 49/3లో 1.96 ఎకరాలు కలిపి మొత్తం 4.09 ఎకరాల భూమిని 2014 అక్టోబరు 13న కేశవ్ పెద్దకుమారుడు పయ్యావుల విక్రమసింహ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఎకరం 3.7 లక్షల చొప్పున 4.09 ఎకరాలను 12.27లక్షల రూపాయలకే కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. కానీ అయినవోలులో ప్రస్తుతం మార్కెట్ విలువ ఎకరా రూ.2కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. అంటే ఏడాది వ్యవధిలో పయ్యావుల భూములకు 50 రెట్లకు పైగా ధర పలుకుతోంది. ప్రజారాజధాని నిర్మిస్తున్నామని, ప్రజల మద్దతు ఓర్వలేకనే ప్రతిపక్షం ప్రభుత్వంపై అనవసర ఆరోపణలు గుప్పిస్తోందని పదేపదే గగ్గోలు పెట్టే పయ్యావుల కేశవ్ మరి రైతుల భూములను మభ్యపెట్టి కొని వారికి అన్యాయం చేయడం ఎంతవరకు సమంజసమో ఆయనే చెప్పాలి. ధూళిపాళ్ల ‘పోరంబోకు’ కథ! • అనధికారికంగా కొట్టేసింది 50 ఎకరాలు • రిజిస్ట్రేషన్ చేయించుకుంది 3.89 ఎకరాలు రాజధాని ప్రాంతంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధుల భూకబ్జాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. చివరకు వాగు, డొంక, చెరువు పోరంబోకు భూములను సైతం వదలడం లేదు. కన్పించిన భూమినంతా కబ్జా చేసి.. రెవెన్యూ రికార్డులను తిరగరాయించి బినామీ పేర్లతో సొంతం చేసుకుంటున్నారు. ఇందుకు పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర అనుచరుల తీరే తార్కాణం. రాజధాని ప్రకటనతో కోల్కత-చెన్నై జాతీయ రహదారి సమీపంలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరులోని వాగు పోరంబోకు భూములపై ఎమ్మెల్యే నరేంద్రకుమార్ కన్ను పడింది. ఒత్తిళ్లతో రిజిస్ట్రేషన్ నంబూరులో సర్వే నెంబరు 274లోని 3.89 ఎకరాల వాగు పోరంబోకు భూమిని తన సమీప బంధువు దేవర పుల్లయ్య పేరుతో సొంతం చేసుకోవడానికి ధూళిపాళ వ్యూహాత్మకంగా పావులు కదిపారు. రెవిన్యూ అధికారులపై ఒత్తిడి తీసుకు వచ్చి రెండుమూడు చేతులు మార్చినట్లుగా చూపి డాక్యుమెంట్ నెంబర్లు 2638, 2639, 2640లలో 3.89 ఎకరాల భూమిని తమ బినామీదారుల పేర్లపై రిజిస్ట్రేషన్ చేసేసుకున్నారు. మొదటగా పుల్లయ్య కొడుకు సాంబశివరావు తన భూమిగా దీన్ని చిత్రీకరించి ఉప్పుటూరి కిరణ్కుమార్, అడుసుమల్లి రవికిరణ్, వెన్నా పెద అచ్చిరెడ్డిలకు జీపీ(జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ) రిజిస్ట్రేషన్లు చేశారు. దీంతో లింకు డాక్యుమెంట్లు పుట్టించారు. ఆ తరువాత ఈ ముగ్గురితో సాంబశివరావు తండ్రి దేవర పుల్లయ్యకు విక్రయించినట్లు సృష్టించారు. ఎమ్మెల్యే ధూళిపాళ ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు సర్వే నంబరు 274ను 274/బి6, బి7, బి8 సబ్ డివిజన్లుగా విభజించి దేవర పుల్లయ్య పేరుతో రిజిస్ట్రేషన్ చేశారు. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం ఈ భూమి విలువ సుమారుగా రూ. 5 కోట్ల వరకూ ఉంటుంది. మొత్తం 50 ఎకరాల పోరంబోకు కబ్జా ఈ భూమిని పూర్తిగా తమ స్వాధీనంలోకి తీసుకున్న ఎమ్మెల్యే తన అనుచరులతో ఆ భూమిలో బోర్లు వేసి, సాగుచేసేందుకు సమాయత్తమవుతున్నారు. బోరు వేసేందుకు అనుమతులు ఇవ్వాలంటూ వీఆర్వోకు ఎమ్మెల్యే స్వయంగా ఫోన్ చేసి ఆదేశాలు ఇచ్చారని తెలిసింది. ఈ భూమి వాగు పోరంబోకు అని గ్రామ ప్రజలందరికీ తెలిసినా ఏం చేయలేని నిస్సహాయ స్థితి వారిది. అడ్డుతగిలితే తప్పుడు కేసులు పెట్టించడం, లేదా దాడులు చేయించడం వంటివి చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి కోట్ల రూపాయల ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేస్తున్నారు. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. ఒక్క పెదకాకాని మండలంలో ఎమ్మెల్యే అనుచరులు సుమారు 50 ఎకరాల వాగు పోరంబోకు భూములు కబ్జా చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొమ్మాలపాటి కుచ్చుటోపీ! • కొనుగోలు 42 ఎకరాలు • చెల్లించినది రూ. 1.26 కోట్లు • ప్రస్తుత విలువ: రూ. 210 కోట్లు రాజధాని ప్రాంతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికార దుర్వినియోగానికి.. టీడీపీ ప్రజా ప్రతినిధుల రౌడీయిజానికి ఇదో తార్కాణం. ఏడేళ్ల కిందట మంగళగిరికి సమీపంలో నెలసరి కంతులపై మూడువేల మందికి విక్రయించిన భూములను రిజిస్ట్రేషన్ చేసేందుకు అభినందన హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ యజమాని, పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాల పాటి శ్రీధర్ నిరాకరిస్తున్నారు. ఈ ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో ఆయన వినియోగదారులకు టోపీ పెట్టారు. ప్లాట్లు ఇచ్చేది లేదంటూ బెదిరిస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా అధినేతపై ఒత్తిడి తెచ్చి రూ.210 కోట్ల విలువైన 42 ఎకరాల భూమిని భూసమీకరణ నుంచి తప్పించారు. ప్రతిఫలంగా చినబాబుకు భారీ ఎత్తున వాటాలు అందినట్లు సమాచారం. సభ్యులకు కుచ్చుటోపీ గుంటూరు జిల్లా పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ అభినందన హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో విజయవాడ, గుంటూరు కేంద్రాలుగా ఓ రియల్ ఎస్టేట్ సంస్థ వెంచర్లను వేసి వాయిదాల పద్ధతిలో ప్లాట్లను విక్రయిస్తూ వస్తున్నారు. అదే సంస్థ యర్రబాలెంలో అమరావతి టౌన్షిప్ను ఆనుకుని సర్వే నంబర్ 485 నుంచి 500 వరకు 42 ఎకరాలు కొనుగోలు చేసింది. సభ్యుడిగా చేరేందుకే రూ.25 వేల వంతున చెల్లించి, తదుపరి వాయిదాలు చెల్లించారు. 2009లో ప్లాట్ల విక్రయాలు ప్రారంభించిన సంస్థ 2012 నాటికే సభ్యుల నుంచి పూర్తి వాయిదాలను వసూలు చేసింది. ఒక్కనెల వాయిదా కట్టకపోయినా డిఫాల్టరుగా మార్చి మెజారిటీ సభ్యులకు శఠగోపం పెట్టారు. పూర్తిగా డబ్బు కట్టిన వారికి కూడా ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయలేదు. ఇంతలో యర్రబాలెం గ్రామం సైతం భూ సమీకరణలోకి చేరడంతో వెంచర్కు అనుమతులు నిలిచిపోయాయి. దీంతో పూర్తిగా నగదు చెల్లించిన సభ్యులు సంస్థను సంప్రదించగా అధికార పార్టీ అండ ఉండడంతో సభ్యులకు నయానోభయానో విషయం బయటకు పొక్కకుండా కొంతమందికి వేరే వెంచర్లో ప్లాట్లను కేటాయిస్తామంటూ నమ్మబలికి.. ఆ తర్వాత మొండిచేయి చూపారు. ఈ విధంగా ఒక్క యర్రబాలెం వెంచర్లోనే సంస్థ సుమారు రూ.15 కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టిందని తెలిసింది. సమీకరణ నుంచి తప్పించేశారు.. యర్రబాలెం గ్రామంలో అధిక శాతం మంది రైతులను బెదిరించి భూములు లాక్కోవడానికి ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు. కానీ.. అభినందన రియల్ ఎస్టేట్ వెంచర్కు చెందిన 42 ఎకరాల భూములను భూ సమీకరణకు ఇవ్వకపోగా.. డ్రాఫ్ట్ మాస్టర్ప్లాన్లో సైతం వదిలేసింది. సీఎం చంద్రబాబునాయుడు ఒత్తిడే ఇందుకు కారణమని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఈ భూములకు అన్ని మినహాయింపులు ఇచ్చి.. రాజధానిలో మెగా సిటీ రూపొందించడానికి ఎత్తులు వేస్తున్నారని తెలుస్తోంది. తుది మాస్టర్ ప్లాన్ విడుదలైన వెంటనే రాజధానిలో తొలి ప్రైవేటు రియల్ మెగా సిటీని ప్రకటించేందుకు సంస్థ సిద్ధమవుతుండగా, అందుకు సీఆర్డీఏ నుంచి అనుమతులు ఇప్పించేందుకు చినబాబు చక్రం తిప్పుతున్నారు. ఆ మేరకు ఆ వెంచర్లో చినబాబు వాటాలు పొందినట్లు టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. ఇదే అంశంపై సీఆర్డీఏ డిప్యూటీ కలెక్టర్ లలితకుమారి వివరణ కోరగా... 485 నుంచి 500 సర్వే నంబర్ల వరకు 42 ఎకరాలు భూసమీకరణలోనే ఉన్నాయన్నారు. అయితే ఇప్పటివరకు ఆ భూములను సమీకరణకు ఇవ్వలేదన్న అంశాన్ని ఉన్నతాధికారులకు తెలిపామంటూ దాటవేశారు. ఇదే విషయంపై సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్ను సంప్రదించగా స్పందించేందుకు నిరాకరించారు. కోడెల తనయుడా? మజాకా? • కొనుగోలు 17.3 ఎకరాలు • చెల్లించినది రూ. 93 లక్షలు • ప్రస్తుత విలువ 18.4 కోట్లు రాజధాని ప్రాంతంలో భూములను కొల్లగొట్టడంలో శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ తనయుడు కోడెల శివరామకృష్ణ రూటే సపరేటు. వివాదాస్పదమైన భూములను గుర్తించడం.. అధికార బలాన్ని ఉపయోగించి వాటిని తక్కువ ధరలకే సొంతం చేసుకోవడంలో ఆయనది అందెవేసిన చేయి అని సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారు. రాజధానిపై ప్రకటన వెలువడిన తర్వాత ఆ పరిసర ప్రాంతాల్లో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ప్రధాన రాజధానికి సమీపంలోని సత్తెనపల్లి నియోజకవర్గంలో భూములను సొంతం చేసుకోవడా నికి కోడెల శివరామకృష్ణ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఆ నియోజకవర్గ పరిధిలోని వివాదాస్పదమైన భూములను గుర్తించడం.. వివాదం ఎవరి మధ్య నడుస్తుందో తెలుసుకోవడం.. అందులో ఒక వర్గాన్ని కోడెల శివరామకృష్ణ వద్దకు తీసుకెళ్లడమే ప్రత్యేక బృందాల బాధ్యత. తన వద్దకు వచ్చిన వారిని బతిమాలో బెదిరించో.. నయానో భయానో తక్కువ ధరలకు వివాదాస్పదమైన భూములు కొనుగోలు చేసి.. అధికారాన్ని అడ్డుపెట్టుకుని వాటిని తన బినామీల పేర్లతో కొట్టేయడం రివాజుగా మారింది. సత్తెనపల్లి మండలం ధూళిపాళ్లలో సర్వే నెంబర్లు 167-1ఏ, 167-1సీ, 168-1, 168-3లో 17.3 ఎకరాల భూమి ఇద్దరు అన్నదమ్ముల మధ్య వివాదం నడుస్తోంది. ఇది పసిగట్టిన కోడెల శివరామకృష్ణ ఒకరిని తన వద్దకు పిలిపించుకుని.. తన వ్యక్తిగత సహాయకుడు గుత్తా నాగప్రసాద్ మేనేజింగ్ పార్ట్నర్గా వ్యవహరిస్తున్న శశి ఇన్ఫ్రా పేరుతో ఎకరం రూ.ఎనిమిది లక్షల చొప్పున కొనుగోలు చేశారు. వాస్తవంగా ఆ ప్రాంతం ఎకరం రూ.1.50 కోట్లకుపైగా పలుకుతోండటం గమనార్హం. కోడెల తనయుడి వ్యవహారంపై ఇదే వివాదంతో సంబంధం ఉన్న మరో వ్యక్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కానీ.. అదేమీ పట్టని రెవెన్యూ యంత్రాంగం ఆ భూమిని గుత్తా నాగప్రసాద్కు కట్టబెట్టేసింది. కోడెల శివరామకృష్ణ ఇదే పద్ధతిలో సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో భారీ ఎత్తున భూములు కొట్టేసినట్లు ఆ నియోజకవర్గాల ప్రజలు చెబుతున్నారు. ఎవరీ గుత్తా నాగప్రసాద్? గుత్తా నాగ ప్రసాద్ సొంతూరు ప్రకాశం జిల్లా యద్దనపూడి మండలం పోలూరు. సాధారణ కుటుంబానికి చెందిన నాగ ప్రసాద్ బీటెక్ (సివిల్ ఇంజనీరింగ్) చదువుకున్నారు. కోడెల పెద్ద కుమారుడు సత్యనారాయణ ప్రమాదం మరణించినపుడు నాగప్రసాద్కు ఆ కుటుంబంతో సన్నిహిత బంధం ఏర్పడింది. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి ఛైర్మన్ కోడెల వ్యవహరించే సమయంలో నాగ ప్రసాద్ను తన వద్దకు పిలిపించుకున్నారు. ఆసుపత్రిలో కాంట్రాక్టు పనులను నాగ ప్రసాద్తో చేయించేవారని సమాచారం. కేడెల క్యాన్సర్ ఆసుపత్రి ఛైర్మన్ పదవి నుంచి తప్పుకున్న తర్వాత నాగప్రసాద్ ఆయన వ్యక్తిగత సహాయకుడిగా వ్యవహరిస్తున్నారు. కోడెల స్పీకర్ పదవిని చేపట్టిన తరువాత ఆయన తనయుడు కోడెల శివరామ కృష్ణకు వ్యక్తిగత సహాయకుడిగా వ్యవహరిస్తూనే.. గుంటూరు లో హోండా షోరూంలో ప్రైవేటు మేనేజర్గా పనిచేస్తున్నారు. చిలుకలూరిపేటలో అద్దె ఇంట్లో నివాసముంటున్న నాగ ప్రసాద్.. కోడల తరఫున సత్తెనపల్లి, నరసరావుపేట నియో జకవర్గాల్లో పనులు చక్కబెడుతుంటారు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన నాగ ప్రసాద్కు కోట్లాది రూపాయలు వెచ్చించి.. భూములు కొనుగోలు చేసే స్థోమత ఉంటుందా? హాయ్ల్యాండ్.. హాంఫట్! బేరం కుదిరింది.. రూ.425 కోట్ల విలువైన ‘అగ్రిగోల్డ్’ భూములు చినబాబు వశమయ్యాయి రాజధాని పేరుతో భారీ దోపిడీకి తెరలేపిన ప్రభుత్వ పెద్దలు ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోలేదనడానికి హాయ్ల్యాండ్ భూములే ఉదాహరణ. కోల్కోత-చెన్నై జాతీయ రహదారిపై మంగళగిరి మండలం చినకాకానిలో 85.13 ఎకరాల భూమిని అగ్రిగోల్డ్ కొనుగోలు చేసి హాయ్ ల్యాండ్ పేరుతో అభివృద్ధి చేసింది. ఎకరం రూ.4 నుంచి రూ.4.50 కోట్ల వరకూ పలికే ఈ భూమిపై ప్రభుత్వ పెద్దల కళ్లు పడ్డాయి. ఆ భూములను కొట్టేయాలన్న మందస్తు ఎత్తుగడలో భాగంగా.. వాటిని రాజధాని భూసమీకరణ నుంచి తప్పించారు. తనకు సన్నిహితుడైన ఓ పోలీసు ఉన్నతాధికారిని ప్రభుత్వ పెద్ద రంగంలోకి దించారు. రాజధానికి కూతవేటు దూరంలో ఉన్న భూములు అప్పగిస్తే కేసుల నుంచి తప్పిస్తామంటూ అగ్రిగోల్డ్ యజమానులకు రాయబారం పంపారు. అప్పటికే పీకల్లోతు కేసుల్లో కూరుకుపోయిన అగ్రిగోల్డ్ యాజమాన్యం అందుకు అంగీకరించడంతో కేసుల నుంచి తప్పించేందుకు 32 లక్షల మంది డిపాజిట్దారుల ప్రయోజనాలను ప్రభుత్వ పెద్ద పణంగా పెట్టారు. టీడీపీ అధికారం చేపట్టి 21 నెలలైనా అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని అరెస్టు చేయలేదు. ప్రతిఫలంగా రూ.425 కోట్ల విలువైన హాయ్ ల్యాండ్ను చినబాబు కొట్టేశారు. హైకోర్టు ఆదేశించినా సీఐడీ విచారణను ఓ కొలిక్కి తేలేకపోవడానికి ప్రధాన కారణం ప్రభుత్వ పెద్ద ఒత్తిళ్లేనన్నది పోలీసు వర్గాల అభిప్రాయం. క్విడ్ ప్రోకో అంటే ఇదీ అని టీడీపీ నేతలే బహిరంగంగా వ్యాఖ్యానిస్తోండటం గమనార్హం. హైకోర్టు ఆగ్రహించినా... అగ్రిగోల్డ్ సంస్థ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, ఒడిశా, కర్ణాటక, కేరళ, చత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాల్లోని 32 లక్షల ఖాతాదారుల నుంచి సుమారు రూ.6850 కోట్లను డిపాజిట్లను ఈ సంస్ధ సేకరించింది. ఆ డబ్బులతో భారీ ఎత్తున భూములు కొనుగోలు చేసింది. గడువు తీరిపోయినా అధిక శాతం మంది డిపాజిట్దారులకు నగదు చెల్లించకపోవడం వివాదాస్పదంగా మారింది. దాంతో ఏడు రాష్ట్రాలతోపాటూ మన రాష్ట్రంలోనూ 2014 నవంబర్ నుంచి ఖాతాదారులు, ఏజెంట్లు ఆందోళనలకు దిగారు. అగ్రిగోల్డ్ కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలంటూ ఆగస్టు, 2015లో హైకోర్టులో బాధితులు ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. హైకోర్టు ఎక్కడ సీబీఐ విచారణకు ఆదేశిస్తుందోనని ఆందోళన చెందిన ప్రభుత్వ కీలక నేత.. తన చెప్పుచేతల్లో ఉండే సీఐడీ దర్యాప్తునకు ఆదేశిస్తూ హడావుడిగా ఆదేశాలు జారీ చేశారు. దీంతో అగ్రిగోల్డ్కు సంబంధించిన మొత్తం సుమారు 16 వేల ఎకరాల భూమికి సంబంధించి కొనుగోళ్లూ, అమ్మకాలు స్థంభించిపోయాయి. సీఐడీ దర్యాప్తు నత్తనడకన సాగుతోండటంతో ఆగస్టు, 2015లో ఉమ్మడి హైకోర్టు జోక్యం చేసుకుంది. అగ్రిగోల్డ్కు సంబంధించిన ఆస్తులు, ఆ సంస్థ, అనుబంధసంస్థల్లో ఉన్న డెరైక్టర్లు, భాగస్వాముల వివరాలు, వారి ఆస్తులు వివరాలు అందజేయాలని దర్యాప్తు సంస్థను అదేశించింది. ఒకానొక సందర్భంలో దర్యాప్తు తీరు ఎంత మాత్రం సంతృప్తికరంగా లేదని, దర్యాప్తు అధికారిని మార్చాలని, లేని పక్షంలో తామే అందుకు తగిన ఆదేశాలు జారీ చేస్తామని ఉమ్మడి హైకోర్టు తేల్చి చెప్పింది. అనుమతి లేకుండా ఆస్తులు విక్రయించేందుకు ప్రయత్నిస్తే తీవ్రంగా పరిగణిస్తామని అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని హెచ్చరించింది. పక్షం రోజుల క్రితం హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంలో ఎట్టకేలకు అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని అరెస్టు చేశారు. కానీ.. కేసు విచారణను నీరుగార్చుతూ వారిని రక్షించేందుకు యత్నిస్తున్నారు. రూ.200 కోట్ల విలువైన హాయ్ ల్యాండ్ కోసం 32 లక్షల మంది మదుపుదారుల ప్రయోజనాలను పణంగా పెట్టడంపై టీడీపీ వర్గాలే విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. అగ్రిగోల్డ్ భూముల క్రయ విక్రయాలు నిలిచిపోయినా వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అగ్రిగోల్డ్కు చెందిన 14 ఎకరాల భూమిని అతి తక్కువ ధరకు కొనుగోలు చేయడం గమనార్హం. -
ఔషధం.. విషం..
అంగట్లో ఫార్మసీ సర్టిఫికె ట్లు కాలం చెల్లిన మందులు అర్హత లేకున్నామెడికల్ షాపుల నిర్వహణ ప్రిస్క్రిప్షన్ లేకున్నా మందులు జబ్బు విని మందులిస్తూ.. ఔషధ నియంత్రణ అధికారుల దాడులు జబ్బు నయం కావడానికి మనం తీసుకుంటున్న ఔషధం మాటున ప్రాణహాని ఉందని తెలిస్తే..? మనం వెళ్తున్న మందుల దుకాణాల్లో పలు షాపులకు అనుమతులే లేవంటే..? మనకు మందులిస్తున్న వారికి అసలు ఆ అర్హతే లేదని తెలిస్తే..? ఆ మందులు మనం వాడితే..? పరిస్థితి ఒక్కసారి ఊహించుకుంటేనే వణుకుపుడుతోంది కదూ..? కానీ.. వాస్తవానికి జిల్లాలో ప్రస్తుతం అలాంటి పరిస్థితే నెలకొంది. కాలం చెల్లిన మందులనూ మనకు అంటగడుతున్న షాపు యజమానులున్నారు. అనుభవం లేకున్నా షాపులు నిర్వహిస్తున్న వాళ్లున్నారు. జబ్బు విని ఫార్మసిస్టులకు బదులు వర్కర్లే మందు ఇచ్చే దుకాణాలు.. బినామీ సర్టిఫికెట్లతో కొనసాగుతున్న మెడికల్ హాళ్లు జిల్లాలో ఐదొందలకు పైనే ఉన్నాయి. ఈ నెల 3, 4 తేదీల్లో మంచిర్యాల, ఆదిలాబాద్.. తరువాతి రోజు నిర్మల్, మందమర్రి, లక్షెట్టిపేట, బెల్లంపల్లి ప్రాంతాల్లో ఔషధ నియంత్రణ శాఖ అధికారులు జరిపిన దాడులతో మెడికల్ హాళ్ల నిర్వహణ విషయంలో ఉన్న అక్రమాలు బహిర్గతమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మెడికల్ షాపులు తనిఖీలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు.. ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాల నుంచి వచ్చిన 38 మందితో కూడిన అధికార బృందాలు వరుస దాడులు చేపట్టి.. నిబంధనలకు విరుద్ధంగా షాపులు నిర్వహిస్తున్న తొమ్మిది మందిపై కేసులు నమోదు చేశారు. మొత్తం 51 షాపులు తనిఖీ చేశారు. రికార్డులు నిర్వహించని వారిని హెచ్చరించారు. మరోపక్క.. ఔషధ నియంత్రణ అధికారులు షాపులు తనిఖీ చేస్తున్న విషయం దావానంలా వ్యాపించడంతో ఆయా పట్టణాల్లో అక్రమంగా షాపులు నిర్వహిస్తున్న యజమానులు దుకాణాలు మూసేశారు. మరోపక్క.. ఇలాంటి తనిఖీలు ఇకపై నెలలో కనీసం ఒక్క సారైనా నిర్వహిస్తామని ఔషధ నియంత్రణ శాఖ అధికారులు స్పష్టం చేయడంతో అక్రమంగా షాపులు నిర్వహిస్తున్న వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. నిబంధనల అతిక్రమణ జిల్లావ్యాప్తంగా 1100 మెడికల్ షాపులున్నాయి. కేవలం మంచిర్యాల పట్టణంలోనే 300లకు పైగా ఉన్నాయి. ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, కాగజ్నగర్, బెల్లంపల్లి, భైంసా మున్సిపాలిటీల్లో 550 వరకు ఉన్నాయి. మిగతా షాపులు మండల కేంద్రాల్లో ఉన్నాయి. వీటిలో నిబంధనల ప్రకారం కొనసాగుతున్నవి 600లకు మించి ఉండవు. ఫార్మసిస్టు సమక్షంలోనే మెడికల్ షాపులు కొనసాగాల్సి ఉండగా.. చాలా చోట్ల వర్కర్లే షాపులు నిర్వహిస్తున్నారు. ఫార్మసిస్టు సమక్షంలో పలు రకాల మందుల వివరాలు.. అవి వినియోగంపై అవగాహన పెంచుకున్న వర్కర్లతోనే మెడికల్ షాపులు కొనసాగుతున్నాయి. కొన్ని రకాల మందులు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేనిదే ఇవ్వడానికి వీలు లేదు. అయినా.. చాలా చోట్ల ఎవరికి పడితే వారికి ఆ మందులు అందుతున్నాయి. మందులు వాడిన తర్వాత రోగులు ఇబ్బందులెదుర్కొంటున్న సందర్భాలూ జిల్లాలో చోటు చేసుకుంటున్నాయి. జిల్లాలో దాదాపు అన్ని షాపుల్లో రోగుల జబ్బు విని వర్కర్లే మందులివ్వడం షరామామూలైంది. ఇదిలావుంటే.. జిల్లాలో సింహభాగం ఫార్మసీలు బినామీ పేర్లతో కొనసాగడం విశేషం. ఫార్మసీ పట్టా పొందిన కొందరు ఏడాదికి రూ.20వేల నుంచి రూ.30 వేల వరకు తమ సర్టిఫికెట్ను అంగట్లో అమ్మకానికి పెడుతున్నారు. ఇలా కొనుగోలు చేసిన సర్టిఫికెట్ను షాపులో ప్రదర్శించి.. యథేచ్ఛగా ఫార్మసీ నిర్వహిస్తున్నారు. ఇది అధికారులందరికీ తెలిసిన విషయమే అయినా దాడులు చేసి అలాంటి షాపులను సీజ్ చేయడంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇకపై తరచూ తనిఖీలు.. ఇకపై తరచూ తనిఖీలు నిర్వహిస్తాం. నిబంధనలకు విరుద్ధంగా రికార్డులు, బిల్లుల నిర్వహణ.. సర్టిఫికెట్లు.. మందుల నాణ్యత పాటించని మెడికల్ షాపుల యజమానులపై చర్యలు తీసుకుంటాం. అలాగే.. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు ఇచ్చే వారిపైనా కఠిన చర్యలు తీసుకుంటాం. త్వరలోనే మళ్లీ దాడులు నిర్వహిస్తాం. - వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ డ్రగ్ కంట్రోలర్ -
పాలకపక్షమా... ఐతే ఓకే!
చెముడు సహకార సొసైటీలో రూ. 97.74లక్షల మేరకు అవకతవకలు జరిగాయి. ఇందులో బినామీ రుణాలే ఎక్కువగా ఉన్నాయి. కొందరికైతే రుణాలు ఇవ్వకుండానే ఇచ్చినట్టు చూపించి మింగేశారు. మరికొందరికి తక్కువ మొత్తాల్లో రుణాలు మంజూరు చేసి రికార్డుల్లో ఎక్కువగా చూపించారు. ఇది ఏడాది క్రితమే వెలుగు చూసింది. కానీ రికవరీకి చర్యలు తీసుకోవడం లేదు. శాఖా పరమైన చర్యలంటూ తాత్సారం చేస్తున్నారు. క్రిమినల్ చర్యలకు పోవడం లేదు. గొట్లాం పీఏసీఎస్లో 1559మందికి సుమారు రూ.కోటి 3 లక్షలు బోగస్ రుణాల కింద అక్రమాలు జరిగినట్టు రెండేళ్ల క్రితమే తేల్చారు. కానీ ఇంతవరకు రికవరీకి చర్యలు తీసుకోలేదు. ఎందుకిలా చేస్తున్నారంటే ఆ రెండు సొసైటీలకూ అధికార పార్టీ నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్నందునే. అందుకే వాటి జోలికి పోవడం లేదు. కేసులపై శ్రద్ధ చూపడంలేదు. శాఖా పరమైన ప్రక్రియ పేరుతో తాత్సారం చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం : జిల్లాలోని పీఏసీఎస్ల్లో అక్రమాలు జరిగితే అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడంలో ఒక్కోచోట ఒక్కోలా వ్యవహరిస్తున్నారు. వారి దృష్టి అంతా ఎంతసేపూ టీడీపీ ప్రత్యర్థుల సొసైటీలపైనే. అధికార పార్టీ ప్రాతినిధ్యం వహిస్తే చర్యలకు వెనుకాడుతున్నారు. విషయం గ్రహించిన ఉన్నతాధికారులు కాసింత అసహనం వ్యక్తం చేస్తున్నారు. విచారణలో అక్రమాలు తేలినా రికవరీలోనూ... పోలీసు కేసులు పెట్టడంలోనూ అనుసరిస్తున్న వైఖరిపైనా ప్రశ్నించే పరిస్థితి వచ్చేసింది. తాజాగా చెముడు సొసైటీలో రూ. 97.74లక్షలు అక్రమాలు తేలినా పోలీసు కేసు పెట్టడంలో ఎందుకు అలసత్వం వహిస్తున్నారని జిల్లా సహకార అధికారులను ఉన్నతాధికారులు ప్రశ్నించారు. తక్షణమే కలెక్టర్కు పెట్టి చర్యలకు ఉపక్రమించాలని ఆదేశించారు. సొసైటీలో అక్రమాలు సర్వసాధారణమే... బినామీ రుణాలు, నిధుల దుర్వినియోగం సహకార సంఘాల్లో కొత్తేమీ కాదు. సెక్షన్ 51స్టాట్యుటరీ విచారణ, సెక్షన్ 52, 53పై విచారణలు అనేకం జరిగాయి. ఇటీవల కాలంలో 25 సహకార సంఘాల్లో బినామీల పేరుతో రుణాలు కాజేయడం, నిధుల దుర్వినియోగం, కొనుగోళ్లలో చేతివాటం వంటి అడ్డగోలు కార్యకలాపాలు జరిగినట్టు తేలింది.ఉన్నత న్యాయస్థానాల్లో ఉన్నవి పక్కన పెడితే 51స్టాట్యూటరీ విచారణ 17సొసైటీల్లో జరిగింది. రూ. 2.5కోట్ల వరకు అక్రమాలు జరిగినట్టు తేలింది. ఇందులో ఒక్క చెము డు సొసైటీలోనే రూ. 97.74లక్షల అవినీతి చోటు చేసుకుంది. అక్రమాలు, విచారణ జరిగి ఏళ్లు గడుస్తున్నా పూర్తి స్థాయిలో రికవరీ జరగడం లేదు. అలాగే 52స్టాట్యూటరీ విచారణ ఏడు సొసైటీల్లో జరిగింది. ఇందులోనూ రూ. లక్షల్లో అవినీతి బయటికొచ్చింది. సెక్షన్ 53 ప్రకారం గొట్లాం పీఏసీఎస్లో విచారణ నిర్వహించి అక్రమాల్ని వెలికి తీశా రు. ఇందులో రూ.కోటి 3లక్షల మేర అక్రమాలు జరిగాయి. ఈ అవినీతికి చనిపోయిన సొసైటీ అధ్యక్షుడు, కార్యదర్శులే కారణమని అధికారులు తేల్చారు. కానీ బతికున్న సొసైటీ డెరైక్టర్లు, అందులో పనిచేసిన ఇతర సిబ్బందిని వదిలేశారు. వాస్తవానికైతే ఈ సొసైటీలో 51స్టాట్యుటరీ విచారణ జరపాలి. ఈ విచారణ జరిగితేనే చట్టబద్ధత ఉంటుంది. బ యటి వ్యక్తులు విచారణ చేపట్టడం ద్వారా మరింతగా అక్రమాలు బయటపడే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఆ రకమైన విచారణ జరగలేదు. అధికారుల తీరుపైనే అనుమానాలు న్యాయపరమైన ఇబ్బందులున్న వాటిని పక్కన పెడితే మిగిలిన చోట అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. అధికార పార్టీ సొసైటీల్లో అక్రమాలు జరిగినట్టు తేలినా వాటి జోలికెళ్లడం లేదు. చెముడు సొసైటీపై సీబీసీఐడీ విచారణ జరపాలని ఇక్కడ విచారణ జరిపిన అధికారి సిఫార్సు చేశారు. అక్రమాలు రూ. కోటి దాటలేదన్న కారణంగా సీబీసీఐడీ విచారణకు తిరస్కరించారు. కనీసం పోలీసు స్టేషన్లోనైనా కేసు పెట్టలేదు. చివరకు ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. అక్రమాలు ఇలా... కొన్ని సొసైటీల్లో భూమి లేని వారిని సభ్యులుగా చేర్చి వారి పేరున రుణాలు తీసుకుని పాలక వర్గ సభ్యులు మింగేశారు. కొన్నిచోట్ల కొందర్ని కౌలు రైతులుగా చేర్పించి, వారి పేరునా, వారికి తెలియకుండా రుణాలు కాజేశారు. కొన్ని సొసైటీల్లో షేర్ కేపిటల్కు సంబంధం లేకుండా రుణాలిిప్పించేసి కుట్ర పూరితంగా నిధులు దుర్వినియోగం చేశారు. సొసైటీలో సభ్యుడిగా చేరితే రూ.300షేర్ కేపిటల్తో పాటు అడ్మినిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. ఆ మేరకే రుణ పరిమితి నిర్దేశిస్తారు. చాలా సొసైటీల్లో అడ్డగోలుగా రుణాలు ఇచ్చేసినట్టు తెలిసింది. కొన్ని సొసైటీల్లో సభ్యుడికి తెలియకుండా సభ్యత్వం చేర్పించి, వారి పేరుతో ఫోర్జరీ సంతకాలు చేసి రుణాలు తీసేసుకున్నారు. -
బినామీల అడ్డా!
నిరుపేద దళిత నిరుద్యోగుల స్థానంలో ధనికులు పాగా వేశారు. వారికి కేటాయించాల్సిన దుకాణాల్లో బినామీలు అడ్డా పెట్టారు. ఫలితంగా అర్హుల స్థానంలో అనర్హులు లబ్ధిపొందుతున్నారు. దుకాణాల కేటాయింపుల్లో అక్రమాలు జరిగినట్టు నిరుపేద దళితులు మొత్తుకుంటున్నా పట్టించుకునే దిక్కు లేదు. కలెక్టర్కు ఫిర్యాదు చేసినా ఫలితం లేదంటూ దళిత సంఘాల నేతలు మండిపడుతున్నారు. - మెదక్ * దళితుల దుకాణాలు ధనికుల పాలు * అర్హులైన ఎస్సీలకు అన్యాయం * అనర్హులకు కొమ్ముకాస్తున్న అధికారులు! * ఆందోళనలు చేసినా పట్టించుకోని వైనం * కలెక్టర్కు ఫిర్యాదుచేసినా ఫలితం శూన్యం ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 2006లో మెదక్ పట్టణంలో ప్రభుత్వం సుమారు రూ.20 లక్షలు వెచ్చించి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించింది. స్థానిక జీకేఆర్ కాంప్లెక్స్ సమీపంతోపాటు రామాలయ సమీపంలో 20 షాపులకు మున్సిపల్ అధికారులు వీటిని నిర్మించారు. ఈ షాపులను అర్హులైన దళితులకు అద్దెకు ఇవ్వాలి. ఆ మడి గెలో ఏదైన వ్యాపారం చేసుకుని జీవనోపాధి పొందాలి. కానీ వాటిని కొందరు రాజకీయ పలుకుబడితో దక్కించుకున్నారు. సదరు వ్యక్తులు ఇతరులకు అద్దెకిచ్చి అధికంగా వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ కాంప్లెక్స్లు అన్ని బినామీల పేర్లపైనే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఆ షాపుల్లో కిరాయికి ఉంటున్న వారంతా ధనికులే కావడం గమనార్హం. ఆ షాపుల నుంచిబినామీలను పంపించి వేయాలని పలువురు నిరుపేద దళితులు మున్సిపల్ అధికారులతోపాటు కలెక్టర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీలకు ఫిర్యాదు చేశారు. అయినా ఫలితంలేక పోవడంతో ఈనెల 6న రాస్తారోకో చేశారు. అయినా మున్సిపల్ అధికారులు బినామీలకే కొమ్ముకాస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. అధికారుల తీరుతో ఎందరో నిరుపేద దళితులు అన్యాయానికి గురవుతున్నారని వారు ఆవేదన చెందుతున్నారు. ఇ ప్పటికైనా అధికారులు స్పందించి బినామీలను ఖాళీ చేయించి అర్హులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. అనర్హుల చేతిలో కాంప్లెక్స్లు... దళితుల కోసం కేటాయించిన దుకాణాల్లో అగ్రవర్ణాల వారితోపాటు ధనికులు అద్దెకుం టున్నారు. దీంతో అర్హులైన నిరుద్యోగ దళితులకు అన్యాయం జరుగుతుంది. బి నామీలను ఖాళీ చేయించి అర్హులకు ఇవ్వాలని రాస్తారోకో చేపట్టినా స్పందించడం లేదు. కలెక్టర్ స్పందించి అక్రమంగా అద్దెకు ఉంటున్న వారిని ఖాళీ చేయించాలి. - బాల్రాజ్, మాదిగ యువసేన జిల్లా అధ్యక్షుడు ఆందోళనలు చేపడతాం.. దళితుల కోసం కేటాయించిన షాపుల్లోంచి అనర్హులను ఖాళీ చేయిం చాలి. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతాం. కళ్లముందే అక్రమాలు కన్పిస్తున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా అనర్హులను ఖాళీచేయించి అర్హులకు కేటాయించాలి. - యాదగిరి, ఎమ్మార్పీఎస్ పట్టణ కార్యదర్శి -
కొండలు కరిగించి..కోట్లు కొల్లగొట్టి..
క్వారీల్లో బినామీల కాసుల వేట యంత్ర పరికరాలు సీజ్ చేసిన అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు అక్రమార్కుల యత్నాలు రంపచోడవరం :అమాయక గిజనుల పేరిట లీజులు సంపాదిస్తున్న బడాబాబులు అనధికారికంగా క్వారీలు నిర్వహిస్తూ దర్జాగా కాసుల వేట సాగిస్తున్నారు. కొండలు కరిగించేసి దర్జాగా కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నారు. ఇదంతా నిజమేనని నిర్ధారిస్తున్న అధికారులు కూడా ఏ చర్యలూ తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. అడ్డతీగల మండలం పులిగోగులపాడు పరిసరాల్లో సర్వే నంబర్-24లో ఉన్న నల్ల మెటల్ క్వారీయే ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది. వాస్తవానికి ఈ క్వారీ నిర్వహణకు లీజు మంజూరైంది. కానీ దీనిని బినామీలు నడుపుతూ, కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నారని గత ఏడాది ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో అప్పటి రంపచోడవరం సబ్కలెక్టర్ గంధం చంద్రుడు ఈ క్వారీని తనిఖీ చేశారు. బినామీల ఆధ్వర్యంలోనే క్వారీ నడుస్తున్నట్లు తేల్చి, క్వారీ లీజు రద్దు చెయ్యాలని సూచిస్తూ మైనింగ్ శాఖకు నివేదిక పంపించారు. కొద్ది రోజులు పనులు నిలిపివేసిన బినామీదారులు క్వారీని తిరిగి ప్రారంభించారు. దీనిపై రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి గనుల శాఖ డెరైక్టర్కు ఫిర్యాదు చేశారు. లీజు పొందిన ప్రాంతంతోపాటు అనుమతి లేని ప్రాంతాల్లోనూ తవ్వకాలు జరుపుతున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మైనింగ్ శాఖ విజిలెన్స్ అధికారులు ఆరు నెలల క్రితం తనిఖీలు చేశారు. ఎమ్మెల్యే పేర్కొన్న అంశాలు వాస్తవమేనని తేల్చారు. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని మైనింగ్ శాఖ అసిస్టెంట్ డెరైక్టర్ను ఆదేశించారు. అయినప్పటికీ అధికారులను మేనేజ్ చేసుకుని ఈ క్వారీలో నల్లమెటల్ను బినామీదారులు యథేచ్ఛగా తవ్వేస్తున్నారు. దీనిపై ఫిర్యాదులు రావడంతో ఆర్డీఓ జీవీ సత్యవాణి నాలుగు రోజుల క్రితం క్వారీ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు. నల్లమెటల్ సేకరణకు వాడుతున్న యంత్ర పరికరాలను సీజ్ చేశారు. కాగా బినామీదారులు మాత్రం రాజకీయ ఒత్తిళ్లు తెచ్చి, క్వారీని యథాతథంగా నడుపుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్టు తెలియవచ్చింది. -
బ్యాంక్ అధికారి బురిడీ
ఉదయగిరి: కంచే చేను మేసిన చందంగా ప్రజాధనానికి జవాబుదారీగా ఉండాల్సిన ఓ సీనియర్ బ్యాంకు అధికారి అక్రమాలకు ప్పాలడ్డారు. బినామీ పేర్లతో భూములు కొనుగోలు చేసి నిబంధనలకు విరుద్ధంగా ఏకంగా రూ.3.25 కోట్లు కాజేసీ బ్యాంకు టోపీ పెట్టారు. 30 ఏళ్లపాటు తనకు అన్నం పెట్టిన సంస్థనే మోసం చేసిన ఘనుడికి ఉపయోగపడిన భూములు ఉదయగిరి మండలం బండగానిపల్లిలో ఉన్నాయి. వివరాల్లోకెళ్తే...మండలంలోని బండగానిపల్లిలో సర్వే నం.408, 589, 384, 407, 509, 385ర్లలో 66 ఎకరాల మెట్టభూమిని జనార్దన్రెడ్డి, ప్రసూన అనే వారివద్ద నుంచి నెల్లూరులోని పొగతోట ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు(ఐఓబీ)లో సీనియర్ మేనేజరుగా పనిచేస్తున్న తాళ్లూరి నాగయ్య నెల్లూరులోని జెండావీధికి చెందిన 11 మంది బినామీల పేర్లపై రిజిస్ట్రేషన్ చేయించారు. 2014 మార్చి 18న అల్లూరు సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో షేక్.కౌసిఫ్బేగ్, షేక్.ఫయాజుద్దీన్, షేక్.బీబీజాన్, షేక్.ఆస్మా, షేక్.సిరూనా, షేక్.సలావుద్దీన్, ఆమూరి శీనయ్య, షేక్.షావుద్దీన్, షేక్.సదావుద్దీన్, షేక్.అమీరుద్దీన్, షేక్.అబ్దుల్జ్రాక్ల పేర్లమీద ఒక్కొక్కరికి ఆరు ఎకరాల చొప్పున రిజిస్ట్రేషన్ చేశారు. ఎలాంటి పాస్పుస్తకాలు లేకుండా, కేవలం రిజిస్ట్రేషన్ డాక్యుమెంటు ఆధారంగా రిజిష్టరు జరిగింది. రిజిష్టర్ అయిన వారంరోజులు తిరగకముందే 2014 మార్చి 23న వీరి పేర్లుమీద పొగతోట ఐఓబీలో అగ్రికల్చర్ గ్రీన్ క్రెడిట్ స్కీం కింద ఒక్కొక్కరికి రూ.25 లక్షలు చొప్పున రూ.2.75 కోట్లు మంజూరుచేశారు. అంతేకాకుండా భూమి అభివృద్ధి కోసం కిసాన్ క్రెడిట్ కార్డు పథకం ద్వారా రూ.5 లక్షలు చొప్పున మరో రూ.50 లక్షలు మంజూరుచేశారు. ఎందుకూ పనికిరాని గుట్టలు, రాళ్లతో కూడిన ఈ భూమికి నిబంధనలకు విరుద్ధంగా రుణాలు మంజూరుచేశారు. అనుమానం వచ్చి.. ఇంత పెద్దమొత్తంలో రుణాలు మంజూరుచేయడంతో ఈ బ్యాంకుకు చెందిన రీజనల్ స్థాయి అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చి నివ్వెరపోయారు. కనీసం ఎకరా రూ.50 వేలు కూడా విలువచేయని భూములకు ఇంత పెద్దమొత్తంలో రుణాలు మంజూరుచేయడంతో సంబంధిత బ్యాంకు మేనేజరుపై చర్యలు చేపట్టి సస్పెండ్ చేయటమే కాకుండా నెల్లూరులోని వన్టవున్లో 2014 సెప్టెంబరులో కేసు పెట్టారు. నెల్లూరు క్రైంబ్రాంచ్ డీఎస్పీ శ్రీధర్కు ఈ కేసు అప్పగించారు. రిజిస్ట్రేషన్ వద్ద నుంచి బ్యాంకు రుణాలు మంజూరు చేసేవరకు అన్నిచోట్ల నిబంధనలు పాటించలేదని ఆయన తేల్చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా బుధవారం ఆయన క్రైంబ్రాంచ్కు చెందిన ఏఎస్సై వెంకటేశ్వర్లుతో కలిసి ఉదయగిరిలోని రెవెన్యూ అధికారులతో చర్చించారు. అనంతరం బండగానిపల్లిలోని పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఈ కేసులో బ్యాంకు అధికారి నాగయ్య 11 మంది తమ అనుచరులకు ఎరవేసి వారి పేరు మీద రిజిస్ట్రేషన్లు చేసి బ్యాంకు లోను మొత్తం కాజేశారన్నారు. ఈ బ్యాంకు అధికారి కూడా ఉదయగిరి ప్రాంతానికి చెందిన వ్యక్తి అని తెలిపారు. కాగా బండగానిపల్లికి చెందిన ఈ భూమికి సంబంధించి పలు వివాదాలున్నాయి. రిజర్వ్ ఫారెస్ట్కు చెందిన భూమిగా గ్రామస్తులు, అటవీ అధికారులు చెబుతున్నప్పటికీ ప్రభుత్వ రికార్డుల్లో మాత్రం సెటిల్మెంట్గా ఉండటంతో వాటిని కొంతమంది వ్యక్తులు కొనుగోలు చేశారు. వీటిపై కూడా అనేకసార్లు గ్రామస్తులు, అధికారులు, హక్కుదారుల మధ్య వివాదాలు నడిచాయి. -
వండువ కొండపై గ్రానైట్ బాంబు !
ఓ మాజీ ప్రజాప్రతినిధి, బినామీలుగా వ్యవహరిస్తున్న కొంతమం ది అధికార పార్టీకి చెందిన ఛోటా నాయకులు తమ స్వార్థం కోసం పచ్చని పొలాల్లో క్వారీ చిచ్చు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. సుమారు రెండు వేల ఎకరాల్లోని పంటలకు ముప్పు కలిగించేందుకు బరి తెగిస్తున్నారు. 50 గ్రామాలకు తాగునీరు అందించేందుకు నిర్మాణంలో ఉన్న ఉపరితల ప్రాజెక్టు ఉనికికే ప్రమాదం తెచ్చి పెడుతున్నారు. సుమారు 350 మంది సరస్వతీ పుత్రులకు విద్యనందిస్తున్న ఉన్నత పాఠశాలకు, 2,500 మంది జనాభా కలిగిన గ్రామాలపై గ్రానైట్ బాంబు విసరాలని చూస్తుండడంతో జనం భయూందోళన చెందుతున్నారు. ప్రజలు, పర్యావరణ వేత్తల అభ్యంతరాలు, ఆందోళనలు బేఖాతరు చేస్తూ వీరఘట్టం మండలం వండువ కొండను గ్రానైట్ లీజు పేరిట కొల్ల గొట్టాలని నేతల పన్నాగం పన్నుతున్నారు. - వీరఘట్టం పరిస్థితి ఇది : సర్వే నెంబరు 185పై ఉన్న వండువ కొండపై రూ.35 కోట్లు వ్యయంతో తాగునీటి ప్రాజెక్టు నిర్మాణంలో ఉంది. దీని ద్వారా వీరఘట్టం మండంలోని 50 గ్రామాలకు కొద్ది రోజుల్లో తాగునీరు అందనుంది. అలాగే కొండకు ఆనుకొని ఉన్న వండువ గ్రామంలో 2500 మంది జనాభా నివసిస్తున్నారు. పక్కనే ఉన్నత పాఠశాల, మరో పక్క అడారు కాలనీ, కొండ చుట్టూ సుమారు రెండు వేల ఎకరాల ఆయకట్టు, రూ.5 లక్షలతో నిర్మించిన క్రైస్తవ దేవాలయం ఉంది. కొండను లీజుకి ఇస్తే వీటి భవిష్యత్ ప్రమాదంలో పడనుంది. ఇదీ విషయం : ఓ మాజీ ప్రజాప్రతినిధి గ్రానైట్ లీజుల కోసం ప్రయత్నిన్నారు. దీంతో వండువ కొండపై గతంలో అధికారులు గుట్టుగా సర్వేలు జరిపారు. కొండకు ఆనుకొని ఉన్న గ్రామం, ఉన్నత పాఠశాల, చుట్టూ సాగవుతున్న పొలాలు, కొండపై సాగవుతున్న జీడి, మామిడి తోటలు, సాగునీటి కోసం ఏర్పాటు చేసిన బోరింగుల ఫొటోలు సేకరించారు. వీటితో పాటు కొండ వద్ద వన్యప్రాణులు సైతం ఉన్నట్లు గుర్తించారు. ఇక్కడ వాస్తవ పరిస్థిని ప్రభుత్వానికి నివేదిస్తాని అప్పట్లో ప్రకటించారు. అయితే సర్వే చేసిన అధికారులు వాస్తవాలను విస్మరించి తప్పుడు నివేదికలను తయారు చేసి ప్రభుత్వానికి నివేదించేందుకు సిద్ధమవుతున్నారనే విమర్శలు వస్తున్నారుు. 30న ప్రజాభిప్రాయ సేకరణ సర్వే నెంబరు 185లో సుమారు 75 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న వండువ కొండ లీజు విషయమై ఈనెల 30న ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి గ్రామసభ నిర్వహించనున్నట్టు ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో వండువ గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాభిప్రాయ సేకరణతో లోలోపల అధికారులు కుమ్మకై అక్రమ లీజుకు యత్నిస్తున్నారని గ్రామస్తులంటున్నారు. ఇటువంటి చర్యలు మానుకోవాలని, లేకుంటే ఆమరణ నిరాహరదీక్షకు చేయడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరిస్తున్నారు. స్థానికుల ఆందోళన కొద్ది కాలంగా మౌనంగా ఉన్న వండువ కొండ లీజు వ్యవహారం తెరపైకి రావడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. కొండే జీవనాధారం కావడంతో గ్రానైట్ లీజు విషయం తెలిసినప్పటి నుంచి పేదలు ఆందోళనకు గురవుతున్నారు. కొండను లీజు పేరిట ఎవరికైనా ధారదత్తం చేస్తే కుటుంబాలతో సహా వలసలు పోవాల్సిందేనని వాపోతున్నారు. కొండను రక్షించుకునేందుకు ప్రాణత్యాగాలకైనా, ఆమరణ నిరాహరదీక్షలకైనా సిద్ధమంటున్నారు. ప్రజాభిప్రాయ సేకరణను నిలిపి వేసి అక్రమ లీజును నిలుపుదల చేయాలని గ్రామస్తులంతా డిమాండ్ చేస్తున్నారు. -
రుణమాఫీకి బినామీ ‘అప్పు’లోడ్ !
బోగస్ రుణాలని తేలితే రుణమాఫీ వర్తించదని ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఆదేశాలను గొట్లాం పీఏసీఎస్ అధికారులు పట్టించుకోలేదు. ఈ సొసైటీలో బినామీ పేర్లతో రుణాలు పొందారని గత విచారణలో తేలినా... డీసీసీబీ అధికారులు ఇంతవరకూ చర్యలు తీసుకోలేదు. అలా రుణాలు పొందిన వారి ఖాతాలను ఇప్పుడు రుణ మాఫీ కోసం అప్లోడ్ చేశారు. మరో పక్క అసిస్టెంట్ రిజిస్ట్రార్ స్థాయి అధికారితో మళ్లీ విచారణ నిర్వహిస్తున్నారు. కానీ తాజా విచారణకు అభియోగాలు ఎదుర్కొంటున్న రైతులు సహకరించడం లేదు. ఈ మొత్తం వ్యవహారం సహకారశాఖ అధికారులకు తలనొప్పిగా మారింది. సాక్షి ప్రతినిధి, విజయనగరం : బొండపల్లి మండలం గొట్లాం పీఏసీఎస్లో 1,559 మందికి నిబంధనలకు విరుద్ధంగా రూ.కోటి 3లక్షల 78వేల 803మేర రుణాలిచ్చారని గత ఏడాది నిర్వహించిన సెక్షన్ 53 విచారణలో తేల్చారు. అప్పట్లో వచ్చిన ఫిర్యాదులు, ఆరోపణల దృష్ట్యా డీసీసీబీ ఏజీఎం స్థాయి అధికారి విచారణ చేశారు. ఈ విచారణలో అవకతవకలు జరిగాయన్న నిర్ధారణకొచ్చారు. కాకపోతే, ఈ అక్రమాలకు అప్పట్లో సొసైటీ అధ్యక్షుడు, కార్యదర్శులుగా పనిచేసి, మృతి చెందిన వారిని బాధ్యులను చేస్తూ నివేదికలో పేర్కొన్నారు. కానీ సొసైటీ సిబ్బంది, డెరైక్టర్ల విషయాన్ని పట్టించుకోలేదు. వాస్తవానికి సొసైటీలో ఏ అక్రమాలు జరిగినా అందులో పర్యవేక్షక అధికారులు, పాలకవర్గం ప్రతినిధులగా డెరైక్టర్లు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే, ఎవరికి రుణమిచ్చినా పరిశీలించాల్సిన బాధ్యత సూపర్వైజరీ అధికారులపై ఉండగా, ఎవరికెంత రుణం ఇచ్చారన్నదానిపై పాలకమండలి సభ్యులంతా తీర్మాణం చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన అక్కడి అక్రమాలపై సమిష్టి బాధ్యత వహించాల్సి ఉంటుంది. కానీ విచారణ అధికారులు చనిపోయిన సొసైటీ అధ్యక్షుడు, కార్యదర్శిని బాధ్యుల్ని చేసి చేతులు దులిపేసుకున్నారు. రూ.కోటి 3లక్షల 78వేల 803 మేర అక్రమాలు జరిగినా ఇంతవరకు చర్యలు తీసుకోలేదు, సరికదా ఒక్క పైసా కూడా రికవరీ చేయలేదు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలొస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఇటీవల ఒకరు జిల్లా సహకార శాఖ అధికారికి ఫిర్యాదు చేశారు. ఇక్కడ భారీగా అక్రమాలు జరిగాయని, బినామీ రుణాలు పెద్ద ఎత్తున ఇచ్చారని గ్రీవెన్ సెల్లో ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా రుణాలు పొందిన వారి పేర్లను రుణమాఫీ కోసం అప్లోడ్ చేశారన్న ఫిర్యాదులు కూడా వచ్చాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని ఒకవైపు గత విచారణపై తీసుకున్న చర్యలేంటని డీసీసీబీని ఆరాతీస్తూనే, మరోవైపు సెక్షన్ 51విచారణ చేపట్టే ఉద్దేశంతో ప్రాథమిక విచారణకు తాజాగా ఉపక్రమించారు. అసిస్టెంట్ రిజిస్టార్ వాణి శైలజ ప్రస్తుతం గొట్లాం పీఏసీఎస్ పరిధిలో విచారణ చేపడుతున్నారు. సెక్షన్ 53 విచారణలో ఎవరికైతే నిబంధనలకు విరుద్ధంగా రుణాలిచ్చారని తేల్చారో వారిని ఇప్పుడెళ్లి విచారిస్తే తమకేమీ తెలియదని కొందరు, ఇంట్లో పెద్ద వాళ్లు లేరని మరికొందరు విచారణ అధికారికి ముఖం చాటేస్తున్నారు. దీంతో విచారణలో ఆమె ముందుకెళ్లలేకపోతున్నట్టు తెలిసింది. ఇదంతా అక్రమార్కులు పథకం ప్రకారం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనిపై ప్రత్యేక దృష్టి సారించి, ఉన్నత స్థాయి విచారణ చేపడితే తప్ప వాస్తవాలు బయటికొచ్చే అవకాశం లేదు. లేదేంటే బినామీ రుణాలు కూడా రుణమాఫీలో సర్దుబాటు అయ్యే అవకాశం ఉంది. తద్వారా రైతులు పేరు చెప్పి సొమ్ము దిగమింగేసిన బడాబాబులకు మేలు చేసినట్టు అవుతుంది. అంతేకాకుండా వారి అవినీతి భాగోతం బయటపడకుండా కాల గర్భంలో కలిసిపోతుంది. -
తేలనున్న ‘ఇంటి’గుట్టు
జేఎన్ఎన్ఆర్యూఎం ఇళ్ల కేటాయింపుపై కమిటీ రెవెన్యూ..యూసీడీ సంయుక్త సర్వే సంక్రాంతిలోగా అందజేయనున్న నివేదిక బినామీలలో మొదలైన కలవరం విశాఖపట్నం సిటీ : అవకతవకలమయమైన జేఎన్ఎన్ఆర్యూఎం ఇళ్ల కేటాయింపుపై అధికారులు దృష్టి సారించారు. మహా విశాఖలో జేఎన్ఎన్యూఆర్ఎం కింద నిర్మితమైన గృహాల వ్యవహారం నిగ్గుతేల్చాలని తాజాగా సంకల్పించారు. అనర్హులే ఎక్కువగా ఉన్నారనే ఫిర్యాదులు అందడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే కోర్టుల నుంచి మొట్టికాయలు వేయించుకున్న మహా నగర పాలక సంస్థ నివేదికల్లో వాస్తవాలను బయటపెట్టేందుకు రెవెన్యూ యంత్రాంగం సైతం కదిలింది. దీనిలో భాగంగా అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ అధికారులు, రెవెన్యూ బృందాలు సంయుక్తంగా సర్వే చేసి అర్హుల నిగ్గు తేల్చేందుకు నడుం బిగించాయి. అసంపూర్తిగా ఎన్ని ఇళ్లు వున్నాయి... కేటాయింపు జరిగిన గృహాల్లో ఎవరెవరు ఉంటున్నారు...ఉంటున్న వారు అర్హులా..కాదా...రిజర్వుడు కేటగిరీల కింద ఎంత మంది ఉంటున్నారు... ఆక్రమించిన వారికి ఎవరెవరు సిఫార్సు చేశారు... బినామీల పేర్లతో ఎవరెవరు ఎన్ని ఇళ్లు ఆక్రమించారు తదితర అంశాలపై రెవెన్యూ వారు నిగ్గు తేల్చనున్నారు. ఇందుకు 33 బృందాలను ఏర్పాటు చేశారు. బృందంలో ముగ్గురు నలుగురు చొప్పున అధికారులుంటారు. ఒకటి రెండు రోజుల్లోనే ఈ బృందాలు సర్వే చేపట్టనున్నాయి. సంక్రాంతి లోగా వీరిచ్చే నివేదిక ఆధారంగానే అర్హులను గుర్తించి, వారికి అన్ని సదుపాయాలు కల్పించేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేయనుంది. 14,203 ఇళ్లు నిర్మాణం విశాఖ అర్బన్లో జేఎన్ఎన్యూఆర్ఎం హౌసింగ్ ప్రాజెక్టును 2006లో ప్రారంభించినా 2008 వరకూ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ మాత్రమే పర్యవేక్షించేది. ఆ తర్వాత నుంచీ జీవీఎంసీకి ప్రభుత్వం అప్పగించింది. అప్పటి నుంచి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టి 15,320 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అయితే స్థల వివాదాలు, కోర్టు వ్యాజ్యాలు వల్ల 14,203 ఇళ్లను మాత్రమే 38 లే అవుట్లలో నిర్మించారు. ఇందులో 12,947 ఇళ్లకు కేటాయింపు చేశారు. ఇంకా 1,256 ఇళ్లు మాత్రమే అధికారికంగా ఖాళీ వున్నట్టు లెక్కలేస్తున్నారు. కానీ వాస్తవ పరిస్థితికొచ్చేసరికి 5 వేలకు పైగా ఇళ్లు ఖాళీగా ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఇవన్నీ బినామీలే. రాజకీయ నేతల అనుయాయులు తాళాలు వేసి తమ వారి కోసం సిద్ధంగా ఉంచుకున్నారు. గతంలోనే అప్పటి కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల అనుచరులే ఎక్కువ ఇళ్లను స్వాహా చేసినట్టు అధికారులు లెక్కలేస్తున్నారు. అప్పటి ఎమ్మెల్యే, మంత్రుల అనుచరులు కాజేయడంతో ఇప్పటి మంత్రులు, ఎమ్మెల్యేలకు జీవీఎంసీ అధికారులపై ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. గతంలో స్వాహా చేసిన వారికే వత్తాసు పలుకుతున్నారంటే తమ పరిస్థితి ఏంటని మల్లగుల్లాలు పడుతున్నారు. మొత్తానికి ఆ ఇళ్లల్లో ఎవరెవరు ఉంటున్నారనేదానిపై లోతుగా అధ్యయనం చేస్తున్నారు. అన్నీ సమస్యలే..! జెఎన్ఎన్యుఆర్ఎం ఇళ్ల నిర్మాణానికి కేంద్రం నుంచి రూ. 300 కోట్లు రావాల్సి వుంది. ఆ మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో వుండిపోయాయి. అక్కడి నుంచి ఆ మొత్తం తెచ్చుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో సంప్రదింపులు జరపాల్సి ఉంది. ఇదంతా ఇప్పట్లో అయ్యే పని కాదని తేలడంతో ఇంజనీరింగ్ అధికారులు పనులకు ఫుల్స్టాప్ పెట్టారు. ఎక్కడి పనులు అక్కడే ఆపేశారు. రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్, నీటి సదుపాయాల్లేవు. అందుకే ఇళ్ల కేటాయింపులు జరిగినా మెజార్టీ ఇళ్లు తాళాలు వేసే ఉన్నాయి. అర్హుల గుర్తింపు ఇలా..! జేఎన్ఎన్యూఆర్ఎం ఇళ్లు కేటాయించేందుకు అర్హులను ఇలా గుర్తించాలంటూ ప్రభుత్వం మార్గ దర్శకాలు జారీ చేసింది. మొత్తం ఇళ్లల్లో ఎస్సీలకు 16శాతం, ఎస్టీలకు 6 శాతం, మైనార్టీలకు 5 శాతం ఇళ్లను కేటాయించాలని సూచించింది. మిగిలిన ఇళ్లల్లో రహదారుల విస్తరణలో ఇళ్లు కోల్పోయిన వారికి, గెడ్డలు, కెనాల్స్పై ఉంటున్న వారికి, కొండ ప్రాంతాల్లో వారికి, రైల్వే,డిఫెన్స్, పోర్టు స్థలాల్లో అనధికారికంగా ఉంటున్న వారికి ప్రాధాన్యమివ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే ఇళ్లు కాలిపోయిన వారికి, ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసుల్లోని బాధితులు, వికలాంగులు, హెచ్ఐవీ బాధితులకు, అనాథలకు నిబంధనల మేరకు ఇళ్లు కేటాయింపులు చేయాలని సూచించారు. జరుగుతుందిలా..! రాజకీయ నేతలు సిఫార్సు చేసిన వారికి, మంత్రులు, ఎమ్మెల్యేల అనుయాయులకు కేటాయింపులు చేస్తున్నారు. జీవీఎంసీలోని మాజీ కార్పొరేటర్లకు, రాజకీయ పార్టీల్లోని ముఖ్య నేతల అనుయాయులకు, వాళ్ల ఇళ్లల్లో పనిచేసే వారికి మాత్రమే ఇస్తున్నారు. అధికారిక పార్టీల వార్డు అధ్యక్షులు రూపొం దించే నివేదికలకే పచ్చజెండా చూపుతున్నారు. జన్మభూమి కమిటీలు జోక్యం పెరిగిపోవడంతో వార్డు నేతల చుట్టూ ఇళ్ల కోసం ప్రదక్షిణలు చేస్తున్నారు. ఓడీఏ బెటర్..! విశాఖలో ఓడీఏ పేరుతో పలు మురికివాడలను నిర్మించి అభివృద్ధి చేసిన ఘనత ఓవర్సీస్ డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్దే. ఎలాంటి అభివృద్ధి లేని సమయంలో ఆరిలోవలో 10 సెక్టార్లను అభివృద్ధి చేసింది. ఇప్పుడు ఆరిలోవలో ఎలాం టి సదుపాయాలున్నాయో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు నిర్మిస్తున్న జేఎన్ఎన్యుఆర్ఎం ఇళ్లల్లో అలాంటి సదుపాయాలున్నాయో లేదో అధికారులకే తెలియాలి. సదుపాయాలు లేని ఇళ్లు ఇవే..! చాలా ఇళ్లల్లో కనీస సదుపాయాలు కల్పించేందుకు నగర పాలక సంస్థ మీనమేషాలు లెక్కిస్తోంది. ఇళ్లు కట్టేశామంటూ గొప్పలు చెప్పే ఇంజినీరింగ్ శాఖ అక్కడ కనీస సదుపాయాలున్నాయో లేదో చూడడం లేదు. వేలాది గృహ సముదాయాలను రూ. కోట్లు వెచ్చించి నిర్మిస్తున్నా కనీస అవసరాలు తీర్చే నీటి, విద్యుత్ సదుపాయాలు కల్పించడంలో విఫలమైంది. ఈ ఇళ్ల వద్ద కమ్యూనిటీ కేంద్రాలు, దుకాణ సముదాయాలు, పాఠశాల, అంగన్వాడీ భవనం, డిస్పెన్సరీ, పై అంతస్తులోని వారికి నీరు వెళ్లేందుకు అవసరమైన మోటార్లు, ట్యాంకులు ఏర్పాటుపై దృష్టి పెట్టాలి. స్థానికంగానే ఉపాధికి అవసరమైన పరిశ్రమలు ఏర్పాటు చేస్తే తప్పా అక్కడ ప్రజలు నివాసముండలేరని అధికారులే చెబుతున్నారు. ఖాళీగా ఉన్న ఇళ్లు పరదేశిపాలెం-1లో 927 బక్కన్నపాలెం-2లో 512 కొమ్మాది-2లో 890 సింహాచలం దరి అప్పన్న పాలెంలో 480 పెందుర్తి దరి 1472 తాగునీటికి ఇబ్బందులు మాది నిరుపేద కుటుం బం. ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేస్తాదంటే దరఖాస్తు చేసుకున్నాం. ఇక్కడ ఓ ఇంటిని కేటాయించారు. కనీసం తాగేందుకు నీరు కూడా అందించడంలేదు. పిల్లాపాపలతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. - టి.లక్ష్మి వెళ్లాలంటే నరకమే ఇళ్లు కేటాయించిన అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడలేదు. కనీసం రోడ్లు కూడా సక్రమంగా నిర్మించలేదు. ఇక్కడికి రావాలంటే నరకం చూడాల్సిందే. - ఎం. నాగేశ్వరరావు విద్యుత్ సదుపాయం లేదు మా నివాసాలకు విద్యుత్ సదుపాయం లేదు. రాత్రి సమయాల్లో చాలా భయంగా ఉంటుంది. కాలువలు, నీటి సదుపాయం లేదు. బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నాం. - టి. సత్యవతి -
రుణమాఫీలో బినామీలు
కొక్కిరాపల్లి సొసైటీలో వెలుగులోకి అక్రమాలు కార్యదర్శిని నిలదీసిన బాధితులు యలమంచిలి : బినామీ, కాలపరిమితి తీరిన రుణాలకు సంబంధించిన కుంభకోణంతో గతంలో కుదేలైన కొక్కిరాపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్)లో ప్రస్తుతం రుణమాఫీలోనూ అక్రమాలు చోటు చేసుకున్నట్టు శనివారం బయటపడింది. సమగ్ర విచారణ జరిపితే ఈ వ్యవహారం వెనుక ఉన్న సూత్రధారులు బయటపడే అవకాశం ఉందని సభ్యరైతులు డిమాండ్ చేస్తున్నారు. రెండో విడత రుణమాఫీ జాబితాలో పేర్లున్న పలువురు రైతులు శనివారం ఇంటర్నెట్ కేంద్రాల్లో తమ స్టేటస్ను తెలుసుకున్నారు. షేకిళ్లపాలేనికి చెందిన రాయి నూకరాజు ఈ సొసైటీలో రూ.4,193లు రుణం తీసుకున్నాడు. యలమంచిలి ఎస్బీఐలో కూడా రూ.43వేల వరకు పంటరుణం మంజూ రైంది. ఇవి కాకుండా అతని పేరుతో కొక్కిరాపల్లి సొసైటీలో రూ.1.8లక్షలు తీసుకున్నట్టు ఉంది. ఇది చూసి కంగారుపడిన నూకరాజు కుమార్తె లక్ష్మి శనివారం సొసైటీకి వచ్చి కార్యదర్శి రామకృష్ణ, సిబ్బందిని నిలదీశారు. తమకు సంబంధం లేని రుణాలు తమ పేరుతో ఎలా ఉన్నాయని ప్రశ్నించా రు. ఆమెకు మద్ధతుగా సభ్యరైతులు ఆడారి రమణబాబు, ఆడారి ఆదిమూర్తి కార్యదర్శిని నిలదీయడంతో కంప్యూటర్లో తప్పు వచ్చిందని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కొత్తపాలెంకు చెందిన రాపేటి అప్పలనాయుడు తన ఆధార్కార్డు నంబరుతో వివరాలు చూస్తే ఊడా నర్సింహమూర్తి పేరుతో రూ.76,477 రుణం తీసుకున్నట్టు వచ్చింది. రిపోర్టుతో అతడు సొసైటీ కార్యాలయానికి వచ్చి వాపోయాడు. తాను రూ.40వేలు రుణం తీసుకున్నానని, తన ఆధార్, రేషన్ కార్డుల వివరాలతో మరో వ్యక్తి పేరుతో వివరాలు రావడమేమిటని కార్యదర్శిని నిలదీశారు. పెదపల్లికి చెందిన మరిశావెంకటేశ్వరులు యలమంచిలి ఎస్బీఐలో రుణం తీసుకున్నారు. అతని కుమారుడు మరిసా రాము ఈ సొసైటీలో పంటరుణం పొందారు. వెంకటేశ్వరులు కొక్కిరాపల్లి సొసైటీలో ఎలాంటి రుణం తీసుకోలేదు. అయినప్పటికీ వెంకటేశ్వరులు ఆధార్ నంబర్తో కొఠారు మంగతల్లి, పండూరి నాగభూషణం, బోజా సోమునాయుడు పేర్లతో రుణాలు తీసుకున్నట్టు బయటపడింది. ఇవన్నీ బినామీ రుణాలుగానే వెంకటేశ్వరులు భావిస్తున్నారు. పైడాడ వెంకటేశ్వరులు అనే రైతు రూ.9,484 పంటరుణం సొసైటీ నుంచి తీసుకున్నారు. ఇతని ఆధార్, రేషన్ వివరాలు నమోదు చేస్తే గొల్లవిల్లి రాంబాబు పేరుతో రుణం తీసుకున్నట్టు సూచిస్తోంది. ఇదే తరహాలో పలువురు రైతుల పేర్లతో స్టేటస్ రిపోర్డులు వస్తున్నట్టు పలువురు రైతులు విలేకరులకు చెప్పారు. ఈ సొసైటీలో గతంలో తీసుకున్న బినామీ రుణాలు మాఫీ అయ్యేందుకు కొందరు వివరాలు తప్పుగా నమోదు చేయించినట్టు రైతులు ఆరోపిస్తున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపితే భారీ స్థాయిలో అక్రమాలు బయటపడే అవకాశం ఉందని చెబుతున్నారు. -
ఏ తీరమైనా దుమారమే
సాక్షి, రాజమండ్రి : జిల్లాలో డ్వాక్రా సంఘాలకు అప్పగించిన ఇసుక రీచ్లు వివాదాలకు కేంద్రాలవుతున్నాయి. అక్కడ విధివిధానాలకు రేణువంత తావు లేకుండా పోయింది. అమ్మకాలు ప్రారంభమైన తొలిరోజు నుంచే అక్రమార్కులు పర్మిట్ల ముసుగులో రీచ్ల నుంచి ఇసుక తరలించారు. డీడీలు తీసిన గృహ వినియోగదారులకు తొలి రెండు రోజులు లారీ ఇసుక దొరకలేదు. మరికొన్ని చోట్ల డీడీలు లేక పోయినా డబ్బులు వసూలు చేసి సరుకు తరలించారు. రాజమండ్రిలో బినామీలు డీడీలు తె చ్చి తమ లారీలు క్యూల్లో పెట్టి మరీ లోడ్ చేయించుకున్నారు. బిల్డర్లు, కాంట్రాక్టర్లు తమ మనుషులతో డీడీలు తీయించి సరుకును తరలించేశారు. జిల్లాలో 27 ఇసుక రీచ్లకు పర్యావరణ అనుమతులు రావాల్సి ఉంది. గోదావరిలో పూడిక తీత చేపట్టే పనులకు పర్యావరణ అనుమతులు అవసర ం లేకపోవడంతో ఏడు రీచ్ల్లో ప్రభుత్వం డ్వాక్రా సంఘాల ద్వారా ఇసుక అమ్మకాలను సోమవారం ప్రారంభించింది. కానీ ఈ విధానం తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావండి అన్న చందంగా తయారైంది. ఎక్కడికక్కడ రీచ్ల నిర్వహణకు మహిళా సొసైటీల ఎంపిక అసమ్మతికి దారి తీసింది. టీడీపీ నేతలు తమ వారికి రీచ్లు కట్టబెట్టారని ఆరోపణలు వెల్లువెత్తాయి. తవ్వకాలు జరుగుతున్న చోట వివాదాల ముసుగులో నిబంధనలను గోదావరిలో కలిపేశారు. ఉల్లితోట సమాఖ్య ధర్నా రాజమండ్రి కుమారి టాకీస్ ఎదురుగా, జీవకారుణ్య సంఘం వద్ద ఉన్న రీచ్లలో మంగళవారం కూడా వివాదాలు కొనసాగాయి. గత 30 ఏళ్లుగా ఈ రీచ్లపై ఆధారపడి జీవిస్తున్న తమకు కాదని కొత్త బోట్ సొసైటీలకు తవ్వకాలకు అనుమతులు ఇచ్చారని వెంకటేశ్వరా బోట్స్మన్ అసోసియేషన్ వారు జీవకారుణ్య సంఘం వద్ద ఆందోళన చేశారు. రోడ్డుపై బైఠాయించి ఇసుక రవాణాను అడ్డుకున్నారు. స్థానికంగా ఉన్న తమను కాదని వేరే డివిజన్ మహిళా సమాఖ్యకు రీచ్ను అప్పగించడమేంటని ఉల్లితోట మహిళా సమాఖ్య కుమారి టాకీస్ వద్ద ధర్నాకు దిగింది. దీంతో రెండుచోట్టా మధ్యాహ్నం వరకూ అమ్మకాలు నిలిచిపోయాయి . ఇక కపిలేశ్వరపురం, కేదారిలంకల్లో రెండు రీచ్లలో తవ్వకాలు ప్రారంభం కాలేదు. కానీ పేరు మహిళా సమాఖ్యదైనా పెతన్తం మాత్రం టీడీపీ నేతలు చేస్తుండడం వివాదాస్పదంగా మారుతోంది. కేదారిలంక పేరుతో ఏర్పడ్డ శాండ్ మైనింగ్ ఎయిడెడ్ సొసైటీ అధ్యక్షురాలు సాదా పార్వతి గ్రామ టీడీపీ అధ్యక్షుని సోదరి కావడం వివాదాలకు వేదికవుతోంది. మరో తొమ్మిది మంది సభ్యులు కూడా టీడీపీకి చెందిన వారే కావడాన్ని మిగిలిన సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. తవ్వకాలు రెండు రోజుల్లో ప్రారంభం అవుతాయని భావిస్తుండగా అడ్డుకునేందుకు ఇతర మహిళా సమాఖ్యలు సిద్ధమవుతున్నాయి. సీతానగరం మండలం ముగ్గళ్లలో మహిళా సంఘాలు తవ్వకాలను అడ్డుకున్నాయి. గ్రామంలోని 93 డ్వాక్రా సంఘాలను సంప్రదించకుండా టీడీపీ నాయకులు 12 మందితో రహస్యంగా కమిటీ వేసి రీచ్ను అప్పగించడం ఉద్రిక్తతకు దారి తీసింది. మొత్తం అన్ని సంఘాల నుంచీ కమిటీని ఎన్నుకుంటే తప్ప తవ్వకాలు సాగనిచ్చేది లేదని తేల్చి చెప్పడంతో తవ్వకాలు నిలిచి పోయాయి. ఇసుక ట్రాక్టర్లకు ‘దేశం’ జెండాలు మామిడికుదురు మండలం పాశర్లపూడి రీచ్లో తవ్వకాలను పాశర్లపూడి శాండ్ మైనింగ్ సొసైటీ పేరుతో ఏర్పడ్డ మహిళా సొసైటీకి అప్పగించారు. టీడీపీ ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి ప్రారంభించిన రీచ్లో టీడీపీ వారు ట్రాక్టర్లకు పార్టీ జెండాలు కట్టి హడావిడి చేశారు. తొలిరోజు మొత్తం 26 ట్రాక్టర్ల ఇసుక విక్రయాలు జరగ్గా అందులో 13 ట్రాక్టర్లకు మాత్రమే డీడీలు తీశారు. మిగిలిన వాటికి నిబంధనలకు విరుద్ధంగా రీచ్ వద్దే రూ.2100 చొప్పున వసూలు చేసి లోడ్చేశారు. ఇక్కడ ఇసుక తవ్వకాలు తమకే అప్పగించాలంటూ మత్స్యకార సొసైటీలు కూడా మధ్యాహ్నం వరకూ ధర్నా చేశాయి. రీచ్లో రూ.4 వేలు..బయట రూ.9 వేలు ఇసుక రీచ్లలోకి లారీలకు ప్రవేశం లేదని, ట్రాక్టర్లు, చిన్న వాహనాలను మాత్రమే రవాణాకు అనుమతిస్తామని ప్రభుత్వం చెప్పినా.. రాజమండ్రిలో రవాణాను పూర్తిగా లారీలతో సాగిస్తున్నారు. యూనిట్కు రూ.2 వేల చొప్పున రీచ్లో చెల్లించిన వారు.. ఒక్కో లారీలోని రెండు యూనిట్ల ఇసుకను బయటకు రాగానే రూ.9 వేలకు ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకుంటున్నారు. ఒకే వ్యక్తి బినామీ పేర్లతో డీడీలు తీసి రీచ్ల నుంచి బయటికి వెళ్లిన ఇసుకను అమ్ముకుంటున్నట్టు ఆరోపణలున్నాయి. రాజమండ్రిలో మంగళవారం సుమారు 20 లారీల వరకూ ఇలా అక్రమ విక్రయాలు సాగాయని తెలుస్తోంది. రేవుల్లో ఇసుక తవ్వకాలకు కొత్తగా అనుమతులు పొందిన సొసైటీలు వినియోగిస్తున్న బోట్లకు రిజిస్ట్రేషన్ లేదని తెలుస్తోంది. ఇంకా తమకు ఎవరూ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు సమర్పించలేదంటున్న అధికారులు నేతల వత్తిడితో వీటి విషయంలో జోక్యం చేసుకునేందుకు జంకుతున్నారు. -
సర్వేతో అక్రమార్కులకు చెక్ పడే అవకాశం
మంచిర్యాల రూరల్ : తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న సమగ్ర సర్వేతో మంచిర్యాల మండలం గుడిపేట వద్ద ఎల్లంపల్లి ప్రాజెక్టులో ముంపునకు గురవుతున్న గ్రామాల నిర్వాసితుల్లో అనర్హులు, బినామీల బండారం బయటపడే అవకాశం కన్పిస్తోంది. సర్వే సిబ్బంది పక్కాగా వ్యవహరిస్తే ముంపు గ్రామాల్లో నివాసం ఉంటున్న వారు ఎంత మంది? బినామీ పేర్లతో పరిహారం పొందిన వారు ఎవరు? అనే విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకు రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి, అధికారులు చేతివాటం చూపించడంతో, ముంపునకు గురయ్యే తొమ్మిది గ్రామాల్లో 300లకు పైగా అనర్హులు తెరపైకి వచ్చినట్లు సమాచారం. వీరిని గుర్తించేందుకు అధికారులు ఎన్నో రకాలుగా ప్రయత్నించినా.. స్థానికంగా ఉన్న ఇబ్బందులతో అనర్హత వేటు పడలేదు. గతేడాది డిసెంబర్ వరకు పరిహారం పంపిణీ సమయంలో బయోమెట్రిక్ విధానం ద్వారా వేలిముద్రలు, ఐరిష్ సేకరణను చేపట్టగా 129 మంది అనర్హులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సమగ్రంగా సర్వే చేస్తే 300లకు పైగా అనర్హులను గుర్తించొచ్చని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని చూసినా ఆ ప్రయత్నాలు ముందుకు సాగలేదు. అనంతరం ఎన్నికల హడావుడి, రాష్ట్రపతి పాలన, ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో బినామీల గుర్తింపు, వారిపై చర్యలకు బ్రేక్ పడింది. ప్రస్తుతం అనర్హుల గుర్తింపునకు ఈ నెల 19న నిర్వహించే సమగ్ర కుటుంబ సర్వే ఉపయోగపడనుందని అధికారులు భావిస్తున్నారు. అర్హులకు నిరాశ 2006లో ముంపు గ్రామాల్లో సోషల్ ఎకనామికల్ సర్వే(ఎస్ఈఎస్) చేపట్టారు. గ్రామాల్లో ఉన్న వారి పేర్లు, వివరాలు సర్వే ద్వారా నమోదు చేసి నిర్వాసితులను గుర్తించారు. నిరక్షరాస్యత, అవగాహన లోపంతో కొందరు అర్హుల పేర్లు ఎస్ఈఎస్లో నమోదు చేయించుకోలేదు. ఆలస్యంగా మేల్కొన్న అర్హులైన వారు ఎస్ఈఎస్లో పేర్లు మిస్సయ్యాయని, తమ పేర్లు నమోదు చేసుకోవాలని అధికారుల చుట్టూ తిరిగినా ఇప్పటికి ఫలితం లేకుండా పోయింది. దీంతో గ్రామంలో దళారులు పుట్టుకొచ్చారు. అర్హుల పేర్లు ఎస్ఈఎస్లో నమోదు కాలేదంటూ, వారి పేర్లు అడ్డుపెట్టుకుని, ఒక్కో గ్రామం నుంచి 50కి పైగా బినామీ పేర్లు తెరపైకి తెచ్చారు. పేర్లు మిస్సయిన అర్హులు గ్రామానికి 10 నుండి 30 మంది వరకు ఉండగా, వారిని ఇంత వరకు అర్హులుగా అధికారులు గుర్తించలేదు. అధికారులకు ముడుపులు అందించిన వారి పేర్లు మాత్రమే ఎస్ఈఎస్లో నమోదు చేసి, ముడుపులు ఇవ్వని వారి పేర్లు నమోదు చేయలేదనే ఆరోపణలు ఉన్నాయి. బినామీలకు కూలీ డబ్బులు, ఇంటి డబ్బులు, పునరావాస కాలనీలో ప్లాట్లు లభించాయి. దీంతో తమకు పరిహారం అందించకుండా, అనర్హులకు పరిహారం అందించారంటూ బాధితులు అప్పటి ఆర్ఆర్ కమిషనర్ చిరంజీవి చౌదరికి ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టు పనులు పూర్తికాగా, సర్వేతో మేలు జరుగుతుందని నిర్వాసితులైన అర్హులు భావిస్తున్నారు. బినామీల్లో ఆందోళన బయోమెట్రిక్ విధానంతో ముంపు గ్రామాల్లోని 129 మంది బినామీలు ఉన్నట్లు ఇప్పటికే అధికారులు గుర్తించారు. సమగ్ర సర్వే ద్వారా ఇళ్లు, కుటుంబ సభ్యుల వివరాలు, సంక్షేమ పథకాల వివరాలు, వారికి ఉన్న ఆస్తుల వివరాలు రికార్డు కానున్నాయి. దీంతో మిగిలిన బినామీలను గుర్తించేందుకు కుటుంబ సమగ్ర సర్వేఉపయోగపడనుండడంతో బినామీల్లో గుబులు మొదలైంది. ప్రతి గ్రామంలో బినామీలు అధికంగా ఉండడం, వారిపై చర్యలు తీసుకోవాలంటే రాజకీయ నాయకులు ఒత్తిడి ఉండేది. కానీ ఇప్పుడు సమగ్ర సర్వే చేపట్టడం వల్ల ఇతర ప్రాంతాల్లో ఉండే కుటుంబాలు మరోసారి గ్రామానికి వచ్చి సర్వేలో పాల్గొనే అవకాశం లేదు. ఒకవేళ సర్వేలో పాల్గొన్న గ్రామంలోని ఇతరులు గుర్తించే అవకాశం ఉంది. ప్రస్తుతం వారు ఉంటున్న ఊర్లలో సర్వేలో పాల్గొనాలో, ముంపు గ్రామాల్లో పరిహారం పొందడంతో ఇక్కడికి రావాలోననే ఆందోళన బినామీల్లో నెలకొంది. మరికొందరు రెండు గ్రామాల్లో పరిహారం పొందారు. వారిని కూడా సర్వే ద్వారా గుర్తించే వీలుంది. ప్రస్తుతం ముంపు గ్రామాల్లో ఇదే చర్చనీయాంశంగా మారింది. ఈ సర్వేతో అనర్హులను గుర్తించడం, అర్హులకు న్యాయం జరుగుతుందని ముంపు గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
మీసేవ.. ‘వారిష్టం’
బినామీల నిర్వహణతో అస్తవ్యస్తం కేటాయింపులో నిబంధనలు బేఖాతరు పల్లెల పేరిట మంజూరు..పట్టణాల్లో ఏర్పాటు సేవల్లో జాప్యంతో ప్రజల బేజారు పాలమూరు : ప్రభుత్వ కార్యకలాపాల వి సృ్తతంలో భాగంగా... ప్రజలు తమ గ్రా మాల్లోనే ఉంటూ సేవలను పొందేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక వ్యవస్థ అమలుతీ రు ప్రశ్నార్థకంగా మారింది. నిరుద్యోగు ల ద్వారా సేవలను అందించేందుకు ఏ ర్పాటు చేస్తున్న మీసేవ కేంద్రాల్లో బినామీలు పాగా వేస్తూ.. అసలు లక్ష్యానికి గండి కొడుతున్నారు. ప్రభుత్వ పరంగా ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు ఉద్దేశించిన ఈ కేంద్రాల్లో నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం 400 మీ సేవ కేంద్రాలను నిర్వహిస్తుం డగా అధికశాతం ఎలాంటి అర్హతలేని వ్యక్తుల చేతుల్లో ఉండటం గమనార్హం. పలుకుబడి.. పైరవీలతో దక్కించుకున్న కేంద్రాలను చాలామంది లీజుకిచ్చి సొ మ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ని బంధనల ప్రకారం డిగ్రీ చదివి కంప్యూట ర్ పరిజ్ఞానం కలిగిన నిరుద్యోగులకే వీటి ని కేటాయించాల్సి ఉంది. కేవలం 10వ తరగతి చదివి కనీసం కంప్యూటర్ పరి జ్ఞానం లేని వ్యక్తులకు సైతం మీసేవ కేం ద్రాలను కట్టబెట్టడం ఆశ్చర్యంలో కలి గిస్తోంది. ఏపీ ఆన్లైన్, ఇతర సంస్థల ని ర్వహణలో జిల్లాలో కొనసాగుతున్న 400 మీసేవ కేంద్రాలు ఏ గ్రామానికి మం జూరైతే అక్కడే ఏర్పాటు చేయాలనే నిబంధన ఉన్నా దాన్ని అమలు జరగడం లేదు. గ్రామాల పేరుతో అనుమతి పొం ది పట్టణాల్లో నిర్వహిస్తుండటంతో గ్రా మీణులకు నిరాశే ఎదురవుతోంది. ఈ కేంద్రాల్లో సగంవరకు గ్రామీణ మీసేవ కేంద్రాలున్నాయి. 40 వరకు గ్రామీణ ప్రాంతాల పేర తీసుకొని పట్టణ ప్రాం తాల్లో నడుపుతున్నట్లు తెలుస్తోంది. దా దాపు 200 మీసేవ కేంద్రాల్లో కేవలం ఒ క్క కంప్యూటర్తోనే నడుపుతున్నారు. దీంతో ప్రజలకు సత్వర సేవలను అం దించలేకపోతున్నారు. జిల్లాలో అక్రమాలు అనేకం చోటుచేసుకున్నా అడిగే నాథుడే కరవయ్యాడు. ఇక మీసేవ కేంద్రాల్లో తగినంత మంది ఆపరేటర్లను నియమించకపోవడంతో సర్టిఫికెట్ల జారీ ఆలస్యమవుతోంది. హెచ్సీఎల్కు చెం దిన అర్బన్ కేంద్రాల్లో పని ఒత్తిడి అధికం గా ఉన్నా అందుకు తగినట్లుగా ఆపరేటర్ల ను నియమించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఏపీ ఆన్లైన్, సీఎంఎస్ సెంటర్లలోనూ తగినన్ని కంప్యూటర్లు లేకపోవడంతో సేవల్లో జాప్యం జరుగుతోం ది. ఒకే సిస్టంతో పనిచేస్తున్న మీసేవా కేంద్రాలు జిల్లాలో 200 వరకు ఉన్నా అధికారులు చర్యలు తీసుకోవడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. గాడిలో పెడతాం..! జిల్లాలోని పలు మీసేవ కేంద్రాల నిర్వహణ తీరుపై అప్పుడప్పుడు ఫిర్యాదులు వస్తున్నాయి. వీటిపై విచారణ చేపట్టి తగిన చర్యలు చేపడతాం. మీసేవ కేంద్రాలను గాడిలో పెట్టేందుకు అవసరమైన చర్యలు క్షేత్ర స్థాయిలో తీసుకుంటున్నాం. ఒకరికి మంజూరైన కేంద్రాన్ని మరొకరికి లీజుకిస్తే బాధ్యులపై చర్యలు తప్పవు. ఏ గ్రామానికి మంజూరైన కేంద్రాన్ని అక్కడే ఏర్పాటు చేసుకోవాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే ఉపేక్షి ంచేదిలేదు. ఇలాంటి వాటిపట్ల విచారణ కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించాం. -ఎల్.శర్మణ్, జాయింట్ కలెక్టర్. -
ఎంచుకో.. దోచుకో
సెలక్ట్ ఏరియా డెవలప్మెంట్.. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డంపెట్టి తన బినామీలు, బంధుమిత్రులకు లాభం చేకూర్చేందుకు ఉద్దేశించిన బృహత్తర పథకం. ఇది అక్కడి రైతులను బికారీలుగా మారిస్తే తనవారిని రూ.వందల కోట్లకు అధిపతులను చేసింది. శిల్పారామం, సైబర్టవర్స్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, సైబ రాబాద్ పోలీస్ కమిషనరేట్.. ఇలా ప్రతీసంస్థను ఆనుకుని తన బినామీ మురళీమోహన్కు చెందిన ‘జయభేరి’ ఎన్క్లేవ్, కౌంటీ,వ్యాలీలు ఉండేటట్టు ప్రణాళిక రూపొందించిన బాబు, రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలోని వేలాది ఎకరాలను పథకం ప్రకారం కొల్లగొట్టారు. శ్రీగిరి విజయ్కుమార్ రెడ్డి చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే ఆయన బినామీలు రెచ్చిపోయారు. మాదాపూర్లో సైబర్ టవర్స్ ఏర్పాటు యోచనను మురళీమోహన్ బృందానికి బాబు లీక్ చేసిందే తడవుగా మాదాపూర్ పరిధిలోని సర్వే నంబర్ 65, 65(అ), 67(అ)లో రమీజా బీ, చాంద్ పాషా, నజీర్ అనే సాధారణ రైతుల నుంచి అతి చౌకగా ‘జయభేరి’ పేరుతో 22 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఆ కొనుగోలు వ్యవహారం పూర్తవగానే 1997 ఏప్రిల్ 27న చంద్రబాబు సైబర్ టవర్స్కు శంకుస్థాపన చేసి 1998 నవంబర్ 22న ప్రారంభించారు. సైబర్ టవర్స్, శిల్పారామాలను ఆనుకుని ఉన్న భూమిని ముందస్తు లీకులతో సొంతం చేసుకున్న మురళీమోహన్ అక్కడ జయభేరి ఎన్క్లేవ్ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. మూడు వెంచర్లు.. ఆరు కౌంటీలుగా శేరిలింగంపల్లి మండలంలో ఏర్పాటు చేయనున్న ప్రభుత్వరంగ సంస్థలు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ల వివరాలన్నీ భూసేకరణకు ముందుగానే బాబు తన బినామీలకు లీక్ చేశారు. దీంతో వారు కొనుగోలు చేసిన భూములను ఏపీఐఐసీ భూ సేకరణ నోటిఫికేషన్లోకి రాకుండా జాగ్రత్తపడ్డారు. ఆ తర్వాత జయభేరి రియల్ ఎస్టేట్ వ్యాపారం అనతికాలంలోనే మూడు వెంచర్లు, ఆరు కౌంటీలుగా వెలిగిపోయింది. గచ్చిబౌలిలో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్కు చంద్రబాబు జనవరి 2004లో శంకుస్థాపన చేశారు. అంతకుముందే గచ్చిబౌలి సర్వే న ంబర్ 55,56,57,58లలో 18 ఎకరాల భూమిని అతి తక్కువ ధరకు సొంతం చేసుకున్న మురళీమోహన్కు చెందిన పయొనీర్ ఎంటర్ ప్రైజెస్ సంస్థ, ఆ తర్వాత దాన్ని ‘జయభేరి పైన్ వ్యాలీ’ పేరుతో అభివృద్ధి చేసి విక్రయించింది. అదే పంథాలో గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ను అనుకుని ఉండే సర్వే నంబర్ 103, 105, 106,109లలో పదిహేను ఎకరాల్లో జయభేరి ఎన్క్లేవ్ పేరుతో వెంచర్ చేసి విక్రయించారు. కొండాపూర్లో జయభేరి నిర్మించిన సిలికాన్ కౌంటీ భూములు కూడా బాబు అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొనుగోలు చేసినవే. కారుచౌకగా భూములు కొట్టేసిన ‘జయభేరి’.. చివరకు విక్రయించిన భూమిని సైతం కబ్జా చేసేం దుకు వెనుకాడలేదు. తాము కొనుగోలు చేసిన స్థలాన్ని మరో సంస్థకు జయభేరి అమ్మినట్టు బండరెడ్డి మధుసూదన్ అనే బాధితుడు ఫిర్యాదు చేయడంతో మురళీమోహన్పై 420 సెక్షన్ కింద కేసు నమోదైంది. భూ సేకరణ పేరుతో భారీ దందా 2003లో చంద్రబాబు ప్రభుత్వం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కోసం నానక్రాంగూడలో భూ సేకరణ పేరుతో భారీ దందా నడిపింది. ప్రభుత్వ అవసరాల కోసం భూమిని సేకరిస్తున్నామంటూ ఏపీఐఐసీ సర్వే బృందాలను రంగంలోకి దింపి అక్కడి రైతులు, భూ యజమానుల్లో భయాందోళనలు రేకెత్తించారు. తర్వాత ఆ భూములను ఏపీఐఐసీ నోటిఫికేషన్ నుంచి మినహాయించి సొంత బావమరిది బాలకృష్ణ, ఆయన భార్య వసుంధర తదితరుల చేత చౌకగా కొనుగోలు చేయించారు. ఈ భూముల్లోనే నేడు భారీ భవంతులు లేవగా, దాన్ని ఆనుకునే జయభేరి ఆరెంజ్ కౌంటీ విస్తరించింది. ‘సైబరాబాద్’లోనూ అవినీతి సైబరాబాద్ డెవలప్మెంట్ అథారిటీ(సీడీఏ) ఏర్పాటులోనూ చంద్రబాబు అవినీతికి తెరతీశారు. ఐటీ జోన్లో మౌలిక సదుపాయాల సత్వర కల్పన కోసం జీఓ ఎస్ఎం నంబర్ 21(జనవరి 20,2001) జారీ చేసి శేరిలింగంపల్లి మునిసిపాలిటీలోని 17 గ్రామాల పరిధిలో 51.70 చదరపు కిలోమీటర్ల మేరకు సైబరాబాద్ డెవలప్మెంట్ అథారిటీ( సీడీఏ)ను విస్తరించారు. సీడీఏలో సైబర్టవర్స్కు 12 కి.మీల దూరంలో ఉన్న గోపనపల్లి మురికివాడలు, లంబాడీతండాలను చేర్చిన ప్రభుత్వం సైబర్టవర్స్ను ఆనుకుని ఉన్న కొండాపూర్ను మాత్రం మినహాయించింది. ఇక్కడ తన భార్య భువనేశ్వరి, తన బినామీ సంస్థ జయభేరితోపాటు తన బంధువుల ఆస్తులుండడమే అందుకు కారణమంటూ అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. సీడీఏ ఉత్తర్వులు వచ్చిన సమయంలో కొండాపూర్లో ఆరు ఎకరాల విస్తీర్ణంలో జయభేరి సిలికాన్ టవర్స్, మరో నాలుగు ఎకరాల్లో జయభేరి క్లబ్ నిర్మాణాలు ప్రారంభం కావడంతో డెవలప్మెంట్ చార్జీల భారాన్ని తప్పించేందుకే బాబు అలా చేశారన్న ఫిర్యాదులున్నాయి. అంతేకాక సీడీఏ ప్లాన్లో పేర్కొన్నట్టుగా దారిని 120:120 అడుగుల మేర విస్తరించాల్సి ఉన్నా తన జేబు సంస్థ జయభేరి భూములకు నష్టం కలుగుతుందన్న ఉద్దేశంతో విస్తరణను నిలిపేశారు. మురికివాడలపై ప్రతాపం హైటెక్ సిటీలో విస్తృత మౌలిక సదుపాయాల కోసం సైబరాబాద్ డెవలప్మెంట్ అథారిటీ అసలు ప్రాంతాలను వదిలేసి మురికివాడలపై తన ప్రతాపాన్ని చూపింది. సీడీఎ అమలు వల్ల నిర్మాణ చార్జీలు మూడింతలయ్యాయి. 2002 నుంచి సీడీఏ నిబంధనల ప్రకారమే నిర్మాణాలు చేపట్టాలని నిబంధన విధించారు. హైదరాబాద్ మునిసిపల్, శివారు మునిసిపాలిటీల కంటే రెట్టింపు బెటర్మెంట్ చార్జీలు వడ్డించారు. నిర్మాణాల అనుమతులకు చదరపు మీటరుకు రూ.200 అదనంగా చెల్లించాలని షరతులు విధించారు. ఇది సాధారణ ప్రజలకు పెను శాపమైంది. -
బినామీలకు చెక్
పాపన్నపేట, న్యూస్లైన్: తెలంగాణలో ప్రసిద్ధి చెందిన ఏడుపాయల దుర్గా భవానీ ఆలయం వద్ద ఈనెల 30న మాఘ అమావాస్య, ఫిబ్రవరి 27న మహాశివరాత్రి సందర్భంగా భారీ ఉత్సవాలు జరుగుతాయి. ఈ మేర కు జాతరలో వివిధ వ్యాపారాలు చేసుకునేందుకు శుక్రవారం ఏడుపాయలలో వేలం పాటలు నిర్వహించారు. మొత్తం 8 అంశాలకు వేలం పాటలు నిర్వహిం చగా, ఒడిబియ్యం రూ.6.66 లక్షలకు, ఘనపురం వైపు సైకిల్ స్టాండ్ రూ.80 వేలు, జాతర అనంతరం ఏడుపాయల్లో కొబ్బరికాయలు విక్రయించేందుకు రూ.25.26 లక్షలకు వేలం పాటలు ఖరారయ్యాయి. కాగా మిగతా వాటికి ఆశిం చిన స్థాయిలో ఆదాయం రాక పోవడం తో చైర్మన్ ప్రభాకర్రెడ్డి వేలం పాటలను ఈనెల 16వ తేదీకి వాయిదా వేశారు. జాతరలో కొబ్బరికాయలు అమ్మేందుకు గత ఏడాది రూ.14.10లక్షలు, తలనీలాలకు రూ.7.52లక్షలు, జాతరలో లడ్డు, పులిహోరా విక్రయించుకునేందుకు రూ.14.16 లక్షలు, నూనే గురుగులు విక్రయించేందుకు రూ.2.36లక్షలు, వాహనాల తైబజార్కు రూ.2.65 లక్షలు ఖరారయ్యాయి. కాగా ఈ ఏడాది కాం ట్రాక్టర్లు అంతకంటే తక్కువగా వేలం పాటలు పాడటంతో వాటిని వాయిదా వేశారు. కాంట్రాక్టర్ల కాసులాటలు గతంలో కాంట్రాక్టర్లు జాతర వేలం పాటల్లో నిబంధనలకు విరుధ్ధంగా పాల్గొంటూ లక్షల రూపాయలు పాటలు పాడి అపై దేవాదాయ శాఖకు భారీ మొత్తంలో బకాయి పడి ఎగ్గొట్టిన సంఘటనలున్నాయి. లక్షల రూపాయల బకాయిలు ఉన్నప్పటికీ తిరిగి కొత్త వ్యక్తుల పేర్లతో కాంట్రాక్ట్ పొందుతున్నారు. ఈసారి చైర్మన్ ప్రభాకర్రెడ్డి, ఈఓ వెంకటకిషన్రావులు కఠిన నిబంధనలు అమలు చేశారు. టెండర్లో పాల్గొనే కాంట్రాక్టర్లు బ్యాంకు పాస్బుక్, చెక్కుబుక్, ధరావత్, జమానత్లను సమర్పిస్తేనే వేలం పాటల్లో పాల్గొనే అవకాశం కల్పించారు. దీంతో అక్రమార్కుల ఆట లు సాగలేదు. గత సంత్సవరం స్థాయి లో వివిధ అంశాలకు సంబంధించి వేల విలువలు రాక పోవడంతో 5 అంశాలను ఈనెల 15వ తేదీకి వాయిదా వేశారు. జాతర అనంతరం విక్రయించే లడ్డు, పులిహోర ప్రసాదాలు సైతం నిబంధనలకనుగుణంగా కాంట్రాక్టర్ల నుండి తప్పించారు. కాగా జాతర సమయానికి మాత్రం ప్రసాదాన్ని కాంట్రాక్టర్లకు అప్పగించేందుకు దేవాదాయ అనుమతి కోసం ప్రతి పాదనలు పంపినట్లు చైర్మన్ ప్రభాకర్రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమం లో అసిస్టెంట్ కమిషనర్ కృష్ణ ప్రసాద్, ధర్మకర్తలు లలిత, పోచయ్య, దేవయ్య, సంజీవయ్య, పెంటయ్య, నర్సింలు, యాదయ్య, సంగమేశ్వర్, నర్సింహచారి, మాజీ జెడ్పీటీసీ మల్లప్ప, ఉద్యోగులు గోపాల్, రవికుమార్, మధుసూదన్రెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
గ్యాస్ దందా
కలెక్టరేట్, న్యూస్లైన్ : ఇంట్లో గృహావసరాలకు ఉపయోగించే రాయితీ గ్యాస్ సిలిండర్ల అక్రమ వ్యాపారం జిల్లాలో జోరుగా సాగుతోంది. ఆదిలాబాద్ పట్టణంతో పాటు వివిధ పట్టణాలకు, గ్రామీణ ప్రాంతాలకు సిలిండర్లు నల్లబజారు నుంచి తరలుతున్నాయి. పౌర సరఫరాల అధికారులు జిల్లాలోని అన్ని మున్సిపాలిటీ పరిధి ప్రాంతాల్లో ఒకేసారి దాడులు నిర్వహించినా తీరు మారడం లేదు. జిల్లాలో అధికారులు గత ఐదు నెలల్లో ఇప్పటి వరకు నాలుగు సార్లు దాడులు నిర్వహించి కేవలం 223 సిలిండర్లను మాత్రమే స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా గ్యాస్ వినియోగిస్తున్న 179 మందిపై కేసులు నమోదు చేశారు. తాజాగా సోమవా రం ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించి సిలిండర్లు స్వాధీనం చేసుకుని కేసు లు నమోదు చేశారు. గ్యాస్ వినియోగదారులకు ఏడాదికి సరిపడా తొమ్మిది గ్యాస్ సిలిండర్లను మాత్రమే సరఫరా చేసేలా కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఇదే అదునుగా భావించి అక్రమార్కులు రాయితీ గ్యాస్ సిలిండర్లను అధిక ధరలకు అమ్ముకుంటున్నారు. పలుచోట్ల గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుల అండతో వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది. బినామీ పేర్లతో గ్యాస్ కనెక్షన్లు పొందిన వారూ ఉన్నారు. కొత్తగా వచ్చిన నగదు బదిలీ పథకంలో ఆధార్, బ్యాంకు ఖాతాలను అనుసంధానం చేసిన అధికారులు తనిఖీలు చేసినప్పుడల్లా అక్రమంగా వినియోగిస్తున్న సిలిండర్లు బయటకు వస్తున్నాయి. 75 వేలకుపైగా బోగస్.. జిల్లాలో ప్రస్తుతం 3,30,747 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో దీపం కనెక్షన్లు 1,29,600 ఉన్నాయి. ఒక్కో వినియోగదారునికి తొమ్మిది సిలిండర్లు సరఫరా చేసి సిలిండర్ల రాయితీని ప్రభుత్వం నేరుగా గ్యాస్ వినియోగదారుని బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. దీని వల్ల రాయితీ సిలిండర్ల అక్రమ వ్యాపారం అరికట్టవచ్చన్నది ప్రభుత్వం ఉద్దేశం. కానీ ప్రభుత్వం ప్రకటించిన విధానంలో లోపాలను వెతికి అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జూలై నెలలో చూస్తే జిల్లాలో 4.15 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. అప్పటి నుంచి ఆధార్, బ్యాంకు ఖాతా అనుసంధానం చేయడం వల్ల 75 వేలకుపైగా కనెక్షన్లు బోగస్గా గుర్తించబడ్డాయి. ఇందులో దీపం కనెక్షన్లు కూడా ఉన్నాయి. గ్రామీణా ప్రాంతాల్లో దీపం పథకం కింద మంజూరు చేయబడిన వారు గృహా అవసరాలకు వినియోగించకుండా వేరే వ్యక్తులకు అమ్ముకున్నారు. దీనికితోడు ఒకరి పేరు మీదా దీపం గ్యాస్ కనెక్షన్ మంజూరైతే సదరు వ్యక్తులకు గ్యాస్ సిలిండర్ ఇచ్చారు. దీంతో ఆ గ్యాస్ కనెక్షన్లు సైతం బోగస్గా గుర్తించడం జరిగింది. దాడులు ముమ్మరం చేస్తాం.. - వసంత్రావు దేశ్పాండే, డీఎస్వో, ఆదిలాబాద్ గృహావసరాలకు వినియోగించే రాయితీ గ్యాస్ సిలిండర్లను కమర్షియల్కు వినియోగించిన వారిపై చర్యలు తీసుకుంటాం. అన్ని ప్రాంతాల్లో అధికారులతో దాడులు నిర్వహిస్తాం. ముమ్మరంగా తనిఖీ చేసి దొరికిన వారిపై కేసులు నమోదు చేస్తాం. హోటళ్లలో, ఇతర వాటికోసం వినియోగిస్తున్న రాయితీ సిలిండర్లు ఇప్పటికే కొన్ని స్వాధీనం చేసుకున్నాం. -
బినామీ లెక్కలేవీ బాబూ: వినోద్ ప్రశ్న
సాక్షి, హైదరాబాద్: బినామీల పేర్ల మీదున్న ఆస్తుల వివరాలు చెప్పకుండా అవే పాత లెక్కలను చంద్రబాబునాయుడు చెప్తానంటే ప్రజలు నవ్వుకుంటున్నారని మాజీ ఎంపీ, టీఆర్ఎస్ పొలిట్బ్యూరో సభ్యుడు బి.వినోద్కుమార్ ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో పోటీచేసిన వారందరి ఆస్తుల వివరాలు వెబ్సైట్లలో ఉన్నాయన్నారు. కుటుంబసభ్యుల ఆస్తుల వివరాలు సహా ఏవైనా తప్పు చెప్తే అనర్హతకు గురౌతారని కూడా ఎన్నికల సంఘం చెప్తోందని వివరించారు. ఆస్తులను చంద్రబాబు ఒక్కరే ప్రకటించినట్టు, మిగిలినవారూ ప్రకటించాలని సవాల్ విసరడం అందరికీ నవ్వు తెప్పిస్తోందని వినోద్కుమార్ అన్నారు. చంద్రబాబు చెప్పిం దాంట్లో కొత్తేమీ లేదన్నారు. బినామీ ఆస్తుల వివరాలను కూడా చంద్రబాబుకు దమ్ముంటే వెల్లడించాలని ఆయన సవాల్ చేశారు.