Boss
-
ఉద్యోగులకు కార్లు, బైకులు గిఫ్ట్.. ఎక్కడో తెలుసా?
కొన్ని కంపెనీలు దసరాకు బోనస్లు ఇవ్వడం, దీపావళికి గిఫ్ట్స్ ఇవ్వడం వంటివి చేస్తుంటాయి. మరికొన్ని సంస్థలు బోనస్లు, బహుమతుల ఊసేలేకుండా మిన్నకుండిపోతాయి. అయితే ఇటీవల చెన్నైకి చెందిన సుర్మౌంట్ లాజిస్టిక్స్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ తమ ఉద్యోగులకు బైకులు, కార్లను గిఫ్ట్ ఇచ్చింది. ప్రస్తుతం నెట్టింట్లో ఇదే హాట్ టాపిక్గా మారిపోయింది.సుర్మౌంట్ లాజిస్టిక్స్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తమ ఉద్యోగులను ప్రోత్సహించడంలో భాగంగా 20 మందికి టాటా కార్లు, యాక్టివా స్కూటర్లు, రాయల్ ఎన్ఫీల్డ్ బైకులను అందించింది.చెన్నైలో ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉన్న సుర్మౌంట్ లాజిస్టిక్స్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ లాజిస్టిక్స్ రంగంలో సరుకుల రవాణా, పారదర్శకత, సరఫరాలలో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరిస్తుంది. అన్ని వ్యాపారాల్లో లాజిస్టిక్స్ను మరింత సరళీకృతం చేయడమే కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు దాని వ్యవస్థాపకుడు, ఎండీ డెంజిల్ రాయన్ పేర్కొన్నారు. -
బాస్ను తిట్టడానికి.. ఓ కొత్త సర్వీస్
ఉద్యోగం చేసే చాలామంది కొన్ని సమస్యలను లేదా ఫిర్యాదులను ఆఫీసులో బాస్కు చెప్పుకోవాలంటే భయపడతారు. మరికొందరికి బాస్ మీద తిట్టేయాలన్నంత కోపంతో ఉంటారు. అలాంటి వారికోసం యునైటెడ్ స్టేట్స్లోని ఓసీడీఏ అనే సంస్థ స్కోల్డ్ అనే ప్రత్యేకమైన సర్వీస్ అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనిని స్టాండ్ అప్ కమెడియన్ అండ్ యాక్టర్ 'కాలిమార్ వైట్' ఈ ఏడాది ప్రారంభంలో ప్రారభించారు.ఫిర్యాదులను సరిదిద్ది.. మెరుగైన పని వాతావరణాన్ని సృష్టించడమే లక్ష్యంగా కంపెనీ ఈ సర్వీస్ ప్రారంభించినట్లు వైట్ పేర్కొన్నారు. ఈ సర్వీస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కంపెనీ దీనిని పూర్తిగా ఏజంట్ల ద్వారా నిర్వహిస్తుంది.కంపెనీ ఏజెంట్ ఉద్యోగి ఫిర్యాదు స్వీకరించిన తరువాత.. వారు నేరుగా ఆఫీసుకు వెళ్తారు. బాస్ నుంచి ఎలాంటి సమస్య వచ్చినా దానికి మొత్తం ఏజెంట్ బాధ్యత వహిస్తాడు. మొత్తానికి ఒక ఉద్యోగి ఆందోళనలను బాస్కు చేరవేస్తారు. కొన్నిసార్లు ఏజెంట్ వ్యక్తిగతంగా కనిపించకుండానే.. ఫోన్లో సంభాషణ చేస్తాడు.ఇటీవల సోషల్ మీడియాలో వెల్లడైన వీడియోలో.. ఒక ఏజెంట్ ఉద్యోగి ఫిర్యాదు మీద ఆఫీసుకు వెళ్లి, వెంటనే బాస్ మీద విరుచుకుపడ్డాడు. నేను 17 సంవత్సరాలు పనిచేస్తున్నా.. అయినప్పటికీ నాకు పీటీఓ ఇవ్వలేదు. మీరు కొత్త ఉద్యోగులకు ఎక్కువ చెల్లిస్తున్నారు. మొత్తం ఇన్వెంటరీ అస్తవ్యస్తంగా ఉంది. మోల్డింగ్ విభాగంలో ఫ్యాన్ లేదు అని అరుస్తూనే ఉన్నారు.ఇదీ చదవండి: ఆ రంగంలో హైదరాబాద్ టాప్: ఆ తరువాతే అన్నీ..ఏజెంట్ను శాంతిచమని ఎంతమంది చెప్పినా.. అతని స్క్రిప్ట్ కొనసాగించాడు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియో ఎంతోమంది వీక్షకులను ఆకర్శించింది. ఆ తరువాత దీనికి మరింత డిమాండ్ పెరిగిపోయింది. వీడియోపై పలువురు నెటిజన్లు మిశ్రమంగా స్పందించారు. -
బాస్ లీవ్ ఇవ్వలేదని.. వీడియో కాల్లో పెళ్లి
పని, పని పని.. కార్పొరేట్ కల్చర్లో ఇది ఎక్కువైంది. కార్యాలయాల్లో పని ఒత్తిడి.. ఉద్యోగులను ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటుంది. ముఖ్యమైన అవసరాలకు సైతం సరిగా లీవ్లు కూడా ఇవ్వని పరిస్థితి తలెత్తుతోంది. కానీ ఎంత పెద్ద ఉద్యోగమైన, ఎంత పెద్ద పదవిలో ఉన్న జీవితంలో జరిగే పెళ్లికి ప్రతి ఒక్కరూ తప్పక సెలవులు పెడతారు. అయితే టర్కీలో ఓ ఉద్యోగికి తన పెళ్లికి బాస్ లీవ్ ఇవ్వలేదు. దీంతో అతను వర్చువల్గా వివాహం చేసుకోవాలసి వచ్చింది.హిమాచల్ ప్రదేశ్కు చెందిన ఓ జంట ఆన్లైన్ వీడియో కాల్ సాక్షిగా ఒక్కటైయ్యారు. పెళ్లి కూతురు మండిలో.. పెళ్లి కొడుకు టర్కీలో ఉండి వీడియో కాల్లోనే పెళ్లి తంతు పూర్తి చేశారు. బిలాస్పూర్ చెందిన అద్నాన్ ముహమ్మద్ టర్కీలో పని చేస్తున్నాడు. స్వదేశానికి వచ్చి వివాహ చేసుకునేందుకు అతడు లీవ్ కోరగా.. కంపెనీ సెలవు ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో అతను వర్చువల్గా ముస్లిం మత సంప్రదాయ ప్రకారం వీడియోకాల్లో పెళ్లి చేసుకున్నాడు. అయితే అంత హడావిడీగా పెళ్లి చేసుకోవడానికి కారణం.. వధువు తాత అనారోగ్యంతో ఉండటంతో ఆమెను త్వరగా వివాహం చేసుకోవాలని పట్టుబట్టినట్లు వరుడి కుటుంబ సభ్యులు తెలిపారు.ఆమె పెళ్లి చూడాలని పట్టుపట్టడంతో ఇరు కుటుంబీకులు ఆన్ లైన్ నికాకు అంగీకరించారు. బిలాస్పూర్ నుంచి నవంబర్ 3న ఆదివారం మండికి చేరుకున్నారు. మండీలో నవంబర్ 4న (సోమవారం) వీడియో కాలంలో వారి వివాహం జరిగింది. ఖాజీ వారితో కలిసి ఖుబూల్ హై అని మూడుసార్లు అనిపించారు. ఇదిలా ఉండగా గతేడాది జూలైలో సిమ్లాలో మరో వ్యక్తి కూడా ఇలానే ఆన్ లైన్ పెళ్లి చేసుకున్నాడు. కోట్ఘర్కు చెందిన ఆశిష్ సింఘా, కులులోని భుంతర్కు చెందిన శివాని ఠాకూర్లు కొండచరియలు విరిగిపడటంతో టైంకు వారి పెళ్లింటికి చేరుకోలేక పోయారు. దీంతో వీడియో-కాన్ఫరెన్స్లో పెళ్లి చేశారు. -
ఉద్యోగినికి మెసేజ్.. మేనేజర్పై దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు
సమయం ఉదయం. ఇంటి నుంచి ఆఫీస్కు వస్తున్న ఉద్యోగినికి యాక్సిడెంట్ అయ్యింది. అనంతరం తీవ్ర గాయాల పాలైన ఉద్యోగిని.. రోడ్డు ప్రమాదంలో తాను డ్రైవ్ చేస్తున్న కారు ప్రమాదానికి గురైందని తెలుపుతూ కారు ఫొటో తీసి తన మేనేజర్కి మెసేజ్ చేసింది. తాను ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు ఆ మెసేజ్లోని సారాశం. ఇలాంటి సందర్భాలతో సాధారణంగా మేనేజర్లు ఎలాంటి సమాధానం ఇస్తారు. కానీ అందుకు భిన్నంగా ఈ సంస్థ మేనేజర్ ఇచ్చిన రిప్లయిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఘటన ఎక్కడ జరిగింది. ఉద్యోగి,మేనేజర్ సంబంధిత వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది.కిరా అనే యూజర్ ఎక్స్ వేదికగా ఓ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్లో ఉద్యోగిని కారు ప్రమాదానికి గురైందని తన మేనేజర్కు మెసేజ్ చేసింది. తాను డ్రైవ్ చేస్తున్న కారు ప్రమాదం ఫొటోల్ని జత చేసింది.what would y’all respond with if your manager says this? pic.twitter.com/bZznlPZrLT— kira 👾 (@kirawontmiss) October 22, 2024 అయితే అనూహ్యంగా కంపెనీ మేనేజర్ సదరు ఉద్యోగిని యోగక్షేమాలు అడగడానికి బదులు.. మీరు ఆఫీస్కు ఎప్పుడు వస్తారో సమాచారం ఇవ్వండి అంటూ బదులిచ్చారు. ఆ మేస్జ్కి ఉద్యోగిని రిప్లయి ఇవ్వలేదు. దీంతో కోపోద్రికుడైన మేనేజర్ మరుసటి రోజు మరోసారి మెసేజ్ పంపాడు. అందులో మీరు నా మెసేజ్కు రిప్లయి ఎందుకు ఇవ్వలేదో నేను అర్ధం చేసుకోగలను. కానీ జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణం మినహా ఇతర ఘటనలు జరిగి ఉంటే సంస్థ మీపై తప్పని సరిగా కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు సదరు మేనేజర్.ప్రస్తుతం ఈ ఘటనపై నెటిజన్లు మేనేజర్పై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇలాగే మా మేనేజర్ వ్యవహరిస్తే..నేను వెంటనే కొత్త ఉద్యోగం వెతుక్కుంటాను అంటూ ఓ నెటిజన్ స్పందిస్తే.. ఈ తరహా ఉన్న మేనేజర్లు మనల్ని బయపెడుతున్నారు. జీవితం ఇంత దుర్భరంగా ఉంటుందా? అని మరో నెటిజన్ రిప్లయి ఇచ్చాడు. -
ఐఫోన్ లాంఛ్ ఈవెంట్లో కాబోయే టాలీవుడ్ కపుల్.. ఫోటోలు
-
క్విట్ వెకేషనింగ్ ట్రెండ్ ఏమిటి? యువత ఎందుకు ఫాలో చేస్తోంది?
సాధారణంగా ఉద్యోగులు తమ ఉద్యోగానికి, వ్యక్తిగత జీవితానికి మధ్య సమన్వయాన్ని కొనసాగించేందుకు పని నుండి కాస్త విరామం తీసుకుని, ఎక్కడికైనా వెళ్లాలని అనుకుంటారు. ఇందుకోసం తమ ఆఫీసులోని బాస్కు చెప్పి సెలవు తీసుకుంటారు. అయితే ఇప్పుడు ఈ విషయంలో కొత్త ట్రెండ్ మొదలయ్యింది. ప్రపంచంలోని అనేక దేశాలలో వివిధ ప్రైవేట్ కంపెనీలలో పనిచేసే ఉద్యోగులు ఈ నూతన ట్రెండ్ను ఫాలో చేస్తున్నారు. దానిపేరే ‘క్విట్ వెకేషనింగ్’. ఇంతకీ ఈ కొత్త ధోరణి ఏమిటి?అమెరికన్ మార్కెటింగ్ అండ్ రీసెర్చ్ కంపెనీ ‘హారిస్ పోల్’ నిర్వహించిన సర్వేలో వెల్లడైన వివరాల ప్రకారం యూఎస్లోని దాదాపు 78 శాతం మంది ఉద్యోగులు, ప్రధానంగా యువత తమకు పని నుంచి విరామం కావాలని బాస్ను అడగడం లేదు. ఇలా అడగకుండా లీవ్ పెట్టడాన్ని వారు తప్పుగా భావించడంలేదని సదరు సర్వే చెబుతోంది. పని ఒత్తిడికి తగ్గించుకునేందుకే వారు ఇలా చేస్తున్నారని సర్వే వెల్లడించింది.పని నుంచి విరామం కోరుకునేందుకు ఉద్యోగులు తమకు తోచిన పరిష్కారాలను కనిపెడుతున్నారు. దీనిలో భాగంగానే క్విట్ వెకేషనింగ్ అనేది ఉద్భవించిందని సర్వే చెబుతోంది. ఈ సర్వేలోని వివరాల ప్రకారం క్విట్ వెకేషనింగ్ సమయంలో ఉద్యోగులు తాము పనిచేస్తున్నట్లు సంస్థకు భ్రమ కల్పిస్తారు. పని వేళల్లో తాము పంపాల్సిన ఈమెయిల్స్ను ముందుగానే షెడ్యూల్ చేస్తారు. పనివేళల తర్వాత కూడా ఓవర్ టైం చేస్తున్నట్లు కనిపించేందుకు కూడా ప్రయత్నిస్తుంటారు.మరి కొందరు ఉద్యోగులు అప్పుడప్పుడు తమ కంప్యూటర్ మౌస్ను కంపెనీ మెసేజింగ్ ప్లాట్ఫారమ్పై ఉంచి, పని చేస్తున్నట్లు కనిపించడానికి ప్రయత్నిస్తారు. ఇదంతా తెరవెనుక కొన్నాళ్లుగా జరుగుతున్నదని ఈ సర్వే చేపట్టిన సంస్థ తెలిపింది. అయితే అటు ఉద్యోగాన్ని, ఇటు వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేసేందుకు మంచి పరిష్కార మార్గం కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నామని సర్వే నిర్వాహకులు తెలిపారు. -
పెళ్లి సెలవును ఎగతాళి చేసిన బాస్.. ఉద్యోగి షాకింగ్ నిర్ణయం!
ఉద్యోగ జీవితం ఎంత ముఖ్యమో వ్యక్తిగత జీవితం కూడా అంతే ముఖ్యం. దీనికి విఘాతం కలిగినప్పుడు కొంత మంది ఉద్యోగులు ధైర్యంగా కఠిన నిర్ణయాలు తీసుకుంటారు. అలాంటి ఓ ఉద్యోగి తన సోదరుడి పెళ్లి కోసం సెలవు అడిగితే ఇవ్వకపోగా ఎగతాళి చేసిన బాస్కు గట్టి షాక్ ఇచ్చాడు. ఇంతకీ అతను తీసుకున్న షాకింగ్ నిర్ణయం ఏంటన్నది ఇప్పుడు చూద్దాం.. ఆస్ట్రేలియాలో నోయెల్ అనే ఉద్యోగి బాలీలో సోదరుడి పెళ్లి కోసం సెలవుకు దరఖాస్తు పెట్టకున్నాడు. అయితే అతని బాస్ సెలవును రద్దు చేయడంతోపాటు ఎగతాళి చేస్తూ పంపిన సందేశం చూసిన తర్వాత నోయెల్ కఠిన నిర్ణయం తీసుకున్నాడు. సోదరుడి పెళ్లికి వెళ్లకపోవడం కంటే ఉద్యోగం వదిలేయడమే మేలని నిశ్చయానికి వచ్చాడు. ఆ బాస్ అంతలా ఏమి ఎగతాళి చేశాడు.. ఉద్యోగికి బాస్కి మధ్య జరిగిన సంభాషణపై మైఖేల్ సాంజ్ బిజినెస్మన్, ఔట్సోర్సింగ్ ఎక్స్పర్ట్ టిక్టాక్లో ఓ వీడియోను షేర్ చేయడంతో ఈ సంఘటన సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది. "ఈ వ్యక్తి పనిముట్టులా ఉన్నాడు. ఎటువంటి సంభాషణ లేకుండా ఆటోమేటిక్గా సెలవును రద్దు చేస్తున్నాడు" అంటూ జోడించారు. నిక్ అనే బాస్, అతని ఉద్యోగి నోయెల్ మధ్య సంభాషణ ఇలా ఉంది.. మరొక ఉద్యోగి రాజీనామా చేస్తున్నందున నోయెల్ సెలవు రద్దు చేస్తున్నట్లు బాస్ తెలియజేశాడు. ఇప్పటికే బాలీకి విమానాలకు టికెట్ల బుకింగ్ అయిపోయిందని, తన పిల్లలు వివాహ పార్టీలో ఉన్నారని తన సెలవులను రద్దు చేయొద్దని నోయెల్ బాస్ని వేడుకున్నాడు.ఏడు నెలల క్రితమే టికెట్లు బుక్ చేశానని కాబట్టి రద్దు చేయడం వీలు కాదని అభ్యర్థించాడు. అయినప్పటికీ, బాలిని గమ్యస్థానంగా ఎగతాళి చేస్తూ సెలవును మూడు వారాల నుంచి మూడు రోజులకు తగ్గించుకోవాలని నోయెల్కు సూచించాడు. దీంతో కలత చెందిన నోయెల్.. ఇతర దేశాలను ఎగతాళి చేసే ఇలాంటి కంపెనీలోనా తాను పనిచేస్తున్నది అంటూ తాను ఈ రోజు నుంచే సెలవు తీసుకుంటున్నాని అంటే జాబ్ మానేస్తున్నానని బదులిచ్చాడు. బాస్ ప్రవర్తనపై నెటిజన్లు తీవ్రంగా ప్రతిస్పందించారు. నోయెల్ తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు కురిపించారు. -
చీకటి నీడ!..ఒక బాస్ జంటల మధ్య సాగే థ్రిల్లింగ్ కథ!
వర్షం ధారగా కురుస్తూ రాత్రిని చల్లగా తడుపుతోంది. కన్నీటి వాన నా మనసును బాధతో తడుముతోంది. కొద్దిసేపటికో లేదా మరునాటికో వర్షం ఆగిపోయి వాతావరణం సాధారణ స్థితికి వస్తుంది. నా కన్నీరు కూడా అలాగే ఆగిపోతుందేమో. కానీ నా మనసులోని బాధ ఎప్పటికి తగ్గుతుంది? నేను మళ్లీ సాధారణ స్థితికి రాగలనా..! ఎదురుగా కనిపిస్తున్న పిస్తా రంగు వెడ్డింగ్ కార్డుపై గోల్డ్ కలర్లోని ‘మానస వెడ్స్ తరుణ్’ అనే అక్షరాలను చూస్తుంటే నా బాధ రెట్టింపు అవుతోంది. ఇన్ని సంవత్సరాల నా రిలేషన్షిప్ని ఎలా వదులుకోగలుగుతోంది మానస. ఆ తరుణ్ అనే వాడితో అంత సులువుగా పెళ్లికి ఎలా ఒప్పుకుంది? ఎంత ఆలోచించినా కారణం అంతుబట్టడం లేదు. కార్డు ఇస్తున్నప్పుడు అదే విషయం అడిగాను. ‘చిల్ యార్. తరుణ్తో పెళ్ళి అమ్మా..నాన్న, సొసైటీ కోసమే! నా మనసులో నీ స్థానం ఎప్పటిలాగానే పదిలంగా ఉంటుంది. నా పెళ్లి తరువాత కూడా మనం మునుపటిలాగానే కలుసుకుందాం..’ అని ఎంత ఈజీగా చెప్పేసింది. నా మనసులో మానసకు తప్ప మరో మనిషికి చోటు లేదు. కానీ తనెందుకు ఇలా చేసింది! బాల్కనీలోకి వచ్చి సిగరెట్ వెలిగించాను. ఆమె పరిచయం, సాన్నిహిత్యం తరువాత నేనొక అనాథనని మరచిపోయాను. ఇప్పుడు నేను మళ్ళీ ఒంటరినని తలుచుకుంటే దుఃఖం ముంచుకొస్తోంది. బెడ్ పై వాలి కళ్ళు మూసుకుంటే నిద్ర దరి చేరటం లేదు. నాలుగేళ్ల క్రితం నాటి మా మొదటి పరిచయం గుర్తుకు వచ్చింది. ∙∙ చురుకుగా ఉండటం, సమయస్ఫూర్తి, కంప్యూటర్ సైన్స్లో మాస్టర్ డిగ్రీతో పాటు చూడగానే ఆకర్షించే నా రూపం.. చిన్న వయసులోనే.. పేరున్న కంపెనీలో టీమ్ లీడర్గా ఎదగటానికి దోహదపడింది. అది నా రెండో ప్రాజెక్ట్ అనుకుంటా. కొత్తగా ఒక జావా డెవలపర్ అవసరం పడింది. షార్ట్ లిస్ట్ చేసిన ముగ్గురిలో ఒకరిని ఫైనల్ చేసి రిక్రూట్ చేసుకొనే బాధ్యతను నాకు అప్పగించారు. ఒక అబ్బాయి, ఇద్దరు అమ్మాయిలు. ప్రొఫైల్స్ చూస్తే ముగ్గురూ టాలెంటెడ్ అనిపించింది. ఇంటర్వ్యూ కోసం ఒక్కొక్కరినీ నా క్యాబిన్లోకి పంపించమన్నాను. మొదట వచ్చిన అమ్మాయిది.. బంగారు వర్ణం. ఒకసారి చూస్తే ఏ మగాడికైనా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే సోయగం. కొన్ని కోడ్స్, ప్రాబ్లెమ్ ఎనాలిసింగ్ టెక్నిక్స్ డిస్కస్ చేశాక ఎందుకో సంతృప్తి కలగలేదు నాకు. తరువాత వచ్చిన అబ్బాయి ఎన్.ఐ.టి గ్రాడ్యుయేట్. కానీ అతనిలోని కొంచెం నిర్లక్ష్యపు దోరణి నచ్చక రిజెక్ట్ చేశాను. చివరగా వచ్చింది మానస. చామనఛాయ రంగు దేహం.. ఆ కళ్ళలోని మెరుపు సమ్మోహనంగా ఉంది. ‘గుడ్ మార్నింగ్’ అంటూ సన్నని నవ్వు. అదేంటి ఆశ్చర్యంగా ఆ నవ్వు నాలో చక్కిలిగింతలు పెడుతోంది. ఇదేమి వింత! ఇది కరెక్ట్ కాదు కదా అని అనిపించింది. కానీ ఆ పొడవాటి మొహంలోని కాంతి, మెడ దగ్గరి నునుపు నన్ను కళ్ళు తిప్పుకోనివ్వ లేదు. తమాయించుకొని ప్రోగ్రామింగ్ మాడ్యూల్స్ డిస్కస్ చేశా. అన్ని ప్రశ్నలకూ సరైన సమాధానాలే. ఆటిట్యూడ్, కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూస్తే ముచ్చటేసింది. ‘యూ ఆర్ సెలెక్టెడ్’ అని చెప్పాను. ‘థాంక్ యూ సో మచ్ ఫర్ సెలెక్టింగ్ మీ. ఈ జాబ్ నాకు రావటానికి మీరే కారణం. మీ గైడెన్స్లో పనిచెయ్యటానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చింది. ఆ మెత్తని స్పర్శకు నా నరనరాల్లో వేల వోల్ట్ల విద్యుత్ ప్రవహించిన అనుభూతి. సర్దుకొని ‘బై ద వే.. నీ డేట్ అఫ్ బర్త్ చూశాను. నువ్వే నా కన్నా ఆరు నెలలు పెద్ద. సో నేను నీ బాస్ అయినప్పటికీ మీరు అనొద్దు. నువ్వు అని సింగిలర్ యూస్ చెయ్యి. నో ప్రాబ్లెమ్’ అన్నాను. కళ్ళతోనే నవ్వింది. ఆ చూపు గుచ్చుకొని నా హృదయంలో తియ్యని అలజడి మొదలయ్యింది. అలా తొలి పరిచయంలోనే తను నాకు బాగా కావాల్సిన వ్యక్తిలా కనిపించింది. తరువాత నుండి ప్రతిరోజు తనను చూడాలనే తహ తహ మొదలయ్యింది. అయితే ఒకటే టీమ్ అయినా ఆఫీస్లో ఇద్దరం కలిసి మాట్లాడుకునే టైమ్ అస్సలు ఉండేది కాదు. మీటింగ్స్ కుడా జూమ్లోనే అయ్యేవి. కానీ నాకు మాత్రం రోజుకి ఒక్కసారైనా మానసని చూడాలని, చలాకీగా తను మాట్లాడుతుంటే వినాలని అనిపించేది. మానస ఇదేమీ గమనించేది కాదు. నాలో తన పట్ల కలుగుతున్న ప్రేమ పూరిత భావనలు తను కనిపెట్టే అవకాశం అస్సలు లేదు. ‘నువ్వు సిగరెట్లు తగ్గించు. పెదాలు కొంచెం నలుపు రంగులోకి మారేలా కనిపిస్తున్నాయి’ అంది ఒక రోజు. ‘ఇంత అందంగా ఉంటావు. ఆఫీస్లో ఇప్పటివరకు ఎవ్వరూ ప్రపోజ్ చెయ్యలేదా నీకు?’ చొరవగా అడిగింది ఇంకో రోజు. ‘నువ్వు మామూలు డ్రెస్లో కంటే జీన్స్.. టీ షర్ట్లో సూపర్ ఉంటావు’ మరో రోజు కాంప్లిమెంట్. ఎప్పుడూ క్యాంటీన్లోనే తినే నాకోసం అప్పుడప్పుడు తన లంచ్ బాక్స్ షేర్ చేసేది. కొద్ది రోజుల్లోనే ఒక స్నేహితురాలిగా దగ్గరయ్యింది. ఆఫీస్ విషయాలు, ఇంట్లో సంగతులే కాకుండా పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసుకునేది. ఎప్పుడైనా తను లీవ్ పెడితే ఆ రోజంతా నా మనసు విలవిల్లాడేది. తను పరాయి మనిషి కాదు అని నా కోసమే పుట్టిందేమో అనే తీవ్రమైన భావన నాలో! నేను తనకి ఇంకా దగ్గర అవ్వకముందే మంచి ఆపర్చునిటీ వచ్చిందని ఇంకో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగానికి మారిపోయింది. మా ఆఫీస్లో తన లాస్ట్ వర్కింగ్ డేనాడు వీడ్కోలు పలుకుతున్నప్పుడు నా కళ్ళలోని తడిని చూసి ‘హే.. ఇప్పుడు ఏమైంది? నేను వేరే కంట్రీకి ఏమీ పొవట్లేదు. ఈ సిటీలోనే ఉంటున్నా. ఇంకా చెప్పాలంటే మనిద్దరి ఆఫీస్ల మధ్య దూరం పది నిమిషాలే. రెగ్యులర్గా టచ్లో ఉందాం. ఓకే నా’ అంటూ హగ్ చేసుకొంది. ఆ కౌగిలి తను కాజువల్గా ఇచ్చినా అప్పుడు మా రెండు దేహాల స్పర్శలో నేను పొందిన ఆనందం అనిర్వచనీయం. అలారం క్లాక్, మొబైల్ రెండూ ఒకేసారి మోగుతుండగా నిద్ర లేచాను. టైమ్ చూస్తే పది. మానస గురించి ఆలోచిస్తూ లేట్గా పడుకున్నానేమో మెలకువ రాలేదు. మొబైల్ చూస్తే తన నుండే కాల్. ‘హలో.. గుడ్ మార్నింగ్ ’ అన్నాను. నా గొంతులో విషాదం నాకే తెలుస్తోంది. ‘హే గుడ్ మార్నింగ్. ఇప్పుడే లేచావా? కమాన్ క్విక్గా రెడీ అయ్యి బేగంపేట షాపర్స్ స్టాప్కి వచ్చేయ్. చిన్న షాపింగ్. తరుణ్ కూడా వస్తున్నాడు. నువ్వుంటే నాకు బాగుంటుంది’ అని చెప్పేసి ఫోన్ కట్ చేసింది. ఏమనుకుంటుంది ఈ మనిషి అసలు! మా ఇద్దరి మధ్య ఏమీ లేనట్లు ఇంత క్యాజువల్గా ఎలా మాట్లాడుతుంది? తరుణ్తో షాపింగ్ చెయ్యటానికి నన్నెందుకు రమ్మంటోంది? వాళ్ళిద్దరినీ పక్క పక్కన చూస్తే నేను తట్టుకోగలనా! అలా ఆలోచిస్తూనే రెడీ అయ్యి కిందకి వచ్చి కార్ స్టార్ట్ చేశాను. రాత్రి తగ్గిన వర్షం మళ్ళీ సన్నని తుంపరతో మొదలయ్యింది. కొన్ని జ్ఞాపకాలకు మరణమే ఉండదు. కొన్ని జ్ఞాపకాలు అస్సలు పురుడు పోసుకోవు. డ్రైవ్ చేస్తూ మళ్ళీ పాత జ్ఞాపకాలను వెతుక్కొన్నాను. మొదటిసారి తను నా కార్ ఎక్కటానికి కూడా ఇలాంటి వర్షమే కారణం. ఆ రోజు సాయంత్రం ఆఫీస్ నుండి బయటకు వచ్చేసరికి చిన్న ముసురు. నా కార్ దగ్గరికి వెళ్తూ, నీటి బిందువులతో ఆనందంగా పరవశిస్తున్న చెట్ల ఆకుల సోయగాన్ని చూస్తే ఎందుకో మానస గుర్తుకు వచ్చింది. స్కూటీ పై ఆఫీస్కి వచ్చే తను ఈ వర్షంలో ఇంటికి ఎలా వెళ్తుందో అనిపించి మొబైల్ తీసి కాల్ చేశా. నేనేం మాట్లాడక ముందే ‘హే.. హౌ అర్ యూ? ఒక్క మెసేజ్ లేదు, కాల్ లేదు. మర్చిపోయావనుకున్నా బేబీ’ అన్నది గారాలు పోతూ. ఆ గొంతులో ఆ చనువుకి నా వొళ్ళు సంతోషంతో పులకరించింది. ‘ఐ యామ్ గుడ్. వర్షం వస్తుంది కదా ఎలా వెళ్తావు? ఫైవ్ మినిట్స్లో వస్తా. ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా’ అన్నాను. ‘థాంక్ గాడ్. క్యాబ్ కోసం ట్రై చేస్తుంటే రెస్పాన్స్ రావట్లేదు. కమాన్ తొందరగా వచ్చేయ్. నీతో కబుర్లు చెప్పుకొని చాలా రోజులు అవుతోంది. వెయిటింగ్ ఫర్ యూ..’ అన్న తన మాటలకి కొత్త ఉత్సాహం ఆవరించింది నన్ను. రెడ్ కలర్ చుడీదార్ పై కొన్ని వర్షపు చినుకులు అద్దుకొని మంచి పరిమళాన్ని మోసుకుంటూ వచ్చి కార్లో కూర్చుంది. ఆ కళ్ళు చూస్తేనే మైకం కమ్ముకుంటుంది నాలో. ఎప్పటిలాగానే గలగలా మాట్లాడుతుంటే ముందున్న అద్దంలో మెరిసే తన పెదాలనే చూస్తున్నా. ‘హే.. ఈ వర్షాన్ని చూస్తుంటే నీకేమనిపిస్తుంది? నాకైతే చల్లటి ఐస్క్రీమ్ చప్పరించాలని ఉంది’ అంది. ‘నిజం చెప్పనా! నాకైతే నిన్ను చూస్తూ చిల్డ్ బీర్ కొట్టాలని ఉంది’ అన్నాను. ‘అబ్బా.. నీకెప్పుడూ బోల్డ్ థాట్స్ వస్తాయి.. లెట్స్ డూ ఇట్..’ అంటూ కన్ను గీటింది. తను అలా చేస్తే ఏదో తెలియని థ్రిల్ ఫీలింగ్ కలిగింది నాకు. ‘అయితే చలో నా ఫ్లాట్కే పోదాం. ఫ్రిజ్లో ఐస్క్రీమ్, బీర్ రెండూ ఉన్నాయి’ అంటూ నేను కూడా కన్ను గీటాను కావాలని. ‘డన్..’ అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బాల్కనీలో కూర్చొని, వర్షాన్ని ఆస్వాదిస్తూ తను బటర్ స్కాచ్ని, నేను బడ్వైజర్ని రుచి చూస్తున్నాం. ఎలా మొదలు పెట్టాలో అర్థంకావటం లేదు నాకు. డైరెక్ట్గా ప్రపోజ్ చేస్తే ఒప్పుకుంటుందా? ఒప్పుకోకుంటే భరించలేను. నా గురించి అందరికీ చెపితే ఆ అవమానాన్ని తట్టుకోలేను. బాల్కనీ కుండీల్లో రకరకాల మొక్కలు ఉంటే, వాటివైపు చూస్తూ ఏదో ఆలోచిస్తోంది మానస. బీర్తో పాటు నైట్ క్వీన్ గుబాళింపు ఒక వైపు, మరువం పరిమళం ఇంకో వైపు నాకు మత్తుని కలిగిస్తున్నాయి. ధైర్యం చేసుకొని తన దగ్గరగా వెళ్లి కళ్ళలో కళ్ళు పెట్టి చూశాను. అదే మెరుపు. నవ్వుతూ నన్ను ఆహ్వానిస్తున్నట్లుగా..చప్పున తన భుజాలు పట్టుకొని ముద్దు పెట్టి ‘లవ్ యూ మానసా..’ అన్నాను. ఊహించని ఈ పరిణామానికి బిత్తరపోయి నిలుచుంది తను. నా వొంట్లో భయం కలిసిన ఉద్విగ్నత. ‘నీకు ఎందుకు ఇలా అనిపించింది. ఇది కరెక్టేనా?’అని అడిగింది. ముద్దు పెడితే ఏమీ అనకుండా ఆ ప్రశ్న అడగటంతో నాకు ధైర్యం వచ్చింది. ‘కరెక్టో కాదో అన్నది ప్రశ్న కాదు. నీకు నేనంటే ఇష్టమా కాదా చెప్పు. నాకు నువ్వు కావాలి. జీవితాంతం నీ తోడు కావాలి’ అన్నాను. అంతే లతలా నన్ను పెనవేసుకొని ‘లవ్ యూ టూ డియర్’ అని నా నుదుటిపై చిన్నగా ముద్దు పెట్టింది. ఆ క్షణం ఈ ప్రపంచాన్ని జయించిన అనుభూతి కలిగింది నాకు. ఆ రోజు నుండి మా ఇద్దరి ప్రపంచం కొత్తగా మొదలయ్యింది. ఎన్నో కబుర్లు, సినిమాలు, పార్టీలు, అలకలు, ఆనందాలతో జీవితం రంగుల హరివిల్లులా సాగుతూ.. ఒక్క క్షణం కూడా ఒకరిని విడిచి ఇంకొకరం ఉండలేని ప్రేమలోకంలో విహరించసాగాం. అలా అంతా సాఫీగా సాగుతున్న తరుణంలో ఇలా సడన్గా తరుణ్తో నా పెళ్లి అంటూ వెడ్డింగ్ కార్డు ఇచ్చింది. నా ఆలోచనలకు బ్రేక్ వేస్తూ బేగంపేట్ వచ్చింది. ∙∙ నేను వెళ్లేసరికి వెడ్డింగ్ డ్రెస్ సెలక్షన్లో బిజీగా ఉన్నారు ఇద్దరూ. ‘తరుణ్.. మీట్ మై బాస్ ఇన్ మై ఫస్ట్ జాబ్. అఫ్కోర్స్ ఇప్పుడు మాత్రం తనే నాకున్న ఒకే ఒక్క క్లోజ్ ఫ్రెండ్ అనుకో’ అని నన్ను పరిచయం చేసింది. ఆ మాటకు నా హృదయం భగ్గుమంది. ‘ఎంతకు తెగించావే రాక్షసి. నేను క్లోజ్ ఫ్రెండ్ అంతేనా? ఇంకేమీ కానా? అయినా ఎలా చెపుతావు లే!’అని మనసులో అనుకున్నాను. మొహం మీద బలవంతంగా నవ్వు పులుముకొని ‘హాయ్’ అన్నాను. ఇంకేం మాట్లాడబుద్ధి కాలేదు. వాళ్లిద్దరినీ అలా చూస్తుంటే బాధ, కోపం, కసి, చిరాకు.. మనసంతా చేదుగా అయిపోయింది. మానస లేకుండా నేను అసలు జీవించగలనా! ఎక్కడి నుండి ఊడిపడ్డాడు ఈ ఇడియట్ తరుణ్ గాడు? మమ్మల్ని వేరు చెయ్యటానికే పుట్టినట్లున్నాడు. నాకు వాడంటే అసూయ, అసహ్యం రెండూ కలిగాయి. షాపింగ్ అయిపోయింది. వస్తుంటే ‘మా పెళ్ళికి మీరు తప్పకుండా రావాలి. ఇది నా నుండి ఇన్విటేషన్’ అన్నాడు తరుణ్. ‘ష్యూర్.. సీ యూ’అని చెప్పి బయట పడ్డాను. మానస ఎప్పటికైనా నాకే సొంతం కావాలి. తను లేకుంటే నాకు చావే దిక్కు అనిపించింది. దేవుడా ఎలాగైనా ఈ పెళ్లి ఆపు అని జీవితంలో మొదటిసారి దేవుడికి మొక్కుకున్నాను. కానీ దేవుడు నా మొర ఆలకించలేదు. వైభవంగా వాళ్ళిద్దరి పెళ్లి జరిగిపోయింది. ఆ రోజు ఏడ్చి ఏడ్చి నా కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి. నా కళ్ల ముందు అంతా శూన్యం. ఇంత చేసినా ఆశ్చర్యంగా నాకు మానస మీద కోపం మాత్రం రావట్లేదు. ప్రతిరోజు తన గొంతు వినాలని, తనని చూడాలని అనిపించి పిచ్చెక్కేది. కాల్ చేస్తే జస్ట్ హాయ్, బాయ్ అని రెండు మూడు మాటలు మాట్లాడి ఫోన్ కట్ చేసేది అంతే. ఇప్పుడు నా భవిష్యత్తు గురించి నేనో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందనిపించింది. అది ఎంత కఠినమయినా కచ్చితంగా ఆచరణలో పెట్టాలని డిసైడ్ అయ్యాను. వాళ్ళ పెళ్ళైన వారం రోజుల తరువాత ఒక రోజు ఉదయాన్నే ఫోన్ చేసింది మానస. ‘హేయ్.. ఏం చేస్తున్నావ్? మరిచిపోయావా మమ్మల్ని? ఈ రోజు నేను ఆఫీస్కి వెళ్లట్లేదు. ఇంట్లో ఒక్కదాన్నే ఉంటాను. వచ్చేయ్ ఇంటికి’ అంది. అడ్రస్ అడిగి జుట్టు కూడా సరిగ్గా దువ్వుకోకుండా బయటపడ్డాను. ఎందుకు రమ్మంది? క్యాజువల్గానా లేక ఇంకేదైనా చెప్పటానికా? నాలో అంతులేని ప్రశ్నలు. నేను వెళ్లేసరికి తరుణ్ ఇంకా పోలేదు. రెడీ అయ్యి షూ వేసుకుంటున్నాడు. నన్ను చూసి ఆశ్చర్యంగా ‘అరే చెప్పకుండా వచ్చారు? ముందే చెపితే నేను కూడా లీవ్ పెట్టే వాడిని కదా! ఎనీవే ఆఫ్టర్ నూన్ వచ్చేస్తాను. లంచ్ ముగ్గురం కలిసే చేద్దాం. బాయ్’ అంటూ వెళ్ళిపోయాడు. వీడికి మా ఇద్దరి మీద డౌట్ వచ్చే అవకాశం అస్సలు లేదులే అనుకున్నాను. నన్ను చూస్తూనే గట్టిగా కౌగిలించుకొని ‘మిస్ యూ బేబీ..’ అంటూ ముద్దు పెట్టింది మానస. నాకు ఏడుపు ఆగలేదు. ‘ఎందుకిలా చేశావ్? నన్ను ఒంటరిగా ఎందుకు వదిలేశావ్? నువ్వు నిజంగా నన్ను ప్రేమించావా?’ నిలదీశాను. నా నడుము చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కుంటూ ‘ఇప్పుడేమైంది? నిన్ను దూరం పెట్టను అని చెప్పాగా. నువ్వంటే నాకు ఎప్పటికీ ప్రేమే’ అంది. ‘మరి అలాంటప్పుడు ఆ తరుణ్గాడిని ఎందుకు పెళ్లి చేసుకున్నావు? నన్నెందుకు పెళ్లి చేసుకోలేదు?’ కొంచెం కోపంగా అడిగాను. ‘ఎందుకంటే ఇద్దరు ఆడవాళ్లు పెళ్లి చేసుకుంటే లోకం ఒప్పుకోదు కాబట్టి. చూడు అమృతా.. నాకు నీ ప్రేమ కావాలి. సోషల్ లైఫ్ కావాలి. అలాగే పిల్లలు కూడా కావాలి. అందుకోసం తరుణ్ని పెళ్లి చేసుకున్నాను. కానీ నా మనసులో మాత్రం నువ్వే ఉంటావు..’ అని చెప్పుకుంటూ పోతోంది. తన నుండి దూరంగా జరిగి ‘ప్రేమంటే రెండు దేహాల కలయిక మాత్రమే కాదు. రెండు మనసుల అపూర్వ సంగమం. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే నా మనసులో నువ్వు మాత్రమే ఉంటావు. ఇంకో వ్యక్తికి చోటు ఉండదు. కానీ నువ్వు అలా కాదు. నీది నిజమైన ప్రేమ కాదు’ అన్నాను. ‘అమృతా.. ప్లీజ్ అలా అనకు. నన్నర్థం చేసుకో’ నా చేతులు పట్టుకుంటూ అడిగింది. ‘ఒకే జెండర్ అయినా, జెండర్స్ వేరైనా.. ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ ఉన్నప్పుడు మూడో వ్యక్తితో రిలేషన్ అంటే అది మొదటి ప్రేమికుడు లేదా ప్రేమికురాలికి ద్రోహం చేసినట్లే అవుతుంది. ఇంకా చెప్పాలి అంటే అది మానసిక వ్యభిచారం లాంటిదే’ స్థిరంగా చెప్పాను. ‘అమృతా.. చెప్పానుగా.. సమాజం కోసం.. ఇంకా చెప్పాలంటే మా పేరెంట్స్ కోసమే నేను తరుణ్ని పెళ్లి చేసుకుంది. నాకు నువ్వే ప్రాణం’ అంది. ‘నేను నీ ప్రాణమే అయితే నన్నిలా వదిలేసే దానివి కాదు. జీవితాంతం నాకు తోడుగా ఉండేదానివి. నీ కోసం ఎవ్వరినైనా ఎదిరించి బతకటానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ నువ్వు? నీది స్వార్థం. నిజమైన ప్రేమకు కావాల్సింది నమ్మకం. అది నీ మీద నాకు ఇప్పుడు లేదు. మళ్ళీ నా జీవితంలో ప్రవేశించాలని చూడకు. గుడ్ బై’ అని చెప్పి బయటకు నడిచాను. --మొగలి అనిల్ కుమార్ రెడ్డి (చదవండి: -
మద్యం మత్తులో మేనేజర్కు మెసేజ్.. ‘ఏందిరా ఇది’ అంటున్న నెటిజన్లు!
మత్తులో మునిగినోడు నిజమే మాట్లాడతాడని, అన్నీ నిజాలే చెబుతాడని చాలా మంది అంటుంటారు. అలా మద్యం మత్తులో అన్నీ నిజాలే మాట్లాడేసి, ఆనక చిక్కుల్లో పడినవారు చాలామందే ఉంటారు. ఇదే బాపతుకు చెందిన ఒక మందుబాబు తన మేనేజర్తో చాట్ చేశాడు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ను ఆ మేనేజర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. మద్యం మత్తులో మునిగిన ఆ జూనియర్ తన బాస్కు అర్థరాత్రి 2:30కి మెసేజ్ చేసి, దానిలో.. ‘బాస్ నేను మద్యం మత్తులో ఉన్నాను. నేను ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. నా మీద నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు. నన్ను ముందుకు నడిపిస్తున్నందకు ధన్యవాదాలు. మంచి కంపెనీలో ఉద్యోగం దొరకడం కన్నా మంచి మేనేజర్ దొరకడం ఎంతో కష్టం. నేను చాలా లక్కీ. మిమ్మల్ని మీరు ప్రశంసించుకోండి. మీకు మీరు అభినందనలు చెప్పుకోండి’ అని రాశాడు. ఈ పోస్టుకు క్యాప్షన్ రాసిన బాస్.. ఎక్స్ నుంచి మద్యం మత్తులో మెసేజ్లు రావడం సహజం. కానీ ఇటువంటి మెసేజ్లు మీకు ఎప్పుడైనా వచ్చాయా? అని ప్రశ్నించారు. ఈ పోస్ట్ వైరల్ అయిన నేపధ్యంలో పలువురు నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ‘ఏందిరా ఇది’ అంటూ ఆశ్యర్యపోతున్నారు. ఒక యూజర్..‘మీరు చాలా అదృష్టవంతులు. మీ జూనియర్ మిమ్మల్ని ఇష్టపడుతున్నాడు’ అని రాయగా మరొకరు మీరు చాలా మంచి మేనేజరై ఉంటారు. లేకుంటే ఇలాంటి మెసేజ్లు మీకు రావు’ అని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: ఇది యానిమేటెడ్ 3డీ షో కాదు.. ప్రకృతి ఆవిష్కరించిన మెరుపు! Drunk text from ex is okay but have you ever received drunk texts like these? pic.twitter.com/rvkaGMYqLl — Siddhant (@siddhantmin) August 4, 2023 -
ఏం చేసినా పడుండాలా?, బాస్కి దిమ్మతిరిగేలా రిప్లై..డేరింగ్ లేడీ అంటున్న నెటిజన్లు!
కొత్త జాబ్, ఆఫీస్. నచ్చిన వాతావరణంలో పని. మన ఆలోచనలకు అనుగుణంగా ఉండే కొలీగ్స్. ఇదిగో ఆఫీసుల్లో ఇలా ఉండాలని కోరుకుంటాం. కానీ అందుకు విరుద్దంగా ఉంటే అంతే సంగతలు. అందుకే తాను కోరుకున్నట్లు ఆఫీస్ వాతావరణం, బాస్ లేడని ఓ యువతి ఉద్యోగంలో చేరిన మూడు రోజుల్లో తన జాబ్కు రిజైన్ చేసిన విషయాన్ని నెటిజన్లతో పంచుకున్నారు. ప్రస్తుతం, ఈ అంశం చర్చాంశనీయంగా మారింది. ఇటీవల, ఓ యువతి తాను కొత్తగా చేరిన జాబ్, ఆఫీస్ వాతావరణం ఎలా ఉందో ఏకరువు పెట్టింది. ఆమె ఇలా ఎందుకు చేసిందో ఉదహరిస్తూ.. ఉద్యోగం మానేయడం సమంజసమా? లేదంటా అతిగా స్పందించానా’ అంటూ రెడ్డిట్ యూజర్లను సలహా అడిగారు. ‘బాస్ తనకు ఎలాంటి పనులు అప్పగించలేదు. పైగా నేను చెప్పిన పని ఎందుకు చేయలేదని తిట్టాడు. ఆయన అప్పగించిన పనిని వెంటనే పూర్తి చేస్తే.. ఎందుకంత నిధానంగా పనిచేస్తున్నావని ఆరోపించారు. టాయిలెట్లో 10 నిమిషాల కంటే ఎక్కువ సమయం గడిపినందుకు ప్రశ్నించారు. గతంలో తాను ఎదుర్కొన్న మానసిక సమస్యల గురించి చెప్పనందుకు మరింత మందలించాడు. ఒత్తిడిని సమస్యను ఎదుర్కొనేలా డాక్టర్లు మెడిసిన్ వేసుకోవాలని చెప్పారు. డాక్టర్ల సూచన మేరకు కొంత కాలం ఆ మెడిసిన్ వేసుకొని మానేశా . ఈ విషయాలన్నీ ఇంటర్వ్యూలో చెప్పాలిగా అని బాస్ ఆగ్రహం వ్యక్తం చేశాడని వాపోయింది. చివరిగా, నేను అక్కడ పని చేయగలనా అని నిర్ణయించుకోవడానికి రేపటి వరకు (ఈ రోజు) సమయం ఇచ్చారు. బాస్ తీరు నచ్చక. రేపటి వరకు అవసరం లేదని నేనే చెప్పాను. వెంటనే రాజీనామా కూడా చేశా’ అంటూ తన అనుభవాన్ని నెటిజన్లతో పంచుకున్నారు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు.. అలాంటి వాళ్ల దగ్గర పని చేయకపోవడమే బెటర్.. మంచి నిర్ణయం తీసుకున్నావ్, నువ్వు డేరింగ్ లేడీ అంటూ అభినందిస్తున్నారు. I quit after 3 days by u/QueenMangosteen in antiwork చదవండి👉 ఆ వార్తల్లో వాస్తవం లేదు.. క్లారిటీ ఇచ్చిన రిలయన్స్ -
అదే పనిగా భర్తకు నైట్ షిఫ్ట్.. కోపంతో భార్య.. రాత్రి మాస్క్ వేసుకుని ఇంట్లోకి దూరి
సాధారణంగా కార్పొరేట్ కంపెనీల్లో నైట్ షిఫ్టులు అనేది సర్వసాధారణం. ముఖ్యంగా అమెరికా, యూకే ఆధారిత కంపెనీల్లో పని చేస్తుంటే నైట్ షిఫ్ట్లు చేయక తప్పదు. ఉద్యోగం కోసం కొందరు తప్పక నైట్ షిఫ్ట్లకు అంగీకరించినా.. వారి జీవన విధానం పూర్తి భిన్నంగా ఉంటుంది. రాత్రిళ్లు మేల్కొని పనిచేయాల్సి ఉంటుంది. మెలకువగా ఉండేందుకు నానా తంటాలు పడుతుంటారు. అయినా ఎలాగోఒకలా డ్యూటీ చేసినా.. ఆ తర్వాత ఆరోగ్య సమస్యల రావడం కామన్. అదే పనిగా నైట్ షిఫ్ట్... అందుకే రాత్రిపూట పని చేయడానికి చాలా వరకు ఇష్టపడరు. కానీ... కొన్ని చోట్ల కార్పొరేట్ కంపెనీల్లో బాస్లు ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తూ బలవంతంగా నైట్ షిఫ్ట్లు చేయిస్తుంటారు. తాజాగా ఉత్తరాఖండ్లోని ఉదంసింగ్ నగర్ జిల్లాలో ఈ తరహా కేసు వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..టేకి రవ్లీన్, రవ్లీన్ కౌర్ ఇద్దరూ దంపతులు. వీరు ఉధమ్సింగ్ నగర్ జిల్లాలోని ట్రాన్సిట్ క్యాంపు ప్రాంతంలోని హౌసింగ్ డెవలప్మెంట్లో రౌలీన్ నివసిస్తున్నారు. టెకీ రవ్లీన్ పంత్నగర్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. పగ పెంచుకుంది అదే కంపెనీలో పనిచేస్తున్న రవ్లీన్ హెడ్ దీపక్ భాటియా చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. వారి మధ్య ఏం జరిగిందో ఏమో గానీ ఇటీవల రవ్లీన్కు అదే పనిగా నైట్ షిఫ్ట్ వేయిస్తున్నాడు. అంతే కాకుండా జీతం కూడా పెంచలేదు. రోజూ భర్త రాత్రికి వెళ్లి నైట్ షిఫ్ట్ చేసి తెల్లవారుజామున తిరిగి వచ్చేవాడు, దీంతో క్రమంగా అతని ఆరోగ్యం కూడా క్షీణించింది. ఈ క్రమంలో తన భర్త యజమానిపై రవ్లీన్ కౌర్ పగ పెంచుకుంది. అతనికి తగిన బుద్ధి చెప్పాలనుకుని అందుకోసం ఓ ప్లాన్ వేసింది.. ఓ రోజు రాత్రి మాస్క్ ధరించి భర్త బాస్ ఇంట్లోకి ప్రవేశించి అక్కడ ఉన్న యజమాని తల్లిపై దాడి చేసి.. ఆమె తలపై సుత్తితో బాదింది. ఆమె గట్టిగా అరిచింది. ఈ క్రమంలో.. అరుపులు విని ఆమె మనవడు గదిలోకి వచ్చాడు. దీంతో ఆ మహిళ భయపడి అక్కడి నుంచి పారిపోయింది. గాయపడిన మహిళను ఆసుపత్రికి తరలించారు. ఆపై.. సీసీటీవీల ఫుటేజీని పరిశీలించిన పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్లు ఇదేం రివెంజ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చదవండి Aunty Network: హోరు వానలో.. కూర్చుని ముచ్చట్లు పెట్టిన ఆంటీలు.. -
ఫాస్ట్గా ఎందుకు.. నెమ్మదిగా పనిచేసుకోండి - బాస్ స్వీట్ వార్నింగ్!
ఉద్యోగి జీవితం పైకి కనిపించేంత అద్భుతంగా ఉండదు, ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. అటు ఉద్యోగాన్ని.. ఇటు ఫ్యామిలీని మెయింటేన్ చేయాలంటే తల ప్రాణం తోకకి వస్తుంది. ఆఫీసుకు లేటుగా వెళ్తే చీవాట్లు, సరైన సమయానికి పని పూర్తి చేయకపోతే తిట్లు.. ఇలా ఎన్నో సమస్యలతో ముందుకు సాగుతుంటుంది. ఎంత పని చేసినా బాస్ నుంచి ఏదో ఒకటి అనిపించుకోక తప్పదు. అయితే ఇటీవల వెలుగులోకి వచ్చిన సంఘటన దానికి భిన్నంగా ఉంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఒక సంస్థ అంటే అందులో అందరూ ఒకేలా పనిచేయరు. ఒకరు వేగంగా పనిచేస్తారు, మరి కొందరు నెమ్మదిగా పనిచేస్తారు. అయితే ఒక కంపెనీలో బాస్ మాత్రం వేగం వద్దు నెమ్మదిగా పనిచేయండంటూ చెప్పినట్లు సమాచారం. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని రెడ్దిట్ యూజర్ @cryptoman9420 అనే వ్యక్తి వెల్లడించినట్లు తెలిసింది. (ఇదీ చదవండి: ఏసీ రైలు.. ఇండియన్స్ను ఎక్కనించేవారే కాదు.. తొలి ఏసీ కోచ్ ఎప్పుడు? ఎక్కడ? ఎలా మొదలైందంటే..) నాకు పని చేయడం చాలా ఇష్టం.. చాలా వేగంగా పనిచేయాలనుకుంటాను, ఏదైనా పని చెబితే గంటల్లో పూర్తి చేస్తాను అని చెప్పుకొచ్చాడు. కానీ అతని మాటలకు బాస్ పొగుడుతాడనుకుంటే.. వార్ణింగ్ ఇచ్చాడట. కొంచెం నెమ్మదిగా పనిచెయ్యి, కొన్ని మెయిల్స్కి మాత్రమే రిప్లై ఇస్తే చాలు. నీ వేగవంతమైన ప్రదర్శన పని వాతావరణం మీద ప్రభావం చూపిస్తుంది. అంతే కాకుండా ఆఫీసులో నైతికత కూడా దెబ్బ తింటుందని స్వీట్ వార్ణింగ్ ఇచ్చినట్లు సమాచారం. దీనిపైన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ కూడా చేస్తున్నారు. -
మీ బాస్కి బుద్ధి లేదు,వాడో శాడిస్ట్.. టార్గెట్ రీచ్ కాలేదని బలవంతంగా..ఛీ!
సాధారణంగా కంపెనీలు.. ఉద్యోగుల నుంచి సాధ్యమైనంత పనిని చేయించు కోవాలనుకుంటాయి. ఇక కొన్ని సంస్థలైతే తమ ఉద్యోగులకు టార్గెట్ల పేరుతో వేధిస్తుంటాయి. తాజాగా ఓ బాస్ తన ఉద్యోగులకు విచిత్రమైన శిక్ష వేశాడు. తమ సంస్థలో పని చేసే ఉద్యోగుల పనితో సంతృప్తి లేదని వెరైటీ పనిష్మెంట్ ఇచ్చాడు. ఇదంతా అందులో ఒక ఉద్యోగి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ఆ బాస్ బండారం బయటపడింది. ఈ వింత ఘటన చైనాలోని జియాంగ్సూ ప్రావిన్స్లో చోటు చేసుకుంది. అదో ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ కంపెనీ. పేరు సుఝౌ దనావ్ ఫాంగ్చెంగ్షీ ఇన్ఫర్మేషన్ కన్సల్టింగ్. ఈ కంపెనీకి సంబంధించిన చాలా మంది ఉద్యోగులు బలవంతంగా చేదు కాకరకాయల్ని బలవంతంగా తిన్నారు. చైనీస్ సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియోలో, చాలా మంది ఉద్యోగులు పచ్చి పొట్లకాయ తింటున్నారు. కంపనీలో చేరే ముందు వారి పని తీరు సంతృప్తిగా లేకపోతే ఇలాంటి పనిష్మెంట్కి ఉద్యోగులు అంగీకరిస్తూ అగ్రిమెంట్ కూడా చేయించుకున్నట్లు కంపెనీ తెలిపింది. అది రివార్డ్, పనిష్మెంట్ స్కీమ్ అని పేర్కొంది. ఇలా ఎందుకు చేశారని చైనా మీడియా ఆ సంస్థ ప్రతినిధిని అడగగా.. వారు మొండిగా సమాధానం ఇచ్చారు. ఉద్యోగులకు ఇలా చేయడం ద్వారా భవిష్యత్తులో వారు కఠినంగా, హార్డ్ వర్క్ చేస్తారని అన్నారు. తద్వారా మాత్రమే టార్గెట్ రీచ్ అవ్వగలరని అన్నారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆ కంపెనీ బాస్పై మండిపడుతున్నారు. ఇదేం స్కూల్ కాదు ఇలాంటి శిక్షలు వేయడానికి.. ఆ బాస్ బుద్ధిలేదు, వాడో శాడిస్ట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. చదవండి: రష్యాకి తగిలిన వాగ్నర్ సైన్యం షాక్కి..ప్రపంచ నాయకుల రియాక్షన్ ఎలా ఉందంటే.. -
Jayanti Chauhan: వేల కోట్ల కంపెనీకి లేడీ బాస్.. జయంతి చౌహాన్
గత కొన్ని రోజులుగా ప్యాకేజ్డ్ వాటర్ బిజినెస్ కంపెనీ బిస్లెరీ ఇంటర్నేషనల్ను విక్రయించాలని సన్నాహాలు జరిగాయి. అయితే వాటన్నంటికీ ఇప్పుడు తెరవేసారు. కంపెనీని ప్రస్తుతం ఎట్టిపరిస్థితుల్లో విక్రయించబోమని రమేష్ చౌహాన్ స్పష్టం చేశారు. నిజానికి బిస్లెరీ విక్రయానికి సంబంధించి చర్చలు టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్తో గడిచిన నాలుగు నెలలుగా జరుగుతున్నాయి. అయితే ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదు. బిస్లరీ బ్రాండ్ను టాటా గ్రూప్కు రూ.7,000 కోట్లకు విక్రయించాలని గతంలో అనుకున్నప్పటికీ, చివరికి రద్దయింది. జయంతి చౌహాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జార్జ్ నేతృత్వంలోని ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ బృందంతో కలిసి పని చేసింది. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే బిస్లరీ ఇంటర్నేషనల్ ఛైర్మన్ 'రమేష్ చౌహాన్' కూతురే 'జయంతి చౌహాన్'. టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (TCPL)తో చర్చలు ముగిసిన తరువాత ఈమె సంస్థకు సారథ్యం వహించే బాధ్యతలు స్వీకరించింది. దీనికి సంబంధించిన అధికారిక సమాచారాన్ని రమేష్ చౌహాన్ స్వయంగా మీడియాకు తెలిపారు. (ఇదీ చదవండి: EPFO: పీఎఫ్ విత్ డ్రా చేస్తున్నారా? ఈ సందర్భంలో 75 శాతం తీసుకోవచ్చు..) జయంతి చౌహాన్ లాస్ ఏంజిల్స్లోని 'ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అండ్ మర్చండైజింగ్' (FIDM) లో ప్రాడక్ట్ డేవలప్మెంట్, లండన్ కాలేజ్ ఆఫ్ ఫ్యాషన్ నుండి ఫ్యాషన్ స్టైలింగ్ అండ్ ఫోటోగ్రఫీ చదివింది. అంతే కాకుండా స్కూల్ ఆఫ్ ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్, యూనివర్సిటీ ఆఫ్ లండన్ నుంచి అరబిక్ కూడా నేర్చుకున్నారు. (ఇదీ చదవండి: 2023 ఇన్నోవా క్రిస్టా లాంచ్ చేసిన టయోట - పూర్తి వివరాలు) జయంతి ప్రారంభంలో బిస్లరీ ప్లాంట్ ప్రాసెస్ ఆటోమేషన్పై ద్రుష్టి సారించి హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్తో పాటు సేల్స్ అండ్ మార్కెటింగ్ టీమ్లో గణనీయమైన మార్పులు తీసుకువచ్చింది. ఆ తరువాత 2011లో ఢిల్లీ నుంచి ముంబైకి షిఫ్ట్ అయిన తరువాత హిమాలయాస్ నేచురల్ మినరల్ వాటర్, బిస్లరీ హ్యాండ్ ప్యూరిఫైర్స్ వంటి కొత్త బ్రాండ్లను నడపడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. -
ఇక బిస్లెరీకి బాస్ ఆమే...
ప్యాకేజ్డ్ వాటర్ వ్యాపార దిగ్గజం బిస్లెరీని ఇక ఆ కంపెనీ వైస్ చైర్ పర్సన్ జయంతి చౌహాన్ నడిపించనున్నారు. బిజినెస్ కొనుగోలుకి బిస్లెరీ ఇంటర్నేషనల్తో చేపట్టిన చర్చలకు చెక్ పడినట్లు ఎఫ్ఎంసీజీ దిగ్గజం టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్(టీసీపీఎల్) వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో బిస్లెరీ కంపెనీకి ఇక జయంతి చౌహాన్ అధిపతిగా ఉంటారని ఆమె తండ్రి సంస్థ చైర్మన్ రమేష్ చౌహాన్ తాజాగా తెలిపారు. ఇదీ చదవండి: Rs 2000 notes: రూ.2వేల నోట్లపై కేంద్రం కీలక ప్రకటన! ది ఎకనామిక్ టైమ్స్ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రమేష్ చౌహాన్ మాట్లాడుతూ.. తమ వ్యాపార సంస్థను తాము అమ్మడం లేదని, తమ కూతురు జయంతి చౌహాన్ ఇక మీదట సంస్థను నడిపిస్తారని చెప్పారు. 42 ఏళ్ల జయంతి చౌహాన్ ప్రస్తుతం ఆమె తండ్రి స్థాపించి తీర్చిదిద్దిన బిస్లెరీ కంపెనీలో వైస్ చైర్పర్సన్గా ఉన్నారు. కంపెనీ వర్గాల సమాచారం మేరకు.. ఆమె కంపెనీ ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ బృందంతో కలిసి పని చేస్తారు. జయంతి చౌహాన్ కంపెనీ వ్యాపార వ్యవహారాల్లో అప్పుడప్పుడు పాలుపంచుకుంటున్నారు. అయితే బిస్లరీ పోర్ట్ఫోలియోలో భాగమైన వేదిక బ్రాండ్పైనే ప్రధానంగా ఆమె దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. టాటా సంస్కృతి, విలువలు నచ్చడంతో తాను తన వ్యాపార సంస్థ బిస్లెరీని వారికి అమ్మదలిచానని, ఇతర సంస్థలు బిస్లెరీ కొనుగోలుకు ఎంత ప్రయత్నించినా తాను పట్టించుకోలేదని రమేష్ చౌహాన్ అప్పట్లో చెప్పారు. ఇదీ చదవండి: Apple Watch: ప్రాణం కాపాడిన యాపిల్ వాచ్!.. ఎలాగంటే... టాటా కన్స్యూమర్ ప్రోడక్ట్స్, బిస్లెరీ ఇంటర్నేషనల్ సంస్థల మధ్య రెండేళ్లుగా జరుగుతున్న చర్చలు బిస్లరీ కంపెనీ వాల్యుయేషన్పై భిన్నాభిప్రాయాల కారణంగా అటకెక్కాయి. అయితే చర్చలు విఫలం కావడానికి వాల్యుయేషన్ కాకుండా వేరే కారణాలు ఉన్నట్లు ఎకనమిక్స్ టైమ్స్ పేర్కొంటోంది. కంపెనీ ప్రమోటర్లు భవిష్యత్తులో తమ ఆలోచనలను మార్చుకోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. -
తెలంగాణ కొత్త పోలీస్ బాస్
-
'హే డ్యూడ్'..అమ్మా..తల్లి నేను నీ బాస్ను..నన్ను అలా పిలవద్దు ప్లీజ్!
ప్రపంచ దేశాల్లో కరోనా కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. దీంతో ఇన్ని రోజులు హైబ్రిడ్ వర్క్తో తలమునకలైన ఉద్యోగులు.. ఇప్పుడు తాత్కాలికంగా వర్క్ ఫ్రమ్ హోం చేసేందుకు ఇష్టపడుతున్నారు. అందుకు సంస్థలు సైతం గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాయి. అయితే ఈ తరుణంలో వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్న ఉద్యోగులకు, వారి బాస్ల మధ్య జరుగుతున్న సంభాషణలు నెటిజన్లను నవ్వులు పూయిస్తున్నాయి. ఉద్యోగులు ఆఫీస్కు వచ్చి పనిచేయడం వల్ల వర్క్ ప్రొడక్టివిటీ పెరుగుతుంది. ఉద్యోగుల నుంచి మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చనేది సంస్థల అభిప్రాయం. అయితే ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా రిమోట్ వర్క్తో టీం లీడర్లు, బాస్లు ఉద్యోగులతో వర్క్ చేయించుకోవడం తలనొప్పిగా మారింది. ముఖ్యంగా కొంత మంది ఉద్యోగులు ట్రెండ్కు తగ్గట్లు స్నేహితులతో ఎలా మెలుగతారో.. బాస్లతో సైతం అదే తరహాలో సంభాషిస్తున్నారు. ఆ సంభాషణలే బాసిజం చూపించే బాస్లకు అస్సలు నచ్చడం లేదు. హర్టవుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఉద్యోగి శ్రేయాస్.. బాస్ సందీప్ మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణను మీరూ చూసేయండి తాజాగా వర్క్ ఫ్రం హోం చేస్తున్న శ్రేయాస్ అనే యువతికి ఆమె బాస్ సందీప్ ఓ వర్క్ అలాట్ చేశాడు. ఆ వర్క్ పూర్తయ్యిందా అంటూ వాట్సాప్లో మెసేజ్ పెట్టారు. ఆ మెసేజ్కు శ్రేయాస్ ఇలా రిప్లయి ఇచ్చింది. "హే.. నో,నాట్ ఎట్" అని మెసేజ్ పెట్టింది. ఆ మెసేజ్ బాస్కు కోపం తెప్పించింది. దీంతో సందీప్ స్పందించాడు. హాయ్ శ్రేయాస్ నేను మీ బాస్ను నన్ను 'హే' అని పిలవొద్దు. ఉద్యోగులు బాస్తో మాట్లాడేందుకు కొన్ని పద్దతులుంటాయి. నీకు నా పేరు గుర్తు లేకపోతే హాయ్ అని మెసేజ్ చేయ్. దీంతో పాటు "డ్యూడ్", "మ్యాన్", "చాప్", "చిక్" అని కూడా పిలవొద్దు. అంటూ ఉద్యోగికి వాట్సాప్ మెసేజ్ ఫార్వర్డ్ చేశాడు. అంతే ఆ రిప్లయికి ఉద్యోగి శ్రేయాస్ స్పందిస్తూ.."మంచిది. నేను మీతో వాట్సాప్ చాట్ చేస్తున్నాను. తప్పితే లింక్డిన్, మెయిల్ చేయలేదు. మిమ్మల్ని కించ పరచలానే ఉద్దేశ్యం నాకు లేదు. నేను ప్రొఫెషనల్గా మీతో మాట్లాడాను అని బాస్కు చెప్పింది".ఆ వాట్సాప్ సంభాషణను ఉద్యోగి సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ రెడ్డిట్లో పోస్ట్ చేయడం,అది కాస్త వైరల్ అవ్వడం క్షణాల్లో జరిగిపోయాయి. -
ఆఫీసులో ఫోన్ ఛార్జింగ్ పెడితే జీతం కట్!
స్మార్ట్ ఫోన్.. మనకి రోజూవారీ పనుల్లో ఓ భాగం అయ్యింది. బయటకు వెళ్లేప్పుడు మాస్క్ మరిచిపోతున్నా.. ఫోన్ మాత్రం వెంటే ఉంటుంది. మరి వాడకానికి తగ్గట్లు పాపం ఛార్జింగ్ కూడా అవసరం కదా! అందుకే చాలామంది పని చేసే చోట్ల కూడా ఫోన్లకు ఛార్జింగ్ పెట్టేస్తుంటారు. అయితే ఇక్కడో బాస్ అందుకు అభ్యంతరం చెప్తున్నాడు. వర్క్ప్లేస్లో ఫోన్ ఛార్జింగ్ పెట్టడం కుదరదని అంటున్నాడు ఆ బాస్. ఆ బాస్, ఆఫీస్ ఎక్కడిదనేది క్లారిటీ లేదు. కానీ, ఇందుకు సంబంధించిన ఓ పేపర్ నోట్ ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. ఈ అలవాటు కరెంట్ దొంగతనం కిందకే వస్తుందని, పనిచోట నైతిక విలువలకు సంబంధించిన విషయమని పేర్కొన్నాడు ఆ బాస్. ఈ నోట్ రెడ్డిట్ వెబ్సైట్లో చర్చకు దారితీసింది. గంటల తరబడి ఆఫీసుల్లో ఉన్నప్పుడు ఫోన్ ఛార్జింగ్ తగ్గిపోతుందని, అలాంటప్పుడు ఆఫీస్ కరెంట్ ఉపయోగించుకోవడంలో తప్పేంటని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు కొందరు. మరికొందరేమో ఆ బాస్ చేసింది కరెక్టేనని, దీనివల్ల ఫోన్-ఇంటర్నెట్ వాడకం తగ్గుతుందని, అంతేకాదు మైండ్ డైవర్షన్ లేకుండా పనిలో నైపుణ్యం పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. అయితే వర్క్ ప్లేస్లో ఫోన్, డివైస్ల ఛార్జింగ్ను చాలా కంపెనీలు వ్యతిరేకిస్తాయని, వాల్మార్ట్ లాంటి ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ సైతం ఇలాంటి నిబంధనను అమలు చేస్తోందని గుర్తు చేస్తున్నారు ఇంకొందరు. ఇక ఈ నోట్ మూడేళ్ల క్రితమే రెడ్డిట్లో ఇలా చర్చకు దారితీయడం మరో విశేషం. చదవండి: Work From Home.. మారిన రూల్స్! ఏంటంటే.. -
వివాహేతర సంబంధం వద్దన్నందుకు అంతు చూస్తానన్న భార్య.. తట్టుకోలేక
లక్నో: భార్య మరొకరితో సంబంధం పెట్టుకోవడంతో పద్ధతిని మార్చుకోవాలని హెచ్చరించినా పట్టించుకోలేదు. దీంతో తట్టుకోలేక ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని గోమతి నగర్లో చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోమతి నగర్కు చెందిన నిఖిల్కు 2012లో వివాహం కాగా, ఒక కుమార్తె ఉంది. నిఖిల్ కిరాణా దుకాణం ద్వారా జీవనం సాగిస్తుండగా, ఇటీవల కొంత కాలంగా తన భార్య ఓ ఎన్జీవో సంస్థలో పని చేయడం ప్రారంభించింది. అయితే గత కొంతకాలంగా ఆమె తన యజమానితో సన్నిహితంగా ఉంటోంది. అది కాస్త వివాహేతర సంబంధంగా మారింది. దీంతో ఆమె తన కుటుంబాన్ని పట్టించుకోవడం మానేసింది. ఈ విషయం నికిల్కి తెలియడంతో తన భార్య పద్ధతిని మార్చుకోవాలని ఆమెను హెచ్చరించాడు. అయినప్పటికీ ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. మంగళవారం రాత్రి ఈ విషయమై వీరిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చివరకి తన అక్రమ సంబంధానికి అడ్డు రావొద్దని ఆమె తన భర్తకి తెగేసి చెప్పడంతో పాటు భర్త అంతు చూస్తానని బెదిరించింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన నిఖిల్ ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో నికిల్ తండ్రి పోలీసుల వద్ద.. తన కొడుకు జీవితం అతని భార్య వివాహేతర సంబంధం కారణంగా నాశనం అయ్యిందని తెలిపాడు. నికిల్ అత్మహత్యకు తన కోడలు ఆమె యజమానే కారణమని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: 3 నిమిషాల్లో 3 కిలోమీటర్లు.. జెట్ స్పీడులో దూసుకొచ్చి ప్రాణం కాపాడిన పోలీసులు -
వార్నీ... వీక్లీ ఆఫ్ రోజు తాగొద్దన్నందుకు జాబ్ మానేశాడు
సాధారణంగా చేసే ఉద్యోగం మనకు నచ్చకపోతేనో.. బాస్ తీరు సరిగా లేకపోతేనో.. చుట్టూ ఉన్న వాళ్లు రాజకీయాలు చేసి.. మనల్ని అవమానిస్తేనో.. ఉద్యోగం మానేస్తాం. కానీ కరోనా వ్యాప్తి మొదలైన నాటి నుంచి పైన చెప్పిన పరిస్థితులు ఎదురైనా సరే.. అన్నింటిని మౌనంగా భరిస్తూ.. ఉద్యోగం చేసుకుంటున్నారు చాలా మంది. ఎందుకంటే బయట పరిస్థితులు బాగాలేవు కనుక.. అన్నింటిని సహిస్తున్నారు. కానీ ఇప్పుడు మీరు చూడబోయే వ్యక్తి మాత్రం కాస్త భిన్నం. వీక్ ఆఫ్ రోజు పని చేయడానికి రావాలి.. తక్కువ తాగు అని బాస్ సూచించినందుకు ఆగ్రహించి ఉద్యోగం మానేశాడో వ్యక్తి. ఇక బాస్కి, సదరు ఉద్యోగికి మధ్య జరిగిన చాటింగ్ ఆసక్తికరంగా ఉంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లు సోషల్మీడియాలో వైరలవుతున్నాయి. ఆ వివరాలు.. (చదవండి: జీతం ఎంతో చెప్పాలంటూ కాబోయే అల్లున్ని గదిలో బంధించి...) రెడిట్లో పోస్ట్ చేసిన స్క్రీన్ షాట్స్లో బాస్ తన బార్ అటెండర్కి ఉదయం 2.59 గంటలకు మెసేజ్ చేస్తాడు. ఏమని అంటే.. ‘‘రేపు ఓ ఈవెంట్ ఉంది.. డ్యూటీలో ఒక్కడే బార్ అటెండర్ ఉన్నాడు. కనుక నీవు రేపు ఉదయం 11 నుంచి రాత్రి 10 గంటల వరకు అతడు డ్యూటీ చేయాల్సి ఉందని’’ తెలుపుతాడు. అందుకు సదరు ఉద్యోగి నిరాకరిస్తాడు. రేపు నాకు ఆఫ్ అని తెలుపుతాడు. కానీ తప్పనిసరిగా రావాల్సిందిగా కోరతాడు బాస్. అందుకు ఆ ఉద్యోగి ‘‘రేపు ఉదయం డ్యూటీకి రావాలని.. మీరు తెల్లవారుజామున 3 గంటలకు నాకు మెసేజ్ చేశారు. ముందు చెప్పలేదు. రేపు వీక్లీ ఆఫ్ కదా అని నేను ఈ రోజు ఎక్కువ డ్రింక్ చేశాను. రేపంతా నాకు హ్యాంగోవర్ ఉంటుంది.. నేను 11 గంటల పాటు డ్యూటీ చేయలేను’’ అని రిప్లై ఇస్తాడు. (చదవండి: కొడుక్కి ఎంతైనా ఇస్తా.. కూతురికి ఇవ్వను!) అందుకు బాస్ ‘‘నీవు డ్యూటీ చేయడానికి సిద్ధంగా ఉండాల్సిందే. పైగా ఎక్కువ తాగడం మంచిది కాదు. కొన్ని అనుకోని పరిస్థితులకు మనం అప్పటికప్పుడే సిద్ధపడి.. వాటిని పూర్తి చేయాలి. ఒకరికొకరం మద్దతుగా ఉండాలి’’ అని మెసేజ్ చేస్తాడు. అప్పటికే సదరు ఉద్యోగికి చిర్రెత్తుకొస్తుంది. ఇక ఏమాత్రం మోహమాటపడకుండా బాస్ని దులిపిపారేస్తాడు. ‘‘వీక్లీ ఆఫ్ రోజు నేను ఎంత తాగాలో నీవు నాకు చెప్తావా.. వీక్లీ ఆఫ్ రోజు తినొద్దని చెఫ్కి చెప్పగలవా.. నువ్వు కరెక్ట్ టైమ్లో నాకు ఈ మెసేజ్ చేస్తే అప్పుడు నేను ఆలోచించేవాడిని. ఇంత లేట్గా చెప్పడమే కాక నేను ఎంత తాగాలో నువ్వు డిసైడ్ చేస్తున్నావ్’’ అంటూ ఉద్యోగి ఘాటుగా రిప్లై ఇస్తాడు. (చదవండి: షాకింగ్: భార్య ప్రేమను అమ్మకానికి పెట్టి మరీ..) అందుకు బాస్ ‘‘నువ్వు ఆటిట్యూడ్ చూపిస్తున్నావ్. దీని గురించి మనం తర్వాత చర్చిద్దాం’’ అంటాడు. అందుకా ఉద్యోగి.. ‘‘మనం చర్చించాల్సిన అవసరం లేదు. బార్ అటెండర్లకి చాలా అవకాశాలు ఉన్నాయి. నేను ఉద్యోగం మానేస్తున్నారు. నీతో నేను విసిగిపోయాను. గుడ్బై’’ అంటాడు. అప్పుడు బాస్.. ‘‘నీ నిర్ణయం సరైంది కాదు. ఉదయం లేచాకా నీవు దీని గురించి బాధపడతావ్’’ అని హెచ్చరిస్తాడు. కానీ సదరు ఉద్యోగి మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోడు. ఇక వీరిద్దరి సంభాషణ చాలా ఫన్నీగా ఉండటంతో నెటిజనులను తెగ ఆకట్టుకొంటుంది. మా బాస్ కూడా ఇలానే సతాయిస్తాడు.. కానీ ఏం చేయలేకపోతున్నాం.. నీ ధైర్యానికి హ్యాట్సాఫ్ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. చదవండి: వెరైటీ ఆహ్వానం: గిఫ్ట్ విలువను బట్టే పెళ్లి భోజనం -
బంధం తగ్గుతోంది..
ముంబై: కరోనా మహమ్మారి కారణంగా గతేడాది మార్చి నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇలా ఇంటి నుంచి పని చేస్తున్న సమయంలో సంస్థలోని ఉద్యోగులకు, పై అధికారులకు మధ్య సమన్వయం తగ్గుతోందని ‘2022 అంతర్జాతీయ సాంస్కృతిక నివేదిక’ అనే పరిశోధనలో తేలింది. ఓ సీ ట్యానర్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఈ పరిశోధన జరిగింది. దీని ప్రకారం ప్రతి ముగ్గురు ఉద్యోగుల్లో ఒకరు తమ బాస్తో సంబంధాలు తెగిపోయాయని భావిస్తున్నట్లు తేలింది. ఉద్యోగుల మధ్య సంబంధాలు లేకపోవడం, ఉద్యోగులు– ఉన్నతాధికారుల మధ్య సమన్వయం కొరవడటం దీనికి కారణాలని పేర్కొంది. ఈ సమస్యలు కరోనా మహమ్మారి కారణంగా ఉత్పన్నమైనట్లు నివేదిక తెలిపింది. అంతర్జాతీయంగా పరిశోధన.. ప్రపంచవ్యాప్తంగా 21 దేశాల్లో 38 వేల మంది ఉద్యోగులు, ఉన్నతాధికారులు, హెచ్ఆర్ విభాగానికి చెందినవారు, ఎగ్జిక్యూటివ్ అధికారుల నుంచి సేకరించిన సమాచారంతో ఈ పరిశోధన వెలువడింది. ఇందులో భారత్ నుంచి 5,500 మంది పాల్గొన్నారు. వీటన్నింటిని ఓసీ ట్యానర్ ఇన్స్టిట్యూట్ క్రోడీకరించి 2022 అంతర్జాతీయ సాంస్కృతిక నివేదికను వెలువరించింది. ఉద్యోగుల మధ్య సంబంధాలు ఎంత ముఖ్యమనే విషయాన్ని ఈ పరిశోధన మరోమారు స్పష్టం చేసిందని ఇన్స్టిట్యూట్ ఉపాధ్యక్షుడు గ్యారీ బెక్స్ట్రాండ్ చెప్పారు. ప్రోత్సాహం లేదు.. 57 శాతం మంది ఉద్యోగులు తమ బాస్ల నుంచి ప్రోత్సాహాన్ని పొందడం లేదని పరిశోధనలో వెల్లడించారు. 62 శాతం మంది పై అధికారులు విజయం సాధించడం ఎలాగో చెబుతుండగా, 52 శాతం మంది మాత్రమే తమ ఉద్యోగుల విజయాల గురించి ఇతరులకు వివరిస్తున్నారు. ఉద్యోగుల మధ్య సమన్వయాన్ని పెంచడంలో ఉన్నతాధికారులు విఫలమైతే పరిస్థితులు మరింత దిగజారతాయని పరిశోధన పేర్కొంది. ఉద్యోగులను పట్టించుకోకపోతే, ఉద్యోగులు కూడా తమ సంస్థ గురించి పట్టించుకోవడం మానేస్తారని తెలిపింది. సంస్థలోని ముఖ్యమైన సందర్భాలను కలసి జరుపుకోవడం ద్వారా ఉద్యోగులకు ప్రోత్సాహం లభిస్తుందని, తద్వారా వారు బాగా పని చేస్తారని నివేదిక స్పష్టం చేసింది. కీలకాంశాలు.. పరిశోధనలో పాల్గొన్న 61 శాతం మంది ఉద్యోగులు తమకు నూతన పరిచయాలు కార్యాలయాల్లోనే అవుతాయని చెప్పారు. సామాజికంగా ఇతరులతో కలసి పని చేస్తే తమలోని ఉత్తమ నైపుణ్యాన్ని బయటకు తీసుకురాగలమని అభిప్రాయపడ్డారు. మరో 45 శాతం మంది ఉద్యోగులు.. గతేడాది నుంచి ఆఫీస్ వర్క్కు సంబంధించిన దైనందిన సమన్వయ కార్యక్రమాలు బాగా పడిపోయాయని చెప్పారు. 57 శాతం మంది సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా వరకు తగ్గిపోయిందని అభిప్రాయపడ్డారు. పని ప్రదేశంతో కనెక్షన్ తెగిపోయాక తమ పనితీరు 90శాతం వరకూ పడిపోయిందని కొందరు ఉద్యోగులు వెల్లడించారు. దీంతో పాటు పని వల్ల నీరసపడిపోవడం (బర్న్ఔట్) బాగా పెరిగిందని వెల్లడించారు. చదవండి: కోవిడ్ పోరులో కొత్త ఆశలు -
అసభ్య సందేశాలు.. బాస్ను చితకబాదిన మహిళ
బీజింగ్: ఆడవాళ్లు ఇంటి పట్టునే ఉండాలి.. కుటుంబ సభ్యులను బాగా చూసుకోవాలి.. వారికి కావాల్సినవన్ని అమర్చి.. ఆమె జీవితాన్ని కుంటుంబానికే అంకితం చేయాలి. ఉద్యోగాలు చేయడం అంటే పెద్ద నేరం చేసినట్లే. స్త్రీ అంటే నేటికి సమాజంలో చాలా మందికి ఇదే భావం. ఇక ఈ బంధనాలు తెంచుకుని ఉద్యోగాలు చేసే మహిళలు ఎదుర్కొనే సమస్యలు కోకొల్లలు. పనిలో ఏ మాత్రం జాప్యం జరిగినా.. ఆఫీసుకు కాస్త లేటుగా వెళ్లినా.. కొందరు పురుష ఉద్యోగులు ఇంటి పట్టున ఉండక.. వీరికి ఇవన్ని ఎందుకు అంటూ ఎద్దేవా చేస్తారు. ఇక బాస్ "మగానుభావుడైతే" ఆ కష్టాలు ఇంకో రకం. ఆ పెత్తనంతో ఆడవారిని వేధింపులకు గురి చేస్తారు. తమ మాట వినకపోతే.. టార్చర్ పెడతారు. బాస్ అనే కారణం చెప్పి ఫోన్ చేసి.. అసభ్య సందేశాలు చేస్తూ మహిళా ఉద్యోగులను వేధింపులకు గురి చేస్తారు. చాలా మంది ఆడవారు వీటన్నింటిని మౌనంగా భరిస్తారు. కానీ కొందరు మాత్రం ఎదురుతిరుగారు. అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో ఈ వీడియో చూస్తే బాగా అర్థం అవుతుంది. ప్రభుత్వ ఉద్యోగి అయిన ఓ యువతిని ఆమె బాస్ వేధింపులకు గురి చేస్తాడు. ఉన్నాతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. సహనం కోల్పోయిన సదరు ఉద్యోగిణి మాబ్ కర్ర తీసుకువచ్చి.. బాస్ను చితకబాదింది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరలవుతోంది. చైనాలోని హీలాంగ్జియాంగ్ ప్రావిన్స్లోని సుయిహువా, బీలిన్ జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగ సంస్థలో ఈ సంఘటన జరిగిందని చైనా టైమ్స్ న్యూస్ మీడియా తెలిపింది. ఈ వీడియోలో ఓ మహిళ తన బాస్ తనను ఎలా హింసించాడో వివరిస్తూ అతడిపై మాబ్ కర్రతో దాడి చేస్తుంది. తనకు అసభ్య సందేశాలు పంపాడని.. వార్నింగ్ ఇచ్చినా ఆగలేదని.. దాంతో ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేశానని అనడం వీడియోలో వినిపిస్తుంది. ఎన్ని చేసినా బాస్ ప్రవర్తనలో మార్పు రాలేదు. ఓపిక నశించిన సదరు యువతి మాబ్ కర్రతో బాస్పై దాడి చేస్తుంది. చితకబాదుతుంది. ఇక సదరు బాస్ తన మొహం కనిపించకుండా చేతులు అడ్డుపెట్టుకుని తనను వదిలి వేయాల్సిందిగా బతిమిలాడతాడు. తాను జోక్ చేద్దామని భావించి మెసేజ్ చేశానని తెలుపుతాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజనులు సదరు ఉద్యోగిణిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రతి మహిళ ఇంతే ధైర్యంగాఉండాలని కామెంట్ చేస్తున్నారు. చదవండి: హనీమూన్ కోసం రూ.18 లక్షలకు కొడుకును అమ్మిన తండ్రి -
వైరల్ వీడియో: బాస్ను చితకబాదిన మహిళ
-
బాస్ మీద కోపం.. డ్రింక్లో కరోనా రోగి లాలాజలం
ఇస్తాంబుల్: బాస్ మీద కోపంతో ఓ ఉద్యోగి కోవిడ్ రోగి లాలాజలంతో తన బాస్ని చంపేందుకు ప్రయత్నించాడు. వివరాల్లోకి వెళితే.. ఆగ్నేయ టర్కీలోని అదానాకు చెందిన ఇబ్రహీం ఉన్వర్డి కారు డీలర్షిప్ యజమానిగా పని చేస్తున్నాడు. రంజాన్ సిమెన్ అనే వ్యక్తి మూడేళ్లుగా అతడి దగ్గర ఉద్యోగం చేస్తున్నాడు. చెప్పిన పని చేస్తూ.. నమ్మకంగా ఉండటంతో ఇబ్రహీం అప్పుడప్పుడు రంజాన్ చేతికి డబ్బులు కూడా ఇచ్చే వాడు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం ఇబ్రహీం కారు అమ్మగా వచ్చిన 2,15,000టర్కిష్ లిరాలను(2,22,2160 రూపాయలు) రంజాన్ సిమెన్కి ఇచ్చాడు. ఆ మొత్తాన్ని తీసుకెళ్లి ఆఫీసులో జమ చేయాల్సిందిగా కోరాడు. అయితే ఇంత పెద్ద మొత్తం చేతికి రావడంతో రంజాన్ మనసులో చెడు ఆలోచనలు ప్రవేశించాయి. పైగా అప్పటికే అతడు లోన్ బకాయి ఉన్నాడు. ఈ క్రమంలో ఇబ్రహీం ఇచ్చిన డబ్బు తీసుకుని ఉడాయించాడు రంజాన్. దాంతో ఇబ్రహీం అతడి మీద పోలీసులకు ఫిర్యాడు చేయడమే కాక.. ఉద్యోగంలో నుంచి తొలగించాడు. అప్పటి నుంచి రంజాన్ బాస్ మీద పగ పెంచుకున్నాడు. ఎలాగైనా అతడిని చంపాలని భావించాడు. ఈ క్రమంలో ఓ దారుణమైన ఆలోచన చేశాడు. బాస్, అతడి కుటుంబ సభ్యులు తాగే డ్రింక్స్లో కరోనా వైరస్ సోకిన వ్యక్తి లాలాజలాన్ని కలిపి అందరిని ఒకేసారి చంపాలని భావించాడు. ఇందుకు గాను ఓ కరోనా రోగికి 50 టర్కిష్ లిరాలు (రూ. 516)చెల్లించి అతడి లాలాజలాన్ని కొన్నాడు. అయితే ఇబ్రహీం అదృష్టం కొద్ది రంజాన్ చేస్తోన్న దారుణం గురించి అతడికి ముందే తెలిసింది. రంజాన్ సహోద్యోగి ఒకరు దీని గురించి బాస్కు తెలపడంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సాక్ష్యాధారాలు సమర్పించాడు. దాంతో పోలీసులు రంజాన్ మీద హత్యానేరం కేసు నమోదు చేశారు. అయితే ఇంత జరిగినా రంజాన్ మాత్రం మారలేదు. ‘‘నేను నిన్ను వైరస్తో చంపడం కాదు.. ఈ సారి నీ పుర్రెని పుచ్చకాయాల పేల్చేస్తాను’’ అంటూ బాస్కి బెదిరింపు సందేశాలు పంపుతున్నాడట. ఇబ్రహీం దీని గురించి మాట్లాడుతూ.. ‘‘రంజాన్ను చూస్తే.. భయం వేస్తుంది. ప్రస్తుతం నేను, నా భార్య, పిల్లలు అందరం ఇంట్లోనే ఉంటున్నాం. మా సొంత ఇంట్లోనే మేం బందీలుగా బతుకుతున్నాం. ఇలా ఇంకేన్నాళ్లో’’ అంటూ వాపోయాడు. చదవండి: ‘ఓవెన్ వెలిగించమన్నారు.. చుట్టూ మాంసం ముక్కలు’ -
బాస్ మీద కోపం.. డేటింగ్ సైట్లలో ఫోన్ నంబర్
బెంగళూరు: బాస్ మీద కోపంతో ఓ వ్యక్తి అతడి ఫోన్ నంబర్ని డేటింగ్ సైట్లలో అప్లోడ్ చేశాడు. అంతేకాక యాజమాని పేరు మీద సెక్స్ టాయ్స్ బుక్ చేసి.. అతడి ఇంటికి పంపించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేయడంతో.. ఉద్యోగి చర్యలు వెలుగులోకి వచ్చాయి. వివరాలు.. బెంగళూరుకు చెందిన హరిప్రసాద్ జోషి అనే వ్యక్తి ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో కుటుంబ అవసరాల నిమిత్తం పీఎఫ్ మనీ డ్రా చేసుకోవాలనుకున్నాడు. దీని గురించి బాస్ అవినాష్ ప్రభుకు తెలిపాడు జోషి. అయితే వైరస్ కారణంగా వ్యాపారం నిలిచిపోయిందని చెప్పాడు యజమాని. అంతేకాక మునుపటి బిజినెస్ హెడ్ కూడా అవసరమైన పత్రాలను సమర్పించలేదని, అందువల్ల చెల్లింపు విడుదలలో ఆలస్యం జరిగిందని ఆయన పేర్కొన్నారు. మహమ్మారి ముగిసిన తర్వాత పీఎఫ్ డబ్బులు చేల్లిస్తానని ప్రభు, జోషికి హామీ ఇచ్చాడు. (4 నెలల్లో రూ. 30 వేల కోట్లు విత్డ్రా) కానీ డబ్బులు అత్యవసరం ఉండటంతో జోషి ఎదురుచూడటానికి ఇష్టపడలేదు. దాంతో దీని గురించి బాస్కు రోజు కాల్ చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగింది. దాంతో ప్రభు అస్సలు డబ్బు చెల్లించనని.. ఏం చేసుకుంటావో చేసుకోమని జోషిని బెదిరించాడు. బాస్ ప్రవర్తనతో విసిగిపోయిన జోషి.. అతడి భార్య, పిల్లలకు అసభ్యకరమైన మెయిల్స్ పంపాడు. ప్రభు ఫోన్ నంబర్ని డేటింగ్ సైట్లలో అప్లోడ్ చేశాడు. అంతేకాక వారి పేరు మీద సెక్స్ టాయ్స్ బుక్ చేశాడు. ఈ చర్యలతో విసిగిపోయిన ప్రభు దీని గురించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మొబైల్ నంబర్ ఆధారంగా ట్రాక్ చేసి జోషిని అరెస్ట్ చేశారు. అతడి మీద ఐటీ చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. -
‘బాస్’ కోసం ఫ్యాన్స్ మధ్య రగడ
సాక్షి, బెంగళూరు: కరోనా లాక్డౌన్ సమయంలో బాస్ అనే పదంపై దర్శకుడు పవన్ ఒడెయర్ చేసిన ట్వీట్ సినీ అభిమానుల మధ్య వాడీవేడి చర్చను రేకెత్తించింది. సినిమా చిత్రీకరణ సమయంలో సామాజీక దూరంను పాటిస్తాం, లవ్యూ బంగారం, సోదర, బాస్ అని ఒడెయర్ చేసిన ట్విట్కు హీరో యశ్ అభిమానులు అభినందనలు చెబుతుండగా, హీరో దర్శన్ అభిమానులు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. కన్నడ సినిమా రంగంలో ‘బాస్’ అనే పదం ఒక దర్శన్కు మాత్రమే దక్కుతుందని అయన ఫ్యాన్స్ వాదిస్తున్నారు. యశ్ను బాస్ అనడం జీర్ణించుకోలేక పోతున్నారు. దీంతో దర్శన్ అభిమానులు పవన్ ఒడెయర్పై ట్విట్టర్లో మండిపడుతున్నారు. ‘బాస్’ కోసం ఆది నుంచి గొడవలు నిజానికి యశ్–దర్శన్ మంచి స్నేహితులు. అయితే బాస్ అనే పదం కోసం వారి అభిమానుల మధ్య ట్విటర్లో మాటల యుద్ధం జరుగుతున్నా హీరోలు స్పందించలేదు. బాస్ అనే పదాన్ని ఎవరైనా ఉపయోగించవచ్చు అని యశ్ అభిమానులు వాదనకు దిగుతున్నారు. గతంలో శాండల్వుడ్లో ఎవరు బాస్ అనే విషయంపై పెద్ద వివాదం జరిగింది. హీరో శివరాజ్కుమార్కు చందనవన బాస్ అని బిరుదునివ్వడంతో గొడవకు తెరదించారు. మరో పక్క యశ్ ఇటీవల కొనుగోలు చేసిన కారుకు బాస్ అని అక్షరాలు వచ్చేలా 8055 నంబర్ను రిజిస్టర్ చేయించారు. రగడెందుకు: పవన్ ఒడెయర్ సినిమా రంగంలో సామాన్యంగా అందరినీ బాస్ పదంతో సంబోధిస్తారు. యశ్ను కలిసిన సందర్భంగా బాస్ అని అంటూ ట్వీట్ చేయటంపై ఇంత రాద్ధాంతం అవసరంలేదని దర్శకుడు పవన్ ఒడెయర్ అన్నారు. దర్శకులు, నిర్మాతలను తను బాస్ అని పిలుస్తానంటూ క్లారిటీ ఇచ్చారు. -
బాస్కే సైబర్ వేధింపులు!
సాక్షి, సిటీబ్యూరో: వర్క్ ప్లేస్ హెరాస్మెంట్లో ఇదో కొత్త కోణం. సాధారణంగా తమ కింద పని చేసే మహిళల్ని వేధించే బాస్ల వ్యవహారాలు తరచుగా వెలుగులోకి వస్తూనే ఉంటాయి. అయితే తన బాస్ అయిన ఓ మహిళను ఈ–మెయిల్స్ ద్వారా వేధించాడో ఉద్యోగి. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సాంకేతికంగా దర్యాప్తు చేశారు. బండ్లగూడకు చెందిన ఇ.లక్ష్మీకాంత్ను నిందితుడిగా గుర్తించి గురువారం అరెస్టు చేశారు. కర్నూలు జిల్లాకు చెందిన ఇ.లక్ష్మీకాంత్ రాజేంద్రనగర్ సమీపంలోని బండ్లగూడలో స్థిరపడ్డాడు. వివాహితుడైన ఇతడికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. న్యూ బోయిన్పల్లి ప్రాంతంలో ఉన్న ఓ లేడీస్ గార్మెంట్స్ డిజైనింగ్ సంస్థలో పని చేస్తున్నాడు. ఈ సంస్థను అదే ప్రాంతానికి చెందిన ఓ మహిళ నిర్వహిస్తున్నారు. లక్ష్మీకాంత్ ‘యువర్ మై బెస్ట్ లవర్’ పేరుతో జీమెయిల్ ఖాతా తెరిచాడు. దీన్ని వినియోగించి కొన్నాళ్ళుగా తన యజమానికే ప్రేమ సందేశాలు పంపిస్తున్నాడు. ఇది పోకిరీల పనిగా భావించిన ఆమె విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. అయితే వ్యవహారం శృతిమించి కొన్ని రోజుల నుంచి అశ్లీల చిత్రాలను ఈ–మెయిల్ చేయడం ప్రారంభించాడు. దీంతో ఆమె సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్కు ఫిర్యాదు చేశారు. ఇన్స్పెక్టర్ సీహెచ్ గంగాధర్ సాంకేతికంగా దర్యాప్తు చేశారు. ఈ–మెయిల్ ఐడీతో పాటు ఇతర అంశాల ఆధారంగా సదరు మహిళ వద్ద పని చేస్తున్న లక్ష్మీకాంతే నిందితుడిగా గుర్తించారు. గురువారం అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా తానే నేరం చేసినట్లు అంగీకరించాడు. ఆ మెయిల్స్ను నగరంలోని ఓ ఇంటర్నెట్ కేఫ్ నుంచి పంపినట్లు బయటపెట్టాడు. -
ఎంప్లాయ్స్ అంతా బాస్ పోయాడనుకున్నారు!
మోస్టర్: సాఫ్ట్వేర్ ఉద్యోగులను బాస్ మీటింగ్ ఉందంటూ పిలిచాడు. మీటింగ్కు వెళ్లిన వారితో ఉత్సాహంగా మాట్లాడాడు. తన ప్రసంగంతో అదరగొట్టాడు. ఇకమీటింగ్ ముగిసిందనగా.. ఒక్కసారిగా బిల్డింగ్ బాల్కనీలోంచి కిందకు దూకాడు. దీంతో ఒక్కసారిగా ఉద్యోగులు ఆందోళనతో పరుగులు తీశారు. కొందరైతే తమ బాస్ ఇక లేడనుకున్నారు. బోస్నియా అండ్ హెర్జిగోవినాలోని మోస్టర్లో క్రెజిక్ అనే క్రేజీ బాస్ చేష్టలకు ఉద్యోగులకు నోటమాటరాలేదు. ఎన్సాఫ్ట్ అనే సాఫ్ట్వేర్ సంస్థ ఫౌండర్, ఓనర్ అయిన క్రెజిక్.. కార్యాలయం నుంచి అలా కిందకు దూకగానే ఉద్యోగులు ఉరుకులు పరుగులతో బాల్కనీలోకి వచ్చి చూశారు. ముందుగా ఏర్పాటు చేసుకున్న క్రాష్ మ్యాట్ మీద బాస్ నవ్వుతూ కనిపించడంతో అంతా అవాక్కయ్యారు. తన ఉద్యోగులకు ‘పొలిటికల్ సూసైడ్’ అనే అంశం గురించి చెప్పడానికే తాను అలా చేశానని క్రెజిక్ వెల్లడించాడు. అన్నట్లు గతంలోనూ ఉద్యోగులను ఇలాంటి చేష్టలతో క్రెజిక్ షాక్కు గురిచేశాడట. ఆన్లైన్ గేమింగ్, స్పోర్ట్స్ బెట్టింగ్ ఇండస్ట్రీలో ఎన్సాఫ్ట్కు మంచి పేరుంది. -
దళితులపై దాడి అమానుషం
ఎమ్మెల్సీ బోస్ అమలాపురం : ఉప్పలగుప్తం మండలం సూదాపాలెంలో దళితులపై దాడి చేయడం అమానుషమని ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు పిల్లి సుభాష్చంద్రబోస్ అన్నారు. స్థానిక ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన శుక్రవారం పరామర్శించారు. దాడులు ఆగని కారణంగా గతంలో పార్లమెంట్లో ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్టు ఫర్ ఎస్సీ, ఎస్టీ చట్టం ఆమోదించారని, అయినా దాడులు ఆగకపోవడం దురదృష్టకరమని అన్నారు. ‘భారతదేశంలో అంటరానితనాన్ని నిర్మూలించినా అంబేడ్కర్ ఆశించిన ఒక కొత్త సామాజిక వ్యవస్థ చరిత్ర గర్భం నుంచి ఇంకా బయటపడలేదు’ అని ఓ సామాజిక విశ్లేషకుడు అన్న మాటలు ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు నిజమనిపిస్తున్నాయన్నారు. ఆర్థిక అసమానతల కారణంగానే ఇప్పటికీ దళితులపై దాడులు జరుగుతున్నాయన్నారు. దీనిని రూపుమాపడానికి, దళితులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఏర్పాటు చేసిన ఎస్సీ కార్పొరేషన్ను నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. ఎస్సీ సబ్ప్లాన్ నిధులు పక్కదారి పట్టించడం ద్వారా దళితులు ఆర్థికంగా నిలదొక్కుకునే పరిస్థితులను ప్రభుత్వం కల్పించడం లేదని బోస్ విమర్శించారు. -
ఆనందంలో బాస్ పై యూరిన్ పోశాడు...
లండన్ః కొందరికి ఆనందం వచ్చినా, ఆగ్రహం వచ్చినా పట్టలేరు. అనుకోని సంఘటన ఏది జరిగినా తట్టుకోలేకపోతారు. ఆ కోవకు చెందిన వ్యక్తి ప్రవర్తనే ఇప్పుడు యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది. ఓ ఆఫీసులో పనిచేస్తున్న ఉద్యోగికి అనుకోకుండా లాటరీ తగలడంతో చిత్రవిచిత్రంగా ప్రవర్తించాడు. బాస్ రూం లోకి వెళ్ళి అక్కడ యూరిన్ పోసి నానా హంగామా చేశాడు. సీసీటీవీ కెమెరాకు చిక్కిన ఆ షాకింగ్ ఘటన.. ఇప్పుడు వైరల్ గా మారింది. లండన్ లోని ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న వ్యక్తికి ఆకస్మాత్తుగా లాటరీ విన్ అయినట్లు సమాచారం అందింది. అనుకోకుండా అంతటి అదృష్టం వరించేప్పటికి ఆనందం పట్టలేకపోయాడు. హడావిడిలో ఏం చేస్తున్నాడో మర్చిపోయాడు. బాస్ రూం లోకి వెళ్ళి యూరిన్ పోసి కలంకలం సృష్టించాడు. జాక్ పాట్ తనను వరించిందని తెలియగానే ముందుగా.. కూర్చున్న కుర్చీలోనే ఎగిరెగిరి గంతులేశాడు. అనంతరం ఒళ్ళు తెలీకుండా ఆఫీసులో ఆటూ ఇటూ పరుగులు తీశాడు. దీంతో పక్కనే ఉన్న కొలీగ్స్ ఖిన్నులైపోయారు. కార్యాలయంలో ఎప్పుడూ తమతోపాటు.. ప్రశాంతంగా పనిచేసుకునే వ్యక్తి ఉన్నట్లుండి వింతగా ప్రవర్తించడంతో కాస్త భయపడ్డారు కూడా. అయితే అక్కడున్న వారు ఏం జరుగుతోందో తెలుసుకునే లోపే అతడు తిన్నగా బాస్ కేబిన్ లోకి ప్రవేశించాడు. అక్కడున్న పర్సనల్ సెక్రెటరీని భయభ్రాంతులకు గురి చేశాడు. తర్వాత బాస్ పై కూడా తన ప్రతాపం చూపించాడు. కుర్చీనుంచీ పడియేట్టు కొట్టడమే కాక ఏకంగా అతడిపై యూరిన్ పోసి హల్ చల్ చేసి... చివరికి ఏమీ తెలియనట్లు తన సీట్లోకి వెళ్ళిపోయాడు. సీసీ కెమెరాకు చిక్కిన ఆ వీడియో ఇప్పుడు య్యూట్యూబ్ లో వైరల్ అయింది. కార్యాలయాల్లోనూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని చెప్పకనే చెప్తోంది. -
ఆనందంలో బాస్ పై యూరిన్ పోశాడు...
-
అందరికీ ఇలాంటి బాస్ ఉంటే....
ఆఫీస్లో ఉన్నప్పుడు ఎవరైనా ఉద్యోగి నిద్రపోవడం అతని పై అధికారి చూస్తే ఏమంటారు? అతన్ని తీసేయడమో, మందలించడమో చేస్తారు. కానీ వర్జిన్ గ్రూప్ యజమాని రిచర్డ్ బ్రాన్సన్ మాత్రం తన కంపెనీకి చెందిన ఉద్యోగి నిద్రపోతుండగా ఫోటో దిగి తన బ్లాగ్లో పోస్ట్ చేశారు. ‘అతణ్ణి నేను నిద్ర లేపి ఉంటే ఏం అనుకుని ఉంటాడు? కలకంటున్నాననుకుని మళ్లీ పడుకునేవాడేమో’అని ఆ ఫోటో కింద రాసి తనలోని సెన్సాఫ్ హ్యూ మర్ని చూపించారు. ఆస్ట్రేలియాలోని వర్జిన్ గ్రూప్ అన్ని శాఖలను రిచర్డ్ సందర్శించాడు. ఆ సమయంలో క్లిక్ మనిపించిన ఫోటోనే ఇది. ఫోటో దిగాక కూడా రిచర్డ్ అతన్ని లేపకుండా తన తర్వాతి కార్యక్రమాల్లో మునిగిపోయాడు. -
మాజీ గర్ల్ఫ్రెండ్, బాస్పై కాల్పులు..
న్యూయార్క్: అమెరికాలోని ఫ్లోరిడాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. డ్రగ్స్ మత్తులో ఓ వ్యక్తి తన మాజీ గర్ల్ప్రెండ్ను కాల్చిచంపాడు. అనంతరం తనపై కోపాన్ని ప్రదర్శించిన బాస్పై కూడా కాల్పులు జరిపాడు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మాన్యుయల్ ఫాలిసియానో(50) అనే వ్యక్తి శుక్రవారం సాయంత్రం డ్రగ్స్ మత్తులో పైశాచికంగా మారాడు. తన మాజీ గర్ల్ఫ్రెండ్(45) ఇంటికి వెళ్లి.. అక్కడ ఆమెను ఇద్దరు పిల్లల ముందే దారుణంగా కాల్చిచంపాడు. అనంతరం.. అంతకు ముందు రోజు ఆఫీసులో తనపై దురుసుగా ప్రవర్తించాడన్న కారణంతో ఆఫీసుకు వెళ్లి బాస్పై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో సదరు అధికారి తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు విచారణ అధికారి జెర్రీ డెమింగ్స్ తెలిపారు. ఈ రెండు ఘటనలకు పాల్పడిన అనంతరం ఓ ఇంట్లో దాక్కున్న ఫాలిసియానోను పోలీసులు అరెస్టు చేశారు. -
టెకీలు ఇక హాయిగా నిద్రపోవచ్చు..
బీజింగ్: సాధారణంగా బాస్లంటే ఎలా ఉంటారు. పని త్వరగా పూర్తవ్వాలని.. ముందుగా నిర్ణయించిన సమయంలోగా టార్గెట్ పూర్తి చేయాలని ఆదేశిస్తారు. అలా జరగలేదో వారి తీరు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శివతాండవం తప్పదు. వాస్తవానికి ఎంతపనిచేస్తున్నా ఉద్యోగుల విషయంలో యజమానుల ఉదాసీనత కాస్తంత తక్కువగానే ఉంటుంది. కానీ, చైనాలో ఆ పరిస్థితి మారుతోంది. తమ సంస్థల్లో పనిచేసే టెక్కీల క్షేమమే తమ లక్ష్యంగా మార్పు చెందుతోంది. అందుకు ఉదాహరణగా బైషాన్ క్లౌడ్ అనే కంపెనీ నిలుస్తోంది. దాయి జియాంగ్ అనే వ్యక్తి బీజింగ్ లో ని ఓ మిషనరీ సంస్థలో పనిచేస్తున్నాడు. ఇందులో ఒక షిప్ట్ 72 గంటలు ఉంటుంది. అంటే మూడు రోజులు. దీంతో అతడు ఎప్పుడుపడితే అప్పుడు అలసిపోయి నిద్రలోకి జారుకుంటాడన్నమాట. పనివేళల్లో అతడు ఓ తేలికపాటి కునుకు తీసినా అతడిని బాస్ ప్రశ్నించడు. ఇలా అతడు కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగుల పరిస్థితి గత పదిహనేళ్లుగా ఇలాగే ఉంది. దీంతో దాయి పనిచేసే సంస్థ బైషాన్ క్లౌడ్ ఇప్పుడు ఏకంగా ఓ పన్నెండు బంక్ బెడ్స్ను ఏర్పాటుచేసింది. ఆఫీసులోనే ఓ పక్కకు ఒక దానిపై ఒకటి అల్మారాల మాదిరిగా పెట్టించింది. ఈ 72గంటల షిప్టుల్లో ఉన్నవారు.. ఉదయం, రాత్రి అనే తేడా లేకుండానే ఎప్పుడంటే అప్పుడు ఏం చక్కా అందులోకి వెళ్లి నిద్రపోవచ్చు. ఇదంతా ఎందుకంటే.. ఉద్యోగుల మానసిక పరిస్థితి కుదురుగా ఉంటేనే సరిగా పని చేయగలరని ఆ కంపెనీ చెబుతోంది. అమెరికాతో పోటీ పడుతున్న చైనాకు ఇలాంటి పరిస్థితులు సర్వసాధారణం అని.. తక్కువ ఖర్చుతో ఎక్కువ శ్రామిక నైపుణ్యం లభించే ఆ దేశంలో ఇలా పనుల్లో ఉండగా కునుకిపాట్లు ఉండనే ఉంటాయని చెప్తుంటారు. తీవ్రమైన పోటీ వాతావరణం నెలకొన్న చైనాలో ఇప్పుడు ఉద్యోగుల కోసం ఇలాంటి సౌకర్యాలు ఏర్పాటుచేస్తున్నారు. అంతేకాదు.. ఆఫీసుల్లోనే ఇంటిని తలపించే వాతావరణం కూడా సిద్ధం చేస్తున్నారు. అయితే, ఈ ఉద్యోగులు మాత్రం తమ కుటుంబాలను మిస్సవుతున్నామని ఫీలవుతున్నారు. -
ఆ బాస్ అద్భుతం!
చైనాః ఒకే సంస్థకు చెందిన వేలమంది సిబ్బంది ఒకేచోట చేరి హాయిగా ఆనందంగా గడపటం చాలా అరుదుగా చూస్తాం. సంవత్సరానికోసారి సెలవు పెట్టి ఎక్కడికైనా నాలుగు రోజులు విహారా యాత్రలకు వెళ్ళే అవకాశం కూడ కంపెనీల్లో పనిచేసే వర్కర్లకు అరుదుగానే ఉంటుంది. అటువంటిది ఆ చైనా కంపెనీ బాస్ మాత్రం తన వర్కర్లను ఎప్పుడూ ఆనందంగా, హాయిగా ఉండేట్లు చూసుకుంటాట్ట. వారి సరదాకోసం ఏకంగా కోట్లకొద్దీ డబ్బును ఖర్చుపెడుతున్నాడట. ఆ వివరాలేమిటో చూద్దాం. చైనాలోని డైరెక్ట్ మార్కెటింగ్ సంస్థ...అంతర్జాతీయ టైన్స్ గ్రూప్ యజమాని, బిజెనెస్ టైకూన్, లీ జినువాన్ తన సంస్థలో పనిచేసే సిబ్బందిని కుటుంబ సభ్యుల్లా చూసుకుంటారట. నిత్యం పనితో సతమతమయ్యే సిబ్బందికి ఆట విడుపుగా సంవత్సరానికోసారి వారిని ఏకంగా విదేశాలకు హాలీడే టూర్ తీసుకెడుతుంటారట. గత సంవత్సరం సుమారు 6,400 మంది సిబ్బందిని స్వంత ఖర్చులతో ఫ్రాన్స్ కు తీసుకెల్ళిన లీ.. ఈ సారి స్పెయిన్ పర్యటనకు తీసుకెళ్ళారు. ఈ విహార యాత్రకోసం ఆయన ఏకంగా సుమారు 552 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారు. టైయెన్స్ గ్రూప్ కంపెనీల్లో వివిధ వ్యాపారాలు నిర్వహిస్తున్న సుమారు 2500 మంది సిబ్బందిని 20 వరకూ అద్దె విమానాల్లో స్పెయిన్ కు తీసుకువెళ్ళిన ఆయన... రాజధాని మాడ్రిడ్ లో బస చేసేందుకు 1650 హోటల్ గదులను, పర్యటించేందుకు 70 ఏసీ బస్సులను ఏర్పాటు చేశారట. సెల్ఫీ స్టిక్ లతో ఫొటోలు, బుల్ ఫైట్స్, డ్యాన్సింగ్ హంగామాలతో ఆనందంగా ఐదు రోజుల పాటు జరిగే వీరి విహార యాత్రలో భాగంగా మాడ్రిడ్ తో పాటు, బార్సిలోనా, టోలెడో నగరాలను సందర్శించి తిరిగి మే 10వ తేదీ నాటికి చైనా చేరుకుంటారు. కంపెనీ యజమాని కుమారుడు లీ జాంగ్ మిన్ కూడ ఈ యాత్రలో పాల్గొంటున్నారు. కంపెనీ 21వ వార్షికోత్సవం సందర్భంగా ఈసారి ఏర్పాటు చేసిన పర్యటనకు అయ్యే ఖర్చులను పూర్తిగా కంపెనీయే భరిస్తోంది. సిబ్బందిని విదేశీ పర్యటను తిప్పాలన్న ఉద్దేశ్యం కంపెనీలో గతేడాది ప్రారంభమైంది. అప్పట్నుంచీ అదే సంప్రదాయాన్నికొనసాగిస్తూ.. కంపెనీ అధినేత లీ జినువాన్ ఇప్పుడు ప్రపంచంలోనే బెస్ట్ బాస్ అనిపించుకుంటున్నారు. అంతేకాదు చైనా కంపెనీలకు స్ఫూర్తిగా కూడ నిలుస్తున్నారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా చైనీస్ టైకూన్ లీ ఉద్యోగులను ఉత్సాహంగా ఉంచుతూనే తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునేందుకు ప్రయోగిస్తున్న మార్కెటింగ్ టెక్నిక్ ను అంతా అభినందిస్తున్నారు. సిబ్బందిని అధినేత ట్రీట్ చేస్తున్న విధానాన్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. -
అందగాళ్లకు అన్నీ కష్టాలే..!
టింగురంగళ్లలా తయారయ్యే అందగాళ్లను చూస్తే చాలామందికి కాస్తంత అసూయగానే ఉంటుంది. అందగాళ్లను అంతా అబ్బురంగా చూస్తారు. అమ్మాయిలూ ఎక్కువగా వారి వెంటే పడతారు. ఇలాంటి సహజ పరిణామాలన్నీ అందగాళ్లకు కాస్తంత ఆనందాన్నే ఇస్తాయి. మరి, వాళ్లకు కష్టాలేమిటి అనుకుంటున్నారా? అందగాళ్లకు బయట ఫాలోయింగ్ ఎలా ఉన్నా, కెరీర్లో మాత్రం ఇబ్బందులు తప్పవని లండన్ వర్సిటీ కాలేజీకి చెందిన స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్, అమెరికాలోని మేరీలాండ్ వర్సిటీలకు చెందిన పరిశోధకులు చెబుతున్నారు. అందగాళ్ల పట్ల వాళ్ల బాస్లకు కాస్తంత బెదురు ఉంటుందని, వీలైనంతగా వాళ్లను అణగదొక్కడానికే ప్రయత్నిస్తారని అంటున్నారు. అయితే, అందగత్తెలైన మహిళలకు కెరీర్లో ఇలాంటి సమస్యలేవీ ఎదురుకావని కూడా వారు చెబుతున్నారు. బాస్ల అసూయ కారణంగానే అందగాళ్లు కెరీర్లో నష్టపోతారని, ఏడాదిపాటు జరిపిన తమ అధ్యయనంలో ఈ విషయం తేలిందని వెల్లడిస్తున్నారు. -
వద్దు బాస్...వదిలేద్దాం!
సోల్ / అసహనం ఇదో భౌతిక ఉద్వేగం! ఉద్వేగం మానసికమైనది కదా! మరి ఈ ‘భౌతిక ఉద్వేగం’ ఏమిటి? ఇన్టాలరెన్స్ అన్నమాట. అంటే అసహనం. అసహనంలో మైండ్ కన్నా ముందు, భౌతికమైన పరిణామాలేవో పనిచేస్తాయి. అందుకే అసహనాన్ని ‘భౌతిక ఉద్వేగం’ అనడం! సామాన్యుల దగ్గర్నుంచి అసామాన్యుల దాకా ఏదో ఒక రకంగా.. ఎప్పుడో అప్పుడు.. లేదంటే అప్పుడప్పుడు ఇంకా కాదంటే ఎప్పుడూ వాళ్ల వాళ్ల మానసిక స్థితిగతులననుసరించి ఈ ఉద్వేగానికి గురికాక తప్పరు. ఆ మాటకొస్తే దేశాలు, సమాజాలూ అసహనాన్ని మోసాయి.. మోస్తున్నాయి! పర్యవసానాలూ అనుభవించాయి... అనుభవిస్తున్నాయి.. ఏ కాలానికి ఆ కాలం కొత్తే కాబట్టి పాత పాఠాలనే కొత్తగా నేర్చుకోవడానికి నేటికీ సిద్ధంగా ఉన్నాయి. అడిగింది అందకపోతే చిన్నపిల్లలకు అసహనం... ఆశించింది దొరక్కపోతే యువతలో అసహనం! ఇంట్లో తన మాట సాగకపోతే భర్తకు అసహనం.. ఆదరణ కరువైతే భార్యలో అసహనం! అహం ఓడిపోయే అసహనం పురుషుడైతే... అస్తిత్వం కోల్పోయిన అసహనం స్త్రీది! ఇక కులజాఢ్యం, మతమౌఢ్యం, వర్ణవివక్ష, అధికార దాహం, ఆక్రమణకాంక్ష, అగౌరవం.. మొత్తం మానవజాతి అసహనానికి కారణాలు! కరువు, వరదలు, భూకంపాలు, సునామీలు, గ్లోబల్వార్మింగ్ వంటివన్నీ ప్రకృతి అసహనానికి నిదర్శనాలు! ఏదైనా, ఎవరైనా తను మెచ్చినట్లు, తనకు నచ్చినట్లు ఉండకపోవడం అనే దగ్గర్నుంచే అసహనం మొదలవుతుంది. ఈ భావన మనిషి నుంచి సమాజానికి విస్తరిస్తే ఫలితమూ అంతే పరిధిలో ఉంటుంది. పుక్కిటనున్న పురాణాలను కదిపినా... చరిత్రగా మిగిలిన గతాన్ని కదిలించినా ఉదాహరణ హెచ్చరికలు కోకొల్లలు! రామాయణ, భారతాలూ... పురాణాల్లో సహనం ప్రస్తావన ఉన్నా కనిపించేది మాత్రం ఎక్కువగా అసహనమే! రామాయణంలోని రావణాసురుడి పాత్ర అసహనానికి అసలైన ఉదాహరణ. సీతాస్వయంవరంలో శివుడి విల్లు విరవలేని ఓటమి దగ్గర మొదలైన రావణుడి అసహనం.. తన చెల్లెలు శూర్పణఖ ముక్కుచెవులను లక్ష్మణుడు ఖండించడంతో పీక్కి చేరుతుంది. రాముడితో యుద్ధానికి నగారా మోగిస్తుంది. రావణుడి అసహనం అతడిని పరాజితుడిని చేస్తే.. రావణుడు అంటే అతడి తమ్ముడు విభీషణుడికి ఉన్న అసహనం, వాలిసుగ్రీవులిద్దరికీ ఒకరంటే ఒకరికి ఉన్న అసహనం ఈ యుద్ధంలో రాముడిని విజేతగా నిలబెట్టాయి! లంకలో బందీగా ఉన్న ‘సహనశీలి’ సీత హనుమంతుడితో వెళ్లడానికి నిరాకరించడం కూడా ఒకరకంగా రాముడి మీద అమెకున్న అసహనంగా అనుకోవచ్చేమో! ఆయనే వచ్చి తీసుకెళ్లాలని ఆమె ఆశ. ఆ ఆశ నెరవేరడంలో జరిగే జాప్యం వల్ల వచ్చిన అసహనం అది. మహాభారతానికి వస్తే అది అన్యాపదేశంగా బోధించింది అసహనాన్నే. అందులోని వృద్ధ పాత్రల నుంచి కుర్ర పాత్రల దాకా అందరిదీ అసహనమే. చివరకు కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుడు అర్జునుడికి చెప్పింది కూడా అసహనం గురించిన లెసనే! గతం... అంతా అసహనాల పుట్టే! చరిత్రలో నమోదైన ఏ యుద్ధానికి అయినా నాంది అసహనమే. అతిపెద్ద సామ్రాజ్యాలుగా పేరొందిన రోమ్ నుంచి మొగల్దాకా అన్ని రాజ్యాలు, రాజవంశాలు అసహనానికి బానిసలుగానే బతికాయి. అసహనం ఆసరాతోనే క్రుసేడులనే యుద్ధాలూ వీరంగం చేశాయి. ఆధునిక ప్రపంచ యుద్ధాలకూ ఆజ్యంపోసింది అసహనమే. మొదటి ప్రపంచయుద్ధానికి సామ్రాజ్య విస్తరణ కాంక్ష విత్తు నాటితే రెండో ప్రపంచ యుద్ధానికి జాత్యహంకారమనే అసహనం బీజమైంది. తత్ఫలితమే హిట్లర్ పేరుపక్కన నియంత అనే సఫిక్స్ చేరింది. ప్రాంతాల మధ్యే కాదు... అసహనం మనిషి నుంచి సమూహానికి పాకి ప్రాంతాలుగా విడగొట్టిన దుదృష్టకర సంఘటనలూ ఉన్నాయి. దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇండియా, పాకిస్తానే! కులం, మతం, చివరకు చర్మం రంగును సాకుగా చేసుకొని మనుషుల మధ్య సంబంధాలను చెడగొట్టి వివక్ష అనే పదాన్ని సృష్టించిన ఘనతా అసహనానిదే. అంటరానితనాన్ని ఉనికిలోకి తెచ్చిన కీర్తీ దానిదే. వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ కూల్చిన అపకీర్తీ దానికే! ఆఫ్టనిస్తాన్ను మట్టిదిబ్బగా మిగిల్చిన దోషమూ అసహనానిదే. ఇజ్రాయేల్, పాలెస్తీనాల మధ్య సాగుతున్న మారణహోమం తాలూకు పాపభారాన్ని మోస్తున్నదీ అసహనమే. ఆగని ఆగడం... ‘అసహనం’ మిగిల్చిన భయోత్పాతాలు భూతంలా వర్తమానాన్ని వెంటాడుతున్నా... దాన్ని జయించే సాహసం చేయట్లేదు ప్రపంచం. పైగా కొత్తగా సాధించుకున్న సాంకేతికత దానికి శక్తినిచ్చే పోషకంగా మారింది. చాలా సౌకర్యంగా మనకు తెలియకుండానే మన సహనాన్ని రీప్లేస్ చేస్తోంది. అందుకే అప్పుడు భూమి కోసం దానిమీదున్న మనుషులతో యుద్ధం చేస్తే ఇప్పుడు భూమిలో ఉన్న వనరుల కోసం మనుషులకు మనుగడ లేకుండా చేస్తోంది అసహనం. భరిస్తున్న ప్రకృతిని కూడా గిల్లుతోంది. ప్రకోపంతో కంపిస్తున్న ప్రకృతి పట్ల డిజాస్టర్ మేనేజ్మెంట్తో నిర్లక్ష్యంగానే ఉంటోంది తప్ప సహనంతో చెలిమితో దాన్ని మేనేజ్ చేసుకోవాలనే ఇంగితాన్ని మాత్రం గ్రహించట్లేదు. నాగరికత అంటే మనం నేనుగా మారడం కాదు.. నేను మనం అవడం! సహనం నేనును మనంగా చూపిస్తుంది. అసహనం మనల్ని నేనుగా మారుస్తుంది! నేను మనంగా ఆలోచించడమే మతం... అంటే ఇప్పటికీ మనం అసహనానికి వెట్టిచేస్తూ అనాగరికులుగానే ఉన్నామన్నమాట! మన దేశంలో జరుగుతున్న ప్రస్తుత పరిణామాలే దీనికి అద్దం పడుతున్నాయేమో! - సరస్వతి రమ ఆటమ్... అసహనమ్! రెండో ప్రపంచ యుద్ధంలో అటం బాంబ్ను ఉపయోగించడంలో యూదులు కీలకపాత్ర వహించారట. జర్మనీలోని నాజీల అసహనానికి గురైన యూదులు ఆ యుద్ధంలో నాజీల మీదే ఆటమ్బాంబ్ను ప్రయోగించాలని పథకం పన్నారు. కానీ వాళ్లు సరెండర్ కావడంతో ఆ బాంబ్ జపాన్మీద ప్రయోగించారట. ప్రపంచంలో ఎక్కువ అసహనాన్ని అనుభవించింది యూదులు అని చరిత్ర చెబుతోంది. మూడొంతుల ప్రపంచాన్ని ఆక్రమించిన రోమన్ సామ్రాజ్యం, దాని చక్రవర్తులు మొదట్లో పరమత సహనశీలురుగానే ఉన్నారట. పౌరులు చక్రవర్తికి విధేయులుగా ఉండాలనే పట్టింపు తప్ప వారి మతవిశ్వాసాల జోలికి వెళ్లలేదట. కానీ తర్వాత కాలంలోనే అధికార దురహంకారంతో పరమత అసహనానికి లోనయ్యారట. -
'బాస్' చంద్రబాబే: ఛార్జ్షీటులో ఏసీబీ
హైదరాబాద్ : సంచలనం సృష్టించిన 'నోటుకు కోట్లు' కేసుకు సంబంధించిన ఛార్జ్షీటులో టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరు చేర్చినట్లు ప్రముఖ ఆంగ్ల దినపత్రిక 'టైమ్స్ ఆఫ్ ఇండియా' ఓ కథనం ప్రచురించింది. 'క్లైయిమ్స్ బాస్ ఈజ్ ఏపీ సీఎం' అంటూ ఆ పత్రిక మొదటి పేజీలో వార్తను వేసింది. ఓటుకు కోట్లు కేసు ఛార్జ్షీటులో చంద్రబాబు నాయుడు పేరును చేర్చినట్లు ఏసీబీ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వి.సురేందర్ రావు తెలిపినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటేయాలంటూ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్తో రూ.ఐదు కోట్లకు ఒప్పందం కుదుర్చుకుని, అడ్వాన్స్గా రూ. 50 లక్షలిస్తూ రేవంత్రెడ్డి రెడ్హ్యాండెడ్గా ఏసీబీకి పట్టుబడిన విషయం తెలిసిందే. సెబాస్టియన్ ఫోన్ నుంచి చంద్రబాబు స్టీఫెన్సన్తో మాట్లాడిన సంభాషణతోపాటు చంద్రబాబు ఆదేశాల మేరకే తాను మాట్లాడేందుకు వచ్చానంటూ రేవంత్రెడ్డి పదేపదే చెప్పిన సంభాషణల ఆధారంగా బాబు కనుసన్నల్లోనే ఈ వ్యవహారం నడిచినట్లు ఏసీబీ నిర్ధారణకు వచ్చింది. ఫోన్ కాల్స్ సంభాషణల ఆధారంగా 'బాస్' చంద్రబాబు నాయుడే అని నిర్థారించిన ఏసీబీ..ఈ మేరకు ఆయన పేరును ఛార్జ్షీటులో చేర్చినట్లు తెలుస్తోంది. ఈ కుంభకోణానికి చంద్రబాబే సూత్రధారి అనేందుకు పక్కా ఆధారాలున్న నేపథ్యంలో బాబు పేరు ఛార్జ్షీట్లో చేర్చినట్లు సమాచారం. అలాగే ఓటుకు కోట్లు ప్రలోభాల పర్వం వెనుక ఉన్న కీలక వ్యక్తుల పాత్రపై పూర్తి ఆధారాలు సేకరించిన ఏసీబీ.. మరో వారం రోజుల్లో అనుబంధ చార్జిషీట్ దాఖలు చేయనున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు బుధవారం ఉదయం తన నివాసంలో డీజీపీ రాముడు, ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ, పలువురు పోలీస్ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ఓటుకు కోట్లు వ్యవహారంలో ఏసీబీ ఛార్జిషీటు, భవిష్యత్ పరిణాలపై పోలీస్ ఉన్నతాధికారులతో చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంలో ఈడీ కూడా రంగంలోకి దిగుతుందన్న వార్తలతో చంద్రబాబు ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగా ఓటుకు కోట్లుతో సంబంధమున్న అనేక మంది ఫోన్ సంభాషణల సారాంశాన్ని డాక్యుమెంట్ల రూపంలో కోర్టుకు సమర్పించినట్లు సమాచారం. ఈ కేసులో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డితో పాటు తెలుగుదేశం పార్టీ క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు హ్యారీ సెబాస్టియన్, ఉదయ సింహ, మత్తయ్య (ప్రస్తుతం పరారీలో ఉన్నారు)లను నిందితులుగా పేర్కొంటూ అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్టు)లోని సెక్షన్ 12, ఐపీసీ సెక్షన్లు 120(బి)(నేరపూరిత కుట్ర), 34 (కామన్ ఇంటెన్షన్) కింద అభియోగాలను మోపుతూ బుధవారం 25 పేజీల చార్జిషీట్ను దాఖలు చేసిన ఏసీబీ ఇందులో 39 మందిని సాక్షులుగా పేర్కొంది. -
‘బాస్’ఆధారాలు లభ్యం!
- సండ్ర రెండో రోజు ఏసీబీ కస్టడీలో కీలక అంశాలు వెల్లడి - సెబాస్టియన్తో కలిపి గంటన్నర పాటు విచారణ - ఎమ్మెల్యేల కొనుగోళ్లపై ప్రశ్నల వర్షం - ముగిసిన సండ్ర కస్టడీ.. చర్లపల్లి జైలుకు తరలింపు సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసులో సూత్రధారికి సంబంధించి ఏసీబీ అధికారులకు కీలక ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించినవారి సంభాషణల్లోని ‘బాస్’, ‘సార్’ ఎవరు, వారి లక్ష్యం ఏమిటనేదానిని దాదాపు నిర్ధారించుకున్నట్లు సమాచారం. రెండు రోజుల కస్టడీలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను విచారించిన ఏసీబీ అధికారులు.. ఆయన నుంచి దీనికి సంబంధించిన వివరాలు సేకరించారని తెలిసింది. ఈ కేసులో రెండో నిందితుడు సెబాస్టియన్ను శుక్రవారం ఏసీబీ కార్యాలయానికి పిలిచిన అధికారులు ఆయనను సండ్రతో పాటు ఎదురెదురుగా కూర్చోబెట్టి ప్రశ్నించినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఈ కేసులో కీలకమైన ‘మిస్సింగ్ లింకు’లను రాబట్టినట్లు తెలుస్తోంది. ఇక సండ్ర రెండు రోజుల ఏసీబీ కస్టడీ ముగియడంతో.. ఆయనను అధికారులు కోర్టులో హాజరుపరిచి, జైలుకు తరలించారు. ఎదురెదురుగా కూర్చోబెట్టి.. కస్టడీలో తొలిరోజు సండ్ర వ్యవహార శైలిని దృష్టిలో ఉంచుకుని రెండో రోజు ఏసీబీ అధికారులు రూట్ మార్చారు. బాగా ‘తర్ఫీదు’ పొందిన సండ్ర నుంచి ఎలాగైనా సమాచారం రాబట్టేందుకు.. ఈ కేసులో రెండో నిందితుడిగా ఉన్న సెబాస్టియన్ను ఎదురుగా కూర్చోబెట్టి ప్రశ్నించినట్లు తెలిసింది. తద్వారా రెండో రోజు విచారణ కాస్త సఫలీకృతమైనట్లు సమాచారం. సండ్రను శుక్రవారం ఉదయం సిట్ కార్యాలయం నుంచి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. తొలుత సండ్ర గన్మ్యాన్ లచ్చు గతంలో ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఏసీబీ అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. సండ్ర మే 29న మహానాడు ముగిసిన తర్వాత 30వ తేదీన తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నివాసానికి వెళ్లడం, తర్వాత ఎన్టీఆర్ ట్రస్టుభవన్కు, అట్నుంచి లేక్వ్యూ అతిథి గృహానికి వెళ్లడం వంటి అంశాలను లచ్చు తన వాంగ్మూలంలో వివరించారు. ఇలా ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని ఏసీబీ అధికారులు సండ్రను సూటిగా ప్రశ్నించినట్లు తెలిసింది. అయితే సండ్ర వీటికి కూడా పార్టీ పనులు, ఇతర వ్యవహారాలు అంటూ అస్పష్టమైన సమాధానాలే ఇవ్వడానికి ప్రయత్నించారని అధికారవర్గాల ద్వారా తెలుస్తోంది. మే 31న రేవంత్రెడ్డి నేరుగా రూ.50 లక్షలు తీసుకుని స్టీఫెన్సన్ నివాసానికి వెళ్లడం పట్ల సండ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ఏసీబీ వద్ద సమాచారం ఉంది. అందుకు అనుగుణంగా ‘ఎమ్మెల్యేలను ఎవరు కొనుగోలు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, తదితర అంశాలు మీకు ముందే తెలుసా?..’ అని సండ్రను ప్రశ్నించినట్లు సమాచారం. కేసులో ఏ2 నిందితుడిగా ఉన్న సెబాస్టియన్ను పిలిపించి ఇద్దరినీ ఎదురెదురుగా కూర్చోబెట్టి గంటన్నర పాటు ప్రశ్నించగా... ఈ కేసుకు సంబంధించిన అనేక మిస్సింగ్ లింకులు బయటకు వచ్చినట్లు తెలిసింది. జైలుకు తరలింపు శుక్రవారం సండ్ర కస్టడీ గడువు ముగియడంతో ఏసీబీ అధికారులు ఆయనను ప్రత్యేక కోర్టులో హాజరుపర్చగా.. ఈనెల 21 వరకు రిమాండ్కు తరలించాలని న్యాయమూర్తి లక్ష్మీపతి ఆదేశించారు. కస్టడీ సమయంలో ఏసీబీ అధికారులు ఏమైనా ఇబ్బంది పెట్టారా, మంచి ఆహారం ఇచ్చారా? అని న్యాయమూర్తి ప్రశ్నించగా.. అన్నీ మంచిగానే చూశారని సండ్ర చెప్పారు. అనంతరం పోలీసులు ఆయనను చర్లపల్లి జైలుకు తరలించారు. జనార్దన్ పాత్రపై ఆరా.. సండ్ర, సెబాస్టియన్ మధ్య సాగిన ఫోన్ సంభాషణల్లో తెరపైకి వచ్చిన జనార్దన్ ఈ వ్యవహారంలో పోషించిన పాత్ర పట్ల ఏసీబీ ప్రత్యేకంగా ఆరా తీసింది. మే 30న ఉదయం బాబు నివాసం నుంచి నేరుగా ఎన్టీఆర్భవన్కు వెళ్లినది జనార్దన్ను కలవడానికేనా, ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం జనార్దన్ నేతృత్వంలోనే జరిగిందా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం. ఇలా వీరిని కలిపి, వేర్వేరుగా విచారించిన అధికారులు... ‘బాస్’తో పాటు జనార్దన్కు సంబంధించిన కీలక అంశాలను సేకరించారని తెలిసింది. వీటి ఆధారంగా దర్యాప్తును కొనసాగిస్తూ కేసుతో సంబంధమున్న వారిపై చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. సోమవారం నుంచి ‘ఓటుకు కోట్లు’ కేసులో ‘పెద్దలకు’ సంబంధించిన కీలక ఘట్టం ప్రారంభం కానున్నట్లు సమాచారం. -
’బాస్’ గిమ్మిక్కులు
-
’బాస్’ గిమ్మిక్కులు
- ‘ఓటుకు కోట్లు’ కేసు నుంచి తప్పించుకునేందుకు బాబు యత్నాలు - ఏసీబీ విచారణకు హాజరుకావొద్దంటూ సండ్రపై ఒత్తిడి - తన సలహాదారుగా ఫోరెన్సిక్ నిపుణుడి నియామకం - ‘తెలంగాణ’ కాల్డేటా ఇవ్వాలంటూ మొబైల్ ఆపరేటర్లపై ఒత్తిళ్లు.. పరాకాష్టకు చేరిన అధికార దుర్వినియోగం - కీలక వివరాలు వెల్లడించకుండా సండ్రకు ‘శిక్షణ’ - బెజవాడకు తరలింపు.. అధికారుల ఆధ్వర్యంలో తర్ఫీదు - ఫోరెన్సిక్ నిపుణుడి నియామకంపై అప్రమత్తమైన తెలంగాణ సర్కారు - ఫోరెన్సిక్ డెరైక్టరేట్లో కట్టుదిట్టమైన చర్యలు సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసు నుంచి ఎలాగైనా బయటపడేందుకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ‘అన్ని’ రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అడుగడుగునా అడ్డదారులు తొక్కుతున్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ఏపీ పోలీస్ అధికారులను అడ్డంగా వాడేసుకుంటున్నారు. ఏసీబీ విచారణకూ అడ్డుపడే యత్నం చేస్తున్నారు. తాజాగా శుక్రవారం ఏసీబీ విచారణకు హాజరుకావాల్సిన ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను డుమ్మా కొట్టించడం, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్, ఏసీబీ డీజీ ఏకే ఖాన్, నిఘా విభాగం ఐజీ శివధర్రెడ్డిల కాల్డేటా కోసం మొబైల్ ఆపరేటర్లపై ఒత్తిడి తేవడం, ఫోరెన్సిక్ నిపుణుడు కేపీసీ గాంధీని ఏపీ ప్రభుత్వ సలహాదారుగా నియమించుకోవడం వంటివన్నీ అందులో భాగమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ చర్యలను చూసి ప్రజలు, ఏపీ పోలీస్ అధికారులే విస్తుపోతుండడం గమనార్హం. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటేయాలని నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్తో రూ.5కోట్లకు ఒప్పందం కుదుర్చుకుని, అడ్వాన్స్గా రూ.50లక్షలు ఇస్తూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి రెడ్హ్యాండెడ్గా ఏసీబీకి దొరికిపోయిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో సూత్రధారి చంద్రబాబేనని ఏసీబీ నిర్ధారణకు వచ్చింది. ఈ క్రమంలో ఇద్దరు రాజ్యసభ సభ్యుల బ్యాంకు ఖాతాల నుంచి పెద్దఎత్తున డబ్బు డ్రా చేయడంపై టీడీపీ ఎమ్మెల్యే వెంకట వీరయ్య నుంచి వాస్తవాలు రాబట్టాలన్న ఏసీబీ యత్నానికి చంద్రబాబు, ఆయన కోటరీ అడ్డుపడినట్లు ప్రచారం జరుగుతోంది. సండ్రను విచారిస్తే తమ బండారం బయటపడుతుందని భావించిన ఆ ఇద్దరు రాజ్యసభ సభ్యులు, లోక్సభ మాజీ సభ్యుడొకరు తెర వెనుక తీవ్ర ప్రయత్నాలు చేసినట్లు తెలిసింది. గురువారం దాకా విశాఖపట్నంలోని తన కుమారుడి వద్ద ఉన్న సండ్ర శుక్రవారం ఉదయం హైదరాబాద్కు వచ్చి ఏసీబీ విచారణకు హాజరుకావాలని భావించారు. కానీ ఆయన హాజరుకాకుండా అడ్డుకున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు తన మంత్రివర్గ సహచరుడు ఒకరికి ఫోన్ చేసి సండ్రను నిలువరించాలని ఆదేశించినట్లు సమాచారం. అంతేకాదు సండ్రను రోడ్డు మార్గంలో శుక్రవారం ఉదయం విజయవాడకు తరలించాలని సలహా ఇచ్చినట్లు తెలిసింది. అయితే విచారణకు హాజరుకాకపోతే తన తప్పు అంగీకరించినట్లు అవుతుందని అంతకుముందు సండ్ర ఆ ఇద్దరు టీడీపీ రాజ్యసభ సభ్యులతో వాదించినట్లు తెలిసింది. కానీ వారు బెంబేలెత్తి చంద్రబాబు ద్వారా సండ్రను నిలువరించగలిగారు. ముందు జాగ్రత్తగా.. అవినీతి కేసు నుంచి బయటపడేందుకు చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. అడుగడుగునా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ఏపీ పోలీసులను స్వప్రయోజనాలకు వాడుకుంటున్నారు. తాజాగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే వెంకట వీరయ్యకు పోలీస్ ఇంటరాగేషన్పై శిక్షణ ఇప్పించే బాధ్యతను ఓ పోలీసు ఉన్నతాధికారికి అప్పగించినట్లు తెలిసింది. ఏసీబీ విచారణకు హాజరుకావడానికి ముందు ఆయనకు ఇంటరాగేషన్పై తర్ఫీదు ఇవ్వాలని చంద్రబాబు ఆ అధికారిని ఆదేశించారు. ఇలాంటి కేసుల విచారణలో ఆరితేరిన ముగ్గురు సీనియర్ అధికారులు శుక్రవారం సాయంత్రం నుంచే ఈ శిక్షణ మొదలుపెట్టారు. ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు అనుసరించిన మార్గాలు-వాటిపై ఏసీబీ అధికారులు అడిగే ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు చెప్పాలో వారు విశదీకరిస్తారు. దాదాపు మూడు రోజుల పాటు సండ్రకు ఈ శిక్షణ ఇచ్చే అవకాశం ఉంది. ఎక్కడా చిన్న పొరపాటు కూడా తలెత్తకుండా, పొరపాటున కూడా ఆయన ఎవరి పేర్లు వెల్లడించకుండా జాగ్రత్తలు తీసుకునేలా లోక్సభ మాజీ సభ్యుడొకరు దగ్గరుండి ఈ శిక్షణను పర్యవేక్షిస్తున్నారు. తాను వైద్యుల సూచన మేరకు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నానని ఏసీబీకి రాసిన లేఖలో పేర్కొన్న సండ్ర... తాను ఏఆస్పత్రిలో చికిత్స పొందుతున్నదీ చెప్పలేదు. దీంతో విచారణాధికారికి పూర్తి వివరాలు ఇవ్వకుండా చట్టాన్ని ఉల్లంఘించడంపై సండ్రపై మరో కేసు నమోదు చేసే అవకాశముంది. సండ్ర తన రెండు ఫోన్లను స్విచాఫ్ చేసుకోవడం కూడా ఏసీబీ నోటీసును పట్టించుకోలేదన్న భావన కలిగించడమేనని సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఇక సండ్ర గత వారం రోజులుగా ఎక్కడ తిరుగుతున్నారు, ఎవరెవరిని కలుస్తున్నారు వంటి వివరాలను ఏసీబీ ఎప్పటికప్పుడు సేకరిస్తూనే ఉంది. అచ్చంగా లంచం కేసు చుట్టే.. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్తో పాటు ఏసీబీ డీజీ ఏకే ఖాన్, నిఘా విభాగం అధిపతి శివధర్రెడ్డిల కాల్డేటా ఇవ్వాలంటూ ఏపీ పోలీస్ ఉన్నతాధికారులు మొబైల్ ఆపరేటర్లపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకువస్తున్నారు. రేవంత్రెడ్డి అరెస్టుకు వారం ముందు నుంచి అరెస్టయ్యాక వారం వరకూ వారి ఫోన్ నంబర్లకు సంబంధించిన కాల్డేటా కావాలని కోరుతున్నారు. ఈ కాల్డేటా ప్రముఖులది కావడంతో ఇచ్చేందుకు మొబైల్ ఆపరేటర్లు ససేమిరా అన్నారు. కాల్డేటా ఇవ్వాలంటూ ఏపీ సీఎం నుంచే తమకు ఒత్తిడులు వస్తున్నాయంటూ వారు తెలంగాణ పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చారు. మరోవైపు వ్యక్తిగతంగా తాను కేసు నుంచి బయటపడే మార్గాల అన్వేషణకు చంద్రబాబు ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్న తీరు ఏపీ పోలీస్ ఉన్నతాధికారులకేజుగుప్స కలిగిస్తోంది. ‘వారం రోజులుగా మాకు మరో పనే లేకుండా పోయింది. అచ్చంగా లంచం కేసు చుట్టే మేం పరిభ్రమిస్తున్నాం..’ అని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించడం గమనార్హం. మామూలుగా కాల్ డేటా తీసుకోవడం తమకు సమస్య కాదని, అవినీతి కేసు బయటపడిన తరువాత ఇలా కాల్డేటా అడగడమే ఇబ్బందిగా మారిందని ఆ అధికారి ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాగోలా తప్పించుకునేందుకే.. నామినేటెడ్ ఎమ్మెల్యేతో రూ.5 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుని అడ్వాన్స్గా రూ.50 లక్షలు ఇస్తూ రేవంత్రెడ్డి అడ్డంగా దొరికిపోయిన వ్యవహారంలో వీడియో, ఆడియో రికార్డులకే అత్యధిక ప్రాధాన్యత. రేవంత్ లంచం ఇవ్వజూపిన వీడియోతో పాటు, స్టీఫెన్సన్తో చంద్రబాబు మాట్లాడిన ఆడియో రికార్డులు ఇప్పుడు హైదరాబాద్ ఫోరెన్సిక్ డెరైక్టరేట్లో ఉన్నాయి. అధికారులు మూడు బృందాలుగా ఏర్పడి వాటిని పరీక్షిస్తున్నారు. నెలాఖరులోగా కోర్టుకు నివేదిక ఇచ్చేందుకు శ్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫోరెన్సిక్ విభాగం మాజీ డెరైక్టర్, నిపుణుడు కూడా అయిన కేపీసీ గాంధీని ఏపీ ప్రభుత్వ సలహాదారుగా నియమించుకుంటూ చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించడం రాజకీయ, అధికారవర్గాలను విస్మయానికి గురిచేసింది. ఈ పరిణామంతో తెలంగాణ ప్రభుత్వం ఫోరెన్సిక్ విభాగంలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. అనుమానితులెవరినీ వీడియో, ఆడియో ఫుటేజీలను పరీక్షించే ప్రదేశాలకు అనుమతించవద్దని ఆదేశించింది. కేసు నుంచి బయటపడే మార్గాల అన్వేషణలో భాగంగానే గాంధీ నియామకం జరిగిందని అధికారవర్గాలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. ఇంత తెంపరితనమా..? - ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థులను ‘ఎలాగైనా’ గెలిపించుకొనేందుకు ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ప్లాన్ వేశారు. - తెలంగాణలోని ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు గాలం వేశారు. నామినేటెడ్ ఎమ్మెల్యేకు రూ.5కోట్లు ముడుపులు ఇవ్వజూపారు.. మిగతా వారికి మరింత భారీగా ‘ఆఫర్’ చేశారు. రూ.100కోట్లు ఖర్చుచేసి ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. - దీంతోపాటు ఏపీలోని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం రూ.150కోట్లదాకా సమకూర్చుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. - ఈ సొమ్ము కోసం అడ్డదారులు తొక్కారు.. పారిశ్రామికవేత్తల నుంచి ముడుపులు తీసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. - ఐదారుగురు ఎమ్మెల్సీల కోసమే రూ.150కోట్ల ఖర్చుకు సిద్ధం కావడంతో గత ఏడాదిగా మరెంతో ‘భారీగా’ అవినీతి జరిగి ఉండవచ్చనే అభిప్రాయాలూ వ్యక్తమయ్యాయి. - నామినేటెడ్ ఎమ్మెల్యేకు రూ.50 లక్షలు లంచం ఇస్తూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి అడ్డంగా దొరికిపోయారు. - ఈ వ్యవహారానికి సూత్రధారి చంద్రబాబేనని ఏసీబీ నిర్ధారించింది. బండారం బయటపడడంతో బాబు ఎదురుతిరిగారు. ‘ట్యాపింగ్’ అంటూ అవాస్తవ ఆరోపణలతో అడ్డుకోజూశారు. ఆ యత్నం ఫలించకపోయేసరికి.. అధికార దుర్వినియోగానికి దిగారనే ఆరోపణలు వస్తున్నాయి. - కేసు నుంచి బయటపడేందుకు అనేక రోజుల పాటు పోలీస్ ఉన్నతాధికారులను చంద్రబాబు తన నివాసానికే పరిమితం చేశారు. - తాజాగా ఏసీబీ విచారణకు హాజరుకావాల్సిన ఎమ్మెల్యే సండ్రను అడ్డుకుని, విజయవాడకు తరలించినట్లు ఏసీబీ గుర్తించింది. - ఈ కేసులో ఫోరెన్సిక్ నివేదిక కీలకం కావడంతో ఆ రంగానికి చెందిన నిపుణుడిని ఇప్పుడు ఏపీ ప్రభుత్వ సలహాదారుగా నియమించుకున్నారు. -
8 మంది ఎమ్మెల్యేల బాబు వ్యూహం
-
‘బాస్’ టార్గెట్ 8
► 8 మంది ఎమ్మెల్యేల బాబు వ్యూహం ► టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపు కోసం భారీ ఆపరేషన్ ► ఎంత ఖర్చయినా పర్లేదంటూ టీటీడీపీ నేతలకు నిర్దేశం ► రేవంత్, ఎర్రబెల్లి, రమణ, సండ్రలకు బాధ్యతలు ► పలువురు ఎమ్మెల్యేలకు ఐదేసి కోట్లు ఆఫర్ చేసిన నేతలు ► సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లిన మజ్లిస్ ఎమ్మెల్యే బలాల ► అప్రమత్తమైన టీఆర్ఎస్ వర్గాలు.. మంత్రి హరీశ్కు చెప్పిన స్టీఫెన్సన్ ► ఏసీబీ రంగప్రవేశంతో బెడిసికొట్టిన చంద్రబాబు పథకం ► ఎర్రబెల్లి, రమణ, సండ్ర పాత్రపైనా విచారణ సాక్షి, హైదరాబాద్: ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి ఆ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భారీ ఆపరేషన్కు రూపకల్పన చేశారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే టీడీపీ అభ్యర్థికి కనీసం 21 ఓట్లు పోలయ్యేలా వ్యూహరచన చేశారు. ఎంత ఖర్చయినా భరించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆపరేషన్ నిర్వాహకులకు(టీటీడీపీ నేతలకు) భరోసా ఇచ్చారు. ‘బాస్’ ఆదేశాల మేరకు తెలంగాణ టీడీపీ నేతలు రేవంత్రెడ్డి, ఎల్.రమణ, ఎర్రబెల్లి దయాకర్రావు, సండ్ర వెంకటవీరయ్య రంగంలోకి దిగారు. ఎమ్మెల్యేలను గుర్తించి వారితో మాట్లాడే బాధ్యతను తీసుకున్నారు. టీడీపీకి మద్దతిచ్చేందుకు మొత్తం 8 మంది ఎమ్మెల్యేలతో రాయ‘బేరాలు’ నడిపారు. వీరిలో ఐదుగురు ఓటేసినా, మరో ఐదుగురు బీజేపీ సభ్యులతో కలిపి టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థికి 21 ఓట్లు వస్తాయన్నది పార్టీ నేతల యోచన. అదే సమయంలో మాధవరం కృష్ణారావు (కూకట్పల్లి) టీఆర్ఎస్లో చేరడంతో టీడీపీ బలం 11 నుంచి 10కి తగ్గింది. ఈ లెక్కన 20 ఓట్లు వచ్చినా చాలునని టీడీపీ అధినేత భావించారు. దీనికి అనుగుణంగా టీటీడీపీ నేతలు వ్యవహరించారు. తమ సొంత జిల్లాల్లో పరిచయమున్న ఎమ్మెల్యేలతో నేరుగానో లేక వారి సన్నిహితులను ఆసరాగా చేసుకునో మంతనాలు జరిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేస్తే భారీ నజరానా ఉంటుందన్న సమాచారం పంపారు. ఏపీ సీఎం చంద్రబాబే డబ్బును సమకూర్చుతారని, అక్కడ అధికారంలో ఉన్నందున డబ్బుకు ఎలాంటి ఇబ్బంది లేదని మధ్యవర్తులకు నమ్మకంగా చెప్పారు. అవసరమైతే కొంత సొమ్మును ముందే సర్దుతామని హామీ ఇచ్చారు. సీఎం దృష్టికి తీసుకువచ్చిన అహ్మద్ బలాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటేస్తే భారీగా డబ్బు ముట్టజెప్పుతామని ఆ పార్టీ నేతలు మధ్యవర్తుల ద్వారా ప్రలోభపెట్టే ప్రయత్నం చేస్తున్నారని హైదరాబాద్లోని మలక్పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాల... ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు దృష్టికి తెచ్చారు. రేవంత్రెడ్డి తరఫున ఓ మధ్యవర్తి తనను సంప్రదించాడని బలాల తెలిపారు. దీంతో అప్రమత్తమైన కేసీఆర్.. పోలింగ్కు మూడు రోజుల ముందు(మే 29న) టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ భేటీలో ఎవరి పేరునూ ప్రస్తావించకుండానే పార్టీ ఎమ్మెల్యేల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎవరైనా అనైతిక పనులకు పాల్పడితే అసెంబ్లీని రద్దు చేయడానికి కూడా వెనుకాడబోనని సీఎం కేసీఆర్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. అలాగే బలాల ఇచ్చిన సమాచారం మేరకు అనుమానం ఉన్న ఎమ్మెల్యేలపై నిఘా పెట్టాలని తనకు అత్యంత నమ్మకస్తులైన మంత్రి హరీశ్తోపాటు మరొకరిని కేసీఆర్ ఆదేశించారు. అదే సమయంలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు టీడీపీ ఆపరేషన్పై అనుమానం వచ్చింది. వెంటనే ఆయన ఈ వ్యవహారాన్ని హరీశ్రావుకు వివరించారు. రేవంత్రెడ్డి తనకు రూ.5 కోట్లు ఇచ్చేందుకు ముందుకు వచ్చారని తెలిపారు. అవినీతి నిరోధక శాఖ చీఫ్ ఖాన్ను కూడా కలిసి ఫిర్యాదు చేశారు. వెలుగులోకి వచ్చిన ఇతరుల పేర్లు స్టీఫెన్సన్ తెలిపిన వివరాలను హరీశ్రావు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో టీడీపీ ఆపరేషన్ భారీ స్థాయిలో జరుగుతోందన్న నిర్ధారణకు కేసీఆర్ వచ్చారు. రేవంత్రెడ్డి-స్టీఫెన్సన్ వ్యవహారాన్ని అత్యంత గోప్యంగా ఉంచుతూనే టీడీపీ నేతలు సంప్రదిపంపులు జరుపుతున్న ఇతర ఎమ్మెల్యేలను కూడా గుర్తించారు. అత్యంత విశ్వసనీయవర్గాలు అందించిన సమాచారం ప్రకారం టీడీపీ నేతలు సంప్రదింపులు జరిపిన వారిలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సంజీవరావు(వికారాబాద్), బి.శోభ(చొప్పదండి), శంకర్ నాయక్(మహబూబాబాద్)తోపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు మదన్లాల్(వైరా), తాటి వెంకటేశ్వర్లు(అశ్వరావుపేట), కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్లో చేరిన కనకయ్య(ఇల్లెందు) ఉన్నారు. వీరందరికీ రూ.5 కోట్ల చొప్పున ఇస్తామని నేరుగా వారికో లేక వారికి సన్నిహితులైన వారికో టీడీపీ నేతలు హామీ ఇచ్చినట్లు సమాచారం. కాగా, ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టిన నలుగరు టీడీపీ నేతల్లో ఒకరైన రేవంత్రెడ్డి ఇప్పటికే అరెస్ట్ కాగా, మిగిలిన ముగ్గురు నేతలు ఎల్.రమణ, ఎర్రబెల్లి దయాకర్రావు, సండ్ర వెంకట వీరయ్య పాత్రపైనా వారి కాల్డేటా ఆధారంగా విచారణ జరుగుతోంది. నాలుగు రోజుల కస్టడీలో రేవంత్ వెల్లడించే వివరాల ఆధారంగా తదుపరి విచారణ ఉంటుందని ఏసీబీ వర్గాలు పేర్కొన్నాయి. -
తిట్టాడని.. బాస్ భార్య ఫోటోల మార్ఫింగ్
హైదరాబాద్ : బాస్ తనను తిట్టినందుకు అతని భార్య ఫోటోలను మార్ఫింగ్ ద్వారా అశ్లీలంగా చిత్రీకరించి కంపెనీలోని ఉద్యోగులందరికీ పోస్ట్ చేసిన ఓ ప్రబుద్ధుడిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీసీ ఎస్.జయరాం తెలిపిన వివరాల ప్రకారం వనస్థలిపురం హిల్ కాలనీకి చెందిన సేనాపతి శ్రీధర్ (49) హైటెక్ సిటీలోని ఓ కంపెనీలో ఉద్యోగి. విధులకు తరచుగా ఆలస్యంగా వస్తుండటంతో ఉన్నతాధికారి (బాస్) ఒకరు తీవ్రంగా మందలించాడు. దీంతో అతనిపై కక్ష పెంచుకున్న శ్రీధర్ ...బాస్ సతీమణి ఫోటోను మార్ఫింగ్ చేసి అశ్లీలంగా చిత్రీకరించాడు. ఆ ఫోటోలను కంపెనీలని ఉద్యోగులందరికీ మెయిల్ చేశాడు. ఈ నేపథ్యంలో బాస్ పోలీసులను ఆశ్రయించటంతో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. -
సోషల్ మీడియాలోనూ 'బాస్'దే పైచేయి!
-
సాదా సీదాగా ఉండటమే రజనీకి ఇష్టం
-
సినిమా రివ్యూ: సాదాసీదా 'బాస్'!
'వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ముంబై దోబారా' చిత్రంతో పూర్తి స్థాయిలో బాలీవుడ్ అగ్రనటుడు అక్షయ్ కుమార్ ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయిన సంగతి తెలిసిందే. అయితే మమ్ముట్టి, పృథ్వీరాజ్, శ్రీయ సరన్ లు నటించిన మలయాళ చిత్రం పోకిరి రాజా ఆధారంగా రూపొందిన 'బాస్' చిత్రం ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు మరోసారి ప్రయత్నం చేశాడు. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ తోపాటు మిథున్ చక్రవర్తి, శివ్ పండిట్, అధితి రావు హైద్రీ, రోనిత్ రాయ్ లాంటి అగ్రతారలందరూ నటించడం, మీట్ బ్రాస్ అంజన్, చిరంతన్ భట్, పీఏ దీపక్, యో యో హనీ సింగ్ కలిసి చిత్రానికి సంగీతం అందించడం, అతిధి పాత్రలో సోనాక్షి సిన్హా, ప్రత్యేక పాటల్లో ప్రభుదేవా, హనీ సింగ్ లు కనిపించడం, ప్రపంచవ్యాప్తంగా సుమారు 3800 థియేటర్లలో విడుదల లాంటి అంశాలు 'బాస్' పై ఆసక్తిని, అంచనాలను పెంచాయి. బాలీవుడ్ లో అగ్రస్థానం కోసం కొనసాగుతున్న ఆధిపత్య పోరులో అక్షయ్ కుమార్ ను బాలీవుడ్ లో 'బాస్'గా నిలిపిందా అనే విషయాన్ని తెలుసుకునేందుకు కథలోకి వెళ్లాల్సిందే. విలువలకు కట్టుబడి ఉండే సత్యకాంత్ శాస్త్రి (మిథున్ చక్రవర్తి) ఓ టీచర్. సత్యకాంత్ కు సూర్య (అక్షయ్ కుమార్), శివ్ (శివ్ పండిట్) ఇద్దరు కుమారులుంటారు. ఇద్దరు కొడుకుల్లో పెద్దవాడు సూర్య ముక్కు సూటి మనస్తత్వంతో తండ్రికి ఇబ్బందిగా మారుతాడు. అయితే కొన్ని సంఘటనల కారణంగా సూర్యను చిన్నతనంలోనే ఇంటి నుంచి వెళ్లగొడతాడు. ఇంటి నుంచి బయటకు వచ్చిన సూర్య.. బిగ్ బాస్ (డానీ) అనే ట్రాన్స్ పోర్ట్ యజమానిని ఓ హత్య ప్రయత్నం నుంచి కాపాడుతాడు. దాంతో సూర్యను చేరదీసి బాస్ గా తయారు చేస్తాడు. ట్రాన్ పోర్ట్ బిజినెస్ తోపాటు కాంట్రాక్ట్ మాఫియా వ్యవహారాలు కూడా నిర్వహిస్తుంటాడు బిగ్ బాస్. కథ ఇలా నడుస్తుండగా.. హోంమంత్రి అండతో ఆయుష్మాన్ ఠాకూర్ అనే పోలీస్ ఆఫిసర్ సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుంటాడు. ఆయుష్మాన్ చెల్లెలు అంకితతో (ఆధితి రావు హైదరీ) శివ్ ప్రేమలో పడుతాడు. అప్పటికే హోంమంత్రి కుమారుడితో అంకితకు నిశ్చితార్ధం ఖాయం కావడంతో శివ్ ను అంకిత నుంచి దూరం చేయడమే కాకుండా మట్టుపెట్టేందుకు హోంమంత్రి, పోలీస్ ఆఫీసర్ లు బాస్ ను ఆశ్రయిస్తారు. అయితే తాను మట్టుపెట్టాల్సింది తన తమ్ముడినే అని తెలుసుకున్న బాస్.. శివ్ ను ఎలా రక్షించాడు. తండ్రికి ఎలా చేరువయ్యాడు అనే ప్రశ్నలకు సమాధానమే 'బాస్' చిత్రం. 'బాస్' గా అక్షయ్ కుమార్ అన్న, కొడుకు, ఓ మాస్ హీరో ఎలిమెంట్స్ ఉన్న పాత్రను పోషించాడు. గతంలో అక్షయ్ కుమార్ ఎలాంటి పాత్రల్లో ఎక్కువగానే కనిపించాడు. అయితే అక్షయ్ కుమార్ ను బాలీవుడ్ లో బాస్ గా నిలపెట్టే పాత్ర కాకపోవడం అభిమానులను నిరాశపరిచే అంశం. అయితే అక్కడక్కడా తన కామెడీ పంచ్ లతో అభిమానులను ఉత్సాహ పరిచాడంలో కొంత అక్షయ్ సఫలమయ్యాడు. అక్షయ్ తండ్రిగా మిథున్ పాత్ర పరిధి మేరకు పర్వాలేదనింపించాడు. సత్యకాంత్ పాత్ర మిథున్ కు గొప్ప పేరును తీసుకువస్తుందని ఆశించడం పొరపాటే అవుతుంది. దుష్ట పోలీస్ ఆఫిసర్ గా రోనిత్ రాయ్ ఓకే అయినా.. అక్షయ్ కుమార్ ముందు తేలిపోయాడు. శివ్ పండిట్ పాత్రకు ప్రాధాన్యత లేకపోయింది. అధితి ఓ బికిని సీన్ లో మెరిసినా.. ఆ తర్వాత అతిధి పాత్రకే పరిమితమైంది. మీట్ బ్రాస్ అంజన్, చిరంతన్ భట్, పీఏ దీపక్, యో యో హనీ సింగ్ లు నలుగురు కలిసి అందించిన సంగీతం కూడా ఆకట్టుకోలేకపోయింది. ఇక కథ రొటిన్ గా ఉండటం, పాతకాలం నాటి కథకు కొత్తగా చూపించే ప్రయత్నం బెడిసి కొట్టిందని చెప్పవచ్చు. పాత కథకు కమర్షియల్ హంగులు కల్పించడంలో దర్శకుడు అంథోని డిసౌజా దారుణంగా విఫలమయ్యాడు. కామెడి చిత్రంగానో లేక యాక్షన్ చిత్రంగా రూపొందించాలనే సందిగ్ఘంలో దర్శకుడు కొంత తడబాటుకు గురైనట్టు కనిపించింది. ఇక రెండు ప్రత్యేక పాటల్లో కనిపించిన సోనాక్షి సిన్హా, ఓ పాటలో కనిపించిన ప్రభుదేవా కూడా ప్రేక్షకుల్ని థియేటర్ రప్పించడం కష్తమే. ఏది ఏమైనా.. బాలీవుడ్ లో ఈ చిత్రం ద్వారా అక్షయ్ కుమార్ సాదాసీదా 'బాస్' గానే మిగిలి పోవడం ఖాయం. -
గిన్నిస్ బుక్ లో 'బాస్' సినిమా పోస్టర్!
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ నటించిన బాస్ చిత్రం ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. బాస్ చిత్రానికి సంబంధించిన అతిపెద్ద పోస్టర్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుల్లో చోటు సంపాదించుకుంది. నాలుగు నెలలపాటు తీవ్రంగా శ్రమించిన అక్షయ్ కుమార్ అభిమానులు ప్రపంచంలోనే అతిపెద్ద పోస్టర్ ను రూపొందించారు. అభిమానుల కృషిని అభినందిస్తూ అరుదైన గౌరవం అని అక్షయ్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. యూకేలోని లిటిల్ గ్రాన్స్ డెన్ ఎయిర్ ఫీల్డ్ లో 58.87 మీటర్ల వెడల్పు, 54.94 మీటర్ల ఎత్తుతో రూపొందించిన పోస్టర్ ను అక్టోబర్ 3 తేదిన ఆవిష్కరించారు. గతంలో మైఖేల్ జాక్సన్ పోస్టర్ రూపొందించిన మైక్రో ఆర్ట్స్(యూకే) బాస్ పోస్టర్ కు రూప కల్పన చేశారు. అతిపెద్ద బాస్ చిత్ర పోస్టర్ వివరాలను గిన్నిస్ బుక్ కు చెందిన అధికారిక వెబ్ సైట్ లో పొందుపరిచారు. ఆంథోని డి సౌజా దర్శకత్వం వహించిన బాస్ చిత్రం అక్టోబర్ 16 తేదిన విడుదల కానుంది. -
ఇమేజ్కు కాలం చెల్లిందన్న అక్షయ్ కుమార్
న్యూఢిల్లీ: కథానాయకుల పేరుమీద సినిమాలు నడిచే రోజులు పోయాయని, కథ, కథనం, తెరకెక్కించే విధానమే ప్రస్తుతం సినిమాలను ఆడిస్తోందని బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ అభిప్రాయపడ్డాడు. ఎంతపెద్ద సూపర్స్టార్ను హీరోగా పెట్టి సినిమా తీసినా అందులో కొత్తదనం, ప్రత్యేకత లేకపోతే ప్రేక్షకులు నిర్మోహమాటంగా తిరస్కరిస్తున్నారని చెప్పాడు. సినిమాకు పేరుకు సూపర్స్టార్ పేరును జోడిస్తే సినిమా దానంతట అదే హిట్ అవుతుందన్న అభిప్రాయాన్ని ఇక నుంచి నిర్మాతలు, దర్శకులు మార్చుకోవాలని సూచించాడు. మంచి సినిమాలే ఆడతాయని, కొత్తదనం ఉన్న చిత్రాలకే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారన్నాడు. మంచి కథ, స్క్రీన్ప్లేలే ప్రస్తుతం బాక్సాఫీస్ను ఏలుతున్నాయని, ఇది చాలా మంచి పరిణామమని ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్షయ్ చెప్పాడు. అంతేకాక కథానాయకులను విభాగాల వారీగా విభజించడాన్ని కూడా తాను సమర్థించలేనన్నాడు. వంద కోట్ల హీరో, రెండువందల కోట్ల హీరో అంటూ బాలీవుడ్లో ఇటీవల కొత్త ట్రెండ్ పుట్టుకొచ్చిందని, కోట్లను సంపాదించేది కథ మాత్రమేనన్నాడు. ఈ రోజుల్లో కథ, కథనం ప్రధాన్యత పెరిగిందని, హీరోలు, హీరోయిన్లు సాధారణ అంశాలైపోయాయన్నారు. కొత్తగా బాలీవుడ్లోకి అడుగుపెడుతున్న కుర్రాళ్ల చిత్రాలు కూడా బంపర్ హిట్ అవుతున్నాయని, అందుకు కారణం సదరు చిత్రాల్లో ఏదో ప్రత్యేకత ఉండడమేనని చెప్పారు. దర్శకుడు ఆంటోని డిసౌజా తెరకెక్కిస్తున్న ‘బాస్’ సినిమాతో అక్షయ్ త్వరలో ప్రేక్షకుల ముందుకొస్తున్నానని, మళయాల చిత్రం ‘పోకిరి రాజా’ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోందని చెప్పాడు. సినిమా చాలా బాగా వచ్చిందని, ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతుందని, హాస్యంతోపాటు యాక్షన్ కూడా అదరగొడుతుందన్నాడు. వక్త్, ఏక్ రిష్తా, జాన్వర్ వంటి సినిమాల్లాగే ఈ సినిమా కథ కూడా నచ్చడంతోనే నటించేందుకు ఒప్పుకున్నానన్నాడు.