Cape Town
-
భారత నారీమణుల మరో అరుదైన సాహసం..ప్రమాదాలకు కేరాఫ్ అయినా..!
సాహాసయాత్రలకు కేరాఫ్గా అడ్రస్గా నిలుస్తున్న మహిళా నేవి అధికారులు మరో అరుదైన సాహసాన్ని నమోదు చేశారు. సాహసమే ఊపిరిగా సాగిపోతున్న లెఫ్టినెంట్ కమాండర్(Lieutenant Commander) దిల్నా కే లెఫ్టినెంట్ కమాండర్ రూప ఏ చారిత్రాత్మక విజయ పరంపరను కొనగిస్తున్నారు. ఈ మేరకు ఇద్దరు నేవి అధికారులు నావికా సాగర్ పరిక్రమ II యాత్ర మూడవ దశలో భాగంగా శనివారం ఐఎన్ ఎస్ తరణిలో(INSV Tarini) దక్షిణ అమెరికా దక్షిణ కొన వద్ద ఉన్న కేప్ హార్న్(Cape Horn)ను దాటారని భారత నౌకాదళ ప్రకటించింది. ఆ ప్రాంతం చేరుకోవడానికి ఇద్దరు మహిళా నావిక అధికారులు డ్రేక్ సముద్ర మార్గం గుండా వెళ్లాల్సి ఉంటుంది. నిజానికి దక్షిణ అమెరికాకు దక్షిణంగా బహిరంగ సముద్ర మార్గం ఉనికిని నిర్థారించిన ఇంగ్లిష్ అన్వేషకుడు సర్ ఫ్రాన్సిస్ డ్రేక్ పేరు మీదగా ఆ మార్గానికి పేరు పెట్టారు. ఈ ప్రాంతం తీవ్రమైన గాలులు, ఎత్తైన అలలతో కూడిన అనూహ్య వాతావరణానికి ప్రసిద్ధి చెందింది. పైగా ప్రమాదకరమైన జలమార్గం కూడా. ఇలాంటి ప్రదేశాన్ని అలవొకగా దాటి మరో విజయ ఢంకా మోగించారు. ఈ కేఫ్ హార్న్ అంటార్కిటికా నుంచి 800 కిలోమీటర్ల దూరంలో ఉంది. మంచు ఖండానికి దగ్గరగా ఉన్న భూభాగాల్లో ఒకటి ఇది. ఈ ప్రాంతం గుండా ప్రయాణించాలంటే అసాధారణమైన నావిగేషన్ నైపుణ్యం తోపాటు దక్షిణ మహాసముద్రంలో ఉండే కఠిన పరిస్థితులను తట్టుకునే శక్తి కూడా ఉండాలి. కాగా, ఈ నావికా సాగర్ పరిక్రమ II అనేది శాస్త్రీయ అన్వేషణ, సహకారానికి మద్దతు ఇవ్వడానికి భారతదేశం చేస్తున్న ప్రయత్నాల కొనసాగింపును ఇది. అలాగే మహిళా నేవి అధికారులు తమ ప్రయాణాన్ని కొనసాగించడమే కాకుండా తదుపరి గమ్యస్థానం వైపు పురోగమిస్తారు. అంతేగాక ఈ మిషన్ లక్ష్యాలను కూడా మరింత ముందుకు తీసుకువెళ్తారు. ఈ అధికారులు సాహసయాత్ర విజయవంతంగా పూర్తి అయ్యినట్లయితే ప్రపంచంలో తొలిసారిగా ఇద్దరు మహిళా నావికా అధికారులు ప్రపంచ ప్రదక్షిణ యాత్రను పూర్తి చేసిన వ్యక్తులుగా నిలుస్తారు. In persistent rains, Sea State 5, winds of 40kns (~75 kmph) and waves more than 5 metres, Lt Cdr Dilna K & Lt Cdr Roopa A, recorded their names in the annals of history by successfully crossing the #CapeHorn located at the southern tip of #SouthAmerica, while sailing on the third… pic.twitter.com/N1isyvHGMA— SpokespersonNavy (@indiannavy) February 15, 2025 (చదవండి: ఇంజెంక్షన్ ఫోబియా: నాకిప్పుడు ఐదో నెల మరి ఎలా..?) -
రోహిత్ వ్యాఖ్యలపై ఐసీసీ సీరియస్.. చర్యలకు సిద్దం!?
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది. తాజాగా కేప్టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు అనంతరం క్రికెట్ పిచ్లపైన రోహిత్ చేసిన వ్యాఖ్యలను ఐసీసీ సీరియస్గా తీసుకున్నట్లు సమాచారం. ఐసీసీ మ్యాచ్ రిఫరీలను ఉద్దేశించి రోహిత్ ఘూటు వాఖ్యలు చేశాడు. ఈ క్రమంలో రోహిత్ కామెంట్స్ను సీరియస్గా తీసుకున్న ఐసీసీ.. హిట్మ్యాన్పై చర్యలకు సిద్దమైనట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. రోహిత్ ఏమన్నాడంటే? కేప్టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో భారత్ 7 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. దీంతో టెస్టు సిరీస్ను 1-1తో టీమిండియా సమం చేసింది. ఈ క్రమంలో పోస్ట్మ్యాచ్ ప్రేజేంటేషన్లో రోహిత్ మాట్లాడుతూ.. "ఇది కూడా క్రికెట్ పిచే కదా. ఆడింది మ్యాచే కదా! మ్యాచ్ రిఫరీలకు, ఐసీసీకి ఏం జరిగిందొ కనబడిందనే అనుకుంటున్నా. మరి దీనికేం రేటింగ్ ఇస్తారు? భారత్లో ప్రపంచకప్ ఫైనల్ కోసం తయారు చేసిన పిచ్పై ఓ బ్యాటర్ సెంచరీ చేసినా దానికి ‘యావరేజ్’ రేటింగ్ ఇస్తారు. ఇవేం ద్వంద్వ ప్రమాణాలు మరి! ఐసీసీ గానీ, రిఫరీలు గానీ తటస్థంగా ఉండాలి. కేప్టౌన్లో ఏం జరిగిందో అందరూ చూశారు. పిచ్ ఎలా ఉందో అందరికీ తెలుసు. నిజాయితీగా చెబుతున్నా... ఇలాంటి పిచ్లపై ఆడేందుకు నాకైతే ఎలాంటి ఇబ్బందులు లేవు. అలాగే విదేశీ జట్లు కూడా భారత్కు వచ్చినప్పుడు మూడు రోజుల్లో ముగిస్తే, స్పిన్ తిరిగితే ఇవేం పిచ్లు, ఇదేం చెత్త అని నోరుపారేసుకోవడం ఆపితే మంచిది" అని రోహిత్ పేర్కొన్నాడు. అయితే ఐసీసీ మాత్రం ఈ విషయంపై ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇక దక్షిణాఫ్రికా పర్యటనను ముగించుకుని స్వదేశానికి చేరుకున్న భారత జట్టు అఫ్గానిస్తాన్తో టీ20 సిరీస్కు సిద్దమవుతోంది. జనవరి 11న మొహాలీ వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం ఇరు దేశాల క్రికెట్ సెలక్షన్ కమిటీలు తమ జట్లను ప్రకటించాయి. చదవండి: IND Vs AFG: టీమిండియాలో ఛాన్స్ కొట్టేశాడు.. కట్ చేస్తే! అక్కడ 6 వికెట్లతో అదుర్స్ -
ఏం జరిగిందో చూశారు కదా.. నోరుపారేసుకోవడం ఆపితే మంచిది: రోహిత్
2024 ఏడాదిని విజయంతో టీమిండియా ఆరంభించింది. కేప్టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన భారత జట్టు కేవలం ఒకటిన్నర రోజుల్లోనే ఈ మ్యాచ్ను ముగించింది. దీంతో రెండు మ్యాచ్ల సిరీస్ను 1-1తో సమం చేసింది. 79 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ మ్యాచ్కు వేదికైన కేప్టౌన్ పిచ్పై ప్రస్తుతం క్రికెట్ వర్గాలపై తెగ చర్చనడుస్తోంది. ఈ పిచ్పై పేసర్లు అద్బుతాలు సృష్టించారు. ఒకటిన్నర రోజుల్లోనే 33 వికెట్లు నేలకూలాయి. టెస్ట్ క్రికెట్ చరిత్రలో బంతుల పరంగా అత్యంత వేగంగా ముగిసిన మ్యాచ్గా కేప్టౌన్ టెస్టు రికార్డులకెక్కింది. మ్యాచ్ అనంతరం ఇదే విషయంపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. భారత్ పిచ్లపై విమర్శలు చేసే వారికి రోహిత్ గట్టి కౌంటరిచ్చాడు. "ఇది కూడా క్రికెట్ పిచే కదా. ఆడింది మ్యాచే కదా! మ్యాచ్ రిఫరీలకు, ఐసీసీకి ఏం జరిగిందొ కనబడిందనే అనుకుంటున్నా. మరి దీనికేం రేటింగ్ ఇస్తారు? భారత్లో ప్రపంచకప్ ఫైనల్ కోసం తయారు చేసిన పిచ్పై ఓ బ్యాటర్ సెంచరీ చేసినా దానికి ‘యావరేజ్’ రేటింగ్ ఇస్తారు. ఇవేం ద్వంద్వ ప్రమాణాలు మరి! ఐసీసీ గానీ, రిఫరీలు గానీ తటస్థంగా ఉండాలి. కేప్టౌన్లో ఏం జరిగిందో అందరూ చూశారు. పిచ్ ఎలా ఉందో అందరికీ తెలుసు. నిజాయితీగా చెబుతున్నా... ఇలాంటి పిచ్లపై ఆడేందుకు నాకైతే ఎలాంటి ఇబ్బందులు లేవు. అలాగే విదేశీ జట్లు కూడా భారత్కు వచ్చినప్పుడు మూడు రోజుల్లో ముగిస్తే, స్పిన్ తిరిగితే ఇవేం పిచ్లు, ఇదేం చెత్త అని నోరుపారేసుకోవడం ఆపితే మంచిది" అని పోస్ట్మ్యాచ్ ప్రేజేంటేషన్లో రోహిత్ పేర్కొన్నాడు. చదవండి: Ind vs SA: దెబ్బకు దెబ్బ: రెండు రోజుల్లోనే ముగించిన టీమిండియా.. సరికొత్త చరిత్ర -
భారత్-సౌతాఫ్రికా రెండో టెస్ట్ విశేషాలు, రికార్డులు..
కేప్టౌన్ వేదికగా భారత్-సౌతాఫ్రికా జట్ల మధ్య జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ పలు రికార్డులకు వేదికైంది. ఈ మ్యాచ్లో భారత్.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, రెండు మ్యాచ్ల సిరీస్ను 1-1తో సమం చేసుకుంది. దీనికి ముందు సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. కేప్టౌన్ టెస్ట్ రికార్డులు.. 2024లో తొలి టెస్ట్ కేవలం ఒకటిన్నర రోజుల్లో ముగిసింది (నాలుగున్నర సెషన్లు) భారత్.. సౌతాఫ్రికాను కేప్టౌన్లో తొలిసారి ఓడించింది కేప్టౌన్లో టెస్ట్ మ్యాచ్ గెలిచిన తొలి ఏషియన్ కెప్టెన్గా రోహిత్ శర్మ రికార్డు కేప్టౌన్లో టెస్ట్ మ్యాచ్ గెలిచిన తొలి ఏషియన్ జట్టుగా భారత్ రికార్డు ధోని తర్వాత సౌతాఫ్రికా గడ్డపై టెస్ట్ సిరీస్ను డ్రా చేసుకున్న రెండో కెప్టెన్గా హిట్మ్యాన్ రికార్డు అంతర్జాతీయ క్రికెట్లోకి రీఎంట్రీ తర్వాత టెస్ట్ల్లో సౌతాఫ్రికా అత్యల్ప స్కోర్ (55, తొలి ఇన్నింగ్స్) టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఓ జట్టు (భారత్) పరుగులేమీ (153 పరుగుల వద్ద) చేయకుండా తమ చివరి ఆరు వికెట్లు కోల్పోవడం ఇదే తొలిసారి. 2024లో తొలి సెంచరీ చేసిన ఆటగాడిగా మార్క్రమ్ రికార్డు టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా (బంతుల పరంగా) ముగిసిన టెస్ట్ మ్యాచ్ (642 బంతుల్లో) టెస్టు క్రికెట్ చరిత్రలోనే తొలి రోజు అత్యధిక వికెట్లు (23) పడిన రెండో మ్యాచ్గా రికార్డు. మ్యాచ్ విశేషాలు.. సిరాజ్ చెలరేగడంతో (6/15) తొలి ఇన్నింగ్స్లో సౌతాఫ్రికా 55 పరుగులకే కుప్పకూలింది ఒకే స్కోర్ వద్ద (153, తొలి ఇన్నింగ్స్) టీమిండియా చివరి ఆరు వికెట్లు కోల్పోయింది. కెరీర్లో తొమ్మిదో ఐదు వికెట్ల ప్రదర్శనతో (6/61) సౌతాఫ్రికా నడ్డివిరిచిన బుమ్రా సౌతాఫ్రికా తరఫున టెస్ట్ల్లో అత్యంత వేగవంతమైన ఆరో సెంచరీ (99 బంతుల్లో) చేసిన మార్క్రమ్ సౌతాఫ్రికా తరఫున ఓ పూర్తయిన టెస్ట్ ఇన్నింగ్స్లో అత్యధిక శాతం (60.22) పరుగులు చేసిన ఆటగాడిగా మార్క్రమ్ రికార్డు సౌతాఫ్రికా తాత్కలిక కెప్టెన్ డీన్ ఎల్గర్ టెస్ట్ కెరీర్ ముగిసింది ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్-సిరాజ్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్- డీన్ ఎల్గర్, బుమ్రా స్కోర్ వివరాలు.. సౌతాఫ్రికా- 55 (వెర్రిన్ 15, సిరాజ్ 6/15), 176 (మార్క్రమ్ 106, బుమ్రా 6/61) భారత్- 153 (కోహ్లి 46, ఎంగిడి 3/30), 80/3 (జైస్వాల్ 28, జన్సెన్ 1/15) 7 వికెట్ల తేడాతో భారత్ విజయం -
7 వికెట్ల తేడాతో సఫారీలను చిత్తు చేసిన భారత్
-
ఇటువంటి పిచ్ను నా కెరీర్లో చూడలేదు: సౌతాఫ్రికా కెప్టెన్
కేప్టౌన్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య ప్రారంభమైన రెండో టెస్టు మొదటి రోజు వికెట్ల వర్షం కురిసింది. ఇరు జట్ల పేసర్ల చెలరేగడంతో ఏకంగా మొదటి రోజు 23 వికెట్లు నేలకూలాయి. మొదటి ఇన్నింగ్స్లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా కేవలం 55 పరుగులకే కుప్పకూలగా.. అనంతరం టీమిండియా కూడా 153 పరుగులకే చాపచుట్టేసింది. భారత బౌలర్లలో పేసర్ మహ్మద్ సిరాజ్ 6 వికెట్లతో విజృంభించాడు. సఫారీ బౌలర్లలో బర్గర్, రబాడ, ఎంగిడీ తలా మూడు వికెట్లు పడగొట్టారు. ఇక కెరీర్లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న డీన్ ఎల్గర్.. ఈ టెస్టు రెండు ఇన్నింగ్స్లలోనూ దారుణంగా విఫలమయ్యాడు. తొలి టెస్టులో సెంచరీతో చెలరేగిన ఎల్గర్ రెండో టెస్టులో మాత్రం 4 పరుగులు మాత్రమే చేశాడు. ఇక తొలి రోజు ఆట అనంతరం స్టార్స్పోర్ట్స్తో మాట్లాడిన ఎల్గర్ కేప్టౌన్ పిచ్ పరిస్థితి గురించి వివరించాడు. సెషన్ కొనసాగుతన్నకొద్దీ వికెట్ పరిస్థితి మారిపోయిందని ఎల్గర్ చెప్పుకొచ్చాడు. "సాధారణంగా న్యూలాండ్స్ పిచ్ కొంచెం స్లోగా ఉంటుంది. బ్యాటర్ కాస్త సమయం వెచ్చిస్తే క్రీజులో నిలదొక్కకోవచ్చు. అందుకే తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాను. కానీ ఈ మ్యాచ్లో సెషన్ కొనసాగుతున్న కొద్దీ బంతి గతిలో మార్పు కన్పించింది. అంతేకాకుండా బౌన్స్ కూడా చాలా ఎక్కవైంది. దీంతో బ్యాటర్లు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నాను. అయితే పిచ్ను దగ్గరనుంచి చూస్తే బాగానే ఉన్నట్లు అన్పిస్తోంది. గతంలో ఎప్పుడూ ఈ వేదికలో ఇలా జరగలేదు. డొమాస్టిక్ క్రికెట్లో కూడా ఇప్పటివరకు ఇంత చెత్త గణాంకాలు నమోదు కాలేదు. ఇటువంటి పిచ్ను ఇప్పటివరకు నా కెరీర్లో చూడలేదు" స్టార్ స్పోర్ట్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎల్గర్ పేర్కొన్నాడు. కాగా తొలి రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. చదవండి: Ind Vs SA: రెండో టెస్టులో విజయం భారత్దే.. ఎందుకంటే?: టీమిండియా దిగ్గజం -
Ind Vs SA: ‘రెండో టెస్టులో టీమిండియాదే విజయం.. ఎందుకంటే?’
Ind Vs SA 2nd Test: సౌతాఫ్రికాతో రెండో టెస్టులో టీమిండియా కచ్చితంగా విజయం సాధిస్తుందని భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ ధీమా వ్యక్తం చేశాడు. తొలి రోజే ప్రొటిస్ జట్టు కీలక వికెట్లు కోల్పోయింది కాబట్టి భారత్ గెలుపు సాధ్యమవుతుందని పేర్కొన్నాడు. టీమిండియా పేసర్లు మరోసారి విజృంభించి సౌతాఫ్రికాను తక్కువ స్కోరుకే కట్టడి చేసి శుభారంభం అందిస్తే.. బ్యాటర్లు విజయ లాంఛనం పూర్తి చేయగలరని గావస్కర్ అంచనా వేశాడు. కాగా సెంచూరియన్ వేదికగా బాక్సింగ్ డే టెస్టులో ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఘోర పరాజయం చవిచూసిన రోహిత్ సేన.. రెండో మ్యాచ్లో గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. సఫారీ గడ్డపై తొలిసారి సిరీస్ గెలిచే అవకాశాన్ని ఆదిలోనే చేజార్చుకున్న టీమిండియా.. కేప్టౌన్లో గెలిచి కనీసం డ్రా చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. ఇందులో భాగంగా బుధవారం మొదలైన టెస్టులో టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసిన భారత్.. అనూహ్య రీతిలో సౌతాఫ్రికాను 55 పరుగులకే ఆలౌట్ చేసింది. 36 పరుగుల ఆధిక్యంలో టీమిండియా ఆ తర్వాత 153 పరుగుల వద్ద తమ తొలి ఇన్నింగ్స్ ముగించింది. అనంతరం మళ్లీ బౌలింగ్ చేసిన టీమిండియాకు మూడు వికెట్లు దక్కాయి. డీన్ ఎల్గర్ రూపంలో కీలక బ్యాటర్ను అవుట్ చేయగలిగింది. ఈ క్రమంలో తొలి రోజు ఆట ముగిసే సరికి సౌతాఫ్రికా 17 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 62 పరుగులు చేయగా.. టీమిండియాకు 36 పరుగుల ఆధిక్యం దక్కింది. రోహిత్ సేనదే విజయం.. ఎందుకంటే ఈ నేపథ్యంలో సునిల్ గావస్కర్ స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘ఇప్పటికే సౌతాఫ్రికా మూడు వికెట్లు కోల్పోయింది. భారత్ ఇంకా ఆధిక్యంలోనే కొనసాగుతోంది. కాబట్టి మ్యాచ్ టీమిండియా చేజారిపోతుందని నేను అనుకోవడం లేదు. సౌతాఫ్రికా బ్యాటింగ్ ఆర్డర్లో మిగిలిన ఆటగాళ్లంతా కలిసి 150- 200 పరుగులు చేయడం మాత్రం కష్టమే. కాబట్టి భారత్కు విజయావకాశాలు ఎక్కువే. ఇన్నింగ్స్ తేడాతో విజయం దక్కకపోయినా.. మెరుగైన స్థితిలోనే ఉంటుంది’’ అని అభిప్రాయపడ్డాడు. చదవండి: Ind vs SA: అస్సలు ఊహించలేదు.. వాళ్లిద్దరి సహకారం వల్లే సాధ్యమైంది: ‘సిక్సర్’ సిరాజ్ -
ఒకే రోజు 23 వికెట్లు.. సచిన్ టెండూల్కర్ రియాక్షన్ ఇదే
కేప్టౌన్ వేదికగా దక్షిణాఫ్రికా-భారత్ మధ్య రెండో టెస్టు రసవత్తరంగా ప్రారంభమైంది. తొలి రోజే ఆసక్తికర మలుపులు చోటు చేసుకున్నాయి. న్యూలాండ్స్ పిచ్పై ఇరు జట్ల పేసర్లు నిప్పులు చేరిగారు. ఫలితంగా మొదటి రోజే ఏకంగా 23 వికెట్లు నేలకూలాయి. తొలి ఇన్నింగ్స్లో మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. టీమిండియా పేసర్ సిరాజ్ దాటికి కేవలం 55 పరుగులకే కుప్పకూలింది. సిరాజ్ 6 వికెట్లతో చెలరేగగా.. బుమ్రా, ముఖేస్ కుమార్ తలా రెండు వికెట్లతో తమ వంతు పాత్ర పోషించారు. ఆ తర్వాత తమ తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించిన టీమిండియాది కూడా అదే తీరు. ఒక దశలో స్కోరు 153/4 వద్ద పటిష్ట స్ధితిలో నిలిచింది. దీంతో తొలి రోజును భారీ అధిక్యంతో భారత్ ముగిస్తుందని అభిమానులంతా భావించారు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ చేసుకుంది. చివరి 11 బంతుల్లో ఒక్క పరుగు కూడా తీయకుండా జట్టు 6 వికెట్లు కోల్పోయింది. దీంతో భారత్ ఇన్నింగ్స్ అదే స్కోరు వద్ద టీమిండియా ఆలౌటైంది. సచిన్ రియాక్షన్ ఇదే.. ఇక ఒకే రోజులో 23 వికెట్లు కోల్పోవడంపై భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పందించాడు. "ఒకే రోజు 23 వికెట్లతో ఈ ఏడాది క్రికెట్ ఆరంభమైంది. ఇది ఇప్పటికి నేను నమ్మలేకపోతున్నాను. సౌతాఫ్రికా ఆలౌటైనప్పుడు నేను ఫ్లైట్ ఎక్కాను. నేను ఇంటికి వచ్చి టీవీలో చూస్తే దక్షిణాఫ్రికా 3 వికెట్లు కోల్పోయి బ్యాటింగ్ చేస్తోంది. నేను ఆశ్చర్యపోయాను. ఈ గ్యాప్లో నేను ఏమి మిస్సయ్యాను?" అని సచిన్ ఎక్స్( ట్వీట్) చేశాడు. Cricket in ‘24 begins with 23 wickets falling in a single day. Unreal! Boarded a flight when South Africa was all out, and now that I'm home, the TV shows South Africa has lost 3 wickets. What did I miss?#SAvIND — Sachin Tendulkar (@sachin_rt) January 3, 2024 -
నిప్పులు చెరిగిన టీమిండియా పేసర్లు.. సౌతాఫ్రికా చెత్త రికార్డులు
కేప్టౌన్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్లో భారత పేస్ బౌలింగ్ త్రయం (సిరాజ్, బుమ్రా, ముకేశ్ కుమార్) ఉగ్రరూపం దాల్చింది. వీరి ధాటికి సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 55 పరుగులకే కుప్పకూలింది. ఆట తొలి రోజే భారత పేసర్లు సఫారీల భరతం పట్టారు. ముఖ్యంగా సిరాజ్ (9-3-15-6) నిప్పులు చెరిగే బంతులతో సౌతాఫ్రికా పతనాన్ని శాశించాడు. సిరాజ్కు జతగా ముకేశ్ కుమార్ (2.2-2-0-2), బుమ్రా (8-1-25-2) కూడా విజృంభించడంతో సౌతాఫ్రికా అత్యల్ప స్కోర్కు పరిమితం కావడంతో పలు చెత్త రికార్డులను మూటగట్టుకుంది. క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చాక సౌతాఫ్రికాకు టెస్ట్ల్లో ఇదే అత్యల్ప స్కోర్ కాగా.. టెస్ట్ల్లో భారత్పై ఏ ప్రత్యర్ధికైనా ఇదే అత్యల్ప స్కోర్గా నిలిచింది. ఈ మ్యాచ్లో సిరాజ్ నమోదు చేసిన గణాంకాలు సైతం రికార్డుల్లోకెక్కాయి. అతి తక్కువ పరుగులు సమర్పించుకుని ఐదు వికెట్ల ఘనత సాధించిన భారత బౌలర్ల జాబితాలో సిరాజ్ నాలుగో స్థానాన్ని (6/15) సాధించాడు. ఈ జాబితాలో బుమ్రా (5/7) టాప్లో ఉండగా.. వెంకటపతి రాజు (6/12), హర్భజన్ సింగ్ (5/13) ఆతర్వాతి స్థానాల్లో నిలిచారు. అలాగే ఈ ప్రదర్శనతో సిరాజ్ మరో రికార్డుల జాబితాలోనూ చోటు దక్కించుకున్నాడు. సౌతాఫ్రికా గడ్డపై అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన భారత బౌలర్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో శార్దూల్ ఠాకూర్ (7/61) టాప్లో ఉండగా.. హర్బజన్ సింగ్ (7/120) ఆతర్వాతి స్థానంలో నిలిచాడు. సౌతాఫ్రికా 55 పరుగులకే ఆలౌట్ కావడంతో కేప్టౌన్ సైతం రికార్డుల్లోకెక్కింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు 36 సందర్భాల్లో ఆయా జట్టు 55 అంతకంటే తక్కువ స్కోర్లకు ఆలౌట్ కాగా.. అత్యధిక సందర్బాల్లో (7) కేప్టౌన్లోనే ఈ చెత్త రికార్డులు నమోదయ్యాయి. కేప్టౌన్ తర్వాత అత్యధికంగా ఆరుసార్లు ఆయా జట్లు 55 అంతకంటే తక్కువ స్కోర్లను లార్డ్స్ మైదానంలో చేశాయి. సౌతాఫ్రికా ఇన్నింగ్స్ విషయానికొస్తే.. బెడింగ్హమ్ (12), వెర్రిన్ (15) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. మార్క్రమ్ 2, కెరీర్లో చివరి టెస్ట్ ఆడుతున్న సౌతాఫ్రికా తాత్కాలిక కెప్టెన్ డీన్ ఎల్గర్ 4, టోనీ జార్జీ 2, ట్రిస్టన్ స్టబ్స్ 3, మార్కో జన్సెన్ 0, కేశవ్ మహారాజ్ 3, రబాడ 5, నండ్రే బర్గర్ 4 పరుగులు చేశారు. కాగా, రెండు మ్యాచ్ల ఈ టెస్ట్ సిరీస్లో సౌతాఫ్రికా తొలి మ్యాచ్లో గెలుపొందిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్లో ప్రోటీస్ ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
ఆరు వికెట్లతో చెలరేగిన సిరాజ్: 55 పరుగులకే సౌతాఫ్రికా ఆలౌట్
South Africa Vs India 2nd Test 2024 Day 1 Updates- కేప్టౌన్: రెండో టెస్టులో భారత పేసర్ల విజృంభణతో సౌతాఫ్రికా 55 పరుగులకే కుప్పకూలింది. బుధవారం నాటి మ్యాచ్లో తొలి రోజు ఆట తొలి సెషన్లో 23.2 ఓవర్లలోనే ఆలౌట్ అయి తొలి ఇన్నింగ్స్ ముగించింది. ప్రొటిస్ బ్యాటర్లలో వికెట్ కీపర్ కైల్ వెరెనె 15 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవడం విశేషం. టీమిండియా బౌలర్లలో మహ్మద్ సిరాజ్ అత్యధికంగా ఆరు వికెట్లు తీయగా.. బుమ్రాకు రెండు, ముకేశ్ కుమార్కు రెండు వికెట్లు దక్కాయి. మరో పేసర్ ప్రసిద్ కృష్ణ 4 ఓవర్ల బౌలింగ్లో పది పరుగులు మాత్రమే ఇచ్చి పొదుపుగానే బౌలింగ్ చేశాడు. Double breakthrough for #TeamIndia!@mdsirajofficial is breathing 🔥 this morning & bags a -fer in just his 8th over! A sensational spell leaves #SouthAfrica reeling! Tune in to #SAvIND 2nd Test LIVE NOW | Star Sports Network#Cricket pic.twitter.com/hpzR8g9wLH — Star Sports (@StarSportsIndia) January 3, 2024 22.6: తొమ్మిదో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా బుమ్రా బౌలింగ్లో యశస్వి జైస్వాల్కు క్యాచ్ ఇచ్చి నండ్రే బర్గర్(4) పెవిలియన్ చేరాడు. స్కోరు: 55-9(23) 21: హాఫ్ సెంచరీ మార్కు అందుకున్న సౌతాఫ్రికా.. స్కోరు: 50-8 ఎనిమిదో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 19.6: ముకేశ్ కుమార్ బౌలింగ్లో బుమ్రాకు క్యాచ్ ఇచ్చి ఔటైన కేశవ్ మహరాజ్(3). సౌతాఫ్రికా స్కోరు: 46-8(20) 17.5: ఏడో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా సిరాజ్ బౌలింగ్లో శుబ్మన్ గిల్కు క్యాచ్ ఇచ్చి వెరెనె (15) ఔటయ్యాడు. అతడి రూపంలో సౌతాఫ్రికా ఏడో వికెట్ కోల్పోయింది. సిరాజ్ ఖాతాలో ఆరో వికెట్ చేరింది. సౌతాఫ్రికా స్కోరు: 45-7(18). రబడ, కేశవ్ మహరాజ్ క్రీజులో ఉన్నారు. 15.5: తిరుగులేని సిరాజ్.. ఆరో వికెట్ డౌన్ టీమిండియా పేసర్ సిరాజ్ ఒకే ఓవర్లో రెండు వికెట్లతో సత్తా చాటాడు. పదహారో ఓవర్ రెండో బంతికి బెడింగ్హాం(12)ను పెవిలియన్కు పంపిన ఈ హైదరాబాదీ బౌలర్.. ఐదో బంతికి మార్కో జాన్సెన్(0) రూపంలో మరో వికెట్ దక్కించుకున్నాడు. మొత్తంగా ఇప్పటి వరకు ఐదు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. కేశవ్ మహరాజ్, వెరెనె క్రీజులో ఉన్నారు. సౌతాఫ్రికా స్కోరు: 34-6(16) మరోసారి మ్యాజిక్ చేసిన సిరాజ్ 15.2: కేప్టౌన్ టెస్టులో టీమిండియా స్పీడ్స్టర్ మహ్మద్ సిరాజ్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఇప్పటికే మార్క్రమ్, ఎల్గర్, జోర్జి రూపంలో మూడు వికెట్లు తీసిన తాజాగా నాలుగో వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. మంచి లైన్ అండ్ లెంగ్త్తో బౌలింగ్ చేసి డేవిడ్ బెడింగ్హాంను ఔట్ చేశాడు. తద్వారా సౌతాఫ్రికా ఐదో వికెట్ కోల్పోయింది. ఇక అంతకు ముందు బుమ్రా ట్రిస్టన్ స్టబ్స్ను అవుట్ చేసిన విషయం తెలిసిందే. 11 ఓవర్లు ముగిసే సరికి సౌతాఫ్రికా స్కోరు: 23-4 బెడింగ్హామ్ 8, వెరెనె సున్నా పరుగులతో క్రీజులో ఉన్నారు. నిప్పులు చెరుగుతున్న సిరాజ్.. 15 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ నిప్పులు చెరుగుతున్నాడు. అతడి ధాటికి సౌతాఫ్రికా 15 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. 15 పరుగుల వద్ద డి జార్జీ (2) ఔటయ్యాడు. నాలుగు వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా 9.2: సిరాజ్బౌలింగ్లో 2 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద టోనీ డీ జోర్జీ ఔట్ 8.3: బుమ్రా బౌలింగ్లో మూడో వికెట్గా వెనుదిరిగిన ట్రిస్టన్ స్టబ్స్ ►రెండో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా.. కెప్టెన్ ఔట్ ►సౌతాఫ్రికాతో రెండో టెస్టులో భారత్ బౌలర్ సిరాజ్ నిప్పులు చెరుగుతున్నాడు. ►ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో సౌతాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. మొదటి మ్యాచ్లో సెంచరీలో రాణించిన ఎల్గర్ ఈ ఇన్నింగ్స్లో 4(15) పరుగులు చేసి ఔటయ్యాడు. తొలి వికెట్ డౌన్ ►ఫస్ట్ వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా.. ►సిరాజ్ వేసిన రెండో ఓవర్లో మార్క్రమ్2(10) ఔట్ ►టీమిండియాతో రెండో టెస్టులో టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తెంబా బవుమా గాయం కారణంగా దూరమైన నేపథ్యంలో అతడి స్థానంలో డీన్ ఎల్గర్ సౌతాఫ్రికా కెప్టెన్గా బరిలోకి దిగాడు. ఈ మ్యాచ్లోనూ గెలిచి సిరీస్ను సొంతం చేసుకోవడమే తమ లక్ష్యమని టాస్ సందర్భంగా పేర్కొన్నాడు. ఎల్గర్కు ఆఖరి టెస్టు పిచ్ బ్యాటింగ్కు అనుకూలిస్తుంది కాబట్టే తొలుత బ్యాట్తో రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించాడు. తొలి టెస్టులో గెలిచాం కాబట్టి కేప్టౌన్లో తాము ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఆడగలమని ఎల్గర్ పేర్కొన్నాడు. గాయాల కారణంగా జట్టుకు దూరమైన బవుమా స్థానంలో ట్రిస్టన్ స్టబ్స్, గెరాల్డ్ కోయెట్జీ స్థానంలో లుంగి ఎంగిడిని రెండో టెస్టులో ఆడిస్తున్నట్లు ఎల్గర్ తెలిపాడు. కాగా వెటరన్ ఓపెనర్ డీన్ ఎల్గర్ కెరీర్లో ఇదే ఆఖరి టెస్టు కావడం విశేషం. అశ్విన్, శార్దూల్ అవుట్ ఇక ఇప్పటికే బాక్సింగ్ డే టెస్టులో ఓటమి పాలైన రోహిత్ సేన.. రెండో మ్యాచ్లో రెండు మార్పులతో బరిలోకి దిగింది. స్పిన్ ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో రవీంద్ర జడేజా, పేసర్ శార్దూల్ ఠాకూర్ స్థానంలో ముకేశ్ కుమార్ తుదిజట్టులో చోటు దక్కించుకున్నారు. సౌతాఫ్రికా వర్సెస్ ఇండియా రెండో టెస్టు తుదిజట్లు ఇవే సౌతాఫ్రికా ప్లేయింగ్ ఎలెవన్ డీన్ ఎల్గర్ (కెప్టెన్), ఐడెన్ మార్క్రమ్, టోనీ డి జోర్జీ, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ బెడింగ్హామ్, కైల్ వెర్రెన్నె(వికెట్ కీపర్), మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్, కగిసో రబాడ, నండ్రే బర్గర్, లుంగి ఎంగిడి. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, ముకేష్ కుమార్. చదవండి: T20 WC 2024: రోహిత్, కోహ్లి విషయంలో బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అగార్కర్ కీలక నిర్ణయం! -
ప్రొటిస్ బ్యాటింగ్ ఆర్డర్ బలహీనం: భారత్ గెలవాలంటే అదొక్కటే మార్గం
South Africa vs India, 2nd Test : సౌతాఫ్రికాతో రెండో టెస్టులో టీమిండియా గెలుపు అవకాశాలపై భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గత మ్యాచ్ సెంచరీ హీరో డీన్ ఎల్గర్ను తొందరగా అవుట్ చేస్తే రోహిత్ సేన పని సులువు అవుతుందని పేర్కొన్నాడు. కేప్టౌన్లో ఎల్గర్ కేవలం బ్యాటర్గా మాత్రమే కాకుండా కెప్టెన్గానూ బరిలోకి దిగుతున్న కారణంగా అతడిపై సహజంగానే ఒత్తిడి ఉంటుందన్న ఈ మాజీ ఓపెనర్.. టీమిండియా బౌలర్లు దీనిని తమకు అనుకూలంగా మార్చుకోవాలని సూచించాడు. ఎల్గర్ను పెవిలియన్కు పంపితే సౌతాఫ్రికా బ్యాటింగ్ ఆర్డర్ను కుప్పకూల్చడం కష్టమేమీ కాబోదని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. కేప్టౌన్లో అంత ఈజీ కాదు కాగా సౌతాఫ్రికాతో రెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా బాక్సింగ్ డే టెస్టులో ఓడిన టీమిండియా కేప్టౌన్లో గెలిచి సిరీస్ సమం చేయాలని భావిస్తోంది. అయితే, సీమర్లకు స్వర్గధామమైన న్యూల్యాండ్స్ పిచ్పై ఆతిథ్య జట్టు బౌలర్లు మరోసారి చెలరేగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇలాంటి తరుణంలో రోహిత్ సేన ఎలాంటి ప్రణాళికలు అమలు చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. కెప్టెన్ కాబట్టి ఒత్తిడి సహజం ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘డీన్ ఎల్గర్ కెరీర్లో ఇది ఆఖరి టెస్టు. తెంబా బవుమా జట్టుతో లేడు కాబట్టి ఎల్గర్ కెప్టెన్గా వ్యవహరించబోతున్నాడు. ఇప్పుడు తన దృష్టి మొత్తం కేవలం రన్స్ తీయడం కాకుండా.. ట్రోఫీ గెలవడం పైనే ఉందని ఇప్పటికే ఎల్గర్ స్పష్టం చేశాడు. కాబట్టి అతడిపై ఒత్తిడి ఉండటం సహజం. నా దృష్టిలో అయితే.. సౌతాఫ్రికా బ్యాటింగ్ ఆర్డర్ బలహీనంగానే ఉంది. డీన్ ఎల్గర్ బ్యాటింగ్ కూడా సాధారణంగానే ఉంది. అయితే, అతడిని అవుట్ చేయడం అంత తేలికేమీ కాదు. ఒక్కసారి ఎల్గర్ను పెవిలియన్కు పంపితే మాత్రం మిగతా బ్యాటర్లు కూడా క్యూ కట్టడం ఖాయం’’ అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. కేశవ్ మహరాజ్ను ఆడిస్తారు! అదే విధంగా.. పేసర్ గెరాల్డ్ కోయెట్జీ గాయపడటం సౌతాఫ్రికాకు ఎదురుదెబ్బేనన్న ఆకాశ్ చోప్రా.. అతడి స్థానంలో లుంగీ ఎంగిడీ జట్టులోకి వచ్చే అవకాశం లేదన్నాడు. ఎంగిడి దాదాపు ఏడాది కాలంగా ఫస్ట్ క్లాస్ క్రికెట్కు దూరంగా ఉన్నాడు కాబట్టి మేనేజ్మెంట్ అతడి వైపు మొగ్గు చూపకపోవచ్చని అభిప్రాయపడ్డాడు. స్పిన్నర్ కేశవ్ మహరాజ్ను రెండో టెస్టులో ఆడించే అవకాశాలు ఉన్నాయని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. చదవండి: T20 WC 2024: రోహిత్, కోహ్లి విషయంలో బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అగార్కర్ కీలక నిర్ణయం! -
కేప్టౌన్లో అంత ఈజీ కాదు.. ఇక్కడ సెంచరీలు చేసింది నలుగురే..!
రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా టీమిండియా రేపటి నుంచి (జనవరి 3) సౌతాఫ్రికాతో రెండో టెస్ట్లో తలపడనుంది. ఈ మ్యాచ్ కేప్టౌన్లోని న్యూల్యాండ్స్ మైదానం వేదికగా జరుగనుంది. ఈ పిచ్పై భారత్కు చెప్పుకోదగ్గ ట్రాక్ రికార్డు లేకపోవడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అసలే తొలి టెస్ట్లో ఓడిపోయి సిరీస్ కోల్పోయే ప్రమాదంలో ఉన్న టీమిండియా ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి పరువు దక్కించుకోవాలని పట్టుదలగా ఉంది. అయితే న్యూల్యాండ్స్లో టీమిండియా ట్రాక్ రికార్డు ప్రస్తుతం అందరినీ కలవరపెడుతుంది. ఈ మైదానంలో భారత్ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఇక్కడ ఇరు జట్ల మధ్య మొత్తం ఆరు మ్యాచ్లు జరగగా.. నాలుగింట గెలిచిన సౌతాఫ్రికా, రెండింటిని డ్రా చేసుకుంది. ఇరు జట్ల మధ్య చివరిసారిగా (2022, జనవరి 11-14) ఇక్కడ జరిగిన మ్యాచ్లో ఆతిథ్య జట్టు టీమిండియాను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. 1993, 2011లో జరిగిన మ్యాచ్లు డ్రా కాగా.. 1997, 2007, 2018, 2022 సిరీస్ల్లో ఇక్కడ జరిగిన మ్యాచ్లను సౌతాఫ్రికా గెలిచింది. న్యూల్యాండ్స్ పిచ్ ఆనవాయితీగా పేసర్లకు స్వర్గధామంగా ఉంటూ వస్తుంది. ఇక్కడ బ్యాటింగ్ చేసేందుకు దిగ్గజాలు సైతం వణికిపోతారు. ఈ మైదానంలో ఇప్పటివరకు కేవలం నలుగురు భారత క్రికెటర్లు మాత్రమే సెంచరీలు చేయగలిగారు. సచిన్ టెండూల్కర్ రెండుసార్లు.. మొహమ్మద్ అజారుద్దీన్, వసీం జాఫర్, రిషబ్ పంత్ తలో సారి న్యూల్యాండ్స్ పిచ్పై సెంచరీ మార్కును తాకారు. ఇక్కడ టీమిండియా అత్యధిక స్కోర్ 414గా ఉంది. 2007 సిరీస్లో భారత్ ఈ స్కోర్ను చేసింది. ఈ పిచ్పై టీమిండియా తరఫున అత్యధిక పరుగులు చేసిన రికార్డు సచిన్ పేరిట ఉంది. సచిన్ ఇక్కడ నాలుగు మ్యాచ్ల్లో ఏడు ఇన్నింగ్స్లు ఆడి 489 పరుగులు చేశాడు. ఇక్కడ భారత్ తరఫున అత్యధిక స్కోర్ (169) కూడా సచిన్ పేరిటే ఉంది. కాగా, ప్రస్తుత సిరీస్లో భాగంగా జరిగిన తొలి టెస్ట్లో టీమిండియా ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. -
IND VS SA 2nd Test: అరుదైన రికార్డుపై కన్నేసిన బుమ్రా
కేప్టౌన్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగబోయే రెండో టెస్ట్కు ముందు టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రాను ఓ అరుదైన రికార్డు ఊరిస్తుంది. ఈ మ్యాచ్లో బుమ్రా మరో ఏడు వికెట్లు తీస్తే.. కేప్టౌన్లో అత్యధిక వికెట్లు తీసిన విజిటింగ్ బౌలర్గా (యాక్టివ్ బౌలర్లలో) రికార్డుల్లోకెక్కుతాడు. ఈ వేదికపై బుమ్రా ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ల్లో 10 వికెట్లు పడగొట్టాడు. జనవరి 3 నుంచి ప్రారంభంకాబోయే మ్యాచ్లో అతను మరో ఏడు వికెట్లు తీస్తే ఇంగ్లండ్ వెటరన్ జేమ్స్ ఆండర్సన్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొడతాడు. కేప్టౌన్లో ఆండర్సన్ అందరి కంటే ఎక్కువగా (యాక్టివ్ బౌలర్లలో) 16 వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్గా కేప్టౌన్ పిచ్పై అత్యధిక వికెట్లు తీసిన పర్యాటక బౌలర్ రికార్డు ఇంగ్లండ్కు చెందిన కొలిన్ బ్లైత్ (25 వికెట్లు) పేరిట ఉంది. కేప్టౌన్ టెస్ట్లో బుమ్రా మరో మూడు వికెట్లు తీసినా మరో రికార్డు అతని ఖాతాలో వచ్చిపడుతుంది. ఈ మ్యాచ్లో అతను మూడు వికెట్లు తీస్తే.. కేప్టౌన్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గా రికార్డుల్లోకెక్కుతాడు. ఈ రికార్డు మాజీ పేసర్ జవగల్ శ్రీనాథ్ (12 వికెట్లు) పేరిట ఉంది. కేప్టౌన్తో బుమ్రాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. సరిగ్గా ఐదేళ్ల క్రితం (2018) అతను ఇక్కడే తన టెస్ట్ అరంగేట్రం చేశాడు. దీంతో ఈ మ్యాచ్లో బుమ్రాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఓవరాల్గా బుమ్రా తన టెస్ట్ కెరీర్లో 31 మ్యాచ్లు ఆడి 21.84 సగటున 132 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుత పర్యటనలో భాగంగా సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్ట్లోనూ బుమ్రా సత్తా చాటాడు. ఆ మ్యాచ్లో అతను 4 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే, రెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా జరిగిన తొలి టెస్ట్లో టీమిండియా ఇన్నింగ్స్ 32 పరుగుల భారీ తేడాతో పరాజయంపాలైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో కేఎల్ రాహుల్ (తొలి ఇన్నింగ్స్లో 101), విరాట్ కోహ్లి (సెకెండ్ ఇన్నింగ్స్లో 76), జస్ప్రీత్ బుమ్రా (4/69) మినహా భారత ఆటగాళ్లంతా దారుణంగా విఫలమయ్యారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. తొలి ఇన్నింగ్స్లో 245, సెకెండ్ ఇన్నింగ్స్లో 131 పరుగులకే కుప్పకూలగా.. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ మాత్రమే బ్యాటింగ్ చేసి 408 పరుగుల భారీ స్కోర్ చేసింది. నిర్ణయాత్మకమైన రెండో టెస్ట్లో గెలిచి సిరీస్ కోల్పోయే ప్రమాదం నుంచి తప్పించుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. -
సౌతాఫ్రికాతో రెండో టెస్టు.. టీమిండియాను భయపెడుతున్న రికార్డులు!
కేప్టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో తలపడేందుకు టీమిండియా సిద్దమవుతోంది. ఈ మ్యాచ్లో విజయం సాధించి సిరీస్ను కాపాడుకోవాలని భారత జట్టు భావిస్తోంది. ఈ మ్యాచ్ కోసం రోహిత్ సేన నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తోంది. అయితే ఈ మ్యాచ్కు ముందు కేప్టౌన్లోని రికార్డులు భారత జట్టును భయపెడుతున్నాయి. కేప్టౌన్లోని న్యూల్యాండ్స్ క్రికెట్ స్టేడియంలో టీమిండియా టెస్టు రికార్డు మరి దారుణంగా ఉంది. న్యూలాండ్స్లో భారత్ రికార్డులు ఇవే.. ►ఇప్పటివరకు కేప్టౌన్లో ఆరు టెస్టు మ్యాచ్లు ఆడిన భారత్.. ఒక్క మ్యాచ్లో భారత్ విజయం సాధించలేదు. 4 మ్యాచ్లలో భారత్ ఓటమి పాలవ్వగా.. రెండు సార్లు డ్రా ముగిచింది. ఈ వేదికలో 1993లో భారత్ తొలి టెస్టు మ్యాచ్ ఆడింది. ►ఈ స్టేడియంలో టీమిండియా అత్యధిక అత్యధిక స్కోర్ 414 పరుగులగా ఉంది. 2007లో ప్రోటీస్తో జరిగిన మ్యాచ్లో 131.1 ఓవర్లలో 414 పరుగులకు ఆలౌటైంది. ►ఈ వేదికలో భారత జట్టు అత్యల్ప స్కోర్ 135గా ఉంది. 2018లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో 42.4 ఓవర్లలో 135 పరుగులకు టీమిండియా ఆలౌటైంది. ►న్యూలాండ్స్ స్టేడియంలో అత్యధిక పరుగులు చేసిన రికార్డు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. ఈ వేదికలో నాలుగు టెస్టులు ఆడిన సచిన్ 489 పరుగులు సాధించాడు. ►అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గా మాజీ పేసర్ జవగల్ శ్రీనాథ్ ఉన్నాడు. రెండు టెస్టులు ఆడిన శ్రీనాథ్ 12 వికెట్లు పడగొట్టాడు. ►అత్యధిక సిక్స్లు కొట్టిన రికార్డు టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్(4) పేరిట ఉంది. చదవండి: 2024 ఏడాదిలో టీమిండియా షెడ్యూల్ ఇదే.. ఈ సారైనా కల నెరవేరేనా? -
విధివంచితురాలి యథార్థ గాధ: ఆమె శరీర భాగాలను గొడుగు మొనలతో పొడిచి..
మా చిన్నతనంలో చెంచులో.. మరెవరో.. నల్లమల అడవుల నుంచి ఎలుగుబంట్ల ముక్కుకు తాడు కట్టి తీసుకుని వచ్చేవారు. ఆ జీవి చుట్టూ జనం మూగేవారు. దాని వీపుపై తమ పిల్లలను సవారీ చేయించేవారు. దానిని తడిమేవారు, తట్టేవారు. అల్లరి మనుషులు కొందరు కర్ర పుల్లతో పొడిచేవారు, మరి కొంతమంది ఆ ఎలుగ్గొడ్డు వెంట్రుకలను పీక్కునేవారు. ఆ వెంట్రుకలను దారంగా పేనుకుని కాలి బ్రోటన వేలుకు కట్టుకుంటే శుభమని భావించేవారు. లేదా దాని యజమానికి కాసిన్ని డబ్బులు ఇచ్చి అతనితోనే దాని వెంట్రుకలను పీకించే వారు. Duniyaa banaane wale, kyaa tere man me samaai ? Kaaheko duniyaa banaai? అని ఆడుగుతారు కవి శైలేంద్ర ఒక పాటలో. ఈ పాట తెలిసిన వాళ్ళే కాదు, తెలీని వాళ్ళు కూడా భగవంతుడిని ఈ మాట అడిగే ఉంటారు తమ తమ మూగభాషలో. ఒక విధివంచితురాలి యథార్థ గాధ 20 ఏళ్ల సారా బార్ట్మాన్ 1810లో బతుకు తెరువు కోసమన్న తలంపుతో కేప్టౌన్ నుంచి లండన్కు బయలుదేరడానికి పడవ ఎక్కినప్పుడు, ఆమె ఇక తన ఇంటిని మళ్లీ చూడదని ఆమెకు తెలియదు. అక్కడి గాలిని, అక్కడి గడ్డిని, అక్కడి సూర్యుడి వెలుతురును ఇక తన జీవితకాలంలో మరెప్పుడు తాకలేదని ఆవిడకు తెలీదు. మా ప్రాంతాల ఎలుగుబంటి కన్నా అన్యాయమైన జీవితం ఆవిడకు సంప్రాప్తించినపుడు ఆవిడ పదే పదే అదే ప్రశ్న భగవంతుడిని అడుగుతూ ఉండి ఉండవచ్చు. మా ఊరి ఎలుగు బంటిని నేను బోనులో చూడలేదు. కానీ మనిషి పుట్టుక పుట్టిన సారా బార్ట్మన్ని బోనులో నుండి బయటకు లాగేవారు. ధృఢమైన ఎలుగు శరీరాన్ని జనం పుల్లలతో తాకేవారు. సారా శరీరాన్ని, ఆవిడ వంటిని, ఆవిడ శరీర భాగాలను ఆడా మగ, పిల్లా జెల్లా, ముసలీ ముతక ప్రేక్షకులు అంతా తాకేవారు, గొడుగు మొనలతో పొడిచి పొడిచి పులకించి పోయేవారు. ఎలుగుబంటి వెంట్రుకలతో తమ ధైర్య సాహాసాలని పెంచుకోవడానికి చూశారు. సారా బార్ట్మన్ శరీరాంగాలను చూసుకుంటూ లండన్ సభ్య సమాజం, ఇంగ్లీష్ నాగరిక ప్రపంచం ప్రేరేపణలో మునిగి తేలారు. అచ్చు ఎలుగుబంటి మీద స్వారీ చేసినట్లు నల్ల పిల్ల, అఫ్రికా అమ్మాయి సారాబార్ట్మన్ మీద ఊరేగింది మానవజాతి. దునియా బనానే వాలే, క్యా తేరే మన్ మే సమాయి? కాహికో దునియా బనాయి తూనే, కాహికో దునియా బనాయి? మనుష్యులు కాదు.. రాక్షసులు ఇరవై ఆరు సంవత్సరాల వయస్సులో మానవ ఉన్మాద హింసతో మరణించింది సారా బార్ట్మన్. మరణించినా ఆమె శరీరాన్ని విడిచిపెట్టలేదు జాత్యహంకారం. 1815 నుండి ఆమె మెదడు, ఆమె తాలూకు శరీర తోలు తిత్తి బొమ్మ , ఆమె శరీర భాగాలను 1974 వరకు పారిస్ మ్యూజియంలో ప్రదర్శనలో పెట్టారు. సారా బార్ట్మన్ జీవితాన్ని 2010 బ్లాక్ వీనస్ అనే సినిమాగా తీశారు. సున్నిత మనస్కులు, మానవ జాతి మీద ప్రేమ, గౌరవం, ఔన్నత్యం కలవారు ఎవరూ ఈ సినిమా భరించలేరు. -అన్వర్, ఆర్టిస్ట్, సాక్షి. 'మానవ జూ'ల ఏర్పాటులో భాగంగా యూరోపియన్ సమాజం సారా బార్ట్మన్ పట్ల వ్యవహరించిన తీరు అమానుషం. 1789లో జన్మించిన ఆమెను యూరప్లో దేశాల్లోని జాతరల్లో ప్రేక్షకుల ముందు ప్రదర్శించేవాళ్లు. 1815లో ఆమె చనిపోయారు. అయినప్పటికీ సారా అస్తిపంజరం, మెదడు సహా లైంగిక అవయవాలను పారిస్లోని ఓ మ్యూజియంలో 1974 వరకూ ప్రదర్శించినట్లు చరిత్ర చెబుతోంది. ఇక 2002లో సారా అవశేషాలను తిరిగి సౌతాఫ్రికాకు అప్పగించినట్లు కథనాలు ఉన్నాయి. చదవండి: Neena Rao: బిడ్డ మేధాశక్తిని గ్రహించండి! బిడ్డకు ఏమివ్వాలో తెలుసుకోండి.. -
వీడియో వైరల్: వాహ్.. వాటే క్యాచ్.. ఆల్ టైం గ్రేట్ క్యాచ్!
అప్పుడప్పుడూ క్రికెట్లో అసాధారణ విన్యాసాలు చూస్తూ ఉంటాం. బ్యాట్స్మెన్ అద్భుతమైన షాట్స్ కావొచ్చు.. వికెట్ కీపర్ల నైపుణ్యాలు కావొచ్చు.. ఫీల్డర్ల మెరుపు విన్యాసాలు కావొచ్చు. ఇలా ఎన్నో సూపర్మూమెంట్స్ను ఆస్వాదిస్తూ ఉంటాం. ఇలా ఒక అద్భుతమైన ఫీల్డింగ్ మూమెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మ్యాచ్ జరిగి రెండు దశాబ్దాల కావొస్తున్నా ఆ విన్యాసం మాత్రం ఇప్పటికీ వావ్ అనిపిస్తోంది. 1997లో కేప్టౌన్ వేదికగాభారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన టెస్టు మ్యాచ్లో ఒక ఫీల్డింగ్ మూమెంట్ అబ్బురపరచడమే కాదు.. ఆల్ టైమ్ టాప్-10 క్యాచెస్లో నిలుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. 1997లొ కేప్టౌన్లో టెస్టు మ్యాచ్ జరగ్గా, ఆడమ్ బాచెర్ ఒక క్యాచ్ అందుకున్నాడు. అది కూడా భారత దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ క్యాచ్. మెక్మిలాన్ బౌలింగ్ భారీ షాట్ ఆడబోయిన సచిన్.. ఆడమ్ మార్క్ బాచెర్ పట్టిన అద్భుతమైన క్యాచ్తో వెనుదిరిగాడు. ఆ షాట్ను కచ్చితంగా ఫోర్ వెళుతుందని ఊహించిన సచిన్.. బాచెర్ ఫీల్డింగ్ విన్యాసంతో ఆశ్చర్యానికి గురవ్వడమే కాకుండా భారంగా పెవిలియన్ వీడాడు. బంతి గాల్లో ఉండగానే దాన్ని వెంటాడిన బాచెర్.. ఒంటి చేత్తో అందుకుని శభాష్ అనిపించాడు. నేడు(అక్టోబర్ 29వ తేదీ) మార్క్ బాచెర్ బర్త్ డే సందర్భంగా ఈ క్యాచ్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. క్రికెట్ సుప్రిమో ఆలీ బాచెర్ మేనల్లుడే మార్క్ బాచెర్. ఆనాటి మ్యాచ్ సదరు ఇన్నింగ్స్లో సచిన్ 169 పరుగులు చేశాడు. Happy Birthday Adam Bacher 🇿🇦. The nephew of cricket supremo Ali Bacher. Played 19 Tests & Scored 833 with 96 His top Score One of Best Catch he Taken in 90s of @sachin_rt in Cape Town 1997 & even this catch should in all time top 10 catches. pic.twitter.com/20eEI0gnwV— Zohaib (Cricket King) 🏏 (@Zohaib1981) October 29, 2022 -
Aus Vs SA: ‘మేమే కాదు దక్షిణాఫ్రికా కూడా టాంపరింగ్ చేసింది’
Tim Paine- Ball Tampering- Sandpaper Scandal- సిడ్నీ: 2018లో కేప్టౌన్లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా టెస్టు సందర్భంగా జరిగిన ‘బాల్ టాంపరింగ్’ ఉదంతం క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపర్చింది. దాంతో స్మిత్, వార్నర్, బాన్క్రాఫ్ట్లపై వేటు పడటంతో పాటు తర్వాతి మ్యాచ్నుంచి టిమ్ పెయిన్ ఆస్ట్రేలియాకు కెప్టెన్గా వ్యవహరించాడు. అయితే నాటి ఘటనను తన పుస్తకం ‘ద పెయిడ్ ప్రైస్’లో గుర్తు చేసుకున్న పెయిన్... తామే కాదు, తర్వాతి టెస్టులో దక్షిణాఫ్రికా కూడా టాంపరింగ్ చేసిందని వ్యాఖ్యానించాడు. అయితే స్థానిక ప్రసారకర్తల సహాయంతో ఆ వీడియోను దాచేశారని అతను ఆరోపించాడు. ‘సిరీస్ నాలుగో టెస్టులో ఇది జరిగింది. దక్షిణాఫ్రికా ప్లేయర్ చేతిలో ఉన్న బంతిపై చాలా పగుళ్లు ఉన్న దృశ్యం అక్కడి భారీ స్క్రీన్పై కనిపించింది. కానీ ఆ వెంటనే దానిని తొలగించారు. మేం ఈ విషయంపై అంపైర్లతో మాట్లాడినా అసలు ఎవరూ పట్టించుకోలేదు’ అని పెయిన్ చెప్పాడు. బాల్ టాంపరింగ్ ఘటన సమయంలో తమ ముగ్గురు క్రికెటర్లకు ఎవరూ అండగా నిలవలేదని విషయాన్ని అతను అంగీకరించాడు. ‘సాధారణంగా ఇలాంటి సమయంలో తమ ఆటగాళ్లను సహచర క్రికెటర్లు ఆదుకోవాలి. మానసికంగా వారికి అండగా నిలవాలి. కానీ వారందరినీ వెలి వేసినట్లు చూశారు’ అని పెయిన్ చెప్పాడు. చదవండి: Ind Vs Pak: టీమిండియా మోసం చేసి గెలిచిందంటూ అక్కసు.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన దిగ్గజ అంపైర్ T20 WC 2022: అక్తర్, బ్రాడ్ హాగ్లు దొరికేశారు కదా..! -
IND vs SA 3rd Test Day 1: భారత్ 223 ఆలౌట్, దక్షిణాఫ్రికా 17/1
IND vs SA 3rd Test Updates: భారత్ 223 ఆలౌట్, దక్షిణాఫ్రికా 17/1 తొలి రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా వికెట్ నష్టానికి 17 పరుగులు చేసింది. కెప్టెన్ డీన్ ఎల్గర్(3)ను బుమ్రా ఔట్ చేశాడు. క్రీజ్లో మార్క్రమ్(8), కేశవ్ మహారాజ్(6) ఉన్నారు. 8: 46 PM: సఫారీ పేసర్ల విజృంభణ.. టీమిండియా 223 ఆలౌట్ దక్షిణాఫ్రికాతో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో టెస్ట్లో టీమిండియా నిరాశపరిచింది. సఫారీ పేసర్ల ధాటికి 223 పరుగులకే చాపచుట్టేసింది. కెప్టెన్ కోహ్లి(79) ఓంటరి పోరాటం చేయడంతో గౌరవప్రదమైన స్కోర్ను సాధించగలిగింది. సఫారీ బౌలర్లు రబాడ 4, మార్కో జన్సెన్ 3, ఒలీవియర్, ఎంగిడి, కేశవ్ మహారాజ్ తలో వికెట్ సాధించారు. కోహ్లి(79) ఔట్.. తొమ్మిదో వికెట్ కోల్పోయిన టీమిండియా క్రీజ్లో పాతుకుపోయిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి(79) ఎట్టకేలకు ఔటయ్యాడు. రబాడ బౌలింగ్లో వెర్రిన్కు క్యాచ్ ఇచ్చి 211 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్గా వెనుదిరిగాడు. క్రీజ్లో ఉమేశ్ యాదవ్, షమీ ఉన్నారు. టీమిండియా ఎనిమిదో వికెట్ డౌన్ డ్రింక్స్ బ్రేక్కు ముందు టీమిండియాకు మరో షాక్ తగిలింది. రబాడ బౌలింగ్లో బుమ్రా డకౌటయ్యాడు. ఫలితంగా టీమిండియా 210 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయింది. క్రీజ్లో కోహ్లి(78), ఉమేశ్ యాదవ్ ఉన్నారు. శార్ధూల్ ఔట్ రెండో టెస్ట్లో బౌలింగ్తో పాటు బ్యాటింగ్లోనూ రాణించిన శార్ధూల్ ఠాకూర్(12) ఈ మ్యాచ్లో నిరాశపరిచాడు. వచ్చీ రాగానే భారీ షాట్లతో విరుచుకుపడిన అతను.. మరో భారీ షాట్కు ప్రయత్నించి కేశవ్ మహారాజ్ బౌలింగ్లో కీగన్ పీటర్సన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఫలితంగా టీమిండియా 205 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది. క్రీజ్లో కోహ్లి(73), బుమ్రా ఉన్నారు. జన్సెన్ విజృంభణ.. 175 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన టీమిండియా దక్షిణాఫ్రికా యువ పేసర్ మార్కో జన్సెన్ విజృంభణతో టీమిండియా 175 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఎదురీదుతుంది. అశ్విన్ 2 పరుగులు మాత్రమే చేసి జన్సెన్ బౌలింగ్లో వెర్రిన్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. క్రీజ్లో కోహ్లి(56), శార్ధూల్ ఠాకూర్ ఉన్నాడు. 167 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన టీమిండియా మార్కో జన్సెన్ టీమిండియాపై మరోసారి ప్రతాపం చూపుతున్నాడు. ఈ ఇన్నింగ్స్లో ఇదివరకే కీలకమైన పుజారా వికెట్ పడగొట్టిన అతను.. రిషబ్ పంత్(27)ను కూడా పెవిలియన్కు పంపాడు. దీంతో టీమిండియా 167 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. కెప్టెన్ విరాట్ కోహ్లి(50), అశ్విన్ క్రీజ్లో ఉన్నారు. నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా 116 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. రహానే(9) వైఫల్యాల పరంపరను కొనసాగించాడు. రబాడ బౌలింగ్లో వెర్రిన్కు క్యాచ్ ఇచ్చి రహానే ఔటయ్యాడు. క్రీజ్లో విరాట్ కోహ్లి(29), పంత్ ఉన్నారు. టీమిండియా మూడో వికెట్ డౌన్ క్రీజ్లో నిలదొక్కుకున్నట్లు కనిపించిన పుజారా 43 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద మార్కో జన్సెన్ బౌలింగ్లో వెర్రిన్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఫలితంగా 95 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. క్రీజ్లో కోహ్లి(17), రహానే ఉన్నారు. 5: 06 PM: టీమిండియా స్కోరు: 85/2 (34.3). పుజారా 35, కోహ్లి 16 పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రొటిస్ బౌలర్లు రబడ, ఒలివర్ చెరో వికెట్ తీశారు. 4: 00 PM: లంచ్ బ్రేక్ సమయానికి టీమిండియా స్కోరు: 75/2 (28). కోహ్లి 15, పుజారా 26 పరుగులతో క్రీజులో ఉన్నారు. 3: 36 PM: టీమిండియా ప్రస్తుత స్కోరు: 53/2 (22.1). కెప్టెన్ కోహ్లి 5, పుజారా 17 పరుగులతో క్రీజులో ఉన్నారు. 2: 53 PM: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత జట్టు రెండో వికెట్ కోల్పోయింది. మయాంక్ అగర్వాల్ను రబడ అవుట్ చేశాడు. స్కోరు: 33/2. విరాట్ కోహ్లి, పుజారా క్రీజులో ఉన్నారు. 2: 48 PM: తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా.. కేఎల్ రాహుల్ అవుట్. ఒలివర్ బౌలింగ్లో టీమిండియా ఓపెనర్ రాహుల్ పెవిలియన్ చేరాడు. వికెట్ కీపర్ వెరెన్కు క్యాచ్ ఇచ్చి 12 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. పుజారా క్రీజులోకి వచ్చాడు. 2: 30 PM: కేఎల్ రాహుల్ 12, మయాంక్ అగర్వాల్ 15 పరుగులతో క్రీజులో ఉన్నారు. స్కోరు 31/0. మూడో టెస్టులో రెండు మార్పులతో భారత జట్టు బరిలోకి దిగింది. గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమైన విరాట్ కోహ్లి.. విహారి స్ధానంలో జట్టులోకి రాగా, సిరాజ్ స్థానంలో ఉమేశ్ యాదవ్ తుది జట్టులోకి వచ్చాడు. ఇక దక్షిణాఫ్రికా ఎటువంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగింది. తుది జట్లు: భారత్: కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, ఛతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, విరాట్ కోహ్లి(కెప్టెన్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, ఉమేశ్ యాదవ్ సౌతాఫ్రికా: డీన్ ఎల్గర్(కెప్టెన్), ఎయిడెన్ మార్కరమ్, కీగన్ పీటర్సన్, రసే వాన్ డెర్ డసెన్, తెంబా బవుమా, కైలీ వెరెనె(వికెట్ కీపర్), మార్కో జాన్సెన్, కగిసో రబడ, కేశవ్ మహరాజ్, డువానే ఒలివర్, లుంగి ఎంగిడి. కేప్టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో తుది సమరానికి భారత్ సిద్దమైంది. ఒక్కో టెస్టు గెలిచి భారత్, దక్షిణాఫ్రికా 1–1తో సమంగా ఉన్న సంగతి తెలిసిందే. తొలి సారి సఫారీ గడ్డపై టెస్ట్ సిరీస్ సాధించి చరిత్ర సృష్టించాలన్న పట్టుదలతో టీమిండియా బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. చదవండి: క్రికెట్ చరిత్రలోనే అద్భుతమైన క్యాచ్.. సూపర్ మ్యాన్లా.. వీడియో వైరల్! -
Ind Vs Sa 3rd Test: నేటి నుంచి భారత్, సౌతాఫ్రికా మూడో టెస్ట్
-
Ind Vs Sa 3rd Test: టెస్టు మ్యాచ్కు సరిగ్గా సరిపోయే పిచ్.. టాస్ గెలిస్తే..
Ind Vs Sa Test Series 2021-22: దక్షిణాఫ్రికా గడ్డపై ఏడు పర్యటనల్లో ఒక్కసారి కూడా టెస్టు సిరీస్ గెలవలేకపోయిన భారత జట్టు ఈ సారి సిరీస్ విజయమే లక్ష్యంగా అక్కడ అడుగుపెట్టింది. సెంచూరియన్ విక్టరీతో దానికి బాటలు వేసుకున్నా... జొహన్నెస్బర్గ్లో ఆతిథ్య జట్టు పోరాటంతో లెక్క సమమైంది. ఇప్పుడు మరో అవకాశం మన ముంగిట నిలిచింది. గత మ్యాచ్లో ఓడినా ఇప్పటికీ ప్రత్యర్థితో పోలిస్తే టీమిండియా పటిష్టంగా కనిపిస్తోంది. అయితే, సొంత మైదానంలో సిరీస్ చేజార్చుకోరాదనే పట్టుదల, గత మ్యాచ్ విజయం ఇచ్చిన స్ఫూర్తి సఫారీ టీమ్లో కూడా ఉత్సాహం పెంచాయి. న్యూలాండ్స్ మైదానంలో భారత్ గతంలో ఎన్నడూ గెలవకపోయినా...కొత్త చరిత్ర సృష్టించడం ఈ జట్టుకు కొత్త కాదు. ఇక పిచ్, వాతావరణం కేప్టౌన్లోని న్యూలాండ్స్ మైదానంలో దక్షిణాఫ్రికా- టీమిండియా మధ్య మూడో టెస్టు జరుగనుంది. ఒక టెస్టు మ్యాచ్కు సరిగ్గా సరిపోయే పిచ్ అని విశ్లేషకుల అంచనా. ఆరంభంలో పేసర్లు ప్రభావం చూపించడంతో పాటు బౌన్స్ కారణంగా బ్యాట్స్మెన్ కూడా బాగా పరుగులు సాధించే అవకాశం ఉంది. మ్యాచ్ సాగుతున్న కొద్దీ పొడిబారి స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకోవడం ఖాయం. మంచి వాతావరణం, వర్షం సూచన లేదు. టీమిండియా రికార్డు న్యూలాండ్స్ మైదానంలో భారత్ 5 టెస్టులు ఆడింది. 3 మ్యాచ్లలో ఓడి 2 ‘డ్రా’గా ముగించింది. భారత తుది జట్టు అంచనా: కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి(కెప్టెన్), అజింక్య రహానే, రిషభ్ పంత్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, ఉమేశ్ యాదవ్. చదవండి: IPL 2022: కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్! 🔊 🔊 🔛 Practice 🔛 𝐈𝐧 𝐭𝐡𝐞 𝐳𝐨𝐧𝐞 - 𝐂𝐚𝐩𝐭𝐚𝐢𝐧 𝐊𝐨𝐡𝐥𝐢.👌 👌#TeamIndia | #SAvIND | @imVkohli pic.twitter.com/ChFOPzTT6q — BCCI (@BCCI) January 10, 2022 -
Ind Vs Sa 3rd Test: నేను ఫిట్గా ఉన్నా.. సిరాజ్ సిద్ధంగా లేడు: కోహ్లి
-
ఎక్కడ మొదలెట్టానో అక్కడే ఉన్నాను.. టీమిండియా పేసర్ ఆసక్తికర ట్వీట్
IND Vs SA 3rd Test: కేప్టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో రేపటి(జనవరి 11) నుంచి ప్రారంభంకానున్న నిర్ణయాత్మక మూడో టెస్ట్కు ముందు టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా ఆసక్తికర ట్వీట్ చేశాడు. టెస్ట్ కెరీర్ను ఎక్కడ మొదలుపెట్టానో నాలుగేళ్ల తర్వాత అక్కడే ఉన్నానంటూ తన టెస్ట్ అరంగేట్రాన్ని గుర్తు తెచ్చుకున్నాడు. 2018 జనవరిలో ఇదే వేదికపై టెస్ట్ల్లోకి ఎంట్రీ ఇచ్చిన బుమ్రా.. నాలుగేళ్ల కాలంలో ఆటగాడిగానే కాకుండా వ్యక్తిగానూ పరిణితి చెందానని, తిరిగి కేప్టౌన్కు రావడం మధుర స్మృతులను నెమరువేసుకున్నట్లు ఉందని భావోద్వేగంతో కూడిన పోస్ట్ చేశాడు. Cape Town, January 2018 - is where it all began for me in Test cricket. Four years on, I’ve grown as a player and a person and to return to this ground brings back special memories. 😊 pic.twitter.com/pxRPNnqwBH— Jasprit Bumrah (@Jaspritbumrah93) January 9, 2022 విరాట్ కోహ్లి నేతృత్వంలోని టీమిండియా 2018లో దక్షిణాఫ్రికా పర్యటనకు వచ్చింది. ఆ సిరీస్లో తొలి మ్యాచ్ ద్వారా బుమ్రా టెస్ట్ అరంగేట్రం చేశాడు. 3 మ్యాచ్ల ఆ సిరీస్లో అతను 14 వికెట్లు పడగొట్టాడు. ఇప్పటివరకు 25 టెస్ట్లు ఆడిన బుమ్రా.. 23.24 సగటుతో 106 వికెట్లు సాధించాడు. ఇదిలా ఉంటే, 3 టెస్ట్ల ప్రస్తుత సిరీస్లో భారత్, దక్షిణాఫ్రికా జట్లు చెరో మ్యాచ్ గెలిచి సమంగా నిలిచాయి. రేపటి నుంచి ప్రారంభంకాబోయే నిర్ణయాత్మక మ్యాచ్లో ఇరు జట్లు అమితుమీకి సిద్ధమయ్యాయి. చదవండి: విరాట్ కోహ్లిని బ్రాండ్ అంబాసిడర్గా పెట్టుకుని, భార్యకు భరణం కట్టలేనంటావా..? -
Ind Vs Sa 3rd Test: నేను ఫిట్గా ఉన్నా.. సిరాజ్ సిద్ధంగా లేడు: కోహ్లి
IND Vs SA 3rd Test: ఎట్టకేలకు టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి మీడియా ముందుకు వచ్చాడు. దక్షిణాఫ్రికాతో నిర్ణయాత్మక మూడో టెస్టుకు ముందు నిర్వహించిన ప్రెస్ కాన్పరెన్స్లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. తను ఫిట్గా ఉన్నాడని స్పష్టం చేశాడు. కేప్టౌన్ టెస్టుకు అందుబాటులో ఉంటానని పేర్కొన్నాడు. ఇక స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ ఇంకా పూర్తిగా కోలుకోలేదని కోహ్లి వెల్లడించాడు. ‘‘నేను పూర్తి ఫిట్నెస్ సాధించాను. సిరాజ్ మాత్రం మ్యాచ్ ఆడేందుకు సిద్ధంగా లేడు. ఈరోజు జరిగే సమావేశంలో అతడి స్థానంలో ఎవరిని తీసుకోవాలో చర్చిస్తాం. నిజానికి సిరాజ్ స్థానాన్ని భర్తీ చేయడానికి మాకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నిజంగా ఇది మాకు గర్వకారణం’’ అని కోహ్లి పేర్కొన్నాడు. -
దక్షిణాఫ్రికా ‘పార్లమెంట్’లో అగ్ని ప్రమాదం
కేప్ టౌన్: కేప్టౌన్లోని దక్షిణాఫ్రికా పార్లమెంట్ భవన సముదాయంలో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఉదయం 6 గంటల ప్రాంతంలో ప్రభుత్వ కార్యాలయాలున్న పురాతన పార్లమెంట్ భవనం మూడో అంతస్తులో మొదటగా మంటలు ప్రారంభమయ్యాయి. అనంతరం అగ్ని కీలలు పక్కనే ఉన్న ప్రస్తుత పార్లమెంట్ నేషనల్ అసెంబ్లీ భవనానికి వ్యాపించాయి. పార్లమెంట్ కార్యాలయ భవనం పైకప్పు కూలింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారని మంత్రి పాట్రీసియా చెప్పారు. ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయా లేదా విద్రోహ చర్యా అనేది ఇప్పుడే చెప్పలేమని పార్లమెంట్ స్పీకర్ నొసివివే అన్నారు. అగ్ని కీలల వేడికి ఆ కాంప్లెక్స్లోని మిగతా భవనాలు దెబ్బతినడంతోపాటు, అందులోని కళాఖండాలు ధ్వంసమయ్యే ప్రమాదముందని మంత్రి పాట్రీసియా ఆందోళన వ్యక్తం చేశారు. సంఘటన ప్రాంతాన్ని అధ్యక్షుడు సిరిల్ రమఫోసా సందర్శించారు. ఘటనకు సంబంధించి పోలీసులు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. మంటలు మొదట ప్రారంభమైన పార్లమెంట్ పాత భవనం 1880ల నాటిది కాగా, దాని వెనుక ఉన్న నేషనల్ అసెంబ్లీ భవనం ఇటీవలి కాలంలో నిర్మించింది. కాగా, దక్షిణాఫ్రికాకు మూడు రాజధానులున్నాయి. కేప్టౌన్ నగరం లెజిస్లేటివ్ రాజధాని కాగా, ప్రిటోరియా పరిపాలన కేంద్రంగా, బ్లోమ్ ఫోంటెన్ న్యాయ రాజధానిగాను ఉన్నాయి. #BREAKING: Firefighters are battling a large fire that has ripped through the Houses of Parliament in Cape Town, South Africa "There have been reports of some walls showing cracks, which could indicate a collapse” Jermaine Carelse, of CT fire servicepic.twitter.com/LZTNH0Dzmu — Stefan Simanowitz (@StefSimanowitz) January 2, 2022 -
జాతి వివక్ష పోరాట యోధుడు అస్తమయం
జొహన్నెస్బర్గ్/న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాలో జాతి వివక్షపై అవిశ్రాంత పోరాటం సాగించిన హక్కుల నేత, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత డెస్మండ్ టుటు(90) అస్తమించారు. ఆర్చ్బిషప్ డెస్మండ్ టుటు ఆదివారం వేకువజామున కేప్టౌన్లోని ఓ ఆస్పత్రిలో కన్నుమూశారని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా ప్రకటించారు. గతంలో క్షయవ్యాధికి గురైన డెస్మండ్ టుటు, ప్రొస్టేట్ కేన్సర్ బారినపడి 1997లో శస్త్రచికిత్స చేయించుకున్నారు. అనంతరం పలు అనారోగ్య సమస్యలు ఆయన్ను చుట్టుముట్టాయి. బ్రిటిషర్ల హయాంలో నల్లజాతి ప్రజల హక్కుల కోసం, అన్యాయాలకు గురైన వారి తరఫున డెస్మండ్ టుటు తీవ్రంగా పోరాడారు. నల్ల జాతీయుల పాలన మొదలైన తర్వాత కూడా అన్యాయాలను, అక్రమాలను ఖండించడంలో ఆయన వెనుకాడలేదు. అధికార ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్లో కొనసాగుతూనే పార్టీ నేతలు అక్రమాలకు పాల్పడుతూ ప్రభుత్వ సంస్థలను కొల్లగొడుతున్న తీరుపై గళమెత్తారు. ఆర్చ్బిషప్ టుటు మృతిపై భారత ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆర్చి బిషప్ టుటును ‘ఆఫ్రికా పీస్ బిషప్’గా నోబెల్ ఇన్స్టిట్యూట్ అభివర్ణించింది. దక్షిణాఫ్రికా నల్లజాతి ప్రజలపై బ్రిటిషర్లు దారుణాలకు పాల్పడినప్పటికీ బిషప్ టుటు మాత్రం అహింసాయుత విధానాలకే కట్టుబడి ఉన్నారని కొనియాడింది. మండేలాతో విడదీయరాని మైత్రి మొదట జొహన్నెస్బర్గ్ ఆర్చ్బిషప్గా ఉన్న టుటు తర్వాత కేప్టౌన్ బిషప్గా బాధ్యతలు నిర్వహించారు. ఆ పదవులు నిర్వహిస్తూనే స్థానిక నల్లజాతి వారిపై శ్వేత జాతీయుల దురాగతాలను ఖండించడంలో వెనుకాడలేదు. జొహన్నెస్బర్గ్ ఆర్చ్బిషప్గా కొనసాగుతున్న సమయంలోనే 1984లో ఆయన్ను నోబెల్ శాంతి బహుమతి వరించింది. బ్రిటిషర్ల హయాంలో జాతి వివక్షకు గురైన వారికి న్యాయం చేసే లక్ష్యంతో 1995లో టుటు నేతృత్వంలో ‘ట్రూత్ అండ్ రికన్సిలియేషన్ కమిషన్’ను మండేలా నియమించారు. టుటు, మండేలా మధ్య అనుబంధాన్ని వివరిస్తూ మండేలా ఫౌండేషన్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘1950లలో పాఠశాలలో చదువుకునే రోజుల్లో జరిగిన వక్తృత్వ పోటీల సమయంలో మండేలా, టుటు తొలిసారి కలుసుకున్నారు. ఇద్దరూ జాతి వివక్షపై ప్రజల తరఫున పోరాటం సాగించారు. ఇది నచ్చని బ్రిటిషర్లు వారిద్దరూ కలుసుకోకుండా దాదాపు 4 దశాబ్దాలపాటు పలు అవాంతరాలు కల్పించారు. చివరికి మండేలా 27 ఏళ్లపాటు జైలు జీవితం గడిపి విడుదలయ్యాకే టుటుతో నేరుగా మాట్లాడగలిగారు. చెరసాల నుంచి విడుదలైన మండేలా మొదటగా వెళ్లి ఆ రోజు గడిపింది టుటు నివాసంలోనే’అని తెలిపింది. మండేలా 2013లో తుదిశ్వాస విడిచే వరకు టుటుతో అనునిత్యం మాట్లాడుకుంటూనే ఉన్నారంటూ వారి మధ్య ఉన్న గాఢమైత్రిని గుర్తు చేసింది. -
దక్షిణాఫ్రికా అధ్యక్షుడికి కోవిడ్ పాజిటివ్
జొహన్నెస్బర్గ్: దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా(69) కరోనా వైరస్ బారినపడ్డారు. ఆయనకు స్వల్పలక్షణాలు బయటపడ్డాయని, ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారని అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది. సోమవారం కేప్టౌన్లో జరిగిన మాజీ ఉపాధ్యక్షుడు డీక్లార్క్ సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్న అధ్యక్షుడు రమఫోసా అస్వస్థతకు గురయ్యారని పేర్కొంది. ఆయన ఆరోగ్య పరిస్థితులను రక్షణ శాఖ ఆరోగ్య అధికారులు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది. రమఫోసా కోవిడ్ టీకా రెండు డోసులు తీసుకున్నారు. సోమవారం 37,875 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం కేప్టౌన్లో సెల్ఫ్ ఐసోలేషన్లో ఉన్న రమఫోసా..ఉపాధ్యక్షుడు డేవిడ్ మబూజాకు వారం పాటు అధ్యక్ష బాధ్యతలను అప్పగించారని మంత్రి ఒకరు తెలిపారు. రమఫోసా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ భారత ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ఒమిక్రాన్ దక్షిణాఫ్రికాలో బయటపడిన విషయం తెలిసిందే. -
ప్రియురాలిని వదిలి వెళ్లలేక, షోను వదులుకోలేక..
ముంబై : ప్రముఖ రియాలిటీ షో 'ఖత్రోన్ కే ఖిలాడీ' పదకొండవ సీజన్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. దక్షిణాఫ్రికాలోని కేప్టౌన్లో జరిగే ఈ షోలో పాల్గొనేందుకు ఇప్పటికే కంటెస్టెంట్లు సన్నద్ధం అయ్యారు. ప్రముఖ సింగర్, బిగ్బాస్ ఫేం రాహుల్ వైద్య, వరుణ్ సూద్, దివ్యంకా త్రిపాఠి అర్జున్ బిజ్లాని, నిక్కి తంబోలి, అభినవ్ శుక్లా సహా పలువురు ఈ షోలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో గత రాత్రి ముంబై ఏయిర్పోర్టుకు చేరుకున్న రాహుల్ ప్రియురాలు దిషా పర్మార్ని వదిలి వెళ్లేటప్పుడు ఎమోషల్ అయ్యారు. ప్రియురాలికి ముద్లులు, హగ్గులు ఇచ్చి విడ్కోలు పలికారు. ఈ ఫోటోలను క్లిక్ మనిపించిన ఫోటోగ్రాఫర్లు వీరిది ఎంతో క్యూట్ జోడీ అంటూ కొనియాడారు. ఇక ఈ పోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. హిందీ బిగ్బాస్-14లో రుబీనా దిలైక్తో తలపడి రాహుల్ రన్నరప్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇదే షోలో ప్రియురాలు దిశా పర్మార్ని కూడా పరిచయం చేసిన రాహుల్ మరొకొద్ది నెలల్లోనే తమ వివాహం ఉంటుందని ప్రకటించారు. ఇప్పటికే పెళ్లి పనులు మొదలు పెట్టినా కరోనా కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతం ఖత్రోన్ కే ఖిలాడీ షోలో పాల్గొనేందుకు సన్నద్ధం అయ్యారు. అయితే ఏయిర్పోర్టులో ప్రేయసిని వదిలి వెళ్లలేక, షోను వదులుకోలేక రాహుల్ మదనపడుతూ కనిపించాడు. View this post on Instagram A post shared by Rahul Vaidya world (@mad_fan_of_rahul_vaidya_) ఛదవండి : 'బిగ్బాస్' వల్ల నాకు ఒరింగిందేమీ లేదు : నటి నా కుమారులు నన్ను మళ్లీ పెళ్లి చేసుకోమంటున్నారు: నటి -
మా ఆటగాళ్లకు వైరస్ లేదు: ఈసీబీ
కేప్టౌన్ : దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న ఇంగ్లండ్ జట్టులో ఇద్దరు ఆటగాళ్లకు వైరస్ లక్షణాలు లేవని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) స్పష్టం చేసింది. బయో బబుల్లో ఉన్నప్పటికీ వీరితో పాటు బస చేసిన హోటల్ సిబ్బందికి కరోనా సోకినట్లు వార్తలొచ్చాయి. ఈ గందరగోళంలోనే మూడు వన్డేల సిరీస్ పూర్తిగా రద్దయింది. అయితే కరోనా అనుమానితుల్ని మిగతా ఆటగాళ్లకు దూరంగా ఐసోలేషన్లో ఉంచారు. ఈసీబీ వైద్యబృందం వారి నమూనాల్ని మరోసారి స్వతంత్ర వైరాలజీ ల్యాబ్లో పరీక్షించింది. అయితే వైరస్ జాడ లేదని తెలియడంతో ఈసీబీ, దక్షిణాఫ్రికా క్రికెట్ వర్గాలు ఊపిరిపీల్చుకున్నాయి. ఇప్పుడు ఆ ఇద్దరు ఆటగాళ్లు ఐసోలేషన్ నుంచి విడుదలయ్యారు. జట్టుతో కలిసి గురువారం స్వదేశానికి పయనం కానున్నారు. -
క్వారంటైన్లో ముగ్గురు క్రికెటర్లు
కేప్టౌన్: స్వదేశంలో ఇంగ్లండ్తో వన్డే, టి20 సిరీస్లకు సన్నద్ధమవుతున్న సమయంలో దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టును కరోనా తాకింది. జట్టులో సభ్యుడొకరు కోవిడ్–19 పాజిటివ్గా తేలాడు. దాంతో అతడిని బయో బబుల్నుంచి బయటకు పంపించివేశారు. అతనితో సన్నిహితంగా మెలిగిన మరో ఇద్దరు క్రికెటర్లకు వైరస్ లక్షణాలు లేనప్పటికీ ముందు జాగ్రత్తగా క్వారంటైన్కు తరలించినట్లు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ప్రకటించింది. అయితే వారి పేర్లను మాత్రం వెల్లడించలేదు. ఆ ముగ్గురి స్థానాలను ఇతర క్రికెటర్లతో భర్తీ చేయబోమని చెప్పింది. (భారత్ కంటే ఆస్ట్రేలియా మెరుగు) మరో వైపు తాజా సిరీస్లో మోకాలిపై కూర్చొని నల్లజాతివారికి సంఘీభావం తెలిపే కార్యక్రమానికి తాము దూరంగా ఉంటున్నామని దక్షిణాఫ్రికా కోచ్ మార్క్ బౌచర్ వెల్లడించాడు. తమ దేశంలో ఈ మొత్తం ఉద్యమంలో కీలకంగా ఉన్న జట్టు సభ్యుడు లుంగీ ఇన్గిడితో తాను మాట్లాడానని... కొన్నాళ్ల క్రితం జరిగిన 3టీసీ మ్యాచ్లో ఇలా చేశాం కాబట్టి ఇప్పుడు అవసరం లేదని వివరించినట్లు బౌచర్ తెలిపాడు. -
మాజీ క్రికెటర్ సోదరుడు కాల్చివేత
కేప్టౌన్: దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ వెర్నోన్ ఫిలాండర్ సోదరుడు టైరోన్ ఫిలాండర్ కాల్చివేతకు గురయ్యాడు. ఈ ఘటన బుధవారం టైరోన్ స్వస్థలమైన రావెన్స్మీడ్లో చోటు చేసుకుంది. తన సోదరుడ్ని కొందరు దుండగులు కాల్చివేసిన విషయాన్ని వెర్నోన్ ఫిలాండర్ ట్వీటర్ ద్వారా వెల్లడించాడు. ‘ నా సోదరుడు టైరోన్ దారుణ హత్యకు గురయ్యాడు. మా హోమ్ టౌన్లోనే ఇది జరిగింది. ఈ కష్టసమయంలో మా కుటుంబానికి ప్రైవసీని గౌరవించాలని కోరుతున్నారు.(చదవండి: శాంసన్ రాత మారేనా? మళ్లీ అదే డ్రామానా?) ఇది పోలీసుల దర్యాప్తులో ఉంది. ఈ విషయంలో పోలీసులకు మీడియా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నా. దీనికి సంబంధించి ఎటువంటి ఆధారాలు లభించనందున ఎటువంటి తప్పుడు వార్తలు రాయొద్దు. ఊహాగానాలతో దర్యాప్తు కష్టంగా మారిపోతుంది. టైరోన్ ఎప్పుడూ మా మనసుల్లో ఉంటాడు. అతని ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. టైరోన్ కాల్చబడ్డ సమయంలో పక్కంటి వారికి వాటర్ డెలివరీ చేయడానికి ఇంటి నుంచి బయటకు వెళ్లినట్లు స్థానిక మీడియా ద్వారా తెలుస్తోంది. -
‘438’.. సీన్ రిపీట్ అవుతుందా?
‘438’ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ నంబర్పై తీవ్ర చర్చ జరుగుతోంది. క్రికెట్ అభిమానులకు ముఖ్యంగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా ఫ్యాన్స్ మరిచిపోని నంబర్ ‘438’. ఎందుకంటే టీ20 ఫార్మట్ అంతగా ఎస్టాబ్లిష్ కాకముందే వన్డే చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో రికార్డు స్కోర్ నమోదు చేసింది దక్షిణాఫ్రికా జట్టు. కేప్టౌన్ వేదికగా ఆసీస్ విసిరిన భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ప్రొటీస్ జట్టు అందరినీ షాక్కు గురిచేస్తూ 438 పరుగులు సాధించి అపూర్వ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే అదెప్పుడో 2006లో జరిగింది కదా మళ్లీ ఇప్పుడు ఎందుకు ఆ చర్చ అనుకుంటున్నారా? అయితే అదే మ్యాజిక్ ఫిగర్ దక్షిణాఫ్రికాను మరోసారి ఊరిస్తోంది. దీంతో సోషల్ మీడియా వేదికగా ‘438’ మరోసారి తెరపైకి వచ్చింది. నాలుగు టెస్టుల సిరీస్లో భాగంగా ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టులో భాగంగా ఆతిథ్య సఫారీ లక్ష్యం 438 పరుగులు. పర్యాటక ఇంగ్లండ్ జట్టు తమ రెండో ఇన్నింగ్స్ను 391/8 వద్ద డిక్లెర్డ్ చేసింది. దీంతో 46 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని డుప్లెసిస్ సేన ముందు ఇంగ్లండ్ 438 పరుగుల భారీ లక్ష్యాన్ని ముందుంచింది. ఇక నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ప్రొటీస్ జట్టు రెండు వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. ఎల్గర్(34), హమ్జా(15) అంతగా ఆకట్టుకోలేదు. ప్రస్తుతం క్రీజులో మలాన్(63 బ్యాటింగ్), నైట్ వాచ్మన్ కేశవ్ మహారాజ్(2 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. సఫారీ జట్టు గెలవాలంటే ఆట చివరి రోజు 312 పరుగులు సాధించాలి. చేతిలో 8 వికెట్లు ఉన్నాయి. అయితే గెలుపు కోసం పోరాడటంతో పాటు ఓడిపోకుండా జాగ్రత్తగా ఆడాలని ప్రొటీస్ జట్టు భావిస్తోంది. ఇక ఈ మ్యాచ్లో తప్పక గెలిచి నాలుగు టెస్టుల సిరీస్ను 1-1తో లెవల్ చేయాలని రూట్ సేన ఉవ్విళ్లూరుతోంది. అయితే కేప్టౌన్ వేదికగా దక్షిణాఫికా ‘438’ సీన్ మరోసారి రిపీట్ చేస్తుందని ఆ దేశ అభిమానులు ఆశిస్తున్నారు. అంతేకాకుండా ఆనాటి మ్యాచ్కు సంబంధించి మధురస్మృతులను గుర్తుచేసుకుంటున్నారు. దీనిలో భాగంగా ఆనాటి మ్యాచ్కు సంబంధించిన ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తున్నారు. ఇక ఆ మ్యాచ్లో అప్పటి సారథి రికీ పాంటింగ్ (164) భారీ సెంచరీ సాధించడంతో ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 434 పరుగులు చేసింది. అనంతరం హెర్షల్ గిబ్స్(175), స్మిత్(90)తో పాటు బౌచర్(50 నాటౌట్) రాణించడంతో దక్షిణాఫ్రికా 49.5 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 438 పరుగులు సాధించి విజయాన్ని అందుకుని ఛేజింగ్లో సరికొత్త చరిత్రను సృష్టించిన విషయం తెలిసిందే. -
బ్యాటింగ్ కన్సల్టెంట్గా కల్లిస్
కేప్టౌన్: సంధి దశను ఎదుర్కొంటున్న దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు దిద్దుబాటు చర్యలను వేగవంతం చేసింది. ఇటీవల ప్రధాన కోచ్గా మార్క్ బౌచర్ను నియమించిన దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు.. తాజాగా బ్యాటింగ్ కన్సల్టెంట్గా మరో దిగ్గజ ఆటగాడు జాక్వస్ కల్లిస్ను ఎంపిక చేసింది. సమ్మర్లో సద్వేశంలో జరుగనున్న మొత్తం మ్యాచ్లకు కల్లిస్ను బ్యాటింగ్ కన్సల్టెంట్గా నియమిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈరోజే బ్యాటింగ్ కన్సల్టెంట్ బాధ్యతలను కల్లిస్ స్వీకరించనున్నాడు. ఈ విషయాన్ని తమ అధికారిక ట్వీటర్ అకౌంట్లో దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. 519 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన కల్లిస్ దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టుకు ఎన్నో చిరస్మరణీయమైన విజయాలు అందించాడు. ఆల్ రౌండర్గా సఫారీలకు వెన్నుముకగా నిలిచాడు. 166టెస్టులు, 328 వన్డేలు, 25 అంతర్జాతీయ టీ20లు ఆడిన అనుభవం కల్లిస్ది. దక్షిణాఫ్రికా తరఫున అన్ని ఫార్మాట్లలో కలిపి 25, 534 పరుగులు సాధించిన కల్లిస్.. 577 వికెట్లు తీశాడు. -
ఎలాగైనా బౌలింగ్ చేస్తా.. వికెట్ తీస్తా!
కేప్టౌన్: క్రికెట్లో రెండు చేతులతో బౌలింగ్ చేయడం చాలా అరుదు. గతంలో శ్రీలంక స్పిన్నర్ కామిందు మెండిస్ రెండు చేతులతో బౌలింగ్ చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఇప్పుడు అదే తరహా బౌలింగ్తో మరొక బౌలర్ వచ్చేశాడు. తనకు కుడి-ఎడమ తేడా లేదంటున్నాడు దక్షిణాఫ్రికా గ్రెగొరీ మహలోక్వానా. రెండు చేతులతో బౌలింగ్ చేయడం అనేది చాలా కష్టం. ఎంతో శ్రమిస్తేకానీ ఇలా బౌలింగ్ చేయలేదు. సౌతాఫ్రికాలో జరుగుతున్న ఎమ్జాన్సీ టీ20 సూపర్ లీగ్లో గ్రెగొరీ రెండు చేతులతో బౌలింగ్ చేయడమే కాకుండా వికెట్లు కూడా సాధించాడు. కేప్టౌన్ బ్లిట్జ్ తరఫున ఆడుతున్న గ్రెగొరీ.. ఆదివారం డర్బన్ హీట్తో జరిగిన మ్యాచ్లో రెండు వికెట్లు సాధించాడు. తొలుత కుడి చేతి బౌలింగ్ చేసి ఓపెనర్ సారే ఎర్వీని ఔట్ చేసిన గ్రెగొరీ..ఆపై ఎడమ చేతితో బౌలింగ్ చేసి డానే విలాస్ను బోల్తా కొట్టించాడు. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. ఈ మ్యాచ్లో కేప్టౌన్ బ్లిట్జ్ 10 పరుగుల తేడాతో గెలిచింది. ముందు బ్యాటింగ్ చేసిన కేప్టౌన్ ఆరు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేయగా, డర్బన్ హీట్ ఏడు వికెట్లు కోల్పోయి 164 పరుగులే చేసింది. WICKET | SJ Erwee c Linde b Mahlokwana 16 (23b 1x4 0x6) SR: 69.56 Will the ambidextrous Mahlokwana be able to take a left handed and a right handed wicket today?#MSLT20 pic.twitter.com/rkw29YIb3g — Mzansi Super League 🔥 🇿🇦 🏏 (@MSL_T20) November 17, 2019 WICKET | DJ Vilas b Mahlokwana 8 (10m 8b 0x4 0x6) That's Mahlokwana's second of the day. His first wicket was bowled Right handed and now he gets a wicket with the quicker left arm.#MSLT20 pic.twitter.com/Gey4JPypq1 — Mzansi Super League 🔥 🇿🇦 🏏 (@MSL_T20) November 17, 2019 -
ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న విమానం కూలిన వీడియో
-
చనిపోయాడని చెప్పారు.. కానీ!
కేప్టౌన్(దక్షిణాఫ్రికా) : ఆ రోజు జూన్ 24, తెల్లవారు జామున.. రోడ్డు సరిగా కనిపించడం లేదు. అసలే అది కేప్టౌన్లోకెల్లా చాలా ప్రమాదకరమయిన రోడ్డు. ఆ రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ జరిగింది. కారులో నలుగురులో ముగ్గురికి తీవ్ర గాయలయ్యాయి. ఎంత తీవ్రంగా అంటే కారులో నుంచి రోడ్డు మీద పడ్డారు. నాల్గో వ్యక్తికి మాత్రం అంత పెద్ద దెబ్బలేం తగల్లేదు. దాంతో అతను సాయం కోసం ఎదురు చూస చూస్తుండగా.. సమాచారం అందుకున్న ప్రైవేటు అంబులెన్స్ సర్వీస్ వారు అక్కడికి వచ్చారు. గాయపడిన నాల్గో వ్యక్తిని కాపాడటం కోసం ఆస్పత్రికి తరలించారు. మిగతా ముగ్గురిని పరీక్షించి చనిపోయినట్లుగా నిర్ధారించారు. అనంతరం వారిని మార్చురికి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. ముగ్గురిని స్ట్రెచర్ మీద పడుకోబెట్టి తీసుకెళ్తుండగా చనిపోయిన వారిలో ఒక వ్యక్తి శ్వాస తీసుకుంటున్నట్టు గమనించారు. అతన్ని పరీక్షించగా బతికే ఉన్నాడు. కొద్ది నిమిషాల ముందు మరణించాడని ప్రకటించిన వ్యక్తి మళ్లీ ఎలా బతికాడు...? ఇలాంటి సంఘటనలు ఇక్కడే కాదు ప్రంపంచ వ్యాప్తంగా చాలా చోట్ల జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించి బీబీసీ కొన్ని కథనాలను కూడా ప్రచారం చేసింది. వాటిలో గత జనవరిలో గోన్జాలో మొన్టోయో అని వ్యక్తి మరణించినట్లు ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు డాక్టర్లు నిర్ధారించారు. అతనికి పోస్టు మార్టమ్ చేద్దామని శరీరంపై గుర్తులు కూడా పెట్టారు. కానీ ఉన్నట్టుండి ఆ వ్యక్తి లేచి కూర్చున్నాడు. మూడేళ్ల క్రితం 91 ఏళ్ల వృద్ధురాలిని మరణించినట్లు ప్రకటించారు. కానీ ఆమె మరణించినట్లు ప్రకటించిన 11 గంటల తర్వాత ఆ బామ్మ నింపాదిగా లేచి కూర్చుని వేడి వేడిగా ఓ కప్పు కాఫీ, పాన్ కేక్ తీసుకురమ్మని డాక్టర్లకు చెప్పింది. దాంతో డాక్టర్లు ఆశ్చర్యంతో నోరు వెళ్లబెట్టారు. కొన్నేళ్ల క్రితం ఓ 80 ఏళ్ల బామ్మకు గుండెపోటు రావడంతో ఆస్పత్రిలో చేర్చారు. డాక్టర్లు ఆమెను మరణించిందని నిర్ధారించి, ఫ్రీజర్లో ఉంచారు. కొన్ని రోజుల తర్వాత చూస్తే ఆమె ముక్కు పగిలి సగం బయటకు వచ్చి ఉంది. ఏం జరిగిందో ముందు డాక్టర్లకు అర్థం కాలేదు. తర్వాత తెలిసిందేంటంటే పాపం ఆ వృద్ధురాలిని ఫ్రీజర్లో పెట్టిన తర్వాత బతికిందని, అందుకే బయటకు రావడానికి ప్రయత్నించి ఉంటుందని తెలిపారు డాక్టర్లు. మరణం తర్వాత జీవం ఎలా... వైద్యులు పరీక్షించి, మరణించారని నిర్ధారించిన తర్వాత కూడా వీరంతా మళ్లీ ఎలా బతుకుతున్నారన్నదే చాలా ఆశ్చర్చకరమైన విషయం. అయితే దీనికి వైద్యులు చెప్పే సమాధానం మరణించారని నిర్ధారించిన వ్యక్తులు కొన్నిసార్లు నిజంగానే మరణించరు. ఆ సమయంలో వారు ‘కాటలాప్సి’(కండరాలు బిగుసుకుపోవడం) అనే స్థితికి చేరుకుంటారు. ఆ సమయంలో వారి హృదయ స్పందనలు, శ్వాస తీసుకోవడం వంటి వాటిని గుర్తించలేనంత లో-లెవల్కు పడిపోతాయి. కాబట్టి వారు మరణించిన వారిలానే ఉంటారు. కండరాల బిగువు సడలిన తర్వాత వారి శరీరం సాధారణ స్థితిలోకి వచ్చి ఉన్నట్టుండి ఒక్కసారిగా బతుకుతున్నారని తెలిపారు వైద్యులు. -
సాంబా.. చంపేయబోయింది
కేప్టౌన్ : మచ్చిక చేసుకున్నవైనా.. మన ఆధీనంలోనే ఉన్నా క్రూర జంతువుల దగ్గర చాలా జాగ్రతగా ఉండక తప్పదు. లేకపోతే ప్రాణాల మీద ఆశ వదులుకోవాల్సిందే. దక్షిణాఫ్రికాలో తాజాగా జరిగిన ఓ సంఘటన ఈ విషయాన్ని మరోసారి రుజువు చేసింది. ఓ జూ యజమానిపై సింహం దాడికి దిగగా.. ఆయన అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డారు. బ్రిటన్కు చెందిన మైక్ హాడ్జ్(67) కొన్నేళ్లుగా దక్షిణాఫ్రికాలోని లింపోపో ప్రావిన్స్లో మారకెలె శాంక్చురీ పేరుతో జూ నిర్వహిస్తున్నారు. ఇందులో వివిధ రకాల జంతువులతోపాటు సాంబా అనే పేరు గల సింహం ఉంది. గత సోమవారం (ఏప్రిల్ 30) జూకు వచ్చిన సందర్శకులకు వివరాలు చెబుతూ.. ఏదో దుర్వాసనను గమనించిన హాడ్జ్ ఎన్క్లోజర్లోకి వెళ్లారు. అదే సమయంలో దూరం నుంచి సింహం రావడం చూసి సహాయం కోసం కేకలు వేస్తూ గేటు వైపు పరిగెత్తాడు. అయితే ఈ లోపలే ఆయన మీద సింహం దాడి చేసి పొదల్లోకి లాక్కెళ్లింది. ఆ తర్వాత కాసేపటికి సందర్శకుల్లో ఎవరో రైఫిల్తో కాల్చడంతో సింహం ఆయన్ని వదిలేసింది. తీవ్రంగా గాయపడిన ఆయన్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాలతో బయటపడ్డారు. కాగా, సింహం నుంచి తప్పించుకునేందుకు హాడ్జ్ పరిగెత్తడం, సింహం ఆయన్ని నోట కరుచుకొని లాక్కెడం రికార్డయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. -
కేప్టౌన్కు ఐస్బర్గ్స్ ఉపశమనం..!!
జోహన్నెస్బర్గ్ : దక్షిణాఫ్రికాలోని కేప్టౌన్లో ఏర్పడిన తీవ్ర నీటి కొరతను తగ్గించేందుకు మెరైన్ నిపుణులు ఆ దేశ ప్రభుత్వం ముందు పరిష్కారాన్ని ఉంచారు. అంటార్కిటికా ఖండం నుంచి భారీ మంచు దిమ్మెలను కేప్టౌన్కు తీసుకువచ్చి, కరువు ప్రాంతాల్లోని నీటి కుంటలు, సరస్సులు, నదుల్లో వాటిని కరిగించాలనేది ప్రతిపాదన. 20వ శతాబ్దంలోనే అతిపెద్ద కరువుగా కేప్టౌన్ కరువును అభివర్ణిస్తున్న విషయం తెల్సిందే. మంచు దిమ్మెలను కేప్టౌన్కు తీసుకురావడ తప్ప కరువుకు మరో ప్రత్యామ్నాయం ఏమీ లేదని నిపుణులు దక్షిణాఫ్రికా ప్రభుత్వానికి తేల్చిచెప్పారు. 2015 నుంచి కేప్టౌన్లో తీవ్రదుర్భిక్షం నెలకొంది. దీంతో ఈ కరువును దక్షిణాఫ్రికా ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించింది. కేప్టౌన్లో ఇప్పటికే నీటిపై ఆంక్షలు ఉన్నాయి. ఈ ఏడాది వర్షాలు లేకపోతే తాగునీరు పూర్తిగా లేకుండా పోయే ప్రమాదం ఉంది. అనుమతిస్తే అంటార్కిటికా నుంచి మంచు తునకలను త్వరగా కరిగిపోకుండా జాగ్రత్తలు తీసుకుని కేప్టౌన్కు తీసుకువస్తామని నిపుణులు దక్షిణాఫ్రికా ప్రభుత్వానికి నివేదించారు. ఒక భారీ ఐస్బర్గ్ ఏడాది పాటు కరుగుతూ రోజుకు 150 మిలియన్ లీటర్ల తాగునీటిని ఇస్తుందని పేర్కొన్నారు. -
ప్రతి చుక్కా.. ఓ లెక్కే..!
ఉన్నట్టుండి ఓరోజు.. కొళాయిల్లో నీళ్లు రావని ప్రభుత్వం ప్రకటిస్తే..! ఇంకేముంది.. నానా గందరగోళం తప్పదు.. అటకెక్కినబిందెలు కిందకు దిగేస్తాయి.. రేపటికోసం ఈరోజే ఖాళీ బిందెలతో పే...ద్ద క్యూలు ఏర్పాటవుతాయి. అచ్చం ఇలాంటి పరిస్థితినే చివరిక్షణంలో అధిగమించింది కేప్టౌన్. సకాలంలో వానలు పడటంతో గండం గట్టెక్కినా.. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి ఎక్కడైనా.. ఎవరికైనా రావచ్చు అనేందుకు సూచిక ఇది. మరి తరుణోపాయం..? భవిష్యత్ ఎలా ఉంటుందో ఊహించలేం. కానీ వాస్తవ పరిస్థితుల నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి. అందుకనుగుణంగా మనం మసలుకోవాలి. నానాటికీ పెరుగుతోన్న జనాభా, పట్టణీకరణ, కుప్పలు తెప్పలుగా కాంక్రీటు భవనాల నిర్మాణం, నీటిచుక్క ఇంకే జాడేలేకపోవడం. అంతా పెద్ద పెద్ద కాంక్రీటు రోడ్లూ, ఫ్లైఓవర్ల పిల్లర్లు.. మినహా మట్టికింత జాగాలేకపోవడం.. పట్టణాలనూ, నగరాలనూ పట్టిపీడిస్తోన్న నీటిఎద్దడికి ఇలాంటివే ఎన్నెన్నో కారణాలు. పెరుగుతోన్న జనాభాకి అనుగుణంగా నీటి వనరులను ఒడిసిపట్టుకోలేకపోవడం, నీటి సమస్యను అధిగమించడమెలాఅన్నదే ఇప్పుడు సమస్య. మానవ నాగరికతలన్నీ నీటి చుట్టూతానే అల్లుకుని ఉంటాయి. నీటి ప్రవాహం పొడవునా పరుచుకున్నదే ఏ సంస్కృతైనా.. తరతరాల నాగరికత ఒకే ఒక్క తుపానుకు తుడిచి పెట్టుకుపోయినట్టు చరిత్ర లో చదివాం. కానీ నేడు నీటి చుట్టూ అలము కున్న కరువు ప్రపంచ చరిత్రను ప్రమాదంలో పడేసే రోజొచ్చింది. ఇక జరగబోయేవన్నీ నీటి యుద్ధాలేనన్న విషయం నిజమయ్యే రోజు ఎం తో దూరంలో లేదని అర్థమవుతోంది. దక్షిణా ఫ్రికాలోని ‘డేజీరో’ దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. వానలకు భరోసా లేదని గుర్తించాలి.. వాతావరణ మార్పుల ప్రభావం కారణంగా భవిష్యత్తులో వానలకు భరోసా ఉండదన్న విషయాన్ని గుర్తించాలి. కేప్టౌన్ విషయాన్నే తీసుకుంటే ఈ నగరం తాగునీటి అవసరాల కోసం రిజర్వాయర్లపైనే ఆధారపడి ఉంది. మూడేళ్లపాటు వరుణుడు ముఖం చాటేయడంతో ఇవి నోళ్లు తెరిచాయి. భవిష్యత్తులో ఇలాంటి కరువు కాటకాలు మరింత తరచుగా వస్తాయన్న విషయాన్ని గుర్తుపెట్టుకుని అందుకు తగ్గట్టుగా ప్రభుత్వాలు తాగునీటి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. రెండు దశాబ్దాల క్రితం ఆస్ట్రేలియా చేసింది ఇదే. పెర్త్ నగరంలో తాగునీటి ఎద్దడి ఏర్పడిన విషయాన్ని గుర్తించిన అక్కడి ప్రభు త్వం ఆ తర్వాత తన విధానాలను సవరించుకుంది. సముద్రపు నీటి నుంచి మంచి నీటిని తయారుచేసే నిర్లవణీకరణ ప్రక్రియకు ప్రోత్సాహం కల్పించింది. ఇప్పుడు ఆ నగరంలో సగం నీరు నిర్లవణీకరణ ద్వారా అం దుతూంటే.. ఇంకో 40 శాతం అవసరాలను భూగర్భ జలా ల ద్వారా తీర్చుకుంటున్నా రు. రోజువారీ వ్యవహారాల్లో వాడే నీటిని మళ్లీమళ్లీ వాడుకునేలా ఏర్పాట్లు చేసుకోవడం వంటి చర్యల ద్వారా ‘డేజీరో’ ను అధిగమించవచ్చన్నది నిపుణు ల అభిప్రాయం. ప్రతి వానచుక్కను ఒడిసి పట్టుకోవడం, సురక్షితంగా నిల్వ చేసుకుని వాడటంపై కూడా ప్రజల్లో చైతన్యం పెరగాల్సిన అవసరముంది. స్థానిక ప్రభుత్వాలే కీలకం.. నీటి ఎద్దడి పరిష్కారం విషయంలో స్థానిక మున్సిపాలిటీలు, జిల్లా యంత్రాంగాలే కీలకపాత్ర పోషించాల్సి ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా అనేకచోట్ల నిరూపితమైన అంశమిది. అవసరాలకు తగ్గట్టుగా సత్వర నిర్ణయాలు తీసుకోవడం ముఖ్యమన్నది గుర్తించాలి. స్థానిక ప్రజల భాగస్వామ్యంతో చేపట్టే ఏ కార్యక్రమమైనా విజయవంతమ య్యే అవకాశాలు ఎక్కువ. తాగునీటి నిర్వహణ, ఎద్దడి నివారణ కూడా ఇందుకు భిన్నమేమీ కాదు. ప్రయోజనాలెన్నో.. తాగునీటి నిర్వహణ విషయంలో ప్రభుత్వాలు ఎంత పారదర్శకంగా ఉంటే అంత మేలు జరుగుతుందని గత అనుభవాలు సూచిస్తున్నాయి. నీటి వినియోగం, అందుబాటులో ఉన్న వనరులు తదితర అంశాలన్నింటిపై ఎప్పటికప్పుడు స్పష్టమైన సమాచారం అందివ్వడం ద్వారా ప్రజలు పరిస్థితులను అర్థం చేసుకోగలుగుతారు. సమస్య పరిష్కారానికి చేస్తున్న ప్రయత్నాలనూ వారికి వివరించడం ప్రయోజనకారి. సమాచారాన్ని తొక్కిపట్టి.. అంతా బాగుందన్న భ్రమ కల్పిస్తే నీటిని పొదుపుచేయడం అస్సలు సాధ్యం కాదు. కేప్టౌన్లో ‘డే–జీరో’పరిస్థితిని అధిగమించేందుకు అక్కడి ప్రభుత్వం ఏర్పాటుచేసిన అవేర్నెస్ వెబ్సైట్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. దూరదృష్టి అవసరం.. మబ్బుల్లో నీళ్లు చూసి ముంతవలకబోసుకున్నట్లు.. అనే సామెత తెలుగువారికి సుపరిచితమే. అయితే తాగునీటి సమస్యలు నివారించుకోవాలంటే ఈ రకమైన ఆలోచన అస్సలు పనికి రాదు. గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో తాగునీటి అవసరాలపై కచ్చితమైన మదింపు.. అందుకు తగ్గట్టుగా సరఫరా వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడం అవసరం. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమగ్ర ప్రణాళికలు రూపొందించుకోవాలని.. అందుబాటులో ఉన్న వనరులను ఏ ప్రాధాన్యత క్రమంలో ఖర్చు చేయాలన్నదీ ముందుగానే నిర్ణయమై ఉండాలని ఈ రంగంలో కృషిచేస్తున్న నిపుణులు సూచిస్తున్నారు. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో మనం వాడే ప్రతినీటి బొట్టునూ లెక్కపెట్టేందుకు డిజిటల్ మీటర్లు ఏర్పాటు చేయడం ఇక్కడ ప్రస్తావనార్హం. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
డేంజర్కు దగ్గరగా బెంగళూరు
సాక్షి, న్యూఢిల్లీ : నీరే జీవకోటికి ప్రాణాధారం. జలం లేకపోతే జీవమే ఉండదు. ఇతర గ్రహాలు మనుషుల ఆవాసానికి అనుకూలమా, కాదా అనే విషయం కూడా అక్కడి నీటి లభ్యత మీద ఆధారపడి ఉంటుంది. నీరు లేకపోతే ఈ సృష్టే అంతరిస్తుంది. ఈ విషయం తెలిసి కూడా చేజేతులా భూతాపాన్ని పెంచి తీవ్రమైన వాతావరణ మార్పులకు కారణమవుతున్నాము. అందుకే అతివృష్టి, అనావృష్టిలాంటి పరిస్థితులు. ఇంకా వేసవి పూర్తిగా ప్రారంభమవలేదు. అయినప్పటికీ అప్పుడే నీటి ఎద్దడి సమస్యలు ప్రారంభమయ్యాయి. ఈ సమస్య తీవ్రంగా ఉండి ఇప్పుడు సిలికాన్ సిటీ బెంగళూరును బెంబేలెత్తిస్తోంది. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (సీఎస్ఈ) పత్రిక ప్రపంచవ్యాప్తంగా తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న10 నగరాల జాబితాను విడుదల చేసింది. వాటిలో బెంగళూరు ఒకటి. అనతి కాలంలోనే బెంగళూరు మరో కేప్ టౌన్ కానుంది. వరుస కరువు, ముందుచూపులేని ప్రభుత్వం తీరుతో కేప్టౌన్ తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటోంది. గత జూన్-.జూలైలో అక్కడ 'డే జీరో' (ట్యాప్లలో నీరు రాకుండా పూర్తిగా నిలిచిపోవడం) పరిస్థితి. ప్రస్తుతం అక్కడ నీటిని కూడా రేషన్లో తీసుకోవాల్సిన దుస్థితి. మరికొన్ని రోజుల్లో బెంగళూరులోను ఇవే దృశ్యాలు కనిపించనున్నట్లు సీఎస్ఈ వెల్లడించింది. ఈ పత్రిక వెల్లడించిన అంశాల ప్రకారం ప్రణాళిక ప్రకారం లేని నగరీకరణ, నిర్మాణాల వల్ల 79శాతం నీటి వనరులు తగ్గిపోయాయి. 1973 నుంచి నిర్మాణాలకు సంబంధించిన స్థల విస్తీర్ణం 8 శాతం నుంచి 77 శాతానికి పెరిగింది. బెంగుళూరులో ఇంతకుముందు నీటి లభ్యత 10-12 మీటర్ల లోతు లోపు ఉండేది, కానీ ప్రస్తుతం ఇది 76-91 మీటర్లకు పడిపోయింది. 30 ఏళ్ల క్రితం 5 వేల వరకూ ఉన్న బావుల సంఖ్య ప్రస్తుతం 0.45 మిలియన్లకు పెరిగింది. బెంగుళూరు జనాభా ప్రతి సంవత్సరం 3.5శాతం పెరుగుతూ 2031 నాటికి 20.3మిలియన్లకు చేరుకుంటుంది. నూతన ఆవిష్కరణలు చేయడంతోపాటు ప్రస్తుతం ఉన్న నీటి వనరులను సవ్యంగా వినియోగించుకోకపోతే కేప్టౌన్లాంటి పరిస్థితులు ఇక్కడ కూడా ఎదురవ్వడానికి ఎంతో సమయం పట్టదు. ఈ పది నగరాలు ఇప్పటికైనా మేల్కోనకపోతే అతి త్వరలోనే తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటాయని ఈ పత్రిక వెల్లడించింది. బెంగుళూరుతోపాటు చైనాలోని బీజింగ్, మెక్సికోలోని మెక్సికో సిటీ, కెన్యాలోని నైరోబీ, పాకిస్తాన్లోని కరాచీ, ఆఫ్గానిస్తాన్లోని కాబూల్, టర్కీలోని ఇస్తాంబుల్లో కూడా ఇవే పరిస్ధితులు నెలకొని ఉన్నాయి. -
2050 నాటికి ప్రపంచం గొంతెండిపోతుంది
సాక్షి, హైదారాబాద్: దక్షిణాఫ్రికాలోని కేప్టౌన్ మహానగరం.. తాగునీరు లేక ఎడారిగా మారబోతున్న నగరం... మనిషికి 50 లీటర్లు మాత్రమేనంటూ నీటికి రేషన్ విధించింది తొలి నగరం. ఆ దుస్థితే ప్రపంచ దేశాలు చూసే రోజు ఎంతో దూరంలో లేదు. నీటిసంక్షోభం 2050 నాటికి మరింత తీవ్రతరం కానుందని ఐక్యరాజ్య సమితి తాజా నివేదిక హెచ్చరించింది. అప్పటికి 500 కోట్ల మంది నీరు లభ్యం కాని ప్రాంతాల్లోనే నివాసం ఉండాల్సిన పరిస్థితి వస్తుందని వెల్లడించింది. 2050నాటికి ప్రపంచ జనాభా వెయ్యి కోట్లకు చేరుకుంటుందని అంచనాలున్నాయి. అంటే సగం మంది జనాభా గొంతు తడుపుకోవడానికి గుక్కెడు నీరు దొరక్క అవస్థలు పడతారన్న మాట. అందులోనూ సురక్షిత నీరు దొరక్క భారత్ వంటి దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోనున్నాయి. మార్చి 22న వరల్డ్ వాటర్ డే సందర్భంగా యునెస్కో తన నివేదికలో నీటివనరులపై భవిష్యత్ చిత్రపటాన్ని ఆవిష్కరించింది. వాతావరణంలో వస్తున్న మార్పులు, నీటికి డిమాండ్ పెరగడం, నీటి కాలుష్యాన్ని అరికట్టడంలో ప్రభుత్వాల వైఫల్యం వంటి కారణాలతో నీటికి తీవ్ర కొరత ఏర్పడుతుందని తెలిపింది. ఆ నివేదిక ఏం చెప్పిందంటే ... చైనా, భారత్, అమెరికా, రష్యా, పాకిస్థాన్ దేశాలు అత్యధికంగా నీటిని వినియోగిస్తున్నాయి. ఆ దేశాలే నీటి సంక్షోభంలో చిక్కుకొని విలవిలలాడతాయి. భూమిపై 70 శాతం నీరు ఉంటే అందులో స్వచ్ఛమైన నీరు కేవలం 2 శాతం మాత్రమే మధ్య భారతం అత్యధికంగా నీటికొరతను ఎదుర్కొంటుంది. 2050నాటికి 40 శాతం నీటి వనరులు తగ్గిపోతాయి. పంజాబ్, హర్యానా, ఢిల్లీలలో భూగర్భ జలాలు ప్రమాదకర స్థాయికి పడిపోతాయి. దక్షిణ భారత్ నీటి కాలుష్యం సమస్యని అత్యధికంగా ఎదుర్కొంటుంది. దక్షిణభారతంలో ఉన్న నదులన్నీ 2050నాటికి విషతుల్యంగా మారతాయి. బహిరంగ మలవిసర్జన, వివిధ రకాల వ్యర్థాల కారణంగా భూగర్భజలాలు కాలుష్యంతో నిండిపోతాయి. ఈకోలి బ్యాక్టేరియా సమస్య తీవ్రతరమవుతుంది. భారత్లో 21 శాతం వ్యాధులు నీటి ద్వారా సంక్రమిస్తున్నవే. ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల మంది సురక్షిత మంచి నీరు అందడం లేదు. భారత్లో 16.3 కోట్ల మంది భారతీయులకు రక్షిత మంచినీరు లభ్యం కావడం లేదు. పరిశుభ్రమైన తాగు నీరు లేక భారత్లో ప్రతీరోజూ అయిదేళ్ల లోపు వయసున్న చిన్నారులు దాదాపు 500 మంది మరణిస్తున్నారు. ఏడాదికి ఏడాది నీటి వినియోగం 1 శాతం పెరుగుతూ వస్తోంది. వాతావరణంలో వస్తున్న విచిత్రమైన పరిస్థితుల కారణంగా కొన్ని ప్రాంతాల్లో నీటికి కట కట ఉంటే, మరికొన్ని ప్రాంతాల్లో వరద ముంపునకు గురవుతాయి. 2050 నాటికి 116 కోట్ల మందికి వరదల వల్ల ముప్పుని ఎదుర్కొంటారు. ప్రపంచవ్యాప్తంగా నీటి సమస్యల్ని అధిగమించడానికి ప్రకృతి సంబంధమైన పరిష్కారాల కోసం కసరత్తు చేయాలని యునెస్కో డైరెక్టర్ జనరల్ ఆడ్రీ అజౌలే సూచించారు. వర్షపు నీటిని రీసైక్లింగ్కు చైనా అనుసరిస్తున్న విధానాలు, భారత్లో ఎడారి ప్రాంతమైన రాజస్థాన్లో కొన్ని స్వచ్ఛంద సంస్థలు చేపట్టిన నీటిసంరక్షణ, అటవీప్రాంతాన్ని విస్తరించడం వంటి చర్యలు, ఉక్రెయిన్లో కృత్రిమ చిత్తడి నేలల్ని రూపొందించడం వంటివి అన్ని చోట్లా చేపట్టాలని ఆ నివేదిక సిఫారసు చేసింది. అలా చేయడం వల్ల నీటి సంక్షోభం బారి నుంచి తప్పించుకోవడమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఆహార ఉత్పత్తుల్ని 20 శాతం పెంచుకోవచ్చునని ఆ నివేదిక వివరించింది. -
‘కేప్టౌన్’కు భారత్, దక్షిణాఫ్రికా జట్ల సాయం
జొహన్నెస్బర్గ్: తీవ్ర వర్షాభావంతో నీటికి కటకటలాడుతున్న కేప్టౌన్కు భారత్, దక్షిణాఫ్రికా క్రికెట్ జట్లు 8,500 అమెరికన్ డాలర్లు (రూ.5.52 లక్షలు) విరాళం ప్రకటించాయి. ఈ డబ్బును నగరంలో బాటిళ్లతో నీటి సరఫరా, బోర్లు వేసేందుకు వినియోగిస్తారు. గత శనివారం కేప్టౌన్లోని న్యూలాండ్స్లో మూడో టి20 అనంతరం ఈ మొత్తాన్ని రెండు జట్ల కెప్టెన్లు విరాట్ కోహ్లి, డు ప్లెసిస్లు ‘గివర్స్ ఫౌండేషన్’కు అందజేశారు. భారత్, దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్టుతో పాటు మూడో వన్డే, చివరి టి20లకు కేప్టౌన్ ఆతిథ్యమిచ్చింది. ఆటగాళ్లు సంతకాలు చేసిన జెర్సీల వేలం ద్వారా నగరంలో నీటి ఎద్దడి నివారణకు నిధులు సేకరించాలని తాను, కోహ్లి చర్చించుకున్నామని డు ప్లెసిస్ చెప్పాడు. -
గొంతెండిన కేప్టౌన్
గుక్కెడు మంచినీటి కోసం మున్ముందు ప్రపంచ ప్రజానీకం పడబోయే కష్టాలెలా ఉంటాయో దక్షిణాఫ్రికా నగరం కేప్టౌన్ శాంపిల్గా చవిచూపిస్తోంది. అభివృద్ధి పేరిట నేల విడిచి ఆకాశం వైపు దూసుకెళ్తున్న నగరాలకు భవిష్యత్తులో ఇలాగే చుక్కలు కనబడటం ఖాయమని ఆ నగర పౌరులు పడుతున్న ఆప సోపాలు చూస్తే అర్ధమవుతుంది. ఇప్పటికే నగరంలో రేషన్ మొదలైంది. మనిషికి 50 లీటర్ల చొప్పున ఇచ్చే నీటితో కాలక్షేపం చేస్తున్న నగర పౌరులు మరో మూడు నెలల్లో మరిన్ని ఇబ్బందులు పడకతప్పదని అధికారులు చెబుతున్నారు. మే 11ను వారు ‘జీరో డే’గా ప్రకటించారు. ఆ రోజు మొదలుకొని కేప్టౌన్లోని 40 లక్షలమంది పౌరుల ఇళ్లకూ, వ్యాపార సంస్థలకూ నల్లాల ద్వారా నీటి సరఫరా నిలిచిపోతుంది. పౌరులందరూ నగరంలో ఏర్పాటయ్యే 200 నీటి కేంద్రాల వద్ద బారులు తీరి నిలబడి నీళ్లు పట్టుకోవాల్సివస్తుంది. అప్పటినుంచీ మనిషికి కేవలం 25 లీటర్ల నీటిని మాత్రమే ఇస్తారు. తెల్లారింది మొదలుకొని రాత్రి నిద్రపోయేవరకూ ప్రతి ఒక్కరూ ఈ నీటితోనే తమ సమస్త అవసరాలనూ తీర్చుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా 2022 నాటికల్లా నీటి వనరులన్నీ యుద్ధాలకు వనరులుగా మారబోతున్నాయని అయిదారేళ్లక్రితం అమెరికా ఇంటెలిజెన్స్ సంస్థ అంచనా వేసింది. ఎత్తయిన భవంతుల్ని, కళ్లు జిగేల్మనేలా విద్యుత్ దీప కాంతుల్ని, వాహనాలు శరవేగంతో దూసుకెళ్లడానికి వీలయ్యే రోడ్లనూ పరిచి, అక్కడ సమస్తమూ కేంద్రీకరించి ఆ నగరాలను అభివృద్ధి నమూనాలుగా, తమ ఘనతగా చాటే పాలకులు కళ్లు తెరవక తప్పదని కేప్టౌన్ అనుభవం చెబుతోంది. దక్షిణ అట్లాంటిక్ మహా సముద్ర తీరాన ఉండే కేప్టౌన్ సాధారణ నగరం కాదు. నల్లజాతి ప్రజల మహానాయకుడు నెల్సన్ మండేలాను దీర్ఘకాలం బందీగా ఉంచిన కారాగారం ఆ నగరంలోనిదే. దేశంలో ప్రధాన నగరం జోహ న్నెస్బర్గ్ అయినా ప్రపంచంలోని సంపన్నుల కళ్లన్నీ కేప్టౌన్పైనే ఉంటాయి. ఏటా ప్రపంచం నలుమూలలనుంచీ ఆ నగరానికి 16 లక్షలమంది సందర్శకులు వస్తుంటారు. వారు అక్కడ చేసే ఖర్చు 330 కోట్ల డాలర్ల(రూ.21,000 కోట్ల) పైమాటే. ఆకాశాన్నంటే అయిదు నక్షత్రాల హోటళ్లు, బీచ్లు, కేబుల్ కార్లు, ప్రపంచం మూల మూలలనుంచీ తరలివచ్చిన రకరకాల వినియోగవస్తువులతో కొలువు దీరే మహా దుకాణ సముదాయాలు, సైకిల్ రేసులు, క్రికెట్ మొదలుకొని రగ్బీ వరకూ తరచుగా జరిగే జాతీయ, అంతర్జాతీయ క్రీడలు పర్యాటకులకు మంచి కాలక్షేపాన్నిస్తాయి. నగరానికి దగ్గర్లో సముద్ర గర్భాన ఉండే రాబెన్ ద్వీపానికి రాత్రి, పగలు తేడాలేకుండా పడవల్లో రాకపోకలు సాగించే జనాన్ని చూసి తీరాల్సిందే. కేప్టౌన్ ప్రధాన ఓడరేవున్న నగరం కూడా. ఇంత హడావుడి నగరం కనుక అక్కడికి పొట్టపోసుకొనేందుకొచ్చే వలస జనం కూడా ఎక్కువే. డబ్బే సర్వస్వమైన ఆ నగరం ఇప్పుడు నీటి చుక్కకు కటకటలాడే దుస్థితి తలె త్తడాన్ని సహజంగానే జీర్ణించుకోలేకపోతోంది. ఇదెక్కడో ఏర్పడ్డ సంక్షోభమని కొట్టి పారేయడానికి లేదు. మన నగరాల తలుపు తట్టే రోజు ఎంతో దూరంలో లేదు. రాబోయే రోజుల్లో నీటి సంక్షోభాన్ని ఎదుర్కొనబోతున్న నగరాల జాబితాను ఈమధ్యే బీబీసీ ప్రకటించింది. అందులో బ్రెజిల్ ఆర్థిక రాజధాని సావోపావ్లో మొదటి స్థానంలో ఉంటే ఆ తర్వాత నగరం బెంగళూరే. బీజింగ్, కైరో, మాస్కో తదుపరి స్థానాల్లో ఉన్నాయి. ఈ నగరాలన్నీ చెప్పుకోవడానికి ‘శరవేగంగా’ అభివృద్ధి చెందుతున్న నగరాలే. వాటి ద్వారా ప్రభుత్వాలకు లభిస్తున్న ఆదాయం సైతం భారీగానే ఉంటున్నది. కానీ అక్కడికి చేరుతున్న జనాభాకు అవసరమైన జల వనరులు ఆ నగరాలకు అందుబాటులో లేవు. వెనకా ముందూ చూసుకోకుండా అభివృద్ధినంతటినీ ఒకేచోట కేంద్రీకరించడం వల్ల తలెత్తిన సమస్య ఇది. బెంగళూరుకు నీటి సమస్య కొత్తగాదు. అక్కడ సమస్య ఉన్నట్టు ప్రభుత్వాలు సైతం గుర్తించి దశాబ్దాల వుతోంది. అయినా ఎవరికీ చీమ కుట్టినట్టయినా లేకపోయింది. పాలకులు హ్రస్వ దృష్టితో వ్యవహరించారు. అడవుల్ని విచక్షణారహితంగా నాశనం చేస్తుంటే, కొండల్ని పిండి చేస్తుంటే వానలు పడటం తగ్గుతుందని, కరువు రాజ్యమేలుతుందని పర్యావరణవాదులు హెచ్చరిస్తున్నా పెడచెవిన పెట్టారు. పైపెచ్చు అభివృద్ధి మాటున తామే సహజ సంపదను ధ్వంసం చేసే పనికి పూనుకున్నారు. కరువు కాటకాల వల్ల నదులు చిక్కిపోతున్నాయి. పారినంత మేరా అనేక వ్యర్థాల బారిన పడి అవి కాలుష్యమయమవుతున్నాయి. ఇక నగర జనాభాకు నీటి లభ్యత అడుగంటడంలో ఆశ్చర్యమేముంది? భూ ఉపరితలంపై నీటి వాటా 70 శాతమైతే 30 శాతం మాత్రమే భూభాగం. ఇంత పుష్కలంగా నీరున్నా అందులో తాగడానికి పనికొచ్చేది 3 శాతం మాత్రమే. ప్రపంచ జనాభా 760 కోట్లయితే అందులో కోటిమందికి అసలు మంచినీటి సదుపాయమే లేదు. మరో 270 కోట్లమంది ఏటా కనీసం నెలరోజులపాటు చాలి నంత నీరు లభ్యంకాక సతమతమవుతున్నారు. ప్రపంచంలోని 500 మహా నగరాలు మున్ముందు నీటి ఇబ్బందుల్లో పడతాయని నాలుగేళ్ల క్రితం వెలువడిన సర్వే అంచనా వేసింది. ప్రతి నాలుగు నగరాల్లోనూ ఒకటి మంచినీటి వెతల్ని ఎదుర్కొనవలసి వస్తుందని ఆ సర్వే అంటున్నది. ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొని తమ అభివృద్ధి నమూనాలను సమీక్షించుకోనట్టయితే ప్రమాదకర పర్య వసానాలు ఏర్పడటం ఖాయం. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని అన్ని రాష్ట్రాలూ ఆదర్శంగా తీసుకోవాలి. 2020 నాటికి ఆ రాష్ట్రంలోని 46,530 చెరు వుల్ని, సరస్సుల్ని పునరుద్ధరించాలన్న సంకల్పంతో 2015లో ప్రారంభించిన ‘మిషన్ కాకతీయ’ అనుకున్నట్టు విజయం సాధిస్తే ఇటు మంచినీటి కొరతనూ తీరుస్తుంది. అటు సాగునీటి లభ్యతనూ పెంచుతుంది. ఇది అనుసరణీయమైన మార్గం. ముప్పు ముంచుకొచ్చే వరకూ పట్టనట్టు ఉంటే ఇప్పుడు కేప్టౌన్ వాసులు ఎదుర్కొంటున్న దుస్థితే అందరికీ దాపురిస్తుంది. బహుపరాక్!! -
కోహ్లి విజృంభణ.. దక్షిణాఫ్రికాకు భారీ లక్ష్యం
కేప్టౌన్ : దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేల్లో కెప్టెన్ విరాట్ కోహ్లి (160), ఓపెనర్ ధావన్(73)లు విజృంభించడంతో భారత్, ఆతిథ్య జట్టుకు 304 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన భారత్కు రోహిత్ డకౌటవ్వడంతో ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అనంతరం క్రీజులోకి వచ్చిన కోహ్లి, ధావన్తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. ఈ తరుణంలో వేగంగా ఆడిన ధావన్ 42 బంతుల్లో 9 ఫోర్లతో కెరీర్లో 25వ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. హాఫ్ సెంచరీ అనంతరం వేగం పెంచిన ధావన్ సఫారీ కెప్టెన్ మార్క్రమ్ అద్భుత క్యాచ్కు వెనుదిరిగాడు. దీంతో రెండో వికెట్కు నమోదైన 140 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన రహానే(11) విఫలమయ్యాడు. తొలి వన్డేలో అర్ధ సెంచరీతో ఆకట్టుకున్న రహానే ఈ మ్యాచ్లో తీవ్రంగా నిరాశపరిచాడు. మిడిలార్డర్ విఫలం తొలి రెండు వన్డేల్లో అంతగా బ్యాటింగ్ అవకాశం రాని మిడిలార్డర్ బ్యాట్స్మన్ ఈ మ్యాచ్లో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. పాండ్యా(14), ధోని(10), జాదవ్(1)లు దారుణంగా విఫలమయ్యారు. భువీ అండతో ఒకవైపు వికెట్లు పడుతుండటంతో భారత్ సాధారణ లక్ష్యానికే పరిమితం అనుకున్న సందర్భంలో కోహ్లి, భువనేశ్వర్ అండతో భారీ స్కోర్ దిశగా ప్రయత్నించాడు. వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలిస్తూ స్కోరు బోర్డు వేగాన్ని పెంచాడు. భువనేశ్వర్(16) సైతం కోహ్లికి మద్దతివ్వడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 303 పరుగులు చేసింది. కోహ్లి 160(159 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సులు) నాటౌట్గా నిలిచి వన్డేల్లో మూడోసారి 150 పైగా పరుగులు చేశాడు. ఇక ప్రొటీస్ బౌలర్లలో డుమినీకి రెండు వికెట్లు దక్కగా.. మోరిస్, రబడ, తాహీర్, ఆండీల్ పెహ్లుక్వాయో, తాహిర్లకు తలో వికెట్ దక్కింది. -
కోహ్లి సెంచరీ.. మరో అరుదైన రికార్డు
కేప్టౌన్ : దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మరో శతకం సాధించాడు. దీంతో మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఇప్పటికే తొలి వన్డేలో సెంచరీ సాధించిన కోహ్లి, రెండో వన్డేలో 46 నాటౌట్గా నిలిచి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. అదే ఫామ్ను కొనసాగిస్తూ మూడో వన్డేలో సైతం 119 బంతుల్లో 7 ఫోర్లతో కెరీర్లో 34వ సెంచరీ నమోదు చేశాడు. ఈ సెంచరీతో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక సెంచరీలు సాధించిన క్రికెటర్ల జాబితాలో 5వ స్థానంలో నిలిచాడు. 54 సెంచరీలతో ఇప్పటి వరకు ఈ స్థానంలో హాషిమ్ ఆమ్లా( దక్షిణాఫ్రికా), మహేళా జయవర్ధనే(శ్రీలంక)లతో నిలిచిన కోహ్లి తాజా సెంచరీతో వారిని వెనక్కి నెట్టాడు. వన్డేల్లో 34, టెస్టుల్లో 21 సెంచరీలతో కలపి కోహ్లి మొత్తం 55 సెంచరీలు చేశాడు. ఇక తొలి స్థానంలో సచిన్(100) ఉండగా.. పాంటింగ్(ఆస్ట్రేలియా) 71, సంగక్కర(శ్రీలంక) 63, జాక్వస్ కల్లీస్(దక్షిణాఫ్రికా) 62లు కోహ్లికన్నా ముందు వరుసలో ఉన్నారు. కోహ్లి భవిష్యత్తులో ఇదే ఫామ్ను కొనసాగిస్తే సచిన్ను అధిగమించడం అతిశయోక్తికాదు. -
రోహిత్ డకౌట్.. భారత్ 0/1
కేప్టౌన్ : దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ రోహిత్ శర్మ డకౌట్ అయి మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు. దీంతో భారత్ పరుగుల ఖాతా తెరవకుండానే వికెట్ కోల్పోయింది. తొలి ఓవర్ వేసిన రబడా బౌలింగ్లో 6 బంతులు ఎదుర్కొన్న రోహిత్ చివరి బంతికి కీపర్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. గత రెండు వన్డేల్లో తీవ్రంగా నిరాశపర్చిన రోహిత్ ఈ మ్యాచ్లోనైనా చేలరేగుతాడని భావించిన అభిమానులకు నిరాశే మిగిలింది. అనంతరం క్రీజులోకి కోహ్లి వచ్చాడు. -
భారత్దే బ్యాటింగ్
కేప్టౌన్: భారత్తో న్యూలాండ్స్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత జట్టులో ఎలాంటి మార్పులు చోటు చేసుకోకపోగా ఆతిథ్య జట్టులో స్వల్ప మార్పులు జరిగాయి. గాయంతో దూరమైన సఫారీ కీపర్ డికాక్ స్థానంలో హెన్రీచ్ క్లాసెన్, బౌలర్ మోర్కెల్ స్థానంలో లుంగి ఎంగిడిలను తీసుకున్నారు. ఈ ఇద్దరు ఈ మ్యాచ్తో అంతర్జాతీయ వన్డేల్లోకి అరంగేట్రం చేస్తున్నారు. ఇప్పటికే రెండు మ్యాచ్లు గెలిచి మంచి ఊపు మీదున్న కోహ్లి సేన మరో విజయం సొంతం చేసుకుని చరిత్ర సృష్టించాలని ఉవ్విల్లూరుతోంది. ఇక ఆతిథ్య జట్టుకు గాయాల బెడద వెంటాడుతుండగా ఎట్టి పరిస్థితుల్లోనైనా ఈ మ్యాచ్ గెలిచి సిరీస్పై అవకాశాలు వదులుకోవద్దని సఫారీ జట్టు భావిస్తోంది. జట్లు భారత్: కోహ్లి (కెప్టెన్), ధావన్, రోహిత్, రహానే, జాదవ్, ధోనీ, పాండ్యా, భువనేశ్వర్, కుల్దీప్, చహల్, బుమ్రా. దక్షిణాఫ్రికా: మార్క్రమ్ (కెప్టెన్), ఆమ్లా, డుమిని, మిల్లర్, జొండొ, హెన్రీచ్ క్లాసెన్, మోరిస్, రబడ, తాహీర్, ఆండీల్ పెహ్లుక్వాయో, లుంగి ఎంగిడి -
స్టెయిన్ ‘గన్ డౌన్’
భారత్తో జరుగుతున్న కేప్టౌన్ టెస్టులో 17.3 ఓవర్లు వేసిన తర్వాత... ఈ మ్యాచ్కు ముందు తాను ఆడిన ఆఖరి టెస్టులో ఆస్ట్రేలియాపై పెర్త్లోనూ తొలి ఇన్నింగ్స్లో 12.4 ఓవర్ల తర్వాత... అంతకు కొన్నాళ్ల క్రితం డర్బన్లో ఇంగ్లండ్పై రెండో ఇన్నింగ్స్లో 3.5 ఓవర్ల తర్వాత... దానికంటే ముందు మొహాలీలో భారత్తో జరిగిన తొలి టెస్టులో 11 ఓవర్లకే! దిగ్గజ ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ మ్యాచ్ మధ్యలోనే తప్పుకోవడం ఇది కొత్త కాదు. తాను బరిలోకి దిగిన గత ఆరు టెస్టుల్లో గాయం కారణంగా నాలుగు మ్యాచ్ల్లో ఆట మధ్యలోనే మైదానం నుంచి నిష్క్రమించాడు. ఇప్పుడు కూడా అతను తొలి టెస్టుతో పాటు సిరీస్కు దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది. తాజా పరిణామాలు చూస్తుంటే అతను మళ్లీ కోలుకొని జట్టులోకి రావడం, గత స్థాయిలో ప్రదర్శన ఇవ్వడం చాలా కష్టం కావచ్చు. పదమూడేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్పై తనదైన ముద్ర వేసి ఎందరో బ్యాట్స్మెన్ను భయపెట్టిన స్టెయిన్ కెరీర్ ప్రమాదంలో పడింది. తొలి టెస్టుకు ముందు దక్షిణాఫ్రికా కోచ్ ఒటిస్ గిబ్సన్ మీడియాతో మాట్లాడుతూ స్టెయిన్కు తుది జట్టులో దాదాపుగా అవకాశం లేదని తేల్చేశాడు. జట్టు కూర్పు ఒక సమస్య కాగా, గాయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న అతను, ఏదైనా జరిగి మ్యాచ్ మధ్యలో తప్పుకుంటే సమస్యగా మారుతుందని స్పష్టంగా చెప్పాడు. నిజంగా ఆయన భయపడినట్లే జరిగింది. న్యూలాండ్స్ పిచ్ను దృష్టిలో ఉంచుకొని సఫారీ జట్టు నలుగురు పేసర్లతో బరిలోకి దిగడంతో స్టెయిన్కు చాన్స్ లభించినా... అతను మళ్లీ గాయంతో వెనుదిరగడం ఆ టీమ్ను ముగ్గురు పేసర్లకే పరిమితం చేసింది. ఇది చివరకు జట్టు విజయావకాశాలపై ప్రభావం చూపించవచ్చు కూడా. భుజం గాయం నుంచి కోలుకొని ఏడాది తర్వాత పునరాగమనం చేశాక ఇప్పుడు మరో కొత్త తరహా గాయం (మడమ)తో అతను మధ్యలోనే వెళ్లిపోవడం ఏమాత్రం మేలు చేసేది కాదు. భారత్తో సిరీస్ తర్వాత మార్చిలో కీలకమైన ఆస్ట్రేలియా సిరీస్ కూడా ఉంది. అతను అప్పటిలోగా కోలుకోగలడా? ప్రదర్శన బాగున్నా... భుజం గాయం నుంచి కోలుకున్న తర్వాత స్టెయిన్ ముందుగా దేశవాళీ టి20ల్లో ఐదు మ్యాచ్లు ఆడి తన ఫిట్నెస్ పరీక్షించుకున్నాడు. ఆ తర్వాత జింబాబ్వేతో ప్రాక్టీస్ మ్యాచ్లో కూడా 12 ఓవర్లు వేశాడు. అయితే అనారోగ్యంతో జింబాబ్వేతో టెస్టు ఆడలేకపోయాడు. భారత్తో మ్యాచ్లో అతని బౌలింగ్లో ఎప్పటిలాగే పదును కనిపించడం విశేషం. షార్ట్ బంతులు, అవుట్ స్వింగర్లు వేయడంలో ఎక్కడా తీవ్రత తగ్గకపోగా, బౌలింగ్ రనప్, యాక్షన్లో ఎక్కడా పాత గాయం సమస్య కనిపించలేదు. ధావన్ను వెనక్కి పంపిన బంతిగానీ, ఆ వెంటనే కోహ్లిని దాదాపుగా అవుట్ చేసినట్లుగా అనిపించిన బంతిగానీ పాత స్టెయిన్ను చూపించాయి. చాలా సార్లు స్టెయిన్ బంతులు గంటకు 140 కిలోమీటర్ల వేగాన్ని కూడా దాటాయి. ఆ తర్వాత సాహా వికెట్, పాండ్యా క్యాచ్ డ్రాప్ అయిన బంతి కూడా అతని గొప్పతనాన్ని చాటాయి. అయితే దురదృష్టవశాత్తూ గాయం అతని జోరుకు బ్రేక్ వేసింది. నిజానికి దక్షిణాఫ్రికా టీమ్ మేనేజ్మెంట్ లెక్కల ప్రకారం పేస్కు బాగా అనుకూలించే తర్వాతి రెండు టెస్టుల వేదికలు సెంచూరియన్, జొహన్నెస్బర్గ్లలో అతను తప్పనిసరిగా జట్టులో ఉండేవాడు. కానీ ఇప్పుడు ఆ అవకాశం కనిపించడంలేదు. గత రెండేళ్ల కాలంలో అతను తుంటి, రెండు సార్లు భుజం, మడమ గాయాలకు గురయ్యాడు. భుజానికి సర్జరీ కూడా జరగడంతో అతను ఏడాది పాటు ఆటకు దూరం కావాల్సి వచ్చింది. అద్భుతమైన రికార్డు... సమకాలీన క్రికెట్లోని అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో స్టెయిన్ ఒకడు అనడంలో సందేహం లేదు. గత కొన్నేళ్ళలో జీవం లేని పిచ్లు, చిన్న మైదానాలు, పెద్ద బ్యాట్లు రాజ్యమేలుతున్న సమయంలో కూడా అతను తన ముద్ర చూపించాడు. గాయాలు ఇబ్బంది పెడుతున్నా అతని బౌలింగ్ ఇంకా భీకరమే. గాయంతో పెర్త్ టెస్టు నుంచి తప్పుకోవడానికి ముందు తొలి ఇన్నింగ్స్లో అతని అద్భుత బౌలింగ్ పునాదితోనే దక్షిణాఫ్రికా మ్యాచ్ గెలవగలిగింది. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో స్టెయిన్ టాప్–10లో ఉన్నాడు. వారిలో కేవలం ఇద్దరు పేసర్లకు (మెక్గ్రాత్, హ్యాడ్లీ)లకు మాత్రమే స్టెయిన్ (22.32) కంటే మెరుగైన సగటు ఉంది. ఎంతో మంది పేసర్లు తమ సొంతగడ్డపై, అనుకూల పిచ్లపై చెలరేగినా... ఉపఖండానికి వచ్చేసరికి మాత్రం తేలిపోయారు. అయితే ఈతరంలో తనతో పోటీ పడిన బ్రెట్ లీ, మిచెల్ జాన్సన్, అండర్సన్, బ్రాడ్ తదితరులతో పోలిస్తే భారత్లాంటి చోట అతని ప్రదర్శన స్టెయిన్ను అందరికంటే ప్రత్యేకంగా నిలబెడుతుంది. భారత గడ్డపై 6 టెస్టుల్లో కేవలం 21.38 సగటుతో 26 వికెట్లు పడగొట్టడం, పాకిస్తాన్లో 24.66, శ్రీలంకలో 24.71 సగటు అతనేమిటో చెబుతాయి. దక్షిణాఫ్రికా తరఫున 44 టెస్టు విజయాల్లో భాగమైన స్టెయిన్... వాటిలో నమ్మశక్యం కాని రీతిలో 16.03 సగటుతో 291 వికెట్లు పడగొట్టడం అతని విలువేమిటో చూపిస్తోంది. ఇలాంటి గొప్ప ఆటగాడి కెరీర్ అర్ధాంతరంగా ముగియా లని ఏ జట్టూ కోరుకోదు. డాక్టర్ల సహకారంతో వీలైనంత త్వరగా అతను కోలుకునేలా ప్రయత్నిస్తామని జట్టు మేనేజర్ మూసాజీ చెప్పడం తమ స్టార్ ఆటగాడిపై వారికి ఉన్న నమ్మకమే కారణం. వారు ఆశించినట్లుగా స్టెయిన్ మళ్లీ తిరిగొచ్చి తన సత్తా చూపించాలని క్రికెట్ ప్రపంచం కూడా కోరుకుంటోంది. 419: 86 టెస్టుల్లో స్టెయిన్ పడగొట్టిన వికెట్ల సంఖ్య. ఓవరాల్గా పదో స్థానంలో ఉన్న అతను... మరో మూడు వికెట్లు తీస్తే అత్యధిక వికెట్లు తీసిన దక్షిణాఫ్రికా బౌలర్గా షాన్ పొలాక్ (421)ను అధిగమిస్తాడు. 60 ఏళ్ల వయసులో కూడా 90 కిలోమీటర్ల మారథాన్ పరుగెత్తే కొందరు మిత్రులే నాకు ఆదర్శం. ఫిట్నెస్ గురించి నాకు బెంగ లేదు. ప్రస్తుతం మా జట్టులోని చాలా మంది యువ ఆటగాళ్లకంటే నా ఫిట్నెస్ చాలా బాగుంది. కనీసం ఈ ఏడాది మొత్తం ఆడిన తర్వాతే కెరీర్పై పునరాలోచిస్తా. ప్రస్తుతం 35 ఏళ్ల వయసులో నాకు క్రికెట్ గురించే తప్ప రిటైర్మెంట్, ఇతర వ్యాపకాల గురించి ఆలోచన లేదు. సాధ్యమైనంత ఎక్కువ కాలం క్రికెట్ ఆడాలని భావిస్తున్న నాకు వయసు సమస్యే కాదు. –కేప్టౌన్ టెస్టుకు ముందు స్టెయిన్ వ్యాఖ్య కేప్టౌన్కు వానొచ్చింది ► మూడో రోజు ఆట పూర్తిగా రద్దు ► భారత్, దక్షిణాఫ్రికా తొలి టెస్టు కేప్టౌన్: అనూహ్య మలుపులు తిరుగుతూ ఆసక్తికరంగా మారిన భారత్, దక్షిణాఫ్రికా తొలి టెస్టు మ్యాచ్కు ఆకస్మిక విరామం... రెండు రోజుల పాటు క్రికెట్ అభిమానులను అలరించిన టెస్టుకు మూడో రోజు వాన అడ్డంకిగా మారింది. భారీ వర్షం కారణంగా ఆదివారం ఆట పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది. రోజంతా ఒక్క బంతి వేయడం కూడా సాధ్యం కాలేదు. శనివారం రాత్రి నుంచే నగరంలో కురుస్తున్న వర్షం ఆదివారం ఉదయం జోరందుకుంది. మధ్యలో కొన్ని సార్లు తెరిపినిచ్చినా, గ్రౌండ్ను సిద్ధం చేసేందుకు అది సరిపోలేదు. అంపైర్లు కనీసం న్యూలాండ్స్ మైదానాన్ని పరిశీలించాల్సిన అవసరం కూడా లేకుండా ఆటను రద్దు చేశారు. మ్యాచ్ నిర్దేశిత ఆరంభ సమయంనుంచి సరిగ్గా ఐదు గంటల తర్వాత అంపైర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్లో 2 వికెట్లకు 65 పరుగులు చేసిన దక్షిణాఫ్రికా ఓవరాల్గా 142 పరుగులు ముందంజలో ఉంది. మిగిలిన రెండు రోజుల ఆట ఎలాంటి మలుపులు తీసుకుంటుందో, ఎలాంటి తుది ఫలితం వస్తుందో చూడాలి. సోమ, మంగళవారాల్లో రోజుకు 98 ఓవర్ల చొప్పున ఆట సాగనుంది. మరోవైపు ఈ భారీ వర్షం స్థానికంగా క్రికెట్ వీరాభిమానులను కూడా ఏమాత్రం నిరాశపర్చలేదు. ఈ వాన వారిలో అమితానందాన్ని నింపింది. వర్షాలే లేకపోవడంతో గత వందేళ్లలో ఎన్నడూ లేనంత తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటున్న కేప్టౌన్కు ఇదో వరంగా వారు భావిస్తున్నారు. వాతావరణ శాఖ సూచన ప్రకారం సోమవారం మాత్రం వర్షసూచన లేదు. –సాక్షి క్రీడా విభాగం -
వాటర్ బాటిల్ బదులు.. 10 బీర్లు ఇస్తాం!
కేప్టౌన్ : దక్షిణాఫ్రికాతో తొలి టెస్ట్ ఆడుతున్న భారత జట్టును నీటి కష్టాలు ఇబ్బందులు పెడుతున్నాయి. ప్రస్తుతం కేప్టౌన్లో అత్యంత దారుణ దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. నగరంలో నీటికొరత తీవ్రంగా ఉంది. దీంతో భారత క్రికెటర్లు వినియోగించే నీటిపై అధికారులు ఆంక్షలు విధించారు. షవర్ కింద రెండు నిమిషాలు మాత్రమే స్నానం చేయాలని క్రికెటర్లకు అధికారులు స్పష్టం చేశారు. అలాగే టబ్ బాత్ను పూర్తిగా నిషేధించారు. ప్రస్తుతం కేప్టౌన్లో ఉష్ణోగత చాలా ఎక్కువగా ఉంది. ఉష్ణోగ్రతలనుంచి ఉపశమనం పొందేందుకు తాగే నీటిపైనా అధికారులు ఆంక్షాలు విధించారు. ‘తాగేందుకు కావలసిన స్థాయిలో నీరు ఇవ్వలేం.. కానీ ఎంత కావాలన్నా బీరు అందిస్తాం. ఒక వాటర్ బాటిల్ బదులు.. 10 బీర్లు ఇస్తామ’ని అధికారులు చెప్పడంతో.. షాక్ తినడం క్రికెటర్ల వంతైంది. ఇదిలావుంటే.. పిచ్క్యూరింగ్, గ్రౌండ్ సిబ్బంది అవసరాల కోసం రోజుకు 87 లీటర్ల నీటిని మాత్రమే అధికారులు సరఫరా చేస్తున్నారు. పిచ్పై పచ్చికను కాపాడేందుకు కూడా ఈ నీరు సరిపోదని క్యూరేటర్ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అవుట్ ఫీల్డ్ పూర్తిగా పొడిబారి పిచ్ స్పిన్కు అనుకూలించే అవకాశం ఉందని క్యూరేటర్ అన్నారు. -
కేప్టౌన్లో బుమ్రాను ఆడించాలి: నెహ్రా
న్యూఢిల్లీ: భారత్, దక్షిణాఫ్రికా మధ్య కేప్టౌన్లో జరిగే తొలి టెస్టులో యువ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను ఆడించాలని మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా అన్నారు. ‘టీమ్ మేనేజ్మెంట్ మదిలో ఏముందో నాకైతే తెలీదు... కేప్టౌన్లోని న్యూలాండ్స్ వికెట్ బుమ్రాకు సరిగ్గా నప్పుతుంది. రంజీల్లో గుజరాత్ తరఫున అద్భుతమైన యార్కర్లతో చెలరేగాడు. అతని బౌలింగ్ శైలి ప్రత్యర్థి బ్యాట్స్మెన్కు ఇబ్బందికరంగా ఉంటుంది. పైగా సుదీర్ఘమైన స్పెల్స్ వేయగలడు. ఇవన్నీ సఫారీ గడ్డపై అతనికి కలిసొస్తాయి’ అని నెహ్రా విశ్లేషించారు. ఈ జనవరిలో కేప్టౌన్ వాతావరణం ఎండవేడిమితో ఉంటుందని, సీమర్లకు ఇది కాస్త ఇబ్బందిగా ఉంటుందని చెప్పారు. ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగితే షమీ, ఇషాంత్ల తర్వాతే మూడో సీమర్ ఎవరనే చర్చ ఉంటుందని చెప్పారు. ఇషాంత్ తన బౌలింగ్తో ప్రత్యర్థి బ్యాట్స్మెన్ను అదేపనిగా అసహనానికి గురి చేస్తాడని, దీనివల్ల మరో ఎండ్లో బౌలర్కు దొరికిపోతారన్నారు. -
ఫ్రిడ్జ్లో 12 అడుగుల కొండచిలువ
కేప్టౌన్: నిత్యవసర వస్తువులను కొనుగోలు చేసుకునేందుకు ఓ మహిళ తన నివాసానికి దగ్గరలోని సూపర్ మార్కెట్లోకి వెళ్లింది. పెరుగు ప్యాకెట్ తీసుకుందామని ఫ్రిడ్జ్లో చేయిపెట్టిన ఆమె చేతికి 12 అడుగుల కొండచిలువ తగిలింది. అది గమనించిన ఆమె ఒక్కసారిగా భయంతో కేకలు వేసింది. అప్రమత్తమైన మార్కెట్ సిబ్బంది ఫ్రిడ్జ్ వద్దకు చేరుకుని అందులో ఉన్న కొండచిలువను చూసి హతశులయ్యారు. వెంటనే పాములు పట్టుకునే వారికి సమాచారం అందించారు. మహిళ కొండచిలువను పట్టుకున్న సమయంలో అది గాఢనిద్రలో ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. వెంటనే మార్కెట్కు చేరుకున్న పాములు పట్టే బృందం కొండచిలువను ఫ్రిడ్జ్ లోపలి నుంచి బయటకు లాగింది. ఆ తర్వాత దాన్ని జాతీయ పార్కులో వదిలేశారు. తమ సూపర్మార్కెట్ వెనుక చాలా పొదలు ఉన్నాయని, పై కప్పు నుంచో లేదా మార్కెట్ కింది భాగంలో ఉన్న మురుగు కాలువ నుంచో కొండ చిలువ వచ్చి ఫ్రిడ్జ్లో చేరుంటుందని యాజమాన్యం పేర్కొంది. -
శ్రీలంకపై దక్షిణాఫ్రికా భారీ విజయం
కేప్ టౌన్: శ్రీలంకతో జరిగిన రెండోటెస్టు మ్యాచ్లో దక్షిణాప్రికా 282 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 507 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక 224 పరుగులకే ఆలౌట్ అయింది. దక్షిణాప్రికా తొలి ఇన్నింగ్స్లో 392 పరుగులు చేయగా.. శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 110 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్లో 224 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ని డిక్లేర్ చేసి శ్రీలంక ముందు 507 పరుగుల టార్గెట్ను ఉంచింది. భారీ లక్ష్యంలో బరిలోకి దిగిన శ్రీలంక 224 పరుగులకే ఆలౌట్ అయింది. దక్షిణాప్రికా బౌలర్ రబడ మొదటి ఇన్నింగ్స్లో 4 వికెట్లు, రెండో ఇన్నింగ్స్లో 6 వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సొంతం చేసుకున్నాడు. మూడు టెస్టుల సిరీస్లో మరో మ్యాచ్ ఉండగానే సిరీస్ను దక్షిణాఫ్రికా సొంతం చేసుకుంది. మూడో టెస్టు జనవరి 12న జోహన్నెస్బర్గ్లో ప్రారంభం కానుంది. -
అగ్ని ప్రమాదంలో 9 మంది సజీవ దహనం
కేప్టౌన్: దక్షిణాఫ్రికాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కేప్టౌన్ నగరం మిషెల్స్ ప్లీన్ టౌన్షిప్లోని ఓ భవనంలో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో తొమ్మిది మంది సజీవ దహనమయ్యారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. గాయపడిన నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. -
ఆమె తెల్లగా ఉందని టిప్ ఇవ్వనన్నాడు!
రెస్టారెంట్లో వెయిటర్కు టిప్ ఇవ్వకపోతే అతనేం చేస్తాడు? మనసులో ఎంత కోపం ఉన్నా పైకి నవ్వుతూ తల ఊపుతాడు. వెయిట్రస్ అయిన ఆమెకు ఓ కస్టమర్ టిప్పు ఇవ్వకపోగా తీవ్రంగా అవమానించిన ఘటనలో చలించిపోయిన స్నేహితులు, నెటిజన్లు ఆమెకు రూ.2.07లక్షల భారీగా విరాళాన్ని పంపారు.. టిప్పుగా! ఆష్లే స్కుల్జ్ అనే 24 ఏళ్ల శ్వేతజాతి యువతి కేప్ టౌన్ లోని ఓజ్ కేఫ్ లో వెయిట్రస్ గా పనిచేస్తోంది. తల్లి కేన్సర్ బారిన పడటంతో చదువుకుంటూనే ఉద్యోగం చేస్తోంది. గతవారం ఆమె పనిచేస్తోన్న కేఫ్ కు ఎన్టొకోజో క్వాంబే అనే విద్యార్థినాయకుడు వెళ్లాడు. తినడం పూర్తియిన తర్వాత టిప్ అడిగిన ఆష్టేకు చేతిలో చిన్న పేపర్ ముక్క పెట్టాడు క్వాంబే. అందులో రాసున్నదిచూసి టపటపా కన్నీళ్లు కార్చిందామె. 'మొసలిలా ఏడుస్తావెందుకు?' అని అవమానించడమేకాక 'ఇలా జరిగిందంటూ' ఆష్లేతో జరిగిన సంవాదాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడా విద్యార్థి నేత. అంతే.క్వాంబేపై నెటిజన్లు విరుచుకుపడ్డారు. అనవసరంగా వెయిట్రస్ ను అవమానించాంటూ అతణ్ని తిట్టిపోశారు. 'వాడు ఇవ్వకపోతే పోయాడు.. టిప్పు మేమిస్తున్నాం తీస్కో..' అంటూ ఏకంగా 44వేల రాండ్లు (మన కరెన్సీలో దాదాపు రూ.2.07 లక్షలు) డొనేట్ చేశారు. ఇంతకీ ఆ పేపర్ లో అతనేం రాశాడంటే.. 'మా నేలను విడిచి వెళ్లిపోతానని చెప్పు. అప్పుడే టిప్ ఇస్తా'అని క్వాంబే.. వెయిట్రస్ ఆష్లేకు ఇచ్చిన లెటర్ లో రాశాడు. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో పీజీ పూర్తిచేసిన అతను ఇప్పుడు సౌతాఫ్రికాలో భారీ ఉద్యమాన్ని నడుపుతున్నాడు. కేప్ టౌన్ వర్సిటీలో ఏర్పాటుచేసిన మాజీ ప్రధాని సిసిల్ జాన్ రోడ్స్ విగ్రహాన్ని తొలిగించాలనే ఉద్యమానికి క్వాంబే నాయకుడు. తెల్లవాళ్లను ఈసడించుకునే క్వాంబే.. వీలుచిక్కినప్పుడల్లా ఇలా తెల్లతోలు వ్యక్తులపై మాటలతో విరుచుకుపడతాడు. దీంతో అతనిపై 'జాత్యహంకారి' అనే ముద్రపడింది. గతవారం కేఫ్ లో చోటుచేసుకున్న సంఘటనతో అతనిపై మరోసారి విమర్శలు వెల్లువెత్తాయి. సౌతాఫ్రికా గడ్డపై తెల్లవాళ్ల పెత్తనం చెల్లబోదంటూ నల్లజాతీయులు చేస్తోన్న ఉద్యమం ఇటీవల తారాస్థాయికి చేరింది. సౌతాఫ్రికన్ క్రికెట్ జట్టులోనూ తెల్ల ఆటగాళ్ల సంఖ్యపై నల్లజాతీయులు నిరసనలు తెలుపుతున్నారు. -
పాయింట్ బ్లాక్ నుంచి కాల్చినా..
కేప్ టౌన్: కేప్ టౌన్ ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్ నిజాం అలెగ్జాండర్ మృత్యువు నుంచి తృటిలో తప్పించుకున్నారు. రోజుమాదిరిగానే చెక్పోస్ట్ల దగ్గర తనిఖీలు నిర్వహిస్తున్న అలెగ్జాండర్ మీద ఓ దుండగుడు తుపాకీతో పాయింట్ బ్లాక్ రేంజ్ నుంచి కాల్చడానికి ప్రయత్నించాడు. వెంటనే తేరుకున్న అతను దుండగునిపైకి తిరిగి కాల్పులు ప్రారంభించి, పట్టుకోవడానికి పరుగు తీశాడు. కానీ అప్పటికే దుండగుడు పరారవ్వడంతో వెంటనే తిరిగి వచ్చి తన డ్యూటీ తాను చేసుకున్నాడు. ఇదంతా అక్కడే వెనకవైపు ఉన్న పోలీసు వాహనంలోని డ్యాష్ బోర్డ్ కెమెరాలో రికార్డయింది. ప్రాణాపాయం నుంచి కొద్దలో తప్పించుకున్నా, కనీసం కొంచెం గ్యాప్ కూడా తీసుకోకుండా మళ్లీ డ్యూటీలో నిమగ్నమైన ఆ అధికారిని పోలీసులు పొగడ్తలతో ముంచెత్తారు. ఈ వీడియోని వెస్టర్స్ కేప్ ప్రొవిన్షియల్ ప్రభుత్వం గురువారం విడుదల చేసింది. -
కోల్పోయిన మగతనాన్ని ప్రసాదించారు..
వైద్య చరిత్రలో మరో మైలురాయిని చేరుకున్నారు సౌతాఫ్రికా వైద్యులు. మొట్టమొదటిసారి పురుషాంగం ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ను విజయవంతంగా నిర్వహించి ప్రపంచ రికార్డు సాధించారు. ఏడు గంటపాటు నిర్వహించిన ఈ అరుదైన ఆపరేషన్ ద్వారా అంగాన్ని కోల్పోయిన 21 ఏళ్ల యువకుడికి తిరిగి దానిని ప్రసాదించగలిగారు. యూనివర్సిటీ ఆఫ్ స్టెల్లెన్బోస్చ్ ప్రొఫెసర్ల సహకారంతో ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు కేప్టౌన్లోని టైగర్బర్గ్ ఆస్పత్రి వైద్యులు శుక్రవారం మీడియాకు తెలిపారు. మత మార్పిడిలో భాగంగా సున్తీ చేయించుకున్న ఓ యువకుడు (పేరు చెప్పలేదు) కొద్ది రోజుల తర్వాత తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. సున్తీ సమయంలో సరైన జాగ్రత్తలు పాటించని కారణంగా ఇన్ఫెక్షన్ సోకడంతో వైద్యులు అతని పురుషాంగాన్ని తొలిగించారు. మూడేళ్ల నిరీక్షణ తర్వాత కేప్టౌన్ వైద్యుల ప్రకటన ఆ యువకుడికి కొత్త ఆశలు రేకెత్తించింది.. అనారోగ్యంతో మరణానికి చేరువైన ఓ వ్యక్తి అవయవ దానం చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేయడంతో అతని అంగాన్ని సదరు యువకుడికి అమర్చేందుకు వైద్యులు ఏర్పాట్లు చేశారు. ఏ తేదీన ఆపరేషన్ నిర్వహించిందీ వెల్లడించనప్పటికీ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయిందని, ప్రస్తుతం ఆ యువకుడు కోలుకుంటున్నాడని టైగర్స్ బర్గ్ ఆసుపత్రి ప్రధాన వైద్యుడు ఆండ్రూ వాన్డెర్ మెర్వే చెప్పారు. సున్తీ సమయంలో అజాగ్రత్తల కారణంగా ఆఫ్రికాలో ఏటా వందలమంది యువకులు అంగాన్ని కోల్పోతున్నారని పేర్కొన్నారు. -
మనీమూన్..
అదేంటి.. హనీమూన్ అని కదా అనాలి అన్న డౌట్ వచ్చిందా.. ‘డిస్కవర్ ఆఫ్రికా’ సంస్థ వాళ్లు అందిస్తున్న ఈ హనీమూన్ ప్యాకేజీ ధర వింటే మీరూ ఇదే అంటారు. 14 రోజుల హనీమూన్ ట్రిప్ ధర జంటకు రూ.1.5 కోట్లు! ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హనీమూన్ ప్యాకేజీ. ఇందులో భాగంగా మనం దక్షిణ, పశ్చిమ ఆఫ్రికా అందాలను వీక్షించవచ్చు. కేప్టౌన్ నగరాన్ని నింగి నుంచి వీక్షించడానికి హెలికాప్టర్ రైడ్, విలాసవంతమైన హోటళ్లలో బస, సఫారీ పార్కుల్లో విహారం వంటివి ఈ ప్యాకేజీలో భాగం. ఇంకేదైనా అదనంగా కావాలనుకుంటే మాత్రం మరింత చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు.. ఇక్కడికి రావడానికి, ఇక్కడ్నుంచి ఇంటికి పోవడానికి అయ్యే విమాన చార్జీలను మనమే భరించాల్సి ఉంటుంది. -
శిలలపై హోటల్ కట్టినారు..
చుట్టూ పచ్చదనం.. మధ్యలో సెడర్బర్గ్ పర్వతాలు.. వాటి గుహల్లో గదులు.. అదిరిపోయే ఈ హోటల్ దక్షిణాఫ్రికాలో ఉంది. కేప్టౌన్కు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కగ్గా కమ్మా రిసార్ట్ అంటే పర్యాటకులు పడిచస్తారు. సెడర్బర్గ్ పర్వతాల్లో ఉన్న గుహల్లో గదులను ఏర్పాటు చేశారు. మరికొన్నింటిని పర్వతాన్ని తొలిచి.. కట్టారు. అంతేకాదు.. దీని చుట్టూ అలా తిరిగొస్తే.. నాటి రాతి యుగంలోకి వెళ్లొచ్చిన అనుభూతి కలుగుతుంది. పర్వతాలపై 6 వేల ఏళ్ల క్రితం అప్పటి ఆదిమవాసులు చెక్కిన చిత్రాలు నేటికీ దర్శనమిస్తాయి. అంతేకాదు.. గుహల్లో వద్దనుకుంటే.. ఆరుబయట నక్షత్రాలను లెక్కబెడుతూ పడుకునే సదుపాయమూ ఉంది. ఇందులో ఒక రోజు బసకు రూ.15,600 వసూలు చేస్తారు. -
క్లార్క్ అజేయ సెంచరీ
కేప్టౌన్: కెప్టెన్ మైకేల్ క్లార్క్ (301 బంతుల్లో 161 బ్యాటింగ్; 17 ఫోర్లు) అజేయ సెంచరీ నమోదు చేయడంతో దక్షిణాఫ్రికాతో మూడో టెస్టులో ఆస్ట్రేలియా భారీ స్కోరు నమోదు చేసింది. ఓవర్నైట్ స్కోరు 331/3తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్... వర్షం కారణంగా ఆట నిలిచిపోయే సమయానికి 7 వికెట్ల నష్టానికి 494 పరుగులు చేసింది. తొడ కండరాల గాయంతో తొలిరోజు అర్ధంతరంగా మైదానం వీడిన దక్షిణాఫ్రికా పేస్ బౌలర్ స్టెయిన్ ఆదివారం కూడా బౌలింగ్కు దిగకపోవడంతో ఈ అవకాశాన్ని ఆసీస్ చక్కగా సొమ్ము చేసుకుంది. అర్ధసెంచరీ సాధించిన స్టీవెన్ స్మిత్ (84; 9 ఫోర్లు, 3 సిక్స్లు)తో కలిసి నాలుగో వికెట్కు క్లార్క్ 184 పరుగులు జోడించాడు. ఎల్గర్ బౌలింగ్లో స్మిత్ ఔటయ్యాక వాట్సన్ (40) దూకుడుగా ఆడగా, డుమిని (4/73) వరుసగా మూడు వికెట్లు పడగొట్టాడు. టీ విరామం తరువాత వర్షం ప్రారంభమై ఎంతకీ తగ్గకపోవడంతో ఆ తరువాత ఆట సాధ్యం కాలేదు. -
వార్నర్ సెంచరీ: ఆస్ట్రేలియా 331/3
కేప్టౌన్: దక్షిణాఫ్రికాతో నిర్ణాయక మూడో టెస్టును ఆస్ట్రేలియా ఘనంగా ఆరంభించింది. శనివారం టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్... ఓపెనర్ డేవిడ్ వార్నర్ (152 బంతుల్లో 135; 12 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీకితోడు కెప్టెన్ క్లార్క్ (92 బ్యాటింగ్; 9 ఫోర్లు), స్టీవెన్ స్మిత్ (50 బ్యాటింగ్; 6 ఫోర్లు, 1 సిక్స్)లు రాణించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 331 పరుగులు చేసింది. 65 పరుగుల వద్ద రోజర్స్ (25)ను స్టెయిన్, 138 పరుగుల వద్ద డూలన్ (20)ను ఫిలాండర్ వెనక్కి పంపినా.. వార్నర్ దూకుడైన ఆటతీరుతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ దశలో స్టెయిన్కు తొడ కండరాలు పట్టేయడంతో మైదానం వీడటం ఆసీస్కు కలిసొచ్చింది. వార్నర్ను డుమినీ ఔట్ చేసినా క్లార్క్-స్మిత్ జంట నాలుగో వికెట్కు అజేయంగా 114 పరుగులు జోడించి భారీ స్కోరుకు బాటలు వేసింది. మూడు టెస్టుల ఈ సిరీస్లో ఇరుజట్లు 1-1తో సమంగా ఉన్న సంగతి తెలిసిందే. -
చేతకాక ఆరోపణలు
కేప్టౌన్: తమ బౌలర్ల స్వింగ్ను ఆడటం చేతకాక ఆస్ట్రేలియా క్రికెటర్లు తమపై ట్యాంపరింగ్ ఆరోపణలు చేస్తున్నారని దక్షిణాఫ్రికా జట్టు ఘాటుగా స్పందించింది. ఇరు జట్ల మధ్య జరిగిన రెండో టెస్టులో దక్షిణాఫ్రికా క్రికెటర్లు ట్యాంపరింగ్ చేశారని వార్నర్ ఆరోపించాడు. దీనిని సఫారీ జట్టు తీవ్రంగా ఖండించింది. తమ ఆత్మవిశ్వాసం దెబ్బతీసేందుకే ఇలా మాట్లాడరని పేర్కొంది -
మండేలా అంత్యక్రియలకు 450 మంది!
-
మండేలా అంత్యక్రియలకు 450 మంది!
కేప్ టౌన్: జాతివివక్ష వ్యతిరేకోద్యమ నాయకుడు, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా అంత్యక్రియలకు సుమారు 450 మంది అతిథులు హాజరవుతారని ప్రభుత్వం ప్రకటించింది. మండేలా కుటుంబ సభ్యులతో సహా అతిథులను అంత్యక్రియలు జరిగే ప్రదేశానికి అనుమతిస్తామని తెలిపింది. సాధారణ ప్రజలను అంత్యక్రియలు జరిగే ప్రదేశానికి అనుమతించబోమని వెల్లడించింది. నెల్సన్ మండేలా అంత్యక్రియలను దక్షిణాఫ్రికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. మండేలా అంత్యక్రియలు ఆయన తెగ హోసాకు చెందిన శ్మశానంలో జరుగుతాయి. -
ప్రఖ్యాత గ్రూట్ షర్ ఆసుపత్రి సీఈఓగా భావనా పాటిల్
రోగుల అవసరాలను తెలుసుకుని తదనుగుణంగా వారికి సేవలందిస్తానని దక్షిణాఫ్రికాలోని ప్రముఖ ఎన్నారై వైద్యురాలు భావనా పాటిల్ శుక్రవారం కేప్టౌన్లో వెల్లడించారు. ఆ దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్రూట్ షర్ ఆసుపత్రి కార్యనిర్వహాణాధికారిగా ఇటీవలే నూతన పదవి బాధ్యతలు స్వీకరించారు. ఆసుపత్రిలో శస్త్ర చికిత్స చేయించుకునే రోగుల సంఖ్య నానాటికి పెరుగుతుందన్నారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రిలో శస్త్ర చికిత్సలు చేసే సమయాన్ని మరింత పెంచుతామన్నారు. గత ఎనిమిదేళ్లుగా ఇదే ఆసుపత్రిలో మెడికల్ మేనేజర్గా భావనా విధులు నిర్వర్తిస్తున్నారని వెస్టరన్ కేప్ ప్రోవెన్షియల్ మినిస్టర్ ఫర్ హెల్త్ త్యియునస్ బొతా తెలిపారు. అలాగే ఆమె ఆధ్వర్యంలోనే శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయని చెప్పారు. శస్త్ర చికిత్సల నిర్వహాణలో ఆమెకు సుదీర్ఘ అనుభవం ఉందని, ఈ నేపథ్యంలో భావనా పాటిల్ను ఆ పదవికి ఎంపిక చేసినట్లు వెల్లడించారు. ఆ పదవికి భావన సరైన వ్యక్తి అని ప్రోవెన్షియల్ కేబినెట్ ప్రగాఢంగా విశ్వసిస్తుందని బొతా చెప్పారు. భావనా పాటిల్ స్టెలెన్బాష్ యూనివర్శిటీ నుంచి ఫ్యామిలీ మెడిసన్లోమాస్టర్ డిగ్రీ అందుకున్నారు. అనంతరం జోహెన్స్బర్గ్లోని విట్వాటర్స్టాండ్ యూనివర్శిటీ నుంచి బయైథిక్స్తోపాటు హెల్త్ లా లోకూడా మాస్టర్ డిగ్రీని కూడా అందుకున్నారు. ఫ్యామిలీ హెల్త్ స్పెషలిస్ట్గా భావన పాటిల్ ఆ దేశ మెడికల్ కౌనిల్స్లో రిజిస్టర్ చేయించుకున్నారు. దక్షిణాఫ్రికాలోని గ్రూట్ షర్ అసుపత్రిని 1938లో స్థాపించారు. 1967లో డిసెంబర్ 3న ఆ ఆసుపత్రిలోనే ప్రముఖ వైద్యుడు క్రిస్టియన్ బెర్నార్డ్ ప్రపంచంలోనే మొట్టమొదటి గుండె మార్పిడి శస్త్ర చికిత్స నిర్వహించిన సంగతి తెలిసిందే.