biodiversity
-
అంతరిక్షంలో జీవం ‘పురుడు’ పోసుకుంది!
న్యూఢిల్లీ: కొన్నేళ్లుగా అంతరిక్షంలో అద్భుతాలతో ప్రపంచాన్ని అబ్బురపరుస్తున్న ఇస్రో మరో ఘనత సాధించింది. అంతరిక్షంలో జీవసృష్టి చేసి చూపించింది. స్పేడెక్స్ మిషన్లో భాగంగా పీఎస్ఎల్వీ–సి60 ఆర్బిటాల్ ఎక్స్పెరిమెంట్ మాడ్యూల్ (పోయెమ్–4) ద్వారా డిసెంబర్ 30న అంతరిక్షంలోకి పంపిన అలసంద విత్తనాలు కేవలం 4 రోజుల్లోనే మొలకెత్తాయి! కాంపాక్ట్ రీసెర్చ్ మాడ్యూల్ ఫర్ ఆర్బిటాల్ ప్లాంట్ స్టడీస్ (సీఆర్ఓపీఎస్) టెక్నాలజీ ద్వారా ఈ ప్రయోగాన్ని ఇస్రో విజయవంతంగా నిర్వహించింది. సూక్ష్మ గురుత్వాకర్షణ పరిస్థితుల్లో విత్తనాల అంకుర, మనుగడ ప్రక్రియను అధ్యయనానికి ఉద్దేశించిన ఆటోమేటెడ్ వ్యవస్థ అయిన సీఆర్ఓపీఎస్ పేలోడ్ను విక్రం సారాబాయ్ అంతరిక్ష కేంద్రం అభివృద్ధి చేసింది. ఇందులో భాగంగా ఎనిమిది అలసంద విత్తనాలను నియంత్రిత వాతావరణంతో కూడిన బాక్సులో ఉంచారు. వాటికి నిరంతరం కచ్చితత్వంతో కూడిన వెలుతురు అందేలా జాగ్రత్త తీసుకున్నారు. విత్తనాల్లో జరుగుతున్న మార్పుచేర్పులను అత్యంత హై రిజల్యూషన్తో కూడిన కెమెరా ఇమేజింగ్, ఉష్ణోగ్రత, సీఓటూ సాంద్రత, ఆర్ద్రత వంటివాటి తనిఖీ తదితరాల ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వచ్చారు. నాలుగు రోజుల్లోనే విత్తనాలు మొలకెత్తడంతో సైంటిస్టులు ఆనందోత్సాహాల్లో తేలిపోతున్నారు. ‘‘అంతరిక్షంలో జీవం పురుడు పోసుకుంది. ప్రయోగం విజయవంతమైంది. విత్తనాలు విజయవంతంగా మొలకెత్తాయి’’ అంటూ ఇస్రో హర్షం వెలిబుచి్చంది. ‘‘త్వరలో వాటికి ఆకులు కూడా రానున్నాయి. అంతరిక్ష అన్వేషణ యాత్రలో అదో కీలక మైలురాయిగా నిలవనుంది’’అంటూ ఎక్స్లో పోస్ట్ చేసింది.స్పేడెక్స్ నుంచి పుడమి ఫొటోలు స్పేడెక్స్ జంట ఉపగ్రహాల్లో ఒకటైన చేజర్ భూమిని తొలిసారి ఫొటోలు, వీడియోలు తీసింది. దాన్ని ఇస్రో శనివారం విడుదల చేసింది. చేజర్ 470 కి.మీ. ఎత్తున దిగువ కక్ష్యలో పరిభ్రమిస్తూ తీసిన ఈ వీడియోలో భూమి అత్యంత అందంగా కని్పస్తోంది. ఉపగ్రహం తాలూకు అత్యంత అధునాతనమైన ఇమేజింగ్ సామర్థ్యంతో పాటు అత్యంత కీలకమైన తదుపరి దశ పరీక్షలకు దాని సన్నద్ధతకు ఈ వీడియో నిదర్శనమని ఇస్రో ఒక ప్రకటనలో పేర్కొంది. త్వరలో కీలక డాకింగ్ (ఉపగ్రహాల అనుసంధాన) పరీక్షకు చేజర్, టార్గెట్ శాటిలైట్లు సన్నద్ధమవుతున్నాయి. వీలైతే దాన్ని జనవరి 7న నిర్వహిస్తామని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ ప్రకటించడం తెలిసిందే. ఈ పరీక్ష విజయవంతమైతే డాకింగ్ పరిజ్ఞానమున్న అమెరికా, రష్యా, చైనాల సరసన భారత్ సగర్వంగా చేరుతుంది. గగన్యాన్ మొదలుకుని పలు భావి అంతరిక్ష పరీక్షలకు డాకింగ్ పరిజ్ఞానం కీలకం కానుంది. -
లంకమల.. జీవ వైవిధ్యంతో కళకళ
లంకమల అభయారణ్యం జీవ వైవిధ్యానికి ప్రతీకగా నిలుస్తోంది. ఏపుగా పెరిగిన ఎర్రచందనం చెట్లు ప్రత్యేకత చాటుకోగా.. వివిధ రకాల పక్షులు, జంతువులు.. పలు రకాలైన వృక్షాలు, మొక్కలు, రంగురంగుల పుష్పాలు.. ముఖ్యంగా ఔషధ గుణాలు కలిగిన వన మూలికలు ఈ అభయారణ్యంలో ఉన్నాయి. ఇక వానాకాలంలో లంకమల్లేశ్వరుని కోనలో జలపాత హొయలు పర్యాటకులను పరవశింపజేస్తుంది. సిద్దవటం : అన్నమయ్య జిల్లాలోని లంకమల అభయారణ్యం ఎంతో ప్రత్యేకమైనది.. సుమారు 46,442 .8 హెక్టార్లలో విస్తరించి జీవ వైవిధ్యాన్ని చాటుతోంది. సుమారు 300 పైగా పక్షుజాతులు, వన్య మృగాలకు ఆవాసంగా ఉంది. ఇక పక్షుల జాతుల్లో చాలా అరుదైన పక్షి జాతి నీలి నల్లంచి ఇక్కడి ప్రత్యేకతగా చెప్పక తప్పదు. 1986వ సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన కలివి కోడి కూడా లంకమల అభయారణ్యంలో అప్పట్లో కనిపించడం కూడా విశేషంగా చెప్పు కోవచ్చు. కలివి కోడిని పోలిన పక్షిగా రాతికాలేడు, ఎర్రచిలుక కూడా ఈ అరణ్యంలో ఉన్నాయి. లంకమల అభయారణ్యంలో అరుదైన పక్షుల్లో బంగారు రొమ్ము ఆకుపిట్ట, ఎర్రగొంతు ఈకపట్ల పిట్ట, నీల ఈక పట్ల పిట్ట, తోక నల్లంచి, పెద్ద ఆకురాయి, గిజిగాడు పిట్ట, చారల గొంతు వడ్రంగి పిట్ట, వర్ణడేగా, అడవి రామదాసు, బుడమాలి గద్ద, జాలిడేగా, నీటి కాకి, తెరభిముక్కు కొంగ, నల్ల గద్ద, తోకపిగిలి పిట్ట, నల్ల తల వంగ పండు, ఎర్రగువ్వ, కుందేలు సాలువ, పచ్చగువ్వ తదితర పక్షి జాతులు లంకమల అభయారణ్యంలో కిలకిలా రావాలతో సందడి చేస్తున్నాయి. లంకమలలో పెరిగిన వన్యప్రాణులు లంకమల అభయారణ్యంలో వన్యప్రాణుల సంతతి క్రమంగా పెరుగుతోందని అధికారులు అంటున్నారు. సహజసిద్దంగా ఉండే పచ్చిక మైదానాల్లో తిరుగుతూ అవి ఆకలిని తీర్చుకుంటున్నాయి. అడవుల్లో ఎక్కువ గా వన్యప్రాణులు తిరిగే ప్రదేశాల్లో అటవీ అధికారులు కెమెరాలను కూడా అమర్చారు. పలు కెమెరాల్లో అడవి జంతువులు కణితిలు, అడవి కుక్కలు, ఎలుగుబంట్లు, పొడదుప్పిల చిత్రాలు నిక్షిప్తంగా ఉన్నాయి. ఒకప్పుడు తక్కువగా ఉండే చిరుత పులుల సంఖ్య ఇప్పుడు పెరిగినట్లు అధికారులు గుర్తించారు. అటవీ ప్రాంతాల్లో నీరు లభించక జింకలు, దుప్పులు, ఎలుగు బంట్లు, చిరుత పులులు సమీప గ్రామాల్లోకి వచ్చి దాహం తీర్చుకునేందుకు వచ్చేవి. అడవి జంతువుల సంచారంలో గ్రామీణ ప్రజలు భయబ్రాంతులకు గురయ్యేవారు. వన్య ప్రాణుల దాహార్తిని తీర్చేందుకు అటవీ అధికారులు అడవిలోనే పలు ప్రాంతాలలో సాసర్ ఫీట్లు, నీటి ట్యాంకులను ఏర్పాటు చేశారు.అరుదైన వన మూలికలు లంకమల అభయారణ్యంలో పక్షులు, వన్య మృగాలతో పాటు, వన మూలికలకు ప్రసిద్ధి గాంచింది. నన్నారి షరబత్కు ఉపయోగించే సుగంది వేర్లు, సార పప్పు, ఉసిరి, నేరేడు, ఏనుగు కుందేలు చెట్టు, అతిపత్తి చెట్టు, మగలింగచెట్టు, ఇప్ప చెట్టు ఇలా ఔషధ గుణాలు కలిగిన మొక్కలు ఇక్కడి అడవిలో ఎన్నో రకాలు ఉన్నాయి. అంతే గాకుండా పాలగడ్డలు, మగసిరి గడ్డలు, పాము కాటు విరుగుడుకు వాడే తెల్లీశ్వరి, నల్లీశ్వరి, నాగముష్టి, విషనాభి చెట్టు, ప్రపంచంలో అత్యంత విలువైన ఎర్రచందనం , భూచక్రగడ్డ తోపాటు జిగురు వంటివి లంకమల అభయారణ్యంలో లభించడం విశేషంగా చెప్పుకోవచ్చు. కపర్థీశ్వరుని కోన, శ్రీ నిత్యపూజ స్వామి కోన, శ్రీ లంకమలేశ్వర స్వామి ఆలయం, కొండ గోపాలస్వామి ఆలయాలతోపాటు నీటి గుండాలు, గలగలా పారే సెలయేర్లు వంటివి కూడా ఈ అరణ్యంలో ఉన్నాయి. -
తేలియాడే రెస్టారెంట్లు.. రూఫ్టాప్ గార్డెన్లు
(సియోల్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) ఒకప్పుడు మురికికూపంగా ఉన్న హాన్ నదిని మూడు దశల్లో అభివృద్ధి చేయాలని 2008లో నిర్ణయించిన దక్షిణ కొరియా ప్రభుత్వం తొలిదశలో నీటిశుద్ధితోపాటు పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దింది. స్థానికులతోపాటు విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు నదిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసింది. నదికి ఇరువైపులా తేలియాడే రెస్టారెంట్లు, రూఫ్టాప్ గార్డెన్లు, కేఫటేరియాలు, 40కిపైగా షాపింగ్ కాంప్లెక్స్లు, యాంఫీ థియేటర్లను నిర్మించింది.పిల్లలంతా ఆహ్లాదంగా గడిపేందుకు వీలుగా 15 పార్క్లను అభివృద్ధి చేసింది. 78 కి.మీ. మేర సైకిల్ ట్రాక్లు, బైక్ పాత్లను ఏర్పాటు చేసింది. నదిలో జీవవైవిధ్యం దెబ్బతినకుండానే ఈ చర్యలన్నీ చేపట్టింది. దీంతో స్థానిక ప్రజలతోపాటు విదేశీ పర్యాటకులను ఆకర్షించే హాట్స్పాట్గా హాన్ నది మారింది. నదిలో బోటింగ్, నదీ తీరం వెంబడి సైక్లింగ్, వాకింగ్ ట్రాక్స్, పార్క్లతో నిత్యం సందర్శకులతో ఆ ప్రాంతమంతా కిటకిటలాడుతోంది. ప్రస్తుతం ఏటా సగటున 6.69 కోట్ల మంది పర్యాటకులు హాన్ నదిని సందర్శిస్తున్నారు.తాగునీటి అవసరాలు సైతం తీరుస్తూ..దక్షిణ కొరియాలోని సియోల్ నగరవాసుల తాగునీటి అవసరాలను హాన్ నదే తీరుస్తోంది. హైదరాబాద్ జంటనగరవాసుల దాహార్తిని గతంలో ఎలాగైతే మూసీ తీర్చిందో.. అచ్చం అలాగే హాన్ నది సియోల్ ప్రజలకు జీవనదిగా మారింది. స్వచ్ఛమైన మంచినీటిని సియోల్వాసులకు అందించేందుకు హాన్ నది పరీవాహక ప్రాంత పరిధిలో నాలుగు చోట్ల నీటి ఫిల్టరేషన్ కేంద్రాలను అక్కడి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నదిలోని నీటి నాణ్యత మెరుగ్గా ఉందని ఐరాస సైతం గుర్తించింది. -
Climate change 2024: గతి తప్పుతున్న రుతుపవనాలు
వాతావరణ మార్పులు. భూమిపై జీవుల మనుగడకే సవాలు విసురుతున్న విపరిణామం. ప్రధానంగా వర్షపాతం, ఉష్ణోగ్రతలపై వాతావరణ మార్పులు తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. భారత్లో ఈ ఏడాది రుతుపవనాల సీజన్పై వీటి ప్రభావం ఎలా ఉందన్న దానిపై క్లైమేట్ ట్రెండ్స్ సంస్థ సమగ్ర అధ్యయనం చేసింది. రుతపవనాల సీజన్లో స్పష్టమైన మార్పులు కనిపించినట్లు తేల్చింది. వాతావరణ మార్పులు వర్షాల గతినే పూర్తిగా మార్చేస్తున్నట్లు వెల్లడైంది. సాధారణ వర్షాలు పడాల్సిన సమయంలో అతి భారీ వర్షాలు, కొన్నిచోట్ల అసలు వర్షాలే లేకపోవడం వంటి విపరీత పరిణామాలకు వాతావరణ మార్పుల ప్రభావమే కారణమని పరిశోధకులు చెబుతున్నారు. → దేశవ్యాప్తంగా 729 జిల్లాల్లో క్లైమేట్ ట్రెండ్స్ సంస్థ అధ్యయనం నిర్వహించింది. 2024 రుతుపవనాల సీజన్లో ఆయా జిల్లాల్లో నమోదైన వర్షపాతంలో వైవిధ్యం కనిపించింది. → 340 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. → 158 జిల్లాల్లో భారీ వర్షాలు, 48 జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిశాయి. మరోవైపు 178 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. వీటిలో 11 జిల్లాల్లో అత్యంత లోటు వర్షపాతం నమోదైంది. → గత ఐదేళ్లలో చూస్తే ఈ ఏడాది తక్కువ సమయంలో అత్యధిక వర్షం కురిసిన సందర్భాలు అధికంగా ఉన్నాయి. వర్షపాతంలో మార్పులతో ఈ పరిస్థితి తలెత్తింది. ఇది ఇందోళనకర పరిణామం అని చెబుతున్నారు. దీనివల్ల వరదలు, తద్వారా ఆస్తినష్టం, ప్రాణనష్టం వాటిల్లుతుందని అంటున్నారు. → ఈ ఏడాది ఆగస్టులో దేశవ్యాప్తంగా 753 వాతావరణ కేంద్రాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. 2020 తర్వాత ఇదే అత్యధికం. → భూమి ఉపరితలం, సముద్రాల ఉష్ణోగ్రతల్లో మధ్య వ్యత్యాసాలు రుతుపవనాలను ప్రభావితం చేస్తుంటాయి. సముద్రాలతో పోలిస్తే భూమిపై ఉష్ణోగ్రతలు వేగంగా మారుతుంటాయి. వాతావరణ మార్పులు, భూతాపం కారణంగా భూమి క్రమంగా వేడెక్కుతుండడంతో రుతుపవనాలు సైతం గతి తప్పుతున్నాయి. గత పదేళ్లలో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. → 2023లో దేశంలో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. 2024లో మాత్రం సాధారణం కంటే అధిక వర్షాలు కురిశాయి. భూమిపై సగటు ఉష్ణోగ్రతల పెరుగుదల వల్ల రుతుపవనాల్లో ప్రతికూల మార్పు మొదలైందని క్లైమేట్ ట్రెండ్స్ వ్యవస్థాపకురాలు, డైరెక్టర్ ఆర్తి ఖోస్లా చెప్పారు. → వ్యవసాయం, నీటి సరఫరా, పర్యావరణ సమతుల్యతకు రుతుపవనాలే అత్యంత కీలకం. కోట్లాది మంది ప్రజల జీవితాలు రుతుపవనాలపై ఆధారపడి ఉన్నాయి. రుతుపవనాలు పూర్తిగా గతి తప్పితే ఊహించని పరిణామాలు ఎదురవుతాయని పరిశోధకులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అందుకే వాతవరణ మార్పులను అరికట్టాలని, పర్యావరణ పరిరక్షణపై తక్షణమే దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మన జీవ వైవిధ్యం భేష్
సాక్షి, హైదరాబాద్: పెరిగిన జంతుజాలం, వృక్షజాలంతో రాష్ట్రంలో జీవ వైవిధ్యత అలరారుతోంది. అటవీ ప్రాంతాల్లో వివిధ రకాల జంతువుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్టుగా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలో మొత్తం 12 రక్షిత అటవీ ప్రాంతాలు (7 శాంక్చురీలు, 2 టైగర్ రిజర్వ్లు, 3 జాతీయ పార్కులు) ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం 26,903 చ.కి.మీ పరిధిలో అటవీ ప్రాంతం విస్తరించి ఉండగా, 5,693 చ.కి.మీ.లో (21.16 శాతం) రక్షిత ప్రాంతాలున్నాయి. ప్రతీ రెండేళ్లకోసారి ఆయా రక్షిత ప్రాంతాలు, శాంక్చురీలు, టైగర్ రిజర్వ్లు, నేషనల్ పార్కుల్లో జంతు, వృక్ష జాతులపై అధ్యయనం నిర్వహిస్తున్నారు.అటవీ ప్రాంతాల పరిధిలో చిరుతలు, అడవి దున్నలు, అడవి కుక్కలు, నక్కలు, జింకలు, దుప్పులు తదితర రకాల వన్యప్రాణులు సందడి చేస్తున్నాయి. కెమెరాట్రాపుల్లో వీటి కదలికలు తాజాగా రికార్డ్ కావడం, వీటి సంఖ్య పెరిగిన ఆనవాళ్లు కనిపించడం పట్ల అటవీశాఖ అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అన్నిరకాల అనుకూల పరిస్థితులు, మెరుగైన సౌకర్యాలతో క వ్వాల్ టైగర్ రిజర్వ్ వన్యప్రాణుల వైవిధ్య కేంద్రంగా నిలుస్తోంది. పొరుగున ఉన్న మహారాష్ట్ర నుంచి పులుల సంచారం పెరిగినా, ఇక్కడ అనుకూల పరిస్థితులున్నా అవి ఇంకా స్థిరనివాసం ఏర్పరచుకోకపోవడం మాత్రం సవాల్గానే మారింది. మహారాష్ట్ర తడోబా నుంచి నేరుగా పులులు వచ్చేందుకు జాతీయ రహదారితోపాటు రైల్వేకారిడార్ ఉండడం, కొన్నిచోట్ల ఆక్రమణలతో కొంత అంతరాయం ఏర్పడుతోందని చెబుతున్నారు. టైగర్ కన్జర్వేషన్ సొసైటీ పరిశీలనలో... ఇటీవల హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ ఆధ్వర్యంలో కవ్వాల్లోని ప్రధాన (కోర్), పొరు గు ప్రాంతాల నుంచి జంతువులు రాకపోకలు సాగించే (బఫర్) ఏరియాల్లో జంతువుల సంఖ్య పై అధ్యయనం నిర్వహించారు. కవ్వాల్లో పులుల అభయారణ్యం ఏ మేరకు సరిపోయేటట్టు ఉంది, ఏయే రకాల మాంసాహార, శాఖాహార జంతువులు ఉన్నాయనే దానిపై దృష్టి కేంద్రీకరించారు. బఫర్ ఏరియాలోని కాగజ్నగర్, చెన్నూరు, ఆదిలాబాద్ డివిజన్లలో అనేక పులి పాదముద్రలను గుర్తించారు. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ వైల్డ్లైఫ్ శాంక్చురీ నుంచి ప్రాణహిత, పెన్గంగ నదు లను దాటి తడోబా అంథారి టైగర్ రిజర్వ్ నుంచి పులుల సంచారం ఎక్కువగా ఉన్నట్లు నిర్ధారించా రు. కవ్వాల్ ప్రధాన అటవీ ప్రాంతంలో చిరుత లు, అడవికుక్కలు, ఎలుగుబంట్లు ఇతర జంతువు లు కనిపించాయి. తాళ్లపేట, ఇంథన్ పల్లిలో కృష్ణజింకలను అధికసంఖ్యలో గుర్తించారు. అడవి దున్న, అడవి పంది, నీల్గాయ్, సాంబారు, మచ్చలజింక, చౌసింగ వంటి శాఖాహార జంతువులను కూడా గుర్తించారు. నీల్గాయ్లు, అడవి పందుల జనాభా అటవీ ప్రాంతమంతా విస్తరించి ఉండగా, సాంబార్ జింకలు కొండ ప్రాంతాల్లో ఉన్న ట్టు గుర్తించారు. అయితే, ఈ అధ్యయనానికి సంబంధించి ఇంకా తుది నివేదిక రూపొందించలేదు. ఇది తయారయ్యాకే ఆయా రకాల జంతువుల సంఖ్యపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశముంది. 2,254 చ.కి.మీ. సర్వే చేశాం అధ్యయనంలో భాగంగా ఆదిలాబాద్, కాగజ్నగర్, నిర్మల్, జన్నారం, చెన్నూ రు, మంచిర్యాలను కవర్ చేశాం. మొత్తం 2,254.35 చ.కి.మీ మేర కవర్ అయ్యింది. ఆదిలాబాద్, కాగజ్నగర్–చెన్నూరు సరిహద్దు లో పులుల ఉనికి గుర్తించాం. ఆదిలాబాద్, కాగజ్నగర్, జన్నారంలలో ఎలుగుబంట్లు, చిరుతలు, థోల్ తదితర జంతువులు కనిపించాయి. జన్నారంలో అడవి గొర్రెలు, సాంబార్ జింకలు, చెన్నూ రు, కాగజ్నగర్, ఆదిలాబాద్లో నీల్గాయ్లు పెద్దసంఖ్యలో కనిపించాయి. వర్షాకాలం తర్వాత ఆసిఫాబాద్లో మళ్లీ సర్వే చేయాలని భావిస్తున్నాం. –ఇమ్రాన్ సిద్ది్దఖీ, డైరెక్టర్, హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ -
ప్రకృతి హితం.. మన అభిమతం
సాక్షి, అమరావతి: భావితరాలకు స్వచ్ఛమైన భూమి, గాలి, నీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక విప్లవాత్మక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. కేంద్ర ప్రభుత్వం, అంతర్జాతీయ సంస్థలు చేపట్టే పర్యావరణ హిత కార్యక్రమాల్లోను భాగమవుతోంది. పర్యావరణ హితం.. తమ అభిమతం.. అని చాటుతోంది. ‘పుడమి సేవలో పరిశ్రమిస్తూ.. కాలుష్యాన్ని ప్రతిఘటిస్తూ.. పచ్చదనం పెంచుకుంటే.. ప్రకృతిని కాపాడుకుంటే.. మనిషికి అదే మనుగడ.. జీవకోటికదే తోడూ.. నీడ’ అంటూ ఈ ప్రయత్నంలో ‘భాగస్వామ్యం కండి’ అనే నినాదాన్ని విశ్వవ్యాప్తం చేస్తూ మే 22న అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం నిర్వహిస్తున్నారు. సకల జీవులకు నిలయమైన ఈ భూమిని రక్షించే ఉమ్మడి కార్యాచరణలో మన దేశంతోపాటు మన రాష్ట్రం సైతం పాలుపంచుకుంటోంది. ఈ పవిత్రయజ్ఞంలో భాగంగా 2028నాటికి పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం వ్యక్తిగత, సామూహిక చర్యలు తీసుకోవడానికి కనీసం ఒక బిలియన్ మంది భారతీయులు, ఇతర ప్రపంచ పౌరులను సమీకరించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ‘మిషన్ లైఫ్’ ప్రాజెక్టులో ఏపీ భాగమవుతోంది. దీనిద్వారా రానున్న నాలుగేళ్లలో 80శాతం గ్రామ పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థలను పర్యావరణ అనుకూలమైనవిగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ బృహత్తర యజ్ఞానికి విశాఖపట్నం నుంచి ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. జీవుల మనుగడకు అనుకూల చర్యలు ప్రకృతిలో ప్రతి ప్రాణి స్వేచ్ఛగా జీవించేందుకు అనువైన వాతావరణం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూమి, పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా క్లైమేట్ చేంజ్ సెల్(ఈఈఈ)ను రూపొందించింది. ఈ సెల్ వాతావరణ మార్పులపై జాతీయ కార్యాచరణ ప్రణాళికతో సమానంగా పర్యావరణ వ్యవస్థ ఆధారిత అప్రోచ్(ఈబీఏ) ద్వారా రాష్ట్రంలో వాతావరణ మార్పుల సమస్యలను పరిష్కరిస్తుంది.ఇందులో ఆయా రంగాల నిపుణులు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు, అర్బన్ డెవలప్మెంట్, రవాణా శాఖలతోపాటు పలు ప్రభుత్వ రంగ సంస్థలకు భాగస్వామ్యం కల్పించింది. భూమి, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడం కోసం మిషన్ లైఫ్ ఎనర్జీ కన్జర్వేషన్, వాటర్ కన్జర్వేషన్, సే నో టు సింగిల్ యూజ్ ప్లాస్టిక్, అడాప్షన్ ఆఫ్ సస్టెయినబుల్ ఫుడ్ సిస్టమ్స్, వేస్ట్ రిడక్షన్, హెల్తీ లైఫ్ స్టైల్స్, ఈ–వేస్ట్ తగ్గింపు అనే ఏడు విభాగాల్లో 75 కార్యక్రమాలను మన రాష్ట్రంలో అమలుచేస్తున్నారు. అదేవిధంగా కాలుష్యాన్ని తగ్గించడం కోసం స్థానికంగా లైఫ్ గ్రూపులను ఏర్పాటుచేశారు. సైకిల్ ర్యాలీలు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్లపై స్పెషల్ డ్రైవ్లు, సోషల్ మీడియాలో ప్రచారం, కమ్యూనిటీ వర్క్షాపులు, సెమినార్లు, క్విజ్ ప్రోగ్రామ్లను నిర్వహిస్తున్నారు. కాలుష్య కారక వాహనాలను అరికట్టడం కోసం ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్లను చేపడుతున్నారు. పాఠశాలల్లో ఎనర్జీ క్లబ్ల ఏర్పాటు ద్వారా భూమి పరిరక్షణ ఆవశ్యకతపై చైతన్యం తీసుకువస్తున్నారు. విశాఖలో లైఫ్ మిషన్ అమలుపర్యావరణ హిత జీవనశైలిని అనుసరించేలా ప్రజలను ప్రోత్సహించడమే లక్ష్యంగా మొదలైన లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ పథకం అమలుకు రాష్ట్రంలోని సముద్ర తీరప్రాంతంలో ఉన్న విశాఖ నగరం అనుకూలమని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ(బీఈఈ) గుర్తించింది. దేశవ్యాప్తంగా 2028 నాటికి 5.15 లక్షల గ్రామాలు, 3,700 పట్టణ స్థానిక సంస్థల్లోని కోటి మంది ప్రజలను ‘ప్రో ప్లానెట్ పీపుల్’గా మార్చాలనేది లైఫ్ మిషన్ లక్ష్యం. పుడమి, జీవ పరిరక్షణ కోసం చేపట్టిన ఈ పథకాన్ని విశాఖలో అమలు చేయనున్నట్లు బీఈఈ ఇటీవల ప్రకటించింది. విశాఖతోపాటు విజయవాడ, కాకినాడ, కర్నూలు, తిరుపతి నగరాలపై కూడా రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు బీఈఈ వెల్లడించింది. లైఫ్ మిషన్ అమలుకు బీఈఈ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో దశలవారీ కార్యాచరణ రూపొందిస్తోంది. -
Living Planet Index: ఐదో వంతు జీవ జాతులు... అంతరించే ముప్పు
ప్రపంచవ్యాప్తంగా పలు కారణాలతో ఏటా వలస బాట పట్టే అసంఖ్యాక జీవ జాతులపై తొలిసారిగా సమగ్ర అధ్యయనానికి ఐక్యరాజ్యసమితి తెర తీసింది. ఇందులో భాగంగా 1997 ఐరాస ఒప్పందం ప్రకారం రక్షిత జాబితాలో చేర్చిన 1,189 జీవ జాతులను లోతుగా పరిశీలించారు. పరిశోధనలో తేలిన అంశాలను 5,000 పై చిలుకు జీవ జాతుల తీరుతెన్నులను 50 ఏళ్లుగా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్), లివింగ్ ప్లానెట్ ఇండెక్స్ సంస్థల గణాంకాల సాయంతో విశ్లేíÙంచారు. విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. 22 శాతం జీవ జాతులు అతి త్వరలో పూర్తిగా అంతరించనున్నట్టు తేలింది. మొత్తమ్మీద 44 శాతం జీవ జాతుల సంఖ్య నిలకడగా తగ్గుముఖం పడుతూ వస్తున్నట్టు వెల్లడైంది. ఈ వివరాలతో కూడిన తాజా నివేదికను ఐరాస ఇటీవలే విడుదల చేసింది. ‘‘ప్రపంచవ్యాప్తంగా ఏకంగా ఐదో వంతు వలస జీవజాతులు అంతరించే ప్రమాదంలో పడ్డాయి. జీవజాతుల వలసలు కొత్తగా మొదలైనవి కావు. అనాదిగా భూమ్మీదా, సముద్రంలోనూ అత్యంత కఠినతరమైన, భిన్న వాతావరణ పరిస్థితుల గుండా ఏటా వందల కోట్ల సంఖ్యలో సాగుతుంటాయి. ఇన్నేళ్లలో ఏనాడూ లేని ముప్పు ఇప్పుడే వచ్చి పడటానికి ప్రధాన కారణం మానవ జోక్యం, తత్ఫలితంగా జరుగుతున్న వాతావరణ మార్పులు, సాగుతున్న పర్యావరణ విధ్వంసమే’’ అని తేలి్చంది. ఇప్పటికైనా కళ్లు తెరిచి నష్ట నివారణ చర్యలు చేపట్టాల్సిన అవసరముందని ఐరాస వలస జాతుల సంరక్షణ సదస్సు కార్యదర్శి అమీ ఫ్రాంకెల్ అన్నారు. గత వారం ఉబ్జెకిస్తాన్లోని సమర్ఖండ్లో జరిగిన సదస్సు భేటీలో ఈ అంశాన్నే ఆయన నొక్కిచెప్పారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా 30 శాతం భూ, సముద్ర భాగాల సమగ్ర పరిరక్షణకు కృషి చేస్తామంటూ 2022 గ్లోబల్ బయో డైవర్సిటీ సమిట్లో పాల్గొన్న దేశాలు ప్రతిజ్ఞ చేశాయి. దాన్ని నెరవేర్చాల్సిన సమయం వచ్చింది’’ అన్నారు. ప్రమాదపుటంచుల్లో... 1979 ఐరాస రక్షిత జాబితాలోని 1,189 జీవ జాతులను నివేదిక లోతుగా పరిశీలించింది. అనంతరం ఏం చెప్పిందంటే... ► ప్రపంచవ్యాప్తంగా 44 శాతం వలస జీవ జాతుల సంఖ్య నానాటికీ భారీగా తగ్గుముఖం పడుతోంది. ► 22 శాతం అతి త్వరలో అంతరించేలా ఉన్నాయి. మొత్తమ్మీద ఐదో వంతు అంతరించే ముప్పు జాబితాలో ఉన్నాయి. ► ఇది జీవవైవిధ్యానికి తీవ్ర విఘాతం. మన జీవనాధారాలపైనా, మొత్తంగా ఆహార భద్రతపైనా పెను ప్రభావం చూపగల పరిణామం. ► ఆవాస ప్రాంతాలు శరవేగంగా అంతరిస్తుండటం మూడొంతుల జీవుల మనుగడకు మరణశాసనం రాస్తోంది. ► జంతువులు, చేపల వంటివాటిని విచ్చలవిడిగా వేటాడటం కూడా ఆయా జాతుల మనుగడను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ► కార్చిచ్చులు, గ్లోబల్ వారి్మంగ్ వంటివి ఇందుకు తోడవుతున్నాయి. ► భారీ డ్యాములు, గాలి మరలకు తోడు ఆకస్మిక వరదలు, అకాల క్షామాలు తదితరాల వల్ల వలస దారులు మూసుకుపోవడం, మారిపోవడం జరుగుతోంది. ఇది పలు జీవ జాతులను అయోమయపరుస్తోంది. ఏం చేయాలి? తక్షణం వలస జీవ జాతుల సంరక్షణ చర్యలకు పూనుకోవాల్సిన ఆవశ్యకతను నివేదిక నొక్కిచెప్పింది. అందుకు పలు సిఫార్సులు చేసింది... ► జీవావరణాల పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యమివ్వాలి. ► భారీ డ్యాములు తదితరాల పర్యావరణ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని తగు నష్ట నివారణ చర్యలు తీసుకోవాలి. ► ఈ అన్ని సమస్యలకూ తల్లి వేరు పర్యావరణ విధ్వంసం. కార్చిచ్చులకైనా, అకాల వరదలు, క్షామాలకైనా, గ్లోబల్ వార్మింగ్కైనా అదే ప్రధాన కారణం. కనుక దానికి వీలైనంత త్వరలో చెక్ పెట్టేందుకు దేశాలన్నీ కృషి చేయాలి. ఆహారం, పునరుత్పాదన వంటి అవసరాల నిమిత్తం వేలాది జీవ జాతులు వలస బాట పట్టడం ప్రపంచవ్యాప్తంగా అనాదిగా జరుగుతూ వస్తున్న ప్రక్రియ. పలు జంతు, పక్షి జాతులైతే కోట్ల సంఖ్యలో వలస వెళ్తుంటాయి. ఈ క్రమంలో కొన్ని పక్షి జాతులు ఏటా 10 వేల కిలోమీటర్లకు పైగా సుదీర్ఘ ప్రయాణాలు చేస్తుంటాయి! పర్యావరణ సంతులన పరిరక్షణకు కూడా ఎంతగానో దోహదపడే ప్రక్రియ ఇది. కానీ గ్లోబల్ వారి్మంగ్, వాతావరణ మార్పుల ప్రభావం జంతువులు, పక్షుల వలసపై కూడా విపరీతంగా పడుతోంది. ఈ ప్రమాదకర పరిణామంపై ఐరాస తీవ్ర ఆందోళన వెలిబుచి్చంది. దీనికి తక్షణం అడ్డుకట్ట వేయకపోతే కనీసం ఐదో వంతు వలస జీవులు అతి త్వరలో అంతరించిపోయే ప్రమాదం పొంచి ఉందని తాజా నివేదికలో హెచ్చరించింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇడ్లీ లవర్స్కు షాకింగ్ న్యూస్, జీవవైవిధ్యానికి అత్యంత ప్రమాదకారిగా
మనకెంతో ఇష్టమైన వంటకాల వల్ల జీవవైవిధ్యం దెబ్బతింటుందంటే నమ్ముతారా? లేటెస్ట్ స్టడీ ఈ భయాల్నే రేకెత్తిస్తోంది. భారతీయులు తినే పలు ఆహార పదార్థాలు జీవ వైవిధ్యానికి ముప్పు కలిగిస్తున్నాయని తాజా అధ్యయనం వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 151 వంటకాలపై జరిపిన పరిశోధనల్లో కొన్ని భారతీయ వంటకాల వల్ల జీవ వైవిధ్యానికి ఎక్కువ ముప్పు ఉన్నట్టు తేలిందట. ముఖ్యంగా ఇడ్లీ, వడ, చనా మసాలా, రాజ్మా, చపాతి సహా పలు ఆహార పదార్థాలుంటం గమనార్హం. అలాగే శాకాహారం , శాకాహార వంటకాలతో పోలిస్తే మాంసాహార వంటకాలు జీవవైవిధ్యంపై ఎక్కువ ప్రభావం చూపుతాయని అధ్యయనం చెబుతోంది. శుభవార్త ఏమిటంటే, బియ్యం , పప్పుధాన్యాల వంటకాలు అధిక స్కోర్లు ఉన్నప్పటికీ, భారత జనాభాలో ఎక్కువ భాగం శాకాహారుల కారణంగా, జీవవైవిధ్య ముప్పుకు పెద్ద ప్రమాదం లేదని పరిశోధకులు వివరించారు. బ్రెజిల్లో వాడే గొడ్డు మాంసం ,స్పెయిన్కు చెందిన రోస్ట్ లాంబ్ డిష్ , బ్రెజిల్ నుండి లెచాజో,జీవవైవిధ్యానికి అత్యధిక నష్టం కలిగించిన ఆహార పదార్థాలుగా నిలిచాయి. ఈ జాబితాలో ఇడ్లీ ఆరో స్థానంలో ఉంది. అంతేకాదు అధ్యయనం ప్రకారం ఫ్రెంచ్ ఫ్రైస్ ప్రభావం చాలా తక్కువ. ఈ లిస్ట్లో ఆలూ పరాటా 96వ స్థానంలో, దోస 103వ స్థానంలో, బోండా 109వ స్థానంలో ఉన్నాయి. భారతదేశంలో జీవవైవిధ్యంపై అపారమైన ఒత్తిడిని ఈ అధ్యయనం నొక్కి చెబుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 151 ప్రసిద్ధ వంటకాలపై నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ పరిశోధన నిర్వహించారు. పర్యావరణంపై ప్రభావం చూపించే దాదాపు 25 ప్రమాదకర ఆహారాల పదార్థాలను గుర్తించారు .యూనివర్శిటీ ఆఫ్ సింగపూర్లోని బయోలాజికల్ సైన్స్ అసోసియేట్ ప్రొఫెసర్ లూయిస్ రోమన్ కరాస్కో మాట్లాడుతూ, ప్రతి వంటకం దాని పదార్థాల ఆధారంగా జాతులు, అడవి క్షీరదాలు, పక్షులు ఉభయచరాలపై ప్రభావం చూపుతుందని చెప్పారు. -
శిలాజ ఇంధనాలకు బైబై
దుబాయ్: హరిత గృహ వాయువుల ఉద్గారానికి, తద్వారా భూతాపానికి, భూగోళంపై ప్రకృతి విపత్తులకు, జీవకోటి మనుగడకు పెనుముప్పుగా పరిణమించిన శిలాజ ఇంధనాల వాడకానికి వీడ్కోలు చెప్పే దిశగా అడుగులు వేసేందుకు దాదాపు 200 దేశాలు అంగీకారానికి వచ్చాయి. ఈ మేరకు దుబాయ్లో జరుగుతున్న ‘కాప్–28’ సదస్సులో చరిత్రాత్మక ఒప్పందానికి అన్ని దేశాలు మద్దతు పలికాయి. ‘శిలాజ ఇంధనాల వాడకం మానేద్దాం.. మార్పు సాధిద్దాం’ అంటూ ప్రతిన బూనాయి. కాప్–28 సదస్సులో బుధవారం చివరి సెషన్ జరిగింది. శిలాజ ఇంధనాలకు వ్యతిరేకంగా కీలక ఒప్పందాన్ని సభ్యదేశాల ప్రతినిధులంతా ముక్తకంఠంలో ఆమోదించారు. ఈ సందర్భంగా సభా ప్రాంగణం కరతాళ ధ్వనులతో మార్మోగింది. 2050 నాటికి నెట్జీరో(సున్నా) ఉద్గారాలే లక్ష్యంగా ఒప్పందంలో 8 సూత్రాల ప్రణాళికను జోడించారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఈ ఏడాది కాప్ సదస్సులో చెప్పుకోదగ్గ తీర్మానాలేవీ ఉండబోవన్న అనుమానాలు పటాపంచలయ్యాయి. భూగోళాన్ని కాపాడుకుంటేనే భవిష్యత్తు తరాలకు మనుగడ ఉంటుందని కాప్–28 అధ్యక్షుడు సుల్తాన్ అల్–జబేర్ తేలి్చచెప్పారు. పారిస్ ఒప్పందాన్ని పరిగణనలోకి తీసుకుంటూ, ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్కు పరిమితం చేయాలని, ఇందుకోసం ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా పని చేయాలని, పటిష్టమైన, నిర్మాణాత్మక చర్యలకు శ్రీకారం చుట్టాలని కాప్–28 సదస్సు పిలుపునిచ్చింది. ప్రమాదకరమైన గ్రీన్హౌస్ వాయువుల ఉద్గారాన్ని గణనీయంగా తగ్గించాల్సిన బాధ్యత అన్ని దేశాలపైనా ఉందని స్పష్టం చేసింది. చేతలు కావాలి: బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తిని తగ్గించుకోవాలని గతంలో జరిగిన కాప్ సదస్సుల్లో ప్రత్యేకంగా సూచించారు. ఈసారి మాత్రం ఈ ప్రస్తావన లేకపోవడం గమనార్హం. బొగ్గుతో విద్యు త్ను ఉత్పత్తి చేయడంలో ప్రపంచంలో చైనా, భారత్ ముందంజలో ఉన్నాయి. తమ విద్యుత్ అవసరాలు తీర్చుకోవడానికి బొగ్గుపై ఆధారపడుతున్నాయి. ఉష్ణోగ్రతల పెరుగుదలను నియంత్రించడానికి బుధవారం ఆమోదించిన ఒప్పందమే అతిపెద్ద కార్యాచరణ ప్రణాళిక అని సుల్తాన్ అల్–జబేర్ అన్నారు. కాప్–28 టాప్ 10 చరిత్రాత్మక శిలాజ ఇంధన ఒప్పందంతో కాప్–28 సదస్సు ముగిసింది. ఇలాంటి కాలుష్య ఇంధనాల వాడకాన్ని క్రమంగా నిలిపివేయడానికి ప్రపంచ దేశాలు అంగీకరించాయి. పెట్రోల్, డీజిల్, బొగ్గు వినియోగం అంతమయ్యే దిశగా అడుగులు పడ్డాయని చెప్పొచ్చు. 1. చరిత్రాత్మక శిలాజ ఇంధన ఒప్పందంతో కాప్–28 సదస్సు ముగిసింది. ఇలాంటి కాలుష్య ఇంధనాల వాడకాన్ని క్రమంగా నిలిపివేయడానికి ప్రపంచ దేశాలు అంగీకరించాయి. పెట్రోల్, డీజిల్, బొగ్గు వినియోగం అంతమయ్యే దిశగా అడుగులు పడ్డాయని చెప్పొచ్చు. 2. సంపన్న దేశాల నిర్వాకం వల్లే వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయి. వాటి వల్ల పేద దేశాలు నష్టపోతున్నాయి. పేద దేశాలకు వాటిల్లుతున్న నష్టానికి గాను బడా దేశాలు పరిహారం ఇవ్వాలన్న ప్రతిపాదన చాలాఏళ్లుగా ఉంది. ఈ సదస్సులో దానికి కార్యరూపం వచి్చంది. వాతావరణ మార్పుల వల్ల నష్టపోయే పేద దేశాలకు ఆర్థిక సాయం అందించడం కోసం ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయడానికి ఆమోదం లభించింది. 3. నిర్దేశిత గడువు కంటే నెట్జిరో కర్బన ఉద్గారాల లక్ష్యాన్ని సాధిస్తామని కెనడా, బెల్జియం వంటి దేశాలు ప్రకటించాయి. 2030 నాటికి ఉద్గారాలను 50 శాతం తగ్గించుకుంటామని దుబాయ్ వెల్లడించింది. 4. 2030 కంటే ముందే గ్రీన్హౌజ్ వాయువుల ఉద్గారాన్ని అరికట్టడానికి శుద్ధ ఇంధనాల వనరుల వాడకాన్ని గణనీయంగా పెంచుకోవాలని నిర్దేశించారు. 5. క్లైమేట్ యాక్షన్ కోసం సంపన్న దేశాల నుంచి నిధులను, సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలకు బదిలీ చేయాలన్న ప్రతిపాదనపై చర్చలు జరిగాయి. 6. జీవ వైవిధ్యానికి, మానవళికి ఎలాంటి హాని కలగకుండా వాతావరణ మార్పుల నియంత్రణకు కార్యాచరణ ప్రణాళిక చేపట్టాలని నిర్దేశించారు. 7. ప్రస్తుతం అమల్లో ఉన్న పారిస్ ఒప్పందం లక్ష్యాలను మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా శిలాజ ఇంధనాల వినియోగం, ఉత్పత్తిని తగ్గించుకోవాలని ఆదేశించారు. 8. పర్యావరణ పరిరక్షణ కోసం గ్రీన్ క్లైమేట్ ఫండ్ తరహాలో క్లైమేట్ ఫైనాన్స్, సపోరి్టంగ్ ఫండ్స్ ఏర్పాటు చేయాలన్న ఆలోచనకు కొన్నిదేశాలు, సంస్థలు మద్దతు ప్రకటించాయి. 9. కాప్–26 సదస్సు ఫలితాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత కర్బన్ ఉద్గారాల సమాచారాన్ని నమోదు చేసే విషయంలో నిబంధనలు సవరించారు. 10. అన్ని దేశాల, అన్ని వర్గాల అవసరా లను దృష్టిలో పెట్టుకొని శిలాజ ఇంధనాల నుంచి ఇతర ప్రమాద రహిత ఇంధనాల వైపు క్రమానుగతంగా మారాలని సూచించారు. -
బయోడైవర్సిటీని రక్షించడంలో సోషల్మీడియాది కీలక పాత్ర
ప్రస్తుతం సోషల్ మీడియా వాడకం బాగా పెరిగిపోయింది. గంటగంటకూ అప్డేట్స్ చూసుకునేవారు చాలామందే ఉన్నారు. స్మార్ట్ఫోన్లో ఫేస్బుక్, వాట్సప్, లింక్డిన్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్ అంటూ పలు ప్లాట్ఫార్మ్స్ ద్వారా మనిషి జీవితం పెనవేసుకొని పోయిందంటే ఆశ్చర్యం లేదు. అయితే జీవవైవిధ్యం(బయోడైవర్సిటీ)ని రక్షించడంలో సోషల్ మీడియాది ప్రముఖ పాత్ర ఉందని తాజా అధ్యయనంలో తేలింది. పకృతిలో జీవుల మధ్య సహజంగా కనిపించే భిన్నత్వాన్ని / ఓ భౌగోళిక ప్రాంతంలోని భిన్నజాతుల సముదాయాన్ని జీవవైవిధ్యం (Biodiversity) అంటారు. పెరుగుతున్న జనాభా, వనరులను మితిమీరంగా వాడటం వల్ల జీవవైవిద్య పరిరక్షణ సంక్లిష్టం మారుతోంది. చెట్లు నరికివేయడం,ఇష్టారాజ్యంగా పరిశ్రమల ఏర్పాటు వంటివి జీవవైవిధ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఫలితంగా భూమిపై ఉన్న కోట్లాది జీవరాశులు అంతరించే ప్రమాదం ఉంది. అయితే బయోడైవర్సిటినీ రక్షించడంలో సోషల్ మీడియా పాత్ర కీలకమని యూనివర్శిటీ ఆఫ్ క్వీన్స్లాండ్ స్కూల్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ జరిపిన అధ్యయనంలో తేలింది. డాక్టర్ చౌదరి ఆధ్వర్యంలో జరిపిన అధ్యయనం ప్రకారం.. సోషల్ మీడియా అన్నది శాస్త్రీయ పరిశోధన, పరిరక్షణ ప్రయత్నాలకు శక్తివంతమైన సాధనంగా మారింది. ఉదాహరణకు బంగ్లాదేశ్లో గొప్ప వన్యప్రాణుల వారసత్వం ఉన్నప్పటికీ, కేవలం 4.6 శాతం మాత్రమే అధికారికంగా రక్షిత ప్రాంతంగా గుర్తించబడిందని తేలింది. బంగ్లాదేశ్లో పనిచేస్తున్న ఫేస్బుక్ నేచర్ ఫోటోగ్రఫీ గ్రూపులను పరిశీలించగా అక్కడ అనేక పక్షులు, కీటకాలు సహా మొత్తం 44,000 జీవరాశులు ఉన్నట్లు వారు కనుగొన్నారు. వీటిలో 288 జీవరాశులు అంతరించే ప్రమాదం ఉన్నట్లు సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్స్ అందించిన డేటా ప్రకారం తెలిసిందని డా. చౌదరి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్ననేచర్ ఫోటోగ్రాఫర్లు దక్షిణాసియాలో జీవవైవిధ్య పరిరక్షణ మ్యాపింగ్ను మెరుగుపరచడంలో సహాయపడుతున్నారు. బంగ్లాదేశ్లో అంతరించిపోతున్న వందలాది జాతుల పంపిణీ డేటాను మేము కోల్పోతున్నాము. ఈ క్రమంలో సోషల్ మీడియా అందించిన డేటా మాకు సహాయపడింది. బయోడైవర్సిటీ పరిరక్షణలో కీలకమైన సమాచార అంతరాలను తగ్గించడానికి సోషల్ మీడియా కీలకంగా మారింది. ప్రత్యేకించి పర్యవేక్షణ లేని ప్రాంతాలలో ఫేస్బుక్ వంటి మీడియా ప్లాట్ఫామ్లు శాస్త్రీయ ప్రయత్నాలకు అర్థవంతంగా సహకరించేలా చేస్తాయి. ఆస్ట్రేలియాలో, తెగులు జాతుల కదలికలను ట్రాక్ చేయడంలో సోషల్ మీడియా కూడా కీలక పాత్ర పోషించింది అని డాక్టర్ చౌదరి వెల్లడించారు.బయోడైవర్సిటీ పరిశోధనపై సోషల్ మీడియా ప్రభావం దక్షిణాసియాకు మించి విస్తరించింది. టానీకోస్టర్ అని పిలవబడే దక్షిణాసియాకు చెందిన సీతాకోకచిలుక 2012లో ఆస్ట్రేలియాలో ప్రవేశించింది. దీని వలస విధానాన్ని అర్థం చేసుకోవడానికి పరిశోధన బృందం ఫేస్బుక్ని ఆశ్రయించడం విశేషం. సోషల్మీడియా ఫ్లాట్ఫామ్లు తప్పుడు సమాచారాన్ని, వ్యవసాన్ని పెంపొందిస్తాయని చెడు ప్రచారం ఉంది. కానీ జీవవైవిధ్యాన్ని రక్షించడంలో సోషల్మీడియా పాత్ర కీలకమని తాజా అధ్యయనంలో తేలింది. -
ఆకులపై జంతువుల డీఎన్ఏ
సాక్షి, అమరావతి: జీవ వైవిధ్యాన్ని పరిరక్షించేందుకు ఏ ప్రాణి.. ఎక్కడ.. ఎలా జీవిస్తోందనే సమాచారం సేకరించేందుకు శాస్త్రవేత్తలు కొత్త పద్ధతులను అన్వేషిస్తున్నారు. ఇప్పటివరకు కెమెరా ట్రాపింగ్, లైన్ ట్రాన్సెక్టు్టలను ఉపయోగించి జంతువుల కదలికలను ట్రాక్ చేయడం ద్వారా వన్యప్రాణుల ఉనికిని పర్యవేక్షిస్తున్నారు. ఈ ట్రాకింగ్ నిర్ధిష్ట ప్రాంతం, ప్రత్యేకించి డిజైన్ చేసిన ట్రయల్స్గా మాత్రమే ఉంటోంది. ఇందులో ఖరీదైన పరికరాల వాడకం, శ్రమతో కూడుకోవడంతో పాటు ఎక్కువ సమయాన్ని కేటాయించాల్సి వస్తోంది. ఒక ప్రాంతంలోని అన్ని జాతులను గుర్తించడం సాధ్యపడటం లేదు. దట్టమైన వర్షారణ్యాల్లో ఈ రకమైన ట్రాకింగ్ కష్టతరంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో అంతర్జాతీయ జీవ వైవిధ్య శాస్త్రవేత్తల బృందం అడవుల్లో జంతువుల డీఎన్ఏ నమూనాల సేకరణ ద్వారా జీవ వైవిధ్యాన్ని సులభంగా, తక్కువ ఖర్చుతో గుర్తించవచ్చని ఓ అధ్యయనంలో పేర్కొంది. గాలిలోకి కణాలుగా జంతు డీఎన్ఏ ఉగాండాలోని కిబలే జాతీయ పార్కులోని వర్షారణ్యంలో అంతర్జాతీయ పరిశోధన బృందం మొక్కలు, చెట్ల ఆకులపై జంతువులు డీఎన్ఏలను కనుగొంది. జంతువులు తమ డీఎన్ఏను గాలిలోకి కణాలుగా విడుదల చేస్తున్నట్టు.. అది కాస్తా అడవిలోని వృక్ష సంపదపై సన్నని మైనం పొర మాదిరిగా అల్లుకుంటున్నట్టు పరిశోధనలో తేలింది. ఆకులపైన స్వాబ్ నమూనాలను కాటన్ బడ్స్ ద్వారా సేకరించి డీఎన్ఏ సీక్వెన్సింగ్ పరీక్ష ద్వారా జాతుల వివరాలను తెలుసుకోవడంతోపాటు జీవ వైవిధ్యాన్ని మ్యాప్ చేయవచ్చని పరిశోధన బృందం చెబుతోంది. పర్యావరణంలోని మార్పులను అర్థం చేసుకుంటూ జీవ వైవిధ్యాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి, అటవీ జనాభాను పర్యవేక్షించడానికి డీఎన్ఏ పరీక్షా విధానం ఎంతగానో ఊతమిస్తోంది. కోవిడ్ తర్వాత డీఎన్ఏ సీక్వెన్సింగ్ టెక్నాలజీ మరింత అభివృద్ధి చెందడం కూడా కలిసి వస్తోంది. ఆకులను శుభ్రపరచడానికి టెక్నాలజీ, ఖరీదైన పరికరాలు, ఎక్కువ శిక్షణ అవసరం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వైల్డ్లైఫ్ అథారిటీలో పని చేసే సిబ్బంది, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఇతర జీవ శాస్త్రవేత్తలు దీనిని సులభంగా నిర్వహించవచ్చు. వాస్తవంగా పర్యావరణంలో సేకరించే డీఎన్ఏ చాలా పెద్దస్థాయిలో జీవ వైవిధ్య పర్యవేక్షణకు దోహదపడుతుంది. వర్షాధార పరిస్థితుల్లో, అత్యంత వేడి పరిస్థితుల్లో మాత్రమే ఆకులపై డీఎన్ఏ త్వరగా క్షీణిస్తుంది తప్ప మిగిలిన సందర్భాల్లో పరిశోధనలకు అనుకూలంగా ఉండటంతో ఈ పద్ధతిపై అంచనాలు పెరుగుతున్నాయి. గంటలో 50కి పైగా జాతుల గుర్తింపు కిబలే జాతీయ పార్కు గొప్ప జీవ వైవిధ్యానికి ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలోని ‘ప్రైమేట్ క్యాపిటల్’ (కోతి జాతులు) నిలయంగా ఉంది. ఇందులో అంతరించిపోతున్న రెడ్ కోలోబస్ కోతి, చింపాజీలతో సహా 13 జాతులు ఇందులో ఉన్నాయి. ఇక్కడ పరిశోధకులు కేవలం ఒక గంటలో 24 కాటన్ బడ్స్ ద్వారా ఆకులపై స్వాబ్ నమూనాలను సేకరించారు. వాటి విశ్లేషణ కోసం ల్యాబ్కు పంపగా.. ఏకంగా 50 రకాల క్షీరదాలు, పక్షులు, ఒక కప్ప జాతులను గుర్తించడం గమనార్హం. ప్రతి మొక్క ఆకులపై దాదాపు 8 జంతు జాతులను కనుగొన్నారు. వీటిల్లో పెద్దవైన అంతరించిపోతున్న ఆఫ్రికన్ ఏనుగు నుంచి చిన్న జాతులైన సన్బర్డ్ వరకు భారీ జీవ వైవిధ్యాన్ని ప్రతిబింబించాయి. డీఎన్ఏల ద్వారా ఒక మీటరు పొడవాటి రెక్కలుండే గబ్బిలాలు, బయటకు కనిపించని పర్వత కోతులు, బూడిద, ఎరుపు వర్ణాల కోతులు, సుంచు ఎలుకలు, అనేక రకాల చిలుకలు ఉన్నట్టు గుర్తించారు. -
విలేజ్ పంచాయతీ ప్రెసిడెంట్: వీరమ్మాళ్ @ 89
‘సేవకు వయసుతో పని ఏమిటి?’ అంటోంది 89 సంవత్సరాల వీరమ్మాళ్. ఈ బామ్మ తమిళనాడులోని అరిట్టపట్టి గ్రామ పంచాయితీ ప్రెసిడెంట్. రకరకాల కార్యక్రమాలతో ఎప్పుడూ బిజీగా ఉండే వీరమ్మాళ్ తన ఆరోగ్య రహస్యం ‘నిరంతర కష్టం’ అంటోంది... మామూలుగానైతే బామ్మల మాటల్లో ‘మా రోజుల్లో’ అనేది ఎక్కువగా వినబడుతుంది. అది ఆ వయసుకు సహజమే కావచ్చుగానీ 89 సంవత్సరాల వీరమ్మాళ్ ఎప్పుడూ వర్తమానంలోనే ఉంటుంది. నలుగురితో కలిసి నడుస్తుంది. వారి కష్టసుఖాల్లో భాగం అవుతుంది. వీరమ్మాళ్ విలేజ్ ప్రెసిడెంట్గా ఉన్న మధురైలోని అరిట్టపట్టి గ్రామాన్ని తమిళనాడు ప్రభుత్వం రాష్ట్ర తొలి బయో డైవర్శిటీ సైట్గా ఎంపిక చేసింది. అరిట్టపట్టిలో పుట్టి పెరిగి అక్కడే వివాహం అయిన వీరమ్మాళ్కు ఆ గ్రామమే ప్రపంచం. అలా అని ‘ఊరి సరిహద్దులు దాటి బయటకు రాదు’ అనే ముద్ర ఆమెపై లేదు. ఎందుకంటే గ్రామ సంక్షేమం, అభివృద్ధి కోసం ఉన్నతాధికారులతో మాట్లాడడానికి పట్టణాలకు వెళుతూనే ఉంటుంది. ‘ఫలానా ఊళ్లో మంచిపనులు జరుగుతున్నాయి’ లాంటి మాటలు చెవిన పడినప్పుడు పనిగట్టుకొని ఆ ఊళ్లకు వెళ్లి అక్కడ అమలు చేస్తున్న కార్యక్రమాలను అధ్యయనం చేస్తుంటుంది. తన గ్రామంలో అలాంటి కార్యక్రమాలు అమలయ్యేలా కృషి చేస్తుంటుంది. ‘స్త్రీలకు ఆర్థిక స్వాతంత్య్రం’ అనే మాట గట్టిగా వినిపించని రోజుల్లోనే స్వయం–సహాయక బృందాలను ఏర్పాటు చేసి గ్రామంలోని మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేసేది. రైతులకు వ్యవసాయ రుణాలు అందేలా ఆఫీసుల చుట్టూ తిరిగేది. మహిళలు గడప దాటి వీధుల్లోకి వస్తే... ‘ఇదేం చోద్యమమ్మా’ అని గుసగుసలాడుకునే కాలం అది. వీరమ్మాళ్ మాత్రం గ్రామంలోని రకరకాల సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఎన్నో ఊళ్లు తిరిగేది. ఎవరు ఎలా మాట్లాడుకున్నా పట్టించుకునేది కాదు. ఆమె దృష్టి మొత్తం సమస్యల పరిష్కారంపైనే ఉండేది. విలేజ్ ప్రెసిడెంట్గా వాటర్ ట్యాంకులు, వాగులు దాటడానికి వంతెనలు నిర్మించింది. జల్ జీవన్ మిషన్ కింద ఎన్నో ఇండ్లకు తాగునీరు అందేలా చేసింది. వీధిలైట్ల నుంచి వీధుల పరిశుభ్రత వరకు అన్నీ దగ్గరి నుంచి చూసుకుంటుంది. అలా అని ఊళ్లో అందరూ వీరమ్మాళ్కు సహకరిస్తున్నారని కాదు. ఎవరో ఒకరు ఏదో రకంగా ఆమె దారికి అడ్డుపడుతుంటారు. వారి నిరసన వెనక రాజకీయ కారణాలు ఉన్నాయనే విషయం స్పష్టంగా అర్థమవుతూనే ఉంటుంది. అలాంటి వారికి వీరమ్మాళ్ తరపున గ్రామస్థులే సమాధానం చెబుతుంటారు. గ్రామంలో వృథాగా పడి ఉన్న భూములను వినియోగంలోకి తీసుకువచ్చే విషయంపై దృష్టి పెట్టింది వీరమ్మాళ్. ‘పనికిరాని భూమి అంటూ ఏదీ ఉండదు. మనం దాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటున్నామా, వృథాగా వదిలేస్తున్నామా అనే దానిపైనే ఆ భూమి విలువ ఆధారపడి ఉంటుంది’ అంటుంది వీరమ్మాళ్. ‘వీరమ్మాళ్ అంకితభావం గురించి ఆ తరం వాళ్లే కాదు ఈ తరం వాళ్లు కూడా గొప్పగా చెబుతుంటారు. గ్రామ అభివృధ్ధికి సంబంధించి ఎంతోమందికి ఆమె స్ఫూర్తి ఇస్తుంది’ అంటున్నాడు అరిట్టపట్టి విలేజ్ ఫారెస్ట్ కమిటీ హెడ్ ఆర్’ ఉదయన్. రోజూ ఉదయం అయిదు గంటలకు నిద్ర లేచే వీరమ్మాళ్ వంటపని నుంచి ఇంటి పనుల వరకు అన్నీ తానే స్వయంగా చేసుకుంటుంది. పొలం పనులకు కూడా వెళుతుంటుంది. ‘బామ్మా... ఈ వయసులో ఇంత ఓపిక ఎక్కడిది?’ అని అడిగితే– ‘నా గ్రామం బాగు కోసం నా వంతుగా కష్టపడతాను... అని అనుకుంటే చాలు ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది. అదే శక్తిగా మారి ఆరోగ్యాన్ని ఇస్తుంది. దేవుడు నన్ను ఈ భూమి మీది నుంచి తీసుకుపోయే లోపు గ్రామ అభివృద్ధి కోసం నేను కన్న కలలు సాకారం కావాలని కోరుకుంటున్నాను’ అంటుంది వీరమ్మాళ్. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అడిషనల్ చీఫ్ సెక్రటరీ సుప్రియ సాహు అరిట్టపట్టి గ్రామానికి వచ్చి బామ్మను కలుసుకుంది. ‘వీరమ్మాళ్ బామ్మతో మాట్లాడడం, ఆమె నోటి నుంచి గ్రామ అభివృద్ధి ప్రణాళికల గురించి వినడం అద్భుతమైన అనుభవం’ అంటుంది సుప్రియ. -
ప్రమాదంలో జీవ వైవిధ్యం
ఆకాశాన్నంటే హిమాలయాల నుంచి, మూడు వైపులా ఆవరించిన అనంత సాగర జలరాశి దాకా; సహారా ఇసుక ఎడారి మొదలుకుని, అపార జీవరాశికి ఆలవాలమైన సుందర్బన్ వంటి అడవుల దాకా... అంతులేని జీవ వైవిధ్యానికి పుట్టిల్లు మన దేశం. అలాంటి జీవవైవిధ్యం ఇప్పుడు మనిషి నిర్వాకం వల్ల అక్షరాలా అతలాకుతలమవుతోంది. అస్తిత్వం కోసం పెనుగులాడుతోంది. అతి త్వరలో పూర్తిగా అంతరించిపోయే పెను ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది. కారణమేమిటి? ♦ విచ్చలవిడిగా అడవుల నరికివేత, అడ్డూ అదుపూ లేని పట్టణీకరణ, ఫలితంగా విపరీతమైన కాలుష్యం, వాతావరణ మార్పులు తదితరాలు. ♦ భారత్లో 1990–2020 మధ్య 30 ఏళ్లలోనే ఏకంగా ఏడు లక్షల హెక్టార్ల మేరకు అడవి నరికివేతకు గురైనట్లు యుటిలిటీ బిడ్డర్ నివేదిక చెబుతోంది. ఇదిఇలాగే కొనసాగితే వన్యప్రాణులకు కనీసం నిలువ నీడ కరువవుతుంది. ♦ విచ్చలవిడిగా విస్తరిస్తున్న నగరాలు క్రమంగా చిత్తడి, గడ్డి నేలల వంటి సహజ జీవ వ్యవస్థలను కబళిస్తున్నాయి. ♦ ప్రణాళికలేని విస్తరణతో పలు నగరాలు వరదల వంటి సమస్యలతో సతమతమవుతున్నాయి. ♦దీని తాలూకు విపరిణామాలకు బెంగళూరే అతి పెద్ద ఉదాహరణ. కేవలం గత 50 ఏళ్లలోనే నగరంలో పచ్చదనం 88 శాతం, నీటి వనరులు 79 శాతం మటుమాయమయ్యాయి! ♦ పెరిగిపోతున్న ధ్వని, కాంతి కాలుష్యం వణ్యప్రాణుల జీవితాలను, ప్రవర్తనను, పునరుత్పత్తి సామర్థ్యాన్ని... మొత్తంగా వాటి మనుగడనే దెబ్బ తీస్తోంది. ముప్పేట ముప్పు! ♦ జీవవైవిధ్యం అంతరిస్తే తలెత్తే విపరిణామాలను ఊహించడం కూడా కష్టమే. ♦ వాతావరణ ధోరణులు పూర్తిగా మారిపోతాయి. వాటితో పాటే రుతువులూ క్రమం తప్పిపోతాయి. అంతా అల్లకల్లోలమవుతుంది. ♦ సముద్ర మట్టాలు మరింత పెరిగి తీర ప్రాంతాలను క్రమంగా కనుమరుగవుతాయి. ♦ సముద్ర జలాల్లో ఆమ్లత్వం పెరిగి వాటిలోని జీవజాలానికి ముప్పు ఏర్పడుతుంది. ♦ హిమానీ నదాలు శరవేగంగా కరిగిపోతాయి. ♦ ప్రజలు భారీగా నిర్వాసితులవుతారు. రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. ♦ పలు అరుదైన జీవ జాతులు శాశ్వతంగా అంతరించిపోతాయి. రాయల్ బెంగాల్ టైగర్, గోల్డెన్ లంగూర్, సిరోయ్ లిలీ వంటివి ఇప్పటికే ఈ జాబితాలోకి చేరాయి. ఏం చేయాలి? ♦ జీవవైవిధ్యపరంగా ప్రస్తుత తిరోగమన ధోరణికి అడ్డుకట్ట వేయాలంటే ప్రభుత్వాలు తక్షణం సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో రంగంలోకి దిగాలి. ♦ శాస్త్రీయ, సమాజ, విధానపరంగా కలసికట్టుగా కృషి జరగాలి. ♦ పర్యావరణ, సహజ వనరుల పరిరక్షణకు నగదు ప్రోత్సాహకాల వంటివి ఇవ్వాలి. ఉత్తరాఖండ్ ఇప్పటికే ఈ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టింది. ♦ తీవ్ర వాతావరణ పరిస్థితులను నిరోధించి పర్యావరణ సమతుల్యతను కాపాడే మడఅడవుల వంటి సహజ వనరులను పూర్తిస్థాయిలో పరిరక్షించుకోవాలి. ♦ పర్యావరణ విద్యను బోధన ప్రణాళికలో తప్పనిసరి చేయాలి. ♦ జీవ వైవిధ్య పరిరక్షణ ప్రాధాన్యత ప్రజలందరికీ అర్థమయ్యేలా ముమ్మర ప్రచారం చేపట్టాలి. హాట్స్పాట్స్.. విశేషాల పుట్టిళ్లు! ♦ అంతర్జాతీయ గుర్తింపున్న 36 జీవవైవిధ్య హాట్స్పాట్లలో నాలుగింటికి భారత్ నెలవు. అవి హిమాలయ ప్రాంతం, పశ్చిమ కనుమలు, ఇండో–బర్మా జోన్, సుందర్బన్ అడవులు. ♦ ఇవి మనుషులతో పాటు పలు జీవజాలాలకు నిలయాలు. ♦ తాగునీటి, ఆహార అవసరాలను సమర్థంగా తీరుస్తున్నాయి. ♦ వాతావరణాన్ని నియంత్రిస్తూ జీవజాలానికి ఎంతో మేలు చేస్తున్నాయి. ♦ ప్రాణికోటి మనుగడకు అత్యవసరమైన ఆక్సిజన్ ఉత్పత్తికి ఇవి ప్రధాన వనరులు. ♦ ఈ హాట్స్పాట్లు అతి పెద్ద పర్యాటక ఆకర్షణలు. తద్వారా స్థానికులకు ఆర్థికంగా పెద్ద ఆలంబనగా నిలుస్తున్నాయి. ♦ ఇక ఈ హాట్ స్పాట్స్కు మూలమైన అడవుల మీద దేశ జనాభాలో 22 శాతం మంది తమ జీవికకు, సామాజిక, సాంస్కృతిక అవసరాలకు పూర్తిగా ఆధారపడ్డారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ప్రతిభకు మారు పేరు ఆ ఊరు
అది ఆదివాసీ గ్రామం. ఆ ఊరికి సర్పంచ్ ఓ మహిళ. అక్కడ రాజకీయాల్లేవు. ఉన్నదంతా జనంలో ఐకమత్యమే. ఊరిలో అవినీతికి తావు లేదు. అభివృద్ధికి చిరునామాగా మారింది. ఊరంతా సస్యశ్యామలంగా ఉంది. జీవవైవిధ్యతకు ప్రతీకగా నిలిచింది. సర్పంచ్ ప్రతిభకు మారుపేరయింది. తెలంగాణ, కుమ్రుం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా, మార్లవాయి గ్రామం. ఆ గ్రామ సర్పంచ్ ప్రతిభ మంగళవారం నాడు (మే, 23వ తేదీ) ఇంటర్నేషనల్ బయో డైవర్సిటీ డే సందర్భంగా ‘తెలంగాణ స్టేట్ బయోడైవర్సిటీ’ అవార్డు అందుకున్నారు కనక ప్రతిభ. తన ప్రతిభతో గ్రామాన్ని నందనవనంగా మార్చిన ఆమె సాక్షితో పంచుకున్న విశేషాలివి. ‘‘మహిళా రిజర్వేషన్లో భాగంగా మా పంచాయితీని మహిళలకు కేటాయించారు. చదువుకున్న వాళ్లయితే బాగుంటుందని మా ఊరి వాళ్లందరూ 2019లో నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగని నేను ఎక్కువేమీ చదువుకోలేదు. డిగ్రీ మొదటి సంవత్సరంలో ఉండగా పెళ్లయింది. ఊరిని బాగు చేయాలనే సంకల్పం ఉంటే ఈ చదువైనా చాలు. మా ఊరి జనాభా 708, మొత్తం కుటుంబాలు 130. ప్రాథమిక పాఠశాల, ఆశ్రమ పాఠశాల కూడా ఉంది. ఇక అంగన్వాడీ కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కమ్యూనిటీ భవనం ఉన్నాయి. నేను వచ్చిన తర్వాత 26 మంది మహిళలకు చేతన ఫౌండేషన్ ద్వారా టైలరింగ్లో శిక్షణ ఇప్పించి, ఎస్బీఐ– ఆర్ఎస్ఈటీ సహకారంతో కుట్టు మిషన్లు ఇప్పించాను. వాళ్లకు చేతిలో పని ఉండడానికి ఆశ్రమ పాఠశాల విద్యార్థుల యూనిఫామ్ కుట్టే ఏర్పాటు చేశాం. డ్వాక్రా గ్రూపులు పదకొండున్నాయి. డ్వాక్రా డబ్బుతో కొంతమంది కిరాణా దుకాణాలు పెట్టుకున్నారు. వీథి వీథీ తెలుసు! మా ఊరిలో ప్రతి వీథీ, ప్రతి కుటుంబమూ తెలుసు. బడి వయసు పిల్లలందరినీ బడికి పంపించాలని ఇంటింటికీ వెళ్లి చెబుతుంటాను. అలాగే పదేళ్లలోపు ఆడపిల్లలందరికీ ‘సుకన్య సమృద్ధి యోజన’ పథకం కింద బ్యాంకు ఖాతాలు తెరిపించాను. పంచాయితీలకు కేంద్ర ప్రభుత్వ సహకారం బాగుంది. వీథులన్నీ సిమెంట్ రోడ్లు వచ్చాయి. అన్ని ఇళ్లకూ టాయిలెట్లున్నాయి. కిరోసిన్ దీపం వెలిగించాల్సిన అవసరం లేదు, అన్ని ఇళ్లకూ కరెంట్ ఉంది. వందకు పైగా ఇళ్లలో దీపం పథకం గ్యాస్ సిలిండర్లున్నాయి. చదువుకున్న వాళ్ల కోసం చిన్నపాటి వీథి గ్రంథాలయం కూడా పెట్టాం. అలాగే హరితహారంలో భాగంగా మొక్కలు నాటాం. గ్రామంలో ఏ మూలకెళ్లినా పచ్చదనం పరిఢవిల్లుతోంది. మంచినీటి సౌకర్యం, పరిశుభ్రతలో భాగంగా ఎప్పటికప్పుడు డ్రైనేజీ శుభ్రం చేయించడం, ప్లాస్టిక్ వాడకంలో విచక్షణ, తడిచెత్త– పొడి చెత్త పట్ల అవగాహన వంటివన్నీ జీవవైవిధ్య పురస్కారం ఎంపికకు ప్రమాణాలయ్యాయి. అందరూ ఇంటిపన్ను కడతారు మా ఊరిలో అంతా క్రమశిక్షణతో నడుచుకుంటారు. అందరూ ఇంటి పన్ను కడతారు. అంతకుముందెప్పుడో ఇందిరమ్మ ఇళ్లు వచ్చాయి. ఎక్కువమందికి మంచి ఇళ్లున్నాయి. కొంతమంది పెంకుటిళ్లలో ఉంటే, ఇప్పటికీ కొంతమంది మట్టికప్పు ఇళ్లలోనే ఉన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మాత్రం రాలేదు. మా ఊరి వాళ్ల గొప్పమనసు ఏమిటంటే... ఊరి బాగు కోసం ఏ పని చేపట్టినా అంతా కలసి వస్తారు. అందరూ ఇంకుడు గుంతలు తవ్వుకున్నారు. జీవవైవిధ్యత నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ వంటి కార్యక్రమాల్లో మొక్కలు నాటడం, వాటిని పరిరక్షించడంలో సంతోషంగా ముందుకు వస్తారు. వీథులకు రెండువైపులా రకరకాల మొక్కలు నాటాం. గిరి వికాస్ పథకం ద్వారా వ్యవసాయానికి 30 బావులు తవ్వించాం. అంతకు ముందు ఇరవై బావులుండేవి. ఊరిలో ఎక్కువమంది వ్యవసాయం చేస్తారు. ఒక్కొక్కరికి పదెకరాలకు తక్కువ లేకుండా భూమి ఉంది. అసలే భూమి లేని వాళ్లు కూడా ఉన్నారు. వాళ్లకు ఉపాధి హామీ పనుల కార్డు ఉంది. పొలాలకు గట్లు, చెరువు పూడిక తీయడం, పొలాల్లోకి వెళ్లడానికి మట్టిరోడ్లు వేయడం వంటి పనులు ఉపాధి హామీలో చేయిస్తాం. ఆకలి, పేదరికం మా ఊరి పొలిమేరలకు కూడా రావు. వ్యవసాయంతోపాటు ఆవులు, గేదెలు, మేకలు, కోళ్లు పెంచుకుంటారు. ప్రతి ఒక్కరూ పని చేస్తారు. సంతోషంగా జీవిస్తారు. ► ఉత్తమ గ్రామ పంచాయితీ 2021 అక్టోబర్ ► ఉత్తమ మహిళా సర్పంచ్ 2021 మార్చి 8 ► జాతీయ స్థాయిలో సంసద్ ఆదర్శ గ్రామీణ యోజనలో ఉత్తమ గ్రామ పంచాయితీ ► పేదరికరహిత, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనలో మొదటి స్థానం ► బెస్ట్ బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ అవార్డు 2023 మా ఊరికి సర్పంచ్గా నేను తొలి మహిళను. మహిళ అయిన కారణంగా నన్ను తక్కువ చేసి చూడడం మా దగ్గర ఉండదు. అంతా అభిమానంగా ఉంటారు. ఊరందరూ ఒక మాట మీద ఉంటారు కాబట్టి నేను ఇన్ని పనులు చేయగలుగుతున్నాను’’ అని గ్రామ తొలి మహిళగా తన అనుభవాలను వివరించారు ప్రతిభ. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
ప్రతి మూడో ముద్ద తేనెటీగలు పెడుతున్నదే!
ప్రకృతిలో తేనెటీగల వంటి చిరుప్రాణులు లేక పోతే మన మనుగడే ప్రశ్నార్థకం అవుతుంది. మొక్కల్లో పూలు కాయలుగా మారడానికి పరాగ సంపర్కమే కారణం. ఈ ప్రక్రియకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపకరిస్తూ పంటల ఉత్పాదనలో ఈ చిరుప్రాణులు తోడ్పడటం వల్లనే మనం మూడు పూటలా తినగలుగుతున్నాం. మనం తింటున్న ప్రతి మూడో ముద్ద ముఖ్యంగా తేనెటీగల పుణ్యమే. తేనెటీగలు లేకపోతే ఎన్నో రకాల పంటలు పండవు. అందుకే, తేనెటీగలు అంతరిస్తే నాలుగేళ్లలోనే మానవ జాతి అంతరిస్తుంది అన్నాడో మహనీయుడు. తేనెటీగల ఉసురు తీస్తున్న పురుగుమందులు, కలుపుమందులు, పచ్చదనం కొరత, వ్యాధికారక క్రిముల విజృంభణ వంటి సమస్యలకు ఇప్పుడు అదనంగా ‘వాతావరణ మార్పులు’తోడయ్యాయి. అందువల్ల కరువు, కుంభవృష్టి వంటి వాతా వరణ మార్పు ప్రభావాల నుంచి మనల్ని మనం కాపాడుకుంటూ తేనెటీగలను సైతం కనిపెట్టుకుని ఉండాలి. – సాక్షి సాగుబడి డెస్క్ మనం ఏం చేయగలం? ♦ అటవీ ప్రాంతాలను నాశనం చేయకుండా ఉండటం.. ♦ గ్రామీణ ప్రాంతాల్లో పొలాల గట్ల మీద రకరకాల స్థానిక రకాల పూల మొక్కల్ని పెంచటం.. ♦నగరాలు, పట్టణాల్లోని ఖాళీ స్థలాల్లో, మిద్దె తోటల్లో, పెరటి తోటల్లో, ముఖ్యంగా రోడ్ల పక్కన ఖాళీ జాగాల్లో కూడా మొక్కలతోపాటు స్థానిక జాతుల పూల మొక్కల్ని విస్తృతంగా పెంచటం.. ♦ రసాయనిక పురుగు మందులు, కలుపు మందులు చల్లకుండా ఉండటం.. ♦తేనెటీగల పెంపకాన్ని ప్రోత్సహించటం వంటి పనులను మనం చేస్తుంటే జీవవైవిధ్యం పరిఢవిల్లుతుంది. తేనెటీగల వంటి చిరు జీవులు మనుగడ సాగిస్తాయి. మనల్ని రక్షిస్తాయి.. తేనెటీగలు.. కొన్ని వాస్తవాలు ♦ తేనెటీగ సగటు జీవితకాలం పనిచేసే కాలంలో సుమారు 1.5 నెలలు; పని లేని సీజన్లో సుమారు 2.5 నెలలు. ∙అర కిలో తేనె ఉత్పత్తికి 556 తేనెటీగలు పని చేయాల్సి ఉంటుంది. ♦ తేనెటీగల సంతతి వసంత రుతువులో 15,000 ఉంటుంది. వేసవిలో 80,000 వరకు ఉంటుంది. ♦ 2021లో ప్రపంచవ్యాప్తంగా సహజంగా ఉత్పత్తయిన తేనె: 1.77 మిలియన్ మెట్రిక్ టన్నులు 20,000 ప్రకృతిలో ఉన్న తేనెటీగల జాతులు.. పరాగ సంపర్కానికి దోహదపడే.. అంతరించిపోయే ముప్పుఎదుర్కొంటున్న సకశేరుక (వెన్నెముక ఉన్న) జాతులు 16.9 అంతరించిపోతున్న తేనెటీగలు, సీతాకోక చిలుకలు వంటి అకశేరుక (వెన్నెముక లేని) జాతులు 40% తేనెటీగలు తదితర కీటకాల పరాగసంపర్కమే ఆధారం. పుష్పించే అడవి మొక్కలు/చెట్లలో తేనెటీగలు/జంతువుల పరాగసంపర్కంపై ఆధారపడుతున్నవి. 90% ప్రపంచవ్యాప్తంగా పరాగసంపర్కంపై ఆధారపడి ఉన్న ఆహార పంటలు. 75% -
బయోడైవర్సిటీ సంరక్షణలో ఏపీ టాప్
-
జీవ వైవిధ్య సంరక్షణలో ఏపీ టాప్
సాక్షి, అమరావతి: దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా జీవ వైవిధ్య పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ నడుం కట్టింది. గ్రామ స్థాయిలో జీవ వైవిధ్య యాజమాన్య కమిటీలు, అక్కడి ప్రత్యేకతలతో జీవ వైవిధ్య రిజిస్టర్లు రూపొందించి జీవ వైవిధ్య సంరక్షణకు పటిష్టమైన పునాదులు వేసింది. 2002లో జీవ వైవిధ్య చట్టం అమల్లోకి వచ్చినా.. రాష్ట్రంలో దాని అమలుకు సంబంధించిన నియమ నిబంధనలకు మాత్రం 2009లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే ఆమోదం లభించింది. ఇప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వంలో జీవ వైవిధ్య సంరక్షణకు ప్రాధాన్యత పెరిగి ఆ అంశంలో దేశంలోనే అగ్రగామిగా ఎదిగింది. అన్ని గ్రామాల్లో యాజమాన్య కమిటీలు జీవ వైవిధ్య చట్టం ప్రకారం రాష్ట్రంలోని అన్ని స్థానిక సంస్థల్లో జీవ వైవిధ్య యాజమాన్య కమిటీలను ఏర్పాటు చేసి.. తద్వారా ప్రజా జీవ వైవిధ్య రిజిస్టర్లను రూపొందించాల్సి ఉంది. కానీ.. జీవ వైవిధ్య మండలి ఏర్పాటైన 13 సంవత్సరాల వరకు దాని గురించి ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. మిగిలిన రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొనడంతో జాతీయ హరిత ట్రిబ్యునల్ 2020 డిసెంబర్లోపు అన్ని స్థానిక సంస్థల్లోను వాటిని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో 2020 జూన్లో రాష్ట్ర ప్రభుత్వం జీవ వైవిధ్య మండలికి పీసీసీఎఫ్ (ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్) స్థాయి అధికారిని సభ్య కార్యదర్శిగా నియమించడంతో మండలి కార్యకలాపాలు ఊపందుకున్నాయి. సిబ్బంది కొరతను అధిగమించడానికి ప్రతి మండలానికి ఒక స్వచ్ఛంద సేవా సంస్థను కో–ఆర్డినేటర్గా మండలి నియమించింది. రాష్ట్రంలో మొత్తం 14,157 స్థానిక సంస్థల్లో ఈ కమిటీలు ఏర్పాటు చేయగా.. వాటిలో 13,363 గ్రామ పంచాయతీ స్థాయివి కాగా 661 మండల పరిషత్, 13 జిల్లా పరిషత్ స్థాయి కమిటీలు ఉండటం విశేషం. ఆ తర్వాత రాష్ట్రంలోని ప్రధాన యూనివర్సిటీల్లో జీవ శాస్త్ర శాఖాధిపతులను సంప్రదించి జీవ వైవిధ్య రిజిస్టర్లను తయారు చేసే పనిలో పాల్గొనేలా చేసింది. సమగ్ర కార్యాచరణ అమలు జీవ వైవిధ్య కమిటీలు పని చేసేందుకు 15 అంశాలతో సమగ్ర కార్యాచరణ ప్రణాళికను తయారు చేశారు. గ్రామ వనాలు, మండల, జిల్లా స్థాయిలో జీవ వైవిధ్య ఉద్యాన వనాలు ఏర్పాటు, అంతరించే జాతుల నర్సరీలను పెంచడం, మొక్కలు నాటడం, చెరువులు, కుంటలను శుభ్రం చేయడం, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించడం, సేంద్రియ, ప్రకృతి వ్యవసాయాన్ని పెంపొందించడం, స్కూళ్లు, కాలేజీలలో మొక్కలు నాటడం, మహిళా సంఘాలు, యువతకు అవగాహన కార్యక్రమాలు, స్థానిక వైద్యులు, నాటు వైద్యులను గుర్తించి వారి వద్ద ఉన్న జ్ఞానాన్ని గ్రంథస్తం చేయడం వంటి పనులను ఈ కమిటీలు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా అన్ని స్థానిక సంస్థల సర్పంచ్లు, గ్రామ సచివాలయ కార్యదర్శులు, క్రియాశీలక సభ్యులతో జాయింట్ బ్యాంక్ ఖాతాలను తెరిపించి వారికి మంజూరు చేసిన నిధులను బదిలీ చేశారు. ఇప్పటివరకు 10 వేల గ్రామ పంచాయతీలకు రూ.75 వేల చొప్పున మొదటి విడతగా రూ.12 కోట్లను బదిలీ చేశారు. జీవ వైవిధ్య సంరక్షణలో ఓ మైలురాయి అన్ని స్థానిక సంస్థల్లోనూ 15 సంవత్సరాల నుంచి అసంపూర్తిగా ఉన్న జీవ వైవిధ్య యాజమాన్యాల కమిటీలను అతి తక్కువ కాలంలో పూర్తి చేయడం జీవ వైవిధ్య సంరక్షణలో ఒక మైలు రాయి. ఇది దేశం మొత్తంలో మన రాష్ట్రానికి ఒక ప్రత్యేకతను, ఒక విశిష్టమైన గుర్తింపును తీసుకువచ్చింది. ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఏపీలో జీవవైవిధ్య సంరక్షణకు సంస్థాగత నిర్మాణం జరిగింది. – దెందులూరి నళినీమోహన్, అటవీ శాఖ పూర్వ పీసీసీఎఫ్, జీవ వైవిధ్య మండలి రిటైర్డ్ సభ్య కార్యదర్శి -
శ్రీశైలం బయో డైవర్సిటీ రీసెర్చ్ సెంటర్.. ఎన్నో ప్రత్యేకతలు
సాక్షి, అమరావతి: ప్రకృతి ప్రసాదించిన వరం నల్లమల అటవీ ప్రాంతం. ఎత్తయిన కొండలు.. జలపాతాలు.. అరుదైన వృక్షాలు.. వన్యప్రాణులు.. అన్నిటికీ మించి పులులు జీవించేందుకు నల్లమల అత్యంత అనుకూలమైంది. విస్తీర్ణంలో దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వు. ఎన్నో విశేషాలు, వింతలు, అద్భుతాలతో అలరారుతున్న నల్లమలను చుట్టి రావాలంటే.. మామూలుగా అయితే సాధ్యం కాదు. కానీ.. అక్కడి జీవవైవిధ్యం అంతటినీ శ్రీశైలం బయో డైవర్సిటీ రీసెర్చ్ సెంటర్లో చూడవచ్చు. నల్లమల ప్రత్యేకతలు, జీవజాలం, జంతుజాలం, పులులు, ఇతర వన్యప్రాణులు వంటి సమస్త సమాచారం అక్కడ ఉంటుంది. నాగార్జున సాగర్ టైగర్ రిజర్వు ప్రాంతంలో జీవవైవిధ్య కార్యకలాపాల కోసం 2001లో స్వతంత్ర జీవవైవిధ్య పరిశోధన కేంద్రాన్ని శ్రీశైలంలో ప్రారంభించారు. దశాబ్ద కాలంలో వన్యప్రాణుల సంరక్షణ, జీవవైవిధ్యం, వివిధ జాతుల జాబితాకు సంబంధించి అత్యుత్తమ పరిశోధనలు ఇక్కడ జరిగాయి. ఈ అటవీ ప్రాంతంలోని వెన్నెముక లేని, వెన్నెముక ఉన్న జీవుల నమూనాలను సేకరించి బయోడైవర్సిటీ రీసెర్చ్ సెంటర్ ల్యాబోరేటరీలో భద్రపరిచారు. ఇదీ నల్లమల జీవవైవిధ్యం పులులు, ఎలుగుబంట్లు వంటి 80 రకాల పాలిచ్చే జంతువులు, 303 జాతుల పక్షులు, 80 రకాల పాకే ప్రాణులు, కప్పల వంటి 20 ఉభయ చరాలు, 55 రకాల చేపలు, 102 రకాల సీతాకోక చిలుకలు, 57 రకాల తూనీగలు, 47 జాతుల కీటకాలు ఇంకా అనేక రకాల కీటక జాతులను ఈ అటవీ ప్రాంతంలో గుర్తించిన పరిశోధనా కేంద్రం చెక్లిస్ట్ను తయారు చేసింది. నాగార్జున సాగర్–శ్రీశైలం పులుల అభయారణ్యం, గుండ్ల బ్రహ్మేశ్వరం, రోళ్లపాడు వన్యప్రాణుల అభయారణ్యాలలో అన్ని రకాల జీవవైవిధ్య సర్వేలు నిర్వహించింది. నల్లమలలోని జంతు, పుష్ప సంపదపై డిజిటల్ ఫొటో డాక్యుమెంటేషన్ చేసింది. అక్కడి జంతుజాలం, వృక్షజాలం యొక్క జాతుల స్థాయిపై సమగ్ర తనిఖీ జాబితాను రూపొందించింది. మాంసాహార ప్రాణుల ఆహారపు అలవాట్లను అధ్యయనం నిర్వహిస్తోంది. శాకాహార ప్రాణుల వెంట్రుకల ద్వారా వాటి లక్షణాలను గుర్తిస్తోంది. ఇక్కడి గడ్డి జాతుల వైవిధ్యం, వృక్ష జాతులతో వాటిపై సంబంధాలపై అధ్యయనం చేసింది. పులుల గణన ఇక్కడే.. నల్లమల అటవీ ప్రాంతంలోని పులుల గణన చేపట్టేది ఈ పరిశోధనా కేంద్రంలోనే. అటవీ ప్రాంతంలో పులులు తిరిగే ప్రాంతంలో ఏర్పాటు చేసిన కెమెరా ట్రాప్ల నుంచి సేకరించిన లక్షలాది ఫొటోలను విశ్లేషించి ప్రతి సంవత్సరం పులులను ఇక్కడ లెక్కిస్తారు. పులుల సంఖ్య, వాటి తీరు, ఆడవా, మగవా, వాటి మధ్య తేడాలు వంటి అన్ని అంశాలను గుర్తిస్తారు. పులులపై ఉండే చారల ద్వారా ప్రతి పులి ఆనవాలును ఇక్కడ సేకరించి దాని కదలికలను గమనిస్తారు. చదవండి: పెళ్లయిన ఆ జంటలు.. ఇక ప్రత్యేక కుటుంబాలు చిరుతలు, ఎలుగుబంట్లు వంటి ఇతర జంతువులను కూడా ఈ ఫొటోల ద్వారా గుర్తించి లెక్కిస్తారు. అటవీ సిబ్బందికి శిక్షణ తరగతులు, ప్రజలకు జీవవైవిధ్య పరిరక్షణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. 8.6 హెక్టార్ల విస్తీర్ణంలో శ్రీశైలం ప్రాజెక్ట్ కాలనీ పక్కన పరిశోధనా కేంద్రం ఆధ్వర్యంలో ఎకోలాజికల్ నాలెడ్జ్ పార్కును అభివృద్ధి చేశారు. ఇందులోని 4.96 హెక్టార్ల విస్తీర్ణంలో భూమి ఆవిర్భావం నుండి ఆధునిక మనిషి జీవ పరిణామ క్రమాన్ని వివరించే థీమ్తో ఏర్పాటు చేసిన పార్కు ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. -
జీవ వైవిధ్యం రక్షణ లక్ష్యాలు నెరవేరేనా?
కెనాడా నగరం మాంట్రియల్లో 2022 డిసెంబర్లో జరిగిన 15వ జీవవైవిధ్య సదస్సులో కుదిరిన ఒప్పందంలో పేర్కొన్న లక్ష్యాలను ఆహ్వానించవలసిందే. అయితే వాస్తవ పరిస్థితులను చూస్తే లక్ష్యాలు నెరవేరతాయా అనిపిస్తోంది. భారత్ సహా 190 దేశాల ప్రతినిధులు పాల్గొని చర్చించి ఒక ఒప్పందం చేసుకున్నారు. 2030 నాటికి ఈ ధరిత్రిపై 30 శాతం జీవవైవిధ్యం కాపా డాలన్నది ఒప్పందంలో ప్రధాన అంశం. ఈ విశ్వంలోగల జీవరాశులన్నిటినీ కలిపి జీవావరణం అంటున్నాం. జీవరాశులన్నీ సురక్షితంగా ఉంటేనే జీవవైవిధ్యం చక్కగా ఉంటుంది. అయితే ఇప్పటికే జీవవైవిధ్యం గణనీయంగా ధ్వంసమైపోయింది. ఇందుకు ప్రధానకారణం మానవ కార్యకలాపాలే. 1972లో స్టాక్హోమ్లో జరిగిన ధరిత్రి పరిరక్షణ సదస్సు తర్వాత ఐక్యరాజ్య సమితి (ఐరాస) ఆధ్వర్యంలో ఇంతవరకు 27 కాప్ సదస్సులు జరిగాయి. మొత్తం సదస్సుల్లో క్యోటో ఒప్పందం, గతంలో జరిగిన మాంట్రి యల్ ఒప్పందం, పారిస్ సదస్సు, 2021లో జరిగిన గ్లాస్గో, 2022లో ఈజిప్టు షర్మెల్ షేక్ నగరంలో జరిగిన సదస్సుల్లో జరిగిన ఒప్పందాలను ఇప్పటివరకు అమలు చేయలేదు. చేసినా అరకొర నిర్ణయాలే తీసుకొని అమలు చేశారు. గ్లాస్గో ఒప్పందంలోనే 2030 నాటికి సాధించవలసిన లక్ష్యా లను నిర్ణయించారు. వీటిలో చాలా తక్కువగానే సాధించారనీ, రానున్న ఐదేళ్ల కాలంలో సైతం సాధించే అవకాశం కనిపించడంలేదనీ, ఐరాస ప్రధాన కార్యదర్శి గుటెర్రస్ ఆయా ప్రభుత్వాలు సమర్పించిన ఐదేళ్ల ప్రణాళికలను బట్టి గ్లాస్గో సదస్సుకు ముందు ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన జీవ వైవిధ్య సదస్సు చేసిన నిర్ణయాలను, లక్ష్యాలను సాధించడం సాధ్యమేనా? ఇప్పటికే 14 లక్షల జీవజాతులు అంతరించాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. పరిశోధకుల అంచనా మేరకు గడచిన నాలుగు వందల కోట్ల సంవత్సరాల జీవపరిణామ క్రమంలో జీవవైవిధ్యం ఏర్పడింది. దీని పరిరక్షణకు ముందు వ్యవసాయంలో సమూల మార్పులు తీసుకురావలసి ఉంది. ఇందులో భాగంగా కృత్రిమ ఎరువులు, పురుగు మందులను నిలిపి వేసి సంప్రదాయ సేద్యాన్ని చేపట్టాలి. ఇది చాలా నెమ్మదిగా, దీర్ఘకాలం అమలు చేయవలసిన ప్రక్రియ. 2030 నాటికి ఈ మార్పును సాధించగలమా? జీవ వైవిధ్య రక్షణ ఒప్పందం అమలు చేయాలంటే ధనిక దేశాలు... పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలకు నిధులు సమకూర్చాలనీ, లేకపోతే ఒప్పందం నుండి వైదొలగుతామనీ కాంగో చివరిలో హెచ్చరించింది. అనేక దేశాలు ఈ బాటను ఎంచుకొనే అవకాశం ఉంది. వ్యవ సాయానికిచ్చే సబ్సిడీలను కొనసాగించాలని భారత్, ఇతర అభివృద్ధి చెందిన దేశాలు డిమాండ్ చేశాయి. అమెరికా తదితర కొన్నిదేశాలు 60 శాతానికి పైగా సబ్సిడీలు ఇస్తున్నాయి. సబ్సిడీల విషయాన్ని తుది ఒప్పందం పత్రంలో చేర్చారా లేదా అన్న సందేహాలు వ్యక్తమ య్యాయి. సబ్సిడీలు లేకపోతే వ్యవసాయం సంక్షోభంలో పడి ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. అయితే ఆర్థిక రంగానికి హాని కలిగించే సబ్సిడీలను తగ్గించాలని ఒప్పందంలో చేరుస్తామని ఒప్పందం రూపొందించిన దేశాలు చెప్పాయి. ఈ లక్ష్యాలను 2030 నాటికి సాధించాలంటే కేవలం ఆసియా – పసిఫిక్ ప్రాంత దేశాలకే 300 బిలియన్ డాలర్లు అవసరం అవుతాయని ఆ ప్రాంత ఐరాస ఆర్థిక, సామాజిక కమిషన్ (యుఎన్ఈపీ) అంచనా వేసింది. 2025 నాటికి 20 బిలియన్ డాలర్లు మాత్రమే ఆర్థిక సహాయం చేస్తామని సంపన్న దేశాలు అంగీకరించాయి. మరి లక్ష్యాలు సాధిం చడం సాధ్యమవుతుందా? వాతావరణ విపత్తులు.. పర్యావరణ కాలుష్యం, భూతాపం పెరుగుదల మూలంగా అధికమయ్యాయి. 200 ఏళ్లకు పైగా పారిశ్రామికీకరణ, పెట్రో ఉత్పత్తులు, వ్యవసాయానికి వినియోగిస్తున్న రసాయన ఎరువులు, పురుగుమందులు, విచ్చలవిడిగా అడవుల నరికివేత పెరిగాయి. మన దేశంలో 75 జిల్లాల్లో వాతావరణ వైపరీత్యాలు సంభవిస్తున్నాయని వివిధ అధ్యయనాలతో పాటూ, వ్యవసాయ గ్రామీణ అభివృద్ధి జాతీయ బ్యాంకు ప్రకటించింది. ఇక అభివృద్ధి పేరుతో విధ్వంసం జరుగుతుందనేది వాస్తవం. ఇందుకు తాజా ఉదాహరణలు లక్ష దీవులు, నికోబార్ దీవుల్లో జరుగుతున్న విధ్వంసం. ఈ ప్రాంతాల్లో వందలు, వేల ఎకరాల భూభాగంలో పచ్చదనం నాశనం అవుతోంది. ఫలితంగా వేలాదిమంది ఆదివాసీ తెగల జన జీవనం మళ్లీ కోలుకోలేనంతగా దెబ్బ తింటోంది. వందలాది పక్షులు, జంతువుల రకాలు, ఇతర లెక్కలేనన్ని జీవరాసులు అంతరించిపోతాయి. సుదీర్ఘ కాలంగా ఈ ప్రాంతాల్లో నెలకొని ఉన్న జీవ వైవిధ్యం మళ్లీ కనిపించదు. ప్రపంచ వ్యాప్తంగా అడవుల్లో నివసించే జంతువులు, పక్షులు, క్షీరదాలు, సరీసృపాలు తదితర అనేక రకాల జీవులలో 1970 నుంచి ఇప్పటి వరకు 69 శాతం నశించాయని లివింగ్ ప్లానెట్ రిపోర్టు (ఎల్పీఆర్)– 2022 నివేదిక తెలిపింది. ప్రపంచ జంతుజాల నిధి సంస్థ పరిధిలో ఎల్పీఆర్ పనిచేస్తోంది. భారత ప్రభుత్వం వాతావరణంపై 2023లో అనేక సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది. గతేడాది పారిస్ ఒప్పందంలో భాగంగా జాతీయ నిర్ణయ కార్యాచరణలు (ఎన్డీసీలు) రూపొందించింది. తక్కువ కాలుష్యం వెలు వరించే దీర్ఘకాలిక కార్యాచరణను మన ప్రభుత్వం ప్రకటించింది. అలాగే 2070 నాటికి కాలుష్య రహిత వాతావరణం సాధిస్తామని పారిస్ సదస్సులో ప్రకటించింది. మరి ఈ లక్ష్యాలను సాధించి మన దేశమన్నా మాట నిలుపుకొంటుందేమో చూడాలి. (క్లిక్ చేయండి: లోహియా లోకదర్శన సులోచనాలు!) – టీవీ సుబ్బయ్య, సీనియర్ జర్నలిస్ట్ -
ఆలోచనలు భేష్... ఆచరణ?
అవును. నాలుగేళ్ళ చర్చోపచర్చల తర్వాత ప్రపంచ జీవవైవిధ్య పరిరక్షణ ఒప్పందం (సీబీడీ)పై ఆలోచన ముందుకు కదిలింది. ఏకంగా 190కి పైగా దేశాలు ఈ ఒప్పందం చేసుకోవడం, ఘనంగా 23 భారీ లక్ష్యాలు అందులో ప్రస్తావించడం కచ్చితంగా చరిత్రాత్మకం. ఈ భారీ ఆలోచనకు కీలక మైన ఆచరణే ఇక మిగిలింది. కెనడాలోని మాంట్రియల్లో ఐక్యరాజ్య సమితి సారథ్యంలో జరిగిన జీవవైవిధ్యంపై భాగస్వామ్యపక్షాల 15వ సదస్సు (కాప్15) అక్షరాలా ఒక మైలురాయి. అయితే, ఐరాస పెద్దలే అన్నట్టు అన్నీ సత్వరం అమలుచేసి, పురోగతి సాధిస్తేనే విజయం సాధ్యం. అందుకే, ఈ చరిత్రాత్మక పరిణామంపై ఏకకాలంలో ఇటు ఆశలూ, అటు అనుమానాలూ తలెత్తుతున్నాయి. డిసెంబర్ 7 నుంచి 19 వరకు జరిగిన ‘కాప్15’లో 196 దేశాల అధికారిక ప్రతినిధులు, 10 వేల మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు. మొన్న నవంబర్ 20న ఈజిప్ట్లో 27వ ఐరాస పర్యావరణ సదస్సు (కాప్ 27) ముగిసిందో లేదో, ఈ జీవవైవిధ్య సదస్సు జరిగింది. ప్రకృతిని కాపాడకుండా, పునరుద్ధరించకుండా భూతాపోన్నతిని 1.5 డిగ్రీలకే పరిమితం చేయడం కుదిరేపని కాదు. అలా జీవవైవిధ్య సదస్సులు కీలకం. అయితే తుపానులు, కరిగిపోతున్న హిమానీనదాలతో పర్యావరణ సంక్షోభం కళ్ళకు కట్టినట్టు, జీవవైవిధ్య నష్టం తెలియదు. అందుకే, తీవ్రంగా పరిగణించక తప్పు చేస్తుంటారు. ఈ సదస్సులకు దేశాధినేతలెవరూ హాజరు కారు. సీబీడీ నిబంధనలు, లక్ష్యాలపై పర్యవేక్షణా తక్కువే. వెరసి పర్యావరణ సదస్సులంత ప్రచారం, రాజకీయ పటాటోపం కనిపించవు. నిజానికి, మూడు దశాబ్దాల క్రితమే 1992లో రియో డిజెనీరోలో జరిగిన ధరిత్రి సదస్సులోనే 150 మంది ప్రభుత్వ నేతలు సీబీడీపై తొలిసారి సంతకాలు చేశారు. జీవవైవిధ్య పరిరక్షణ దాని ప్రధాన ఉద్దేశం. ఆపైన ఆ ఒప్పందానికి మొత్తం 196 దేశాలు ఆమోదముద్ర వేశాయి. అమెరికా మాత్రం ఆమోదించలేదు. అలాగని సంక్షోభం లేదని కాదు. రానున్న రోజుల్లో 34 వేల వృక్ష జాతులు, 5200 జంతు జాతులు అంతరించిపోతాయని ఐరాస అంచనా. ప్రపంచంలోని పక్షిజాతుల్లో ప్రతి ఎనిమిదింటిలో ఒకటి కనుమరుగవుతుందట. అలాగే, భౌగోళిక జీవవైవిధ్యానికి ఆలవాలమైన సహజ అరణ్యాల్లో దాదాపు 45 శాతం ఇప్పుడు లేవు. ఇందులో అధికభాగం గత శతాబ్దిలో సాగిన విధ్వంసమే. తలసరి కర్బన ఉద్గారాల పెరుగుదల, ఉష్ణోగ్రతల్లో మార్పులకు ఇది కారణమని గుర్తించట్లేదు. అదే సమస్య. ఈ నేపథ్యంలో జీవవైవిధ్య నష్టాన్ని నివారించి, 2030 నాటి కల్లా ప్రకృతిని మళ్ళీ దోవలో పెట్టడమే లక్ష్యంగా తాజా ‘కాప్15’ జరిగింది. పర్యావరణ మార్పులపై 2015లో జరిగిన ప్యారిస్ ఒప్పందం ఎలాంటిదో, జీవవైవిధ్య పరిరక్షణకు ఈ ‘కాప్15’ మాంట్రియల్ ఒప్పందం అలాంటిదని విశ్లేషకుల మాట. పారిశ్రామికీక రణకు ముందు నాటి ఉష్ణోగ్రతలతో పోలిస్తే భూతాపోన్నతి 2 డిగ్రీల సెల్సియస్ మించరాదనీ, అసలు 1.5 డిగ్రీల లోపలే ఉండేలా ప్రయత్నించాలనీ దేశాలన్నీ అప్పట్లో ప్యారిస్ ఒప్పందంలో ఏకగ్రీవంగా అంగీకరించాయి. ఇప్పుడీ మాంట్రియల్ ఒప్పందంలో భాగంగా ‘30కి 30’ అంటూ, 2030 నాటికి 30 శాతం భూ, సముద్ర ప్రాంతాలను పరిరక్షించాలని నిర్దేశించుకున్నాయి. జీవ వైవిధ్య పరిరక్షణకు 2030కల్లా 20 వేల కోట్ల డాలర్లు సమీకరించాలని తీర్మానించాయి. పేదదేశాలకు చేరే మొత్తాన్ని 2025 కల్లా ఏటా కనీసం 2 వేల కోట్ల డాలర్లకు పెంచాలని యోచిస్తున్నాయి. విఫలమైన 2010 నాటి జీవవైవిధ్య లక్ష్యాల స్థానంలో మొత్తం 23 లక్ష్యాలను ఈ సదస్సు నిర్ణయించింది. అయితే, వివిధ దేశాలు తమ పరిస్థితులు, ప్రాధాన్యాలు, సామర్థ్యాలకు తగ్గట్టుగా వాటిని మలుచుకొనే స్వేచ్ఛనిచ్చారు. ఇది భారత్ చేసిన సూచనే. ఇక, వర్ధమాన దేశాల్లో వ్యవ సాయ, మత్స్యసబ్సిడీలు, పురుగుమందుల వినియోగంపై వేటు పడకుండా భారత్, జపాన్ తది తర దేశాలు కాచుకున్నాయి. అయితే, లోటుపాట్లూ లేకపోలేదు. ప్రపంచంలోనే పెద్ద వర్షారణ్యా లున్న కాంగో లాంటి ఆఫ్రికన్ దేశాలు చమురు, సహజవాయు అన్వేషణ ప్రమాదంలో పడ్డాయి. అవి కొన్ని అంశాల్లో అసమ్మతి స్వరం వినిపించినా ఈ కొత్త ఒప్పందాన్ని ఖరారు చేశారు. వచ్చే 2030కి సహజ జీవ్యావరణ వ్యవస్థలు 5 శాతం వృద్ధి చెందేలా చూడాలన్న లక్ష్యాన్ని చివరలో తీసేయడమూ నష్టమే. నిర్దిష్ట లక్ష్యాలు లేకుంటే ఆశయాలు మంచివైనా ఆచరణలో విఫలమవుతాం. ‘కాప్–15’ జీవవైవిధ్య ఒప్పందపు సంకల్పంతోనే సరిపోదు. ఒప్పందానికి ఊ కొట్టిన దేశాలు తీరా దాన్ని పాటించకున్నా చర్యలు తీసుకొనే అవకాశం లేదు. అందుకే, 23 లక్ష్యాల సాధనపై అను మానం, ఆందోళన. గతంలో జీవవైవిధ్య ప్రణాళికల అమలులో ప్రపంచ దేశాలు ఘోరంగా విఫల మయ్యాయి. 2010లో జపాన్లోని ఐచీలోనూ ఇలాగే 20 లక్ష్యాలను 2020 నాటికల్లా అందుకోవా లని పెట్టుకున్నాం. కానీ, వాటిలో ఒక్కటీ సాధించలేదు. మరోసారి అలాంటి అప్రతిష్ఠ రాకూడదు. తక్షణం కార్యరంగంలోకి దూకాలి. పరిమితవనరుల్ని యథేచ్ఛగా వాడుతూ, కర్బన ఉద్గారా లకు కారణమవుతున్న ధనిక పాశ్చాత్య ప్రపంచానికి ముకుతాడు వేయాలి. జంతుజాలాన్నీ, పశు పోషణతో అడవుల నరికివేత సాగుతున్న అమెజాన్ వర్షారణ్యాల్నీ కాపాడుకోవాలంటే ఆ దేశాల ఆహారపుటలవాట్లు మారాలి. మూలవాసుల హక్కుల్ని గౌరవించాలన్న మాటా ఆహ్వానించదగ్గదే. దశాబ్దాల క్రితమే చేయాల్సిన పనికి ఇప్పటికైనా నడుం కట్టడం మంచిదే. ప్రపంచం కలసికట్టుగా నడవాల్సిన వేళ కెనడా, చైనాల సహ ఆతిథ్యంలో ఈ సదస్సు, ఒప్పందం శుభపరిణామాలే! -
111 జీవో ఎత్తివేతతో జరిగేది ఇదే?
సాక్షి, హైదరాబాద్: సుదూర ప్రాంతాల నుంచి జంట జలాశయాలకు ఏటా వలస వచ్చే రాజహంసలు.. బాతులు.. కొంగలు.. గోరింకలు.. డేగలు తదితర పక్షుల జాడ క్రమంగా కనుమరుగు కానుందా? జీవో 111 ఎత్తివేతతో సుందర జలాశయాల చుట్టూ గృహ, వాణిజ్య, పారిశ్రామిక సముదాయాలు, కాంక్రీట్ మహారణ్యం పెరిగి.. శబ్ద, వాయు కాలుష్యం, పక్షుల సహజ ఆవాసాలైన జలాశయాలను కాలుష్య కాసారంగా మార్చేయనుందా? ఈ ప్రశ్నలకు పర్యావరణ వేత్తలు, పక్షి ప్రేమికులు అవుననే సమాధానమిస్తున్నారు. ► సైబీరియా.. యూరప్.. ఆఫ్రికా.. మయన్మార్, అఫ్గానిస్థాన్, పాకిస్థాన్ తదితర దేశాల నుంచి జంట జలాశయాలకు ఏటా అక్టోబరు నుంచి ఫిబ్రవరి మధ్య కాలంలో వేలాదిగా విభిన్న రకాల పక్షి ప్రజాతులు తరలివస్తాయి. హిమాయత్సాగర్కు సుమారు 200 వరకు గుజరాత్ నుంచి రాజహంసలు వలస రావడం పరిపాటే. మొత్తంగా ఈ జలాశయానికి 52 రకాలు, ఉస్మాన్సాగర్కు 92 రకాల పక్షి జాతులు వలస వస్తాయి. ► జలాశయాల చుట్టూ గృహ, వాణిజ్య, పారిశ్రామిక సముదాయాలు ఏర్పడిన పక్షంలో వలస పక్షులకు సమీప భవిష్యత్లో గడ్డు పరిస్థితులు తప్పవని పక్షి ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు. విభిన్న రకాల గోరింక ప్రజాతులకూ ఇక్కట్లేనని చెబుతున్నారు. సుమారు పదివేల కిలోమీటర్ల దూరం నుంచి వలసవచ్చే బార్హెడ్గూస్ (బాతు) జాడ కూడా కనిపించదని స్పష్టం చేస్తున్నారు. ఆఫ్రికా ఖండం నుంచి వలస వచ్చే పైడ్ క్రస్టెడ్ కకూ అనే పక్షి రాక ఉండదని చెబుతున్నారు. వలస వచ్చే ప్రధాన పక్షి జాతులివే: గుజరాత్ రాజహంసలు (గ్రేటర్ ఫ్లెమింగోలు), పిన్టెయిల్డ్ డక్(బాతు), షౌలర్,గార్గినే టేల్, హ్యారియర్స్ డేగలు, ఫ్లైక్యాచెస్, గోరింక ప్రజాతికి చెందిన రోజీపాస్టర్స్, స్టార్లింక్స్, భార్మెడోగూస్ బాతు, పైడ్ క్రస్టడ్ కకూ వీటిలో ప్రధానంగా కొంగలు, బాతులు, డేగలు, గుడ్లగూబలు, నీటికోళ్లు తదితర జాతులున్నాయి. (క్లిక్: ఈ పిల్లిని ఎలా రక్షిస్తారు? పోలీసు ఫేస్బుక్లో పోస్టు చేస్తూ..) నగరీకరణ, కాలుష్యం పెరిగితే కష్టమే జంటజలాశయాల చుట్టూ సమీప భవిష్యత్లో పట్టణీకరణ ప్రభావం, శబ్ద, వాయు కాలుష్యాలకు అవకాశం ఉంది. దీంతో సుదూర ప్రాంతాల నుంచి నగరానికి వలస వచ్చే పక్షిజాతుల జాడ కనిపించదు. జీవవైవిధ్యం ప్రమాదంలో పడుతుంది. – డాక్టర్ శ్రీనివాసులు, ప్రొఫెసర్, జంతుశాస్త్ర విభాగం ఉస్మానియా విశ్వవిద్యాలయం -
కొబ్బరి చెట్లకు క్లోనింగ్
తిరువనంతపురం: చాలా నెమ్మదిగా పెరిగే కొబ్బరి చెట్లను కూడా తాము క్లోనింగ్ చేయగలిగినట్లు బెల్జియం యూనివర్సిటీ పరిశోధకులు ప్రకటించారు. బెల్జియంలోని కె.యు.ల్యువెన్ అండ్ అలయెన్స్ ఆఫ్ బయో డైవర్సిటీ ఇంటర్నేషనల్కు చెందిన పరిశోధకులు వేగంగా కొబ్బరి మొక్కలను ఎక్కువ సంఖ్యలో పెంచడంతోపాటు, కొబ్బరి జన్యు మూలాలను దీర్ఘకాలం పరిరక్షించే వీలుంది. వీరు సాధించిన విజయం భారత్ వంటి దేశాల్లోని కొబ్బరి రైతులు ఎదుర్కొనే వ్యాధులు, వాతావరణ మార్పులు, సముద్ర మట్టాల్లో పెరుగుదల వంటి సమస్యల నుంచి విముక్తి కలగనుంది. ‘అసాధ్యమని భావిస్తున్న కొబ్బరి క్లోనింగ్ను మేం సాధించాం. మా పరిశోధన కొబ్బరి జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు, కొబ్బరికి పెరుగుతున్న డిమాండ్ను తీర్చేందుకు సాయపడుతుంది’ ఈ పరిశోధకులు ఒక ప్రకటనలో తెలిపారు. అరటి పండుపై సాగించిన పరిశోధనల ఫలితాల స్ఫూర్తితోనే ఈ విజయం సాధించినట్లు చెప్పారు. తమ విధానంపై పేటెంట్ కోసం త్వరలో దరఖాస్తు చేసుకోనున్నట్లు చెప్పారు. ఈ ఫలితాలు సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్ సెప్టెంబర్ ఎడిషన్లో ప్రచురితమయ్యాయి. -
పెద్దపులి నుంచి పునుగు పిల్లి వరకు..
సాక్షి, ఆత్మకూరురూరల్: తూర్పు కనుమల్లో విస్తరించిన నల్లమల అడవులు జీవ వైవిధ్యానికి ఆసియా ఖండంలోనే ప్రఖ్యాతిగా నిలిచాయి. సింహం, ఏనుగు మినహా అన్ని రకాల జంతువులు ఇక్కడ జీవిస్తున్నాయి. మాంసాహార, గడ్డి తినే జంతువులతో పాటు పలు సరీసృపాలు, ఉభయచరాలు, కీటకాలు, పక్షులు ఉన్నాయి. అటవీ చట్టాలను పకడ్బందీగా అమలు చేయడం, వన్యప్రాణి వేటగాళ్లను కట్టడి చేయడంతో అడవిలో జంతుజాలం అలరారుతోంది. ఏటా జంతువులసంఖ్య క్రమేణా పెరుగుతున్నట్లు అటవీ అధికారులు చెబుతున్నారు. మాంసాహార జంతువులలో ప్రముఖమైన పెద్దపులి నుంచి పునుగు పిల్లి వరకు మొత్తం 17 రకాలు, తొమ్మిది రకాల గడ్డి తినే జంతువులు ఉన్నాయి. అంతరించి పోయే దశలో ఉన్న పెద్దపులులతో పాటు అరుదైన జీవజాలానికి నెలవుగా ఉన్న కొండగొర్రెలు (చౌసింగా) తన ఉనికిని చాటుతూ నల్లమల అటవీ సాంద్రతను నిరూపిస్తున్నాయి. అలాగే నిశాచరి అయిన హనీబాడ్జర్ కూడా ప్రత్యేకంగా నిలుస్తోంది. అటవీ పరిధిలోని కృష్ణానది, పలు కొండవాగుల్లో, నీటిదొరువుల్లో సరీ సృపాలకు చెందిన మొసళ్లు జీవిస్తున్నాయి. అలాగే భారీ తాబేళ్లు (టోలిలు) కూడా ఉన్నాయి. నెమలి, కొండ కోడి (గ్రే జంగిల్ పౌల్), హార్న్బిల్ వంటి 200 రకాల అరుదైన పక్షుల కిలకిలరావాలతో నల్లమల పులకిస్తోంది. ఇవే గాక 13 రకాల గబ్బిలాలు, బెట్టుడత లాంటి ఉడుత జాతి జంతువులు, ఎలుక జాతులు, సాలెపురుగు, చెదపురుగులు వంటి లెక్కలేని కీటకాలు ఉన్నాయి. అయితే వెదురు తోపులు పచ్చిక బయళ్లను ఆక్రమించడంతో జింకలు ఇక్కడి నుంచి మైదాన ప్రాంతాలకు తరులుతున్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు నల్లమలలో తరచూ కనిపించే జింకలు ఇప్పుడు సమీపంలోని రోళ్లపాడు అటవీ ప్రాంతంలో అధికంగా సంచరించడమే ఇందుకు నిదర్శనమని చెప్పవచ్చు. విఫలమైన గడ్డి పెంపకం.. నల్లమలతో పాటు చుట్టూ ఉన్న మైదాన ప్రాంతాల్లో కూడా పశువుల సంఖ్య గణనీయంగానే ఉంది. 2001 లెక్కల ప్రకారం అడవిలో 5.81 లక్షల వన్యప్రాణులు ఉండగా సమీప గ్రామాల్లో (3 కిమీ లోపు) 6.24 లక్షల పెంపుడు జంతువులు ఉన్నాయి. వీటిల్లో గడ్డితినే జంతువులన్నింటికీ నల్లమలనే ఆధారం. నల్లమలలో 1,33,122 హెక్టార్ల గడ్డి లభించే ప్రాంతం ఉండగా.. ఏటా సుమారు 3,86,053 టన్నుల గడ్డి లభ్యమవుతోంది. ఇప్పుడున్న జంతువులకు 6.934 లక్షల టన్నుల గడ్డి అవసరం కాగా 3.073 టన్నుల కొరత ఉంది. వేసవిలో గడ్డి సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది. దీంతో సమస్య పరిష్కారానికి అధికారులు అడవిలో ఏర్పాటు చేసిన సోలార్ పంప్సెట్ల వద్ద గడ్డి పెంచే చర్యలు చేపట్టారు. అయితే నాటిన గడ్డి మొక్కలను జంతువులు వేర్లతో సహా పెకిలించడంతో వారి ప్రయత్నం ఫలించలేదు. దేశంలోని కొన్ని అభయారణ్యాలలో గడ్డి మైదానాలను పెంచేందుకు వెదురు పొదలను తొలగించిన సందర్భాలున్నాయి. గడ్డి తినే, మాంసాహార జంతువుల మధ్య సమతుల్యం లోపిస్తే పర్యావరణ సమస్య తలెత్తే అవకాశం ఉంది. మాంసాహార జంతువులు.. పెద్దపులి, చిరుతపులి, జంగం పిల్లి, ఆకుచిరుత, చేపలుపట్టే పిల్లి, రస్టీస్పాటెడ్ క్యాట్, పునుగు పిల్లి, కామన్ పామ్సివిట్, ముంగీస, నీటికుక్క(ఆటర్), హానీబాడ్జర్, ఎలుగు బంటి, నక్క, గుంటనక్క, చారల హైనా (దొమ్ములగొండి), తోడేలు, రేచుకుక్క (వైల్డ్డాగ్). గడ్డి తినే జంతువులు: దుప్పి (స్పాటెడ్ డీర్), కణితి (సాంబర్ డీర్), మనిమేగం (నీల్గాయ్), కృష్ణజింక (బ్లాక్బక్), బుర్ర జింక (మౌస్డీర్), కొండగొర్రె(చౌసింగా), చింకారా, అడవి పంది (వైల్డ్బోర్), ముళ్ల పంది (మిశ్రమ ఆహార జంతువు. చెద పురుగులు తిని జీవిస్తుంది.) కొండ గొర్రె కొండ గొర్రెలు మైదాన ప్రాంతాల్లో కాక దట్టమైన అడవుల్లో పర్వత ప్రాంతాల్లో ఉంటాయి. ఇవి జింక జాతికి చెందినవైనప్పటికీ మూషిక జింకకు, కృష్ణజింకకు మధ్యరకం పరిమాణంతో ఉంటాయి. రెండు కొమ్ములు నిటారుగా మరో రెండు చిన్న కొమ్ములు ముందుకు ఉంటాయి. మొత్తం నాలుగు కొమ్ములు ఉండటంతో దీనికి చౌసింగా అన్న పేరు వచ్చింది. దీని మాంసం రుచికరంగా ఉంటుందన్న అపోహతో వేట గాళ్ల దృష్టి వీటిపై ఎక్కువగా ఉండేది. అధికారులు నిఘా పెంచడంతో వీటి సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. హనీబాడ్జర్ వన్యప్రాణుల టీవీ చానల్స్లో తరుచూ కనిపించే హనీబాడ్జర్ను ఆఫ్రికా జంతువుగా చాలా మంది భావిస్తారు. ఇది రాత్రి పూట మాత్రమే సంచరించడంతో నల్లమల ప్రాంత ప్రజలకు దీని గురించి పెద్దగా తెలియలేదు. అందుకే దీనికి తెలుగు పేరు కూడా లేకుండా పోయింది. బిలకారి జీవనం చేసే హనీబాడ్జర్లు మానవ సామాజిక వ్యవహారానికి దగ్గరగా తమ జీవన విధానాన్ని కలిగి ఉంటాయి. భూమి లోపల నివాసం ఏర్పరుచుకుని పెద్దవి, పిల్లలు వేర్వేరు గదుల్లో నిద్రిస్తాయి. అలాగే తమ నివాసం వెలుపల మల విసర్జనకు ప్రత్యేక ఏర్పాటు చేసుకుంటాయి. ఇవి అవసరమై సమయంలో పెద్దపులికి కూడా ఎదురుతిరిగే సాహసం చేస్తాయి. -
తోవ చూపేది జీవవైవిధ్యం
మనిషి–ప్రకృతి మధ్య సంబంధాలను పునరుద్ధరించే కీలకమైన ప్రక్రియ జీవవైవిధ్య పరిరక్షణ. ఈ విషయంలో మనం వెనుకబడుతున్నాం. యుగాల తరబడి మనిషి ప్రకృతితో మమేకమైన సహజీవన సౌందర్యానికి మన పౌరాణిక, చారిత్రక నేపథ్యం సాక్ష్యంగా నిలిస్తే, ఇప్పుడు మనం వెనుకంజలో ఉన్నాం. ఐక్యరాజ్యసమితి (యూఎన్) నిర్దేశించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యా(ఎస్డీజీ)ల సాధనలో జీవవైవిధ్య రక్షణా ఉంది! నీటి లోపల, నేల మీది జీవరాశులుగా ప్రాధాన్యతనిచ్చింది. ఎస్డీజీల సాధన దిశలో భారత్ స్థానానికి ఇటీవల వెల్లడించిన యూఎన్ తాజా నివేదిక అద్దం పట్టింది. పలు అంశాల్లో వెంటనే అప్రమత్తం కావాలి. జీవవైవిధ్య రక్షణలో శీఘ్ర ప్రగతికి 2018 లో దేశంలో ఒక మిషన్ ఏర్పడింది. ‘జీవవైవిధ్యం–మానవ సుభిక్ష జాతీయ మిషన్’ (ఎన్ఎమ్బీహెచ్డబ్లుబీ)ని ప్రత్యేక లక్ష్యంతో ఏర్పాటు చేశారు. కరోనా మహమ్మారి వల్ల ముంచుకు వచ్చిన కోవిడ్–19 ఒకటి, రెండు అలలు.. తిరుగులేని ప్రకృతి ఆధిపత్యాన్ని చెప్పకనే చెప్పాయి. జీవులన్నిట బుద్ధిజీవినని జబ్బలు చరుచుకునే మనిషి ప్రకృతి ముందు ఎంత అల్పజీవో కరోనా తేల్చింది. దీన్ని ఒక గుణపాఠంగా గ్రహిస్తే.. ప్రఖ్యాత ఫ్రెంచ్ తత్వవేత్త రూసో చెప్పినట్టు మనిషి మళ్లీ ప్రకృతిలోకి నడవాలి. ప్రకృతి ఔన్నత్యాన్ని గ్రహించి, గుర్తించి, గౌరవించాలి. పర్యావరణం కాపాడుకోవాలి. సౌర కుటుంబంలో ఏకైక జీవగ్రహంగా పరిగణిస్తున్న పృథ్విని పరిరక్షించాలి. మానవ జోక్యంతో పాడుచేసుకున్న భూమ్యావరణ వ్యవస్థల్ని పునరుద్ధరించాలి. మొన్న ప్రపంచ పర్యావరణ దినోత్సవం, నిన్న సముద్ర దినోత్సవం... ఇలా పండుగలు జరుపుకోవడంలో మనం దిట్టలమే! కానీ, కార్యాచరణలోనే మందగమనం. ఈ యేడు పర్యావరణ దినానికి యూఎన్ ఒక ఆశయాన్నిచ్చింది. ఆవరణ వ్యవస్థల్ని కాపాడ్డం, నాశనం చేసుకున్నవి పునర్వవస్థీకరించుకోవడం, తద్వారా భూగ్రహాన్ని పునరుద్ధరించడం. ఈ పని సజావుగా జరగాలంటే, భాగస్వామ్య దేశాలతో కలిసి అదే యూఎన్ రూపొందించిన ఎస్డీజీలను కాలపరిమితిలోగా సాధించాలి. 2015లో యుఎన్ సభ్యదేశాలు చేసుకున్న ఈ అంగీకారానికి గడువు కాలం 2030. మూడో వంతు కాలం ఇప్పటికే కరిగిపోయింది. నికరంగా దశాబ్దకాలం కూడా లేదు. ఏయే అంశాల్లో ఎంతెంత ప్రగతి సాధించాం? ఎవరెక్కడ ఉన్నారు? ఏటా ఒక నివేదిక తయారవుతోంది. తాజా నివేదిక దేశ పరిస్థితినే కాక రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రగతినీ నివేదించింది. ఎస్డీజీల సాధన దిశలో కిందటేడుతో పోలిస్తే భారత్ కొన్ని పాయింట్లు (60 నుంచి 66) పెంచుకున్నప్పటికీ, స్థానం రెండు ర్యాంకులు (115 నుంచి 117) దిగువకు పోయింది. దక్షిణాసియాలోని భూటాన్, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్ మనకన్నా మెరుగైన స్థితిలో ఉండటం మన దుస్థితిని ఎత్తిచూపేదే! స్వచ్ఛ పునర్వినియోగ ఇంధనాలు, నగర–పట్టణాభివృద్ధి వంటి రంగాల్లో మనం ప్రగతి సాధించాం. ఆకలి రూపుమాపడం, ఆహార భద్రత, సమానత్వ సాధన, సమ్మిళిత మౌలికరంగ వసతులు–పారిశ్రామిక వృద్ధి వంటి అంశాల్లో వెనుకబడ్డాం. ఈ తడబాటు భారత్ స్థానాన్ని రెండు ర్యాంకులు దిగజార్చింది. ఇదే స్థితి రాష్ట్రాల ప్రగతి సూచీల్లోనూ ప్రతిబింబించింది. మానవ సర్వతోముఖ వికాసం ప్రాతిపదికగా 17 అంశాలతో సుస్థిరాభివృద్ది లక్ష్యాలు రూపొందాయి. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలు కలిసి, విశ్వ భాగస్వామ్య పద్ధతిలో పరస్పరం సహకరించుకోవడం ద్వారా ప్రపంచ ప్రజల శాంతి, సమున్నతి సాధించడం, ప్రస్తుత భవిష్యత్ అవసరాలు తీరేలా భూగ్రహాన్ని కాపాడుకోవడం ఈ ఉమ్మడి కృషి వెనుక సంకల్పం. చరిత్రాత్మకమైన పారిస్ భాగస్వామ్య ఒప్పందం కుదర్చడంలో కీలకపాత్ర పోషించిన భారత్ చాలా ఎస్డీజీ అంశాల్లో ఇంకా ప్రగతి సాధించాలి. విధాన నిర్ణయాల్లో విప్లవాత్మక మార్పులు వస్తే తప్ప అది సాధ్యపడదు. ఇప్పుడిప్పుడే రాష్ట్రాలు నిర్దిష్ట అంశాల్లో ప్రగతివైపు అడుగులు వేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు వడివడిగా ముందుకు సాగుతుంటే, మరికొన్ని ఇంకా బుడిబుడి అడుగులేస్తున్నాయి. కేరళ (75 పాయింట్లు), హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు (74) అగ్రభాగాన ఉన్నాయి. బిహార్ (52), జార్ఖండ్ (56), అస్సోమ్ (57) రాష్ట్రాలు వెనుకబడి ఉన్నాయి. నిర్దేశించిన గడువు (2030) నాటికైనా ఆశించిన లక్ష్యాలు సాధిస్తాయా? అన్న సందేహం రేకెత్తిస్తుస్నాయి. కిందటేడుతో పోల్చి చూస్తే మిజోరాం, హర్యానా, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు తమ పరిస్థితిని బాగా మెరుగుపరచుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఏపీ (72) తొలి అయిదు రాష్ట్రాల్లో ఉంటే, తెలంగాణ (69) మధ్యరకం ప్రగతి రాష్ట్రాల్లో ఉంది. ఏ అంశంలో అయినా రాష్ట్రాలు–కేంద్ర పాలిత ప్రాంతాలు సాధించే ఉమ్మడి ప్రగతే దేశ పరిస్థితిని అంతర్జాతీయ స్థాయిలో ప్రతిబింబిస్తుంది. అందులో కొన్ని జీవవైవిధ్య రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తే మరికొన్ని నిర్లక్ష్యం చేస్తున్నాయి. సామాజికార్థికాంశాలతో పాటు విధాన నిర్ణయాలు, పాలనా సామర్థ్యం, ప్రాధాన్యతలే ఆయా రాష్ట్రాల్లో ఎస్డీజీల ప్రగతిని–వ్యత్యాసాల్ని ప్రభావితం చేశాయని నివేదిక పేర్కొంది. పర్యావరణ ప్రగతి సూచీ (ఈపీఐ)లో మనం మరింత వెనుకబడి 180 దేశాలకు గాను 168 వ స్థానంలో ఉన్నాం. యాలె విశ్వవిద్యాలయం ఇచ్చిన 2020 ఈపీఐ నివేదిక ప్రకారం జీవవైవిధ్యాంశంలో మన స్థానం (148) పొరుగు దేశమైన పాకిస్తాన్ (127) కంటే 21 స్థానాలు అడుగునుంది. పరిస్థితి మెరుగుపరచి చరిత్రను తిరగరాయాలి. -
International Day for Biological Diversity: జీవవైవిధ్య దినోత్సవం
సిరికొండ: సూక్ష్మజీవుల నంచి క్రిమికీటకాల వరకు వృక్షాల నుంచి జంతు జలచరాల వరకు ప్రకృతిలోని ప్రాణులన్ని పరస్పర జీవనం గడపడమే జీవవైవిధ్యం. ప్రకృతి వనరులను కొల్లగొడుతూ మానవుడు తన ఉనికిని ప్రశ్నార్థకం చేసుకుంటున్నాడు. సంరక్షణ మాట మరిచి ఇష్టానుసారంగా చెట్లను నరికి వేయడం, విరివిగా రసాయనాల వాడకం, ప్లాస్టిక్ వ్యర్థాలు ఇతరత్రా కాలుష్యాలకు కారణమవుతు జీవవైవిధ్య సమతుల్యతను దెబ్బతీస్తున్నాడు. నేడు ప్రపంచ జీవవైవిధ్య దినోత్సవం సందర్బంగా ప్రత్యేక కథనం. పర్యావరణ పరిరక్షణలో ఆహార గొలుసు చెడిపోకుండా 2002లో జీవవైవిధ్య చట్టం అమలులోకి వచ్చింది. దశాబ్దం తర్వాత 2014లో రాష్ట్ర జీవవైవిధ్య బోర్డును తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ ఆ బోర్డు ఆరంభశూరత్వంలా మారింది. గ్రామ, మండల జీవవైవిధ్య కమిటీల ఏర్పాటు సాగుతూనే ఉండటం, జిల్లాల్లో తగినంత సిబ్బందిని నియమించకపోవడం, కమిటీలు ఏర్పాటైన సభ్యులకు సరైన శిక్షణ లేకపోవడం, నిధుల ఖర్చుపై ఆడిట్ లేకపోవడం సమస్యలుగా మారాయి. పేరుకు కమిటీలు.. ఉమ్మడి జిల్లాలో జీవవైవిధ్య అమలు కోసం ఇద్దరు సమన్వయకర్తలు ఉండాలి. ఒక్కరే ఉన్నారు. ఉమ్మ డి జిల్లాలో 51 మండలాలకు నాలుగు మండలాల్లో 1056 గ్రామ పంచాయతీలకు 219 గ్రామాలలో మాత్రమే కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలకు పథకం అమలు, జీవవైవిధ్య సంరక్షణపై తగిన శిక్షణ ఇవ్వాలి. వారసత్వ సంపదలైన వృక్షా లు, జంతువులు, పవిత్రవనాలు, జలాశయాలు, వారసత్వ కట్టడాలు, ఔషధ మొక్కలు మొదలైన వాటిపై అవగాహన కలి్పంచాలి. కానీ గడిచిన ఏడెండ్లలో జిల్లా స్థాయి, మండల, గ్రామ స్థాయిలో తగిన శిక్షణ లేక కమిటీల పనితీరు నామమాత్రంగా మారింది. ప్రతి జిల్లాలో జీవవైవిధ్య కమిటీలకు రెండు దశల్లో నిధులు ఇవ్వాలని రాష్ట్ర జీవవైవిధ్య బోర్డు నిర్ణయించింది. అందులో భాగంగా గ్రామ జీవవైవిధ్య కమిటీకి రూ.1.50 లక్షలు, మండల కమిటీకి రూ.1.50 లక్షలు, జిల్లా కమిటీకి రూ.2.30 లక్షలు ఇవ్వాలి. 2017–18 ఆర్థిక సంవత్సరంలో ఉమ్మడి జిల్లాలో 24 గ్రామ పంచాయతీలకు రూ. 8.80 లక్షలు విడుదల అయ్యాయి. వీటిలో కార్యాలయ ఏర్పాటు అవసరమైన రికార్డులు ఫరీ్నచర్ కొనుగోలు క్షేత్ర స్థాయి పరిశోధనలకు కేటాయించాలి. కానీ చాలా గ్రామ పంచాయతీల్లో వీటి ఏర్పాటు లేకుండానే నిధులు స్వాహ అయ్యాయి. సరైన ఆడిట్ లేనందువల్ల గత సర్పంచుల హయాంలో నిధులకు లెక్కలేకుండా పోయాయి. మిగతా నిధులు విడుదల చేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు చేయలేదు. దెబ్బతింటున్న జీవవైవిధ్యం ప్రకృతిలో జీవవైవిధ్యం దెబ్బతింటోంది. దీంతో హనికరమైన వైరస్లు విజృంభిస్తున్నాయి. గడిచిన వందేళ్లలో ప్రపంచవ్యాప్తంగా 20 వేల జాతుల జీవులు వైరస్లతో అంతరించిపోయాయి. మానవుల తప్పిదాలతో 75 శాతం మేర జన్యుజీవవైవిధ్య పంటలు కనుమరుగయ్యాయి. 24 శాతం క్షీరదాలు, 12 శాతం పక్షి జాతులు అంతరించిపోయే దశలో ఉన్నాయి. -
జీవవైవిధ్య తెలంగాణ!
సాక్షి, హైదరాబాద్: జీవవైవిధ్యానికి ప్రతీకగా తెలంగాణ నిలుస్తోంది. అరుదైన పక్షి జాతులు, విభిన్నమైన చేపల రకాలు, సీతాకోకచిలుకల, ఇతర జంతు జాతులు.. ఇలా అనేక ప్రత్యేకతలను రాష్ట్రం సొంతం చేసుకుంది. రాష్ట్రంలోని పోచారం, మంజీరా, అనంతగిరి, జన్నారం, ఏటీఆర్, ఖ మ్మం, వరంగల్, పాకాల తదితర ప్రాంతాల్లో అద్భుతమైన జీవ వైవిధ్యం అలరారుతోంది. అడవులు, జలవనరులు, ప్రకృతి సేద్యం మధ్య ఒక సమన్వయ బంధం ఏర్పడితే అన్ని జీవరాశులు సుహృద్భావ వాతావరణంలో మెలుగుతాయని ప ర్యావరణ నిపుణులు చెబుతున్నారు. తెలంగాణకే ప్రత్యేకమైన కొన్ని రకాల చేపలు, గుడ్లగూబలు, పావురాలు, 400 వరకు రకాల వివిధ పక్షులున్నాయి. జీవవైవిధ్యం పెంపుదలకు పులులు, చిరుత పులుల వంటివి కీలకమైనవే అయినా అవే సర్వస్వం కాదని మొక్కలు, పక్షులు, ఇతర జంతువుల మనుగడ, పురోభివృద్ధి కూడా ముఖ్యమేనని పర్యావరణవేత్తలు అంటున్నారు. ఇటు తెలంగాణలోని 500 నుంచి 600 రకాల ఔషధ మొక్కలూ కీలక భూమికను నిర్వహిస్తున్నాయి. శుక్రవారం అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ప్రత్యేక కథనం.. రాష్ట్రంలోని పక్షులు, వృక్షాలు, జంతుజాతులు.. రాష్ట్రంలో 1,900 రకాల వృక్షాలు, మొక్కల జాతులు, 166 రకాల చేపలు, 376 రకాల పక్షులు, 155 సీతాకోకచిలుకలు, 13 రకాల రొయ్యలు, 4 రకాల ఎండ్రకాయలు (పీతలు), 28 రకాల తూనీగలు, 53 రకాల మోథ్స్, 46 రకాల సాలెపురుగులు, 12 రకాల తేళ్లు, 107 రకాల ఇన్వర్టెబ్రేట్స్, 41 రకాల నత్తలు, 17 రకాల కప్ప లు, 60 రకాల పాములున్నాయి. ఇక 376 రకాల పక్షి జాతుల్లో భాగంగా గుడ్లగూబలు, బాతులు, పావురాలు, కొంగలు, రామచిలుకలు, పిట్టలు, రాబందులు.. 70 రకాల జంతువుల్లో భాగంగా పులులు, చిరుతపులులు, వివిధ జాతుల కోతులు, జింకలు, ఎలుకలు, ముంగిసలు, నీల్గాయిలు, నక్కలు వంటివి ఉన్నాయి. రాష్ట్రంలో జీవవైవిధ్యానికి నెలవులు... ►రాష్ట్రంలో 8 వన్యప్రాణి అభయారణ్యాలున్నాయి. ప్రాణహిత, శివరం, ఏటూరునాగారం, నాగార్జున సాగర్–శ్రీశైలం, పాకాల, కిన్నెరసాని, మంజీరా, పోచారం.. వీటిల్లో చిరుతలు, ఎలుగుబంట్లు, జింకలు, పులులు, నక్కలు, మొసళ్లు, కొండచిలువలు ఇతర జంతువులున్నాయి. ►ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్–2,166 చదరపు కి.మీ., కవ్వాల్ టైగర్ రిజర్వ్–892 చదరపు కి.మీ. మేర పులుల అభయారణ్యాలు విస్తరించి ఉన్నాయి. ► జాతీయపార్కులు.. (కాసు బ్రహ్మానందరెడ్డి జాతీయ పార్కు, మృగవాణి నేషనల్ పార్కు, మహావీర్ హరిత వనస్థలి జాతీయపార్కు) ►హైదరాబాద్లో జవహర్లాల్ నెహ్రూ జూలాజికల్ పార్కు, వరంగల్లో వన విజ్ఞానకేంద్రం (మినీ జూ) ఉన్నాయి. ►సంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న అమీన్పూర్చెరువు బయో డైవర్సిటీ హెరిటేజ్సైట్గా ఉంది. పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి.. ‘తెలంగాణకు ఘనమైన జీవవైవిధ్య వారసత్వ సంపద ఉంది. రకరకాల మొక్కలు, వృక్షాలు, జంతువుల జాతులతో వైవిధ్యమైన ప్రత్యేకతను సొంతం చేసుకుంది. వీటిని పరిరక్షించుకునే విషయంలో సాధారణ ప్రజల్లో అవగాహనను పెంచాలి. పర్యావరణం, ప్రకృతి, జీవవైవిధ్యం నుంచి మనం ఏమి పొందుతున్నాం.. వాటి వల్ల ప్రయోజనాలు కొనసాగాలంటే ఏవిధంగా వాటిని సురక్షితంగా ఉంచుకోవాలన్నది వారు తెలుసుకోగలగాలి. పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి. స్థానికంగా పండించే వివిధ వ్యవసాయ ఉత్పత్తులు, పండ్లు వంటి వాటిని ప్రోత్సహించాలి. ఔషధ మొక్కల వల్ల ఆరోగ్య పరిరక్షణకు అవకాశం ఏర్పడుతోంది. వాటి ప్రాముఖ్యతను గుర్తించాలి..’ – ఫరీదా తంపల్, వరల్డ్ వైడ్ ఫండ్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) స్టేట్ డైరెక్టర్ -
ఫ్లైఓవర్పై రయ్ రయ్
గచ్చిబౌలి: గచ్చిబౌలిలోని బయోడైవర్సిటీ జంక్షన్లో ఫస్ట్లెవల్ ఫ్లైఓవర్పై వాహనాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. గురువారం దీనిని మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీతో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. రూ.30.26 కోట్ల వ్యయం తో 690 మీటర్ల పొడవు, 11.50 మీటర్ల వెడల్పు (వన్వే)తో నిర్మించిన ఈ ఫస్ట్లెవల్ ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంతో గచ్చిబౌలి నుంచి మెహిదీపట్నం, ఇనార్బిట్ మాల్ వైపు వెళ్లే వాహనదారుల ప్రయాణం సాఫీగా సాగనుంది. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్, సైబరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్, మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్రావు, జీహెచ్ఎంసీ సీఈ జియావుద్దీన్, వెస్ట్ జోనల్ కమిషనర్ రవికిరణ్, డిప్యూటీ కమిషనర్ వెంకన్న, ప్రాజెక్ట్స్ ఈఈ వెంకటరమణ పాల్గొన్నారు. ట్రాఫిక్ చిక్కులు వీడినట్లే.. ► బయోడైవర్సిటీ జంక్షన్లో రెండు వంతెనలు అందుబాటులోకి రావడంతో ట్రాఫిక్ చిక్కులు వీడినట్టే. మెహిదీపట్నం, ఫిలింనగర్, మణికొండ వైపు నుంచి వచ్చే వాహనదారులు లెవల్–2 ఫ్లైఓవర్ పై నుంచి ఐకియా మీదుగా మైండ్స్పేస్ అండర్పాస్ ద్వారా మాదాపూర్ ఐటీ కంపెనీలు, సైబర్టవర్ వైపు ఎలాంటి ఆటంకం లేకుండా వెళ్తున్నారు. ► ఫస్ట్ లెవల్ వంతెన అందుబాటులోకి రావడంతో లింగంపల్లి, కొండాపూర్, ఓఆర్ఆర్ నుంచి వచ్చే వాహనాలు సిగ్నల్ సమస్య లేకుండా మెహిదీపట్నం, ఇనార్బిట్ మాల్వైపు వెళ్లవచ్చు. ► లింగంపల్లి వైపు నుంచి వచ్చే వాహనాలు ఖాజాగూడ క్రాస్రోడ్డు వరకు రావాలంటే దాదాపు 20 నిమిషాలు పట్టేది. ఇప్పుడు గచ్చిబౌలి ఫ్లైఓవర్, బయోడైవర్సిటీ ఫస్ట్లెవల్ ఫ్లైఓవర్పై నుంచి 8 – 10 నిమిషాల్లోనే వెళ్లవచ్చు. దీనివల్ల దాదాపు 10 నిమిషాల సమయం ఆదా కానుంది. ► గచ్చిబౌలి జంక్షన్ నుంచి ఇనార్బిట్ మాల్కు వెళ్లాలన్నా 20 నిమిషాలు పట్టేది. ఫస్ట్లెవల్ వంతెన, నాలెడ్జ్సిటీ లింక్రోడ్డు కూడా అందుబాటులోకి రావడంతో ఇప్పు డు 10 నిమిషాల్లోనే చేరవచ్చు. తద్వారా ఇనార్బిట్ మాల్ వైపు వెళ్లే వాహనదారులకు 10 నిమిషాలు ఆదా కానుంది. -
వంతెన కింద వంతెన
సాక్షి, హైదరాబాద్: వ్యూహాత్మక రహదారుల పథకం (ఎస్సార్డీపీ)లో భాగంగా జీహెచ్ఎంసీ చేపట్టిన పనుల్లో మరో ఫ్లైఓవర్ పనులు పూర్తయ్యాయి. బయోడైవర్సిటీ జంక్షన్ వద్ద సెకండ్ లెవెల్ ఫ్లైఓవర్ ఇప్పటికే అందుబాటులోకి రాగా, ఫస్ట్ లెవెల్ ఫ్లైఓవర్ను మునిసిపల్ మంత్రి కేటీఆర్ గురువారం ప్రారంభించనున్నారు. ఈ ఫ్లైఓవర్తో బయోడైవర్సిటీ జంక్షన్ వద్ద ట్రాఫిక్ సమస్య తీరనుంది. గచ్చిబౌలి వైపు నుంచి రాయదుర్గం మీదుగా మెహిదీపట్నం వైపు వెళ్లే వారికి దీని వల్ల ట్రాఫిక్ చిక్కులు తగ్గుతాయి. దీని వ్యయం రూ.30.26 కోట్లు. (భయం భయంగా ఆసుపత్రులకు) ఎస్సార్డీపీ ప్యాకేజీ–4 పూర్తి: ఈ ఫ్లైఓవర్ పూర్తితో ఎస్సార్డీపీలో ప్యాకేజీ–4 కింద మొత్తం రూ.379 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన అన్ని పనులు పూర్తయ్యాయి. ఇప్పటికే మైండ్స్పేస్ అండర్పాస్, మైండ్స్పేస్ ఫ్లైఓవర్, అయ్యప్ప సొసైటీ జంక్షన్ అండర్పాస్, రాజీవ్గాంధీ జంక్షన్ ఫ్లైఓవర్, బయోడైవర్సిటీ జంక్షన్ సెకెండ్ లెవెల్ ఫ్లైఓవర్ వినియోగంలోకి వచ్చాయి. దీంతో బయోడైవర్సిటీ జంక్షన్ (ఓల్డ్ ముంబై హైవే) నుంచి జేఎన్టీయూ(ఎన్హెచ్–65) మార్గంలో ట్రాఫిక్ సమస్యలు తగ్గినట్టేనని, మొత్తం 12 కిలోమీటర్ల కారిడార్ పనులు పూర్తయ్యాయని మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. -
మన జీవ వైవిధ్యం.. మానవాళికి విశిష్ట నిధి
న్యూఢిల్లీ: భారతదేశంలోని జీవ వైవిధ్యం ప్రపంచ మానవాళికి ఒక విశిష్టమైన నిధిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఆయన ఆదివారం ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో భాగంగా దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. సృష్టిలోని అన్ని జీవరాశుల పట్ల అనురాగం, ప్రకృతి పట్ల ప్రేమ కలిగి ఉండాలని చెప్పారు. ప్రతిఏటా ప్రపంచం నలుమూలల నుంచి ఎన్నో రకాల పక్షులు భారత్కు వస్తున్నాయన్నారు. వలస పక్షులకు భారత్ ఇల్లులా మారిందన్నారు. ఇటీవల ఢిల్లీలో కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ నిర్వహించిన హునర్ హాట్ కార్యక్రమం గురించి ప్రస్తావించారు. భాగీరథీ అమ్మ స్ఫూర్తిదాయకం.. ఆయన మాట్లాడుతూ.. ‘లక్ష్యాలు సాధించడానికి వయసు, వైకల్యం ఎంతమాత్రం అడ్డంకులు కావు. ఏదైనా సాధించాలని సంకల్పిస్తే మనలోని విద్యార్థిని చంపకూడదు. కేరళలో భాగీరథీ అమ్మ అనే మహిళ 105 ఏళ్ల వయసులో లెవల్ 4 పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం, కామ్యా కార్తికేయన్ అనే 12 ఏళ్ల బాలిక దక్షిణ అమెరికాలోని 7,000 మీటర్ల ఎత్తయిన మౌంట్ అకోకాంగువాను అధిరోహించడం సంతోషకరం’ అన్నారు. చమురు దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించుకోవాలన్నారు. దేశీయంగా తయారు చేసిన బయో–జెట్ ఇంధనాన్ని ఇటీవల ఇండియర్ ఎయిర్ఫోర్సుకు చెందిన ఏఎన్–32 రవాణా విమానంలో ఉపయోగించామని. మొత్తం ఇంధనంలో 10 శాతం మనం సొంతంగా తయారు చేసిన ఇంధనమే వాడామన్నారు. రెండు ఇంజన్లలో ఇలాంటి బయో–జెట్ ఇంధనం వాడడం ఇదే మొదటిసారి అన్నారు. -
సుసంపన్నం దుంప పంటల వైవిధ్యం
ప్రజల ఆహారంలో ధాన్యాల తర్వాత అంత ప్రాధాన్యం కలిగినవి దుంపలు. దుంప పంటలు అనగానే మనకు చప్పున గుర్తొచ్చేవి బంగాళ దుంప, కంద, చేమదుంప, క్యారెట్, ముల్లంగి, బీట్రూట్. ఇంకా చెప్పాలంటే కర్రపెండలం, తాటి తేగలు కూడా. అయితే, మనకు తెలియని దుంప పంట రకాలు మరెన్నో ఉన్నాయి. ఈ పంటల జీవవైవిధ్యం చాలా సుసంపన్నమైనది. గ్రామీణులు, ముఖ్యంగా గిరిజనులు, ఆదివాసీలకు ఆహార భద్రతను కల్పిస్తున్నప్పటికీ దుంప పంటలు జీవవైవిధ్యం క్రమంగా అంతరించిపోతోంది. భూసార క్షీణత, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, భూతాపోన్నతిని దీటుగా ఎదుర్కోవడంలో దుంప పంటలు ఎంతగానో ఉపకరిస్తాయి. ఈ దృష్ట్యా దుంప పంటలను పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్న విషయాన్ని ఎలుగెత్తి చాటడం కోసం సహజ సమృద్ధ స్వచ్ఛంద సంస్థ కృషి చేస్తోంది. ఇటీవల మైసూరులో ఇటీవల జరిగిన ప్రత్యేక దుంప పంటల ప్రదర్శన దక్షిణాదిలో దుంప జాతుల జీవవైవిధ్యానికి అద్దం పట్టింది. వివిధ దుంప జాతులను తోటల్లో అంతర పంటలుగా పండించుకొని పరిరక్షించుకోవచ్చు. దుంప జాతుల జీవవైవిధ్యాన్ని పరిరక్షించుకోవడం, వీటితో రకరకాల వంటకాలు తయారు చేసుకునే పద్ధతులను ప్రచారంలోకి తేవడం కోసం సహజ సమృద్ధ సంస్థ నాబార్డు తోడ్పాటుతో ఇటీవల కేలండర్ను ప్రచురించడం విశేషం. గతంలో దేశీ వరి వంగడాలు, చిరుధాన్యాలపై కూడా కేలండర్లను ఈ సంస్థ ప్రచురించింది. దుంప పంటలు, వంటల కేలండర్ ధర రూ. 75. వివరాలకు.. బెంగళూరులోని సహజ మీడియా వారిని 70900 09922 నంబరులో సంప్రదించవచ్చు. -
అభిలాష్ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు..
గచ్చిబౌలి: బయోడైవర్సిటీ ఫ్లైఓవర్పై సెల్ఫీ దిగుతుండగా.. మద్యం మత్తులో ఉన్న సాఫ్ట్వేర్ ఇంజినీర్ అభిలాష్ ర్యాష్ డైవింగ్ చేస్తూ ఇద్దరు యువకులను ఢీకొట్టడంతో వారు కిందపడి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ర్యాష్ డ్రైవింగ్ చేశాడని నిర్ధారించిన రాయదుర్గం పోలీసులు ఐపీసీ 304(ఏ)337, 279, సెక్షన్లతో పాటు 185 ఆఫ్ ఎంవీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఆల్కహాల్ 230ఎంజీ/100 ఎంఎల్గా ఉండటంతో కూకట్పల్లి ఆర్టీఏ అధికారులు 2019 నవంబర్ 15 నుంచి 2020 నవంబర్ 15 వరకు సంవత్సరం పాటు లైసెన్స్ రద్దు చేశారు. ఘటనా స్థలంలో సాయివంశీ కృష్ణ, ప్రవీణ్ మృతదేహాలు (ఫైల్) గత నవంబర్ 10న అర్ధరాత్రి 1 గంట సమయంలో కూకట్పల్లి శాంతినగర్ నివాసి అభిలాష్ పెదకొట్ల మెహిదీపట్నంలో మద్యం తాగి స్నేహితుడితో కలిసి ఐ20 కారులో కూకట్పల్లికి బయలుదేరారు. అభిలాష్ ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ బయోడైవర్సిటీ ఫ్లైఓవర్పై సెల్ఫీ దిగుతున్న సరూర్నగర్కు చెందిన పి.సాయి వంశీకృష్ణ (22), కిష్టాపూర్నకు చెందిన ఎన్.ప్రవీణ్ (22)లను ఢీకొట్టడంతో ఎగిరి కిందపడి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో మరో రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టడంతో నలుగురు గాయాలపాలయ్యారు. బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ ప్రారంభమైన 7 రోజులకే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. -
సేఫ్టీ ఆడిట్ మళ్లీ మొదటి నుంచి...
సాక్షి, సిటీబ్యూరో: బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్పై గత నవంబర్లో జరిగిన ప్రమాదం నేపథ్యంలో కొత్తగా నిర్మించే ఫ్లైఓవర్లన్నింటితోపాటు పాతవాటికి కూడా తగిన సేఫ్టీ ఏర్పాట్లు తీసుకోవడమే కాక.. నిపుణుల కమిటీ సూచనకనుగుణంగా అవసరాన్ని బట్టి అదనపు సేఫ్టీ ఏర్పాట్లు కూడా చేయాలని జీహెచ్ఎంసీ భావిస్తోంది. బయోడైవర్సిటీఫ్లెఓవర్ కారణంగా ముగ్గురు మృతి చెందడంతో ఫ్లైఓవర్ డిజైన్లోనే లోపాలనే ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తడం తెలిసిందే. స్వతంత్ర నిపుణుల కమిటీ సూచనలకనుగుణంగా ప్రయాణికులు వేగనిరోధక చర్యలు పాటించేందుకుఅవసరమైన సైనేజీలతోపాటు రంబుల్స్ట్రిప్స్ పెంచడం.. ప్రత్యేక మెటీరియల్తో రబ్బర్స్ట్రిప్స్ ఏర్పాటు చేయడం తెలిసిందే. ఈ అనుభవం నేర్పిన పాఠంతో ప్రస్తుతంపురోగతిలో ఉన్న ఫ్లై ఓవర్లకు, కొత్తగా చేపట్టబోయే ఫ్లై ఓవర్లకు అన్నింటికీ కూడా తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలను సిఫార్సు చేసేందుకు స్వతంత్ర నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని, ఫ్లై ఓవర్లు పూర్తయ్యాక కూడా సదరు నిపుణులతో సేఫ్టీ ఆడిట్ చేశాకే అందుబాటులోకి తేవాలని భావిస్తున్నారు. పనిలోపనిగా ఇప్పటికే వినియోగంలో ఉన్న పాత ఫ్లై ఓవర్లకు కూడా కమిటీ సిపార్సుల మేరకు తగిన సేఫ్టీ ఏర్పాట్లు చేయాలని యోచిస్తున్నారు. అన్ని ఫ్లై ఓవర్లకు కూడా వేగ పరిమితి హెచ్చరికలు, రంబుల్స్ట్రిప్స్తోపాటు క్రాష్బారియర్స్, వ్యూకట్టర్స్ తదితరమైన వాటితో రీడిజైన్లకు సిద్ధమవుతున్నారు. అంతేకాదు.. బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్కు తీసుకున్న సేఫ్టీ ఏర్పాట్లన్నీ కూడా తీసుకోనున్నారు. ముఖ్యంగా రెండో వరుసలో భూమికి దాదాపు 20మీటర్ల ఎత్తులో నిర్మించే ఫ్లై ఓవర్ల విషయంలో మరింత శ్రద్ధతో వీటిని అమలు చేయనున్నారు. రెండో వరుస ఫ్లై ఓవర్లపై ప్రత్యేక శ్రద్ధ.. వ్యూహాత్మక రహదారుల పథకం(ఎస్సార్డీపీ)లో భాగంగా దాదాపు రూ.25వేల కోట్లతో ఫ్లై ఓవర్లు, ఎక్స్ప్రెస్వేలు, తదితర పనులకు జీహెచ్ఎంసీ శ్రీకారం చుట్టడం తెలిసిందే. ఇందులో భాగంగా వివిధ దశల్లోని పనులు ప్రారంభమయ్యాయి. దాదాపు రూ. 3వేల కోట్ల విలువైన పనులుపురోగతిలో ఉన్నాయి. వీటిల్లో రెండో వరుసలో వచ్చే ఫ్లై ఓవర్లు కొన్ని ఉన్నాయి. బైరామల్గూడ జంక్షన్ వద్ద ఒవైసీ హాస్పిటల్వైపు నుంచి నాగార్జునసాగర్ రోడ్వైపు, విజయవాడ రోడ్వైపు వెళ్లే ఫ్లై ఓవర్ రెండో వరుసలో రానుంది. దాదాపు కిలోమీటరు పొడవుండే ఇది దాదాపు 15 మీటర్ల కంటే ఎత్తులో ఉంటుంది. అలాగే ఇందిరాపార్క్ నుంచి వీఎస్టీ వైపు వెళ్లేందుకు నిర్మించే స్టీల్బ్రిడ్జి అత్యంత ఎత్తులో భూమికి 20 మీటర్ల ఎత్తులోరానుంది. ఉప్పల్ జంక్షన్ వద్ద , ఇతరత్రా ప్రాంతాల్లోనూ రెండో వరుసలో ఫ్లై ఓవర్లు రానున్నాయి. దుర్గంచెరువుపై నిర్మించే కేబుల్ బ్రిడ్జి కూడా 20మీటర్ల ఎత్తులో రానుంది. అది చెరువుపైన ఉంటుంది కనుక దాని విషయంలో మరిన్నిజాగ్రత్తలు తీసుకోవాలని భావిస్తున్నారు. అంతేకాదు.. భవిష్యత్లో ఓఆర్ఆర్ వరకు ఎక్కడ ఫ్లై ఓవర్ నిర్మించినా రెండు, మూడు వరుసల్లో నిర్మించాలనే యోచన ఉంది. ప్రస్తుతానికి ఒక వరుస మాత్రమే అవసరమైనా భవిష్యత్ అవసరాల కనుగుణంగా భూసేకరణ కష్టాలు లేకుండా ఉండేందుకు, ప్రాజెక్టుల వ్యయం పెరగకుండా ఉండేందుకు నాగపూర్ తదితర నగరాల్లో మాదిరిగా రెండు వరుసల్లో ఫ్లై ఓవర్లు నిర్మించే యోచనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇక వచ్చే ఫ్లై ఓవర్లన్నింటికీ సేఫ్టీ ఆడిట్ కీలకంగా మారింది. సేఫ్టీ ఏర్పాట్ల వల్ల పెరిగే అదనపు లోడ్ను కూడా దృష్టిలో ఉంచుకొని నిర్మాణం ఆరంభం నుంచే తగిన జాగ్రత్తలు తీసుకోనున్నారు. పాత ఫ్లై ఓవర్లు ఎంతోకాలంగా వినియోగంలో ఉన్నందున సేఫ్టీ ఆడిట్ అవసరం లేదనే అభిప్రాయాలున్నా, ఎందుకైనా మంచిదనే తలంపుతో అవసరమని భావించిన వాటికి మాత్రం పాతవాటికి కూడా సేఫ్టీ ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నారు.కాగా ప్రమాదం అనంతరం కొద్ది రోజులు మూసివేసి...ఇటీవల అందుబాటులోకి తెచ్చిన బయో డైవర్సిటీ ఫ్లైఓవర్పై సేఫ్టీ మెజర్స్ను నెలరోజుల పాటు పరిశీలించి..అవసరమైతే మరిన్ని చర్యలు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్ ప్రారంభంలో పెద్ద గ్యాంట్రీ (ఓవర్హెడ్) సైన్బోర్డును ఏర్పాటు చేయాల్సిందిగా నిపుణుల కమిటీ సూచించినా, ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా ఆపనులు సాధ్యం కాకపోవడంతో చేపట్టలేదు. సంక్రాంతి సెలవుల సందర్భంగా నగరంలో ట్రాఫిక్ తగ్గుతుంది కనుక ఆ సమయంలో గ్యాంట్రీ నిర్మాణం చేపట్టనున్నట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
గీత దాటితే వాతే
గచ్చిబౌలి: బయో డైవర్సిటీ ఫ్లైవర్పై పరిమితికి మించి దూసుకెళితే వాత తప్పదు. బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్పై వాహనదారులు పాటించాల్సి నిబంధనలను ఆదివారం సైబరాబాద్ పోలీసులు విడుదల చేశారు. ఎస్ఆర్డీపీ–సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్పై అదనపు భద్రతా చర్యల్లో భాగంగా మార్గదర్శకాలు రూపొందించారు. సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షించనున్నారు. ఐబీఎం వద్ద బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్పైకి వచ్చే వాహనదారులు సూచికల బోర్డులను తప్పక చూడాల్సిన పరిస్థితి నెలకొంది. సూచికలు చూడకుండా వెళ్లి గీత దాటినా, వేగంగా వెళ్లినా జరిమానా తప్పదని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ద్విచక్ర వాహనదారులు ఎడమ వైపు లేన్లో మాత్రమే వెళ్లాలి. కుడి వైపు లైన్ దాటినా , వేగంగా వెళ్లినా, మధ్యలో ఆపినా సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా చలానా విధిస్తారు. ద్విచక్ర వాహన దారులు హెల్మెట్ లేకుండా బైక్ నడిపినా ఈ–చలానా తప్పదు. కార్లు కుడి వైపు ఉన్న లేన్లో మాత్రమే వెళ్లాలి, ఎడమ వైపు లైన్ దాటినా, 40 కిలో మీటర్ల వేగం మించినా ఫైన్ కట్టాల్సిందే. అంతే కాకుండా ఫ్లైఓవర్పై ఎవరూ వాహనాలను నిలుపరాదు, ఎదురుగా నడుచుకుంటూ వెళ్లడం నిషేదం. సెల్ఫీల కోసం ఆగినా చలానా విధిస్తారు. ఫ్లై ఓవర్పై పాదచారులు వెళితే జరిమానా తప్పదు. భారీ వాహనాలు, బస్సుల రాకపోకలను నిషేధిస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు. చదవండి : బయోడైవర్సిటీ ఫ్లైఓవర్పై రాకపోకలు షురూ! -
బయోడైవర్సిటీ ఫ్లైఓవర్పై రాకపోకలు షురూ!
రాయదుర్గం: గచ్చిబౌలిలోని బయోడైవర్సిటీ ఫ్లైఓవర్పై రాకపోకలు మళ్లీ ప్రారంభమయ్యాయి. శనివారం ఉదయం 9.30 గంటల నుంచి వాహనాలను పోలీసులు అనుమతించారు. రాయదుర్గం మీదుగా మాదాపూర్ వెళ్లే వాహనాలను ఈ ఫ్లైఓవర్ మీదుగా వెళ్లేందుకు అనుమతించారు. ఉదయం 9 గంటలకు హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్, ట్రాఫిక్ డీసీపీ విజయకుమార్, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ హరిచందన, జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసు అధికారులు తమ వాహన శ్రేణితో ఫ్లైఓవర్పై ట్రయల్రన్ నిర్వహించారు. అనంతరం ఇతర వాహనాలను అనుమతించారు. నవంబర్ 23న ఈ ఫ్లైఓవర్పై కారు ప్రమాదం చోటు చేసుకోవడంతో గత 42 రోజులుగా వాహనాల రాకపోకలను నిలిపివేసిన విషయం తెలిసిందే. సీసీ కెమెరాలు, సైన్ బోర్డుల ఏర్పాటు... ఫ్లైఓవర్పై ప్రమాదాలు చోటుచేసుకోకుండా అధికారులు పలు చర్యలు చేపట్టారు. 40 కిలోమీటర్లకు మించి వేగంగా వెళ్లరాదని రోడ్డుపై అక్కడక్కడా రబ్బర్ స్ట్రిప్స్, సైన్ బోర్డుల ఏర్పాటుతోపాటు సైడ్వాల్ రీలింగ్ను మరింత ఎత్తుకు పెంచారు. అలాగే స్పీడ్ బ్రేకర్లు, సీసీ కెమెరాలు, మలుపులను సూచించే బోర్డులు ఏర్పాటు చేశారు. భారీ వాహనాలకు, పాదచారులకు అనుమతిలేదని బోర్డులు పెట్టారు. -
బయె డైవర్సిటీ ఫ్లై ఓవర్ పుఃన ప్రారంభం
-
దడ పుట్టిస్తున్న బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్
సాక్షి, హైదరాబాద్: ఒక చోట కుడి వైపు, మరో చోట ఎడమ వైపు ప్రమాదకరంగా ఉన్న మలుపులతో బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్ అంటేనే ప్రయాణికుల్లో దడ అని చెప్పాలి. రెండో ప్రమాదంతో నవంబర్ 23న జీహెచ్ఎంసీ అధికారులు ఫ్లైఓవర్ను మూసి వేశారు. నెల రోజులు దాటినా ఇప్పటి వరకు వాహనాల రాకపోకలు పునరుద్ధరించలేదు. ఇంకా భద్రతా చర్యల పేరిట దిద్దుబాటు పనులు చేపడుతున్నారు. నిపుణుల కమిటీ అధ్యయనం, నివేదికతో దిద్దుబాటు చర్యల్లో కొంత జాప్యం జరిగింది. సరిగ్గా నెల రోజుల క్రితం బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ కారు ప్రమాదంతో ఉలిక్కిపడ్డ ఐటీ కారిడార్, ఆ ఘటన ఇంకా అక్కడి ప్రయాణికుల కళ్లలో మెదులుతూనే ఉంది. ప్రారంభమైన వారానికే ప్రమాదం... రూ.69.47 కోట్ల వ్యయంతో నిర్మాణం పూర్తి చేసుకున్న బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ను మంత్రి కేటీఆర్ నవంబర్ 4న ప్రాంభించారు. సరిగ్గా వారం రోజులు తిరగక ముందే నవంబర్ 10న అర్థరాత్రి ఫ్లైఓవర్పై సెల్ఫీ దిగుతుండగా ఐ20 కారు అతి వేగంగా వచ్చి ఢీ కొనడంతో ప్రవీణ్(22), సాయి వంశీ రాజు(22) ఫ్లై ఓవర్పై నుంచి కిందపడి అక్కడిక్కడే మృతి చెందారు. మరో 13 రోజులకు అంటే నవంబర్ 23న వోక్స్ వ్యాగన్ కారు 105.8 కిలోమీటర్ల వేగంతో వచ్చి ఫ్లైఓవర్పై నుంచి పల్టీలు కొడుతూ కిందపడటంతో పసల సత్యవేణి(56) మృతి చెందగా మరో నలుగురికి గాయలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జీహెచ్ఎంసీ అధికారులు ఫ్లై ఓవర్ను మూసివేశారు. 1200కు పైగా రంబుల్ స్ట్రిప్స్... బయోడైవర్సిటీ ఫ్లైఓవర్పై 1200కు పైగా రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు చేశారు. నాలుగు వరుసలుగా చిన్నవి వెయ్యికి పైగా ఉన్నాయి. అడ్డం ఫ్లై ఓవర్ పొడవునా 12 చోట్ల స్పీడ్ బ్రేకర్లుగా రంబుల్ స్ట్రిప్స్ వేశారు. ఫ్లై ఓవర్ పొడవునా నాలుగు వరుసలుగా తెల్ల రంగు, ఎరుపు రంగు క్యాట్ ఐస్ను ఏర్పాటు చేశారు. ఫ్లైఓవర్ మధ్యలో ఎడమ వైపు సైడ్ వాల్పై రేలింగ్ ఏర్పాటు చేశారు. బయట ఉంచి ఏమి కనిపించ కుండా రేలింగ్కు సైనేజీ బోరుల్డను ఏర్పాటు చేయనున్నారు. వంద మీటర్ల పొడవునా రేలింగ్ ఏర్పాటు చేసి సైనేజీ బోర్డులను ఏర్పాటు చేస్తారు. రాయదుర్గం వైపు నుంచి వాహనదారులకు ప్రమాదకరంగా ఉన్న మలుపు వద్ద ఎడమ వైపు వ్యూ కనిపించదు. దీంతో వాహనాలను నెమ్మదిగా నడిపే వీలుంటుంది. స్పీడ్ లిమిట్, మూల మలుపులు, ట్రాఫిక్ నిబంధనలు తెలియజేసే సైన్ బోర్డులను ఫ్లై ఓవర్ పొడవునా ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉంచారు. అంతే కాకుండా ప్రత్యేక మెటీరియల్తో ఫ్లైఓవర్పై స్పీడ్లిమిట్ 40 కి. మీ. అని తెలిసేలా రంబుల్ స్ట్రిప్స్ వేశారు. అవసర మైన చోట రబ్బర్ స్పీడ్ బ్రేకర్లు అమర్చనున్నారు. రోడ్డు దాటాలంటే నరకం... బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ పై నుంచి వెళ్లే వాహనాలు ఐకియా వైపు వేగంగా వెళుతుంటాయి.ఫ్లై ఓవర్ ఎండ్ కాగానే 200 మీటర్ల దూరంలో అనేక మంది వలస కూలీలు రోడ్డు దాటుతుంటారు. ఫ్లై ఓవర్ నుంచి రోడ్డుపైకి వచ్చే వాహనాల వేగం ఎక్కువగా ఉండడంతో రోడ్డు దాటే పాదాచారులు ప్రమాదాల బారీన పడే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ఇద్దరు కూలీలు మృతి చెందారు. గత నవంబర్ 18న రాత్రి 12 గంటల సమయంలో మై హోం భూజకు వెళ్లేందుకు హౌస్ కీపింగ్ పనులు చేసే నవల్ రాయ్(49), భాగేలు మహతో(56)లు రోడ్డు దాటుతుండగా ఫ్లై ఓవర్ పై నుంచి వేగంగా వచ్చిన ఎక్స్యూవీ కారు ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. రాయదుర్గం నాలెడ్జ్ సిటీలోని బహుళ అంతస్తుల నిర్మాణ పనుల్లో వేలాది మంది కూలీలు పని చేస్తున్నారు. నిత్యం ఉదయం, సాయంత్రం, రాత్రి సమయాల్లో రోడ్డు దాటుతుంటారు. ఫ్లై ఓవర్ పై నుంచి వచ్చే వాహనాల వల్ల ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాల్సి ఉంది. -
40 సేఫ్టీ
సాక్షి, సిటీబ్యూరో: విశ్వసనీయ సమాచారం మేరకు నిపుణుల కమిటీ తన నివేదికలో 40 కి.మీ.ల వేగం బయోడైవర్సిటీ ఫ్లైఓవర్పై ప్రయాణం సురక్షితమేనని పేర్కొంది. ఇదే సమయంలో ఫ్లైఓవర్పై నిర్ణీత వేగం మించి వెళ్లకుండా ఉండేందుకు వేగ నిరోధక చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. ఫ్లైఓవర్కు ఇప్పటికే ఉన్న భద్రత చర్యలకు తోడు అదనంగా మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని నివేదికలో పేర్కొంది. వివిధ అంశాలను, ఇండియన్ రోడ్ కాంగ్రెస్ ప్రమాణాలను, ఫ్లైఓవర్ డిజైన్, జామెట్రి తదితర అంశా>లను కూలంకషంగా విశ్లేషించిన కమిటీ ఫ్లైఓవర్పై వెళ్లే వాహనదారులు వేగ పరిమితి కచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది. కమిటీ సిఫార్సులకనుగుణంగా జీహెచ్ఎంసీ అదనపు భద్రత ఏర్పాట్లను వెంటనే చేపట్టనుంది. ఈ ఏర్పాట్లు పూర్తి చేశాక, నిపుణుల కమిటీ వాటిని పరిశీలించి ప్రయాణానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చాకే జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసులు తిరిగి వాహన ప్రయాణానికి అనుమతించనున్నారు. మానవ వైఖరి వల్ల, విపరీత వేగం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున, వేగాన్ని కట్టడి చేసేందుకు కమిటీ కొన్ని అంశాలు సిఫార్సు చేసినట్లు తెలిసింది. సిఫార్సుల్లో ముఖ్యాంశాలిలా ఉన్నాయి. చిన్నపాటి స్పీడ్బ్రేకర్లు.. ♦ సాఫీగా రయ్మని దూసుకుపోయేలా ఉన్న ఫ్లైఓవర్పై వేగాన్ని తగ్గించకుండా వెళ్లేవారిని కట్టడి చేసేందుకు సాధారణ రంబుల్స్ట్రిప్స్కు వాడేథర్మోప్లాస్టిక్ పెయింట్ కాకుండా బాగా దృఢంగా ఉండే ప్రత్యేకమైన మెటీరియల్ను వాడాలని కమిటీ సిఫార్సు చేసింది. ♦ ప్రత్యేక మెటీరియల్తో రంబుల్ స్ట్రిప్స్ 20 మి.మీ. మందంతో ఉండేవి ఒకదాని తర్వాత ఒకటిగా వరుసగా 6 ఏర్పాటు చేయాలి. అంటే ఇవి చిన్నపాటి స్పీడ్బ్రేకర్లలా ఉంటాయి. సాధారణంగా రంబుల్స్ట్రిప్స్ నగరంలో 2.5 మి.మీల నుంచి 5 మి.మీ., 7.5 మి.మీ. మందంతో వేస్తున్నారు. 20 మి.మీ.ల మందంతో ప్రతి వంద మీటర్ల చొప్పున ఫ్లై ఓవర్ పొడవునా దాదాపు 9 ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలి. వీటిని అప్పటికప్పుడే అక్కడే తయారు చేసి వేయాల్సి ఉంటుంది. దీన్ని ఇన్సిటు రంబుల్స్ట్రిప్గా వ్యవహరిస్తారు. ♦ ఫ్లై ఓవర్ కర్వ్ ప్రాంతానికి 135 మీటర్లకుముందు కూడా ఇవి ఏర్పాటు చేయాలి. ♦ ప్రస్తుతమున్న క్రాస్ బారియర్ ఎత్తును అదనంగా మరో 1.5 మీటర్లు పెంచాలి. ♦ తద్వారా సెల్ఫీలు తీసుకోవాలనే ఆలోచన రాదు. మానసికంగానూ ధైర్యంగా ఉంటారు. ♦ ఫ్లైఓవర్ పైకి ఎక్కడానికి ముందునుంచే అడుగడుగునా హెచ్చరికలు, వేగపరిమితిని సూచించే సైనేజీలు ఏర్పాటు చేయాలి. వాటిని ఎక్కడెక్కడ ఎలా ఏర్పాటుచేయాలో కూడా కమిటీ సూచించింది. ♦ అందరికీ బాగా కనిపించేలా పెద్దదైన ఓవర్హెడ్ సైనేజీని ఫ్లై ఓవర్కు దాదాపు 100 మీటర్లకు ముందుగా ఏర్పాటు చేయాలి. దీనిపై వేగపరిమితి 40 కేఎంపీహెచ్ దాటవద్దని, మలుపులున్నాయని సూచించాలి. ఐదున్నర మీటర్ల పొడవుతో దీన్ని ఏర్పాటు చేయాలి. ఓరియన్ విల్లా దగ్గరున్న ఎఫ్ఓబీ మీద కానీ, మరో చోట కానీ దీన్ని ఏర్పాటు చేయవచ్చని సూచించారు. ♦ మైండ్స్పేస్, మాదాపూర్, కూకట్పల్లి వైపు వెళ్లే వారే ఫ్లైఓవర్ ఎక్కాలి. గచ్చిబౌలి, లింగంపల్లి వైపు వెళ్లేవారు ఎక్కరాదు అని తెలుపుతూ కూడా సైనేజీలు ఏర్పాటు చేయాలి. ♦ స్పీడ్ కంట్రోల్ కావడానికి ఏయే లొకేషన్లలో మార్కింగ్లు, సైనేజీలు ప్రత్యేకంగా ఎలా ఉండాలో కూడా సిఫార్సు చేశారు. ♦ ప్రమాదం జరిగిన ఫ్లైఓవర్పై నిపుణుల కమిటీ సభ్యులు వివిధ రోజుల్లో, రాత్రుళ్లు వివిధ సమయాల్లో నాలుగైదు పర్యాయాలు వివిధ వేగాలతో ప్రయాణించి చూశారు. ♦ కమిటీ సభ్యులు డిజైన్ డ్రాయింగ్లు, టెండర్లకు ముందుగా ఆమోదం పొందిన డీపీఆర్, ఈపీసీ ప్రాజెక్ట్ షెడ్యూల్స్, నిర్మాణ డ్రాయింగ్లు పరిశీలించారు. బంప్ ఇంటిగ్రేటర్తో రఫ్నెస్ సర్వే, బ్రిటిష్ పెండ్యులమ్ టెస్టర్తో స్కిడ్ రెసిస్టెన్స్, శాండ్ ప్యాచర్ పరీక్ష ద్వారా టెక్స్చర్ మీన్ డెప్త్ తదితరాలను అధ్యయనం చేశారు. ♦ నలుగురు నిపుణుల కమిటీలో ప్రపంచబ్యాంకు రోడ్డు సేఫ్టీ విభాగం సలహాదారుప్రొఫెసర్ ఎస్.నాగభూషణ్రావు, రోడ్డుసేఫ్టీ, ట్రాఫిక్, ఇంజినీరింగ్ నిపుణులు డా.టి.ఎస్.రెడ్డి, ఓయూ ట్రాఫిక్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ అసోసియేట్ ప్రొఫెసర్ శ్రీనివాస్ కుమార్, రోడ్సేఫ్టీ ఆడిట్ ఎక్స్పర్ట్ ప్రదీప్రెడ్డిలు ఉండటంతెలిసిందే. -
బయోడైవర్సిటీ ప్రమాదం.. పోలీసులకు కోర్టులో చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్ : బయోడైవర్సిటీ ప్లైఓవర్ కారు ప్రమాదం కేసులో రాయదుర్గం పోలీసులకు మరోసారి చుక్కెదురైంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న కృష్ణ మిలన్రావు దాఖలు చేసిన పిటిషన్పై గురువారం హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. కృష్ణ మిలన్రావును జనవరి 3వ తేదీ వరకు అరెస్ట్ చేయవద్దని న్యాయస్థానం ఈ సందర్భంగా పోలీసులను ఆదేశించింది. కారు యాక్సిడెంట్ చేసిన వ్యక్తిపై 304(2) సెక్షన్ ఎలా పెడతారని రాయదుర్గం పోలీసులను ప్రశ్నించింది. తదుపరి విచారణను జనవరి 3వ తేదీకి వాయిదా వేసింది. కాగా, కృష్ణ మిలన్రావు నిర్లక్ష్యం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని పోలీసులు కోర్టుకు తెలిపారు. నిందితుడు అధిక వేగంతో దూసుకెళ్లినందునే ఈ ప్రమాదం జరిగినట్లు ఆధారాలు సేకరించామన్నారు. అంతకుముందు నిందితుడిని డిసెంబర్ 12వ తేదీ వరకు అరెస్ట్ చేయరాదని కోర్టు స్టే ఇచ్చిన సంగతి తెలసిందే. కాగా, నవంబర్ 23న మధ్యాహ్నం బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ పైనుంచి కారు అదుపు తప్పి ఫల్టీలు కొడుతూ రోడ్డుపై పడిన ఘటనలో సత్యవతి(56) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా కుబ్రా(23), బాలరాజ్ నాయక్, ప్రణిత గాయాల పాలయ్యారు. -
‘బయోడైవర్సిటీ’ ప్రమాద కారకుడు అతడే
సాక్షి, హైదరాబాద్: రాజధానిలో కలకలం రేపిన బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ కారు ప్రమాదం కేసు హైకోర్టుకు చేరింది. ప్రమాదానికి కారకుడు కల్వకుంట్ల కృష్ణ మిలన్రావు అని తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్లో రాయదుర్గం పోలీసులు పేర్కొన్నారు. ఇంత పెద్ద ప్రమాదానికి కృష్ణ మిలన్రావు కారణమని, అతడి నిర్లక్ష్యం వల్లే దుర్ఘటన జరిగిందని వెల్లడించారు. ప్రమాదం జరిగిన సమయంలో కృష్ణ మిలన్రావు 120 కిలోమీటర్ల పైగా వేగంతో కారు నడుపుతున్నాడని తెలిపారు. నిర్లక్ష్యంగా అతి వేగంతో కారు నడిపి మహిళ మరణానికి కారకుడైన అతడిని అరెస్ట్ చేయడానికి అనుమతి ఇవ్వాలని హైకోర్టును పోలీసులు కోరారు. కాగా, ఈ నెల 12 వరకు అతడి అరెస్ట్పై హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. తనను అరెస్ట్ చేయకుండా చూడాలని కృష్ణ మిలన్రావు ఈ నెల 4న దాఖలు లంచ్ మోషన్ పిటిషన్ను విచారించిన ఉన్నత న్యాయస్థానం ఈమేరకు ఆదేశాలు ఇచ్చింది. పోలీసులు కౌంటర్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈనెల 12న హైకోర్టు విచారణ చేపట్టనుంది. సంబంధిత వార్తలు.. నా తప్పేంలేదు.. పోలీసులు వేధిస్తున్నారు బయో డైవర్సిటీ ఫ్లైఓవర్పై ఘోర ప్రమాదం డిజైన్ లోపమేనా? బయోడైవర్సిటీ ప్రమాదంపై ‘సీన్ రీ క్రియేట్’ -
బయోడైవర్సిటీ ప్రమాదం; అప్డేట్స్
సాక్షి, హైదరాబాద్: బయోడైవర్సిటీ కారు ప్రమాద ఘటనలో నిందితుడు కల్వకుంట్ల కృష్ణ మిలన్రావు గచ్చిబౌలిలోని కేర్ ఆస్పత్రిలో 16 రోజులుగా చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి డిశ్చార్జి అయినట్లు రాయదుర్గం సీఐ రవీందర్ తెలిపారు. నవంబర్ 23న మధ్యాహ్నం బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ పైనుంచి కారు అదుపు తప్పి నుంచి ఫల్టీలు కొడుతూ రోడ్డుపై పడిన ఘటనలో సత్యవతి(56) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా కుబ్రా(23), బాలరాజ్ నాయక్, ప్రణిత గాయాల పాలయ్యారు. ఈ ఘటనలో గాయపడిన నిందితుడు కృష్ణ మిలన్రావు కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 4న హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేయగా ఈ నెల 12 వరకు అతడిని అరెస్ట్ చేయరాదని కోర్టు స్టే ఇచ్చినట్లు సీఐ తెలిపారు. ఐపీసీ 304ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేశామని, డిసెంబర్ 3న ఐపీసీ 304(కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్) సెక్షన్గా మార్చామన్నారు. 40 కిలో మీటర్ల వేగంతో వెళ్లాలని సూచికల బోర్డులు ఉన్నా, 105.8 కిలో మీటర్ల వేగంతో దూసుకెళ్లినందునే ఈ ప్రమాదం జరిగినట్లు ఆధారాలు సేకరించామన్నారు. ఈ నెల 12న కౌంటర్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు. లంచ్మోషన్ పిటిషన్లో బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్ బ్రిడ్జి ఎస్ ఆకారంలో ఉందని, డిజైన్ లోపాల కారణంగానే ప్రమాదం జరిగిందని, తన తప్పిదం లేదని, తక్కువ వేగంతోనే కారు నడిపానని, బెయిల్ ఇవ్వాల్సిన కేసులో అరెస్ట్ చేస్తామని పోలీసులు వేధిస్తున్నారని, బెడ్ రెస్ట్ అవసరమని నిందితుడు పిటిషన్లో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. సంబంధిత వార్తలు.. బయో డైవర్సిటీ ఫ్లైఓవర్పై ఘోర ప్రమాదం డిజైన్ లోపమేనా? బయోడైవర్సిటీ ప్రమాదంపై ‘సీన్ రీ క్రియేట్’ సత్యవాణి కుటుంబానికి రూ.5 లక్షలు -
బాధితులకు ఆపన్న హస్తం
సాక్షి, హైదరాబాద్: బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ నుంచి కారు పల్టీ కొట్టిన ప్రమాదంలో మృతి చెందిన పసల సత్యవాణి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం రూ.5 లక్షల పరిహారాన్ని అందించింది. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడుకు చెందిన సత్యవాణి కుమార్తె నాగప్రణీత పేరు మీద ఉన్న చెక్కును ఆమె మేనమామ చక్రవర్తి అందుకున్నారు. జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో చెక్కును అందజేశారు. ఇదే ప్రమాదంలో తుంటి ఎముక విరిగి కేర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న అనంతపురం జిల్లాకు చెందిన కుబ్ర బేగం(23)కు వైద్య సేవల కోసం ఇప్పటికే రూ.3.50 లక్షలు చెల్లించామని మేయర్ తెలిపారు. ఆమె పూర్తిగా కోలుకునే వరకయ్యే ఖర్చులను జీహెచ్ఎంసీ తరఫున భరిస్తామన్నారు. చెక్కు అందజేస్తున్న మేయర్ రామ్మోహన్ గత నెల 23న బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ వద్ద జరిగిన ప్రమాదంలో సత్యవాణి దుర్మరణం పాలయ్యారు. ఏడాదిగా మణికొండలో ఉంటున్న ఆమె కుమార్తె ప్రణీతతో కలిసి అద్దె ఇల్లు కోసమని, కూకట్పల్లిలోని బంధువులను కలిసేందుకు వెళ్లి ప్రమాదం బారిన పడ్డారు. కళ్లెదుటే తల్లి సత్యవేణిని పొగొట్టుకున్న ప్రణీత (26) స్వల్ప గాయాలతో బయటపడింది. ఆరు నెలల క్రితం నగరానికి వచ్చి ఉద్యోగాన్వేషణలో ఉన్న అనంతపురం జిల్లా యువతి కుబ్ర బేగం తీవ్రంగా గాయపడి కోలుకుంటోంది. ఆటో డ్రైవర్ ముడావత్ బాలూ నాయక్(38) ఎడమ కాలి పాదం పూర్తిగా దెబ్బతింది. సంబంధిత వార్తలు.. బయో డైవర్సిటీ ఫ్లైఓవర్పై ఘోర ప్రమాదం డిజైన్ లోపమేనా? బయోడైవర్సిటీ ప్రమాదంపై ‘సీన్ రీ క్రియేట్’ ఫ్లై ఓవర్ ప్రమాదం: బేగంకు ‘అనంత’ చేయూత -
బయోడైవర్సిటీ ప్రమాదంపై ‘సీన్ రీ క్రియేట్’
సాక్షి, హైదరాబాద్: సాధారణంగా నేర సంఘటనల్లో అవసరం మేరకు పోలీసులు ‘సీన్ రీ క్రియేట్’ చేస్తుంటారు. ఇప్పుడు జీహెచ్ఎంసీ ఇంజినీర్లు బయోడైవర్సిటీ ఫ్లైఓవర్పై శనివారం జరిగిన ప్రమాదం నేపథ్యంలో అదే ప్రక్రియను అవలంబించారు. వంతెనపై వాహనం ఎంత వేగంతో వెళ్తే ప్రయాణం ఎలా ఉంటుందో తెలుసుకోవడంతో పాటు స్పీడ్ను కంట్రోల్ చేయవచ్చా లేదా అనేది గుర్తించేందుకు తమ డ్రైవర్ను తీసుకెళ్లి సీన్ రీ కన్స్ట్రక్షన్ చేసి పరిశీలించారు. ఆదివారమే జరిగిన ఈ ‘రీ కన్స్ట్రక్షన్’ గురించి విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. శనివారం ప్రమాదం జరగడంతో వివిధ అంశాల పరిశీలనకు ఆదివారం కూడా అక్కడకు వెళ్లిన ఇంజినీరింగ్ అధికారులకు వారి డ్రైవర్ ఆసక్తి కొద్దీ ‘సార్.. అంత స్పీడ్తో వెళ్లినా జాగ్రత్తగా ఉంటే ఆపవచ్చు. నేను మన కారు నడుపుతా’ అన్నాడు. దాంతో ఒక్కసారిగా ఆలోచనల్లో పడ్డ ఇంజినీర్లు ఫ్లై ఓవర్పై అంత స్పీడ్తో వెళ్లవద్దు కదా.. అనుకున్నప్పటికీ డ్రైవర్ నైపుణ్యం, జాగ్రత్తగా వాహనం నడిపే తీరు గురించి తెలిసి ఉండటంతో వాటిని పరిగణనలోకి తీసుకొని సరే అన్నారు. అంతకుముందే కారు ప్రమాదం జరిగిన తీరు.. ఎక్కడ క్రాష్ బారియర్ను ఢీకొని ముందుకు వెళ్లిందీ.. తదితరమైనవి చూసిన డ్రైవర్ సరిగ్గా ఆ ప్రదేశానికి చేరుకునేందుకు కొన్ని క్షణాలు ముందుగా కారును ఆపే ప్రయత్నం చేయగా ఆగిపోయింది. ఆ సందర్భంలో డ్రైవర్ ఆసక్తిని కాదనలేకపోయిన అధికారులు వాహనం దిగాక డ్రైవింగ్ సామర్థ్యం, నైపుణ్యం ఎంతగా ఉన్నప్పటికీ, ఎక్కడా పరిమితి మించిన వేగంతో వెళ్లొద్దని, నిబంధనలు, సైనేజీల్లోని సూచనల మేరకే నడచుకోవాలని అధికారులు తమ డ్రైవర్ను హెచ్చరించినట్లు సమాచారం. శనివారం ప్రమాదానికి గురై బోల్తా పడ్డ కారు ఫోక్స్ వాగన్ కాగా, అధికారులు తమ ఇన్నోవా వాహనంలో వెళ్లారు. ఇదిలా ఉండగా, అంత వేగంతో వాహనాన్ని నడిపిన వ్యక్తి కనీసం బ్రేక్ వేసే ప్రయత్నం చేసినట్లు కూడా కనిపించలేదని సీసీఫుటేజీల్లోని దృశ్యాల ఆధారంగా అధికారులు భావించినట్లు సమాచారం. బ్రేక్ వేస్తే వాహనం వెనుక ఉండే ఎరుపురంగు లైట్లు వెలుగుతాయని, సీసీ ఫుటేజీ దృశ్యాల్లో అది కనిపించకపోవడంతో బ్రేక్ కూడా వేయలేదని భావిస్తున్నారు. ఒకవేళ బ్రేక్ వేయబోయి ఆందోళనలో ఎక్సలేటర్ తొక్కి ఉంటాడని అభిప్రాయపడ్డట్లు సమాచారం. అధ్యయనంలో నిపుణుల కమిటీ ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా స్వతంత్ర నిపుణుల కమిటీ అధ్యయనంలో వెల్లడయ్యే అంశాల వారీగానే అధికారులు తదుపరి చర్యలు చేపట్టనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే నలుగురు నిపుణులతో కూడిన స్వతంత్ర కమిటీ ఫ్లై ఓవర్కు సంబంధించిన డిజైన్లు, ప్లాన్లు జీహెచ్ఎంసీ అధికారుల నుంచి తీసుకుని పని ప్రారంభించారు. -
కుబ్రా బేగంకు అనంత వెంకట్రామిరెడ్డి చేయూత
సాక్షి, అనంతపురం : వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి మంచి మనసును చాటుకున్నారు. హైదరాబాద్లోని బయో డైవర్సిటీ ఫ్లైఓవర్ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన కుబ్రా బేగం (23)కు చేయూత అందించారు. లెటర్ ఆఫ్ క్రెడిట్ కింద బాధిత యువతికి హైదరాబాద్లో మెరుగైన చికిత్సలు అందిస్తున్నారు. అలాగే బాధితురాలికి సీఎం రిలీఫ్ ఫండ్ విడుదలయ్యేలా అధికారులతో సంప్రదింపులు జరిపారు. అనంత వెంకట్రామిరెడ్డి వినతి మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీఎం సహాయకనిధి నుంచి రూ.3,60,000 మంజూరు చేసింది. (చదవండి : బయో డైవర్సిటీ ఫ్లైఓవర్పై ఘోర ప్రమాదం) అనంతపురంనకు చెందిన కుబ్రా బేగం శనివారం హైదరబాద్లోని ఓ కంపెనీకి ఇంటర్వ్యూకు హాజరై సెలక్ట్ కూడా అయింది. ఈ వార్తను సెల్ఫోన్లో అనంతపురంలో ఉన్న తండ్రి తో పంచుకుంటున్న సమయంలోనే రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రస్తుతం ఆస్పత్రిలో ఒంటినిండా గాయాలతో చావుబతుకులతో పోరాడుతోంది. గచ్చిబౌలిలోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ప్రమాదంలో కుబ్రా వెన్నెముక దెబ్బతిందని, ఆపరేషన్ కోసం రూ.6లక్షలు ఖర్చు అవుందని వైద్యులు చెప్పారు. (చదవండి : రూపాయి లేదు..వైద్యమెలా!) తప్పకుండా ఆదుకుంటా: కేటీఆర్ ఫ్లైఓవర్ ప్రమాదంలో గాయపడిన కుబ్రా బేగం (23) ను తప్పకుండా ఆదుకుంటామని తెలంగాణ మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘రూపాయి లేదు..వైద్యమెలా!’ అనే శీర్షికతో సోమవారం ‘సాక్షి’లో వచ్చిన కథనాన్ని ఓ నెటిజన్ కేటీఆర్కు ట్విట్ చేశారు. ఎలాగైనా ఆ యువతిని ఆదుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన కేటీఆర్.. ఆమెకు మెరుగైన వైద్యం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఆమె ఆరోగ్యంపై మేయర్ బొంతు రామ్మోహన్తో చర్చించానని చెప్పారు. కుబ్రా కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. Absolutely will be taken care. I have already asked Hyderabad Mayor @bonthurammohan to visit her and assure her parents of all support that is required https://t.co/MRZKlHz52Z — KTR (@KTRTRS) November 25, 2019 -
రూపాయి లేదు..వైద్యమెలా!
సాక్షి, హైదరాబాద్/గచ్చిబౌలి: కష్టాలు, కన్నీళ్లు దిగమింగి బీటెక్ పూర్తి చేసిందామె. ఏడాది క్రితమే అనంతపురం నుంచి హైదరాబాద్ వచ్చి ఎస్సార్ నగర్ హాస్టల్లో ఉంటూ ఓ వైపు ప్రత్యేక కోర్సులు, మరోవైపు ఇంటర్వూ్యలకు హాజరవుతూ అదృష్టా న్ని పరీక్షించుకుంటోంది. శనివారం ఓ కంపెనీ ఇంటర్వూ్యకు హాజరై సెలక్ట్ కూడా అయింది. ఈ వార్తను సెల్ఫోన్లో అనంతపురంలో ఉన్న తండ్రి తో పంచుకుంటున్న సమయంలోనే రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రస్తుతం ఆస్పత్రిలో ఒంటినిండా గాయాలతో చావుబతుకులతో పోరాడుతోంది. ఇది శనివారం బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన కుబ్రా బేగం (23) దుస్థితి. ప్రసుత్తం ఆమె గచ్చిబౌలిలోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆస్పత్రి వద్ద కుబ్రా తల్లిదండ్రులు చేతిలో రూపాయి లేక విలవిల.. అనంతపురంనకు చెందిన కుబ్రా బేగం తండ్రి అబ్దుల్ అజీం. పెయింటర్గా సాదాసీదా జీవనం సాగిస్తూ కూతురు కుబ్రాతో పాటు కుమారుడు కాలిఖ్ను ఉన్నత చదువులు చదివించాడు. ఆయన సంపాదనంతా పిల్లల చదువులు, జీవనోపాధికే సరిపోయింది. ప్రమాదం గురించి తెలియగానే కుబ్రా తండ్రి, తల్లి, సోదరుడు హైదరాబాద్కు బయల్దేరారు. ఆదివారం తెల్లవారుజామున నగ రానికి చేరుకున్న కుబ్రా తల్లిదండ్రులకు ఆస్పత్రి వైద్యులు వైద్య పరీక్షల నిమిత్తం రూ.లక్షా పది వేలు అయ్యాయని చెప్పారు. కుబ్రాకు ఒళ్లంతా గాయాలున్నాయని, ఆపరేషన్ కోసం రూ.5 లక్షలు ఖర్చు అవుతుందని, చెల్లిస్తే మిగతా వైద్యం చేస్తామని తెలిపారు. అప్పటికే హైదరాబాద్లోని సమీప బంధువుల నుంచి రూ.30 వేలు తీసుకుని ఫీజు చెల్లించిన అబ్దుల్ రూ.5 లక్షల కోసం తనకు తెలిసిన వారందరికీ ఫోన్లు చేశాడు. అయినా ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆస్పత్రి ఎదుటే భార్య, కుమారుడితో విషాదంగా గడిపేశాడు. చేతిలో రూపాయి లేక కుబ్రాకు వైద్యం ఎలా చేయిం చాలో తెలియక సతమతమవుతున్నాడు. కుబ్రాను ఆస్పత్రిలో చేర్చించిన పోలీసులు ఆపై అటు కన్నెత్తి చూడలేదని వారు వాపోతున్నారు. ఆదివారం రాత్రి కుబ్రా సోదరుడు ‘సాక్షి’ప్రతినిధితో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యాడు. తాము నిరుపేదలమని, రూ.5 లక్షలు చెల్లించే స్థోమత తమకు లేదని తన అక్క ప్రాణాలను ఎలాగైనా కాపాడాలని తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలను వేడుకున్నాడు. -
బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ ప్రమాదం.. కేసు నమోదు
సాక్షి హైదరాబాద్ : గచ్చిబౌలి బయోడైవర్సిటీ ప్లైఓవర్ జంక్షన్లో రోడ్డు ప్రమాదానికి కారణమైన కల్వకుంట కృష్ణ మిలాన్ రావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ప్రమాదంలో ఒకరి మృతికి కారణమయ్యారంటూ అభియోగాలు మోపారు. అంతేకాకుండా ఓవర్ స్పీడ్గా నడిపినందుకు అతనిపై ట్రాఫిక్ పోలీసులు వెయ్యిరూపాయల జరిమానా విధించారు. కల్వకుంట కృష్ణ మిలాన్ రావు ఎంపవర్ ల్యాబ్ అండ్ ఏఆర్ గేమ్స్ సంస్థ ఫౌండర్. అతనికి ఈ మధ్య నిశ్చితార్థం జరిగినట్టు తెలుస్తోంది. చదవండి: ఫ్లై ఓవర్ ప్రమాదం: ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు గచ్చిబౌలి బయోడైవర్సిటీ ప్లైఓవర్ జంక్షన్లో శనివారం మధ్యాహ్నం ఓ కారు 105 కిలోమీటర్ల వేగంతో బయల్దేరిన నిమిషంలోపే అదుపు తప్పింది. ఫ్లైఓవర్ మీదుగా.. 19 మీటర్ల ఎత్తు నుంచి గాల్లో ఎగురుతూ కింద రోడ్డుపై పడి.. చెట్టును బలంగా ఢీకొట్టింది. ఆ చెట్టు కింద కుమార్తెతో కలిసి బస్సు కోసం వేచి చూస్తున్న మహిళపై పడింది. ఈ ఘటనలో శరీర భాగాలు ఛిద్రమై.. మహిళ మృత్యువాత పడింది. చెట్టు కూకటివేళ్లతో సహా నేలకూలింది. నలుగురు గాయపడ్డారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 86, ప్లాట్ నంబర్ 530లో నివాసం ఉండే కల్వకుంట్ల కృష్ణ మిలాన్ రావు (27) శనివారం మధ్యాహ్నం రాయదుర్గం వైపు నుంచి వోక్స్ వ్యాగన్ పోలో కారు (టీఎస్09 ఈడబ్ల్యూ 5665)లో బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ పై నుంచి మైండ్స్పేస్ వైపు బయల్దేరారు. ఈ ఫ్లైఓవర్పై 40 కిలోమీటర్ల వేగంతో వెళ్లాల్సి ఉండగా, ఆ సమయంలో కారు 105 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. అతి వేగంగా వెళ్తూ ఫ్లైఓవర్ మలుపు వద్ద ఒక్కసారిగా అదుపుతప్పింది. చదవండి: బయోడైవర్సిటీ ఫ్లైఓవర్పై ఘోర ప్రమాదం 1.04 నిమిషాల సమయంలో కారు ఫ్లైఓవర్ మీదుగా 19 మీటర్ల పై నుంచి.. కింద రోడ్డుపై ఉన్న నిసాన్ షోరూం ఎదుట పడింది. ఆపై పల్టీలు కొడుతూ చెట్టును ఢీకొట్టింది. ఆ ధాటికి చెట్టు కింద బస్సు కోసం వేచి చూస్తున్న పసల సత్యవేణి (56) తల, ఛాతీ భాగం ఛిద్రమై అక్కడికక్కడే ప్రాణాలొదిలారు. ఆమె కాలేయంతో పాటు శరీర భాగాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడటంతో ఆ ప్రాంతమంతా రక్తసిక్తమైంది. కారు బలంగా ఢీకొట్టడంతో చెట్టు కూకటివేళ్లతో సహా పడిపోయింది. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులు సమీపంలోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కారు నడుపుతున్న కల్వకుంట్ల కృష్ణ మిలాన్ రావు.. కారులోని ఎయిర్ బెలూన్లు తెరచుకోవడంతో గాయాలతో బయటపడ్డారు. ఆయన తలకు, చెవికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కుర్బా (23).. ఛాతీకి తీవ్ర గాయాలవడంతో పక్కటెముకలు విరిగిపోయాయి. అనంతపురానికి చెందిన ఈమె ఆరు నెలల క్రితం నగరానికి వచ్చి ఉద్యోగాన్వేషణలో ఉన్నారు. పీపుల్ టెక్ కంపెనీలో ఇంటర్వ్యూకు వెళ్లేందుకు ఆటో కోసం వేచి చూస్తూ ప్రమాదంలో గాయపడ్డారు. ఆమెకు ఆర్థోపెడిక్ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రయాణికులను ఎక్కించుకునేందుకు చెట్టు కింద వేచి చూస్తున్న ఆటో డ్రైవర్ ముడావత్ బాలూ నాయక్ (38) ఎడమ కాలి పాదం పూర్తిగా దెబ్బతింది. మృతురాలి కుమార్తె ప్రణీత స్వల్పంగా గాయపడ్డారు. -
సెల్ఫీ సరదా ప్రాణాలు తీసింది
గచ్చిబౌలి: కొత్తగా ప్రారంభించిన ఫ్లైఓవర్పై సెల్ఫీ తీసుకోవాలన్న సరదా కోరిక ఆ యువకులిద్దరి నిండు ప్రాణాల్ని బలిగొంది. మద్యం మత్తులో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సెల్ఫీ దిగుతోన్న యువకులిద్దరినీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. రాయదుర్గం పోలీసుస్టేషన్ పరిధిలో శనివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. సరూర్నగర్ భగత్సింగ్నగర్లో నివాసం ఉంటూ వొడాఫోన్ సిమ్ కార్డుల సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తోన్న వరంగల్ జిల్లా చేర్యాల్కు చెందిన పి.సాయి వంశీ రాజు(22), సరూర్నగర్లోనే సోదరుని వద్ద నివాసం ఉంటూ పెళ్లిళ్లకు ఫొటో ఈవెంట్లు చేస్తోన్న నారాయణ్ పేట్ జిల్లా కిష్టాపూర్కు చెందిన ఎన్.ప్రవీణ్(22) స్నేహితులు. వీరిద్దరూ శనివారం సాయంత్రం గచ్చిబౌలి, మాదాపూర్ ప్రాం తాలను చూసేందుకు యాక్టివాపై సరూర్నగర్ నుంచి బయల్దేరి వెళా ్లరు. బయోడైవర్సిటీ జంక్షన్లో ఇటీవలే ప్రారంభమైన ఫ్లైఓవర్ పైకి ఎక్కి రాయదుర్గం వైపు వెళ్లారు. జంక్షన్లో ఫ్లైఓవర్పై ఉన్న మూల మలుపు వద్ద స్కూటీని పార్క్ చేసి సెల్ఫీ దిగుతున్నారు. అదేసమయంలో కూకట్పల్లి వైపు వెళ్తున్న ఐ20 కారు(టీఎస్08 ఎఫ్వై1069) వేగంగా వచ్చి వీరిని ఢీకొట్టింది. దీంతో ఫ్లైఓవర్పై నుంచి ఎగిరి కింది రోడ్డుపై పడి అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం జరిగిన సమయంలో కాగ్నిజెంట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసే కూకట్పల్లినివాసి అభిలాష్ డ్రైవింగ్ చేస్తుండగా... కారులో అతని స్నేహితులు అనిల్, చంద్రకాంత్, సూర్య ఉన్నారు. వీరందరూ మద్యం తాగి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదానికి ముందే ఫ్లైఓవర్పై టైరు పంక్చర్ కావడంతో ఓ ద్విచక్రవాహనాన్ని తోసుకుంటూ వెళ్తోన్న పాడాల మురళి కృష్ణ(30), గిరిధర్ సుభాష్(26)లను, తర్వాత హీరోహోండాపై వెళ్తోన్న చుంచు సాయి కృష్ణ(21), చుంచు పవన్ కుమార్(19)లను ఢీకొట్టగా వీరంతా తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. ఫ్లైఓవర్పై ఉన్న మూలమలుపు ఎక్కువగా ఉండటం, మద్యం మత్తులో కారు నడపడం ప్రమాదానికి కారణాలుగా తెలుస్తోంది. అభిలాష్ను పోలీసులు ఆదివారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదం జరి గిన వెంటనే కారులో ఉన్న అభిలాష్ స్నేహితులు అనిల్,చంద్రకాంత్, సూర్య ఘటనా స్థలి నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు. -
సిగ్నల్ ఫ్రీ.. రవాణాకు రూట్ క్లియర్
సాక్షి, హైదరాబాద్/గచ్చిబౌలి: గ్రేటర్ నగరంలో ఎస్సార్డీపీ (వ్యూహాత్మక రహదారుల పథకం)లో భాగంగా సిగ్నల్ ఫ్రీ రవాణా కోసం మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. ఐటీ కారిడార్లో బయోడైవర్సిటీ జంక్షన్ డబుల్ హైట్ ఫ్లై ఓవర్ను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్తో కలిసి మంత్రి కేటీఆర్ సోమవారం ప్రారంభించారు. దీంతో, మెహిదీపట్నం వైపు నుంచి వచ్చే వాహనదారులు సిగ్నల్తో పని లేకుండా హైటెక్సిటీకి వెళ్లవచ్చు. ఎస్సార్డీపీలో భాగంగా ఇప్పటి వరకు అందుబాటులోకి వచ్చిన అండర్పాస్లు/ఫ్లైఓవర్లలో ఇది ఎనిమిదవది. దీనికోసం జీహెచ్ఎంసీ రూ. 69.47 కోట్లు ఖర్చు చేసింది. 3 లేన్ల ఈ ఫ్లై ఓవర్ పొడవు దాదాపు కిలోమీటరు. ఈ ఫ్లైఓవర్తో : మెహిదీపట్నం వైపు నుంచి హైటెక్సిటీ, మైండ్ స్పేస్ వరకు సిగ్నల్ ఫ్రీ రవాణా వ్యవస్థకు మార్గం సుగమమైంది.ఎస్సార్డీపీలో భాగంగా ఐటీ కారిడార్లో ఇప్పటికే మైండ్స్పేస్ జంక్షన్, కూకట్పల్లి జంక్షన్ల వద్ద ఫ్లైఓవర్లు, మైండ్స్పేస్, అయ్యప్ప సొసైటీల వద్ద అండర్పాస్లు అందుబాటులోకి రావడంతో బయోడైవర్సిటీ జంక్షన్ నుంచి జేఎన్ టీయూ వరకు వరకుట్రాఫిక్ చిక్కులు తగ్గాయి. ఇక గచ్చిబౌలి జంక్షన్ వద్ద..: గచ్చిబౌలి జంక్షన్ వద్ద ట్రాఫిక్ చిక్కుల పరిష్కారానికి రూ. 330 కోట్లతో కొండాపూర్ వైపు నుంచి ఓఆర్ఆర్ వైపు గచ్చిబౌలి జంక్షన్ వద్ద పై వరుసలో ఆరులేన్ల ఫ్లై ఓవర్, మైండ్స్పేస్ వైపు నుంచి ఓఆర్ఆర్ వైపు నాలుగు లేన్ల ఫ్లైవర్, శిల్పా లే ఔట్ రోడ్ వైపు నుంచి గ్యాస్ గోడౌన్ వరకు మరో మార్గం నిర్మించనున్నారు. ఈ పనులకు కూడా కేటీఆర్ శంకుస్థాపన చేశారు. వీటిద్వారా రెండు వైపులా ప్రయాణాలు చేయవచ్చు. వీటి ద్వారా ఐటీ కారిడార్పై ట్రాఫిక్ ఒత్తిడి తగ్గుతుంది. ప్రస్తుతం గచ్చిబౌలి మార్గంలో గంటకు 9 వేల వాహనాలు ప్రయాణిస్తున్నాయి. 2036 నాటికి వీటి సంఖ్య 17,711 పెరిగే అవకాశం ఉంది. శిల్పా లే ఔట్ మార్గంలో 2040నాటికి 5,200లకు చేరే అవకాశం ఉంది.కొత్తగా నిర్మించనున్న ఫ్లైఓవర్ల వల్ల గచ్చిబౌలి జంక్షన్లో ట్రాఫిక్ సమస్యలు పూర్తిగా తగ్గడంతో పాటు హైటెక్ సిటీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ల మార్గాలకు మరింత కనెక్టివిటీ పెరుగుతుందని అధికారులు పేర్కొన్నారు. -
ఆరో వినాశనం.. ఇలా ఆపేద్దాం!
వాషింగ్టన్: భూమి చరిత్రలో ఆరో వినాశనం త్వరలోనే ఉండనుందా..? ఇప్పటివరకు ఐదు సమూహ వినాశనాలతో తల్లడిల్లిన భూమికి ఆరో వినాశనం తప్పదా..? అంటే అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. రానున్న ఆ ఆరో వినాశనానికి మూల కారకులు మానవులేనని కూడా చెబుతున్నారు. భూమిపై జీవ వైవిధ్యాన్ని, సమతుల్యతను కాపాడి ఆరో వినాశనాన్ని తప్పించేందుకు రూపొందించిన ఓ విధానం అమలుకు ఏడాదికి రూ.7 లక్షల కోట్లు అవసరమవుతాయని ఆయన వెల్లడించారు. ఇది కూడా ఎంత వీలైతే అంత త్వరగా చేపట్టాలని, తద్వారా మానవ నిర్మిత జీవవైవిధ్యం ద్వారా జరిగే విధ్వంసాన్ని ఈ దశాబ్దంలోనే అడ్డుకోవచ్చని స్పష్టం చేశారు. ఆరో వినాశనం మానవుడి భుజస్కందాలపై ఉందని, ఏం చేయాలో తేల్చుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని అమెరికాలోని అరిజోనా స్టేట్ యూనివర్సిటీకి చెందిన ఎకాలజిస్ట్ గ్రెగ్ అస్నర్ తెలిపారు. భూమిపై జీవవైవిధ్యాన్ని, సమృద్ధిని కాపాడటానికి ‘ఏ గ్లోబల్ డీల్ ఫర్ నేచర్(జీడీఎన్)’అనే సైన్స్ పాలసీని రూపొందించిన 19 మంది అంతర్జాతీయ పరిశోధకుల్లో అస్నర్ ఒకరు. ఈ ఖర్చు అంత భారీదేమీ కాదని, అమెరికాలోని యాపిల్, బెర్క్షైర్ హాత్వే కంపెనీలు 2018లో ఆర్జించిన లాభాలతో ఇది సమానమన్నారు. రెండో అతిపెద్ద నిర్ణయం.. భూ వినాశనాన్ని అడ్డుకునేందుకు తీసుకున్న నిర్ణయాల్లో జీడీఎన్ రెండో అతిపెద్ద నిర్ణయం కాగా.. మొదటిది 2015లో తీసుకున్న పారిస్ ఒప్పందం. ‘అయితే పారిస్ ఒప్పందం ఒక్కటే భూమిపై జీవ వైవిధ్యాన్ని, మానవాళికి అవసరమైన పర్యావరణాన్ని సంరక్షించలేదు. దీని కోసం మరొక ప్రత్యామ్నాయం అవసరం. శాస్త్ర ఆధారిత, నిర్ణీత కాల పాలసీ అయిన ది గ్లోబల్ డీల్ ఫర్ నేచర్ భూమిపై జీవ వైవిధ్యాన్ని, సమృద్ధిని కాపాడగలదు. భూ వినాశనాన్ని ఆపడానికి నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించడంలో జీడీఎన్ పాలసీకి తిరుగులేదు. భావితరాలకు మనం ఇవ్వబోయే అతిపెద్ద బహుమతి ఈ పాలసీ మాత్రమే. జీడీఎన్ పాలసీలో మూడు లక్ష్యాలను నిర్దేశించాం’అని అమెరికాలోని నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్కు చెందిన ఎరిక్ డైనర్స్టెయిన్ వెల్లడించారు. ఈ పరిశోధన ఫలితాలు సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. మన నిబద్ధతను పునరుద్ఘాటిద్దాం: మోదీ వాతావరణ మార్పుల వల్ల ఎదురయ్యే సవాళ్లను తగ్గించడంలో దేశ నిబద్ధతను పునరుద్ఘాటించేందుకు ధరిత్రీ దినోత్సవం ఓ సందర్భం అని ప్రధాని మోదీ అన్నారు. ధరిత్రీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన మాట్లాడుతూ..‘భూమాతకు మనం భక్తితో నమస్కరిస్తాం. ఏళ్లుగా అసాధారణ వైవిధ్యాలకు ఈ భూగ్రహం ఓ నిలయం. మన గ్రహం శ్రేయస్సు కోసం స్థిరమైన అభివృద్ధి, వాతావరణ మార్పులను తగ్గించడంలో మన నిబద్ధతను ఈ రోజున మరోసారి పునరుద్ఘాటిస్తున్నాం’అని అన్నారు. -
ఇదిగో ‘సిరి’ లోకం!
ఆరోగ్యం కోసం ఆహారం.. ఆహారం కోసం వ్యవసాయం.. వ్యవసాయం కోసం అడవి! ఇదీ అటవీ వ్యవసాయానికి మూలసూత్రం. రైతు తమకున్న వ్యవసాయ భూమిలో విధిగా (కనీసం 20%) కొద్ది భాగాన్నయినా అటవీ జాతి చెట్ల పెంపకానికి కేటాయించాలని అటవీ వ్యవసాయ (కాడు కృషి) నిపుణులు, స్వతంత్ర శాస్త్రవేత్త డా. ఖాదర్ వలి సూచిస్తున్నారు. పొలం అంతా ఒకే పంట వేయడం అనర్థదాయకం.. సిరిధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనె గింజ పంటలను ఒకే పొలంలో పక్కపక్కనే కలిపి సాగు చేయాలి.. జీవవైవిధ్యంతోనే సాగుకు జవజీవాలు చేకూరతాయని, చీడపీడల బెడద కూడా తగ్గిపోతుందన్నది సారాంశం. అటవీ కృషిపై డా. ఖాదర్ వలితో ఇటీవలి సంభాషణ నుంచి కొన్ని విశేషాలు ‘సాగుబడి’ పాఠకుల కోసం.. ప్రకృతిలో ఏ జీవీ, ఏ వ్యవస్థా ఒంటరిగా మన జాలదు, పరస్పరాధారితంగానే విరాజిల్లుతుంటాయి. ప్రకృతితో, అడవితో వ్యవసాయానికి అంతటి విడదాయరాని అనుబంధం ఉందని అంటారు స్వతంత్ర శాస్త్రవేత్త, ఆహార – ఆరోగ్య నిపుణులు డాక్టర్ ఖాదర్ వలి. ఇందుకోసం ‘అటవీ వ్యవసాయ’ (కాడు కృషి) పద్ధతికి ఆయన రూపకల్పన చేశారు. మైసూరుకు సమీపంలోని కిబిని డ్యాం దగ్గరలోని తన పదెకరాల వ్యవసాయ క్షేత్రంలో తాను అనుసరిస్తూ రైతులకూ శిక్షణ ఇస్తున్నారు (అటవీ వ్యవసాయంపై డా. ఖాదర్ వలి అభిప్రాయాలతో కూడిన కథనం ‘సిరిధాన్యాలే నిజమైన ఆహార పంటలు’ శీర్షికన 2017 సెప్టెంబర్ 19న, ‘మిక్సీ–సిరిధాన్యాల మిల్లు’ కథనం 2017 డిసెంబర్ 26న ‘సాగుబడి’లో ప్రచురితమైన సంగతి తెలిసిందే). మూడున్నర ఎకరాల్లో అడవిని పెంచుతూ, పక్కనే మిగతా భూమిలో సిరిధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజల పంటలను పండిస్తున్నారు. ఆ వ్యవసాయ క్షేత్రం విశేషాలను పరిశీలిద్దాం. వర్షపు నీటి సంరక్షణకు కందకాలు వ్యవసాయంలో నీటి కొరతను అధిగమించడానికి పొలంలో కందకాలు తవ్వుకోవడం ద్వారా వర్షపు నీటిని ఎక్కడికక్కడ ఇంకింపజేసుకోవడం తెలివైన పని. డా. ఖాదర్ వలి క్షేత్రం కొండ ప్రాంతం కావడంతో (30%) ఏటవాలుగా ఉంటుంది. వాన నీటిని ఒడిసిపట్టుకోవడంతోపాటు భూసారం కొట్టుకుపోకుండా కాపాడుకోవడం కోసం ప్రతి వంద మీటర్లకు ఒక వరుసలో మీటరు లోతు, మీటరు వెడల్పున కందకాలు తవ్వారు. కందకాలలో 10 మీటర్లకు ఒక చోట కట్ట వేశారు. కందకంలో పండ్ల చెట్లు నాటారు. గట్ల మీద 400 మునగ చెట్లు వేశారు. సేంద్రియ వ్యవసాయ క్షేత్రంలోకి పరిసర పొలాల నుంచి రసాయనిక అవశేషాలతో కూడిన వర్షపు నీరు రాకుండా చూసుకోవడం అవసరం. బయటి నుంచి వ్యవసాయ క్షేత్రంలోకి వచ్చే వర్షపు నీటిని భూమిలోకి ఇంకింపజేయడానికి సరిహద్దు చుట్టూ అడుగు లోతు, అడుగు వెడల్పున కందకం తవ్వారు. సరిహద్దులో అక్కడక్కడా పెద్ద గుంతలు ఏర్పాటు చేశారు. రసాయనిక అవశేషాలకు విరుగుడుగా ఆ గుంతల్లో ‘అటవీ చైతన్య ద్రావణం’ పోసి, వాన నీటిని భూమిలోకి ఇంకింపజేస్తారు. అక్కడి సాధారణ వార్షిక వర్షపాతం 800 ఎం.ఎం.–1000 ఎం.ఎం. మధ్య ఉంటుంది. తొలి పంట వర్షాధారంగానే సాగు చేస్తారు. భూమిలోకి ఇంకింపజేసిన నీటిలో మూడింట రెండొంతుల వరకు.. స్ప్రింక్లర్లతో రెండో పంటకు వాడుతున్నారు. సిరిధాన్యాల సాగు ఎలా? కొర్రలు, సామలు, అరికెలు, అండుకొర్రలు, ఊదలను డా. ఖాదర్ వలి సిరిధాన్యాలుగా నామకరణం చేసిన సంగతి తెలిసిందే. వీటిని ముఖ్య ఆహారంగా తింటూ ఉంటే కొద్దికాలంలో జబ్బులను తగ్గించుకోవడంతోపాటు సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని ఆయన చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సిరిధాన్యాల వినియోగం బాగా పెరిగినందున రైతులు సైతం వీటి సాగుపై ఆసక్తి చూపుతున్నారు. ఇంతకీ సిరిధాన్యాల సాగుపై డా. ఖాదర్ వలి సూచనలేమిటో చూద్దాం. మిశ్రమ సాగే మేలు ప్రతి రైతు భూమిలో కనీసం 20% విస్తీర్ణంలో అడవిని పెంచాలి. మిగతా 80% భూమిలో పంటలు పండించుకోవాలి. సిరిధాన్యాలను ఏక పంట (మోనో క్రాప్)గా కాకుండా పప్పుధాన్యాలు (అపరాలు), నూనెగింజలతో కలిపి పండించడం ఉత్తమం. సాగుకు ఎంపిక చేసుకున్న పొలంలో 60% విస్తీర్ణంలో కొర్రలు లేదా సామలు లేదా అరికెలు లేదా అండుకొర్రలు లేదా ఊదలు, 30% విస్తీర్ణంలో కంది/ పెసర/ వేరుశనగ/ శనగ/ మినుము వంటి పప్పుధాన్యాలు, 10% విస్తీర్ణంలో నువ్వులు లేదా కుసుమలు లేదా వేరుశనగ వంటి నూనె నూనెగింజలు పక్కపక్కనే సాగు చేయాలి. పప్పుధాన్యం పంట పక్కన ఉన్న పంటలకు వాతావరణం నుంచి గ్రహించిన నత్రజనిని అందిస్తుంది. ఎకరం నుంచి ఏడు ఎకరాల వరకు విస్తీర్ణాన్ని ఒక గ్రిడ్గా భావించి మిశ్రమ పంటలను ఈ నిష్పత్తిలో సాగు చేసుకోవాలి. ప్రతి గ్రిడ్లో ఈ మూడు రకాల పంటలను పక్కపక్కనే ఉండాలన్న మాట. ఎంత విస్తారమైన పొలంలోనైనా అలాగే గ్రిడ్లుగా విభజించుకొని సాగు చేయాలి. అప్పుడు ప్రతి గ్రిడ్లోనూ అన్ని రకాల పంటలూ సాగవుతూ ఉంటాయి. గ్రిడ్లో గత పంట కాలంలో వేసిన చోట వచ్చే పంట కాలంలో ఇతర పంటలు వేసేలా పంటల మార్పిడి పాటించాలి. ఉదా.. 20 ఎకరాల పొలం ఉంటే 4 ఎకరాల్లో అడవిని పెంచాలి. 16 ఎకరాల్లో రెండు ఎకరాలకో గ్రిడ్గా విభజించి పంటలు పండించాలి. కొన్ని గ్రిడ్లలో సిరిధాన్యాలు ప్రధాన పంటైతే, మరికొన్ని గ్రిడ్లలో కూరగాయలు కూడా ప్రధాన పంటలుగా వేసుకోవచ్చు. టర్పిన్లతో చీడపీడలకు విరుగుడు సిరిధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజల పంటలను కలిపి సాగు చేయడం ద్వారా చీడపీడల నుంచి తమను తాము రక్షించుకునే శక్తి పంటలకు కలుగుతుంది. ఏ మొక్కలైనా ఆకుల ద్వారా వైవిధ్య భరితమైన వాసనలను గాలిలోకి వదులుతూ ఉంటాయి. ఈ వాసనలను టర్పిన్స్ అంటారు. కొన్ని రకాల మొక్కలు విడుదల చేసే వాసనలు మనుషుల ఇంద్రియాలు గ్రహించగలుగుతాయి. కొన్నిటిని గ్రహించలేవు. మనుషులు గ్రహించలేని వాసనలను కూడా పిల్లులు, కుక్కలు, పందులు, పక్షులు గ్రహించగలుగుతాయి. ఈ వాసనలు పంటలపై చీడపీడలను నియంత్రించడంలో ఉపయోగపడతాయి. అండుకొర్ర మొక్కల వాసనలను గ్రహించడం ద్వారా వేరుశనగ మొక్కలు అంతర్గతంగా చీడపీడలను తట్టుకునే శక్తిని సంతరించుకుంటాయి. అందువల్లనే, కనీసం 3 నుంచి 5 రకాల పంటలను కలిపి మిశ్రమ పంటలుగా సాగు చేస్తే ప్రకృతి సమతుల్యత ఏర్పడుతుంది. ఒకే పంటను వేయడం సమస్యలను ఆహ్వానించడమేనని, పాశ్చాత్య ఆలోచనా ధోరణితో వస్తున్న సమస్య ఇదేనని డా. ఖాదర్ అన్నారు. అండుకొర్రలు వర్సెస్ అడవి పందులు అండుకొర్ర పంట మొక్కలు విడుదల చేసే వాసనలు (టర్పిన్లు) అడవి పందులకు సుతరాము గిట్టదు. పొలానికి చుట్టూతా 4 వరుసలుగా అండుకొర్రలను సాగు చేస్తే ఆ పొలం వైపు అడవి పందులు రాకుండా దూరంగా ఉంటాయి. ∙డా. ఖాదర్ పొలంలో మిశ్రమ పంటల సాగు వరి, సిరిధాన్యాల సాగుకు కావాల్సిన నీరెంత? సిరిధాన్యాలుగా మనం పిలుచుకుంటున్న కొర్రలు, అరికలు, అండుకొర్రలు, సామలు, ఊదలను నాలుగు వర్షాలు పడితే చాలు.. అంతగా సారం లేని మెట్ట భూముల్లో కూడా పండించుకోవచ్చు. వరి ధాన్యం, చెరకు వంటి పంటలు పండించడానికి సాగు నీరు పెద్ద మొత్తంలో అవసరమవుతోంది. కిలో వరి బియ్యం పండించానికి 9,000 లీటర్ల నీరు, కిలో సిరిధాన్యాల (కొర్రలు, అరికలు, అండుకొర్రలు, సామలు, ఊదల)ను సాగు చేయడానికి 300 లీటర్ల నీరు చాలు. అంటే, కిలో వరి బియ్యంతో ఐదుగురికి ఒకసారి భోజనం పెట్టవచ్చు. 30 కిలోల సిరిధాన్యాలతో 240 మందికి ఒకసారి భోజనం పెట్టవచ్చు (పట్టిక చూడండి). నీటి వనరులు నానాటికీ క్షీణిస్తున్న ఈ తరుణంలో ప్రధాన ఆహార పంటలుగా సిరిధాన్యాలను సాగు చేసుకోవడమే అన్ని విధాలా ఉత్తమ మార్గమని మనందరం గ్రహించాలని డా. ఖాదర్ చెబుతున్నారు. అటవీ చైతన్య ద్రావణంతో జవజీవాలు నిస్సారమైన భూములను సైతం మూడు నెలల్లో సారవంతం చేయడానికి భూసార వర్థిని అయిన ‘అటవీ చైతన్య’ ద్రావణం ఉపయోగపడుతుందని డా. ఖాదర్ అంటున్నారు. ఇది ఎరువు కాదు. భూమిలో సూక్ష్మజీవ రాశిని ఇబ్బడిముబ్బడిగా పెంపొందించే తోడు (మైక్రోబియల్ కల్చర్) మాత్రమే. అటవీ చైతన్య ద్రావణం తయారు చేసే పద్ధతి: 20 లీటర్ల కుండలో 10 లీటర్ల నీరు పోసి, లీటరు అటవీ చైతన్యం కలిపి, పావు కిలో సిరిధాన్యాల పిండి, పావు కిలో పప్పుల పిండి, 50 గ్రాముల తాటి బెల్లం కలపాలి. దీన్ని రోజూ కలియదిప్పాలి. వారం రోజులకు వాడకానికి సిద్ధమవుతుంది. 21 రోజుల వరకు వాడుకోవచ్చు. ఏమిటి ప్రయోజనం? ఆమ్ల, క్షార గుణాలు సమసిపోయి భూమి సాధారణ స్థితికి చేరుకొని జవజీవాలను సంతరించుకోవడానికి అటవీ చైతన్య ద్రావణం దోహదం చేస్తుంది. లీటరు అటవీ చైతన్య ద్రావణానికి 20 లీటర్ల నీరు కలిపి నేలపై పిచికారీ చేయాలి. సాయంత్రం 5–6 గంటల మధ్య భూమిపై అటవీ చైతన్య ద్రావణాన్ని పిచికారీ చేస్తే మూడు–ఆరు నెలల్లో ఆ భూమి సాగుకు యోగ్యంగా జీవవంతం అవుతుందని డా. ఖాదర్ చెబుతారు. మొదటి నెలలో.. వారానికి 2 సార్లు, రెండో నెలలో.. వారానికోసారి, మూడో నెలలో.. 10 రోజులకోసారి, నాలుగో నెల నుంచి 15 రోజులకోసారి అటవీ చైతన్య ద్రావణం పిచికారీ చేస్తూ ఉంటే భూసారం పెరుగుతుంది. సాయంత్రం వేళల్లో పిచికారీ చేస్తాం కాబట్టి ఉదయం కల్లా నేల పీల్చుకొని నేల జవజీవాలను పొందుతుంది. ఆచ్ఛాదన వేయాల్సిన అవసరం లేదు. ఎండలు మండిపోయే మే నెలలో తప్ప ఏడాది పొడవునా దీన్ని పిచికారీ చేసుకోవచ్చని డా. ఖాదర్ తెలిపారు. అటవీ ప్రసాదం అటవి వ్యవసాయానికి మూలాధారమని డా. ఖాదర్ వలి చెబుతున్నారు. అందుకే పొలంలో 20% శాతంలో అటవీ జాతి చెట్లను పెంచాలని, ఆ చెట్లు రాల్చే ఆకులను పోగు చేసి, వేసవిలో పొలంలో చల్లి, ఆ ఆకులపై ‘అటవీ చైతన్య’ ద్రావణం పిచికారీ చేసి భూమిలో కలియదున్నాలి. భూమి లోతుల నుంచి పోషకాలను గ్రహించే చెట్లు రాల్చిన ఆకులే ‘అటవీ ప్రసాదం’ వంటివని, భూమికి పోషకాహారమని అంటారు. అటవీ సహితం చీడపీడల బెడద నుంచి పంటల రక్షణకు ‘అటవీ సహితం’ ద్రావణాన్ని డా. ఖాదర్ వలి వాడుతున్నారు. వివిధ రకాల ఔ«షధ మొక్కల ఆకులతో దీన్ని తయారు చేస్తారు. పాలు కారే మొక్కల ఆకులు 2 రకాలు (జిల్లేడు, మర్రి, పలవర బొప్పాయి వంటివి), 2 చేదు రకాలు (వేప, కానుగ వంటివి), ఆకర్షణీయంగా ఉండే చెట్ల పూలు, ఆకులు (మందార, తంగేడు వంటివి) ఇవన్నీ 6 కేజీలు తీసుకొని.. దంచాలి. దీన్ని కుండలో వేసి లీటరు దేశీ ఆవు మూత్రం, 10 లీటర్ల నీరు కలిపి.. వారం మురగబెట్టాలి. తర్వాత వడకట్టుకొని లీటరుకు 20 లీటర్ల నీరు కలిపి పంటలపై పిచికారీ చేయాలి. అటవీ చైతన్య ద్రావణం ఔషధ మొక్కలు ఒకే పంట సాగు చేయడం మూర్ఖత్వం! పొలం అంతా ఒకే రకం పంటను పండించడం మూర్ఖత్వం. మోనోకల్చర్ నుంచి బయటకు రావాలి. మిశ్రమ పంటలు సాగు చేయాలి. అటవీ కృషి పద్ధతుల్లో 30 రకాల పంటలు పండించమని సూచిస్తున్నాం. కనీసం 5 రకాలైనా పొలంలో పెంచుకోవడం రైతులు అలవాటు చేసుకోవాలి. సిరిధాన్య పంటలకు కూడా కొన్ని చోట్ల కత్తెర పురుగు సోకడానికి కారణం ఒకే పంటను సాగు చేయడమే. పొలంలోని విస్తీర్ణంలో 60% ఏక దళ పంటలు, 30% పప్పుధాన్యాలు, 10% నూనె గింజల పంటలు సాగు చేయాలి. సిరిధాన్య పంటలు, నువ్వులు, గోంగూర, వేరుశనగ వంటి పంటలను కలిపి పండించాలి. కత్తెర పురుగు నివారణకు సీతాఫలం ఆకులు, గింజల ద్రావణం చక్కగా పనిచేస్తుంది. ఒకే పంట పండిస్తూ ఉంటే ఒక పురుగు పోయినా మరొకటి వస్తుంది. మిశ్రమ పంటలే శ్రేయస్కరం. – డాక్టర్ ఖాదర్ వలి, అటవీ కృషి నిపుణులు – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
జీవ వైవిధ్యమే ప్రాణం!
‘గత డిసెంబరుతో (హైదరాబాద్ సమీపంలోని నారపల్లిలోని) మా మిద్దెతోట తొమ్మిదవ సంవత్సరంలోకి ప్రవేశించింది. గడచిన ఎనిమిది సంవత్సరాల కాలంలో మార్కెట్లో కూరగాయలు కొనలేదు – పండ్లు కొనలేదు! మిద్దెతోటలోనే ఉత్పత్తి చేశాం! ఎనిమిది సంవత్సరాల మిద్దెతోట ఉత్పత్తిని – రోజుకు కిలో చొప్పున లెక్కించినా – మూడు టన్నుల పైమాటే! ఇదంతా కేవలం 1240 స్క్వేర్ ఫీట్ల టెర్రస్ మీద మాత్రమే పండించాం. ఎనిమిది సంవత్సరాల క్రితం మిద్దెతోట నిర్మాణ వ్యయం ఇరవై వేల రూపాయలు. అయితే, ఈ ప్రత్యక్ష ఫలితాల గురించి కాదు నేను చెప్పాలనుకుంటున్నది.. అది అందరికీ కనిపించే విషయమే! ఈ ఉత్పత్తి వెనుక ఒక సహజసిద్ధమైన ‘జీవ వైవిధ్య ప్రభావం’ ప్రక్రియ ఉన్నదని తెలియ జెప్పాలన్నదే ఈ ప్రయత్నం. అదే లేకుంటే, ఈ ఉత్పత్తి వచ్చేదే కాదు! జీవ వైవిధ్యం వల్లనే ప్రకృతి కొనసాగుతున్నది. మనందరికీ తెలుసు, పరపరాగ సంపర్కం వల్లనే పువ్వులు ఫలిస్తాయని. తేనెటీగలు సీతాకోకచిలుకలు ఇతర రెక్కల పురుగులు అందుకు దోహదపడతాయి. పూలలోని తేనె కోసం తేనెటీగలు వచ్చి పువ్వుల మీద వాలినప్పుడు వాటి కాళ్ల నూగుకు పువ్వుల పుప్పొడి అంటుకుని.. అలా పరపరాగ సంపర్కం అప్రయత్నంగా జరుగుతుంది. అలా పువ్వులు ఫలదీకరణ చెందుతాయి. మనకు లభించే దాదాపుగా అన్ని రకాల ఉత్పత్తులు ఇలానే పండుతాయి. మిద్దెతోటను మనం అభివృద్ధి చేస్తున్నకొద్దీ, రావలసిన జీవజాతులు వచ్చి చేరతాయి. మిద్దెతోటల్లో పండ్ల మొక్కలను కూడా పెంచడం వల్ల పక్షులు కూడా వస్తాయి. చిన్న చిన్న పక్షులు మొక్కల మీద పురుగులను ఏరుకొని తింటాయి! మొక్కలకు హాని చేసే క్రిమికీటకాలను అలా కంట్రోల్ చేస్తాయి. కోయిలలు కూడా పండ్ల కోసం మిద్దెతోటల లోకి వస్తాయి. వాటి పాటలను వినగలగడం వల్ల మనకు ఎంతో సంతోషం కలుగుతుంది. అది మన స్వయం కృషి ఫలమైన సహజ సంగీతం! మట్టిలో వానపాములు అభివృద్ధి అవుతాయి. వాటివలన సహజసిద్ధమైన ఎరువు తయారు అవుతుంది. మిద్దెతోటలో సంవత్సరం పొడవునా పువ్వు లుండేలా పూల మొక్కలను పెంచుతాం కనుక రంగురంగుల సీతాకోక చిలుకలు మిద్దె తోటలోకి వస్తాయి, తేనె తాగడానికి! తద్వారా పువ్వుల మధ్య పరపరాగ సంపర్కం జరిగి మనకు సంపూర్ణ ఉత్పత్తి వస్తుంది. గువ్వలు, పిచ్చుకలు వచ్చి మిద్దెతోటలో గూళ్లు కట్టుకుంటాయి. మిద్దెతోటల మొక్కలకు హాని చేసే పురుగూ పుట్రలను అవి తినేస్తూ మొక్కలకు పరోక్షంగా రక్షణ కలిగిస్తాయి. మిద్దెతోటల్లోకి ఎలుకలు కూడా వస్తాయి.. నష్టాన్ని కలిగిస్తాయి. ఎలుకల కోసం పిల్లులు వస్తాయి. ఇలా ఇప్పుడు మా మిద్దెతోటలో మూడు పిల్లులు ఉన్నాయి. ఒక పెంçపుడు శునకం ఉంది. వాటి మధ్య సఖ్యత కూడా కలిగింది! మిద్దెతోటలో నిత్యం పూసే పువ్వుల తేనె కోసం వందలాది తేనెటీగలు ఉదయం పూట వస్తాయి. మిద్దెతోటలో చిన్నచిన్న తేనెపట్టులు పెట్టుకుంటాయి. ప్రతీ చిన్న పువ్వు నుండి అవి తేనెను గ్రహిస్తాయి. కూరగాయ మొక్కల పువ్వుల నుండి కూడా తేనెను గ్రహిస్తాయి. ఆ ప్రక్రియ వల్లనే నిజానికి సమస్త రకాల పువ్వులు ఫలదీకరణం చెందుతున్నాయి. మనం నిత్యం తినే తిండి తయారీలో తేనెటీగల పాత్ర అపురూపమైనది – వెలకట్టలేనిది! మనం ప్రకృతి సమతుల్యతను కాపాడితే, అది మన ఆయురారోగ్యాలను కాపాడుతుంది! మిత్రుడు క్రాంతిరెడ్డి ఓ మాట అన్నాడు, ‘నేను మాత్రమే అనుకుంటే అహం – నేను కూడా అనుకుంటే సుఖం. మనుషులొక్కరే భూగోళం మీద మనలేరు – సమస్త జీవజాతుల మనుగడలో మనుషుల మనుగడ ముడిపడి ఉంది! పట్టణాలలో జీవ వైవిధ్యం పెరగాలంటే, మిద్దెతోటలను మించిన సాధనాలు లేవు! – తుమ్మేటి రఘోత్తమరెడ్డి, మిద్దెతోట నిపుణులు, నారపల్లి రఘోత్తమరెడ్డి మిద్దె తోటలో జీవవైవిధ్యానికి ఆనవాళ్లు.. పక్షి గూళ్లు, పక్షులు, పిల్లి, కుక్క.. -
దుంపల లోకం!
దుంప పంటల్లో జీవవైవిధ్యానికి నెలవు జోయిడా ప్రాంతం. కర్ణాటకలోని కర్వర్ జిల్లాలో జోయిడా ఉంది. ఇక్కడి వారిలో కునబి అనే గిరిజనులు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. జోయిడాలో ప్రతి ఏటా డిసెంబర్లో దుంపల మేళా జరుగుతుంది. 50 రకాల దుంప జాతి వంగడాలను ప్రదర్శిస్తారు, విత్తనాన్ని విక్రయిస్తారు కూడా. దుంపల్లో జీవవైవిధ్యాన్ని పరిరక్షిస్తున్నందుకు మూడేళ్ల క్రితం కేంద్ర వ్యవసాయ శాఖ, ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీస్ అండ్ ఫార్మర్స్ రైట్స్ అథారిటీ ప్లాంట్ జీనోమ్ సేవియర్ కమ్యూనిటీ అవార్డును స్థానిక ‘తాలూక్ కునబి సమాజ్ అభివృద్ధి సంఘ్’కు ప్రదానం చేయడం విశేషం. ఏ రకం దుంప విత్తనం కావాలన్నా వీరి దగ్గర లభిస్తుంది. ట్యూబర్ మేలా తదితర వివరాలకు.. జయానంద్ దెరెకెర్ – 94806 03675, విష్ణు – 94819 53394 నంబర్లలో సంప్రదించవచ్చు. దుంపను చూపుతున్న గిరిజన మహిళ -
నేలమ్మా క్షమించు..
ఈ భూతలమ్మీద జీవానికే జేజమ్మ నేలతల్లి. మనందరం ఈ నేలమ్మ ముద్దు బిడ్డలమే. భూమి మీద ఉన్న జీవవైవిధ్యం కన్నా భూమి లోపల జీవవైవిధ్యం ఎక్కువ. అడవిలోని అత్యంత సారవంతమైన మట్టి జీవన ద్రవ్యంతో జీవజీవాలతో ఉంటుంది. అందుకే అడవి ఎంత ఎండల్లోనూ ఎండిపోకుండా సతత హరితంగా అలరారుతూ ఉంటుంది. అడవిలో చెట్ల కింద మట్టి అత్యంత సారవంతంగా, సజీవంగా ఉంటుంది. దీన్ని చెంచాడు తీసుకొని పరీక్షించి చూస్తే.. భూగోళంపైన మనుషులెందరు ఉన్నారో అన్ని సూక్ష్మజీవులు ఉంటాయని ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఏ.ఓ.) శాస్త్రవేత్తలు ప్రకటించారు. వ్యవసాయ నేలల్లోనూ సూక్ష్మజీవరాశిని పెంపొందించుకునే ప్రకృతి వ్యవసాయ పద్ధతులే భూసారాన్ని పెంపొందించగలవు, పరిరక్షించగలవు. నేలతల్లి చల్లగుంటేనే మనమూ చల్లగా ఉంటాం. నేలతల్లి ఆరోగ్యమే మన ఆరోగ్యం. మన నేలలు సకల పోషకాలతో సజీవంగా ఉంటేనే మనం పండించే ఆహారంలోనూ పోషకాల లోపం లేకుండా ఉంటుంది. నేలతల్లి అమూల్యమైన ప్రకృతి సేవలతో మనుషులు, జంతువులు, పక్షులు, సూక్ష్మజీవులు సహా సకల జీవరాశికి ప్రాణం పోస్తుంది. అటువంటి నేలతల్లి అనేక రకాల కాలుష్యాల వల్ల, పారిశ్రామిక/రసాయనిక వ్యవసాయ పద్ధతుల వల్ల క్రమంగా నిర్జీవమవుతోంది, నిస్సారమవుతోంది. ఇప్పటికే మూడింట ఒక వంతు సాగు భూమి నిర్జీవంగా, సాగు యోగ్యం కాకుండా మారిపోయింది. రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపుమందులతో కూడిన నష్టదాయక వ్యవసాయ పద్ధతుల వల్ల ఉత్పాదకశక్తిని, తేమను నిలుపుకునే శక్తిని కోల్పోయింది. ప్రపంచవ్యాప్తంగా ఏటా కోటి 20 లక్షల హెక్టార్ల భూమి ఎడారిగా మారిపోతోంది. సముద్రం తర్వాత అధికంగా కర్బనం నిల్వలు కలిగి ఉన్న భూమి జవజీవాలను సంరక్షించుకోవడం ద్వారా మాత్రమే భూతాపోన్నతిని అరికట్టగలుగుతామని నిపుణులు చెబుతున్నారు. భూమిని కాలుష్యాల నుంచి రక్షించుకుందాం అని ఎఫ్.ఏ.ఓ. ఈ ఏడాది డిసెంబర్ 5న అంతర్జాతీయ భూముల దినోత్సవం సందర్భంగా పిలుపునిచ్చింది. ఇందుకు ప్రకృతి వ్యవసాయం ఎంతగానో దోహదపడుతుంది. ఈ బృహత్ కృషిలో ప్రకృతి వ్యవసాయదారులే సైనికులు! అయినా.. సమయం మించి పోలేదు భూముల విధ్వంసాన్ని నిలువరించగలం భూమిని కాలుష్యం నుంచి పరిరక్షించడానికి భూసారాన్ని పెంపొందించే రసాయన రహిత వ్యవసాయ పద్ధతులు చేపట్టడంతో పాటు.. అనేక ఇతర రంగాల్లోనూ ఇప్పుడు అనుసరిస్తున్న పద్ధతులు మార్చుకోవాలి. పారిశ్రామిక రంగం, గనుల తవ్వకం, వ్యర్థాల పునర్వినియోగం, రవాణా రంగాలలో కాలుష్యాన్ని తగ్గించే పర్యావరణ అనుకూల పద్ధతులు కూడా పాటిస్తూ స్వచ్ఛంద సంస్థల తోడ్పాటుతో ప్రపంచవ్యాప్తంగా ప్రచారోద్యమాన్ని చేపడితే... భూములను కాలుష్యం బారి నుంచి పూర్తిగా కాపాడుకోగలుగుతాం. -
ఆ క్షేత్రమే సేంద్రియ విశ్వవిద్యాలయం!
‘నవధాన్య’.. ఈ పేరు మన దేశంలో జీవవైవిధ్యంతో కూడిన సేంద్రియ సేద్యం గురించి తెలిసిన వారికెవరికైనా చటుక్కున స్ఫురణకు వస్తుంది.. ‘నవధాన్య’ అనగానే వెంటనే మదిలో మెదిలే రూపం సుప్రసిద్ధ శాస్త్రవేత్త, సంప్రదాయ విత్తన హక్కుల పరిరక్షణ ఉద్యమకారిణి డాక్టర్ వందనా శివ.. మూడు దశాబ్దాలుగా మన దేశంలో వివిధ దేశీ ఆహార పంటలకు సంబంధించి కనీసం 6 వేల సంప్రదాయ వంగడాలను సేకరించి, కంటికి రెప్పలా కాపాడుతున్న ప్రముఖ సంస్థ ఇది.. ‘నవధాన్య’ జీవవైవిధ్య సేంద్రియ వ్యవసాయానికి, లోతైన శాస్త్రీయ పరిశోధనలకు పట్టుగొమ్మ.. భారతీయ పాత పంటల జీవవైవిధ్య వైభవానికి తలమానికంగా విరాజిల్లుతున్న ‘నవధాన్య’, ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్కు సమీపంలో, హిమాలయాల చెంతన సముద్ర తలానికి 500 మీటర్ల ఎత్తున కొలువై ఉంది.. ఇటీవల ‘సాక్షి సాగుబడి’ ప్రతినిధి పంతంగి రాంబాబు డెహ్రాడూన్లోని ‘నవధాన్య’ క్షేత్రంలో పంటల వైవిధ్యాన్ని, విత్తన భాండాగారాన్ని దర్శించారు. నవధాన్య ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినోద్ భట్తో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ‘సాగుబడి’ పాఠకులకు ప్రత్యేకం.. నవధాన్యాలు.. అంటే తొమ్మిది రకాల విత్తనాలు. నవధాన్యాలకు మన సంప్రదాయంలో విశిష్ట ప్రాధాన్యం ఉన్న సంగతి మనకు తెలిసిందే. జీవవైవిధ్య పరిరక్షణకు, సాంస్కృతిక వైవిధ్యానికి ప్రతీకగా డా. వందనా శివ ‘నవధాన్య’ను 1987లో డెహ్రాడూన్లో నెలకొల్పారు. 1991లో ఇది ట్రస్టుగా మారింది. వేలాది ఏళ్లుగా మన భూముల్లో విరాజిల్లుతున్న సంప్రదాయ విత్తన వంగడాలను ప్రాణప్రదంగా పరిరక్షించుకోవడం.. విత్తన జ్ఞానాన్ని పదిలపరచుకోవడం.. అంతిమంగా మన విత్తనాలతో కూడిన ఆహార స్వాతంత్య్రాన్ని పరిరక్షించుకోవడం.. జీవవైవిధ్య సేంద్రియ సేద్యాన్ని చిన్న రైతులకు అందించడం, వారికి సముచితమైన ఆదాయాన్ని అందించే నెట్వర్క్ను ఏర్పాటు చేయటం.. స్థూలంగా ఇవీ నవధాన్య లక్ష్యాలు. నవధాన్య ప్రధాన కేంద్రం డెహ్రాడూన్ అయినప్పటికీ దేశంలో మరో రెండు చోట్ల ఉప కేంద్రాలున్నాయి. నవధాన్య ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినోద్ భట్ ఇలా అన్నారు.. ‘ఇప్పటికి మొత్తం 6 వేల దేశీ పంటల విత్తనాలను పరిరక్షించాం. 22 రాష్ట్రాల్లో 127 సామాజిక విత్తన నిధులను ఏర్పాటు చేశాం. వేప, బాస్మతి వరి, గోధుమలపై విదేశీ కంపెనీలు మేధోపరమైన హక్కులు పొందే ప్రయత్నాలను న్యాయపోరాటం ద్వారా విజయవంతంగా తిప్పికొట్టాం. ఇప్పటికి సుమారు 10 లక్షల మంది చిన్న రైతులు, విత్తన సంరక్షకులు, ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల సిబ్బందికి, దేశ విదేశీ కార్యకర్తలు, శాస్త్రవేత్తలకు శిక్షణ ఇచ్చాం. 20 లక్షల ఎకరాలను సేంద్రియ వ్యవసాయంలోకి మళ్లించాం. ఈ రైతుల సాగు ఖర్చును 30%కు తగ్గించి, దిగుబడులు 3 రెట్లు పెంచాం. అంతేకాదు, 40 వేల మంది చిన్న రైతులను కూడగట్టాం. దేశంలోకెల్లా మొదటిగా ఇందుకోసం ‘ఫెయిర్ ట్రేడ్ నెట్వర్క్’ను నెలకొల్పాం. వారి సేంద్రియ ఉత్పత్తులను స్థానిక మార్కెట్లలోనే విక్రయిస్తూ, వారికి గౌరవప్రదమైన ఆదాయం వచ్చేలా చేశాం. మోహన్ సింగ్ అనే ఓ రైతు ఎకరంలో అనేక పంటలు కలిపి సాగు చేసి 2013లో రూ. 80,300 ఆదాయం పొందారు...’ అని అన్నారు. డెహ్రాడూన్లోని నవధాన్య సేంద్రియ వ్యవసాయ క్షేత్రం వయసు 30 ఏళ్లు. 45 ఎకరాల విస్తీర్ణం. చిన్న, చిన్న కమతాలలో ఎన్నో పంటలను కలిపి, సేంద్రియ పద్ధతుల్లో సాగు చేస్తున్నారు. వరిలో తప్ప ఇతర పంటలన్నీ మిశ్రమ పంటలే. చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజ పంటలు.. అన్నిటినీ కలిపే సాగు చేస్తున్నారు. ప్రతి ఏటా అపురూపమైన ఈ వంగడాలను సాగు చేస్తూ.. విత్తనాలు సేకరించి భద్రపరుస్తున్నారు. రైతులకు ఇస్తున్నారు. సేంద్రియ ఉత్పత్తులను ఢిల్లీ తదితర చోట్ల విక్రయిస్తున్నారు. అమూల్యమైన ఈ దేశీ వంగడాల విత్తనాలను సంప్రదాయ పద్ధతుల్లో ఇక్కడి విత్తన నిధిలో భద్రపరిచారు. 2017లో ఈ క్షేత్రంలో 1,722 వంగడాలున్నాయి. ఇందులో వరి 730, బాసుమతి 41, గోధుమ 212, కూరగాయలు 158, రాజ్మా 130, పప్పుధాన్యాలు 97, నూనెగింజ రకాలు 54, ఆవ 22, కొర్ర 21, మొక్కజొన్న 20, అమరంత్ 3, ఓట్స్ 19, రాగి 30, పచ్చిరొట్ట పంటలు 17, సుగంధ ద్రవ్యాలు 58, ఔషధ మొక్కలు 47.. రకాల పంటలను సాగు చేసి, ఆ విత్తనాలను విత్తన నిధిలో ఉంచారు. ఏక దళ, ద్విదళ పంటలను కలిపి సాగు చేయటం, దేశీ విత్తనాలను భద్రపరచటంతోపాటు.. సేంద్రియ సేద్యం వల్ల దిగుబడులు ఎలా ఉన్నాయి? భూసారం పెరుగుతోందా తగ్గుతోందా? రసాయనిక ఎరువులు వేసే భూముల్లో భూసారం ఎలా ఉంది? వంటి ఆసక్తికరమైన అంశాలపై శాస్త్రీయ పద్ధతిలో తులనాత్మక అధ్యయనాలు చేయటం ‘నవధాన్య’ ప్రత్యేకత. ఇందుకోసం డెహ్రాడూన్ నవధాన్య క్షేత్రంలో 2000లోనే సాయిల్ ఎకాలజీ ల్యాబ్ను నెలకొల్పి ఎప్పటికప్పుడు పరీక్షలు జరుపుతున్నారు. 2014–15లో 5 రాష్ట్రాల్లో డాక్టర్ వందనా శివ ఆధ్వర్యంలో చేసిన ఒక అధ్యయనంలో రసాయనిక వ్యవసాయంలో కన్నా సేంద్రియ వ్యవసాయంలో దిగుబడులు వివిధ పంటల్లో 0.85% నుంచి 106.25% వరకు పెరిగాయని తేలింది. రసాయనిక సేద్యంలో ఒకే పంట సాగు వల్ల భూముల్లో సేంద్రియ పదార్థం నిర్దిష్ట కాలంలో 14% తగ్గిపోగా, అదేకాలంలో సేంద్రియ మిశ్రమ పంటలు సాగు చేయటం వల్ల 29–99% వరకు పెరిగిందని నవధాన్య జరిపిన మరో అధ్యయనంలో నమోదైంది. సేంద్రియ/రసాయనిక వ్యవసాయం వల్ల కలిగే ఫలితాలను గురించి విశ్లేషించినప్పుడు భూసారం, ఉత్పాదకత, ఆదాయం వంటి విషయాల గురించే సాధారణంగా అధ్యయనం చేస్తూ ఉంటారు. అయితే, నవధాన్య అంతటితో సంతృప్తి చెందలేదు. ఎకరానికి సేంద్రియ/రసాయనిక పద్ధతుల్లో ఎంతెంత పరిమాణంలో వివిధ రకాల పోషక పదార్థాలు ఉత్పత్తి అవుతున్నాయో కూడా సశాస్త్రీయంగా అధ్యయనం చేసి, నివేదిక(హెల్త్ పర్ యాకర్)ను ప్రచురించడం విశేషం. సేంద్రియ పద్ధతిలో మిశ్రమ పంటల సాగు(సేంద్రియ పద్ధతుల్లో పొలం అంతటా ఒకే పంటను సాగు చేయడం కూడా అనర్థమే) వల్ల పర్యావరణానికి, ప్రజారోగ్యానికే మేలు కలగడమే కాదు.. అధిక పరిమాణంలో పోషక పదార్థాల దిగుబడి, తద్వారా ఆకలిని, పౌష్టికాహార లోపాన్ని పారదోలటం కూడా ఈ వ్యవసాయ పద్ధతితోనే సాధ్యమవుతుందని ఈ అధ్యయనం రుజువు చేసిందని చెప్పొచ్చు. ‘దేశీ వరి వంగడాల్లోనూ ఔషధ గుణాలున్నాయి. అయితే, చిరుధాన్యాలను ప్రధానాహారంగా తినటం ద్వారా పౌష్టికాహార లోపాన్ని పూర్తిగా అధిగమించవచ్చు. చిరుధాన్యాల పైనుంచి మన దృష్టి మళ్లించేందుకే బ్రిటిష్ పాలకులు వీటికి జంతువుల పేర్లతో (ఉదా.. కొర్రలకు ఫాక్స్టెయిల్ మిల్లెట్, ఉలవలకు హార్స్గ్రామ్..) పేరు పెట్టి ఉంటారు. ఇది కుట్ర పూరితంగానే జరిగింది..’ అని నవధాన్య ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ భట్ వ్యాఖ్యానించారు. జీవవైవిధ్య సేంద్రియ వ్యవసాయం, దేశీ విత్తన పరిరక్షణ, చిన్న రైతును ఫోకస్లోకి తేవడంలో 30 ఏళ్ల క్రితమే ముందు నడచిన సంస్థగా అత్యంత శ్లాఘనీయమైన కృషి చేస్తున్న ‘నవధాన్య’ దిన దిన ప్రవర్థమానం కావాలని ‘సాక్షి సాగుబడి’ ఆకాంక్షిస్తోంది! సేంద్రియ సేద్యం భూమికి బలం! ఐదు అంతకన్నా ఎక్కువ ఏళ్ల నుంచి సేంద్రియ, రసాయనిక వ్యవసాయ పద్ధతుల్లో పంటలు పండిస్తున్న పొలాల్లో భూసారం స్థితిగతులు ఎలా మారాయన్న అంశంపై డెహ్రాడూన్లోని నవధాన్య జీవవైవిధ్య వ్యవసాయ పరిశోధనా సంస్థ గత ఏడాది ఆసక్తికరమైన అధ్యయనం చేసింది. ఈ రెండు రకాల వ్యవసాయ పద్ధతుల వల్ల ఆయా భూముల్లో సూక్ష్మజీవరాశి, పోషకాల స్థాయిల్లో ఎలాంటి మార్పులొచ్చాయో ఉత్తరాఖండ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, మహారాష్ట్రల్లోని వివిధ భూముల్లో శాస్త్రీయంగా అధ్యయనం చేసింది. సేంద్రియ వ్యవసాయ భూముల సారం పెరిగిందని, రసాయనిక వ్యవసాయ భూముల్లో సారం తగ్గిపోయిందని తేలింది(శివ 2017). ఈ పట్టిక చూస్తే సేంద్రియ వ్యవసాయ భూముల్లో సేంద్రియ పదార్థం, నత్రజని, పొటాషియం తదితర పోషకాలు పెరిగిన సంగతి, రసాయనిక వ్యవసాయ భూముల్లో తగ్గిపోయిన సంగతి అర్థమవుతుంది. నేలతల్లికి వందనం.! సముద్ర తలం నుంచి 500 మీటర్ల ఎత్తులో నవధాన్య డెహ్రాడూన్ వ్యవసాయ క్షేత్రం ఉంది. జీవవైవిధ్య సేంద్రియ సేద్యం 30 ఏళ్లుగా చేస్తున్న ఆ భూమి జీవజీవాలతో సుసంపన్నంగా విరాజిల్లుతోంది. సేంద్రియ కర్బనం 1.6(తెలుగు రాష్ట్రాల్లోని భూముల్లో సేంద్రియ కర్బనం 0.5–0.2 మధ్యలో ఉన్నట్లు ఒక అంచనా!), సేంద్రియ పదార్థం 6.5, ఉదజని సూచిక 7గా ఉందని నవధాన్య సాయిల్ ఎకాలజీ ల్యాబ్ నిర్వాహకురాలు భువనేశ్వరి తెలిపారు. 1996లో ఇక్కడ 120 అడుగుల్లో భూగర్భ జలాలు ఉండేవి. 20 ఏళ్లలో నీటి మట్టం 40 అడుగులకు పెరిగాయి. భూమిలో సేంద్రియ కర్బనం, సేంద్రియ పదార్థం పెరుగుతున్న కొద్దీ నీటì తేమను పట్టుకునే శక్తి భూమికి పెరుగుతుంది. తద్వారా నీటి వినియోగం తగ్గిపోతుంది. ఆ విధంగా ఈ క్షేత్రంలో పంటల సాగుకు 20 ఏళ్లలో నీటి వినియోగం 60% తగ్గిందని భట్ వివరించారు. నవధాన్య క్షేత్రం వరి పంట డెహ్రాడూన్ నవధాన్య క్షేత్రంలో వానపాముల విసర్జితాల కనువిందు విత్తన నిధిలో వేలాడదీసిన విత్తన కంకులు డబ్బాల్లో భద్రపరచిన విత్తనాలు డెహ్రాడూన్లోని నవధాన్య వ్యవసాయ క్షేత్రం విశిష్టతలను వివరిస్తున్న నవధాన్య ప్రతినిధి భువనేశ్వరి www.navdanya.org -
ప్రయాస లేని ఇంటిపంటలు!
‘మనిషి చెయ్యి పెడితేనే మొక్కలకు నష్టం జరుగుతుంది. మొక్కలు మనిషి జోక్యాన్ని ఆశించవు. వాటి నైజం బతకటమే కదా. నేను చేసేదేమి ఉంది? ఇది నా అనుభవం..’ అంటున్నారు సీనియర్ అర్బన్ పర్మాకల్చర్ నిపుణురాలు నాదెండ్ల లక్ష్మి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు పదిలో స్వగృహంలో నివాసం ఉంటున్న ఆమె గత ఐదేళ్లుగా అర్బన్ పర్మాకల్చర్ పద్ధతుల్లో పెరటి తోటను స్వతంత్రంగా పెరిగేలా తీర్చిదిద్దారు. ఆ పెరటి తోటలో మొలిచే చాలా రకాల వార్షిక పంటలు ప్రతి ఏటా విత్తనాలు వేయకుండానే మొలిచి మంచి దిగుబడులను ఇస్తున్నాయి! తన పెరటి తోటలో గత మూడేళ్లుగా ఎటువంటి విత్తనాలనూ పనిగట్టుకొని వేయలేదని, అంతకుముందు వరుసగా రెండేళ్లు నాటిన మొక్కలు, వేసిన విత్తనాలే ప్రతి ఏటా వాటంతట అవే మొలకెత్తి, సంతృప్తికరమైన ఫలసాయాన్ని అందిస్తున్నాయని లక్ష్మి వివరించారు. విత్తిన మొదటి ఏడాది పంట తీసుకోరు! ఆమె గార్డెన్లో ప్రస్తుతం అనేక కుండీల్లో వంగ మొక్కలున్నాయి. అయితే, ఆమె తన పెరటి తోటలో ఐదేళ్ల క్రితం వంగ విత్తనాలేశారు. ఆమె పెట్టుకున్న నియమం ఏమిటంటే.. ఏ రకం విత్తనాలైతే కొత్తగా తెచ్చి పెరటి తోటలో చేర్చుతారో ఆ మొక్కల కాయలను తొలి ఏడాది ముట్టుకోరు. అవే పెరిగి, పండి రాలిపోయి భూమిలో కలిసిపోతాయి. అనుకూలమైన వాతావరణం ఏర్పడినప్పుడు ఆ విత్తనాలు మళ్లీ మొలకెత్తి, ఫలసాయాన్ని అందిస్తాయి. ప్రతి ఏటా కొన్ని కాయలను విత్తనాలకు వదిలేస్తారు. వాటిని పనిగట్టుకొని దాచిపెట్టి విత్తటం ఉండదు. అవే మట్టిలో కలిసిపోయి.. తిరిగి మొలకెత్తుతూ ఉంటాయి. ఉదాహరణకు.. ఇప్పుడు కొన్ని కుండీల్లో వంగ మొక్కలున్నాయి. సుమారు 5 సెంట్ల విస్తీర్ణంలో ఉన్న పెరట్లో కొన్ని సిమెంటు రింగ్లు, కొన్ని పెద్ద కుండీలు ఉన్నాయి. చాలా మొక్కలు నేలపైనే పెరుగుతున్నాయి. విత్తనాలు పడి మట్టిలో ఉండి వాటంతటవే తిరిగి మొలుస్తుంటాయి. మొలిచిన మొక్కలకు పరిమితంగా ఆలనాపాలనా చేయడమే తప్ప పెద్దగా చేయాల్సిందేమీ లేదని లక్ష్మి అంటున్నారు. సీజన్లో వంగ మొక్కలు అక్కడక్కడా మొలుస్తాయి. మొలిచిన మొక్కను తీసి కుండీల్లోకి చేర్చుతారు.. ఏడాది పొడవునా రాలిన ఆకులతో లీఫ్ కంపోస్టు తయారు చేసి, ఎప్పటికప్పుడు మొక్కలకు వేస్తూ ఉంటారు. తగుమాత్రంగా నీరందిస్తారు. అంతే.. ఇక వాటంతట అవే పెరుగుతూ దిగుబడినిస్తాయి. వంగ, టమాటా మొక్కలను మాత్రమే పీకి కుండీల్లో నాటుతారు. మిగతా కూరగాయలు, ఆకుకూరలు, బొప్పాయి వంటి పండ్ల మొక్కలు ఎక్కడ మొలిస్తే అక్కడే పెరిగి ఫలసాయాన్నిస్తుంటాయని లక్ష్మి వివరించారు. అందుకే తనది ప్రయాస పడి సాగు చేయని (డూ నథింగ్) పెరటి తోట అంటారామె. భూసారం.. జీవవైవిధ్యం.. భూమిలో వానపాములు, సూక్ష్మజీవరాశి పుష్కలంగా పెరిగేలా సారవంతం చేయడం.. ఆకులు అలములతో ఆచ్ఛాదన కల్పించడం.. వీలైనన్ని ఎక్కువ రకాల (బహువార్షిక, ఏక వార్షిక, స్వల్పకాలిక) పంటల జాతులను కిచెన్ గార్డెన్లోకి చేర్చితే చాలు.. అదేపనిగా ప్రతిరోజూ పనిగట్టుకొని పెద్దగా ప్రయాస పడి మొక్కల పనుల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని లక్ష్మి చెబుతున్నారు. 2013లో అర్బన్ పర్మాకల్చర్ వర్క్షాపును తన ఇంట్లోనే నిర్వహించానని, అప్పటి నుంచి శాశ్వత వ్యవసాయ సూత్రాలను ప్రయాస లేకుండా తు.చ. తప్పకుండా అనుసరిస్తున్నానన్నారు. ఆమె పెరటి తోటలో బొప్పాయి, ప్యాషన్ ఫ్రూట్, దొండ, పొట్ల, అలసంద, 3 రకాల చిక్కుళ్లు, పచ్చిమిర్చి, క్యాప్సికం, వంగ, టమాటాతోపాటు తోటకూర, పాలకూర, మెంతికూర, 3 రకాల బచ్చలికూర మొక్కలున్నాయి. మునగచెట్టు పూలు, పిందెలతో కనువిందు చేస్తుంది. అవకాడొ వంటి అరుదైన పండ్ల మొక్కలూ ఉన్నాయి. తన పెరట్లో ఎందుకనో గాని దేశవాళీ బొప్పాయి మొక్కలు విత్తనాలు వేయకపోయినా రెండేళ్లకోసారి మాత్రమే పుట్టి పెరిగి పండ్లనిస్తున్నాయని లక్ష్మి తెలిపారు. మగ చెట్టును ఒకదాన్ని ఉంచి మిగతావి తీసేస్తానన్నారు. గుత్తిగా పూలు వస్తే అది మగ చెట్టని, పిందెతో కూడిన పూవు ఒకటే వస్తే అది ఆడ చెట్టని గుర్తించాలన్నారు. ఐదారేళ్ల క్రితం వంగ విత్తనాలు వేసి పెంచానని, తర్వాత విత్తనం వేయలేదని, ప్రతి ఏటా గార్డెన్లో అక్కడక్కడా మొలిచిన వంగ మొక్కలను పీకి కుండీల్లో నాటుతానన్నారు. దేశవాళీ టమాటా రకాల విత్తనాలు కొన్ని సంవత్సరాల క్రితం వేశానని, తర్వాత నుంచి వాటికవే మొలుస్తుంటాయని, మొక్కలను తీసి కుండీల్లో నాటి, లీఫ్ కంపోస్టు, నీరు తగినంత అందించడమే తాను చేస్తున్నానన్నారు. రెండు టమాటా మొక్కలుంటే చాలు తమ నలుగురికీ సరిపోయే అన్ని కాయలు కాస్తాయన్నారు. చలికాలంలో 70% తమ కుటుంబానికి ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తమ ఇంట్లో పండినవే సరిపోతాయని, వేసవిలో పూర్తిగా మార్కెట్లోనే కొంటామని లక్ష్మి(laxmi_nad@yahoo. com) తెలిపారు. బొప్పాయి మగ పూలు, బొప్పాయి ఆడ పువ్వు, కాప్సికం, ప్యాషన్ ఫ్రూట్ మునగ వైభవం, చిక్కుడు పాదు, వాటికవే మొలిచినవి, తేనెతుట్టె -
విత్తన ప్రియుడికి గవర్నర్ అభినందన..
తాడూరు (నాగర్కర్నూల్ జిల్లా) : జీవ వైవిద్యంలో ప్రతిభ కనబర్చిన గుంతకోడూరుకు చెదిన రమేష్ విద్యార్థి 500 రకాల విత్తనాలను సేకరించి వాటిని భద్రపరిచాడు. 1995 నుంచి గ్రామీణ ప్రాంతాల్లో వివిధ రంగాల్లో కృషిచేసిన వారికి జాతీయ స్థాయి అవార్డులు సృష్టి సమాన్ పేరుతో ఇస్తున్నారు. 2018కి గాను జీవవైవిధ్య రంగంలో దేశం మొత్తం నుంచి వచ్చిన నామినేషన్లలో రమేష్ ఎంపికయ్యారు. పల్లె సృజన అనే స్వచ్ఛంద సంస్థ సహాయ సహకారంతో ఈ అవార్డు ఎంపికయ్యాడు. ఈ ఏడాది ఇచ్చే 15 మందిలో తెలుగు రాష్ట్రాల నుంచి తాను ఎంపికైనట్లు రమేష్ తెలిపారు. తాను అందుకోబోతున్న ప్రతిష్టాత్మక మొదటి అవార్డు అంటూ ఆనందం వ్యక్తం చేశారు. తనకు లభించిన ప్రతిష్టాత్మక అవార్డును గుజరాత్లోని అహ్మదాబాద్లో శుక్రవారం అందుకోనున్నట్లు వివరించారు. గవర్నర్ అభినందన.. రమేష్ యూనివర్సిటీలో సైన్స్ సైఫాబాద్ ఓయూలో బీఎస్సీ బీబీసీ పూర్తి చేశాడు. 500కు పైగా విత్తనాలను సేకరించిన ఇతనికి హైదరాబాద్కు చెందిన ఎన్ఐఎఫ్ తరపున పనిచేసే పల్లె సృజన స్వచ్ఛంద సంస్థ సహకరిస్తుంది. ఈ సంస్థ అధినేత పోగుల గణేశం సహాయంతో 15 అక్టోబర్ 2015 అబ్దుల్ కలాం పుట్టిన రోజు సందర్భంగా వందేమాతరం పౌండేషన్ నిర్వహించిన ఇండోనేషన్ ఫెస్టివల్లో పాల్గొన్నాడు. అక్కడ ప్రదర్శించిన విత్తనాలను గవర్నర్ నరసింహన్ పరిశీలించి రవీంద్రభారతిలో వేదికపై అభినందించారు. సెప్టెంబర్ 28, 2015న డైరెక్టర్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రీసెర్చ్ డాక్టర్ వరప్రసాద్ గుర్తించి విత్తనాల నుంచి 25కిపైగా పీహెచ్డీలు పొందవచ్చన్నారు. ఏప్రిల్ 27న 2016 రాష్ట్ర ప్రాజెక్టు కోఆర్డినేటర్ తెలంగాణ సాయిలు విత్తనాలు పరిశీలించి అభినందించారు. మే 12, 2016వరకు ఐసీఏఆర్, ఐఐఓఆర్ రాజేంద్రనగర్, ఎన్డీపీజీఆర్లో డాక్టర్ ముక్తా సంరక్షణలో విత్తనాల సేకరణకు సంబంధించిన మెళకువలను తెలుసుకున్నట్లు రమేష్ తెలిపారు. నినాదంగా విత్తనాల సేకరణ స్వగ్రామమైన మండలంలోని గుంతకోడూరులోనే రమేష్ ప్రాథమిక విద్యాభ్యాసం కొనసాగింది. ఆ తర్వాత మండల కేంద్రమైన తాడూ రు ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పూర్తి చేసి ఇంటర్ విద్యను ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అభ్యసించారు. బైపీసీలో 870 మార్కులు సాధిం చి కళాశాల టాపర్గా నిలిచాడు. అనంతరం కల్వకుర్తి వైఆర్ఎం కళాశాలలో బీఎస్సీ పూర్తి చేశాడు. తల్లిదండ్రులు వ్యవసాయ కుటుంబం కావడం, ఉన్న కొద్దిపాటి భూమిని వ్యవసాయం చేస్తూ చదువులో బాగా రాణిస్తూ అప్పటి నుంచి అనుసరిస్తున్న వివిధ రకాల విత్తనాలను భద్రపర్చడంలో ప్రత్యేక శ్రద్ధ కనబర్చేవాడు. రెండున్నరేళ్లు హైదరాబాద్లో జరిగిన జీవవైవిద్య సదస్సులో ఎంతో ప్రభావితమయ్యాడు. టీవీ, దినపత్రికలో వచ్చిన జీవివైవిధ్య కథనాలు ఎంతో కదిలించాయి. రోజు రోజుకు అంతరించిపోతున్న మొక్కలను కాపాడటంలో తన పాత్ర ఏమిటని ప్రశ్నించుకొని.. తాను ఏదైనా చేయాలని నిర్ణయించుకొని కనుమరుగువుతున్న విత్తనాలను సేకరించాలని భావించాడు. అనుకున్నది తడవుగా రంగంలోకి దిగి ఇప్పటి వరకు 500 విత్తనాలను సేకరించి పలువురితో ప్రశంసలు పొందాడు. గర్వంగా ఉంది.. నాకు చిన్నప్పటి నుంచి నాకంటూ ఏదైనా గుర్తింపు తీసుకువచ్చే విధంగా చేయాలనే తపనతోనే విత్తనాల సేకరణ మొదలుపెట్టాను. ఇందులో భాగంగా నావంతుగా అంతరించిపోతున్న 500 రకాల మొక్కలకు సంబంధించి విత్తనాలను సేకరించాను. ఇప్పటికే గ్రామాల్లో సైతం మొక్కల గురించి చాలా మందికి తెలియదు. పట్టణాల వారికి ఏమాత్రం అవగాహన ఉండదు. కాబట్టి వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో ఉన్నాను. జాతీయ స్థాయిలో అవార్డు రావడం గర్వంగా ఉంది. -
మారకపోతే... పావు వంతు ఎడారే!
భూమి ఉష్ణోగ్రత రెండు డిగ్రీలు పెరిగితే చాలు... పావు వంతు నేల బతికేందుకు వీల్లేని రీతిలో ఎడారిగా మారిపోవడం ఖాయం అంటున్నారు శాస్త్రవేత్తలు. అంతేనా. దీనివల్ల వ్యవసాయం దెబ్బతినడమే కాదు... జీవవైవిధ్యం అంతరించిపోయి, మరిన్ని కరువుకాటకాలు, కార్చిచ్చులు వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఈ విషయాలన్నీ గతంలో విన్నవే అయినప్పటికీ అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం ఒకటి ఇంకోసారి ఈ విపరిణామాలను ధ్రువీకరించింది కాబట్టి ప్రాధాన్యమేర్పడింది. నేచర్ క్లయిమేట్ ఛేంజ్ జర్నల్లో ప్రచురితమైన వివరాల ప్రకారం... ప్రపంచ వాతావరణ భవిష్యత్తుకు సంబంధించి అందుబాటులో ఉన్న 27 కంప్యూటర్ నమూనాల విశ్లేషణ ద్వారా తుది అంచనాకు వచ్చారు. భూతాపోన్నతికి కారణమవుతున్న గ్రీన్హౌస్ వాయువులను తగ్గించకపోతే 2052 – 70 మధ్య కాలానికే సగటు ఉష్ణోగ్రత రెండు డిగ్రీల కంటే ఎక్కువవుతుందని వారు హెచ్చరించారు. ఆస్ట్రేలియాలోని దక్షిణ భాగం, దక్షిణాఫ్రికా, ఆగ్నేయాసియా, మధ్య అమెరికా ప్రాంతాల్లో ఈ ఎడారీకరణ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల దాదాపు 150 కోట్ల మంది ప్రభావితమవుతారని ఈ పరిశోధనల్లో పాలు పంచుకున్న శాస్త్రవేత్త మనోజ్ జోషీ తెలిపారు. అయితే ప్యారిస్ ఒప్పందంలో నిర్ణయించిన మాదిరిగా సగటు ఉష్ణోగ్రతలను 1.5 డిగ్రీల సెల్సియస్కు పరిమితం చేయగలిగితే మాత్రం ఈ ప్రమాదాన్ని దాదాపుగా పరిహరించవచ్చునని వివరించారు. -
జీవ వైవిధ్య పరిరక్షించుకుందాం
– జిల్లా పరిషత్ చైర్మన్ మల్లెల రాజశేఖర్ కర్నూలు (అర్బన్): జీవ వైవిధ్యాన్ని పరిరక్షించుకుందామని, ఇందుకు గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్, నగర పాలక, పురపాలక సంస్థల్లో యాజమాన్య కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని జిల్లా పరిషత్ చైర్మన్ మల్లెల రాజశేఖర్ అన్నారు. మంగళవారం ఉదయం నగరంలోని ఓ హోటల్లో జీవవైవిధ్య మండలి ఆధ్వర్యంలో ‘‘జీవ వైవిధ్య భావనలు, జీవ వైవిధ్య చట్టం, జీవవనరుల వినియోగం ద్వారా వచ్చే లాభాలు’’ అనే అంశంపై జిల్లా స్థాయి సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ఏపీఎస్బీడీబీ (ఆంధ్రప్రదేశ్ స్టేట్ బయోడైవర్సిటీ బోర్డు) చైర్మన్ ఎస్.బి.ఎల్.మిశ్రా, మెంబర్ సెక్రటరీ రమేష్ కుమార్ సుమన్, డీపీఓ బి.పార్వతి, వ్యవసాయ శాఖ జేడీ ఉమామహేశ్వరమ్మ, కర్నూలు, నంద్యాల డీఎఫ్ఓలు డి.చంద్రశేఖర్, శివ ప్రసాద్, జడ్పీ డిప్యూటీ సీఈఓ డి.ప్రతాపరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ ప్రస్తుతం శబ్ద, వాతావరణ కాలుష్యం అధికమవ్వడంతో జీవరాశులు కనుమరుగు అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీఎస్బీడీబీ చైర్మన్ ఎస్.డి.ఎల్.మిశ్రా మాట్లాడుతూ బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీలు పీపుల్స్ బయో డై వర్సిటీ రిజిష్టర్ల తయారీకి ఉపయోగపడతాయన్నారు. ఈ రిజిష్టర్లు స్థానిక జీవసంబంధ వనరుల లభ్యత, జ్ఞానం, ఔషధ ఇతర ఉపయోగాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని కలిగి ఉంటాయన్నారు. మెంబర్ సెక్రటరీ రమేష్ కుమార్ సుమన్ మాట్లాడుతూ మానవ సంఘాలు, సంస్కృతుల మనుగడ, జీవ వైవిధ్యం మీద ఆధారపడి ఉంటుందన్నారు. సదస్సుకు రీజనల్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎల్.వరలక్ష్మి, వివిధ విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు డాక్టర్ బి.రవిప్రసాదరావు, డాక్టర్ టి.రవిశంకర్, డాక్టర్ ఎం.సుబ్బారావు, శ్రీశైలం ఫీల్డ్ డైరెక్టర్ ఎస్.శరవనన్, జిల్లా కోఆర్డినేటర్ జి.రాముడుతో పాటు ఈఓఆర్డీ, ఎంపీడీఓ, అటవీ శాఖకు చెందిన అధికారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. -
ప్రతి ఆసుపత్రిలో స్వచ్ఛభారత్ నిర్వహించాలి
- కాంపౌండ్ వాల్స్ ఉన్న ఆసుపత్రుల్లో బయోడైవర్సిటీల నిర్మాణం - ఏటా పశు ప్రదర్శనలు ఏర్పాటు - పశుసంవర్ధక శాఖ అధికారుల సమీక్ష సమావేశంలో జెడ్పీ చైర్మన్ ఈదర ఒంగోలు: ప్రతి హాస్పిటల్లో స్వచ్ఛభారత్ నిర్వహించాలని జిల్లా పరిషత్ చైర్మన్ ఈదర హరిబాబు అధికారులను ఆదేశించారు. పశు సంవర్ధక శాఖ అధికారులతో తన క్యాంపు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. హాస్పిటల్లు ఎల్లప్పుడూ తెరచి ఉంచాలని, సిబ్బంది క్రమం తప్పకుండా విధులకు హాజరయ్యేలా చర్యలు చేపట్టాలని పశుసంవర్థకశాఖ జాయింట్ డైరెక్టర్ రజనీకుమారికి సూచించారు. ప్రహరీలు ఉన్న హాస్పిటల్స్ ఆవరణలో మొక్కల పెంపకం, పక్షుల ఆవాసాలను ఏర్పాటు చేసి బయోడైవర్సిటీలుగా మార్చాల్సిన అవసరాన్ని చర్చించారు. బీమా పరిష్కారాలకు సంబంధించి సత్వర నిర్ణయాలు ఉండాలని, ప్రతి డివిజన్కు ఒక మండలాన్ని ఆదర్శంగా తీసుకుని ఆ హాస్పిటల్స్లో అన్ని రకాల వసతులు కల్పించి ఆదర్శ మండలంగా ప్రకటించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఆసుపత్రుల నిర్మాణాలకు సంబంధించి పెండింగ్లో ఉన్నవాటిపై సంబంధిత ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, పశుసంవర్ధక శాఖ అధికారులతో మరోమారు సమీక్షించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా జేడీ రజనీకుమారి మాట్లాడుతూ జిల్లాలో 231 హాస్పిటల్స్ ఉన్నాయని, అయితే వాటిలో దాణా నిల్వకు, సైలేజీ నిల్వకు స్టోర్రూంల అవసరం ఉందన్నారు. సంతనూతలపాడు పశువైద్యశాల శిథిలావస్థలో ఉందని, రంగారాయుడు చెరువు వద్ద ఉన్న కార్యాలయం పల్లంగా ఉందని, దానిని లెవలింగ్ చేయించాల్సిన అవసరాన్ని వివరించారు. అంచనాలు తయారు చేయించి పంపిస్తే జనరల్ బాడీలో తీర్మానం చేయించి తదుపరి చర్యలు తీసుకుంటామని ఈదర వారికి స్పష్టం చేశారు. ప్రతి ఏడాది జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్లలో పశువులకు సంబంధించి అందాల పోటీలు, పాల పోటీలు, హింసలేని పశువుల బల ప్రదర్శనలు నిర్వహించాలన్నారు. విజేతలకు మెమెంటోలు, నగదు బహుమతులు, సాంస్కృతిక కార్యక్రమాలు, వెటర్నరీ ఫెస్టివల్స్ నిర్వహించాలన్నారు. ఇందుకు దాతల సాయాన్ని కోరాలని సూచించారు. యువ డాక్టర్లకు పోటీలు ఏర్పాటు చేసి సన్మానించదలిచినట్లు పేర్కొన్నారు. సమావేశంలో కందుకూరు సహాయ సంచాలకులు డాక్టర్ షేక్ కాలేషా, ఒంగోలు సహాయ సంచాలకులు డాక్టర్ ఆర్.మురళీకృష్ణ , జిల్లా ప్రజా పరిషత్ సూపరింటిండెంట్ వి.సాంబమూర్తి పాల్గొన్నారు. -
జీవవెవిధ్యాన్ని కాపాడటం సామాజిక బాధ్యత
మోత్కూరు జీవవైవిధ్యాన్ని కాపాడుకోవడం మనందరి సామాజిక బాధ్యత అని మోత్కూరు మండల ఎంపీపీ ఓర్సులక్ష్మీ పురుషోత్తం తెలిపారు. బుధవారం మండలంలోని దాచారం గ్రామంలో జీవవైవిధ్యంపై అవగాహన సదస్సు, శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ జీవవైవిధ్యాన్ని కాపాడేందుకు గ్రామంలోని ప్రతిఒక్కరు కృషిచేయాలని కోరారు. జెడ్పీటీసీ చింతల వరలక్ష్మీ మాట్లాడుతూ ప్లాస్టిక్ను నిషేధించాలని కోరారు. సింగిల్ విండో చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ జీవవైవిధ్యాన్ని కాపాడకపోతే మానవ మనుగడ అసాధ్యమన్నారు. జీవవైవిధ్య జిల్లా కోర్డినేటర్ ఎట్టం శ్రీనివాస్ మాట్లాడుతూ ఔషధ మొక్కల ఉపయోగాన్ని గ్రామస్తులకు వివరించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ కె.వెంకటనర్సయ్య, సర్పంచ్ కడమంచి వస్తాద్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు నిమ్మల వెంకటేశ్వర్లు, ఎస్ఎంసీ చైర్మన్ యాదగిరి, అవిలయ్య, ఉప సర్పంచ్ కప్పల లింగయ్య, వార్డు సభ్యులు, జీవవైవిధ్య కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
‘బయోడైవర్సిటీ’గా అమీన్పూర్ చెరువు
గుర్తింపు కోసం గ్రామ సభ సైట్గా గుర్తించడం దేశంలోనే ప్రథమం: బోర్డు మెంబర్ సువర్ణ పర్యావరణ సమతుల్యత కాపాడాల్సిందే: తేజ్దీప్కౌర్ పటాన్చెరు: మండలం పరిధిలోని అమీన్పూర్ పెద్ద చెరువును బయోడైవర్సిటీ సైట్గా గుర్తింపు ప్రక్రియ తుది అంకానికి చేరుకుందని తెలంగాణా రాష్ట్ర బయోడైవర్సిటీ బోర్డు మెంబర్ సెక్రటరీ డాక్టర్ సి.సువర్ణ తెలిపారు. సోమవారం పంచాయతీ పరిధిలో గ్రామ సభ నిర్వహించారు. ఇందులో స్థానిక సర్పంచ్ కాట శ్రీనివాస్గౌడ్, తెలంగాణ ప్రత్యేక పోలీసు బలగాల డైరెక్టర్ జనరల్, ఐపీఎస్ అధికారి తేజ్దీప్కౌర్, అటవీ, మత్స్యశాఖ అధికారులు పాల్గొన్నారు. ప్రజల నుంచి సైట్ గుర్తింపు పట్ల అభిప్రాయాలను సేకరించారు. చెరువుపై ఆధారపడిన మొత్తం 28 వర్గాల ప్రతినిధుల నుంచి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మెంబర్ సెక్రటరీ డా.సి.సువర్ణ మాట్లాడుతూ దేశంలోనే ఓ చెరువును బయోడైవర్సిటీ సైట్గా గుర్తించడం ప్రపథమమన్నారు. ఈ చెరువు ప్రత్యేకమైందని వివరించారు. మొత్తం 171 రకాల పక్షులు ఇక్కడ ఉన్నాయన్నారు. విదేశాల నుంచి వచ్చే పక్షులు ఉన్నాయన్నారు. మహానగర శివారులో ఉన్న పెద్ద చెరువును బయోడైవర్సిటీ సైట్గా గుర్తించడం భవిష్యత్ తరాలకు మేలు చేసినట్లవుతుందన్నారు. టీఎస్పీఎస్ డీజీ తేజ్దీప్కౌర్ మాట్లాడుతూ పెద్ద చెరువును తాము కొన్ని నెలల క్రితమే దత్తత తీసుకున్నామని గుర్తు చేశారు. తాము చేసిన కృషి ఫలించడంతో చెరువు వద్ద ఉన్న జీవవైవిధ్యం సంరక్షణకు ప్రభుత్వం ముందుకు వచ్చిందన్నారు. అమీన్పూర్ చెరువు పరిసరాల్లో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సు సిబ్బంది, శిక్షణ కేంద్రంలోని సిబ్బంది చెరువులో ఉన్న చెత్తను ఎత్తి పోస్తున్నారని వివరించారు. స్థానికులు అనేక వ్యర్థాలను చెరువులో వేస్తున్నారని దీని వల్ల పక్షి జాతులకు ఇబ్బంది ఏర్పడుతుందని అన్నారు. బయోడైవర్సిటీ సైట్గా గుర్తించాలని హైదరాబాద్ బర్డ్ వాచర్స్ అసోసియేషన్, ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్లోరా సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారని ఆమె తెలిపారు. బయోడైవర్సిటీకి స్థానికులు మరింతగా సహకరించాలని కోరారు. తాను రిటైర్డ్ తర్వాత అమీన్పూర్లోనే నివసిస్తానని చెప్పారు. చెరువు వద్ద కొందరు డ్రోన్లతో ఫొటోలు తీస్తున్నారని దీన్ని అడ్డుకోవాలని ఆమె కోరారు. ఇదిలా ఉంటే స్థానిక రైతులు, మత్సకారులు ఈ సభలో తమ సందేహాలను వ్యక్తం చేశారు. చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో తమ భూములను కోల్పోతామనే ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం చెరువు కింద 350 ఎకరాల ఎప్టీఎల్ పట్టాలున్నాయని అవి ఎంతో విలువైనవని తెలిపారు. స్థానిక సర్పంచ్ కాట శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ చెరువులో కాలుష్య వ్యర్థాలు పెద్ద ప్రమాదాన్ని తెచ్చిపెడుతున్నాయన్నారు. పీసీబీ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే సమస్యలు వస్తున్నాయన్నారు. వివిధ పరిశ్రమల నుంచి వస్తున్న కాలుష్య వర్థాలు పెద్ద చెరువులో చేరుతున్నాయన్నారు. దీనిని అరికట్టాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాస్రెడ్డి, పీసీబి అధికారి భిక్షపతి, మత్స్యశాఖ ఏడీ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
జీవవైవిధ్యంతోనే మానవాళికి మనుగడ
జీవ వైవిధ్యం కాపాడేందుకు 1010 కమిటీలు:జోగు రామన్న సాక్షి, హైదరాబాద్: జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవడంపైనే మానవాళి మనుగడ ఆధారపడి ఉందని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. జీవవైవిధ్య మండలి ముద్రించిన 5 కొత్త పుస్తకాలను సో మవారం సచివాలయంలో మంత్రి ఆవి ష్కరించారు. ఆయన మాట్లాడుతూ జీవవైవిధ్యానికి, మానవ జీవనానికి అవినాభావ సంబం ధం ఉందన్నారు. జీవవైవిధ్యం ధ్వంసమైతే మానవ మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మా రుతుందన్నారు. రాష్ట్రంలో గ్రామ స్థాయిలో జీవవైవిధ్యాన్ని పెంపొందించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఇందులో భాగంగానే గ్రామాల్లో సర్పంచుల అధ్యక్షతన జీవవైవిధ్య యాజమాన్య కమిటీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టామని, ఇప్పటికే 1,010 కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణలో అంతరించిపోతున్న జీవరాశులను కాపాడుకునేం దుకు నిపుణుల సహకారంతో చర్యలు చేపట్టామన్నారు. బయోడైవర్సిటీ మండలి సభ్య కార్యదర్శి సువర్ణ, రీజనల్ కో-ఆర్డినేటర్ లింగారావు, సైంటిస్ట్ లివిశర్మ పాల్గొన్నారు. -
నేలమ్మా.. మన్నించమ్మా!
జీవానికి మూలాధారమైన నేలతల్లి నిర్లక్ష్యమై వట్టి పోతోంది. సకల జీవకోటికీ స్తన్యం పడుతున్న నేలమ్మే నాగరికతకు పునాది. మానవులతోపాటు భూమిపైన, భూమి లోపల సకల జీవులకూ ప్రాణాధారం భూమాతే. అన్నదాత చేతుల మీదుగా మన కంచాల్లోకి వస్తున్న ఆహారంలో 99% భూమాత ప్రసాదమే! ఆహారం, నీరు, వాతావరణం, జీవవైవిధ్యం, జీవితం.. వీటన్నిటికీ ప్రాణ దాతైన భూమాతతో సజీవ సంబంధాన్ని కొనసాగించడంలో మనం ఘోరంగా విఫలమయ్యాం. అందుకే.. అంతటి చల్లని తల్లికే పుట్టెడు కష్టం వచ్చిపడింది. సాగు భూమిలో 25% ఇప్పటికే నిస్సారమైంది. జీవాన్ని.. సేంద్రియ పదార్థాన్ని కోల్పోయింది. చౌడు తేలింది. చట్టుబండైంది. నీటిని గ్రహించే శక్తి నశించింది. ఒక్కమాటలో చెప్పాలంటే.. పంటల సాగుకు పనికిరాకుండా పోయింది.. నాశనమవుతూనే ఉంది.. ప్రతి ఏటా రెండున్నర కోట్ల ఎకరాల్లో సుసంపన్నమైన నేల నాశనమైపోతున్నది. అంటే.. ప్రతి నిమిషానికి 30 ఫుట్బాల్ కోర్టులంత మేర సారవంతమైన భూమి పనికిరాకుండా పోతోంది. ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్థ(ఎఫ్ఏవో) నివేదిక ప్రకారం.. నేలతల్లి ప్రాణాలను అనుక్షణం మనమే చేజేతులా తోడేస్తున్నాం. ఈ విధ్వంసం అంతా వ్యవసాయం పేరిట సాగిపోతోంది.. జీవనాధారంగా ప్రారంభమైన వ్యవసాయం.. విచక్షణారహితంగా వాడుతున్న వ్యవసాయ రసాయనాల వల్లనే ముఖ్యంగా నేల నిర్జీవమవుతోంది. తల్లి ఆరోగ్యం పాడైతే బిడ్డ బాగుంటుందా? అతిగా రసాయనిక అవశేషాలున్న ఆహారం తిన్న నేలతల్లి బిడ్డల ఆరోగ్యం కూడా అంతకంతకూ క్షీణిస్తోంది. మానవాళి మనుగడ సజావుగా సాగాలంటే.. నెత్తికెక్కిన కళ్లను నేల లోతులకు మళ్లించాలి. వనరుల విధ్వంసం ఆగాలంటే.. పారిశ్రామిక దేశాలు రుద్దిన సాంద్ర వ్యవసాయ పద్ధతిని వదిలేసి, ప్రకృతికి దగ్గరవ్వాలని ఎఫ్ఏవో మొత్తుకుంటున్నది. ఆహార భద్రత, పర్యావరణ వ్యవస్థలకు భూమి ఆరోగ్యం ప్రాణావసరమన్న స్పృహను పాలకుల్లో, ప్రజల్లో రగిలించడం తక్షణావసరం. ఇందుకోసమే 2015ను ‘అంతర్జాతీయ భూముల పరిరక్షణ సంవత్సరం’గా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. అంతర్జాతీయ భూముల పరిరక్షణ దినోత్సవం సందర్భంగా ఈ నెల 5(రేపు) నుంచే భూముల పరిరక్షణకు పాలకులు, రైతులు, ప్రతి మనిషీ కదలాలని పిలుపునిచ్చింది. భూసారాన్ని పునరుద్ధరించుకుంటూనే నిశ్చింతగా జీవనాధారమైన పంటల సాగుకు ప్రపంచమంతా కంకణబద్ధులు కావాల్సిన తరుణమిది. వాతావరణ మార్పుల ప్రతికూల పరిస్థితుల మధ్య తెలుగు రాష్ట్రాలు ఈ అంశంపై తీక్షణంగా దృష్టిసారించాలి. భూసార విధ్వంసక విధానాలకు, అసపవ్య సాగు పద్ధతులకు పాతరేద్దాం.. ప్రకృతికి కీడు చేయని పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్న ఆదర్శ అన్నదాతలకు జేజేలు పలుకుదాం.. నిస్సారమైన నేలకు తావు లేని రోజు కోసం అందరం ఉద్యమిద్దాం. జీవిత కాలంలో సెంటీమీటరు నేలను కూడా మనం సృష్టించలేం. అలాంటప్పుడు భూమిని పాడు చేసే హక్కు మనకెక్కడిది? ఆ తల్లి స్తన్యం తాగి రొమ్ము గుద్దడం మాని, నేలమ్మను పరిరక్షించుకుంటే పోయేదేమీ లేదు.. ఆహారోత్పత్తి 58% పెరగటం(ఎఫ్ఏఓ అంచనా) తప్ప! మనిషి పనుల మూలంగా నేలమ్మ చాలా వేగంగా సారాన్ని కోల్పోతూ సాంఘిక, ఆర్థిక, ఇతర సమస్యలకు దారితీస్తోంది. నేలను అపసవ్యమైన రీతుల్లో అతిగా వినియోగించడం మనుగడకే ఎసరు తెస్తోంది. హరిత విప్లవ కాలంలో ముందుకొచ్చిన సాంద్ర వ్యవసాయ పద్ధతుల వల్ల గత ఆరు దశాబ్దాలుగా నేల గతమెన్నడూ ఎరుగనంతగా పతనమైంది. అవసరానికి మించి దున్నడం, ఏదో ఒకే పంటను సాగు చేయడం, సేంద్రియ ఎరువులు చాలినంతగా వేయకపోవడం, రసాయనిక ఎరువులతోపాటు కలుపు మందులను విచ్చలవిడిగా వాడటం, కాలువ నీటి వాడకంలో అపసవ్య పోకడలు.. ఇవీ భూములు నాశనం కావడానికి ముఖ్య కారణాలని భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలాగే పరిస్థితి కొనసాగితే ఆహారోత్పత్తి వ్యవస్థే ప్రమాదంలో పడే అవకాశం ఉంది. దేశంలో 12 కోట్ల 10 లక్షల హెక్టార్ల భూమి నిస్సారంగా మారింది. ఇందులో 2 కోట్ల 28 లక్షల హెక్టార్ల సాగు భూమి కేవలం రసాయనిక ఎరువులు విచ్చలవిడిగా వాడడం వల్ల నిర్జీవమై సాగుకు పనికిరాకుండా పోయింది. పెరుగుతున్న జనాభా అవసరాలు తీర్చే క్రమంలో మన దేశంలో సాగు భూమి తగ్గిపోతున్నది. 1951లో ప్రతి మనిషికీ 1.19 ఎకరాల చొప్పున సాగు భూమి అందుబాటులో ఉండేది. ఇది 1991 నాటికి 40 సెంట్లకు తగ్గింది. 2035 నాటికి 20 సెంట్లకు తగ్గేలా ఉంది. ఉత్పాదకతను కోల్పోతున్న లక్షల హెక్టార్లు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో 12 రకాల భూములున్నాయి. మెట్ట, మాగాణి అనే తేడా లేకుండా అన్ని రకాల భూముల్లోనూ సారం అంతకంతకూ తగ్గిపోతూ పంటల దిగుబడి క్షీణిస్తోంది. తెలంగాణ (భూముల్లో 29 శాతం) లో 34 లక్షల హెక్టార్ల భూమి ఏదో ఒక రకంగా ఉత్పాదక శక్తిని కోల్పోయిందని తాజా అంచనా. ఆంధ్రప్రదేశ్ (భూముల్లో 36 శాతం)లోని 58 లక్షల హెక్టార్ల భూములు నిస్సారంగా మారాయి. సేంద్రియ కర్బనం 0.5 శాతానికి అడుగంటిందని అంచనా. దీన్ని 2 శాతానికి పెంచుకోవడమే లక్ష్యంగా బహుముఖ వ్యూహాలను ప్రభుత్వం అమల్లోకి తేవాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే, వీటిని రైతు దగ్గరకు తీసుకెళ్లే యంత్రాంగమే అరకొరగా ఉంది. రైతుకు సాంద్ర వ్యవసాయాన్ని అలవాటు చేసిన ప్రభుత్వం.. దాని ద్వారా ఏర్పడిన భూసార సమస్యను అధిగమించే సులభమైన, ఆచరణాత్మక పద్ధతులను రైతులకు అందించలేని స్థితిలో ఉండిపోవడం విషాదకర వాస్తవం. దిక్కుతోచని బడుగు రైతు మనుగడకే ఇది పెనుశాపంగా పరిణమించింది. ఫ్రాంక్లిన్ డెలొనొ రూజ్వెల్ట్ ఇలా అన్నారు: ‘భూములను నాశనం చేసుకునే దేశం, తనను తాను నాశనం చేసుకుంటుంది’. ప్రస్తుతం మన భూములు, మన దేశం పరిస్థితి ఇలాగే ఉంది. ప్రత్యామ్నాయాల అడుగుజాడలు.. ప్రభుత్వం చేష్టలుడిగినంత మాత్రాన అన్నదాతలు అక్కడే ఆగిపోరు. తమ సమస్యలకు తామే పరిష్కారాలు వెతుక్కుంటూనే ఉంటారు. రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపుమందులు వాడడం పూర్తిగానో, పాక్షికంగానో మానేసి.. స్థానిక వనరులతోనే ఖర్చు తక్కువతో కూడిన ప్రత్యామ్నాయాలు వెదుకుతున్నారు. భూసారాన్ని పెంపొందించుకుంటూనే పంట దిగుబడులనూ పెంచుకుంటున్నారు. టన్నులకొద్దీ పశువుల ఎరువుల అవసరం లేకుండానే కొత్త పద్ధతుల్లో తక్కువ పశువులతోనే ఎక్కువ విస్తీర్ణంలో సేంద్రియ, ప్రకృతి వ్యవసాయాన్ని అనుసరిస్తున్నారు. ప్రభుత్వాలు అత్యాధునికమైనవన్న భ్రమలో విదేశీ నమూనా ఎండమావుల వెంటపడకుండా.. మన రైతుల అనుభవంలో నిగ్గుతేలిన మేలైన, ప్రకృతికి అనుగుణమైన ప్రత్యామ్నాయ సాగు పద్ధతులపై దృష్టిపెట్టాలి. మట్టిలోనే పుట్టి మట్టిలోనే బతుకుతూ సమాజానికి మూడు పూటలా తిండి పెడుతున్న అచ్చమైన రైతుల అనుభవాల నుంచి బేషజాల్లేకుండా నేర్చుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందా? అన్నదే అసలు ప్రశ్న. మన భూముల, మన రైతుల, వినియోగదారుల భవిష్యుత్తు, ఆరోగ్యం- ఈ ప్రశ్నకు వచ్చే సమాధానంపైనే ఆధారపడి ఉంది. - పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ భూసారాన్ని రక్షించుకునేలా సాగు మారాలి ఉత్పాదకత పెరగాలంటే భూమిలో సేంద్రియ కర్బన శాతాన్ని పెంచాలి. రసాయనిక, సేంద్రియ, జీవన ఎరువులు కలిపి వాడాలి. 25-50% పోషకాలను సేంద్రియ, జీవన ఎరువుల ద్వారా అందించాలి. భూసారాన్ని పరిరక్షించుకునే విధంగా వ్యవసాయ పద్ధతులు మార్చుకోవాలి. కౌలు, యువ రైతులకు అవగాహన కలిగించేందుకు విస్తరణ వ్యవస్థను పటిష్టం చేయాలి. సూక్ష్మజీవుల ద్వారా పోషకాలను అందించడంపై దృష్టిపెట్టాలి. సూక్ష్మజీవుల గురించి మనకు తెలిసింది ఒక శాతమే. అంతర్జాతీయ భూముల పరిరక్షణ సంవత్సరం సందర్భంగా ఈ అంశాలపై శ్రద్ధ చూపాలి. పరిశోధన ఫలితాలను రైతులకు అందించడానికి విస్తృత కృషి జరగాలి. సాయిల్ రిసోర్సెస్ మ్యాపింగ్పై తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు రైతులకు ఉపకరిస్తాయి. - డా. డి. బాలగురవయ్య, ప్రధాన శాస్త్రవేత్త, భూవిజ్ఞాన శాస్త్ర విభాగం, ప్రొ. జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (పీజేటీఎస్ఏయూ), హైదరాబాద్ ప్రకృతి వ్యవసాయంతోనే భూముల పునరుజ్జీవనం! మట్టి మొక్కలకు పునాది. ప్రకృతిసిద్ధమైన పర్యావరణ వ్యవస్థలో జీవరాశి (వానపాములు, సూక్ష్మజీవులు, పురుగులు, శిలీంధ్రాలు, ఇంకా మట్టిలో ఉండే అనేక ప్రాణులు) నిరంతరాయంగా పోషకాలను మొక్కల వేళ్లకు అందిస్తాయి. కానీ గత అరవయ్యేళ్లుగా రైతులు రసాయనిక ఎరువులు, పురుగుమందులు, శిలీంధ్రనాశనులు, కలుపుమందులు వాడుతుండడం వల్ల మట్టిలో ఉండాల్సిన వానపాములు, ఇతర జీవరాశి నాశనమై భూమి నిస్సారమైపోయింది. ఏదైనా ఎరువును బయటి నుంచి అధికంగా తెచ్చి వేస్తేనే గానీ పంట పండని దుస్థితి నెలకొంది. ఇప్పుడు మనం రసాయనిక ఎరువులు, పురుగుమందులు, సూక్ష్మపోషకాలు పొలంలో వేయకుండా పంటలు పండించాలనుకుంటే.. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా మట్టిలోని జీవరాశిని, వానపాములను తిరిగి ఆహ్వానించాలి. ప్రకృతి మనకు అందించిన ఈ అద్భుతమైన వ్యవసాయ విజ్ఞానానికి అడ్డుచెప్పే వారెవరూ ఇప్పుడు లేరు..ప్రాణావసరం కాబట్టి! - సుభాష్ పాలేకర్, ప్రకృతి వ్యవసాయోద్యమ సారధి, మహారాష్ట్ర (‘పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం - 1’ పుస్తకం నుంచి) నడుస్తుంటే మట్టి పెళ్లలు గుచ్చుకునేవి..! పచ్చిరొట్ట ఎరువులు, ఘనజీవామృతం, జీవామృతం వాడుతూ 6 ఎకరాల్లో నాలుగేళ్లుగా సేంద్రియ సేద్యం చేస్తున్నా. సేంద్రియ కర్బనం 0.5% నుంచి 0.95%కు పెరిగింది. అంతకుముందు పొలంలో చెప్పుల్లేకుండా నడిస్తే మట్టిపెళ్లలు గుచ్చుకునేవి. ఇప్పుడు నడి ఎండాకాలంలోనూ చెప్పుల్లేకుండా హాయిగా నడవొచ్చు. ఎకరానికి బీపీటీ ధాన్యం 28-30 బస్తాల దిగుబడి వస్తోంది. మా పొలం తుపాన్లు తట్టుకొని పడిపోకుండా నిలబడింది. నేల తేమ ఆరిపోదు. తక్కువ నీరే సరిపోతున్నది. - కోగంటి రవికుమార్ (80192 59059), సేంద్రియ రైతు, ఇందుపల్లి, ఉంగుటూరు మండలం, కృష్ణా జిల్లా సేంద్రియ కర్బనం 3% నుంచి 0.5%కి తగ్గింది.. జీవామృతం, పంచగవ్య, పచ్చిరొట్ట ఎరువులు, జీవన ఎరువుల ద్వారా సేంద్రియ వ్యవసాయ వ్యాప్తికి కృషి చేస్తున్నాం. భూముల్లో సేంద్రియ కర్బనం 50 ఏళ్ల నాడు 3% ఉండే 0.5%కి తగ్గింది. దీన్ని కష్టపడి 1%కి పెంచేందుకు ప్రయత్నిస్తున్నాం. రైతులను చైతన్యవంతం చేస్తున్నాం. 8 ఏళ్లలో సేంద్రియ సాగు విస్తీర్ణం 5% నుంచి 25%కి పెరిగింది. సేంద్రియ ముడి బియ్యంతోపాటు సేంద్రియ పాలూ అందుబాటులోకి వచ్చాయి. వీటి వినియోగ దారుల్లో రోగ నిరోధక శక్తి పెరిగి, వైద్య ఖర్చులు 50% తగ్గాయి. రైతులంతా సేంద్రియ సాగుకు మళ్లితే ఆసుపత్రుల అవసరమే ఉండదు. ప్రతి రైతుకూ నాటు ఆవు లేదా దూడైనా ఉండాలి. - కే సాంబశివరావు (97011 08511), సేంద్రియ సాగు సమన్వయకర్త, ప్రభుత్వ రైతు శిక్షణా కేంద్రం, విజయవాడ -
భారత శాస్త్రవేత్తకు అత్యున్నత జీవవైవిధ్య అవార్డు
వాషింగ్టన్: భారత పర్యావరణ శాస్త్రవేత్త కమల్జిత్ సింగ్ బావా ఈ ఏడాది ప్రతిష్టాత్మక మిడోరీ జీవ వైవిధ్యం పురస్కారానికి ఎంపికయ్యారు.60 లక్షల రూపాయల విలువైన ఈ అవార్డుని ఆయన చేసిన పర్యావరణ పరిశోధనలు అందజేయనున్నారు. పర్యావరణంపైన, హిమాలయాల్లో వాతావరణ మార్పులపైన కూడా ఆయన పరిశోధనలు చేశారు. జపాన్లోని ఏఇఓఎన్ పర్యావరణ సంస్థ 2010లో మిడోరి జీవ వైవిధ్యం అవార్డుని ఇవ్వడం మొదలు పెట్టింది. దక్షిణ కొరియాలో వచ్చే నెలలో జరిగే ఒక కార్యక్రమంలో ఆయన ఈ అవార్డుని అందుకుంటారు. బోస్టన్లోని మసాచ్చూసెట్ విశ్వవిద్యాలయంలో కమల్ బావా దాదాపు 40 ఏళ్లపాటు ప్రొఫెసర్గా పని చేశారు. జీవవైవిధ్యానికి సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో ఇచ్చే అత్యంత ప్రతిష్టాత్మకమైన గున్నెర్స్ అవార్డుని మొట్టమొదట అందుకున్న ఘతన కూడా కమల్ బావాదే. కమల్జిత్ పంజాబ్ విశ్వవిద్యాలయంలో ఎంఎస్, పిహెచ్డి చేశారు. జీవావరణ శాస్త్ర, పర్యావరణ శాస్త్ర పరిశోధనల కోసం ఆయన అశోక్ ట్రస్ట్ను కూడా స్థాపించారు. ** -
అర్ధరాత్రి నుంచి జీహెచ్ఎంసీ కార్మికుల సమ్మె
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీలోని బీఎంఎస్ యూనియన్కు, అధికారులకు బుధవారం రాత్రి జరిగిన చర్చలు విఫలం కావడంతో అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి దిగుతున్నట్లు యూని యన్ అధ్యక్షుడు కె. శంకర్ ప్రకటించారు. జీహెచ్ఎంసీలోని పారిశుధ్య విభాగంలోని కార్మికులతోపాటు రవాణ, ఎంటమాలజీ, బయోడైవర్సిటీ, వెటర్నరీ సహ మొత్తం 13 కేటగిరీల్లోని కార్మికులకు కూడా 27 శాతం ఇంక్రిమెంట్ను ఇవ్వాలనే ప్రధాన డిమాండ్తో పాటు ఇతరత్రా డిమాండ్లను యూనియన్ నాయకులు అధికారుల ముందుంచారు. తమ డిమాండ్లకు అధికారులు అంగీకరించనందున సమ్మె అనివార్యమైందని యూనియన్ నాయకులు శంకర్, శ్యాంబాబు, జి.మల్లికార్జున్,వినయ్కపూర్ చెప్పారు. ఆయా విభాగాలకు చెందిన దాదాపు 8 వేల మంది కార్మికులు విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొంటార న్నారు. సమ్మెకు వెళ్లొద్దు: కమిషనర్ విజ్ఞప్తి రంజాన్ , బోనాల పండుగలు, వర్షాకాలం తరుణంలో బీఎంఎస్ నాయకులు సమ్మె ఆలోచన మానుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ యూనియన్కు విజ్ఞప్తి చేశారు. డిమాండ్ల పరిష్కారానికి అన్ని అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఒక ప్రకటనలో తెలిపారు. విధులను బహిష్కరించే కార్మికులపై ఎస్మా, ఆర్పీ యాక్ట్లకు సైతం వెనుకాడేది లేదన్నారు. నగరం పరిశుభ్రంగా ఉండేందుకు అవసరమైన అన్ని చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన జోనల్, డిప్యూటీ కమిషనర్లకు సూచించారు. -
దయగల హృదయమేదయా?
పద్యానవనం: ఫలములిచ్చెడు పాదపప్రతతి గనియు పాలు గురిసెడు గోసమూహాల గనియు కరిగి వర్షించు నీలిమేఘాల గనియు కనికరము నేర్చుకొనని ముష్కరుడు నరుడు సకల జీవుల్లో మనిషి ఉత్కృష్టమైన ప్రాణి అంటారు. మేధస్సు కలిగి ఆలోచనతో నడుచుకునే జీవి మనిషి. కానీ, ఇతర జీవుల పట్ల, జీవవైవిధ్యం పట్ల, ప్రకృతి సమతుల్యత పట్ల, మొత్తానికి ప్రకృతి పట్ల స్పృహ నానాటికి సన్నగిల్లుతోంది. ప్రకృతిని కాపాడుకోవాలని, అలక్ష్యం చేస్తే భవిష్యత్తరాల మనుగడ ప్రశ్నార్థకమౌతుందన్న మౌలికాంశాన్నే మనిషి విస్మరిస్తున్నాడు. ప్రకృతికి తద్వారా మొత్తం భూమండలానికే ముంచుకు వస్తున్న ముప్పు పట్ల, సమాజహితంలో ఆలోచించే వారు, పర్యావరణ ప్రేమికులు ఇటీవలి రెండు సందర్భాల్లో తమ ఆందోళనల్ని వ్యక్తం చేశారు. ఏప్రిల్ 22న ధరిత్రీ దినం, రెండోది జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినం సందర్భంగా ఈ ఆందోళనలు వ్యక్తమయ్యాయి. మనిషి పాత్ర-ప్రమేయం వల్లే ప్రకృతి సమతుల్యత చెడి ఈ ధరిత్రికి ప్రమాదమేర్పడుతోంది. దీనికి విరుగుడుగా... ఏదో చేయాలి! పూని ఏదో ఒకటి చేయకుంటే, ప్రమాదం అత్యంత వేగంగా ముంచుకు వస్తోందన్నది ఆందరూ అంగీకరించే సత్యం. ప్రపంచమంతా కూడబలుక్కొని ఏదేదో చేసేయడం ఉన్నపళంగా సాధ్యపడదు. దేశాలు దేశాలుగా శ్రద్ధ వహించి కృషి చేయాలి. అంతకు మించి, ఎవరికి వారు, తమ తమ స్థాయిలో చేయగలిగినంత మేరకు పర్యావరణ పరిరక్షణకు దోహదపడే చిన్న చిన్న చర్యలతోనైనా చొరవ చూపాలన్నది ఐక్యరాజ్య సమితి పిలుపు. ఇటువంటి పూనికకు ముందు, ప్రతి మనిషిలో ఎంతో కొంత కనికరం, దయ, అనుకంప అనేవి ఉండాలి, ఉండి తీరాలనేది ప్రకృతి సూత్రం. కానీ, ఎందుకో మనిషి రోజు రోజుకు కనికరం నశించి కటువుగా తయారవుతున్నాడు. పరిస్థితుల ప్రాబల్యమా? మనిషి మనిషికి మధ్య అంతరం పెరిగి మానవత్వం మృగ్యమవడమా? కష్టపడకుండా అవకాశాలు లభించని ఈ సంక్లిష్ట వ్యవస్థలో, శ్రమపడకుండా అవతలి వాళ్ల అవకాశాల్ని తానే తన్నుకుపోవాలనే దుర్బుద్ధా? అన్నీ తనకే కావాలనే అవధులు మించిన స్వార్థమా? కారణమేదైనా కావచ్చు, మనిషనేవాడు మాత్రం కనుమరుగవుతున్నాడు. మానవేతిహాసం మొదలయిన్నుంచి మనిషి తనకన్నా పూర్వం నుండి ఉన్న వాటిని అనుసరిస్తూనో, అనుకరిస్తూనో (మ్యుటేషన్ ఆర్ ఇమిటేషన్) ముందుకు సాగుతున్నాడు. ఎడనెడ తన సృజనతో కొత్త కొత్త విషయాల్ని కనుగొంటూ సాధించే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని జత చేస్తూ పురోగమిస్తున్నాడు. అంతిమ లక్ష్యం ఆనందం పొందడం. సర్వేజనాః సుఖినోభవంతు! మరి, మంచి నేర్చుకోవడానికి, తనలో అప్పటికే ఉన్న మంచిని కాపాడుకోడానికి ఉన్న అవరోధమేంటో అర్థం కాదు. పారశీక తాత్వికుడు, కవి ఉమర్ ఖయ్యామ్ను తెనుగించిన కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి ఈ పద్యంలో అదే చెబుతున్నాడు. రాయితో కొట్టేవాడికి కూడా తియ్యటి ఫలాలనిచ్చే చెట్టు నుంచి స్ఫూర్తి పొందవచ్చు. తన బిడ్డకు అవసరమయ్యే ఆహారంకన్నా ఎన్నోరెట్లు అధికంగా పాల రూపంలో సంపూర్ణ ఆహారాన్ని మానవ మనుగడ కోసం అందిస్తున్న గోమాత నుంచీ అటువంటి స్ఫూర్తి లభిస్తూనే ఉంది. తాము నిలువెల్లా కరిగిపోతూ కూడా నిరతం వర్షించి నేలను సశ్యశ్యామలం చేసే నీలి మేఘాలూ స్ఫూర్తి దాతలే! ఇవన్నీ చూస్తూ కూడా, అవిచ్చే ఫలాలు అనుభవిస్తూ కూడా మనిషి కనికరం, దయ, అనుకంప నేర్చుకోడు. అలా నేర్వనివాడు నరుడు కాడు ముష్కరుడన్నది పెద్దల భావన. కృష్ణుడు ఉజ్జయినిలో సాందీపుని వద్ద విద్యాభ్యాసం చేసేటప్పటి బాల్యమిత్రుడు సుధాముడు. తర్వాత ఆయన తన స్వస్థలం మధురలో ఉంటాడు. చాలా సంవత్సరాల తర్వాత... తొలిసారి కృష్ణుడు మధురకు వస్తున్నాడని తెలిసి సంబరపడిపోతాడాయన. కానీ, పేదవాడైన తాను మితృడికేమివ్వగలనని మధనపడి, కడకు తనకు చేతనైన విద్య, వృత్తి, ప్రవృత్తి మాలలల్లడమే కనుక, ఓ మంచి దండ తయారు చేస్తాడు. అది వేయగానే పులకించిపోయిన కృష్ణుడు ఏదైనా కోరుకొమ్మని మిత్రుడినడుగుతాడు. అప్పుడు సుధాముడు, ‘‘నీపాద కమల సేవయు, నీపాదార్చకులతోడి నెయ్యము, నితాంతాపార భూతదయయును, తాపస మందార నాకు దయజేయగదే!’’ అంటాడు. ఒకటి తన కోసం, భగవంతుని సేవకుడిగా అనుగ్రహించమంటాడు. రెండు, తన చుట్టూ ఉన్న వారి కోసం, తన స్నేహమల్లా భగవత్భక్తి కలిగిన సజ్జనులతోనే సాగేట్టు చేయమంటాడు. ఇక మూడోది, సమస్త జీవ కోటి కోసం, సకల జీవుల పట్లా తనకు అపారమైన అవ్యాజమైన ప్రేమ, దయ, అనుకంప కలిగి ఉండేలా వరమీయమంటాడు మితృడైన భగవంతుడిని. ఎంత గొప్ప సద్భావన! ఈ సూర్యమండంలోని ఇతర ఏ గ్రహాలపైనా లేని జీవం కలిగి ఉన్న మన పృథ్విని కాపాడుకోవడానికి మనందరిలోనూ ఉండాల్సింది ఈ సద్భావనే! - దిలీప్రెడ్డి -
జీవవైవిధ్యానికి దర్పణం
వ్యక్తిగత సక్సెస్స్టోరీలంటే బాగా డబ్బు సంపాదించిన వారి గురించి ప్రస్తావించుకోవడం, దేశాల సక్సెస్స్టోరీలంటే పారిశ్రామిక ప్రగతి సాధించిన వాటి గురించి మాట్లాడుకోవడం... ప్రపంచం దృష్టిలో చెప్పుకోదగ్గ సక్సెస్ అంటే ప్రస్తుతానికి ఇదే! ఇలాంటి వెల్లువకు భిన్నమైన విజయగాథ ఇది. చీకటి ఖండంలోని ఒక దేశం కథ. ఆ దేశం పేరు నమీబియా. ఎడారి దేశమే అయినా జీవవైవిధ్యాన్ని కాపాడటంలో, ప్రకృతి పరిరక్షణలో ఉత్తమమైనదిగా గుర్తింపు పొందింది ఈ దేశం. భూమి అంటే అది దున్నేవాడిదే కాదు, వాడితో పాటు మనుగడ సాగిస్తున్న జంతుజాలాలకు, వృక్షాలకు దాంట్లో వాటా ఉంటుందని నమ్మి, వాటి వాటా వాటికి ఇచ్చేసి జీవవైవిధ్యానికి ప్రాధాన్యమిస్తున్న దేశం నమీబియా. ప్రకృతి పరిరక్షణ కోసం ప్రతి దేశం కొన్ని నియమాలు పెట్టుకొంది, అయితే అవన్నీ చెప్పుకోవడానికి మాత్రమే. నమీబియాలో మాత్రం నీతులు, సూక్తులు మాటల్లో కాదు ఆచరణలో దర్శనమిస్తాయి. విస్తీర్ణం విషయంలో ప్రపంచంలో 34వ స్థానంలో ఉన్నప్పటికీ, జంతుజాలాల కోసం ఎక్కువ భూభాగాన్ని అభయారణ్యాలుగా వదిలేసిన జాబితాలో మాత్రం ఈ దేశం తొలి స్థానంలో నిలుస్తుంది. ఈ దేశంలో 42 శాతం భూభాగం అభయారణ్యమే. చాలా ఏళ్ళపాటు తెల్లవాళ్ల పాలనలో ఉండిపోయిన ఈ దేశం, స్వాతంత్య్రం పొంది కేవలం పాతికేళ్లు మాత్రమే అయింది. వెంటనే ఏర్పాటైన ప్రభుత్వం ప్రజల విషయంలోనే కాక, జంతు పరిరక్షణపై కూడా దృష్టిసారించి, ‘ప్రకృతి పరిరక్షణ కోసం ఎవరు మంచి మాటలు చెప్పినా విని, వాటిని అమలులో పెడదాం. నమీబియన్లుగా ప్రకృతి పరిరక్షకులుగా నిలుద్దాం..’ అనేది ఆ దేశరాజ్యాంగంలోని ఆర్టికల్ 95 గా రాసుకొన్నారు. ఇతర ఆఫ్రికన్ దేశాలన్నీ మైనింగ్, పారిశ్రామికీకరణ అంటుంటే.. నమీబియా మాత్రం వాటికి దూరంగా అడవుల్లోనే ఉండిపోవాలని బలంగా నిర్ణయించుకొంది. చెట్లను నరికి అడవులకు నిప్పెట్టి గాలినీ, నీటిని కలుషితం చేసి తెచ్చుకొనే అభివృద్ధి తమకు అనవసరమని నమీబియా పాలకులు, ప్రజలు ప్రకృతి పరిరక్షణలో మునిగి తేలుతున్నారు. ఈ విషయంలో ఐక్యరాజ్యసమితితో పాటు అనేక సంస్థలు వీరి కృషిని గుర్తించి, అనేక అవార్డులతో సత్కరిస్తూనే ఉన్నాయి. పారిశ్రామిక ప్రగతి లేకపోతే ఆ దేశం అభివృద్ధి చెందేదెలా? అని కొన్ని అమాయకపు బుర్రలు ప్రశ్నించవచ్చు. కానీ ఆర్థిక ప్రగతిలో కూడా ఈ దేశం వెనుకపడలేదు. జీవవైవిధ్యానికి నిలువెత్తు దర్పణమైన ఈ దేశం ‘పర్యాటకుల స్వర్గం’ మారింది. దీంతో పర్యాటక పరిశ్రమ నిధుల వనరుగా మారి విదేశీమారకాన్ని ఆర్జించి పెడుతోంది.