boduppal
-
బోడుప్పల్లో ఘోరం.. స్టూడెంట్ దుర్మరణం
సాక్షి, క్రైమ్: బోడుప్పల్లో ఘోరం జరిగింది. మద్యం మత్తులో ఓ వ్యక్తి వేగంగా కారు నడిపి ఒకరిని బలిగొన్నాడు. వేగంగా దూసుకొచ్చిన కారు రోడ్డు పక్కన ఆగి ఉన్న బైక్ను ఢీ కొట్టింది. దీంతో ప్రమాదంలో బైక్పై ఉన్న యువకుడు అక్కడిక్కడే మృతి చెందాడు. చనిపోయిన యువకుడి ఐడెంటిటీని.. బీటెక్ చదివే విశాల్గా గుర్తించారు పోలీసులు. విశాల్ స్వస్థలం ఉత్తర ప్రదేశ్. పార్ట్ టైం జాబ్ కోసం ర్యాపిడో నడుపుతున్నట్లు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. -
34 కాలనీలు.. 85 నామినేషన్లు
మేడ్చల్: ఏళ్ల క్రితం చట్ట ప్రకారంగా కొనుగోలు చేసిన భూముల్లో వారు స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. అయితే ఓ వ్యక్తి ఫిర్యాదుతో వారి స్థలాలు వక్ఫ్ భూములని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో తమ సమస్యలను పట్టించుకోవాలని మేడ్చల్ బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలోని 30 కాలనీల ప్రజలు 85 మందితో అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్లు వేసి నిరసన తెలిపారు. బోడుప్పల్ ప్రాంతంలో ఆర్ఎన్ఎస్ కాలనీ, పెంటారెడ్డి కాలనీ,ç మారుతీనగర్, ఘట్కేసర్కు చెందిన మధురానగర్ తదితర 30 కాలనీల ప్రజలు నాలుగేళ్లుగా విచిత్ర సమస్యను ఎదుర్కొంటున్నారు. బోడుప్పల్ ప్రాంతంలో 30 సర్వే నంబర్లలో 300 ఎకరాలు, ఘట్కేసర్ పరిధిలో 10 ఎకరాలు భూమి ఉంది. 40 ఏళ్ల క్రితం అవన్నీ వెంచర్లుగా మారిపోయాయి. బోడుప్పల్, పిర్జాదీగూడ నగర శివారు ప్రాంతాలు కావడంతో శరవేగంగా అభివృద్ధి సాధించాయి. రియల్టర్లు భూములను కొనుగోలు చేసి వెంచర్లను ఏర్పాటు చేశారు. చట్టబద్ధంగా వినియోగదారులకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారు ప్లాట్లు కొనుగోలు చేసి సొంతింటి కల నెరవేర్చుకున్నారు. దాదాపు 30 కాలనీలలో ఏడు వేల కుటుంబాలు నివసిస్తున్నాయి. 2018 వరకు అంతా సాఫీగానే ఉన్నా ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. 2018లో ఓ వ్యక్తి కాలనీలు ఉన్న భూములన్నీ వక్ఫ్ భూములని ఫిర్యాదు చేయడంతో ఆ భూముల రిజిస్ట్రేషన్లు నిలిపివేశారు. దీంతో 7వేల కుటుంబాల వారు జేఏసీగా ఏర్పడి పోరాటం మొదలు పెట్టారు. 2022 సంవత్పరంలో 30 కాలనీల్లో ఉన్న భూములన్నీ ప్రభుత్వ నిషేధిత జాబితాలో చేర్చడంతో కాలనీలలో ఇల్లు కట్టుకున్న వారి భవిష్యత్ అంధకారంగా మారంది. జేఏసీ తరపున పోరాటాలు చేసినా పాలకుల నుంచి, ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో వారి రోదన అరణ్య రోదనగా మారింది. తమ సమస్యను ఎమ్మెల్యే నుంచి ఎంపీ వరకు ఎవరికి విన్నవించుకున్నా పరిష్కారం కాకపోవడంతో వారు తమ సమస్యపై పాలకులు స్పందించాలని డిమాండ్ చేస్తూ ఏకంగా 88 నామినేషన్లు వేశారు. శుక్రవారం కాలనీల వాసులు కీసరలోని ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లి నామినేషన్లను దాఖలు చేశారు. మేడ్చల్ నియోజకవర్గంలో మొత్తం 116 మంది నామినేషన్లు వేయగా అందులో 88 మంది బోడుప్పల్ 30 కాలనీలకు చెందిన వారే. ప్రభుత్వానికి మా సమస్య తెలియాలనే.. మేం ఎన్నికలలో విజయం సాధిస్తామని నామినేషన్ వేయలేదు. మా సమస్య వచ్చే ప్రభుత్వానికి తెలియాలనే మూకుమ్మడి నామినేషన్లు వేశాం. ఎన్నికల ద్వారానైన మా సమస్య ప్రభుత్వం దృష్టికి పోతుందని అనుకుంటున్నాం. – శ్రీధర్రెడ్డి, ఐక్యకార్యాచరణ సమితి అధ్యక్షుడు పాలకులు పట్టించుకోవడం లేదు.. పాలకులు పట్టించుకోకపోవడం వల్లే 88 మంది నామినేషన్లు వేశారు. సమస్యను మంత్రి మల్లారెడ్డికితో పాటు అందరు పాలకులకు విన్నవించినా ఎవరూ పట్టించుకోలేదు. మా సమస్య పట్టించుకోని నేతలకు ఓటు ద్వారా బుద్ది చెబుతాం – కుంభం కిరణ్కుమార్, కార్పొరేటర్, జేఏసీ కోచైర్మన్ -
బోడుప్పల్ లో రూ.10 కోట్ల కుచ్చుటోపి
-
ఆవు పేడతో వినాయక విగ్రహాలు
బోడుప్పల్: జీవ జాతులకు హాని కలుగకుండా... పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ఆవు పేడతో గణపతి విగ్రహాలను తయారు చేస్తూ ఆయా విగ్రహాలను లాభాపేక్ష లేకుండా విక్రయిస్తోంది బోడుప్పల్ బాలాజీహిల్స్ కాలనీలోని శ్రీ శంకర విద్యా భారతి గో సంరక్షణ చారిటబుల్ ట్రస్ట్. ►ఆవు పేడతో 300 రకాల ఉత్పత్తులు తయారు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని సంస్థ నిర్వాహకుడు కుప్ప శ్రీనివాస్ తెలిపారు. వినాయక విగ్రహాలు, గోడకు వేలాడ దీసే బొమ్మలు, ఇంటి ముఖ ద్వార తోరణాలు, ఆది యోగి విగ్రహాలు, శివలింగాలు, జ్ఞాపికలు, నర్సరీ కుండీలు, విత్తన గోలీలు, దీపావళికి లక్ష్మీదేవి విగ్రహాలు, ప్రమిదలు, జప మాలలు, ఫ్రెండ్షిప్ బ్యాండ్లు పెన్ను స్టాండ్లు, సెల్ఫోన్ స్టాండులు, విభూది, దంత మంజరి (పళ్లపొడి), తయారు చేస్తున్నారు. అలాగే గో మూత్రంతో పినాయిల్, వేప, హ్యాండ్వాచ్ల లాంటి ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. భవిష్యత్లో ఆవు పేడతో చెప్పులు తయారీ, ఆసనాల కోసం వేసుకునే పీటలు, దూబ్బత్తి, దోమల కోసం మచ్చల బత్తి వంటి ఉత్పతులు తయారు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ►గోశాలకు విరాళాలు అందజేసే వారికి పేడతో తయారు చేస్తున్న ఉత్పత్తులను ఉచితంగా అందజేస్తున్నామని సంస్థ నిర్వాహకుడు శ్రీనివాస్ తెలిపారు. భావితరాలకు గో జాతిని వారసత్వ సంపదగా అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. -
బోడుప్పల్ అంటే.. బాబోయ్ మాకొద్దంటున్న అధికారులు!
సాక్షి,బోడుప్పల్(హైదరాబాద్): బోడుప్పల్ నగర పాలక సంస్థ పరిధిలో గత కొంత కాలంగా అధికారులు లేకుండా పాలన కొనసాగుతుంది. ఇక్కడ పని చేసే అధికారులు కొంత మంది ఇష్టం లేక వెళ్లి పోవడం, మరి కొంత మంది సెలవులపై వెళ్లడంతో కిందస్థాయి సిబ్బందిచే పాలన కొనసాగిస్తున్నారు. అధికారులపై విపరీతమైన ఒత్తిడి, పనిభారంతో పాటు వేధింపులు ఉండడంతో ఇక్కడ పని చేయడానికి ఏ అధికారి ఇష్ట పడడం లేదు. దీంతో ఇప్పటికే కమిషనర్, టౌన్ ప్లానింగ్, శానిటేషన్, మేనేజర్, హరితహారం ఇన్చార్జ్ లేకుండానే తూతూ మంత్రంగా పాలన కొనసాగిస్తున్నారు. పాలనాధ్యక్షుడైన మేయర్కు అధికారుల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. మేయర్కు ప్రజా పాలనపై పట్టు లేకపోవడం, ఇతర విషయాలపై చూపుతున్న శ్రద్ధ ప్రజా సమస్యలపై చూపకపోవడంతో పాలన పూర్తిగా స్తంభించిపోతోందని ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే డిప్యూటేషన్పై పనిచేసే అధికారులు ఇక్కడ పని చేయకపోగా, మరి కొంత మంది అధికారులు బదిలీ అయ్యారు. కమిషనర్ కూడా సెలవులపై వెళ్లడంతో నగర పాలక సంస్థలో పాలన అటకెక్కింది. సమన్వయ లోపం కారణమా? ► బోడుప్పల్ కమిషనర్, మేయర్కు మధ్య సమన్వయం లోపించింది. దీంతో గత కొంత కాలంగా వారు ఎడ,పెడ మొఖంగా ఉన్నారు. దీంతో పాటు పనిభారంతో పాటు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఆయన సెలవులపై వెళ్లారు. ఇక్కడ పని చేసిన శానిటరీ ఇన్స్పెక్టర్ పదవీకాలం ముగిసింది. అనంతరం ఆయననే మళ్లీ అవుట్ సోర్సింగ్ శానిటరీ ఇన్స్పెక్టర్గా తీసుకున్నారు. ఆయన కొంత కాలం పని చేసిన తర్వాత ఇక్కడ చేయలేనని వెళ్లిపోయారు. ఆ తర్వాత కొత్తగా మరో శానిటరీ ఇన్స్పెక్టర్ రాలేదు. ఒకప్పుడు ఢిల్లీ స్థాయిలో గుర్తింపు పొంది స్వచ్ఛ సర్వేక్షణ్, స్వచ్ఛ భారత్లో అవార్డులు పొందిన బోడుప్పల్ నేడు చెత్త విషయంలో మురికి కూపంగా మారింది. ఇక్కడ పని చేసిన మేనేజర్ మరో చోటకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఎవరూ రాకపోవడంతో ఆర్ఓను ఇన్చార్జ్ మేనేజర్గా పెట్టి విధులు నిర్వహిస్తున్నారు. ఇలా వస్తారు.. అలా వెళ్తారు.. ► మున్సిపాలిటీకి కీలకమైన విభాగం టౌన్ప్లానింగ్. ఇక్కడ గతంలో నల్గొండలో పనిచేసే ఓ ఏసీపీ అధికారి డిప్యూటేషన్పై మూడు రోజులు ఇక్కడ, మరో మూడు రోజులు అక్కడ పని చేశారు. ఓ మంత్రి సహకారం మేయర్, కొంత మంది కార్పొరేటర్లు భవన నిర్మాణాల విషయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో ఆయన తన డిప్యూటేషన్ను రద్దు చేయించుకుని నల్గొండలోనే ఉండి పోయారు. ఆయన తరువాత మరో టీపీఓ డిప్యూటేషన్పై వచ్చారు. ఆయన కూడా ఇక్కడ ఇమడ లేక వెళ్లిపోయారు. ప్రస్తుతం అధికారి లేకుండానే టౌన్ ప్లానింగ్ విభాగం కొనసాగుతోంది. కిందిస్థాయి అధికారులతోనే.. ► ప్రతి సంవత్సరం హరితహారం కోసం బడ్జెట్లో 10 శాతం నిధులు కేటాయిస్తున్నారు. ఇందులో భాగంగా నాటిన మొక్కల సంరక్షణ, మొక్కల పంపిణీ, పార్కుల ఏర్పాటు, నిర్వహణ, పెరటి తోటల పంపకం, మొక్కలకు నీటి సరఫరా, నర్సరీల ఏర్పాటు, నిర్వహణ కోసం పదవీ విరమణ పొందిన ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ను నెలకు రూ. 50 వేలు ఇచ్చి తీసుకున్నారు. ఇక్కడ పరిస్థితులు గమనించిన సదరు అధికారి సైతం పని చేయలేమని వెళ్లిపోయారు. బోడుప్పల్ నగర పాలక సంస్థ పరిధిలో పనిచేసే అందుకు ఎవరూ సాహసించడం లేదు. ప్రస్తుతం ఇంజనీరింగ్, రెవెన్యూ విభాగం మినహా ఇస్తే మిగతా విభాగాలు కింద స్థాయి అధికారులు, సిబ్బందిచే నడుపుతున్నారు. దీంతో పాలన అంతా స్తంభించి పోయి అస్తవ్యస్తంగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. చదవండి: కరీంనగర్లో మరో ‘పుష్ప’ భన్వర్సింగ్.. వైరల్ -
ప్రతిపక్షాలు, పోలీసులు సీఎం కేసీఆర్ తొత్తులు: వైఎస్ షర్మిల
సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్ష పార్టీలతో పాటు పోలీసులు కూడా సీఎం కేసీఆర్కు తొత్తులుగా మారారని వైఎస్సార్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపకురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆరోపణలు చేశారు. నిరుద్యోగ దీక్షకు అనుమతిచ్చి చివరి నిమిషంలో అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్స్టేషన్లలోనే మేం దీక్ష చేస్తామని ప్రకటించారు. కేసీఆర్ నిర్లక్ష్యంతోనే నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని మండిపడ్డారు. చదవండి: కేటీఆర్పై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దు: రేవంత్కు కోర్టు ఆదేశం ప్రతి మంగళవారం చేపట్టే నిరుద్యోగ నిరాహార దీక్షలో భాగంగా మంగళవారం బోడుప్పల్లో దీక్షకు యత్నించారు. ఈ సందర్భంగా ఆత్మహత్యకు పాల్పడిన నిరుద్యోగి రవీంద్ర నాయక్ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఉద్యమకారుడు చనిపోతే పరామర్శించడానికి ప్రభుత్వం రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రవీంద్ర నాయక్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడాడని గుర్తుచేశారు. పోరాటానికి దక్కిన ఫలితం చివరకు ఆత్మహత్య అని వాపోయారు. ఇది హత్యనా? ఆత్మహత్యనా? తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాలని సూచించారు. కేవలం కేసీఆర్ నిర్లక్ష్యంతోనే అతడు ప్రాణాలు కోల్పోయాడని ఆరోపించారు. ఇంటికో ఉద్యోగం అని చెప్పి యువతను మోసం చేసిన మోసగాడు కేసీఆర్ అని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ కొత్త రాగం అందుకుని గర్జనలు చేస్తోందని, చంద్రబాబు సలహా ఇచ్చారా? కేసీఆర్ అనుమతి ఇచ్చారా? అని ప్రశ్నించారు. మీ లోక్సభ పరిధిలోనే నిరుద్యోగి ఆత్మహత్య చేసుకుంటే కనీసం గుర్తించరా? అని నిలదీశారు. ఆ కుటుంబానికి కనీసం భరోసా ఇవ్వలేని మీరు ఒక ఎంపీయేనా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: ‘మా అమ్మాయినే వేధిస్తావా?’ మెడకు బెల్ట్ బిగించి.. ఇన్నాళ్లు అమ్ముడు పోయి.. ఇప్పుడు గర్జనలు, దీక్షలు చేస్తామంటే మిమ్మల్ని నమ్మే స్థితిలో ప్రజలు లేరని పేర్కొన్నారు. టీఆర్ఎస్కు కాంగ్రెస్, బీజేపీలు తొత్తులుగా పనిచేస్తున్నాయని ఆరోపించారు. టీపీసీసీ అంటేనే టీఆర్ఎస్ ప్యాకెట్లో కాంగ్రెస్ కమిటీ అని అభివర్ణించారు. తామే ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ ఉద్యోగ ప్రకటనలు వేసే వరకు పోరాటాలు చేస్తుంటామని ప్రకటించారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీతో పాటు పోలీసులు కూడా కేసీఆర్కు తొత్తులుగా మారారని మండిపడ్డారు. పోలీసుల తీరుకు నిరసనగా పోలీస్స్టేషన్లోనే కూర్చుని దీక్ష చేస్తామని చెప్పారు. -
రవీంద్ర నాయక్ కుటుంబానికి అండగా వైఎస్ షర్మిల
-
బోడుప్పల్ లో ముగ్గురు యువకుల హంగామ
-
కిందపడ్డ మంత్రి మల్లారెడ్డి
-
కబడ్డీ ఆడుతూ కిందపడ్డ మంత్రి మల్లారెడ్డి
బోడుప్పల్: తెలంగాణ క్రీడాకారులు పట్టుదల, కసితో క్రీడలు ఆడి జాతీయ స్థాయిలో అద్భుతాలు సృష్టించాలని రాష్ట్ర క్రీడాభివృద్ధి శాఖ మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ అన్నారు. బోడుప్పల్లోని వైష్ణవి క్రికెట్ గ్రౌండ్లో మంగళవారం రాత్రి దివంగత చెర్ల ఆంజనేయులు యాదవ్ జ్ఞాపకార్థం టీఆర్ఎ అధ్యక్షుడు మంద సంజీవ్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి 68వ కబడ్డీ సీనియర్ ఇంటర్ మెన్ అండ్ ఉమెన్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తుందని అందులో భాగంగా హకీం పేట్లో స్పోర్ట్స్ స్కూల్ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. క్రీడాకారులు అసమానతలు తొలగించి అందరం ఒకే కుటుంబం అనే భావన కల్పించాలన్నారు. క్రీడల్లో పైరవీలకు తావు లేదని, గెలవాలనే తపన, లక్ష్యం ఉన్న క్రీడాకారులనే రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చదువుతోపాటు క్రీడలను ప్రోత్సహిస్తున్నారని, క్రీడల్లో రాణించే వారికి 2 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ శామీర్పేట్లో 250 ఎకరాల్లో స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. క్రీడాకారులు రాష్ట్రాన్ని జాతీయ స్థాయిలో నిలిపేందుకు కృషి చేయాలన్నారు. కబడ్డీ ప్రాచీణమైనదని, క్రికెట్ను తలదన్నేలా కబడ్డీ క్రీడాకారులు రాణించాలన్నారు. తొలుత కబడ్డీ సంఘం పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిన్నారుల భరత నాట్యం ఆహుతులను ఆకట్టుకుంది. కార్యక్రమంలో రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, కార్యదర్శి జగదీశ్ యాదవ్, మేయర్లు సామల బుచ్చిరెడ్డి, జక్క వెంకట్రెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మి రవిగౌడ్ తదితరులు పాల్గొన్నారు. కిందపడ్డ మల్లారెడ్డి కబడ్డీ పోటీల ప్రారంభంలో భాగంగా మంత్రులు శ్రీనివాస్గౌడ్, చామకూర మల్లారెడ్డి కబడ్డీ ఆడారు. ఇరువురు రెండు జట్టులుగా ఏర్పడి కబడ్డీ ఆడుతుండగా కూతకు వెళ్లిన మల్లారెడ్డి గ్రౌండ్లో వేసిన మ్యాట్ జారడంతో కింద పడిపోయారు. దీనిని గమనించిన మంత్రి శ్రీనివాస్ మల్లారెడ్డిని లేపి పక్కనే ఉన్న కుర్చీలో కూర్చోబెట్టారు. -
అమెరికాలో తెలంగాణవాసి మృతి
సాక్షి, తొర్రూరు/కొడకండ్ల: అమెరికాలో తెలంగాణకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి అతడి కుటుంబానికి తీరని విషాదం మిగిల్చింది. గత నెల 27 చనిపోయినా అతడి మరణవార్తను బుధవారమే అందుకున్న ఆ కుటుంబం ఇప్పుడు గుండెలవిసేలా రోదిస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. బోడుప్పల్ మేడిపల్లికి చెందిన పానుగంటి శ్రీధర్ అమెరికాలో ఆరేళ్లుగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం చేస్తున్నాడు. న్యూయార్క్ సిటీలోని బాఫెల్లాలో నివాసముండే అతడికి భార్య ఝాన్సీ, కుమారుడు శ్రీజన్(5) ఉన్నారు. ఈ ఏడాది మార్చిలో సోదరుడి వివాహం నిమిత్తం భార్య ఝాన్సీ, శ్రీజన్ ఇండియాకు వచ్చారు. లాక్డౌన్ కారణంగా ఇక్కడే ఉండిపోయారు. అప్పట్నుంచి శ్రీధర్ యూఎస్లో ఒంటరిగానే ఉంటున్నారు. వీరియోగక్షేమాల్ని ఎప్పటికప్పుడు ఫోన్లోనే తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో గతనెల 26న భార్య సెల్కు కుమారుడి బాగోగులపై శ్రీధర్ మెసేజ్ పంపించాడు. దీనికి ఆమె బాగున్నాడని బదులిచ్చారు. ఆ తర్వాత 27 ఉదయం భార్య ఝాన్సీ ఎన్నిసార్లు ఫోన్ చేసినా శ్రీధర్ నుంచి సమాధానం రాలేదు. దీంతో అనుమానం వచ్చిన ఝాన్సీ.. అపార్ట్మెంట్లో పక్కనే నివాసముండే వారికి ఫోన్ చేసింది. దీంతో వారు అమెరికా పోలీసులకు సమాచారమివ్వగా అక్కడికి చేరుకున్న పోలీసులు శ్రీధర్ నిద్రలోనే మరణించాడని నిర్ధారించారు.(చదవండి: టెక్సాస్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి) ఆలస్యంగా మరణవార్త అమెరికాలో తెలిసిన వారు ఎవరూ లేకపోవడం, అక్కడి అధికారుల నుంచి సరైన స్పందన రాకపోవడంతో శ్రీధర్ కుటుంబ సభ్యులు ఆయనకు ఏమైందోనని ఆందోళన చెందారు. అయితే శ్రీధర్ మరణవార్తను బుధవారమే అందుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతదేహం రావడానికి ఆరు నెలలు పడుతుందని అక్కడి అధికారులు సందేశం పంపడంతో తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. త్వరగా స్వదేశానికి రప్పించండి పోస్టుమార్టం, కోవిడ్ నిర్ధారణ పరీక్షలు పూర్తయినా మృతదేహాన్ని ఇండియాకు పంపించకపోవడంపై కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి కేంద్ర విదేశాంగ శాఖతో మాట్లాడి మృతదేహం త్వరగా రప్పించాలని కోరుతున్నారు. ఈ విషయమై మంత్రి కేటీఆర్ను కూడా కలవనున్నట్లు తెలిపారు. -
'రౌడీషీట్ పెట్టండి.. వాడి అంతు చూస్తా'
సాక్షి, హైదరాబాద్: బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సామల బుచ్చిరెడ్డితో తనకు ప్రాణహాని ఉందని ఓ యువకుడు మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకెళ్తే.. కార్పొరేషన్ పరిధిలోని సర్వే నంబర్ 71, 72, 73 ప్లాట్ నంబర్ 35, 36 పార్ట్ స్థలంలో తన బంధవులు ఇల్లు నిర్మాణం చేసుకుంటే మేయర్ అనుచరులు ఆ ఇంటిని జేసీబీతో నేలమట్టం చేశారని శివకిషోర్ అనే యువకుడు ఆరోపించాడు. ఈ క్రమంలోనే శివకిషోర్.. ఎందుకు ఇల్లు కూలగొడుతున్నారని మేయర్ను ప్రశ్నించగా నువ్వెవడు రా..? అని పరుష పదజాలంతో దూషించి, ఏడుగురు వ్యక్తులు రాళ్ల దాడికి దిగినట్లు బాధితుడు వివరించారు. విషయంపై ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్కు వెళ్తే వీడిపై రౌడీషీట్ పెట్టండి. తర్వాత వాడి అంతుచూస్తానని మేయర్ సామల బుచ్చిరెడ్డి బెదిరించినట్లు బాధితుడు పేర్కొన్నారు. (కస్టమర్ కేర్ కాదు.. ఖాతా కొల్లగొట్టుడే!) -
హైదరాబాద్లో దారుణం
సాక్షి, హైదరాబాద్/బోడుప్పల్ : వీధికుక్కల వీరంగానికి ఓ ఆరేళ్ల చిన్నారి విలవిల్లాడింది. సకాలంలో తగిన వైద్యం అందక ఆరు గంటలపాటు నరకయాతన అనుభవించింది. పాపను బతికిం చుకునేందుకు పేదింటి తల్లిదండ్రులు ఐదు ఆస్పత్రుల చుట్టూ తిరి గినా లాభం లేకపోయింది. ఆస్పత్రుల నిర్లక్ష్యం, ఉదాసీనత వల్ల చివరకు తుదిశ్వాస విడిచింది. ‘అమ్మానాన్న.. భయమైతంది’అంటూతమ కుమార్తె పలికిన చివరి పలుకులు తలుచుకుంటూ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు కావడం అం దరినీ కలచివేసింది. హైదరాబాద్లో శనివారం ఈ దారుణ సంఘటన చోటుచేసుకుంది. అమ్మచేతి గోరుముద్ద తిని... మహబూబాబాద్ జిల్లా పెద్దగూడూరు కారంపూడి తండాకు చెందిన అంగోత్ హోలీ నాయక్ తన భార్య కవిత, కుమార్తె అంగోత్ బేబి, కుమారుడు గణేశ్లతో కలసి మూడేళ్ల క్రితం హైదరాబాద్కు వలస వచ్చి నగర శివార్లలోని చెంగిచెర్లలో ఉన్న సుశీల టౌన్షిప్లో నివాసముంటున్నాడు. రెండేళ్ల క్రితం వరకు దినసరి కూలీగా ఏ పని దొరికితే ఆ పనికి వెళ్లేవాడు. పది నెలల క్రితం నుంచి ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. వారు ఉంటున్న కాలనీకి ఆనుకొని ఒకవైపు అడవి, మరోవైపు యాటల మండీ (జంతు వధశాల) ఉన్నాయి. రోజులాగే నాయక్ శని వారం ఆటో తీసుకొని బయటకు వెళ్లాడు. భార్య కవిత ఉద యం 10 గంటలకు కుమార్తె అం గోత్ బేబికి గోరుముద్దలు తినిపించింది. ఆ తర్వాత బట్టలు ఉతుకుతుండగా అమూల్తా వచ్చి అమ్మా టాయ్లెట్ వస్తోందని చెప్పడంతో బాత్రూమ్కు వెళ్లమని చెప్పింది. అయితే అంగోత్ బేబి ఇంటి ముందు ఉన్న రోడ్డుపైకి వెళ్లడాన్ని తల్లి గమనించలేదు. అదే సమయంలో ఒక్కసారిగా వచ్చిన ఐదు వీధికుక్కలు పాపపై దాడి చేశాయి. నిస్సహాయంగా ఉన్న ఆ పాపను ఒళ్లంతా పట్టి పీకాయి. ఇంటి బయట కుక్కల అరుపులు, కుమార్తె ఆర్తనాదాలు వినిపించడంతో బయటకు వెళ్లి తల్లి చూడగా అంగోత్ బేబిని కుక్కలు పట్టుకొని ఇంకా కరుస్తుండటం చూసింది. వెంటనే అక్కడున్న కర్రలు, రాళ్లతో కుక్కలను చెదరగొట్టిన కవిత... భర్తకు విషయం తెలపడంతోపాటు అంబులెన్స్కు ఫోన్ చేసింది. అప్పటికే పాప శరీరమంతా రక్తసిక్తమైంది. ఆరు గంటలపాటు తల్లడిల్లి... శనివారం ఉదయం 10.30 గంటలకు కుక్కలు దాడి చేయగా 11.00 గంటల సమయంలో తల్లిదండ్రులు అమూల్తాను ఉప్పల్లోని ఆదిత్య ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రి యాజమాన్యం ఫీజు వసూలు చేసి రెండు గంటలపాటు చికిత్స చేసింది. ఆ తర్వాత తమ వల్ల కాదంటూ చేతులెత్తేసింది. సమీపంలోని అంకుర ఆస్పత్రికి తరలించాలని చెప్పి చేతులు దులుపుకుంది. దీంతో చేసేది లేక మరో అంబులెన్సులో తల్లిదండ్రులు తమ చిన్నారిని ఆ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పాపను దాదాపు మూడు గంటలపాటు పరీక్షించిన వైద్యులు మరో ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పడంతో మరో అంబులెన్సులో సమీపంలోని యశోద ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రి నిర్వాహకులు ఆ చిన్నారికి చికిత్స చేయబోమని తెగేసి చెప్పడంతో ఫీవర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షలు చేసే సమయంలో నీళ్లు తాగిన పాప తనకు భయంగా ఉందంటూ తల్లిదండ్రులతో చివరగా మాట్లాడింది. అయితే పరిస్థితి అప్పటికే విషమించడంతో పాపను నిలోఫర్కు తీసుకెళ్లాలని వైద్యులు చెప్పడంతో సాయంత్రం 4:15 గంటలకు తల్లిదండ్రులు తీసుకెళ్లారు. నిలోఫర్లో దాదాపు గంటపాటు చికిత్స పొందిన అమూల్తా చివరకు కన్నుమూసింది. దీంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు హతాశులయ్యారు. ఐదు ఆస్పత్రుల చుట్టూ తిరిగినా తమ బిడ్డను ఎవరూ కాపాడలేకపోయారంటూ కన్నీరుమున్నీరయ్యారు. అమూల్తా అంటే తమకు ఎంతో ప్రాణమని, ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించలేదని ‘సాక్షి’తో మాట్లాడుతూ తల్లిడిల్లారు. కడు పేదరికంలో ఉన్న ఆ కుటుంబం అంత్యక్రియల కోసం స్వస్థలానికి వెళ్లింది. -
మేనేజర్ లంచావతారం
సాక్షి, బోడుప్పల్: బోడుప్పల్ నగర పాలక సంస్థలో పనిచేసే సీనియర్ అసిస్టెంట్ కమ్ మేనేజర్ పి.రాజేందర్రెడ్డి కాంట్రాక్టర్ నుంచి రూ.50 వేలు లంచం తీసుకుంటూ శుక్రవారం ఏసీబీ అధికారులకు చిక్కాడు. కాంట్రాక్టర్ జె.వెంకటేశ్గౌడ్ చేసిన పనులకు బిల్లులు మంజూరు చేసేందుకు గాను కమీషన్ తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఏసీబీ సీటీ రేంజ్–2 డీఎస్పీ అచ్చేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం... పీర్జాదిగూడలో నివసించే పి.రాజేందర్రెడ్డి బోడుప్పల్ నగర పాలక సంస్థలో సీనియర్ అసిస్టెంట్ కమ్ మేనేజర్గా పని చేస్తున్నాడు. బోడుప్పల్లో నివసించే జె.వెంకటేశ్గౌడ్ నగర పాలక సంస్థలో కాంట్రాక్టర్. ఈయన ఇటీవల రూ.62 లక్షల విలువైన రోడ్డు పనులు చేశాడు. వాటిలో రూ.27 లక్షలకు బిల్లు చేశాడు. అయితే వాటిని మంజూరు చేయాలంటే తనకు 7శాతం కమీషన్ ఇవ్వాలని రాజేందర్రెడ్డి కాంట్రాక్టర్ను డిమాండ్ చేశాడు. అంత ఇవ్వలేనని వేడుకున్నా వినలేదు. దీంతో కమీషన్ ఇస్తానని ఒప్పుకున్న వెంకటేశ్గౌడ్ 20 రోజుల క్రితం రూ.లక్ష అందజేశాడు. మళ్లీ ఈ నెల 19న రూ.20 వేలు ఇచ్చాడు. శుక్రవారం మరో రూ.50 వేలు ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. ఈలోపు వెంటేశ్గౌడ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రూ.50 వేలు ఇస్తానని శుక్రవారం ఉదయం రాజేందర్రెడ్డికి ఫోన్ చేశాడు. ఆఫీసులో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పని చేస్తున్న ఆసిఫ్కు ఇవ్వమని రాజేందర్రెడ్డి చెప్పాడు. కాంట్రాక్టర్ వద్ద రూ.50 వేలు తీసుకున్న ఆసిఫ్ రాజేందర్రెడ్డికి ఇచ్చేందుకు ఆయన క్యాబిన్కు వెళ్లాడు. అప్పటికే అక్కడ మాటు వేసిన ఏసీబీ అధికారులు రాజేందర్రెడ్డిని రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆయన క్యాబిన్లో రెండు గంటలకు పైగా సోదాలు చేశారు. రాజేందర్రెడ్డి, ఆసిఫ్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అధికారుల్లో టెన్షన్.. బోడుప్పల్ నగర పాలక సంస్థపై ఏసీబీ అధికారులు దాడి చేయడంతో వివిధ శాఖల అధికారుల్లో భయం మొదలైంది. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో భోజనానికి సిద్ధమవుతుండగా ఈ దాడులు జరిగాయి. ఏసీబీ ఆఫీసర్లు రావడంతో అధికారులంతా అవాక్కయ్యారు. తొలుత ఏసీబీ అధికారులు మీసేవ కేంద్రంలో బిల్లులు చెల్లించే వారికి అనుమతినిచ్చారు. అధికారులతో పని ఉన్న వారిని అనుమతించలేదు. ఏసీబీ దాడులు జరుగుతున్న సమయంలో కమిషనర్ శంకర్, టీపీఓ శ్రీధర్రెడ్డి తప్ప మిగతా శాఖల అధికారులు అందుబాటులో లేరు. -
మంత్రి మల్లారెడ్డికి చేదు అనుభవం
సాక్షి, మేడ్చల్ : టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఆయన శుక్రవారం మేడ్చల్ జిల్లా బోడుప్పల్లో పార్టీ సభ్యత్వ కార్యక్రమానికి హాజరు అయ్యారు. అయితే పార్టీ నేతలు మంత్రి సమక్షంలోనే బాహా బాహీకి దిగారు. వారిని వారించినా ఫలితం లేకపోవడంతో మంత్రి కార్యక్రమం మధ్యలోనే వెళ్లిపోయారు. కాగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీ సభ్వత్య నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించి... పార్టీ తొలి సభ్యత్వాన్ని అందుకున్న విషయం తెలిసిందే. తెలంగాణవ్యాప్తంగా గురువారం నుంచి పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభం అయింది. -
బోడుప్పల్లో రోడ్డు ప్రమాదం
సాక్షి, హైదరాబాద్ : సొంత పనుల నిమ్మిత్తం నడుచుకుంటూ వెళుతున్న మహిళను నెంబర్ ప్లేట్ లేని కారు ఢీకొట్టిన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బోడుప్పల్లో చోటు చేసుకుంది. ఈ ఘటనలో పులికంటి సంగీతారెడ్డికి తీవ్ర గాయాలవడంతో దగ్గర్లోని ఆర్.బీ.ఎమ్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ ఉదంతం వెనుక పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బోడుప్పల్కి చెందిన శ్రీనివాస్రెడ్డి, సంగీతారెడ్డిలు భార్యభర్తలు. కొంతకాలంగా భర్త, అత్తింటివారితో సంగీతకు విభేదాలు నడుస్తున్నాయి. తాజాగా నెంబర్ప్లేట్ లేని వాహనం సంగీతను గాయపరచడం పోలీసులకు అనుమానం కలిగిస్తుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి...
బోడుప్పల్: ఉప్పల్ నుంచి ఘట్కేసర్ వెళుతున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బీభత్సం సృష్టించడంతో దంపతులు మృతి చెందారు. మేడిపల్లి ఇనస్పెక్టర్ డి.అంజిరెడ్డి, స్థానికులు తెలిపిన ప్రకారం... రాజమండ్రికి చెందిన పి.కోటేశ్వరరావు (29) గత కొంత కాలంగా నగరంలో ఉంటూ తార్నాకలోని ఓ ప్రైవేటు సంస్థలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నారు. ఆయన యాదాద్రి జిల్లా బొమ్మల రామారం మండలానికి చెందిన నాగినేని పల్లికి చెందిన స్వప్న(27) రెండేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పీర్జాదిగూడ మునిసిపాలిటీ పరిధిలోని బాలాజీ నగర్లో నివసిస్తున్న వీరు ఆదివారం పనిమీద అన్నోజిగూడకు బయలుదేరారు. నారపల్లి చౌరస్తా వరకూ వచ్చి ఆర్టీసీ బస్సుకు దారి ఇచ్చేందుకు వాహనాన్ని నిలిపారు. అదే సమయంలో ఏపీ 29జడ్ 2157 నంబరు కలిగిన ఆర్టీసీబస్సును మరో టూవీలర్ వేగంగా క్రాస్ చేసి వెళ్లింది. ఈ క్రమంలో బస్సు డ్రైవర్ సడన్ బ్రేక్ వేసి హఠాత్తుగా సీట్లో నుంచి బస్సులో కింద పడిపోయాడు. దీంతో అదుపు తప్పిన బస్సు డివైడర్ ఎక్కింది. బస్సు వెళ్లాక వెళ్దామని అక్కడే ఆగి ఉన్న కోటేశ్వరరావు వాహనాన్ని బస్సు ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన వీరిద్దరినీ ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయారు. పోలీసులు ఆర్టీసీ బస్సు డ్రైవర్ టీవీ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. సంఘటనా స్థలానికి మల్కాజ్గిరి ఏసీపీ గోనె సందీప్రావు సందర్శించారు. మృతుల బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనలో మరో ముగ్గురు కూడా గాయపడినట్లు సమాచారం. ప్రమాదానికి డ్రైవర్ సెల్ఫోన్ మాట్లాడుతూ బస్సు నడపడమే కారణమని కొందరు స్థానికులు చెప్పారు. -
యువ దంపతుల ఆత్మహత్య
బోడుప్పల్: యువ దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బోడుప్పల్లో గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి .నాచారంలోని చింతల్బస్తీకి చెందిన ఎల్లసాని నవనీత్ యాదవ్ (27), స్వప్న (26)ఏడాది క్రితం ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. నవనీత్ కాగ్నిజెంట్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పని చేస్తుండగా, స్వప్న హబ్సిగూడలోని జెన్ప్యాక్ కాల్ సెంటర్లో విధులు నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఆమె 9నెలల గర్భిణి. ఆరు నెలల క్రితం బోడుప్పల్, అశోక్నగర్కు మారిన వీరు ఓ భవనంలో పెంట్ హౌజ్లో అద్దెకు ఉంటున్నారు. గత నాలుగు రోజులుగా వీరు ఇంటి నుంచి బయటికి రాకపోవడం. స్నేహితులు, బంధువులు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో నవనీత్ తల్లి గురువారం రాత్రి వారి ఇంటికి వచ్చింది. ఇంట్లో నుంచి దుర్వాసన వస్తున్నట్లు గుర్తించి ఇంటి యజమానికి చెప్పడంతో అతను అనుమానంతో మేడిపల్లి పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు పగులగొట్టి చూడగా కుళ్లిపోయిన స్థితిలో నవనీత్, స్వప్న మృతదేహాలను కనిపించాయి. పక్కనే పురుగుల మందు డబ్బా ఉండటంతో పురుగుమందు తాగి అత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. మేడిపల్లి సీఐ అంజిరెడ్డి, మల్కాజ్గిరి ఏసీపీ గోనె సందీప్రావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మట్టి పరిమళం...
మట్టే మాణిక్యం..మట్టే బంగారం. మట్టిలో మహిమలెన్నో..అంటూ చిన్నారుల నుంచి యువత వరకు మట్టిలో మునిగితేలారు. మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలే వాడాలని, పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిస్తూ ఆదివారం బోడుప్పల్ హనుమాన్ ఆలయంవద్ద నిర్వహించిన మడ్ ఫెస్టివల్ ఉత్సాహంగా సాగింది. బోడుప్పల్: సిమ్లైన్ ఫిట్నెస్ జిమ్ ఆధ్వర్యంలో బోడుప్పల్ హనుమాన్ ఆలయం వద్ద ఆదివారం నిర్వహించిన మడ్ ఫెస్టివల్ ఆకట్టుకుంది. 400 మందికి పైగా యువతీ యువకులు ఇందులో పాల్గొని సందడి చేశారు. ‘మట్టి విగ్రహాలనే వినియోగిద్దాం... పర్యావరణాన్ని కాపాడుదాం’ అనే నినాదంతో ఈ ఫెస్టివల్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చిన్నారులు, పెద్దలు మట్టిలో కబడ్డీ, వాలీబాల్, హ్యాండ్బాల్, తాడాట, రెయిన్ డ్యాన్స్లతో ఆడిపాడి అలరించారు. ఫెస్టివల్ నిర్వాహకుడు కె.జయసింహాగౌడ్ మాట్లాడుతూ.. ‘పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. ఇందుకు అందరూ నడుం బిగించాలి. గుంట తవ్వి ఎర్రమట్టి, బంక మట్టి పోసి.. అందులో నీళ్లు, వన మూలికలు వేసి ఈ వేడుకలు నిర్వహించాం. ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసుకొని, వారుండే కాలనీలోనే నిమజ్జనం చేసి పర్యావరణాన్ని కాపాడాల’ని కోరారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన మట్టి వినాయక విగ్రహాన్ని దగ్గర్లోని కొలనులో నిమజ్జనం చేశారు. -
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడం ఖాయం
-
సర్వే సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్ : టీడీపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య సంబంధాలపై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొంత కాలంగా టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు లోపాయికారి ఒప్పందంతో పనిచేస్తున్నాయని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆదివారం బోడుప్పల్లో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో సర్వే చేసిన వ్యాఖ్యలతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలు కలిసిపోయేలా ఉన్నాయని తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మనతో కలిసి వచ్చే పరిస్థితి కనిపిస్తోందన్నారు. తనకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ముందుగానే కేంద్ర మంత్రి పదవి రిజర్వేషన్ చేసి ఉంచారని చెప్పారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్రెడ్డి తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి అని జోస్యం చెప్పారు. ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన తర్వాత నుంచి చంద్రబాబు కాంగ్రెస్తో కలవడానికి ప్రణాళికలు సిద్ధం చేయడం కొన్ని కార్యక్రమాల్లో వారి తీరుతో తెలిపోయింది. కర్ణాటక సీఎం కుమారస్వామి ప్రమాణ స్వీకారం రోజున రాహుల్తో చంద్రబాబు వ్యవహరించిన తీరు, ఇటీవల అవిశ్వాస తీర్మాణంపై చర్చలో భాగంగా పార్లమెంటులో టీడీపీ, కాంగ్రెస్లు ఉమ్మడి అజెండాతో పనిచేయడం చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీల పొత్తు ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
ఒకరితో నిశ్చితార్థం.. మరో యువతితో..
సాక్షి, బోడుప్పల్ (హైదరాబాద్) : ఒక యువతితో నిశ్చితార్థం చేసుకొని.. మరో యువతిని వివాహం చేసుకున్న ఓ ప్రబుద్ధుడిని ఆదివారం మేడిపల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇన్స్పెక్టర్ అంజిరెడ్డి వివరాల ప్రకారం నల్గొండ జిల్లా చర్లపల్లికి చెందిన బీపంగి హరిబాబు(28) స్థానికంగా అమ్మ ఆన్లైన్ మీసేవ సర్వీస్ను నిర్వహిస్తున్నాడు. ఫిబ్రవరి 22న బోడుప్పల్ శివపురికి చెందిన ఓ యువతి(24)తో నిశ్చితార్థం అయ్యింది. రూ.3 లక్షలు ఇచ్చేందుకు ఇరువర్గాల పెద్దలు నిర్ణయించారు. నిశ్చితార్థం రోజు ఖర్చుల నిమ్తితం రూ.50 వేలు ఇచ్చారు. మరో రూ.50 వేలు నిశ్చితార్థం కోసం ఖర్చు చేశారు. ఆగస్టులో పెళ్లి నిర్ణయించారు. ఈలోపు హరిబాబు ఎవరికీ చెప్పకుండా మీ సేవలో పనిచేసే ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న యువతి బంధువులు హరిబాబును నిలదీయగా సమాధానం చెప్ప లేదు. దీంతో మేడిపల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆదివారం హరిబాబుపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. -
టఫ్ వన్ బాస్ అంటున్న కేటీఆర్..!
సాక్షి, హైదరాబాద్ : ఐటీ మంత్రి కేటీఆర్ ట్విటర్లో యాక్టివ్గా ఉంటారు. తనను ఉద్దేశించి.. తనను ట్యాగ్ చేసి ఎవరు ట్వీట్ చేసినా.. చాలావరకు బదులు ఇస్తుంటారు. దీంతో రోజురోజుకు ఆయన ట్విటర్ ఖాతాకు విజ్ఞాపనలు, ఫిర్యాదులు పెరిగిపోతున్నాయి. చాలామంది తన సాయం కోసం చేస్తున్న ట్వీట్లకు కేటీఆర్ కూడా బదులిస్తున్నారు. తాజాగా కేటీఆర్ దృష్టికి ఒక ఆసక్తికరమైన ట్వీట్ వచ్చింది. దానిని రీట్వీట్ చేస్తూ.. ‘టఫ్ వన్ (కష్టమైంది) బాస్’ అంటూ బదులిచ్చారు. ఇంతకీ ఆ ట్వీట్ ఏమిటంటే..‘కేటీఆర్ సార్.. నేను శాకాహారిని. నేను ఇడ్లీ, దోసా, అన్నం.. ఇలా ఏదీ తిన్నా జీఎస్టీ కట్టాల్సి వస్తోంది. మా బోడుప్పల్లో హోటళ్లు రాత్రి 10 గంటలవరకు మాత్రమే తెరిచి ఉంటున్నాయి. ఇక నా స్నేహితుడు హైదరాబాద్ పాతస్తీలో నాన్ వెజ్ తింటాడు. బిర్యానీ తిన్నా, రోటీ తిన్నా జీఎస్టీ కట్టాల్సిన అవసరం లేదు. హోటళ్లు 24 గంటలూ తెరిచి ఉంటాయి.. నాయ్యం చేయండి సార్’ అంటూ ఎంబీ ప్రకాశ్ చేసిన ట్వీట్కు కష్టమే బాస్ కేటీఆర్ బదులిచ్చారు. -
‘అశ్లీలం’ కేసులో మరొకరి అరెస్టు
సాక్షి, హైదరాబాద్: సినీ హీరోయిన్ల ఫొటోలను అశ్లీలంగా మార్ఫింగ్ చేసి, వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్న కేసులో సీఐడీ అధికారులు బుధవారం ఓ సివిల్ ఇంజినీర్ను అరెస్టు చేశారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఫిర్యాదు మేరకు గత ఏడాది ఈ కేసు నమోదైన విషయం విదితమే. అప్పటి నుంచి బాధ్యులను గుర్తిస్తున్న సీఐడీ సైబర్ క్రైమ్ పోలీసులు వరుస అరెస్టులు చేస్తున్నారు. బోడుప్పల్కు చెందిన రుద్రవరకు రఘువరన్ ఓ ప్రైవేట్ సంస్థలో సివిల్ ఇంజినీర్గా పని చేస్తున్నాడు. ఇంటర్నెట్లో ఓ బ్లాగ్స్పాట్ క్రియేట్ చేసిన ఇతను ప్రముఖ హీరోయిన్ల ఫొటోలను మార్ఫింగ్ చేస్తూ అందులో పోస్ట్ చేస్తున్నాడు. దీనికి సంబంధించి కల్పిత కథలను పొందుపరుస్తున్నాడు. తద్వారా సైట్కు హిట్స్ పెరగడంతో ఆర్థికంగా లాభం పొందుతున్నాడు. బుధవారం నిందితుడిని అరెస్టు చేసిన సీఐడీ అధికారులు రిమాండ్కు తరలించారు. ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం ఆరుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
మళ్లీ అత్తింటి ముందు సంగీత ధర్నా
-
రోడ్డున పడ్డాం, రాజీకి రావా..?
సాక్షి, హైదరాబాద్: తనపై పెట్టిన కేసులు వెనక్కు తీసుకుంటేనే తన మొదటి భార్య సంగీతను కాపురానికి రానిస్తానని బహిష్కృత టీఆర్ఎస్ నేత శ్రీనివాస్రెడ్డి తెలిపారు. జైలు నుంచి విడుదలైన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ... 53 రోజులుగా తాను, తన తల్లిదండ్రులు రోడ్డుపై ఉంటున్నామని తెలిపారు. తమ ఇంటిని సంగీత అధీనంలోని తీసుకుందని, ఆమెను కొంతమంది తప్పుదోవ పట్టించారని వాపోయారు. తనతో రాజీకి సంగీత రూ. 3 కోట్లు డిమాండ్ చేసిందని ఆరోపించారు. మూడేళ్లుగా రాజీకి ప్రయత్నిస్తున్నా, ఆమె ఒప్పుకోవడం లేదని వెల్లడించారు. తన పేరు మీద ఎటువంటి ఆస్తులు లేవని, తల్లిదండ్రులపైనే ఆధారపడి బతుకుతున్నానని చెప్పారు. కూతురంటే ప్రాణమని, తనకు వచ్చే ఆస్తి ఆమెకే చెందుతుందని స్పష్టం చేశారు. ప్రత్యేకంగా తన కూతురి పేర ఆస్తి రాయాల్సిన అవసరం లేదన్నారు. విభేదాలన్నీ మర్చిపోయి వస్తే సంగీతను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని చెప్పారు. కేసులు ఉపసంహరించుకుంటేనే ఆమెతో రాజీ పడతానని తేల్చి చెప్పారు. నిరూపిస్తే దీక్ష విరమిస్తా: సంగీత రాజీకి తాను రూ. 3 కోట్లు డిమాండ్ చేసినట్టు నిరూపిస్తే ఇప్పుడే దీక్ష విరమిస్తానని సంగీత తెలిపింది. ఎక్కడోవుండి మాట్లాడం కాదని, ఇంటికి వచ్చి రాజీ గురించి మాట్లాడితే సమస్య పరిష్కారం అవుతుందన్నారు. అమ్మాయిల జీవితాలతో ఆడుకోవడం శ్రీనివాస్రెడ్డికి సరదా అని ఆరోపించారు. కాగా, తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బోడుప్పల్లోని భర్త ఇంటి ముందు సంగీత 53 రోజులుగా ధర్నా చేస్తున్న సంగతి తెలిసిందే. -
దీక్ష విరమించా.. ధర్నా కొనసాగిస్తా: సంగీత
సాక్షి, ఉప్పల్(హైదరాబాద్): టీఆర్ఎస్ నేత శ్రీనివాస్రెడ్డి నుంచి తనకు న్యాయం చేయాలని ఆయన భార్య సంగీత చేపట్టిన నిరాహార దీక్షను మంగళవారం విరమించుకుంది. ఒకరికి తెలియకుండా మరొకరిని ఇలా ముగ్గురిని పెళ్లి చేసుకున్నాడని, తనకు, తన పిల్లవాడికి న్యాయం చేయాలని కోరుతూ బోడుప్పల్లోని అతని ఇంటి ముందు ఆమె 52 రోజులుగా నిరాహారదీక్ష చేస్తున్న సంగతి విదితమే. మహిళా సంఘాలు, సామాజికవేత్త దేవి సూచనల మేరకు ఆమె దీక్షను విరమించింది. నిమ్మరసం తాగించి దీక్షను విరమింపజేశారు. అయితే ధర్నాను మాత్రం కొనసాగిస్తానని సంగీత స్పష్టం చేసింది. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు జోక్యం చేసుకుని ఆమెకు న్యాయం చేయాలని దేవి విజ్ఞప్తి చేశారు. కాగా, తన భర్త, అత్తమామలతో మాట్లాడి న్యాయం చేయాలని సంగీత వేడుకుంటున్నది. -
52 రోజులుగా భర్త ఇంటి ముందు దీక్ష
-
హైకోర్టుకు చేరిన సంగీత వివాదం
సాక్షి, హైదరాబాద్ : తనకు న్యాయం కావాలంటూ భర్త ఇంటి ముందు నిరాహార దీక్ష చేస్తున్న సంగీత వ్యవహారం తాజాగా హైకోర్టుకు చేరింది. బోడుప్పల్లోని ఇంటి నుంచి సంగీతను ఖాళీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ఆమె అత్తింటివారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సంగీత బలవంతంగా ఇంటి తాళాలు పగులగొట్టి న్యూసెన్స్ క్రియేట్ చేసిందని, తమను ఇంటికి రానివ్వకుండా అడ్డుకుంటుందని.. ఇంటి ముందు దీక్ష కొనసాగించవద్దని ఆదేశించాలని, సంగీత అత్తింటి వాళ్లు కోర్టును ఆశ్రయించడంతో, సంగీతకు నోటిసులు అందాయి. ఈ కేసు తదుపరి విచారణను హైకోర్టు నాలుగు వారాలపాటు వాయిదా వేసింది. ఇదిలా ఉంటే తనకు, తన బిడ్డకు న్యాయం చేయాలంటూ బోడుప్పల్లో టీఆర్ఎస్ బహిష్కృత నేత శ్రీనివాస్ రెడ్డి ఇంటి ముందు ఆయన రెండో భార్య సంగీత చేస్తున్న పోరాటం 20వ రోజుకు చేరుకుంది. అత్తింటి వారు చేసిన దాడికి నిరసనగా తనకు న్యాయం కావాలని సంగీత గత ఇరవై రోజులుగా దీక్ష కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. సంగీతకు రోజురోజుకూ మహిళా సంఘాల మద్ధతు పెరుగుతూనే ఉన్నా.. ఆమె ఆరోగ్యం మాత్రం రోజురోజుకూ క్షీణిస్తుంది. ఇప్పటికే సంగీత భర్త, అత్త జైలులో ఉండగా.. మామ బాల్రెడ్డికి కూడా కోర్టు బెయిల్ రద్దు చేసింది. సంగీత మాత్రం న్యాయం జరిగే వరకు ఇంటి ముందు నుంచి కదిలేది లేదని స్పష్టం చేస్తోంది. -
జ్వరంతోనూ భర్త కోసం న్యాయపోరాటం
-
'నాకు న్యాయం జరిగే వరకు పోరాడుతా'
-
మూడో పెళ్లిపై నిలదీస్తే భార్య , ఆమె సోదరునిపై దాడి
-
భార్యపై దాడి చేసి గెంటేసిన టీఆర్ఎస్ నేత
-
మూడో పెళ్లిపై నిలదీస్తే జుట్టుపట్టి.. ఈడ్చిపడేశాడు
హైదరాబాద్: అతడో రియల్ ఎస్టేట్ వ్యాపారి.. పైగా అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకుడు.. తొలి భార్యకు విడాకులిచ్చి రెండో పెళ్లి చేసుకున్నాడు.. అయితే పెళ్లైనప్పటి నుంచీ అదనపు కట్నం కోసం భార్యను వేధించేవాడు.. అత్తింటి వేధింపులు భరించలేక బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.. అయితే రెండో భార్యకు తెలియకుండా ఇటీవల మూడో పెళ్లి చేసుకున్నాడా ప్రబుద్ధుడు. తనకు విడాకులివ్వకుండా ఎలా పెళ్లి చేసుకున్నావని నిలదీసినందుకు రెండో భార్యను దూషించడమే కాక జుట్టు పట్టుకుని ఇంటి నుంచి బయటకు ఈడ్చిపడేశాడు. ఆమెపై.. ఆమె సోదరునిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. రాచకొండ కమిషనరేట్లోని మేడిపల్లి ఠాణా పరిధిలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. పెళ్లైనప్పటి నుంచీ వేధింపులే.. పోలీసుల కథనం ప్రకారం.. బోడుప్పల్ శ్రీనగర్కాలనీలో నివసించే పులకండ్ల బాల్రెడ్డి కుమారుడు శ్రీనివాస్రెడ్డి రియల్ఎస్టేట్ వ్యాపారం చేస్తాడు. తొలుత స్వాతి అనే యువతిని వివాహం చేసుకున్నా.. మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నాడు. 2013 అక్టోబర్ 19న శేర్లింగంపల్లి సుందరయ్యనగర్కు చెందిన సంగీతను పెళ్లి చేసుకున్నాడు. వీరికి రెండేళ్ల పాప ఉంది. పెళ్లైనప్పటి నుంచి అదనపు కట్నం కోసం భర్త, అత్తమామ బాల్రెడ్డి, ఐలమ్మ, ఆడబిడ్డ భాగ్యలక్ష్మి.. సంగీతను శారీరకంగా, మానసికంగా వేధించేవారు. వేధింపులపై ఈ ఏడాది జూన్ 13న చందానగర్ పోలీసులకు సంగీత ఫిర్యాదు చేసింది. ఇదిలాఉండగా బోడుప్పల్కు చెందిన దేవిజగదీశ్వరి(20)ని ఆగస్ట్ 11న శ్రీనివాస్రెడ్డి మూడో పెళ్లి చేసుకున్నాడు. తన నుంచి విడాకులు తీసుకోకుండా ఎలా పెళ్లి చేసుకుంటావని సంగీత మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో శ్రీనివాస్రెడ్డి, జగదీశ్వరి, భాగ్యలక్ష్మిలను అరెస్టు చేసి రిమాండ్కు పంపగా.. బాల్రెడ్డి, ఐలమ్మ కోర్టులో లొంగిపోయి బెయిల్పై బయటకొచ్చారు. భర్త ఇంటి వద్ద నిరాహార దీక్ష బెయిల్పై బయటకొచ్చిన శ్రీనివాస్రెడ్డి, జగదీశ్వరితో కలసి ఉంటున్నాడు. దీంతో సంగీత, ఆమె తల్లి పద్మ, తమ్ముడు రంజిత్రెడ్డి ఆదివారం శ్రీనివాస్రెడ్డి ఇంటికి వచ్చారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ నిరాహార దీక్షకు కూర్చున్నారు. ఈ క్రమంలో సంగీత కుటుంబసభ్యులకు, శ్రీనివాస్రెడ్డికి మధ్య మాటామాటా పెరిగింది. ఇంట్లోకి వెళ్లేందుకు యత్నించిన సంగీతను శ్రీనివాసరెడ్డి, అత్త ఐలమ్మ అసభ్య పదజాలంతో దూషిస్తూ.. జుట్టు పట్టుకుని బయటకు లాక్కొచ్చారు. అడ్డుకున్న సంగీత సోదరునిపైనా శ్రీనివాస్రెడ్డి దాడి చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి.. శ్రీనివాస్రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఐలమ్మ పరారీలో ఉంది. సంగీత, రంజిత్లను ఆస్పత్రికి తరలించారు. భార్యను దారుణంగా కొట్టి ఇంటి నుండి గెంటిశాడు -
చైన్ స్నాచింగ్ చేసి పారిపోతుండగా...
హైదరాబాద్: బోడుప్పల్ అంబేద్కర్ నగర్లో చైన్ స్నాచింగ్ చేసి కారులో ముగ్గురు పారిపోతుండగా పోలీసులు వెంబడించి నాచారంలో అదుపులోకి తీసుకున్నారు. శ్రావణ శుక్రవారం కావడంతో ఉషారాణి(52) అనే మహిళ స్థానికంగా ఉన్న దేవాలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా ముగ్గురు వ్యక్తులు కారులో నుంచి ఆమె చైన్ను లాక్కొని పారిపోయారు. మహిళ కేకలు వేయడంతో పాటు స్థానికులను అప్రమత్తం చేసింది. వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు నిందితులను నాచారంలో అదుపులోకి తీసుకున్నారు. దొంగిలించిన 5 తులాల బంగారు గొలుసును, ఇండికా కారును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బోడుప్పల్లో యువతి అదృశ్యం
బోడుప్పల్(హైదరాబాద్): ఉద్యోగానికి వెళ్లిన ఓ యువతి కనిపించకుండా పోయింది. ఆదివారం మేడిపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. బోడుప్పల్ రాజీవ్నగర్కు చెందిన కె. స్వప్న(26) ప్రైవేట్ ఉద్యోగిని. ఈ నెల 15న ఆఫీసు వెళ్లి జీతం తీసుకుని వస్తానని చెప్పిన ఆమె.. తిరిగి ఇంటికి రాలేదు. ఎక్కడ వెతికినా కనిపించకపోవడంతో ఆదివారం వారి కుటుంబ సభ్యులు మేడిపల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
విషమిచ్చి కుక్కను చంపిన అగంతకుడు
బోడుప్పల్: వీధి కుక్కకు ఇంజిక్షన్ ద్వారా విషం ఇచ్చి చంపిన ఘటన బుధవారం మేడిపల్లి ఠాణా పరిధిలో జరిగింది. ఎస్ఐ వెంకటయ్య కథనం ప్రకారం.. బోడుప్పల్ వీరారెడ్డి కాలనీలో మంగళవారం రాత్రి ఓ వీధి కుక్కకు గుర్తు తెలియని వ్యక్తి ఇంజిక్షన్ ద్వారా విషం ఇచ్చి ^è ంపేశాడు. స్థానికంగా ఉండే పీపుల్స్ ఆఫ్ ఏనిమల్ సంస్థ సభ్యురాలు లత ఈ విషయాన్ని గమనించి బుధవారం మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చనిపోయిన కుక్కకు పోచారంలోని వెటరర్నీ హాస్పిటల్లో పోస్టుమార్టం చేయించారు. పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చాక కుక్క ఎలా చనిపోయిందనేది తెలుస్తుందని, అనంతరం నిందితుడిని గుర్తించి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. -
వర్ధమాన క్రికెటర్ను బలిగొన్న డెంగీ
బోడుప్పల్: వర్ధమాన క్రికెట్ క్రీడాకారుడిని డెంగీ కబళించింది. క్రికెట్లో రాణిస్తున్న బోడుప్పల్ శ్రీసాయినగర్ కాలనీకి చెందిన సాయి విశ్వనాథ్రాజు(17) గురువారం రాత్రి డెంగీ జ్వరంతో మరణించాడు. వివరాలివీ... బోడుప్పల్ శ్రీసాయినగర్కాలనీలో నివసించే బుద్ధరాజు సీతారామరాజు, సునీత దంపతులకు ఇద్దరు కుమారులు. సీతారామరాజు సంగారెడ్డిలోని యూబీ కంపెనీలో ఎలక్ట్రీషియన్. పెద్ద కుమారుడు సాయి విశ్వనాథ్రాజు(17) సైనిక పురిలోని భవన్స్ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. క్రికెట్లో రాణిస్తున్నాడు. వారం క్రితం ఇతడికి జ్వరం రావడంతో స్థానిక ఆసుపత్రిలో చూపించుకున్నాడు. జ్వరం తగ్గకపోవడంతో రెండు రోజుల క్రితం పీర్జాదిగూడలోని స్పార్క్ హాస్పిటల్లో చేర్పించారు. డాక్టర్లు వైద్య పరీక్షలు చేయగా డెంగీ అని తేలడంతో చికిత్స ప్రారంభించారు. చికిత్స పొందుతూ గురువారం రాత్రి సాయి విశ్వనాథ్రాజు మృతి చెందాడు. శుక్రవారం భవన్స్ కాలేజీ విద్యార్థులు, తోటి క్రికెట్ టీం సభ్యులు విశ్వనాథ్ రాజు భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎనిమిదేళ్ల వయసు నుంచే క్రికెట్.. సాయి విశ్వనాథ్రాజు చిన్నతనం నుంచి క్రికెట్పై ఆసక్తి చూపేవాడని, దీంతో 8 ఏళ్ల వయసు నుంచి క్రికెట్ కోచింగ్ తీసుకుంటున్నాడని మృతుడి తండ్రి సీతారామరాజు, కోచ్ సురేష్ తెలిపారు. ఇప్పటి వరకు స్కూల్ లెవెల్లో రంగారెడ్డి జిల్లాలో, అండర్ 16 ఏ డివిజన్ లెవెల్లో ఆడాడు. ఇటీవల నేషనల్ లెవెల్లో ఢిల్లీ, గోవాలో వైస్ కెప్టెన్ గా ఆడగా బెస్ట్అవార్డుతోపాటు మేన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడన్నారు. ప్రస్తుతం జరుగుతున్న టుడే లీగ్ మ్యాచ్లు 19 ఆడాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 4 మ్యాచ్లు ఆడాడని, ఇంతలో డెంగీ రూపంలో సాయివిశ్వనాథ్రాజును మృత్యువు కబళించిందన్నారు. -
బోడుప్పల్లో చైన్స్నాచింగ్
బోడుప్పల్ (హైదరాబాద్): ఇంటి ముందు నిలబడి ఉన్న ఓ మహిళ మెడలో నుంచి నాలుగున్నర తులాల బంగారు పుస్తెల తాడును ఇద్దరు యువకులు తెంచుకుని పారిపోయిన సంఘటన మంగళవారం మేడిపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు.. బోడుప్పల్ ఎన్ఐఎన్ కాలనీలో నివసించే మేకల ప్రవళిక(32) మరో ఇద్దరు మహిళలతో కలిసి ఆదివారం రాత్రి తమ ఇంటి ముందు నిలబడి ఉన్నారు. ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు యువకులు ఆమె మెడలో పుస్తెల తాడును తెంచుకుని పారిపోయే ప్రయత్నం చేయగా ఆమె పుస్తెలతాడును గట్టిగా పట్టుకుంది. దాంతో పుస్తెలు ఆమె చేతిలో ఉండి పోగా, నాలుగున్నర తులాల బంగారు గొలుసును తెంచుకుని పారిపోయారు. ప్రవళిక ఫిర్యాదు మేరకు మంగళవారం మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
‘ఆస్తి కోసమే సాహితిని హతమార్చారు’
హైదరాబాద్ : నగరంలోని బోడుప్పల్లో 17 ఏళ్ల సాహితి అనే యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమెను ఆస్తి కోసం మేనత్త, మేనమామ హత్య చేశారని సాహితి తరపు బంధువులు ఆరోపిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మేడిపల్లికి చెందిన సాహితి చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి నానమ్మతో కలిసి ఉంటోంది. అయితే మేనమామ నివాసానికి వచ్చిన సాహితి గతరాత్రి బాత్రూమ్లో జారిపడి మృతి చెందినట్లు ఆమె మేనత్త చెప్పటం పలు అనుమానాలకు తావు ఇస్తోంది. అంతేకాకుండా గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా మరో పదిరోజుల్లో సాహితికి మైనార్టీ తీరునున్న నేపథ్యంలో ఆస్తి కోసమే హతమార్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
‘ఆస్తి కోసమే సాహితిని హతమార్చారు’
-
గిన్నిస్ రికార్డే లక్ష్యంగా తైక్వాండో విన్యాసాలు
బోడుప్పల్: నగరంలో శనివారం వరల్డ్ తైక్వాండో డేని పురస్కరించుకుని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డే లక్ష్యంగా విద్యార్థులు తైక్వాండో విన్యాసాలు చేశారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు చత్తీస్గడ్, కర్ణాటక, మొహాలి, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీలకు చెందిన 999 మంది విద్యార్థులు ఈ విన్యాసాల్లో పాల్గొని, 13 నిమిషాల పాటు ప్రదర్శించారు. బోడుప్పల్లో పల్లవి మోడల్ స్కూల్లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్రెడ్డి హాజరై జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కరాటే పోటీలు ఒకప్పుడు శారీరక దృడత్వం, సమాజంలో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు నేర్చుకునేవారని చెప్పారు. తైక్వాండో గిన్నిస్ ఆఫ్ వరల్డ్ రికార్డుకోసం 999 మంది విద్యార్థులచే ఈ విన్యాసాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. తెలంగాణ విద్యార్థులు కరాటే పోటీల్లో పాల్గొని ప్రపంచ స్థాయి గుర్తింపును రాష్ట్రానికి తీసుకురావాలని కోరారు. క్రీడల కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని ఎమ్మెల్యే చెప్పారు. -
బోడుప్పల్లో భారీ చోరీ
హైదరాబాద్ : తూర్పు సైబరాబాద్ మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బోడుప్పల్లో అర్థరాత్రి దొంగలు హల్చల్ సృష్టించారు. తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు పడి... 25 తులాల బంగారు ఆభరణాలతోపాటు 25 తులాల వెండి ఆభరణాలను దొంగలు దోచుకెళ్లారు. అలాగే ఎల్ఈడీ టీవీతోపాటు కొంత నగదును కూడా అపహరించుకుని పోయారు. చోరీ విషయాన్ని గురువారం ఉదయం స్థానికులు గుర్తించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... చోరీ జరిగిన తీరును పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నయీం అనుచరుడినంటూ వేధింపులు
బోడుప్పల్: పీర్జాదిగూడ మున్సిపల్ పరిధిలోని శ్రీపురి కాలనీలో ఓ వ్యక్తి తాను నయీం అనుచరుడునని చెప్పుకుంటూ బెదిరిస్తుండటంతో కాల నీవాసులు మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... శ్రీపురి కాలనీ నివాసి ఉమర్ అన్సారీ(45) తాను గ్యాంగ్స్టర్ నయీం అనుచరుడునని చెప్పుకుంటూ అదే కాలనీలో ఉండే 15 కుటుం బాలను మూడేళ్లుగా వేధిస్తున్నాడు. రోజూ తాగి వచ్చి దూషించడం, చిన్నపిల్లలతో సిగరెట్లు తెప్పించుకోవడం, మాట వినకపోతే కొట్టడం వంటివి చేస్తున్నాడు. కిరాణా షాపుల్లో సిగరెట్లు, ఇతర వస్తువులు తీసుకొని డబ్బు చెల్లించేవాడు కాదు. ఎవరైనా డబ్బు అడిగితే చంపేస్తానని హెచ్చరించేవాడు. నయీం చనిపోయిన తర్వాత కూడా ఉమర్ అన్సారీ వేధింపులు ఆగకపోవడంతో కాలనీవాసులు పోలీసులకు ఫిర్యాదు చేశా రు. అంతేకాకుండా అన్సారీని పట్టుకొని బుధవారం రాత్రి పోలీసులకు అప్పగించారు. అయితే, రాత్రి అతడిని విడిచి పెట్టినట్టు తెలిసింది. -
దంపతులపై దాడి : కేసు నమోదు
బోడుప్పల్: రోడ్డు పక్కన కారును అడ్డంగా పెట్టారనే కారణంతో దంపతులపై నలుగురు యువకులు అకారణంగా దాడి చేసి గాయపర్చిన సంఘటన మేడిపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ వెంకట్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం బోడుప్పల్ బాలాజీ హిల్స్ కాలనీలో నివసించే సర్దార్ ఖాన్, నస్రిన్ కౌసర్ భార్య భర్తలు. ఆదివారం రాఘవేంద్ర కాలనీలో నివాసం ఉండే మరిది ఇంటికి నస్రిన్ కౌసర్ వెళ్లింది. తరువాత ఆమె భర్త ఆమెను తీసుకెళ్లడం కోసం కారులో వచ్చాడు. కారును రోడ్డు పక్కన పెట్టి ఉండగా స్థానికంగా ఉండే నలుగురు యువకులు రోడ్డు పక్కన కారును ఎందుకు నిలిపారంటూ భార్య భర్తలు ఇద్దరిపై దాడి చేశారు. వారికి తీవ్ర గాయాలు కావడంతో ఉప్పల్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. వారి ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కానిస్టేబుల్ ఇంట్లోనే చోరీ
బోడుప్పల్: తాళం వేసి ఊరికి వెళ్లిన ఓ పోలీస్ కానిస్టేబుల్ ఇంట్లో దొంగలు పడి 3.5 తులాల బంగారు నగలు, ఇతర వస్తువులు ఎత్తుకెళ్లారు. ఆదివారం మేడిపల్లి ఎస్ఐ నవీన్బాబు తెలిపిన వివరాల ప్రకారం... బోడుప్పల్ టెలిఫోన్ కాలనీలో నివసించే కానిస్టేబుల్ ఉమాకుమార్ ఏసీపీ వద్ద డ్రైవర్గా పని చేస్తున్నాడు. ఈనెల 5న ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి వరంగల్ వెళ్లాడు. ఆదివారం ఉదయం తిరిగి వచ్చేసరికి ఇంటి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. ఇంట్లోకి వెళ్లి చూడగా బంగారు ఆభరణాలు, ఇతర వస్తువులు కనిపించలేదు. మేడిపల్లి పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
యువతిని మోసం చేసిన సాఫ్ట్వేర్ ఉద్యోగి రిమాండ్
బోడుప్పల్ (హైదరాబాద్) : పెళ్లి చేసుకుంటానని యువతిని మోసం చేసిన ఓ సాప్ట్వేర్ ఉద్యోగిపై మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఎస్ఐ నాగయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మల్కాజిగిరిలో నివసించే యుగంధర్(35) గత కొంత కాలంగా చెన్నైలో సాప్ట్వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఇతనికి భార్య, పిల్లలున్నారు. కాగా పర్వతాపూర్ ఇంద్రప్రస్థానంలో నివసించే ఓ యువతితో ఫోన్లో పరిచయం చేసుకొని.. కొంత కాలంగా ఆమెతో సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆమె పెళ్లి చేసుకోమని కోరగా తనకు గతంలో పెళ్లి అయ్యిందని చెప్పి మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడు. దీంతో యువతి పోలీసులను ఆశ్రయించింది. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని సోమవారం సాప్ట్వేర్ ఉద్యోగిని రిమాండ్కు తరలించారు. -
కళాశాలకు వెళ్తున్నానని చెప్పి..
బోడుప్పల్ (హైదరాబాద్) : కళాశాలకు వెళ్లిన ఓ విద్యార్థిని కనిపించకుండాపోయిన సంఘటన శనివారం మేడిపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ తాజుద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం.. పీర్జాదిగూడ గాంధీనగర్లో నివసించే పి.రాబర్ట్ కుమార్తె కావేరి(17) డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతుంది. గత నెల 28వ తేదీన కాలేజికి వెళుతున్నానని చెప్పి వెళ్లింది. మరలా తిరిగి రాలేదు. ఎక్కడ వెతికినా కనిపించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు శనివారం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రియల్ ఎస్టేట్ వ్యాపారి అదృశ్యం
బోడుప్పల్ (హైదరాబాద్) : ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి కనిపించకుండాపోయిన సంఘటన ఆదివారం మేడిపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ వెంకటయ్య సమాచారం మేరకు... బోడుప్పల్ బృందావన్ కాలనీలో నివసించే చింతల యాదిరెడ్డి(40) లావణ్య భార్యాభర్తలు. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. యాదిరెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడు. ఈ క్రమంలో ఈ నెల 14 రాత్రి 9 గంటలకు ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. ఇంటికి రాలేదు. పలు ప్రాంతాల్లో వెతికినా కనిపించకపోవడంతో ఆదివారం కుటుంబ సభ్యులు మేడిపల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
చోరీల బాట పట్టిన దంపతులు అరెస్ట్
-కుటుంబ ఆర్థిక స్థితి బాగోలేక ఇళ్లలో చోరీలు -అరెస్ట్ చేసిన మేడిపల్లి పోలీసులు -రూ.5 లక్షల విలువైన వస్తువులు స్వాధీనం బోడుప్పల్ (హైదరాబాద్) : ఇళ్లలో చోరీలు చేసి తప్పించుకుని తిరుగుతున్న దంపతులను మంగళవారం మేడిపల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వారి నుంచి రూ.5 లక్షల విలువైన వివిధ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. డీఐ నవీన్ కుమార్ సమాచారం మేరకు... తుకారం గేట్ వద్ద నివసించే బల్లం ప్రభాకర్(32), శ్రావణి(25)లు దంపతులు. ఆర్థిక పరిస్థితులు సరిగా లేనందున వారు చోరీల బాటపట్టారు. చోరీలు : బోడుప్పల్ సాయివెంకట్ రెడ్డి కాలనీలో 2015 నవంబర్ 21న రమాకాంత్ ఇంట్లో దొంగతనం జరిగింది. రెండు సిలిండర్లు, ల్యాప్టాప్ పోయాయి. బాలాజీ హిల్స్ కాలనీలో 2016 ఫిబ్రవరి 25న పి.భవానీ ఇంట్లో పార్కింగ్ చేసిన ద్విచక్రవాహనం చోరీకి గురైంది. అక్షయనగర్ కాలనీలో కె.ఉదయ్కుమార్గౌడ్ ఇంట్లో మార్చి 11న బంగారం, వెండి వస్తువులు, ఎల్సీడీ, ద్విచక్రవాహనం మాయమయ్యాయి. మార్చి 15న శ్రీసాయి నగర్లో జగంటి చంద్రమౌళి ఇంటి తాళాలు పగులకొట్టి బంగారం, వెండి వస్తువులు, టీవీ, ఎల్సీడీ, నగదు ఇతర వస్తువులు పోయాయి. ఏప్రిల్ 12న అన్నపూర్ణ కాలనీలో నివసించే టి.వెంకటేశ్ ఇంట్లో బంగారు ఆభరణాలు చోరీ అయ్యాయి. శ్రీసాయినగర్ కాలనీలో బి.వెంకటేశం ఇంట్లో ఏప్రిల్ 13న దుస్తులు, కరెంట్ మోటార్, డీవీడీ ప్లేయర్ మాయమయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బోడుప్పల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ప్రభాకర్, శ్రావణిలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. విచారణలో తమ కుటుంబ ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో దొంగతనాలు చేస్తున్నామని అంగీకరించారు. దీంతో వారి నుంచి రెండు ద్విచక్ర వాహనాలు, మూడు టీవీ సెట్స్, మూడు గ్యాస్ సిలిండర్లు, 12 తులాలు బంగారం, ఒక కిలో వెండి మొత్తం రూ.5 లక్షల విలువ చేసే వస్తువులను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించాము అని డీఐ వివరించారు. -
కుమార్తెలు మాట వినడం లేదని..
బోడుప్పల్ (హైదరాబాద్) : ఇద్దరు కుమార్తెలతో గొడవపడిన ఓ తల్లి ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం మేడిపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ వెంకటయ్య తెలిపిన వివరాల ప్రకారం.. బోడుప్పల్ ఈదయ్యనగర్ కాలనీకి చెందిన ఆదిమూలం వీరయ్య, స్వప్న(27) భార్యాభర్తలు. వారికి దీక్షిక, శ్రామిక అనే ఇద్దరు ఆడపిల్లలున్నారు. వీరయ్య లేబర్గా పని చేస్తుండేవాడు. భర్త వీరయ్య, ఇద్దరు పిల్లలతో గొడవ జరిగినప్పుడల్లా.. నా మాట వినకపోతే చనిపోతానని స్వప్న బెదిరించేది. ఈ క్రమంలో మంగళవారం ఇద్దరు పిల్లలు ఎండలో ఆడుకుంటుండగా ఇంట్లోకి రమ్మని వారిని బెదిరించింది. కాసేపు ఆడుకున్న తరువాత ఇంట్లోకి వస్తామని చెప్పిన వారు ఎండలో ఆడుకుంటున్నారు. దీంతో తన మాట వినడం లేదని మనస్తాపం చెందిన స్వప్న ఇంట్లో ఫ్యాన్కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇది గమనించిన కుటుంబసభ్యులు మేడిపల్లి పోలీసులకు సమాచారం అందించారు. వారు సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకని దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యార్థులపై దాడి: యువకులు అరెస్ట్
బోడుప్పల్ : బీటెక్ విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి దాడి చేసిన ఐదుగురు యువకులను గురువారం మేడిపల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఎస్ఐ నాగయ్య తెలిపిన వివరాల ప్రకారం.. పర్వతాపూర్ అరోరా కాలేజీలో మహమ్మద్ అతారుద్ధీన్, మహమ్మద్ అజారుద్దీన్, షేక్ మహమ్మద్ జబీబుల్లా బీటెక్ చదువుతున్నారు. బుధవారం సాయంత్రం కాలేజీ వదిలిపెట్టిన తరువాత బస్సు కోసం బస్టాప్లో వేచి ఉన్నారు. అయితే పర్వతాపూర్కు చెందిన వరికుప్పల సురేష్(21), కొమరె మధు(21), నిమ్మగూడ శ్రీకాంత్గౌడ్(21), సుర్వి సంపత్గౌడ్ (26), బి. వినోద్ కుమార్ (25)లు వారి పట్ల అసభ్యకరంగా మాట్లాడి దాడి చేశారు. దీంతో వారికి స్వల్పంగా గాయాలయ్యాయి. వారి ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని రిమాండ్కు తరలించారు. -
యువతి సజీవదహనం
బోడుప్పల్ (హైదరాబాద్) : ఇంట్లో పని చేసుకుంటున్న యువతి విద్యుదాఘాతానికి గురై సజీవదహనమైంది. ఈ సంఘటన నగరంలోని బోడుప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న హేమానగర్లో గురువారం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న సౌజన్య(18) ఇంట్లో పని చేసుకుంటుండగా.. ప్రమదవశాత్తు కరెంట్ షాక్కు గురైంది. ఈ ఘటనలో యువతి శరీరం పూర్తిగా కాలి బూడిదైంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
లెక్చరర్ ఆత్మహత్య
బోడుప్పల్ (హైదరాబాద్) : జీవితంపై విరక్తి చెంది ఓ మహిళా లెక్చరర్ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మేడిపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ వెంకటయ్య తెలిపిన వివరాల ప్రకారం... బోడుప్పల్కు చెందిన శంకరయ్య కుమార్తె నాగమణి(35)కి కరీంనగర్ జిల్లా వేములవాడకు చెందిన నర్సింహాచారితో వివాహం అయ్యింది. వీరికి 14 సంవత్సరాల కుమారుడున్నాడు. నర్సింహాచారి రెండు సంవత్సరాల క్రితం మృతి చెందాడు. దీంతో కొంత కాలంగా నాగమణి బోడుప్పల్ బృందావన్ కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని తల్లిదండ్రులకు దగ్గరలో ఉంటోంది. కుమారుడిని చదివించుకుంటూ స్థానిక ఎస్ఆర్ కాలేజీలో లెక్చరర్గా పని చేస్తోంది. అయితే శుక్రవారం కుమారుడు బంధువుల ఇంటికి వెళ్లగా రాత్రి 11 గంటల సమయంలో నాగమణి ఫ్యాన్కు తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. శనివారం ఉదయం స్థానికులు గమనించి మేడిపల్లి పోలీసులకు సమాచారం అందించారు. తనకు బతకాలని లేదని, తన కుమారుడిని బాగా చూసుకోవాలని చెప్పి సూసైడ్ నోట్లో రాసినట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు -
బోడుప్పల్ లో రేపు ఉచిత వైద్యశిబిరం
హైదరాబాద్ : బోడుప్పల్ శ్రీనివాస్ నగర్ కాలనీ, అయ్యప్ప స్వామి టెంపుల్ రోడ్డులో ఉన్న మేథ ఇ-టెక్నో స్కూల్లో ఆదివారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నారు. ఉప్పల్ ఆర్టీసీ డిపో వద్ద ఉన్న స్పార్క్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించే వైద్యశిబిరం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంటుందన్నారు. ఈ శిబిరంలో బీపీ, సుగర్, కీళ్ల నొప్పులు, చిన్న పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేస్తామన్నారు. వివరాలకు ఫోన్: 9912076200లో సంప్రదించాలని నిర్వాహకులు పేర్కొన్నారు. -
బోడుప్పల్లో వృద్ధుడి సజీవ దహనం
రంగారెడ్డి: హైదరాబాద్ శివార్లలో దారుణం జరిగింది. మేడిపల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని బోడుప్పల్లో ఓ గుడిసెకు ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుని ఆనందం(65) అనే వృద్ధుడు సజీవదహనయ్యాడు. నిద్రమత్తులో ఉన్న సమయంలో మంటలు వ్యాపించడంతో అతను తప్పించుకోవడానికి కూడా అస్కారం లేకుండా పోయింది. మంటల్లో వృద్ధుడు పూర్తిగా కాలిపోవడంతో నిద్రలోనే ప్రాణాలు కోల్పోయాడు. గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికు, పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గుడిసెకు మంటలు ఎలా అంటుకున్నాయి అనే దానిపై వివరాలు తెలియాల్సి ఉంది. -
దావా వేసిందని రుణదాత నిర్బంధం
బోడుప్పల్ : ఇచ్చిన అప్పును రాబట్టుకునేందుకు కోర్టులో దావా వేసిన పాపానికి ఓ మహిళను ఇంట్లో నిర్బంధించి దాడికి యత్నించిన సంఘటన సోమవారం మేడిపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై వెంకటయ్య తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పల్ అన్నపూర్ణ కాలనీలో నివసించే విద్యారాణికి బోడుప్పల్ ఈస్ట్ బాలాజీ హిల్స్ కాలనీలో ఓ ఇల్లుంది. దానిని మల్కాజిగిరి ప్రశాంతినగర్కు చెందిన రషీద బేగం(42)కు అద్దెకు ఇచ్చింది. రషీద బేగంకు మల్కాజిగిరి మౌలాలికి చెందిన సి.సౌభాగ్యరాణి(58) అనే స్నేహితురాలుంది. విద్యారాణి డబ్బులను ఫైనాన్స్ చేసేది. ఆ విషయం తెలుసుకున్న రషీదబేగం రూ.5 లక్షలు, సాభాగ్యరాణి రూ.3 లక్షలు అప్పు తీసుకున్నారు. తిరిగి చెల్లించమని ఎన్నిసార్లు అడిగినా చెల్లించకపోవడంతో విద్యారాణి కోర్టులో కేసు వేసింది. దీంతో రషీదాబేగం, సాభాగ్యరాణికి కోర్టు నుంచి నోటీసులు వచ్చాయి. ఈ క్రమంలో రషీదబేగం, సాభాగ్య రాణి, వారి కుమార్తె స్వాతి(25) ముగ్గురు కలిసి విద్యారాణిని బోడుప్పల్లోని ఈస్ట్ బాలాజీ హిల్స్ ఇంటికి డబ్బులు ఇస్తాం.. ప్రామిసరీ నోటులు తీసుకుని రావాలని కోరారు. నిజమేనని నమ్మి విద్యారాణి అక్కడకు వెళ్లగా వారు ఆమెను ఇంట్లో నిర్బంధించారు. ప్రామిసరీ నోటులు, ఒంటిపై ఉన్న బంగారం ఇవ్వకుంటే చంపేస్తామని బెదిరించారు. ఎట్టకేలకు అక్కడ నుంచి తప్పించుకున్న విద్యారాణి మేడిపల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. సోమవారం పోలీసులు సౌభాగ్యరాణి, స్వాతిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. రషీదబేగం పరారీలో ఉన్నట్లు ఎస్సై వెంకటయ్య వెల్లడించారు. -
నగర శివారులో చైన్ స్నాచింగ్
-
నగర శివారులో చైన్ స్నాచింగ్
హైదరాబాద్ సిటీ : నగర శివారులో మరోసారి చైన్స్నాచర్లు రెచ్చిపోయారు. మహిళల మంగళసూత్రాలే టార్గెట్గా దోపిడీలకు పాల్పడుతున్నారు. తాజాగా.. మేడిపల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని బోడుప్పల్ సెవెన్హిల్స్ కాలనీకి చెందిన జెతైన్ అనే మహిళ గురువారం సాయంత్రం తన పిల్లలను స్కూలు నుంచి ఇంటికి తీసుకువెళ్తుండగా బైక్పై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు ఆమె మెడలో ఉన్న 3 తులాల బంగారు గొలుసును లాక్కెళ్లారు. మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. -
ప్రేమ విఫలమై ఆత్మహత్య
బోడుప్పల్ (హైదరాబాద్) : ప్రేమ విఫలమైందన్న మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సోమవారం మేడిపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ వెంకటయ్య తెలిపిన వివరాల ప్రకారం... శ్రీకాకుళం జిల్లాకు చెందిన కిరణ్కుమార్(19) మల్లాపూర్ మల్లికార్జున్నగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. స్థానికంగా ఓ కంపెనీలో మెషీన్ ఆపరేటర్గా పని చేస్తున్నాడు. కాగా ఓ యువతిని ప్రేమించాడు. అయితే ప్రేమ విఫలం కావడంతో తీవ్ర మనస్థాపం చెందాడు. సోమవారం ఉదయం బోడుప్పల్ బొల్లిగూడలోని నిర్మానుష్య ప్రదేశంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తాను ఓ అమ్మాయిని ప్రేమించానని, ప్రేమ విఫలం కావడంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్టు రాసిన సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. -
పేకాట శిబిరాలపై దాడులు
బోడుప్పల్: గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న ఏడుగురిని ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేసి మేడిపల్లి పోలీసులకు అప్పగించారు. ఎస్ఐ వెంకటయ్య తెలిపిన వివరాల ప్రకారం.. బోడుప్పల్ ఈస్ట్ బాలాజీ హిల్స్ కాలనీలో గురువారం సాయంత్రం ఏడుగురు వ్యక్తులు పేకాట ఆడుతున్నారు. గమనించిన స్థానికులు ఎస్ఓటీ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు దాడి చేసి ఏడుగురిని అరెస్టు చేశారు. వారి నుంచి నగదు రూ.36,450 నగదు, రెండు ద్విచక్ర వాహనాలు, 6 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు. -
అన్నా...ఈ సొరకాయ రేటెంత?
బోడుప్పల్: ‘అన్నా..ఈ సొరకాయ రేటెంత? దీన్ని మీరే పండించారా...గిట్టుబాటు అవుతోందా...’ అంటూ మంత్రి హరీష్రావు రైతుబజార్లో కూరగాయల రైతులను ఆరా తీశారు. బోడుప్పల్ సమీపంలోని మేడిపల్లిలో రూ.60 లక్షల వ్యయంతో నిర్మించిన రైతుబజార్ను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి రైతుబజార్లో కలియతిరుగుతూ రైతులతో మాట్లాడారు. కూరగాయల ధరల గురించి అడిగి తెలుసుకున్నారు. మార్కెట్లలో దళారీ వ్యవస్థను పూర్తిగా నివారిస్తామని, ఆరుగాలం కష్టపడి సాగుచేసే రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. హరీష్ వెంట మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్రెడ్డి తదితరులున్నారు. - మేడిపల్లి -
స్కూల్ వివాదంలో మహిళ సజీవదహనం
సంచలనం సృష్టించిన పూజిత ఆత్మాహుతి ఘటనను మరవకముందే నగరంలో మరో మహిళ సజీవదహనానికి గురైంది. బోడుప్పల్ ప్రాంతంలోని ఓ ఇంట్లో శ్రీదేవీ అనే మహిళను గుర్తుతెలియని దుండగులు సజీవదహనం చేసిన విషయాన్ని మంగళవారం పోలీసులు గుర్తించారు. మృతురాలు శ్రీదేవి ఒక ప్రైవేటు స్కూల్లో భాగస్వామిగా ఉన్నారు. పాఠశాల నిర్వహణలో తలెత్తిన విభేదాలే హత్యకు దారితీసి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. -
కలుషిత ఆహారంతో..200 మంది విద్యార్థులకు అస్వస్థత
-
కలుషిత ఆహారంతో..200 మంది విద్యార్థులకు అస్వస్థత
ఐదుగురికి ఐసీయూలో చికిత్స యాజమాన్యంపై కేసు నమోదు ఉప్పల్/ బోడుప్పల్, న్యూస్లైన్: ఓ ప్రవేటు కళాశాల హాస్టల్లో కలుషిత ఆహారం తిన్న 200 మంది ఇంటర్ విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిని చికిత్స కోసం కళాశాల యజమాన్యం స్థానిక ఆస్పత్రులకు తరలించింది. కాగా, ఐదుగురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉండంతో ఐసీయూకి తరలించారు. ఈ ఘటనకు సంబందించి పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. బోడుప్పల్లోని శ్రీ రాజరాజేశ్వరి ఎడుకేషనల్ అకాడమి(ఎస్.ఆర్.జూనియర్ కళాశాల)కి బోడుప్పల్ పరిధిలో నాలుగు శాఖలున్నాయి. బృందావన్ కాలనీలోని శాఖలో 600 మంది బాలికలు, అన్నపూర్ణాకాలనీలోని శాఖలో 700 మంది బాలురు ఇంటర్ చదువుతన్నారు. మల్లాపూర్లో ఉన్న హాస్టల్లో వంటలు వండి మిగతా హాస్టల్స్కు అందజేస్తారు. కాగా, పై రెండు హాస్టళ్ల విద్యార్థులు బుధవారం మధ్యాహ్నం హాస్టల్లో పాలకూర పప్పు, పెరుగు, రసంతో భోజనం చేశారు. సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో విద్యార్థులకు కడుపు నొప్పి ప్రారంభమై వాంతులు, విరేచనాలతో కుప్పకూలిపోయారు. విషయం తెలుసుకున్న యాజమాన్యం విద్యార్థులును స్థానిక స్పార్క్, అపెక్స్ హాస్పిటల్స్, ఉప్పల్లోని ఆదిత్య అస్పత్రులకు తరలించింది. ఉప్పల్ ఆదిత్యలోనే 139 మంది విద్యార్థులు చికిత్స పొందు తున్నారు. ఇందులో ఐదుగురు విద్యార్థుల పరిస్థితి విషమించడంతో అత్యవసర సేవలు అందిస్తున్నట్టు డా.సునీల్ వెల్లడించారు. ప్రాణహాని లేనప్పటికీ కొన్ని గంటలు గడిస్తే తప్ప ఏమీ చెప్పలేమన్నారు. యజమాన్యంపై కేసు నమోదు: ఏసీపీ కలుషిత ఆహారం అందించి విద్యార్థుల అస్వస్థకు కారణమైన కళాశాల యజమాన్యంపై కేసులు నమోదు చేసినట్లు మల్కాజిగిరి ఏసీపీ చెన్నయ్య తెలిపారు. ఆహారాన్ని ల్యాబ్కు పంపి వచ్చిన రిపోర్టుల ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. మేడిపల్లి సీఐ రవికిరణ్రెడ్డి, ఉప్పల్ సీఐ అమరవర్ధన్రెడ్డి, ఎస్ఐలు చంద్రశేఖర్, టి.మహేష్గౌడ్ ఘటనా స్థలంలో పరిస్థితిని పరిశీలించారు. విద్యార్థుల తల్లిదండ్రులకు అందని సమాచారం కాగా, ఇంతమంది విద్యార్థులు అస్వస్థతకు గురైనా యజమాన్యం మాత్రం విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం అందించలేదు. దీనిపై పలు విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. హాస్టల్లో కిచెన్ నిర్వహణ సరిగా లేదని, స్థానికంగా కొని తెచ్చిన పాలకూర కలుషిత ఆహారానికి దారి తీసాయని ఏఐఎస్ఎఫ్ మేడ్చల్ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. యజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.