CCMB
-
HYD: హోటళ్లలో తనిఖీలు.. విస్తుపోయే నిజాలు వెలుగులోకి
సాక్షి,హైదరాబాద్: హబ్సిగూడ, నాచారంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆదివారం(నవంబర్ 10) ఉదయం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో విస్తుపోయే వాస్తవాలు బయటపడ్డాయి. హబ్సిగూడలోని సీసీఎంబీ క్యాంటీన్కు ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ లేదని అధికారులు గుర్తించారు.కిచెన్లో బొద్దింకలు, ఎలుకలు ఉన్నట్లు గుర్తించామని ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు.ఎక్స్పైర్ అయిన పాడైన ఫుడ్ ఇంగ్రీడియెంట్స్తో వంట చేస్తున్నట్లు గుర్తించారు.దీంతో పాటు అపరిశుభ్రంగా ఉన్న నాచారంలోని మను కిచెన్ రెస్టారెంట్, శ్రీ సుప్రభాత హోటల్ కిచెన్లలోనూ తనిఖీలు చేశారు.కుళ్ళిపోయిన టమాటో, పొటాటోలను వంటకాల్లో ఉపయోగిస్తున్నారని తేలింది.వీటికి తోడు కాలం చెల్లిన పన్నీర్, మష్రూమ్లతో వంటల చేస్తున్నట్లు గుర్తించారు.ఇదీ చదవండి: HYD: హోటల్లో భారీ పేలుడు.. పక్కనున్న బస్తీలో ఎగిరిపడ్డ రాళ్లు -
కేరళ నాయర్లూ...రాజస్తాన్ గుజ్జర్లూ చుట్టాలే!
దక్షిణాది రాష్ట్రమైన కేరళలోని నాయర్లు... వాయవ్య దిశలో ఉన్న రాజస్తాన్, దాని పొరు గునే ఉన్న పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాలకు చెందిన గుజ్జర్లు చుట్టాలేనట! ఈ విషయాన్ని హైదరాబాద్లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) తాజా అధ్యయనంలో వెల్లడించింది. నాయర్లతోపాటు కేరళకే చెందిన థియ్యాలు, ఎళవ తెగల ప్రజలు కూడా ఒకప్పుడు దేశ వాయవ్య ప్రాంతానికి చెందిన వారని జన్యుక్రమాల ఆధారంగా నిర్ధారించింది. – సాక్షి, హైదరాబాద్ వలసలపై భిన్న వాదనలు... భారతదేశ నైరుతి ప్రాంతం.. అంటే కేరళ, కర్ణాటక, తమిళనాడు దక్షిణ భాగాలు జీవవైవిధ్యానికే కాదు.. జన్యువైవిధ్యానికి కూడా పెట్టింది పేరు. వేల సంవత్సరాలుగా ఎక్కడెక్కడి నుంచో ప్రజలు ఇక్కడకు వలస వచ్చి స్థిరపడ్డారని చరిత్రకారులు చెబుతుంటారు. యూదు లు, పార్సీలు, రోమన్ కేథలిక్కులు కొన్ని ఉదాహరణలు మాత్రమే. అయితే ఈ ప్రాంతంలోనే ఉన్నప్పటికీ నాయర్లు, థియ్యాలు, ఎళవ తెగల వారు ఎక్కడి నుంచి వలస వచ్చారన్న విషయంపై భిన్నాభిప్రాయాలు ఉండేవి. చరిత్రకారుల అంచనాల ప్రకారం వారంతా గంగా తీరంలోని అహిఛాత్ర (ఇనుప రాతి యుగం) ప్రాంతం నుంచి వలస వచ్చిన వారని చారిత్రక, లిఖిత దస్తావేజుల సాయంతో వాదిస్తున్నారు. మరోవైపు ఈ వాదనతో మరికొందరు విభేదించేవారు. వారంతా ఇండో–సిథియన్ వర్గం వారని, దేశ వాయవ్య ప్రాంతం నుంచి వలస వచ్చారని పేర్కొనేవారు. డీఎన్ఏ సేకరణతో... ఈ నేపథ్యంలో నాయర్లు సహా ఇతరుల వలస ఎలా సాగింది? వారు ఏ ప్రాంతానికి చెందిన వారై ఉండవచ్చో నిర్ధారించేందుకు సీసీఎంబీ సీనియర్ శాస్త్రవేత్త కుమారస్వామి తంగరాజ్ నేతృత్వంలోని బృందం ప్రయత్నించింది. నాయర్లు, థియ్యాలు, ఎళవ తెగల వంటి భూస్వామ్య, యుద్ధవీరుల తెగలకు చెందిన 213 మంది జన్యుక్రమాలను సేకరించింది. అటు తల్లివైపు నుంచి మాత్రమే అందే మైటోకాండ్రియల్ డీఎన్ఏ గుర్తులు, ఇటు జన్యుక్రమం మొత్తమ్మీద ఉండే ఆటోసోమల్ గుర్తులను (మన మునుపటి తరాల గురించి తెలిపేవి. సెక్స్ క్రోమోజోములు మినహా మిగిలిన 22 క్రోమోజోముల్లో ఈ మార్పులు ఉంటాయి. వారసత్వంతోపాటు జన్యుపరమైన సంబంధాలు, నిర్దిష్ట వ్యాధులు సోకేందుకు ఉన్న అవకాశాల గురించి ఈ మార్పులు సూచిస్తాయి) విశ్లేషించింది. వాటిని యూరేసియా ప్రాంతంలోని పురాతన, ప్రస్తుత తెగల జన్యుక్రమాలతో తంగరాజ్ బృందం పోల్చిచూసింది. కేరళలోని నాయర్లు, థియ్యాలు, ఎళవలతోపాటు కర్ణాటకలోని బంట్స్ (ఐశ్వర్యరాయ్ బంట్ తెగకు చెందిన మహిళే), హొయసళ సామాజిక వర్గ ప్రజలు కూడా జన్యుపరంగా దేశ వాయవ్య ప్రాంత ప్రజలతో దగ్గరి సంబంధాలు కలిగి ఉన్నారని ఈ పరిశోధన ద్వారా స్పష్టమైంది. ఈ పరిశోధన వివరాలు జినోమ్ బయాలజీ అండ్ ఎవల్యూషన్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. వారి మధ్య ఎక్కువ జన్యుసంబంధాలు.. నాయర్లు, థియ్యా, ఎళవ తెగల ప్రజలకు దేశ వాయవ్య ప్రాంతంలోని కాంభోజ్, గుజ్జర్ తెగల ప్రజలకు మధ్య జన్యుసంబంధాలు ఎక్కువగా ఉన్నట్లు ఈ పరిశోధన స్పష్టం చేసింది. అంతేకాకుండా వారిలో ఇరాన్ ప్రాంత జన్యు వారసత్వం కూడా ఇతరుల కంటే ఎక్కువగా ఉంది. తల్లివైపు నుంచి అందిన జన్యు సమా చారాన్ని విశ్లేషిస్తే పశ్చిమ యూరేసియా ప్రాంత వారసత్వం కనిపిస్తోంది. దీన్నిబట్టి మహిళల నేతృత్వంలో జరిగిన వలసలో వారు భాగమై ఉంటారని చెప్పవచ్చు. – డాక్టర్ కుమారస్వామి తంగరాజ్, శాస్త్రవేత్త గోదావరి తీరం మీదుగా... భారతదేశ దక్షిణ, పశ్చిమ తీర ప్రాంతంలోని వాయవ్య ప్రాంతం నుంచి గోదావరి తీరం ద్వారా కర్ణాటకకు ఆ తరువాత అక్కడి నుంచి మరింత దక్షిణంగా కేరళకు నాయర్లు, ఇతర వర్గాల ప్రజలు వలస వచ్చినట్లు ఈ పరిశోధన ద్వారా తేలింది. – సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ వినయ్ నందికూరి -
కేరళ నాయర్లూ... రాజస్థాన్ గుజ్జర్లూ చుట్టాలే!
కేరళలో ఉన్న నాయర్లకు.. రాజస్థాన్, పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లోని గుజ్జర్లకు మధ్య సంబంధం ఏమిటి? మీకు తెలుసా? ఈ రోజు ఇరువురికీ మధ్య అస్సలు సంబంధం లేకపోవచ్చునేమో కానీ.. ఒకప్పుడు మాత్రం ఇద్దరు దగ్గరి చుట్టాల్లాంటి వారు అంటోంది సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ). ఒక్క నాయర్లు మాత్రమే కాదు.. కేరళలోనే ఉండే థియ్యాలు, ఎళవ తెగల ప్రజలు కూడా ఒకప్పుడు దేశ వాయువ్య ప్రాంతానికి చెందిన వారని వీరు జన్యుక్రమాల ఆధారంగా నిర్ధారించారు. కొంచెం వివరంగా చూస్తే.. భారత దేశ నైరుతి ప్రాంతం అంటే కేరళ, కర్ణాటక, తమిళనాడు దక్షిణ భాగాలు జీవ వైవిధ్యానికే కాదు.. జన్యువైవిధ్యానికి కూడా పెట్టింది పేరు. వేల సంవత్సరాలుగా ఎక్కడెక్కడి నుంచో ప్రజలు ఇక్కడకు వలస వచ్చి స్థిరపడ్డారని చెబుతారు. యూదులు, పార్సీలు, రోమన్ కేథలిక్కులు కొన్ని ఉదాహరణలు మాత్రమే. అయితే ఈ ప్రాంతంలోనే ఉన్నప్పటికీ నాయర్లు, థియ్యాలు, ఎళవ తెగల వారు ఎక్కడి నుంచి వలస వచ్చారన్న విషయంపై భిన్నాభిప్రాయాలు ఉండేవి. చరిత్రకారుల అంచనాల ప్రకారం వీరందరూ గంగా తీరంలోని అహిఛాత్ర (ఇనుప రాతి యుగం) ప్రాంతం నుంచి వలస వచ్చిన వారని చారిత్రక, లిఖిత దస్తావేజుల సాయంతో వాదిస్తున్నారు. మరోవైపు ఇతరులు మాత్రం వీరందరూ ఇండో సిథియన్ వర్గం వారని, దేశ వాయువ్య ప్రాంతం నుంచి వలస వచ్చారని అంటున్నారు. ఈ నేపథ్యంలో జన్యుపరంగా వీరి వలస ఎలా సాగింది? వీరు ఏ ప్రాంతానికి చెందిన వారై ఉండవచ్చో నిర్ధారించేందుకు సీసీఎండీ సీనియర్ శాస్త్రవేత్త కుమారస్వామి తంగరాజ్ నేతృత్వంలోని బృందం ప్రయత్నించింది. నాయర్లు, థియ్యాలు, ఎళవ వంటి భూస్వామ్య, యుద్ధ వీరుల తెగలకు చెందిన 213 మంది జన్యుక్రమాలను సేకరించి అటు తల్లివైపు నుంచి మాత్రమే అందే మైటోకాండ్రియల్ డీఎన్ఏ గుర్తులు, ఇటు జన్యుక్రమం మొత్తమ్మీద ఉండే ఆటోసోమల్ గుర్తులు (మన మునుపటి తరాల గురించి తెలిపేవి. సెక్స్ క్రోమోజోములు మినహా మిగిలిన 22 క్రోమోజోముల్లో ఈ మార్పులు ఉంటాయి. వారసత్వంతోపాటు జన్యుపరమైన సంబంధాలు, నిర్దిష్ట వ్యాధులు సోకేందుకు అన్న అవకాశాల గురించి ఈ మార్పులు సూచిస్తాయి) గుర్తించారు. వీటిని యూరేసియా ప్రాంతంలోని పురాతన, ప్రస్తుత తెగల జన్యుక్రమాలతో పోల్చి చూశారు. కేరళలోని నాయర్లు, థియ్యాలు, ఎళవలతోపాటు కర్ణాటకలోని బంట్స్ (ఐశ్వర్యరాయ్ బంట్ తెగకు చెందిన మహిళే), హొయసళ సామాజిక వర్గ ప్రజలు కూడా జన్యుపరంగా దేశ వాయువ్య ప్రాంత ప్రజలతో దగ్గరి సంబంధాలు కలిగి ఉన్నారని ఈ పరిశోధన ద్వారా స్పష్టమైంది. ‘‘నాయర్లు, థియ్యా, ఎళవ తెగల ప్రజలకు దేశ వాయ్యు ప్రాంతంలోని కాంభోజ్, గుజ్జర్ తెగల ప్రజలకు మధ్య జన్యుసంబంధాలు ఎక్కువగా ఉన్నట్లు ఈ పరిశోధన స్పష్టం చేసింది. అంతేకాకుండా వీరిలో ఇరాన్ ప్రాంత జన్యు వారసత్వం కూడా ఇతరుల కంటే ఎక్కువగా ఉంది’’ అని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త డాక్టర్ కుమారస్వామి తంగరాజ్ తెలిపారు. అంతేకాకుండా... తల్లివైపు నుంచి అందిన జన్యు సమారాన్ని విశ్లేషిస్తే పశ్చి యురేసియా ప్రాంత వారసత్వం కనిపిస్తోందని దీన్నిబట్టి మహిళల నేతృత్వంలో జరిగిన వలసలో వీరు భాగమై ఉంటారని చెప్పవచ్చునని ఆయన వివరించారు. ‘జినోమ్ బయాలజీ అండ్ ఎవల్యూషన్’ జర్నల్లో ప్రచురితమైన ఈ పరిశోధనపై సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ వినయ్ నందికూరి మాట్లాడుతూ భారతదేశ దక్షిణ, పశ్చిమ తీర ప్రాంతంలోని వాయువ్య ప్రాంతం నుంచి గోదావరి తీరం ద్వారా కర్ణాటకకు ఆ తరువాత అక్కడి నుంచి మరింత దక్షిణంగా కేరళకు వలస వచ్చినట్లు ఈ పరిశోధన ద్వారా తెలుస్తుందని అన్నారు. -
సీసీఎంబీ మొబైల్ ఎగ్జిబిషన్ ప్రారంభం
-
మనుషుల్లో ఇన్ని వ్యాధులెందుకు.. వానర రహస్యం రట్టయ్యిందా?
మన జన్యువుల్లో ఒక చిన్న మార్పు ఉన్నా ఏదో ఒక రకమైన వ్యాధికి గురికావడం ఖాయం. కానీ మనిషికి అతిదగ్గరి చుట్టంగా చెప్పుకొనే వానరాల్లో మాత్రం ఇలా ఉండదు. జన్యుపరమైన మార్పులు ఎన్ని ఉన్నా వాటికి మనలా వ్యాధులు అంటవు. ఎందుకిలా? ఈ విషయాన్ని తెలుసుకొనేందుకే హైదరాబాద్లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) సహా అంతర్జాతీయ శాస్త్రవేత్తలు ఓ భారీ అధ్యయనాన్ని చేపట్టి పూర్తి చేశారు. ఇందులో భాగంగా సుమారు 233 వానర జాతులకు చెందిన 809 జన్యుక్రమాలను మానవ జన్యుక్రమాలతో పోల్చి చూశారు. భారత్లోని 19 వానర జాతులకు సంబంధించిన 83 నమూనాల జన్యుక్రమ నమోదు, విశ్లేషణ బాధ్యతలను సీసీఎంబీ చేపట్టింది. అంతరించిపోతున్న వానర జాతుల సంరక్షణకు, జన్యుపరమైన వ్యాధులను మరింత లోతుగా అర్థం చేసుకునేందుకు ఈ అధ్యయనం ఉపయోగపడుతుందని అంచనా.. సాక్షి, హైదరాబాద్: మానవ, వానర జన్యుక్రమాలను పోల్చి చూసినప్పుడు రెండింటిలోనూ సుమారు 43 లక్షల మిస్సెన్స్ జన్యుమార్పులు ఉన్నట్లు స్పష్టమైంది. ఈ ప్రత్యేకమైన జన్యు మార్పులు శరీరానికి అవసరమైన అమైనోయాసిడ్ల రూపు రేఖలను మార్చేస్తాయి. ఫలితంగా ఈ అమైనో యాసిడ్లతో తయా రయ్యే ప్రొటీన్లు కూడా సక్రమంగా పనిచేయకుండా మనం వ్యాధుల బారిన పడుతూంటాం. అయితే ప్రస్తుతం ఏ మార్పుల కారణంగా మనకు వ్యాధులు వస్తున్నాయన్నది గుర్తించడంలో చాలా పరిమితులున్నాయి. జన్యు మార్పులు వందలు, వేల సంఖ్యలో ఉండటం దీనికి కారణం. మధుమేహం, గుండె జబ్బుల్లాంటి ప్రాణాంతక ఆరోగ్య సమస్యలకూ జన్యుపరమైన మూలకారణం ఇప్పటివరకూ తెలియకపోవడానికి కూడా జన్యుమార్పులకు సంబంధించిన సమా చారం లేకపోవడమూ ఒక కారణం. ఈ నేపథ్యంలోనే శాస్త్రవేత్తలు... వాన రులు, మనుషుల జన్యుక్రమాలను సరి పోల్చే పరిశోధన చేపట్టారు. కొన్ని వ్యాధులు ఒకటి కంటే ఎక్కువ జన్యు వుల్లో వచ్చిన మార్పుల వల్ల పుడతాయని... మొదట్లో వాటి ప్రభావం తక్కువగానే ఉన్నా క్రమక్రమంగా ఈ జన్యు మార్పులన్నీ కలసికట్టుగా పనిచేయడం మొదలు పెట్టి మధుమేహం, కేన్సర్ వంటి వ్యాధులుగా పరిణమిస్తాయని అంచనా. కొన్నింటిని గుర్తించాం.. మానవులు, వానరాలను వేరు చేసే 43 లక్షల ప్రత్యేకమైన జన్యుమార్పులు (మిస్సెన్స్ మ్యుటేషన్స్)లలో ఆరు శాతం వాటిని ఇప్పటికే గుర్తించామని, ఇవి మనుషుల కంటే వానరాల్లోనే చాలా ఎక్కువగా ఉన్నాయని కృత్రిమ మేధ కంపెనీ ఇల్యూమినా ఉపాధ్యక్షుడు కైల్ ఫార్ తెలిపారు. ఈ ఆరు శాతం జన్యుమార్పులు మానవ వ్యాధులు వానరాలకు అంటకుండా కాపాడుతున్నట్లు భావిస్తున్నామని ఆయన చెప్పారు. వ్యాధికారక జన్యుమార్పులను గుర్తించేందుకు తాము ప్రైమేట్ ఏఐ–3డీ అనే డీప్ లెర్నింగ్ అల్గారిథమ్ను ఉపయోగించామని చెప్పారు. ఈ అల్గారిథమ్ జన్యుశాస్త్రానికి సంబంధించిన చాట్జీపీటీ అనుకోవచ్చు. చాట్జీపీటీ మనుషుల భాషను అర్థం చేసుకుంటే ప్రైమేట్ ఏఐ–3డీ జన్యుక్రమాన్ని అర్థం చేసుకోగలదు. అంతే తేడా! విస్తృత స్థాయిలో వానర జన్యుక్రమం నమోదు.. ఈ అధ్యయనంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేకానేక వానర జాతుల జన్యుక్రమాలను నమోదు చేశారు. ‘‘ఐదు గ్రాముల బరువుండే చిన్న కోతి మొదలుకొని చింపాంజీల వరకూ.. భారత్లోని ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రమే కనిపించే వెస్టర్న్ హూలాక్ గిబ్బన్, పశ్చిమ కనుమల్లో నివసించే లయన్ టెయిల్డ్ మకాక్ వరకు అనేక వానర రకాల జన్యుక్రమాలను ఇందులో నమోదు చేశారు. ఈ స్థాయిలో వానర జన్యుక్రమ నమోదు జరగడం ఇదే మొదటిసారి’’అని సీసీఎంబీ శాస్త్రవేత్త డాక్టర్ గోవింద స్వామి ఉమాపతి ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. భూమ్మీద ఉన్న మొత్తం వానర జాతుల్లో దాదాపు సగం జాతుల జన్యుక్రమం ఇప్పుడు అందుబాటులో ఉందని అంచనా. ఈ విస్తృతస్థాయి జన్యుక్రమం ఫలితంగా వానరాల జన్యుక్రమాలను పోల్చి చూడటం సాధ్యమైందని, తద్వారా పరిణామ క్రమంలో వాటిలో వచ్చిన మార్పులను కూడా పరిశీలించే అవకాశం దక్కిందని డాక్టర్ ఉమాపతి తెలిపారు. అంతేకాకుండా వానరాలను మనుషులను వేరు చేసే అంశాలేమిటన్నది కూడా మరింత స్పష్టమవుతుందన్నారు. జన్యుక్రమాలు అందుబాటులోకి రావడం పరిణామ క్రమాన్ని అర్థం చేసుకోవడానికి మాత్రమే కాకుండా.. మనకు వచ్చే వ్యాధుల వివరాలు తెలుసుకోవడానికి, వానరాల సంరక్షణకూ ఉపయోగపడుతుందని వివరించారు. ‘‘వానర జన్యుక్రమ నమోదు.. వాటిని సంరక్షించాల్సిన అవసరాన్ని మరింత గట్టిగా చెబుతున్నాయి’’అని సీసీఎంబీ డైరెక్టర్ వ్యాఖ్యానించారు. ఈ అధ్యయనం ఫలితం ఇంకొకటి కూడా ఉంది. మనిషికి మాత్రమే ప్రత్యేకమనుకున్న జన్యుపరమైన అంశాలు దాదాపు సగం తగ్గాయి! అంటే మనిషికి.. వానరానికి మధ్య ఉన్న అంతరం మరింత తగ్గిందన్నమాట!. ఇది కూడా చదవండి: కిలో రూ.100 దాటిన టమాట ధరలు.. -
కొత్త వేరియంట్ ప్రభావం భారత్పై తక్కువే
సాక్షి, హైదరాబాద్: చైనాను వణికిస్తున్న కరోనా వైరస్ భారత్లో అంతగా ప్రభావం చూపే అవకాశం లేదని సీసీఎంబీ డైరెక్టర్ వినయ్ నందికూరి స్పష్టం చేశారు. భారతీయులకు ఇప్పటికే మూక రోగనిరోధకత వచ్చి ఉండటం ఇందుకు కారణం అని అయన ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. అయితే ఈ వైరస్ రోగ నిరోధక వ్యవస్థను తప్పించుకునే అవకాశం ఉందని, తగిన జాగ్రత్తలు కొనసాగించడం అవసరమన్నారు. గతంలో ఒమిక్రాన్ బారినపడిన వారిలో కొందరికి బీఎఫ్–7 సోకే అవకాశం ఉంటుందన్నారు. డెల్టా వైరస్ను ఎదుర్కొన్నాక దేశంలో వాక్సినేషన్ జరిగిందని, ఆ తరువాత ఒమిక్రాన్ వచ్చినప్పుడు బూస్టర్ డోసులు వేసుకున్న కారణంగా భారతీయులు మెరుగైన రోగ నిరోధక శక్తితో ఉన్నారని అయన వివరించారు. అందుకే చైనా లాంటి పరిస్థితులకు ఇక్కడ అవకాశం ఉండదన్నారు. -
కోవిడ్ ఇక అంటువ్యాధి స్థాయిలోనే..
ప్రపంచాన్ని వణికించిన కోవిడ్ మహమ్మారి కథ ముగిసినట్టేనా? వేల సంఖ్యలో రోజువారీ కేసులు, ఆక్సిజన్ కొరతలు, ఆసుపత్రి చేరికలు ఇక గతకాలపు మాటేనా? కావచ్చు.. కాకపోనూవచ్చని అంటున్నారు సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) డైరెక్టర్ వినయ్ నందికూరి. మారుతున్న వాతావరణ పరిస్థితులు.. నగరీకరణ, జంతు ఆవాసాల విస్తృతి తగ్గిపోతుండటం వంటి వాటి వల్ల భవిష్యత్తులోనూ జంతువుల నుంచి మనుషులకు వ్యాధులు సోకుతూనే ఉంటాయని ఆయన తెలిపారు. దేశంలో కోవిడ్ నియంత్రణలో కీలకపాత్ర పోషించిన వినయ్.. ‘సాక్షి’తో కోవిడ్ తదనంతర పరిస్థితులపై తన ఆలోచనలను పంచుకున్నారు! ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కథ ఇక ముగిసినట్టేనా? జవాబు: వైరస్ వ్యాధుల విషయంలో ముగింపు ఉండదు. దశాబ్దాలుగా వచ్చిపోతున్న ఫ్లూ మాదిరిగానే కోవిడ్ కూడా అప్పుడప్పుడూ మనల్ని పలకరిస్తుంటుంది. సాధారణంగా ఇలాంటి వైరస్లు కాలక్రమంలో నెమ్మదిస్తాయి. కొన్ని ప్రాంతాలకే పరిమితమైతే ఎండమిక్ అని, తరచూ కొన్నిచోట్ల వస్తుంటే ఎపిడమిక్ అని పిలుస్తారు. కోవిడ్ ఇకపై ఎపిడమిక్ స్థాయిలో కొనసాగుతుందని అంచనా. కోవిడ్ వైరస్ జన్యుక్రమం గురించి తెలుసుకొని మనం ఏం నేర్చుకోగలిగాము? ►జన్యుక్రమాల ద్వారా నిత్యం ఒక మహమ్మారి వైరస్ను పరిశీలించడం కోవిడ్తోనే మొదలైంది. వేల జన్యుక్రమాలను నమోదు చేయడం వల్ల వైరస్లో వచ్చే అతిసూక్ష్మ మార్పులనూ గుర్తించేందుకు వీలు ఏర్పడింది. ప్రొటీన్ కొమ్ములోని ఏ భాగంలో మార్పులొస్తే ఏ రకమైన లక్షణాలు రాగలవో అంచనా వేయవచ్చు. పరిణామ క్రమాన్ని అర్థం చేసుకోవడమూ సాధ్యమైంది. భవిష్యత్తును అంచనా వేయడమూ వీలవుతోంది. భారతీయ పరిశోధనల్లో వచ్చిన మార్పులేంటి? ►కోవిడ్ వంటి అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ ఎత్తున నిధులు వెచ్చించడంతో మునుపెన్నడూ భారతీయ శాస్త్రవేత్తలు చేయని పనులను చేపట్టారు. జన్యుక్రమాల నమోదు, అత్యవసరంగా టీకా తయారీ వంటివన్నీ ఈ కోవకు చెందుతాయి. అమెరికా లాంటి దేశాలతో పోలిస్తే భారత్లో ఇప్పటికీ పదో వంతు మంది శాస్త్రవేత్తలు కూడా లేరు. పాశ్చాత్య దేశాల్లో నిర్దిష్ట సమస్య పరిష్కారం లక్ష్యంగా వందల మంది శాస్త్రవేత్తలు పనిచేస్తుంటారు. భారత్లో అలాంటి పరిస్థితి లేదు. కోవిడ్ తదనంతర పరిస్థితుల్లో శాస్త్రవేత్తలు, పరిశోధన సంస్థల మధ్య సహకారం మరింత పెరిగింది. సీసీఎంబీ మాతృసంస్థ సీఎస్ఐఆర్కు ఉన్న 35కుపైగా ల్యాబ్స్ మధ్య పరిశోధనల్లో పరస్పర సహకారం ఉందా? ►సీఎస్ఐఆర్ ల్యాబ్స్ అన్నీ ఒక అంశంపై సహకరించుకోవడం అన్నది ఆచరణసాధ్యమైన విషయం కాదు. కానీ కోవిడ్ సమయంలో ఆక్సిజన్ ఉత్పత్తి మొదలుకొని వైరస్ను చంపేందుకు ఉన్న మార్గాల వరకూ అనేక అంశాల్లో సీఎస్ఐఆర్లోని పలు సంస్థలు కలిసికట్టుగా పనిచేశాయి. మంచి ఫలితాలు సాధించాయి కూడా. డిపార్ట్మెంట్ ఆఫ్ బయో టెక్నాలజీకి సంబంధించిన ప్రాజెక్టుల్లోనూ పలు సంస్థలు కలిసి పనిచేస్తున్నాయి. జంతువుల నుంచి మనుషులకు సోకే వ్యాధులు ఎక్కువవుతున్నాయి. వాటిని ఎదుర్కోవడం ఎలా? ►ఇటీవలి కాలంలో మనుషులకు, జంతు ఆవాసాలకు మధ్య దూరం బాగా తగ్గిపోవడంతో జంతువుల్లోని వ్యాధులు మనుషులకు సోకుతున్నాయి. అలాగే వాతావరణ పరిస్థితుల్లో వచ్చిన మార్పులు కూడా వ్యాధులు ఎక్కువయ్యేందుకు కారణమవుతోంది. వాటిని ఎదుర్కోవడం ఎలా? అన్న ప్రశ్నకు ‘వన్ హెల్త్’ కార్యక్రమం సమాధానం చెబుతోంది. మానవ ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా... వాతావరణ పరిస్థితులు, జంతువుల ఆరోగ్యంపై నిత్యం నిఘా పెట్టడం క్లుప్తంగా వన్ హెల్త్ లక్ష్యం. దేశంలో క్షయను పూర్తిగా నివారించాలన్న లక్ష్యాన్ని అందుకోవడంలో ఎదురవుతున్న ఇబ్బందులేమిటి? ►క్షయవ్యాధిని మటుమాయం చేసేందుకు టీకా కచ్చితంగా కావాలి. దీనికోసం చాలా ప్రయత్నాలు జరిగాయి కానీ పూర్తిస్థాయిలో విజయం సాధించలేదు. దేశంలో క్షయ వ్యాధి నివారణకు ప్రస్తుతం 6–9 నెలల కార్యక్రమం నడుస్తోంది. వ్యాధి నయమవ్వాలంటే మందులను క్రమం తప్పకుండా వాడటం, పోషకాహారం తీసుకోవడం వంటివి కచ్చితంగా చేయాల్సి ఉంటుంది. అయితే రకరకాల కారణాల వల్ల ఇవి అమలు కావడం లేదు. అందుకే వ్యాధి నివారణ కష్టతరమవుతోంది. -
సైన్స్ను జనం దరి చేర్చినవాడు
వైజ్ఞానిక స్ఫూర్తి సామాన్యులకు అందించడం కోసం, దేశంలో గొప్ప గొప్ప శాస్త్రీయ సంస్థల స్థాపనకు, అభివృద్ధికి కృషి చేసినవారు డాక్టర్ పుష్పా భార్గవ! ప్రజలను చైతన్య పరచడంలో ప్రముఖ పాత్ర నిర్వహించిన సేవాతత్పరుడు. జన విజ్ఞాన వేదికకు ఆలంబనగా నిలిచిన గొప్ప సైన్సు కార్యకర్త. సైన్స్ ప్రచార కార్యక్రమాల్లో ఆ సంస్థను మున్ముందుకు నడిపిస్తూ– చేప మందు శాస్త్రీయతను ప్రశ్నించారు. న్యాయస్థానం వరకు వెళ్ళి, అది మందు కాదని నిరూపించారు. విశ్వ విద్యాలయాల్లో ప్రభుత్వం జ్యోతిషాన్ని ప్రవేశపెట్టడాన్ని నిరసించారు. అలాగే, వాస్తు ప్రామాణికతను ప్రశ్నించారు. సమగ్రమైన చర్చ లేకుండా జీవ సాంకేతిక మార్పులతో కూరగాయలను మార్కెట్లోకి విడుదల చేయడాన్ని వ్యతిరేకించారు. డాక్టర్ పుష్పా మిత్ర భార్గవ (22 ఫిబ్రవరి 1928–1 ఆగస్టు 2017) రాజస్థాన్లోని అజ్మీర్ (అజయ్ మేరు)లో జన్మించారు. 1946లో ఆర్గానిక్ కెమిస్ట్రీ (సేంద్రియ రసాయన శాస్త్రం)లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. వెనువెంటనే 21 సంవత్సరాల చిరుప్రాయంలో లక్నో యూనివర్సిటీ నుండి పీహెచ్డీ స్వీకరించారు. కొంతకాలం లక్నో యూని వర్సిటీలోనే లెక్చరర్గా పనిచేసి, తర్వాత కాలంలో హైదరాబాద్ చేరుకున్నారు. ఇక్కడి ఉస్మానియా యూనివర్సిటీలో లెక్చరర్గా చేరి స్థిరపడ్డారు. అమెరికా, ఫ్రాన్స్, యూకేల్లో ప్రసిద్ధ సంస్థల్లో పరిశోధనల్లో పాల్గొన్నారు. యూకే నుంచి వచ్చి హైదరాబాద్లోని ప్రాంతీయ పరిశోధనా ప్రయోగశాల (రీజినల్ రీసెర్చ్ లాబొరేటరీ (ఆర్ఆర్ఎల్)లో సైంటిస్ట్గా చేరారు. తర్వాత కాలంలో ఆ ప్రయోగశాల భారత రసాయన సాంకేతిక సంస్థ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ – ఐఐసీటీ)గా రూపాంతరం చెందింది. (చదవండి: నిజం... నిజం... డార్వినిజం) డాక్టర్ పీఎం భార్గవకు దేశ ప్రధానులందరితో దగ్గరి పరిచయాలుండేవి. అందువల్ల ఆయన హైదరాబాదులో ‘సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలి క్యులర్ బయాలజీ’ (సీసీఎంబీ)ని స్థాపించగలిగారు. 1977–1990 మధ్య కాలంలో దానికి వ్యవ స్థాపక సంచాలకుడిగా ఉండి, ప్రపంచ ఖ్యాతిని తెచ్చారు. మాలిక్యులర్ సెగ్మెంట్స్ తయారీ కోసం ఒక అణుశక్తి ప్రయోగశాలను నెలకొల్పారు. భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక బయోటెక్నాలజీ విభాగం నెలకొల్పడంలో కీలకపాత్ర పోషించారు. డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ టెక్నాలజీని హైదరాబాద్లో ఆవిష్కరించి, నేర పరిశోధనలో విప్లవాత్మకమైన మార్పుకు కారణం అయ్యారు. ఒక సైంటిస్ట్గా, ఒక డైరెక్టర్గా వివిధ స్థాయులలో పనిచేస్తూ, దేశ విదేశాలలోని పరిశోధనా శాలల సమన్వ యంతో ఒకానొక సమయంలో దేశ వైజ్ఞానిక పరి శోధనా రంగానికి వెన్నెముకగా నిలిచిన భార్గవ కృషి చాలా విలువైంది. (Ravipudi Venkatadri: వంద వసంతాల హేతువాది) డాక్టర్ భార్గవకు లభించిన దేశ విదేశాల అవార్డులు, గుర్తింపులూ ఎన్నో ఉన్నాయి. ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇచ్చే లీజియన్ డి ఆనర్ (1998) పొందిన ఘనత వీరిదే. ఈ మధ్య కాలంలో దేశంలో వ్యాపించిన మత ఛాందసత్వ అసహనం పట్ల – దభోల్కర్, పన్సారే, కల్బుర్గీల హత్యల పట్ల కలత చెందిన భార్గవ, తన పద్మభూషణ్ పురస్కారాన్ని 2015లో భారత ప్రభుత్వానికి వాపస్ చేశారు. ఉత్తర భారతదేశం నుండి వచ్చి, హైదరాబాద్ను తన స్వస్థలంగా మార్చుకుని, ప్రపంచ వైజ్ఞానిక పరిశోధనా రంగంలో దీన్ని ఒక ముఖ్య కేంద్రంగా మార్చినవారు. సత్యాన్ని ప్రేమించి, దాని కోసం అన్ని విధాలా పోరాడే స్ఫూర్తిని మనమంతా ఆయన జీవితం నుండి పొందుతూనే ఉండాలి! - డాక్టర్ దేవరాజు మహారాజు వ్యాసకర్త సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త (ఫిబ్రవరి 22న పుష్పా భార్గవ జయంతి) -
ఒమిక్రాన్ బలం మన బలహీనతే!
సాక్షి, అమరావతి: ‘డెంగ్యూ, మలేరియా, ఇన్ఫ్లూయాంజాతో నేటికీ మరణాలు సంభవిస్తున్నాయి. రోగ నిరోధకత బలహీనంగా ఉన్న వారిపై వీటి ప్రభావం ఉంటోంది. ఇదే తరహాలో కరోనా వైరస్ కొత్త వేరియంట్ల రూపంలో బలహీన రోగ నిరోధకత ఉన్న వారిపై తీవ్ర ప్రభావం చూపుతోంది’ అని సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) డైరెక్టర్ డాక్టర్ వినయ్ నందికూరి తెలిపారు. కరోనా మూడో దశ వ్యాప్తి, ఒమిక్రాన్ ప్రభావంపై పలు అంశాలను ఆయన ‘సాక్షి’ ప్రతినిధికి వివరించారు. సీసీఎంబీలో ఏపీ నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ చేస్తున్నారు. డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ తీవ్రత ఎలా ఉంది? డెల్టాతో పోలిస్తే ప్రస్తుతం వ్యాపిస్తున్న ఒమిక్రాన్ వైరస్ బలహీనంగా ఉంది. డెల్టా వైరస్ శరీరంలోకి వేగంగా ప్రవేశించడంతో పాటు స్పైక్ ప్రోటీన్తో కణాలపై దాడి చేస్తుంది. రిప్లికేషన్ (ఉత్పాదక సామర్థ్యం) బాగా ఉంటుంది. ప్రస్తుతం ఒమిక్రాన్ వేగంగా వ్యాíపిస్తున్నా డెల్టా అంత తీవ్రతతో దాడి చేయడం లేదు. రిప్లికేషన్ తగ్గింది. వైరస్ ఎండమిక్ దశకు చేరుకున్నట్లేనా? డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ వేరియంట్లో వైరస్ క్షీణించింది. దీన్ని ఆధారంగా చేసుకుని వైరస్ ఎండమిక్ దశకు చేరిందని భావించలేం. భవిష్యత్లో బలమైన లక్షణాలతో వైరస్ రూపాంతరం చెందవచ్చేమో చెప్పలేం. ఇన్ఫ్లూయాంజా దేశంలోకి వచ్చినప్పుడు ఎన్ని రోజులు ఉందో తెలిసిందే. కేసుల నమోదు ఎప్పటిలోగా తారస్థాయికి చేరవచ్చు? మన దేశంలో ప్రస్తుతం పాండమిక్ దశలో ఉన్నాం. ఈ దశలో సాధారణంగా ప్రతి మూడు రోజులకు కేసుల నమోదు రెట్టింపు అవుతూ వస్తుంది. ఈ నెలాఖరు, ఫిబ్రవరి మొదటి వారంలో కేసుల నమోదు తారస్థాయికి చేరుతుంది. పాజిటివిటీ రేటు పెరిగే కొద్దీ ఆసుపత్రులపై ఒత్తిడి పెరుగుతుంది. ప్రస్తుతం అమెరికాలో ఇదే జరుగుతోంది. బలహీన రోగనిరోధకత ఉన్న వారిపై ఒమిక్రాన్ వైరస్ తీవ్ర ప్రభావం చూపుతోంది. ఒమిక్రాన్ + డెల్టా కేసులు నమోదయ్యాయా? ఇప్పటివరకూ మేం పరీక్షించిన నమూనాల్లో ఒమిక్రాన్ + డెల్టా కేసులు నమోదవలేదు. కేవలం ఒమిక్రాన్ కేసులు మాత్రమే ఉంటున్నాయి. టీకాల నుంచి రక్షణ ఉంటోందా? గతంలో వైరస్ సోకడం, టీకాలు తీసుకోవడం వల్ల వచ్చిన రోగనిరోధకతను దాటుకుని ఒమిక్రాన్ వేరియంట్ శరీరంలోకి ప్రవేశిస్తోంది. గతంలో వైరస్తో పరిచయం ఉండటం, టీకాలు తీసుకుని ఉండటం వల్ల టీ సెల్స్ కొంత రక్షణగా ఉంటున్నాయి. బలహీన రోగ నిరోధకత ఉండే వృద్ధులు, రోగులకు చికిత్స అందించే వైద్యులు, వైద్య సిబ్బంది, ఇతరులకు ప్రభుత్వం ప్రికాషన్ డోసు అందిస్తోంది. అర్హులైన వారంతా ప్రికాషన్ డోసు తీసుకోవాలి. ప్రికాషన్ డోసు కింద ఏ వ్యాక్సిన్ వేసుకోవాలి? విదేశాల్లో మొదటి రెండు డోసులు కింద తీసుకున్న టీకా కాకుండా వేరే రకం టీకాను ప్రికాషన్ డోసు కింద ఇస్తున్నారు. ఇలా తీసుకోవడం వల్ల ఇబ్బందులు ఏమీ ఉండవు. మన దేశంలో మాత్రం మొదటి రెండు డోసులు ఏ టీకా తీసుకుంటే ప్రికాషన్ డోసుగా అదే టీకాను పంపిణీ చేస్తున్నారు. కాబట్టి మొదటి రెండు డోసుల కింద ఏ టీకా తీసుకుంటే అదే టీకాను ప్రికాషన్ డోసు కింద పొందాలి. -
రూ. 16 కోట్లుంటేనే పసిదానికి ప్రాణం!
మల్లాపూర్: తమకు పండంటి పాప పుట్టిందని మురిసిపోయిన ఆ తల్లిదండ్రులకు ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు! ఇందుకు కారణం... ఆ చిన్నారిలో కదలికలు క్రమంగా తగ్గిపోవడమే!! ప్రస్తుతం నాలుగు నెలల వయసున్న ఆ బిడ్డ తల, కాళ్లు, చేతులు ఆడించలేని స్థితికి చేరుకోవడమే!! స్పైనల్ మస్కులర్ అట్రోఫీ (ఎస్ఎంఏ) టైప్–1గా పిలిచే అరుదైన జన్యువ్యాధి బారిన ఆ పసిపాప పడటమే!! ఈ వ్యాధి చికిత్సకు రూ. లక్షలు కాదు.. ఏకంగా రూ. కోట్లు కావాలని వైద్యులు చెప్పడంతో రెక్కాడితేకానీ డొక్కాడని ఆ నిరుపేద దంపతులు విలవిల్లాడుతున్నారు. దీనికితోడు కేవలం మరో 3 నెలల్లోనే ఆ సొమ్మును సమకూర్చుకోకుంటే పాప ప్రాణం దక్కదని తెలిసి దాతల సాయం కోసం చూస్తున్నారు. పిడుగులాంటి వార్త... నాచారం బాబానగర్కు చెందిన ఫయాజ్, రేష్మకు 2019లో వివాహం జరిగింది. ఫయాజ్ ఓ మొబైల్ షాప్లో పనిచేస్తుండగా ఆయన భార్య గృహిణి. వారికి 2021 ఆగస్టు 31న కుమార్తె ఫైజా జన్మించింది. తమ బిడ్డ కాళ్లు, చేతులు అడించట్లేదని గుర్తించిన తల్లిదండ్రులు గాంధీ ఆస్పత్రిలో చూపించారు. నెలపాటు చిక్సిత అందించినా చిన్నారి కోలుకోకపోవడంతో ఆమె జన్యు సంబంధ వ్యాధితో బాధపడుతున్నట్లు వైద్యులు అనుమానించి ఆమె రక్త నమూనాలను నిమ్స్కు పంపించారు. నిమ్స్ వైద్యులు శాంపిళ్లను సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ (సీసీఎంబీ)కి పంపగా ఆ చిన్నారి ఎస్ఎంఏ టైప్–1 జన్యు వ్యాధితో బాధపడుతున్నట్లు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఈ వ్యాధిని నయం చేయడానికి విదేశాల నుంచి రూ. 10 కోట్ల ఖరీదైన ఇంజక్షన్తోపాటు దిగుమతి పన్నులు కలిపి రూ.6 కోట్లు కలిపి మొత్తం రూ.16 కోట్ల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు వెల్లడించారు. మంత్రి హరీశ్కు తల్లిదండ్రుల మొర... ఫయాజ్, రేష్మలు మంగళవారం వైద్యశాఖ మంత్రి హరీశ్రావును కలిసి నివేదికలను చూపారు. దీంతో స్పందించిన ఆయన ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి ఇంజక్షన్ కోసం ప్రయత్నిద్దామని హామీ ఇచ్చినట్లు తల్లిదండ్రులు తెలిపారు. దాతలు ఆర్థిక సాయం పంపాల్సిన బ్యాంకు ఖాతా వివరాలు అకౌంట్ పేరు: ఫైజా అకౌంట్ నంబర్: 90928679014210 ఐఎఫ్ఎస్సీ కోడ్: IDFB0020101 యూపీఐ ట్రాన్స్శాక్షన్ కోసం: assist.faiza@icici -
ఏపీలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదు
సాక్షి, విజయనగరం: దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా, ఏపీలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. ఐర్లాండ్ నుంచి ఏపీకి వచ్చిన 34 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్గా నిర్ధారణ అయ్యింది. తొలుత అతనికి ముంబైలోని ఎయిర్పోర్టులో ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించగా అందులో నెగెటివ్ వచ్చింది. ఈ క్రమంలో ఆ వ్యక్తి గత నెల (నవంబరు) 27న విశాఖ చేరుకున్నాడు. అక్కడ కూడా ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయగా నెగెటివ్ వచ్చింది. కాగా, తాజాగా ఆ వ్యక్తికి మరోసారి ఆర్టీపీసీఆర్ పరీక్ష నిర్వహించగా ఒమిక్రాన్ పాజిటీవ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో అధికారులు వ్యక్తి నమునాలను హైదరాబాద్లోని సీసీఎంబీకి పరీక్షల కోసం పంపించారు. ఆ వ్యక్తికి ఒమిక్రాన్ నిర్థారణ అయినట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. మొత్తం 15 మంది నమునాలను హైదరాబాద్లోని సీసీఎంబీకి పంపినట్లు అధికారులు తెలిపారు. కాగా, పది నమూనాలలో ఒకరికి మాత్రమే ఒమిక్రాన్ సోకినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన ఐదుగురి వివరాలు రావాలన్న ఆరోగ్యశాఖ ప్రజలు అనవసర వదంతులు నమ్మవద్దని తెలిపింది. ప్రజలు కోవిడ్ నిబంధలను పాటించాలని కోరింది. ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వ్యక్తి ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నట్లు అధికారులు తెలిపారు. చదవండి: ప్రధాని మోదీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ -
CCMB: గిరిజనులకు కోవిడ్ ముప్పు అధికం
సాక్షి, హైదరాబాద్: దేశంలో సాధారణ ప్రజలతో పోలిస్తే గిరిజనులు కోవిడ్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయోలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు తాజా పరిశోధనలో తేల్చారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలు గిరిజన తెగల ప్రజలపై కోవిడ్ తీవ్ర ప్రభావం చూపిన నేపథ్యంలో ఈ పరిశోధనకు ప్రాధాన్యం ఏర్పడింది. సీసీఎంబీ శాస్త్రవేత్త, సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ (సీడీఎఫ్డీ) డైరెక్టర్ డాక్టర్ కుమారస్వామి తంగరాజ్ ఈ పరిశోధనలు చేపట్టారు. సీసీఎంబీ... అండమాన్ నికోబార్ దీవుల్లోని స్థానిక తెగల ప్రజల జన్యుక్రమాలను పరిశీలించి.. వారు కోవిడ్ బారిన పడేందుకు ఉన్న అవకాశాలపై ఒక అంచనా కట్టింది. బెనారస్ హిందూ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ జ్ఞానేశ్వర్ చౌబేతో కలసి చేపట్టిన ఈ పరిశోధన కోసం మొత్తం 1,600 మంది గిరిజన తెగల ప్రజల జన్యు క్రమాలను విశ్లేíÙంచారు. మొత్తం 227 తెగలకు చెందిన (అండమాన్లోని ఒంగే, జరావా తెగలు కలుపుకొని) జన్యుక్రమాల్లో కోవిడ్కు గురయ్యేందుకు అవకాశమున్న పొడవాటి డీఎన్ఏ పోగులు ఉన్నట్లు తెలిసింది. మానవ పరిణామానికి సజీవ సాక్ష్యాలు... అండమాన్ తెగల జన్యుక్రమాల ద్వారా వారి మూలలను వెలికి తీసిన తంగరాజ్ అంచనా ప్రకారం.. ఒంగే, జరావా తెగల వారితోపాటు దేశంలోని కొన్ని ఇతర తెగల ప్రజలూ కోవిడ్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది. జరావా తెగల ప్రజల్లో ఏస్2 జన్యువులోని మార్పులు ఎక్కువ మందిలో ఉన్నాయని, ఈ జన్యుమార్పులు ఉన్న వారు కోవిడ్ బారిన పడేందుకు అవకాశాలు ఎక్కువని ప్రొఫెసర్ జ్ఞానేశ్వర్ చౌబే తెలిపారు. -
సీసీఎంబీ స్థాయిలో ల్యాబొరేటరీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద ల్యాబొరేటరీ ఏర్పాటు కాబోతోంది. ఇప్పటివరకూ క్లిష్టమైన నమూనాలను పూణె వైరాలజీ ల్యాబొరేటరీ లేదా సీసీఎంబీ (సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ–హైదరాబాద్)కు పంపించేవారు. ఇకపై ఈ స్థాయి ల్యాబొరేటరీని విజయవాడ సమీపంలో ఏర్పాటు చేయబోతున్నారు. తాజాగా ఎన్సీడీసీ (నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్) అధికారులు స్థల సేకరణకు వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం వేగంగా స్పందించి గన్నవరం విమానాశ్రయం వద్ద 3 ఎకరాల స్థలాన్ని మంజూరు చేసింది. ఈ ల్యాబొరేటరీ నిర్మాణానికి రూ. 15 కోట్ల నుంచి రూ. 20 కోట్ల వరకూ అవుతుందని అంచనా. దీన్ని రెండేళ్లలో అందుబాటులోకి తెస్తారు. పూర్తిస్థాయి నిర్మాణం తర్వాత ఇందులో 300 మందికి పైగా సిబ్బంది పనిచేయనున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో 14 వైరాలజీ ల్యాబొరేటరీలు అతి తక్కువ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఉపయోగాలివే.. ► ఈ ల్యాబొరేటరీలో అన్ని రకాల వైరస్లే కాదు, బ్యాక్టీరియా నమూనాలు, కీటకాలు, ఎల్లో ఫీవర్.. తదితర ఎలాంటి నమూనాలనైనా పరిశీలించవచ్చు. ► ప్రస్తుతం మన వద్ద మన రాష్ట్రంలో జినోమిక్ సీక్వెన్సీ ల్యాబ్ (వైరస్ ఉనికిని కనుక్కునే ల్యాబ్) లేదు. ఇకపై ఇలాంటి టెస్టులు ఇక్కడే చేసుకోవచ్చు. ► గతంలో ఏలూరు పట్టణంలో వింత వ్యాధితో బాధితులు ఆస్పత్రికి వచ్చినప్పుడు నమూనాలు వివిధ రాష్ట్రాలకు పంపించాల్సి వచ్చింది. ఇకపై అలాంటి పరిస్థితి ఉండదు. ఎలాంటి టెస్టులైనా ఇక్కడే చేసుకోవచ్చు. ► దీనికి సంబంధించిన నిర్మాణ వ్యయం, మానవ వనరులు కేంద్రం చూసుకుంటుంది. స్థలం మాత్రం ఏపీ సర్కారు ఇస్తుంది. త్వరలోనే అవగాహన ఒప్పందం అతిపెద్ద ల్యాబొరేటరీ నిర్మాణానికి గన్నవరంలో 3 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం చూపించింది. రెండేళ్లలో అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటాం. త్వరలోనే అవగాహన ఒప్పందం చేసుకుంటాం. నిర్మాణం పూర్తయిన తర్వాత ఇతర రాష్ట్రాలకు నమూనాలు పంపించే పరిస్థితి ఉండదు. రకరకాల జబ్బుల ఉనికిని వీలైనంత త్వరగా తెలుసుకునే వీలుంటుంది. – డా.ఎం.అనురాధ, సీనియర్ రీజనల్ డైరెక్టర్, కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ -
కొలెస్ట్రాల్ నియంత్రణకు కొత్త మార్గం
సాక్షి, హైదరాబాద్: శరీంలోని కొలెస్ట్రాల్ను నియంత్రించేందుకు సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు కొత్త లక్ష్యాన్ని గుర్తించారు. కణత్వచంపై సెరటోనిన్ రిసెప్టార్–1ఏ.. కొలెస్ట్రాల్ను గుర్తించగలదని సీసీఎంబీ సీనియర్ శాస్త్రవేత్త ప్రొఫెసర్ అమితబ ఛటోపాధ్యాయ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం గుర్తించింది. సెరటోనిన్ రిసెప్టార్లు కణత్వచంలో ఉండే కొలెస్ట్రాల్కు సున్నితంగా ఉంటాయని ఆయన గతంలోనే గుర్తించారు. కణాల మధ్య సమాచారం ఇచ్చి పుచ్చుకునేందుకు రిసెప్టార్ ప్రోటీన్లు కీలకం కాగా.. చాలా మందులు ఈ రిసెప్టార్ ప్రొటీన్లనే లక్ష్యంగా చేసుకుని తయారుచేస్తుంటారు. సెరటోనిన్ రిసెప్టార్ ప్రొటీన్లోని సీఆర్ఏసీ నిర్మాణాలపై తాము దృష్టి పెట్టామని, నిర్దిష్ట అమైనో యాసిడ్స్ను మార్చి చూడగా, ఒక అమైనోయాసిడ్ కొలెస్ట్రాల్ నియంత్రణకు ఉపయోగపడుతున్నట్లు తెలిసిందని ఆయన తెలిపారు. స్పెయిన్లోని పాంపియూ ఫాబ్ర యూనివర్సిటీ హాస్పిటల్ సాయంతో ప్రొటీన్, కొలెస్ట్రాల్ మధ్య జరిగే చర్యలను పరిశీలించామని, తద్వారా తాము గుర్తించిన అమైనో యాసిడ్.. ఎలా కొలెస్ట్రాల్ను నియంత్రిస్తుందో తెలిసిందని చెప్పారు. వయసుతో పాటు కొలెస్ట్రాల్ మోతాదుల్లో తేడాలు వస్తాయని, ఈ రిసెప్టార్ ఆధారంగా కొత్తగా మందులు తయారుచేస్తే మరింత మెరుగ్గా కొలెస్ట్రాల్ను నియంత్రించొచ్చని తాము భావిస్తున్నట్లు వివరించారు. స్ట్రక్చరల్ బయాలజీలో సీసీఎంబీకి ఉన్న నైపుణ్యం ఈ కొత్త ఆవిష్కరణకు వీలు కలిగించిందని సంస్థ డైరెక్టర్ డాక్టర్ నందికూరి వినయ్ తెలిపారు. -
Covid-19: థర్డ్వేవ్ తీవ్రత: ఆ మూడే కీలకం!
సాక్షి, హైదరాబాద్: కరోనా రెండో దశ ముగింపునకు వచ్చినట్లే! మూడు నాలుగు నెలల తరువాత ఇంకో వేవ్ వచ్చే అవకాశం ఉందనేది నిపుణుల మాట! మూడో దశ తీవ్రత, ప్రభావం మొత్తం మూడంటే మూడు అంశాలపై ఆధారపడి ఉందని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) మాజీ డైరెక్టర్, గౌరవ సలహాదారు డాక్టర్ రాకేశ్ మిశ్రా విస్పష్టంగా తెలిపారు. అందరికీ టీకా ఇవ్వడం, కోవిడ్ నిబంధనలు పాటించడం, నిర్ధారణ పరీక్షలు కొనసాగించడం కీలకమని చెప్పారు. కరోనా కేసుల సంఖ్య క్రమేపీ తగ్గుముఖం పడుతున్న ప్రస్తుత తరుణంలో తరువాతి దశల పరిస్థితి ఏమిటో తెలుసుకునేందుకు ‘సాక్షి’ డాక్టర్ రాకేశ్ మిశ్రాను సంప్రదించింది. ఆయన ఇంకా ఏమన్నారంటే... టీకాతో తీవ్రత తగ్గించొచ్చు.. 1 కోవిడ్ నుంచి రక్షణ పొందేందుకు మనకున్న ఏకైక ఆయుధం టీకానే. వీలైనంత తొందరగా టీకా కార్యక్రమాన్ని పూర్తి చేయడం ద్వారా మూడు లేదా ఆ తరువాతి దశల తీవ్రతను గణనీయంగా తగ్గించవచ్చు. 2 కోవిడ్ నిబంధనలు అంటే భౌతిక దూరం పాటించడం, చేతులు తరచూ శుభ్రంగా కడుక్కోవడం, ముఖానికి మాస్కు తొడుక్కోవడం వంటివి కచ్చితంగా పాటించడం ద్వారా వ్యాధి వ్యాప్తిని అరికట్టవచ్చు. 3 రెండో దశ కేసులు తగ్గిపోతున్నాయి కదా అని ప్రభుత్వాలు పరీక్షలు చేయడం తగ్గిస్తే అసలుకే మోసం వస్తుంది. వీలైనన్ని ఎక్కువ పరీక్షలు జరిపి.. నిర్ధారణయ్యే తక్కువ కేసులను ఐసొలేషన్లో ఉంచి వెంటనే చికిత్స కల్పించడం ఇకపై చాలా ముఖ్యం. జన్యుమార్పులకు లోనయ్యే అవకాశం! అరవై ఏళ్లపైబడ్డ వారు, మధుమేహం, గుండెజబ్బుల వంటి ఆరోగ్య సమస్యలు ఉన్న వారిలో అధికులు ఇప్పటికే టీకాలు తీసుకున్న నేపథ్యంలో వైరస్ ఇతరులకు సోకే అవకాశాలు పెరుగుతాయి. టీకాలు, రకరకాల చికిత్సల ద్వారా అడ్డుకునేందుకు జరుగుతున్న ప్రయత్నాల నుంచి తప్పించుకునేందుకు వైరస్ జన్యుమార్పులకు గురవుతుంది. ఈ మార్పుల్లో ఏ ఒక్కటి మనిషికి ప్రమాదకరంగా ఉన్నా ముప్పు తప్పదు. దేశంలో ప్రస్తుతానికి 617.2 రకం రూపాంతరిత వైరస్ ఒక్కదానితోనే ఎక్కువ సమస్యలు వస్తున్నాయి. ఇటీవలి కాలంలో వైరస్లో కొత్త రూపాంతరితాలేవీ కనిపించలేదు. పాత తప్పులు మళ్లీ వద్దు రెండో దశ కరోనా సమయంలో జరిగిన పొరబాట్లు, తప్పులను పునరావృతం చేస్తే దేశం భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. మూడో దశను ఎదుర్కొనేందుకు అన్ని రకాలుగా సన్నద్ధం కావడం చాలా అవసరం. మూడు నాలుగు నెలల సమయం ఉందన్న అంచనాలను ఆధారంగా చేసుకుని ఆరోగ్య రంగాన్ని పటిష్టం చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. గతంలో మాదిరిగా ఆక్సిజన్, బెడ్ల కొరత వంటి సమస్యలకు ఈసారి మరికొన్ని జత చేరే అవకాశం ఉండొచ్చు. మూడో దశ ప్రభావం పిల్లలపై ఎక్కువ ఉండే అవకాశం ఉన్నందున.. అటువంటి వారికి అనుగుణంగా ఆసుపత్రుల్లోని కోవిడ్ వార్డుల్లో తగిన మార్పులు,చేర్పులు చేయాలి. రోజంతా మాస్కులు ధరించడం, ఒకేచోట కదలకుండా ఉండటం పిల్లలు చేయలేరు కాబట్టి.. వారికి అనుకూలమైన విధంగా వార్డులను సిద్ధం చేయాలి. అంతేకాకుండా.. కోవిడ్ బారిన పడ్డ పిల్లలకు ఏ రకమైన మందులు ఇవ్వాలన్న అంశంపై ఇప్పుడే అధ్యయనం మొదలుపెట్టాలి. పెద్దవారికి ఇచ్చే మందులు పిల్లలకూ పనికొస్తాయనుకోవడం సరికాదు. చదవండి: డ్రోన్లతో వ్యాక్సిన్ల రవాణా: 100 కి.మీ వేగం.. 70 కి.మీ దూరం.. -
Coronavirus: నిర్ధారణ పరీక్షకు ‘డ్రైస్వాబ్’
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ వ్యాధి నిర్ధారణను వేగవంతం చేసే డ్రైస్వాబ్ కిట్ల వాణిజ్య ఉత్పత్తికి రంగం సిద్ధమైంది. సెంటర్ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యు లర్ బయాలజీ (సీసీఎంబీ) అభివృద్ధి చేసిన ఈ డ్రైస్వాబ్ కిట్ల ద్వారా ఆర్టీ–పీసీఆర్ పరీక్షలు వేగంగా, చౌకగా జరుగుతాయి. భారత వైద్య పరిశోధన సమాఖ్య కూడా ఈ డ్రైస్వాబ్ కిట్ల వినియోగానికి అనుమతిచ్చిన నేపథ్యంలో వాటిని వాణిజ్యస్థాయిలో తయారు చేసేందుకు మెరిల్ డయాగ్నస్టిక్స్ ముందుకొచ్చింది. దేశం మొత్తమ్మీద డ్రైస్వాబ్ ఆధారిత పరీక్షలను పెద్ద ఎత్తున చేపట్టేందుకు సీసీఎంబీ–మెరిల్ డయాగ్నస్టిక్స్ ఒప్పందం దోహదపడుతుంది. సాధారణ ఆర్టీ–పీసీఆర్ పరీక్షల్లో ఆర్ఎన్ఏను వేరు చేసేందుకు చాలా సమయం పడు తుండగా.. డ్రైస్వాబ్ కిట్ల ద్వారా తక్కువ సమయంలోనే ఈ పని చేయొచ్చు. దేశంలో కోవిడ్ పరీక్షలు పెద్ద సంఖ్యలో చేపట్టేందుకు ఈ కిట్లు ఉపయోగపడతాయని మెరిల్ డయాగ్నస్టిక్స్ ఉపాధ్యక్షుడు సంజీవ్ భట్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి నెలా దాదాపు రెండు కోట్ల డ్రైస్వాబ్ కిట్లను తయారు చేయగలమని, ఒక్కో పరీక్షకు అయ్యే ఖర్చు రూ.45–60 మధ్య ఉంటుందన్నారు. దేశంలో ప్రస్తుతం జరుగుతున్న రోజువారీ పరీక్షలకు రెండు మూడు రెట్లు ఎక్కువ పరీక్షలు చేసేందుకు ఈ కిట్లు ఉపయోగపడతాయని సీసీఎంబీ నూతన డైరెక్టర్ డాక్టర్ నందికూరి వినయ్ కుమార్ తెలపగా.. పరీక్షలకయ్యే సమయం, ఖర్చు దాదాపు సగం వరకూ తగ్గుతాయని సంస్థ గౌరవ సలహాదారు డాక్టర్ రాకేశ్ మిశ్రా తెలిపారు. ఏమిటీ డ్రైస్వాబ్స్ టెక్నాలజీ? కోవిడ్ వ్యాధి నిర్ధారణకు ముక్కు లేదా నోటి లోపల ఉండే ద్రవాలను పొడవాటి పుల్లల్లాంటి వాటితో సేకరిస్తారు. వీటినే స్వాబ్స్ అంటారు. ఆర్టీపీసీఆర్ టెస్టులు జరిగే కేంద్రాలకు ఈ నమూనాలను తీసుకెళ్లాలంటే వాటిని వైరల్ ట్రాన్స్పోర్ట్ మీడియం (వీటీఎం) ద్రావణంలో ఉంచి తీసుకెళ్లాల్సి ఉంటుంది. అంతేకాకుండా.. స్వాబ్స్లోని జీవ పదార్థా న్ని జాగ్రత్త పరిచేందుకు కొన్ని రీఏజెంట్లను కూడా వాడతారు. ఇవేవీ లేకుండా పొడిగా ఉండే స్వాబ్స్నే నేరుగా పరీక్షలు జరిగే కేంద్రా లకు తరలించేందుకు వీలుగా సీసీఎంబీ అభివృద్ధి చేసిన కొత్త టెక్నాలజీనే డ్రైస్వాబ్స్ టెక్నాలజీ! సాధారణ ఆర్టీపీసీఆర్ టెస్ట్ ద్వారా ఫలితాలకు ఒకట్రెండు రోజుల సమయం పడితే.. డ్రైస్వాబ్స్ టెక్నాలజీతో మూడు గంటల్లోనే ఫలితాలు తెలుసుకోవచ్చు. చదవండి: విదేశీ టీకాలకు నో ట్రయల్స్! -
డీఆర్డీవో గుడ్న్యూస్: కరోనా బాధితులకు కొత్త ఔషధం సిద్ధం
1. పై ఫొటోలో ఆకుపచ్చ రంగువి ఆరోగ్యకరమైన కణాలు, ఎరుపురంగు చుక్కలు కరోనా వైరస్, నారింజ రంగులో మసకగా ఉన్నవి వైరస్ సోకి దెబ్బతిన్న కణాలు. 2–డీజీ ఇవ్వక ముందు వైరల్ లోడ్ ఎక్కువగా ఉంది. 2. మందు ఇచ్చిన తర్వాత పరిశీలిస్తే వైరస్ లోడ్ చాలా వరకు తగ్గింది. సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ డీఆర్డీవో శుభవార్త చెప్పింది. కరోనా బారినపడ్డ వారు వేగంగా కోలుకునేందుకు, ఆక్సిజన్ పెట్టాల్సిన అవసరాన్ని తగ్గించేందుకు తోడ్పడే ‘2–డీజీ’ ఔషధాన్ని త్వరలో మార్కెట్లోకి తేనున్నట్టు ప్రకటించింది. కరోనా బాధితులపై నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్లో ‘2–డీజీ’ మంచి ఫలితాలు ఇచ్చిందని, ఈ మేరకు అత్యవసర వినియోగానికి ‘డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీజీసీఐ)’అనుమతులు వచ్చాయని డీఆర్డీవో చైర్మన్ జి.సతీశ్రెడ్డి శనివారం వెల్లడించారు. డీఆర్డీవో అనుబంధ సంస్థ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అల్లైడ్ సైన్సెస్ (ఇన్మాస్) ఈ ‘2–డీజీ’మందును అభివృద్ధి చేసిందని.. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఫార్మా కంపెనీ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ కలిసి ప్రయోగాలు నిర్వహించిందని తెలిపారు. ‘2–డీజీ’ఇచ్చిన కోవిడ్ రోగుల్లో చాలా మందికి నాలుగైదు రోజుల్లోనే కోవిడ్ నెగెటివ్ వచ్చిందని వివరించారు. దేశవ్యాప్తంగా పెరిగిపోయిన కోవిడ్ కేసులు, ఆక్సిజన్ కొరతతో అల్లాడుతున్న సమయంలో ‘2–డీజీ’అందుబాటులోకి వస్తుండటంతో సంతోషం వ్యక్తమవుతోంది. ఏడాది కిందే ప్రయోగాలు మొదలు.. కరోనా వైరస్ పంజా విసరడం మొదలైన కొత్తలోనే.. అంటే గత ఏడాది ఏప్రిల్లోనే ఈ వైరస్కు మందు కనిపెట్టడంపై ఇన్మాస్ సంస్థ దృష్టి పెట్టింది. సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ)తో కలిసి పరిశోధనలు చేసి.. ‘2–డీజీ (2 డీఆక్సి–డీ గ్లూకోజ్)’మందును రూపొందించింది. ఇది కరోనా వైరస్ పెరుగుదలను సమర్థవంతంగా అడ్డుకుంటోందని గుర్తించి.. క్లినికల్ ట్రయల్స్ కోసం ‘సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్డీఓ)’కు దరఖాస్తు చేసింది. ఈ మేరకు అనుమతి రావడంతో గత ఏడాది మే నెలలోనే డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఫార్మా కంపెనీతో కలిసి.. కోవిడ్ రోగులపై ప్రయోగాత్మక పరిశీలన చేపట్టింది. ఈ మందు సామర్థ్యం, భద్రత ఏమేరకు ఉన్నాయనేది నిర్ధారించేందుకు ప్రయోగాలు నిర్వహించింది. కరోనా వైరస్ ఉన్న శాంపిల్స్.. ఇన్ఫెక్ట్ అయిన కణాలకు 2–డీజీ మందు వాడిన తర్వాత మందు సురక్షితమే.. గత ఏడాది మే – అక్టోబరు మధ్య నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్లో ‘2–డీజీ’మందు సురక్షితమైనదేనని, రోగులు వేగంగా కోలుకునేందుకు ఉపయోగపడుతోందని గుర్తించారు. తర్వాత రెండో దశలో ఫేజ్–2ఏ కింద ఆరు ఆస్పత్రుల్లో, ఫేజ్–2బీ కింద 11 ఆస్పత్రుల్లో పరిశీలన చేపట్టారు. మొత్తం 110 మంది రోగులకు 2–డీజీ మందును ఇచ్చి ఫలితాలను బేరీజు వేశారు. సాధారణ చికిత్సా పద్ధతులతో పోలిస్తే 2–డీజీ మందు ఇచ్చిన రోగులు.. కోవిడ్ లక్షణాల నుంచి వేగంగా బయటపడుతున్నట్టు నిర్ధారించారు. మరోలా చెప్పాలంటే 2–డీజీ తీసుకున్నవారు మూడు రోజులు ముందుగానే కోలుకుంటున్నారని తేల్చారు. మూడో దశలోనూ సత్ఫలితాలు తొలి, రెండు దశల ప్రయోగాలు విజయవంతమైన నేపథ్యంలో మూడో దశ క్లినికల్ ట్రయల్స్కు గత ఏడాది నవంబరులోనే డీసీజీఐ అనుమతులు ఇచ్చింది. గతేడాది డిసెంబరు – ఈ ఏడాది మార్చి మధ్య 220 మంది రోగులకు ఈ మందును ఇచ్చి పరిశీలించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లోని 27 కోవిడ్ ఆస్పత్రుల్లో పేషెంట్లపై ప్రయోగాలు చేశారు. 2–డీజీ మందు ఇవ్వడం మొదలుపెట్టిన మూడో రోజు నుంచే దాదాపు 42 శాతం మంది రోగుల్లో ఆక్సిజన్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా పోయింది. అరవై ఐదేళ్ల కంటే ఎక్కువ వయసున్న వారిలోనూ ఇదేరకమైన ఫలితాలు వచ్చాయి. మూడు దశల ఫలితాల ఆధారంగా.. మధ్యమ, తీవ్ర స్థాయి కోవిడ్ రోగుల చికిత్సలో 2–డీజీని ఉపయోగించేందుకు డీసీజీఐ ఈ నెల ఒకటో తేదీనే అనుమతులు జారీ చేసింది. తాజాగా ఈ మందుకు సంబంధించిన వివరాలను డీఆర్డీవో చైర్మన్ జి.సతీశ్రెడ్డి మీడియాకు వెల్లడించారు. పొడి.. నీళ్లలో కలుపుకొని తాగడమే 2–డీజీ మందు.. పొడి రూపంలో లభిస్తుంది. దానిని నీటిలో కరిగించుకుని తాగాలి. ఈ ఔష ధం మన శరీరంలో వైరస్ సోకిన కణాల్లోకి చేరుకుని.. ఆ కణాల నుంచి వైరస్లు శక్తి పొందకుండా నిరోధిస్తుంది. దీంతో వైరస్ వృద్ధి తగ్గిపోతుంది. వైరస్తో కూడిన కణాల్లోకే చేరుకోవడం 2–డీజీ ప్రత్యేకత. ఈ మందులోని అణువులు.. సాధారణ గ్లూకోజ్ అణువులను పోలి ఉండటం వల్ల విస్తృతంగా ఉత్పత్తి చేయడానికి వీలుందని డీఆర్డీవో చైర్మన్ జి.సతీశ్రెడ్డి తెలిపారు. అన్నీ సవ్యంగా సాగితే వారం, పదిరోజుల్లోనే ఈ మందు తొలి విడత మార్కెట్లోకి వచ్చేస్తుందని.. మూడు వారాల్లో మరింత మోతాదులో అందుబాటులోకి వస్తుందని వివరించారు. -
ఎన్440కే వేరియంట్పై సీసీఎంబీ ట్వీట్
హైదరాబాద్: కరోనా వైరస్ ఎన్440కే వేరియంట్పై సీసీఎంబీ క్లారిటీ ఇచ్చింది. ఇది కొత్త రకం వేరియంట్ అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్న తరుణంలో సీసీఎంబీ ట్వీట్ ద్వారా స్పందించింది. ఈ వైరస్ కొత్తగా వచ్చింది కాదని, గతేడాది ఎన్440కే వైరస్ను గుర్తించామని తెలిపింది. ఎన్440కే వైరస్ ప్రభావం పూర్తిగా తగ్గిపోయినట్లు తమ పరిశోధనల్లో తేలినట్లు సీసీఎంబీ స్పష్టం చేసింది. #COVID19India #COVID19 #coronavirus In light of the many reports on coronavirus variant N440K lately, we would like to bring to your attention a few things: 1. The mutant is not new. We have been seeing it in South India since last year.@CSIR_IND @AndhraPradeshCM (1/3) More👇🏾 — CCMB (@ccmb_csir) May 5, 2021 -
యూకే వేరియంట్తోనే సమస్య!
‘దేశంలో ప్రస్తుతం యూకే వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. గత కొంత కాలంగా డబుల్ మ్యూటెంట్ వేగంగా వ్యాప్తి చెందినా, ప్రస్తుతం యూకే రూపాంతరితమే సమస్యగా మారింది. ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించడమే సెకండ్ వేవ్ ఉధృతికి ప్రధాన కారణం..’అని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా ‘సాక్షి’కి తెలిపారు. ప్ర: దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య రోజుకు నాలుగు లక్షలకు చేరువ అవుతోంది. తొలిదశలో వైరస్ వ్యాప్తిని సమర్థంగా అడ్డుకున్న మనం రెండోసారి మాత్రం విఫలమయ్యాం. ఇందుకు కారణాలేమిటి? జ: కోవిడ్–19 వ్యాప్తి నిరోధానికి అవసరమైన చర్యలు చేపట్టడంలో ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించడమే అతిపెద్ద కారణం. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం అత్యవసరమని, ఈ జాగ్రత్తలన్నీ కొనసాగించాలని చాలాకాలంగా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూనే ఉన్నా పట్టించుకోకపోవడం వల్లనే ఈ సమస్య వచ్చిపడింది. పాఠశాలలు, కళాశాలలు త్వరగా తెరవడం, ఎన్నికల ర్యాలీలకు అనుమతించడం, బార్లు, పబ్బులు, సినిమాహాళ్లు పనిచేసేందుకు అనుమతులివ్వడం కూడా కారణమేనని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే రూపాంతరిత వైరస్ వేగంగా వ్యాప్తి చెందేందుకు అవకాశం ఏర్పడింది. అదృష్టం ఏమిటంటే.. యూకే, భారత్ డబుల్ మ్యూటెంట్ వైరస్లకు ఇతర జీవుల ద్వారా వ్యాపించే శక్తి అలవడలేదు. అదే జరిగి ఉంటే సమస్య మరింత జటిలమయ్యేది. ప్ర: దేశంలో ఏ రూపాంతరిత వైరస్ ఎక్కువ వ్యాప్తిలో ఉంది? జ: ప్రధానంగా మూడు (యూకే, డబుల్ (కాలిఫోర్నియా), బెంగాల్) రూపాంతరిత వైరస్లు ఉన్నాయి. వీటి నుంచి మరోసారి జన్యుమార్పులకు గురైన ఇంకో వైరస్ కూడా వ్యాప్తిలో ఉంది. దీన్నే ట్రిపుల్ మ్యూటేటెడ్ అని పిలుస్తున్నారు. మహారాష్ట్రలో నమోదవుతున్న కేసుల్లో పదిశాతం ఈ వైరస్వే. కొమ్ములో ఉండే ఒకే ఒక్క తేడా డబుల్, ట్రిపుల్ మ్యూటేటెడ్లను వేరు చేస్తుంది. బెంగాల్లో 20 శాతం కేసులకు కారణమవుతున్న రూపాంతరిత వైరస్ బలహీనపడుతోందని, త్వరలో కనిపించకుండా పోతుందని అంచనా వేస్తున్నాం. డబుల్ మ్యూటెంట్ వైరస్ను గత ఏడాది డిసెంబర్లోనే గుర్తించినా..మన నిర్లక్ష్యం కారణంగా గత కొంతకాలంగా అది వేగంగా వ్యాప్తి చెందింది. డబుల్, ట్రిపుల్ మ్యూటెంట్ వైరస్లలో జన్యుపరమైన మార్పులు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నప్పటికీ వాటి వల్ల ప్రమాదమేమీ లేకపోవడం ఊరటనిచ్చే అంశం. దేశంలో ప్రస్తుతం యూకే రూపాంతరితమే ఎక్కువగా వ్యాప్తిలో ఉంది. అదే సమయంలో వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు వెరైటీలు తమ ప్రభావాన్ని చూపిస్తున్నాయని తెలుస్తోంది. సీసీఎంబీలో రూపాంతరితాల జన్యుక్రమ నమోదు జరుగుతోంది. ఇప్పటివరకూ పరిశీలించిన నమూనాల్లో యూకే రూపాంతరితం 12 – 15 శాతం ఉండగా.. డబుల్ మ్యూటెంట్ 20 శాతం నమూనాల్లో కనిపించింది. మిగిలిన 70 శాతంలో వేర్వేరు రకాల ఉనికిని గుర్తించాము. ప్ర: రెండో దఫా కేసులు శిఖరస్థాయికి చేరేదెన్నడు? మూడో దఫా ఉండే అవకాశం ఉందా? జ: దేశ విదేశాల్లో చేసిన అధ్యయనాలన్నీ భారత్లో మే రెండు, మూడో వారాల్లో కేసులు శిఖరస్థాయికి చేరతాయని, ఆ తర్వాత వేగంగా తగ్గిపోతాయని చెబుతున్నాయి. మళ్లీ జూన్ తర్వాత కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి. తీవ్రత తక్కువగా ఉంటుందంటున్న ఈ దశను మూడో దఫా అని కూడా అనలేము. నిజానికి ఈ మూడోదఫా గురించి ఎవరికీ స్పష్టమైన సమాచారం లేదు. ప్రస్తుతం రోజువారీ ఎన్ని కేసులు నమోదవుతున్నాయి? అన్న అంశంపై ఆధారపడి ఈ అంచనాలు రూపొందాయి. శిఖర స్థాయికి చేరే క్రమంలో రోజువారీ కేసుల సంఖ్య ఐదు నుంచి పది లక్షలకు చేరుకునే అవకాశం ఉంది. ప్రభుత్వ లెక్కల్లోకి ఎక్కని కేసులు దీనికి అదనంగా భావించాలి. కేసులకు సంబంధించి పూర్తిస్థాయి సమాచారం అందని పరిస్థితుల్లో అంచనాలు వేయడం అంత సులభమేమీ కాదు. కానీ మే నెల మూడో వారానికల్లా అత్యధిక స్థాయిలో కేసులు నమోదై ఆ తర్వాత తక్కువ కాలంలోనే ఆ సంఖ్య పతనమవుతుందని అనుకుంటున్నాం. అప్పటివరకూ పరిస్థితిని అదుపులో ఉంచేందుకు మాస్కులేసుకోవడం, తరచూ చేతులు కడుక్కోవడం, భౌతిక దూరం పాటించడం వంటివి మరింత కఠినంగా కొనసాగించాల్సి ఉంటుంది. వీలైనన్ని ఎక్కువ పరీక్షలు చేయడం, అందుబాటులో ఉన్న వైరస్ నమూనాల జన్యుక్రమాన్ని వేగంగా నమోదు చేయడం చాలా అవసరం. తద్వారా కొత్త రూపాంతరితాలను ఎప్పటికప్పుడు గుర్తించే వీలేర్పడుతుంది. జన్యుక్రమ నమోదు ద్వారా కొత్త టీకాలు, మందులను అభివృద్ధి చేయవచ్చు. ప్రభుత్వం ఈ పనులన్నీ తగిన వేగంతో చేస్తుందని అనుకున్నా.. ప్రజలు తమవంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తేనే దేశం నుంచి కరోనా వైరస్ను తరిమి కొట్టగలం. – సాక్షి, హైదరాబాద్. -
మాస్కే మంత్రం.. టీకానే దివ్య ఔషధం..!
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ తీసుకోవడం మేలైన మార్గమైతే.. ఆ తర్వాత కూడా మాస్కు వేసుకోవడం, భౌతికదూరం పాటించడం, చేతులు శుభ్రం చేసుకోవడం అత్యవసరమని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నా రు. కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో సామాన్యుల్లో వ్యాధిపై మరింత అవగాహన పెంచే లక్ష్యంతో హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, సీసీఎంబీ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్, జాతీయ పోషకాహార సంస్థలు సంయుక్తంగా బుధవారం ఆన్లైన్ చర్చా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి కరోనాపై పలు సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం చేశాయి. టీకా లభ్యతపై.. ప్రస్తుతం కోవాగ్జిన్, కోవిషీల్డ్ మాత్రమే అందుబాటులో ఉన్నా.. మే 10–15 మధ్య సమయానికి రష్యా తయారుచేసిన స్పుత్నిక్–వీ అందుబాటులోకి వస్తుందని ఐఐసీటీ డైరెక్టర్ డాక్టర్ శ్రీవారి చంద్రశేఖర్ తెలిపారు. క్యాడిల్లా ఫార్మా తయారు చేస్తున్న సెప్సివ్యాక్ కూడా ప్రభుత్వ అనుమతులు పొందే అవకాశముందని పేర్కొన్నారు. కుష్టు వ్యాధి కోసం అభివృద్ధి చేసిన సెప్సివ్యాక్.. రోగ నిరోధక శక్తిని పెంచుతుందని చెప్పారు. కాగా, కోవాగ్జిన్ తయారీకి అవసరమైన ముడిపదార్థాల కొరత లేదని, రసాయనాలను దేశీయంగానే తయారు చేసుకుంటున్నామని డాక్టర్ చంద్రశేఖర్ వివరించారు. కోవి షీల్డ్ ముడిపదార్థాల కొరత కూడా త్వరలోనే తీరుతుందని పేర్కొన్నారు. ఒక్క డోసు వ్యాక్సిన్ తీసుకున్న వారికి వైరస్ సోకితే లక్షణాల తీవ్రత తక్కువగా ఉంటోందని చెప్పారు. వ్యాక్సినేషన్ నత్తనడకపై.. వ్యాక్సినేషన్ కార్యక్రమం నత్తనడక సాగడానికి వ్యాక్సిన్ ఉత్పత్తిలోని లోటుపాట్లు కొంతవరకు కారణమైనా.. తొలి దశ వ్యాక్సినేషన్లో వైద్యులు, సిబ్బందిలో వేచి చూద్దామన్న ధోరణి వల్లే టీకా కార్యక్రమం వేగం తగ్గిందని జాతీయ పోషకాహార సంస్థ డైరెక్టర్ డాక్టర్ ఆర్.హేమలత అభిప్రాయపడ్డారు. సెకండ్ వేవ్ కరోనా కేసుల్లో 85 శాతం మంది తక్కువ స్థాయి లక్షణాలతో బయటపడుతున్నారని తెలిపారు. తొలి దశతో పోలిస్తే రెండో దశలో సైటోకైన్ స్టార్మ్, న్యుమోనియా వంటివి తక్కువగా ఉన్నాయని తెలిపారు. తొలి డోసు టీకా తీసుకున్న 7 రోజులకే శరీరంలో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతున్నా రోగ నిరోధక వ్యవస్థ స్పందించేందుకు 2,3 వారాల సమయం పడుతుందని వివరించారు. మ్యూటెంట్ల గురించి.. కరోనా వైరస్తో పాటు ఏ వైరస్ అయినా కాలక్రమంలో రూపాంతరం చెందుతుంది కాబట్టి.. బ్రెజిల్, యూకే, దక్షిణాఫ్రికా, డబుల్, ట్రిపుల్ మ్యూటెంట్ వైరస్ల గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ సీఈవో ఎన్.మధుసూదనరావు స్పష్టం చేశారు. తొలి దశతో పోలిస్తే రెండో దశలో ప్లాస్మా ట్రీట్మెంట్ ప్రభావం కొంత తగ్గినట్లు తెలుస్తోందని పేర్కొన్నారు. ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో కొందరికి తప్పుగా నెగెటివ్ రావడంపై మాట్లాడుతూ.. శాంపిల్ను ఎంత సమర్థంగా తీయగలరు? ఆర్టీపీసీఆర్ టెస్టులు చేసే యంత్రాలు తదితర అంశాలూ ప్రభావం చూపుతా యని తెలిపారు. ధూమపానం చేసేవారు, శాఖాహారులు, ఫలానా గ్రూపు రక్తం ఉన్న వారిలో కరోనా తీవ్రత తక్కువగా ఉందనేందుకు ఆధారాల్లేవని చెప్పారు. మహిళల్లో నిరోధకత ఎక్కువ? పురుషులతో పోలిస్తే మహిళల రోగ నిరోధక వ్యవస్థ కొంచెం మెరుగ్గా ఉంటుందని, ఆరోగ్య సమస్యల నుంచి కోలుకునే వేగం కూడా ఎక్కువని, కోవిడ్–19 విషయంలోనూ ఇదే జరుగుతోందని జాతీయ పోషకాహార సంస్థ డైరెక్టర్ ఆర్.హేమలత తెలిపారు. నెలసరి సమయంలో వ్యాక్సిన్ తీసుకోరాదన్నది అపోహ మాత్రమేనని స్పష్టం చేశారు. పాలిచ్చే తల్లులు టీకా తీసుకోవడం అపాయమేమీ కాదని, కోవిడ్–19 విషయంలో ప్రభావంపై ఇంకా తెలియదని చెప్పారు. కరోనా బారిన పడ్డవారు తగిన పౌష్టికాహారం తీసుకోవడం అత్యవసరమని తెలిపారు. రోజువారీ ఆహారంలో కనీసం సగం పండ్లు, కాయగూరలు ఉండేలా చూసుకోవాలని వివరించారు. విటమిన్–డి తక్కువగా ఉన్న వారిలో వ్యాధి లక్షణాలు తీవ్రంగా ఉండే అవకాశం ఉందని, మరణాల రేటూ ఎక్కువని, ఇప్పటివరకు జరిగిన పరిశోధనలు కూడా ఇదే చెబుతున్నాయని పేర్కొన్నారు. ఇంట్లోనూ మాస్కు అవసరమా? రెండో దఫా కేసులు ప్రబలుతున్న తీరును చూస్తే ఇళ్లలోనూ మాస్కులు ధరించాలన్న కేంద్ర ప్రభుత్వ అధికారుల సూచన సరైందేనని భావిస్తున్నట్లు ఐఐసీటీ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ శిష్ట్లా రామకృష్ణ తెలిపారు. గాలి, వెలుతురు సరిగా లేని ప్రాంతాల్లో ముగ్గురు కంటే ఎక్కువ మంది ఉంటే.. తప్పనిసరిగా మాస్కు పెట్టుకోవాలని కోరారు. కరోనా వైరస్ నోరు, ముక్కు, కళ్లద్వారా వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువ కాబట్టి బహిరంగ ప్రదేశాల్లో ఆరడుగుల దూరం పాటించాలని, ప్రజలు వీటిని సరిగ్గా పాటించి ఉంటే సెకండ్వేవ్ కేసులు ఈ స్థాయిలో పెరిగేవి కావేమోనని అభిప్రాయపడ్డారు. ఆ రెండే కరోనా నుంచి మనల్ని కాపాడుతాయి.. -
కరోనా ఇండియన్ స్ట్రెయిన్ చాలా ఫాస్ట్!
న్యూఢిల్లీ: కరోనా ఇండియన్ స్ట్రెయిన్ (బి. 1. 617 వేరియంట్) యూకే వేరియంట్లాగానే అత్యంత వేగంగా వ్యాపిస్తోందని, అయితే ఇది అత్యంత ప్రాణాంతకం (లీథల్) అనేందుకు ఆధారాలు స్వల్పమని ఆరోగ్య నిపుణులు విశ్లేషిస్తున్నారు. సార్స్– సీఓవీ2(కరోనా వైరస్) బి. 1. 617 వేరియంట్ను డబుల్ మ్యూటెంట్ లేదా ఇండియన్ స్ట్రెయిన్ అని పిలుస్తున్నారు. ముఖ్యంగా మహారాష్ట్ర, ఢిల్లీల్లో సెకండ్ వేవ్ సందర్భంగా ఈ వేరియంట్ అధికంగా కనిపించింది. మహారాష్ట్రలో దాదాపు 50కిపైగా కేసుల్లో ఈ వేరియంట్ కనిపించిందని, యూకే వేరియంట్ 28 శాతం మేర కనిపించిందని ఎన్సీడీసీ డైరెక్టర్ సుజిత్ సింగ్ గతవారం చెప్పారు. కొన్ని వారాలుగా మహారాష్ట్ర, ఢిల్లీల్లో ఒక్కసారిగా కరోనా విజృంభించింది. పలు ఆస్పత్రుల్లో పడకలు దొరక్క బాధితులు పలు ఇక్కట్లు పడుతున్నారు. అయితే ఈ రెండు వేరింట్లు అత్యంత ప్రమాదకారులని చెప్పలేమని, కానీ యూకే వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందే రకమైతే, భారత వేరియంట్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందే రకమై ఉండొచ్చని ఐజీఐబీ డైరెక్టర్ అనురాగ్ అగర్వాల్ తెలిపారు. అయితే ఈ విషయం నిరూపణకు మరిన్ని పరిశోధనలు చేయాల్సిఉందన్నారు. గతేడాదితో పోలిస్తే సెకండ్వేవ్లో మరణాలు పెరగడానికి వేగంగా వ్యాప్తి చెందే లక్షణం కారణమైఉంటుందన్నారు. ఎక్కువమంది వ్యాధికి గురైతే మరణాలు కూడా ఎక్కువగా ఉంటాయని అభిప్రాయపడ్డారు. భారత్ వేరియంట్లో మూడు రకాల సరికొత్త ప్రొటీన్ ఉత్పరివర్తనాలున్నాయని ఆయన వివరించారు. ఇండియన్ స్ట్రెయిన్ ప్రాణాంతమైనదని చెప్పేందుకు సంపూర్ణ ఆధారాల్లేవని ఎన్సీబీఎస్ డైరెక్టర్ సౌమిత్ర దాస్ తెలిపారు. భారత్లో కనిపిస్తున్న వేరియంట్లు వాక్సిన్కు లొంగేవేనని, ప్రస్తుతం దేశంలో అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు వీటిపై సమర్ధవంతంగా పనిచేస్తున్నాయని గతవారం జరిగిన వెబ్నార్లో ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా బీ. 1. 617 వేరియంట్పై కోవిషీల్డ్ టీకా ప్రభావవంతంగా పనిచేస్తుందని సీసీఎంబీ సైతం వెల్లడించింది. -
హే! హెర్డ్ ఇమ్యూనిటీ ఉత్త ముచ్చట
సాక్షి, హైదరాబాద్: ‘దేశంలో 60 శాతం మందికి కోవిడ్ సోకితే ఇక హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చినట్టే. ఇక వైరస్ వ్యాప్తి తగ్గి క్రమంగా అంతర్థానం అవుతుంది’.. కోవిడ్ ప్రారంభమైనప్పటి నుంచి ప్రచారంలో ఉన్న మాట ఇది.‘ఇప్పటికే హైదరాబాద్లో 54 శాతం మంది కోవిడ్ బారినపడ్డారు’.. కోవిడ్ తొలిదశ ముగిసిన సమయంలో సీసీఎంబీ చేసిన ప్రకటన ఇది. ఈ లెక్కన ఇప్పటికే హైదరాబాద్లో 60 శాతాన్ని మించి జనం ఇన్ఫెక్ట్ అయినట్టే. అంటే హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చి, కరోనా వ్యాప్తి తగ్గిపోవాలి. కానీ వేలకొద్దీ కేసులు నమోదవుతున్నాయి. మరేమిటి విషయం అంటే.. ప్రచారంలో ఉన్నట్టుగా 60% మందికి సోకితే హెర్డ్ ఇమ్యూనిటీ వస్తుందన్నది ఉత్తమాటేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. హెర్డ్ ఇమ్యూనిటీని నమ్ముకుంటే.. ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడమేనని అంటున్నారు. వందేళ్ల కిం ద ప్రపంచాన్ని గడగడలాడించిన స్పానిష్ ఫ్లూ నాటి పరిస్థితిని, ఇటీవల స్వీడన్ హెర్డ్ ఇమ్యూనిటీని ప్రయత్నించి దెబ్బతినడాన్ని గుర్తు చేస్తున్నారు. అప్పుడు జరిగిందేమిటి? పారిశ్రామిక విప్లవం వచ్చి ఆధునిక సమాజం మొదలైన తర్వాత వచ్చిన మహమ్మారి స్పానిష్ ఫ్లూ. మొదటి ప్రపంచ యుద్ధం ముగుస్తూనే దాని దాడి మొదలైంది. 1918లో మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొని స్వదేశాలకు వెళ్లిన సైనికులు ఈ వైరస్ను మోసుకెళ్లారు. తొలుత అమెరికాలో ఈ వైరస్ వెలుగు చూసినా.. ఆ దేశ సైని కులు యూరప్కు వెళ్లినప్పుడు ఒక్కసారిగా ప్రబ లింది. దాని అసలు ప్రభావం స్పెయిన్ నుంచి మొదలైంది. దాంతో ఆ వైరస్కు స్పానిష్ ఇన్çఫ్లూ యెంజా పేరు పడింది. ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ బారినపడి దాదాపు మూడున్నర కోట్ల మంది చనిపోతే.. అందులో ఒక్క మన దేశంలోనే కోటిన్నర మంది చనిపోయినట్టు అంచనా. అంటే వైరస్ సోకినవారి సంఖ్య కోట్లలోనే ఉంటుంది. అప్పటి జనాభా ప్రకారం చాలా మందికి వచ్చినట్టే. ఈ నేపథ్యంలో ప్రస్తుత కరోనా పరిస్థితిని నిపుణులు ప్రస్తావనకు తెస్తున్నారు. హెర్డ్ ఇమ్యూనిటీని నమ్మి దెబ్బతిన్న స్వీడన్.. కోవిడ్ వ్యాప్తితో ప్రపంచం మొత్తం లాక్డౌన్లోకి వెళ్లిపోగా ఒక్క స్వీడన్ మాత్రం దానికి వ్యతిరేకంగా అడుగేసింది. ఆ దేశ ఎపిడమాలజిస్ట్ అండర్స్ టాగ్నెల్ ప్రభుత్వానికి హెర్డ్ ఇమ్యూనిటీని నమ్ముకోవాలని సూచించిన ఫలి తం అది. స్వీడన్లో కోవిడ్ వ్యాప్తి పెరుగుతున్న సమయంలో అక్కడి ప్రభుత్వం టాగ్నెల్ను కరోనా కంట్రోల్ యూనిట్ చీఫ్గా నియమించింది. లాక్డౌన్తో ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని, హెర్డ్ ఇమ్యూనిటీ విధానాన్ని అనుసరించాలని ఆయన సూచించారు. దాంతో దుకాణాలు, బార్లు, మాల్స్, ప్రీస్కూల్స్, పబ్లిక్ ట్రాన్స్పోర్టు అన్నీ తెరిచే ఉంచారు. అక్కడే తేడా కొట్టింది. నిజానికి స్వీడన్ చిన్న ధనిక దేశం.. జనాభా కోటిన్నర మాత్రమే. పార్టీలు, వేడుకలు నిత్యకృత్యం. అయితే ఆ దేశ సగటు ఆయుర్ధాయం 86 ఏళ్లు. దాంతో వృద్ధుల సంఖ్య ఎక్కువ. 65 ఏళ్లపై వయసున్నవారు ఆ దేశ జనాభాలో దాదాపు 24 శాతం ఉన్నారు. ఇలాంటి క్రమంలో హెర్డ్ ఇమ్యూనిటీ విధానం గట్టి దెబ్బకొట్టింది. కేసులు విపరీతంగా పెరిగిపోయి, ఆస్పత్రులు నిండిపోయాయి. అక్కడ తొలి నాలుగు నెలల్లో 3,460 మంది కరోనాతో చనిపోతే.. అందులో 70 ఏళ్లు, ఆపై వయసున్న వారు 2,975 మంది. పరిస్థితి చేయిదాటుతుండటంతో హెర్డ్ ఇమ్యూనిటీ యోచనకు మంగళం పలికి.. లాక్డౌన్ పెట్టారు. జాగ్రత్తలు తెలియక.. ప్రస్తుతం కోవిడ్కు అడ్డుకట్ట వేయాలంటే మాస్కు లు, శానిటైజేషన్, భౌతిక దూరం వంటి నిబంధనలు అమలవుతున్నాయి. కానీ స్పానిష్ ఫ్లూ నాటి పరిస్థితి దీనికి కాస్త భిన్నం. మాస్కులు, భౌతిక దూరం వంటి జాగ్రత్తలు తెలియవు. వైరస్ సోకి ఎవరైనా జ్వరం బారిన పడితే.. వారిని పరామర్శించేందుకు చుట్టుపక్కల జనాలు వచ్చేవారు. ఎవరైనా వైరస్తో చనిపోతే అంతిమ సంస్కారాలకు పెద్ద సంఖ్యలో గుమిగూడేవారు. దీంతో చూస్తూండగానే స్పానిష్ ఫ్లూ దేశం మొత్తం వ్యాపించింది. సరైన వైద్య వసతుల్లేక జనం విలవిల్లాడారు. కొన్ని ఊళ్లలో ఒక్కరు కూడా మిగలకుండా చనిపోయారంటే.. పరిస్థితి ఎంత దారుణంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. ఫలితంగా వైరస్ దేశంలోని ప్రతి గడపనూ తట్టిందని.. ఓ అంచనా ప్రకారం దాదాపు 85 శాతం మంది ప్రజలకు ఫ్లూ సోకిందని నిపుణులు చెప్తున్నారు. మిగతావారిలో రోగనిరోధక శక్తి చాలా బలంగా ఉండటంతో దానిబారిన పడలేదు. అంటే 60 శాతం మందికి వైరస్ సోకితే హెర్డ్ (మూకుమ్మడి) ఇమ్యూనిటీ వచ్చి వైరస్ మాయమవుతుందన్న మాట సరికాదని అంటున్నారు. హెర్డ్ ఇమ్యూనిటీకి ఆధారం లేదు.. ‘‘కోవిడ్ను కట్టడి చేసే క్రమంలో వందేళ్లనాటి స్పానిష్ ఫ్లూను అధ్యయనం చేయడం చాలా అవసరం. దానికి దీనికి చాలా పోలికలున్నాయి. ఆ వ్యాధితో ప్రపంచంలో బాగా దెబ్బతిన్న దేశం మనదే. ఇక్కడ దాదాపు కోటిన్నర మందిని స్పానిష్ ఫ్లూ పొట్టనపెట్టుకుంది. ప్రతి ఇంట్లో వైరస్ జాడ కనిపించింది. అప్పట్లో వైరస్ నియంత్రణ పద్ధతులపై ప్రజల్లో అవగాహన లేక, ఆధునిక వైద్యం లేక భారీగా మరణాలు సంభవించాయి. 60% మందికి సోకితే హెర్డ్ ఇమ్యూనిటీ వస్తుందన్న మాటకు నాటి ఉదంతంలో ఎక్కడా ఆధారాలు లేవు. అందువల్ల ఆ దిశగా యోచించకుండా వ్యాక్సినేషన్ను ముమ్మరం చేయడం, జనం నిబంధనలు పాటించేలా చేయడంపై దృష్టి పెట్టాలి. మ్యుటేషన్స్ వల్ల వ్యాక్సిన్ల పనితనం ఎంతనే విషయంలోనూ పరిశోధనలు సాగాలి.’’ - డాక్టర్ రాజారెడ్డి, ప్రముఖ న్యూరో సర్జన్ -
త్వరలో 18 ఏళ్లకు పైగా వయస్సు ఉన్న వారందరికీ వ్యాక్సిన్
-
భారత్లో కొత్త రకం కరోనా!
న్యూఢిల్లీ: రెండుసార్లు జన్యు మార్పిడి జరిగిన కరోనా వైరస్ను మన దేశంలో గుర్తించినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం ప్రకటించింది. దానితోపాటు పలు ఆందోళనకర వైరస్ రకాలు కూడా వ్యాపిస్తున్నట్టు తెలిపింది. జన్యుక్రమంలో ఓసారి మార్పులు జరిగిన వైరస్లో మరోసారి కూడా జన్యుమార్పిడి జరిగి సరికొత్త రకమైన వైరస్గా మారడం భారత్లోనే కనిపించిందని, ఇతర రకాలు కొన్ని గతంలోనే విదేశాల్లో బయటపడ్డాయని వివ రించింది. ఇటీవల మళ్లీ కరోనా కేసులు పెరిగిపోతుండటానికి ఈ కొత్త వైరస్ రకాలే కారణమా అన్న అంశంపై ఇంకా స్పష్టత లేదని పేర్కొంది. వైరస్ జన్యు క్రమంతోపాటు వ్యాధికి సంబంధించిన పరిశోధనలు కొనసాగుతున్నాయని, పరిస్థితిని విశ్లేషించేందుకు శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారని వివరించింది. ఇన్సాకాగ్ నేతృత్వంలో.. కరోనా వైరస్ జన్యుక్రమాన్ని విశ్లేషించేందుకు కేంద్ర ప్రభుత్వం గతేడాది డిసెంబర్లో ‘ఇండియన్ సార్స్-కోవ్-2 కన్సార్షియం ఆన్ జినోమిక్స్ (ఇన్సాకాగ్)’ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ)తోపాటు దేశంలోని పది జాతీయ పరిశోధనశాలల్లో ఈ పరిశోధనలు చేస్తున్నారు. దేశంలోని పలు ప్రాంతాల నుంచి నమూనాలను సేకరించి వైరస్ జన్యుక్రమాలను నమోదు చేస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారు, వారి సంబంధీకుల నుంచి శాంపిల్స్ సేకరించి, ప్రత్యేకంగా విశ్లేషిస్తున్నారు. జన్యుక్రమాలను గుర్తించడం ద్వారా వైరస్కు సంబంధించిన సమాచారం పూర్తిస్థాయిలో తెలుసుకోవచ్చని.. వ్యాధి చికిత్స, టీకాల తయారీలో ఇది తోడ్పడుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. తెలంగాణలో కొత్త రకాల వ్యాప్తి.. కేరళలోని 14 జిల్లాల నుంచి వచ్చిన 2,032 నమూనాలను విశ్లేషించగా.. రోగ నిరోధక వ్యవస్థ దృష్టి నుంచి తప్పించుకోగల ఎన్440కే రకం వైరస్ 123 నమూనాల్లో కనిపించిందని ఇన్సాకాగ్ వివరించింది. గతంలో ఈ వైరస్ ఆంధ్రప్రదేశ్ నమూనాల్లో 33 శాతం వరకూ ఉండేదని తెలిపింది. తెలంగాణ నుంచి సేకరించిన 104 నమూనాల్లోని.. 53 నమూనాల్లో కొత్త రకాన్ని గుర్తించామని తెలిపింది. బ్రిటన్, డెన్మార్క్, సింగపూర్, జపాన్, ఆస్ట్రేలియా వంటి పదహారు దేశాల్లో ఈ ఎన్440కే రకం వైరస్ వ్యాపించిందని పేర్కొంది. 771 రకాల గుర్తింపు ఇప్పటివరకు 771 రకాల కరోనా వైరస్లను గుర్తించామని, అవన్నీ ఆందోళన కలిగించేవేనని ఇన్సాకాగ్ బుధవారం ప్రకటించింది. దేశవ్యాప్తంగా సేకరించిన మొత్తం 10,787 నమూనాల్లో యూకే రకం వైరస్ను 736 నమూనాల్లో, దక్షిణాఫ్రికా రకం వైరస్ను 34 నమూనాల్లో, బ్రెజిల్ రకం వైరస్ను ఒక నమూనాలో గుర్తించామని తెలిపింది. మహారాష్ట్ర నుంచి సేకరించిన నమూనాలను విశ్లేషించినప్పుడు గతేడాది డిసెంబర్తో పోలిస్తే ప్రస్తుతం.. ఈ484క్యూ, ఎల్452ఆర్ జన్యుమార్పులున్న వైరస్లు ఎక్కువయ్యాయని పేర్కొంది. ఈ రెండు జన్యుమార్పులు రోగ నిరోధక వ్యవస్థ దృష్టి నుంచి తప్పించుకునేందుకు వైరస్కు అవకాశం కల్పిస్తాయని వివరించింది. ఈ జన్యుమార్పులు 15- 20 శాతం నమూనాల్లో ఉన్నట్టు గుర్తించామని.. ఇప్పటిదాకా గుర్తించిన వైరస్లతో వీటికి పోలిక లేకపోవడం ఆందోళన కలిగిస్తోందని తెలిపింది. కొత్త రకం వైరస్ను కట్టడి చేసేందుకు.. విస్తృతంగా పరీక్షలు నిర్వహించడం, పాజిటివ్ వారికి దగ్గరగా వ్యవహరించిన వారిని గుర్తించడం, ఐసోలేషన్లో ఉంచడం, తగిన చికిత్స కల్పించడం అత్యవసరమని స్పష్టం చేసింది. -
అక్కడ కేసులు పెరుగుతున్నా పెద్ద ముప్పేమీ లేదు
సాక్షి, హైదరాబాద్: ఇతర రాష్ట్రాలలో విస్తరిస్తున్నంత వేగంగా తెలంగాణలో కరోనా వైరస్ విస్తరించే అవకాశం తక్కువ అని సీసీఎంబీ డైరెక్టర్ రాకేష్ కె.మిశ్రా చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పటికే 55.5శాతం మందిలో యాంటీ బాడీస్ వృద్ధి చెందినట్లు తమ పరిశోధనలో వెల్లడైందని.. దీనికితోడు ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెరగడం వల్ల ఇక్కడ వైరస్ ఉధృతి తక్కువగా ఉందని పేర్కొ న్నారు. కరోనా వ్యాక్సిన్లు సురక్షితమేనని భరోసా ఇచ్చారు. రెండో డోస్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత 14 రోజులకు యాంటీబాడీస్ ఉత్పత్తి అవుతా యని.. అయితే 20 నుంచి 30% మందిలో తొలి డోసుతోనే వృద్ధి చెందినట్లు గుర్తించామని తెలి పారు. కార్డియాలజీ సొసైటీ ఆఫ్ తెలంగాణ ఆరో వార్షిక సదస్సు శనివారం హైదరాబాద్లో ప్రారంభమైంది. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాలకు చెందిన సుమారు 400 మంది కార్డియాలజిస్టులు దీనికి హాజరయ్యారు. ఈ సదస్సులో రాకేశ్ మిశ్రా ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కరోనా టీకాల కార్యక్రమానికి వైద్య సిబ్బంది నుంచే కాకుండా ప్రజల నుంచి కూడా ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదన్నారు. వ్యాక్సిన్పై అపోహలు అవసరం లేదని, అన్ని వ్యాక్సిన్లు సురక్షితమైనవేనని స్పష్టం చేశారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు టీకా అవసరమన్నారు. జాగ్రత్తలు తప్పనిసరి కోవిడ్ నిబంధనలు సరిగా పాటించకపోవడం వల్లే ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య పెరుగుతోందని రాకేశ్ మిశ్రా చెప్పారు. ప్రజల జీవనోపాధి పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉండటంతోనే ప్రభుత్వం లాక్డౌన్ నిబంధనలు సడలించిందని.. శుభకార్యాలు, తీర్థయాత్రలు, విహారయాత్రల కోసం కాదని పేర్కొన్నారు. వైరస్ పీడ ఇంకా పూర్తిగా తొలగిపోలేదని.. ఈ విషయం తెలియక చాలా మంది సినిమాలు, షికార్లు, పార్టీలు, ఫంక్షన్ల పేరుతో గుమిగూడుతున్నారని చెప్పారు. అలాంటి వారి ద్వారా ఇంట్లో ఉన్న వృద్ధులు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న ఇతర వ్యాధిగ్రస్తులు వైరస్ బారిన పడుతున్నారని వివరించారు. టీకాతో గుండెపోటు ముప్పు ఉండదు కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల హృద్రోగ సమస్యలు తలెత్తుతున్నట్లు వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని కార్డియాలజీ సొసైటీ ఆఫ్ తెలంగాణ సదస్సు నిర్వాహకులు డాక్టర్ కేఎంకేరెడ్డి, డాక్టర్ ఆర్కే జైన్ స్పష్టం చేశారు. టీకా తీసుకున్న తర్వాత కేసులు పెరిగాయనే ప్రచారం అవాస్తవమని స్పష్టం చేశారు. సాధారణ రోజుల్లో ఎంత మంది గుండెపోటుకు గురయ్యారో.. కోవిడ్ టీకా తీసుకున్న తర్వాత అంతే మంది అనారోగ్యం బారిన పడ్డారని వివరించారు. తనతోపాటు చాలా మంది వైద్యులు ఇప్పటికే రెండో డోసు టీకా తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. తమకు ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తలేదని, అంతా ఆరోగ్యంగా ఉన్నామని చెప్పారు. -
హైదరాబాద్లో సగం మందికిపైగా కోవిడ్ నిరోధకత
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సగం మందిలో కోవిడ్ నిరోధక యాంటీబాడీలు ఉన్నట్లు ఓ తాజా అధ్యయనం స్పష్టం చేసింది. సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ), జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్), భారత్ బయోటెక్లు సంయుక్తంగా హైదరాబాద్ వ్యాప్తంగా రక్త పరీక్షలు నిర్వ హించి, విశ్లేషించగా దాదాపు 54% మందిలో కరోనా వైరస్ను అడ్డు కునే యాంటీబాడీలు ఉన్నట్లు తెలిసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 30 వార్డుల్లో దాదాపు 9 వేల మంది నుంచి రక్తం సేకరించి తాము ఈ పరిశోధన నిర్వహించామని, ఒకట్రెండు వార్డులు మిన హాయించి మిగిలిన చోట్ల యాంటీబాడీల మోతాదు దాదాపు ఒకేలా ఉందని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా గురువారం తెలిపారు. అత్యధికంగా కొన్ని వార్డుల్లో 70% జనాభాలో యాంటీబాడీలు కనిపించగా.. కొన్ని వార్డుల్లో 30% మందిలో మాత్రమే యాంటీబాడీలు కనిపించినట్లు తెలిపారు. ఇవీ వివరాలు.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కోవిడ్ వ్యాప్తి, తీవ్రత తదితర అంశాలను అంచనా వేసేందుకు ఈ అధ్యయనం నిర్వహించారు. జనవరి మూడో వారం నుంచి మొదలుపెట్టి 3 వారాల పాటు 9 వేల మంది నుంచి రక్త నమూనాలు సేకరించారు. 10 ఏళ్ల వయసు మొదలుకొని 70 ఏళ్లపైబడిన వారి వరకు నమూనాలు తీసుకున్నారు. జాతీయ పోషకాహార సంస్థ శాస్త్రవేత్తలు, సిబ్బంది నమూనాల సేకరణ చేపట్టగా సీసీఎంబీ అత్యాధునిక శాస్త్ర వ్యవస్థల సాయంతో ఆ నమూనాల్లో యాంటీబాడీల ఉనికి గుర్తించింది. దాదాపు 53 శాతం మంది పురుషుల్లో యాంటీబాడీలు కనిపించగా, మహిళల్లో ఈ సంఖ్య 56 శాతంగా ఉంది. 70 ఏళ్లపైబడ్డ వారిలో 49 శాతం మందిలో మాత్రమే యాంటీబాడీలు ఉన్నాయి. కరోనా కారణంగా వృద్ధులు ఇళ్లకే పరిమితం కావడం వల్ల ఇలా జరిగి ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. కోవిడ్ బారిన పడ్డ వ్యక్తుల కుటుంబాల్లో 78 శాతం మంది కరోనాకు నిరోధకత పెంచుకోవడం గమనార్హం. రోగులతో సంబంధాలు ఉన్న వారిలో 68 శాతం మంది యాంటీబాడీలను కలిగి ఉన్నారు. అంతేకాకుండా గదుల సంఖ్య ఎక్కువగా ఉండి.. సభ్యుల సంఖ్య తక్కువగా ఉన్న కుటుంబాల్లో వ్యాధి బారిన పడ్డవారు తక్కువగా ఉన్నారని జాతీయ పోషకాహార సంస్థ శాస్త్రవేత్త ఎ.లక్ష్మయ్య తెలిపారు. 75 శాతం మందికి తెలియదు.. తమకు కోవిడ్ వచ్చి శరీరంలో యాంటీబాడీలు వృద్ధి చెందినట్లు సర్వేలో పాల్గొన్న 75 శాతం మందికి తెలియలేదని లక్ష్మయ్య తెలిపారు. వైరస్ సోకినా లక్షణాలు లేకపోవడం వల్ల ఇలా జరిగిందని పేర్కొన్నారు. లక్షణాలు ఉన్న వారితో పాటు, లేనివారిలోనూ 54 శాతం మందిలో యాంటీబాడీలు ఉన్నట్లు ఈ పరిశోధన తెలిపిందని వివరించారు. సర్వేలో పాల్గొన్న వారిలో 18 శాతం మందికి గతంలో కోవిడ్ సోకినట్లు తెలుసని, వీరిలో 90 శాతం మందిలో యాంటీబాడీలు గుర్తించామని తెలిపారు. ఇదే మంచి తరుణం.. జనాభాలో 54 శాతం మందిలో యాంటీబాడీలు ఉన్నంత మాత్రాన వైరస్ ప్రమాదం తప్పినట్లేనని అనుకోవద్దని, ఈ పరిస్థితిని అనుకూలంగా మార్చుకుని వైరస్ను అంతమొందించేందుకు అందరూ కలసికట్టుగా ప్రయత్నించాలని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా స్పష్టం చేశారు. జనాభాలో సగం మందిలో యాంటీబాడీలు ఉండటం మంచి విషయమే అయినా.. అలసత్వం పనికిరాదని, టీకాలు వేసుకోవడం ద్వారా కనీసం 80 శాతం మందిలో యాంటీబాడీలు వృద్ధి చెందేలా చూసుకోవాలని తద్వారా మాత్రమే వైరస్ను అంతమొందించొచ్చని స్పష్టం చేశారు. మరికొన్ని నెలల పాటు ముఖానికి మాస్కులు వేసుకోవడం, భౌతిక దూరం పాటించడం, చేతులు తరచూ శుభ్రం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో భారత్ బయోటెక్కు చెందిన శాస్త్రవేత్త కృష్ణ మోహన్ పాల్గొన్నారు. -
సైన్స్ శిఖరం.. పీఎమ్ భార్గవ
శాస్త్రీయ ఆలోచనలు శాస్త్రవేత్తలందరికి ఉంటాయనుకోవడం పొరపాటు. తాము చేసిన పరిశోధనలకు దైవ సహకారం ఉందని బహిరంగంగా ప్రకటించుకునే శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు. ఇస్రో ఉపగ్రహాలని అంతరిక్షములోకి పంపించే ముందు, తర్వాత కూడా విధిగా మన శాస్త్ర వేత్తలు పూజలు చేస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ నిల్వ చేసే పెట్టెలకు కూడా పూజలు చేసే వాటిని ఓపెన్ చేశారు. ఇలాంటి నేపథ్యంలో శాస్త్రీయ దృక్పథంని కల్గి ఉండటమే కాకుండా, సైన్స్ పరిశోధనల విషయంలో పాలకులు తీసుకునే నిర్ణయాలని ఎప్పటికప్పుడు సహేతుకంగా విమర్శించకల్గిన అతి కొద్దిమంది శాస్త్రవేత్తలలో పీఎమ్ భార్గవ ఒకరు. భార్గవ వంటి వ్యక్తిత్వం కల్గిన శాస్త్రవేత్తలు నేడు అరుదుగా కనిపిస్తున్నారు. ఫిబ్రవరి 22, 1928న రాజస్థాన్లోని ఆజ్మీర్లో రామచంద్ర భార్గవ, గాయత్రి భార్గవ దంపతులకు జన్మించారు. ‘జన్యు ఇంజనీరింగ్’ అనే పదాన్ని ఉపయోగించిన మొట్టమొదటి వ్యక్తి ఆయనే. భారతదేశంలో ఆధునిక జీవశాస్త్రం వాస్తుశిల్పిగా ఆయన ప్రసిద్ధి చెందారు. 70లలో బయోటెక్నాలజీ విభాగం ఏర్పాటులో భార్గవ ముఖ్య పాత్ర పోషించారు. హైదరాబాద్ లోని సంభావన ట్రస్ట్, భోపాల్లో బేసిక్ రిసెర్చ్, ఎడ్యుకేషన్ అండ్ డెవెలప్మెంట్ సొసైటీ, న్యూఢిల్లీలోని మెడికల్లీ ఎవేర్ అండ్ రెస్పాన్సిబుల్ పీపుల్స్ వంటి పలు సంస్థలకు చైర్మన్గా కూడా ఆయన ఉన్నారు. 2005 నుండి 2007 వరకు నేషనల్ నాలెడ్జ్ కమిషన్ వైస్ ఛెర్మైన్గా కూడా పనిచేశారు. భార్గవ 100 వరకు జాతీయ, అంతర్జాతీయ స్థాయి గౌరవాలను, అవార్డులను అందుకున్నారు. అలాగే 1986లో ఆయన ప్రతిష్ఠాత్మక పద్మభూషణ్ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. 1998లో లెజియన్ డి హొన్నూర్తో తనను సత్కరించారు. ఇలా ఎన్నో కీర్తి పురస్కారాలను ఆయన అందుకున్నారు. జాతి గర్వించే స్థాయికి ఎదిగారు. ఆయన వివిధ సందర్భాలలో వేలాది ఉపన్యాసాలు ఇచ్చారు, 550 మంది ప్రముఖుల వ్యాసాల సంపుటి, ఆరు పుస్తకాలు కూడా వెలువరించారు. హైదరాబాద్లో సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ సంస్థకి వ్యవస్థాపక డైరెక్టర్గా కూడా పనిచేశారు. ఈ సంస్థ వల్లే హైదరాబాద్ బయోటెక్నాలజీ రంగంలో అంతర్జాతీయంగా పేరు పొందింది. భారతదేశంలో జన్యుమార్పిడి పంటలని వేగంగా, ఎలాంటి శాస్త్రీయ పరిశోధన లేకుండా ప్రవేశ పెట్టడాన్ని వ్యతిరేకించారు. ఈ పంటలు అధిక దిగుబడినిస్తాయి గానీ, వాటిలో పోషక విలువలు ఉండవని తెలిపారు. జ్యోతిష్యం అశాస్త్రీయం అని ఆయన తెలిపారు. హైకోర్టులో వ్యాజ్యం కూడా వేశారు. భోపాల్ గ్యాస్ బాధితులకు అండగా నిలిచారు. దేశంలో పెరుగుతున్న అసహనానికి నిరసనగా ఆయన పద్మభూషణ్ పురస్కారాన్ని వెనక్కి ఇచ్చారు. బయోటెక్నాలజీని వ్యాపారకోణంలో ఉపయోగించడానికి ఆయన అంగీకరించలేదు. ఆయనని ఆధునిక భారతదేశ జీవశాస్త్రపిత అని కూడా పిలుస్తారు. సైన్స్ ఫలాలు పేదవారికి అందాలనేది ఆయన ఆశయం. జనవిజ్ఞాన వేదిక లాంటి సైన్స్ ప్రచార సంస్థలతో ఆయనకు ఎంతో అనుబంధం ఉంది. ఆయన 2017 ఆగస్ట్ 1న తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం సైన్స్ ఉద్యమానికి తీరనిలోటు. - ఎమ్. రామ్ప్రదీప్, జనవిజ్ఞానవేదిక, తిరువూరు మొబైల్: 94927 12836 -
భారత్లో కరోనా రూపాంతరాలు ఎన్నో తెలుసా..?
సాక్షి, హైదరాబాద్: ఒకటి, రెండు కాదు.. భారత్లో ఉన్న కరోనా వైరస్ రూపాంతరాలు ఎన్నో తెలుసా..? ఏకంగా 5 వేల పైమాటే. అవును ఈ విషయాన్ని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ (సీసీఎంబీ) వెల్లడించింది. సీసీఎంబీ శాస్త్రవేత్తలు ఇటీవల ప్రచురించిన పరిశోధనా వ్యాసం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. గతేడాది జనవరి నుంచి ఇప్పటివరకు దేశంలో 5 వేల కంటే ఎక్కువ కరోనా వైరస్లు రూపాంతరం చెందడం ఆందోళన కలిగిస్తోంది. వీటిల్లో వేగంగా వ్యాప్తి చెందగల ఎన్–501–వై, నాశనం చేసేందుకు ఎక్కువ యాంటీబాడీలు అవసరమయ్యే ఈ–484–కేలు కూడా ఉన్నాయి. విస్తృత స్థాయిలో జన్యుక్రమాలను నమోదు చేయకపోవడం వల్ల ఇలాంటివి తక్కువ సంఖ్యలో కనిపిస్తున్నాయని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా శుక్రవారం ఓ ప్రకటనలో వివరించారు. కొన్ని రూపాంతర వైరస్లు కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నాయని, ఎన్–440–కే రకం దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా ఉందని వివరించారు. వైరస్ వ్యాప్తిని అర్థం చేసుకునేందుకు నిఘా ముమ్మరం చేయాలని, కొత్త రూపాంతరాలను వేగంగాగుర్తిస్తే.. అంతే వేగంగా చికి త్సపద్ధతులను అభివృద్ధి చేయొచ్చని వివరించారు. జూన్ కల్లా మార్పు.. ఏడాదిలోనే భారత్లో అన్ని రకాల రూపాంతరాలు ఎలా పరిణామం చెందాయన్న అంశాన్ని సీసీఎంబీ శాస్త్రవేత్తలు తాజా అధ్యయనంలో వివరించారు. గతేడాది జూన్ నాటికి దేశంలో కొంచెం నెమ్మదిగా వ్యాప్తి చెందుతుందనుకున్న ‘ఏ3ఐ’ స్థానంలో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువచోట్ల ఉన్న ‘ఏ2ఏ’ రూపాంతరం వచ్చేసింది. ఇటీవల వెలుగు చూసిన రూపాంతరాల్లో వైరస్ కొమ్ములోనే ఎక్కువ జన్యుమార్పులు చోటు చేసుకున్నట్లు శాస్త్రవేత్త డాక్టర్ దివ్య తేజ్ సౌపాటి తెలిపారు. దేశంలో గుర్తించిన కొన్ని రూపాంతర వైరస్లు పదేపదే వ్యాధికి కారణం అవుతున్నాయని తాము గుర్తించినట్లు తెలిపారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 6,400 వైరస్ జన్యుక్రమాలు మాత్రమే నమోదై ఉన్నాయని, వీటిల్లోనే 5 వేల కంటే ఎక్కువ రూపాంతరాలు ఉన్నాయని అంచనా. కోవిడ్ బారిన పడ్డ వారిలో కనీసం 5 శాతం మందిలోని వైరస్ జన్యుక్రమాలను నమోదు చేసేందుకు కేంద్రం కార్యక్రమం చేపట్టిందని, ఇది వ్యాధి నియంత్రణ, చికిత్సల్లో కీలకం కానుందని డాక్టర్ సురభి శ్రీవాస్తవ తెలిపారు. -
కరోనా వైరస్ గాలిలో ప్రయాణిస్తుంది: సీసీఎంబీ
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ గాలిలో ప్రయాణించగలదని హైదరాబాద్లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ) ప్రకటించింది. చండీగఢ్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైక్రోబియల్ టెక్నాలజీతో కలసి నిర్వహించిన ప్రయోగాల ద్వారా ఈ విషయం స్పష్టమైందని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. హైదరాబాద్, చండీగఢ్లో మూడు చొప్పున ఆసుపత్రుల్లో ప్రయోగాలు నిర్వహించినట్లు చెప్పింది. కోవిడ్, ఇతర వార్డుల నుంచి గాలి నమూనాలు సేకరించి ఆరీ్టపీసీఆర్ విధానంలో పరీక్షలు జరిపినట్లు వివరించింది. (గుడ్న్యూస్.. టీకా పంపిణీకి సిద్ధం ) కోవిడ్ వార్డుల్లోని గాలిలో వైరస్ ఆనవాళ్లు కనిపించాయని, ఇతర వార్డుల నమూనాల్లో కనిపించలేదని తెలిపింది. దీన్ని బట్టి కోవిడ్ నిరోధానికి ఆసుపత్రుల్లో గదుల మధ్య స్పష్టమైన విభజన ఉండాలని తీసుకున్న నిర్ణయం సత్ఫలితాలిచ్చిందని పేర్కొంది. కోవిడ్తో బాధపడుతున్న వారు ఒక గదిలో ఎంత మంది ఉన్నారనే అంశంపై గాలి ద్వారా వైరస్ వ్యాపించేదీ లేనిదీ తెలుస్తుందని, రోగుల్లో లక్షణాల తీవ్రత, గదిలో ఎంతకాలం ఉన్నారనే అంశాలూ ప్రభావం చూపుతాయని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా తెలిపారు. వ్యాధిగ్రస్థులు ఎక్కువ కాలం గడిపిన గదిలో రెండు మీటర్ల కంటే దూరంలోనూ గాల్లో వైరస్ ఆనవాళ్లు కనిపించినట్లు ఈ పరిశోధన వెల్లడించింది. లక్షణాలు లేనివారి నుంచి వైరస్ ఎక్కువ దూరం వెళ్లడం లేదని తాము గుర్తించామని రాకేశ్ మిశ్రా తెలిపారు. టీకా అందుబాటులోకి వచ్చేంతవరకూ భౌతిక దూరం, చేతుల శుభ్రత, మాస్కు ధరించడం చాలా ముఖ్యమని పరిశోధన చెబుతోందని, వైరస్ కొంత కాలమైనా గాల్లో ఉండగలదని తేలడం దీనికి కారణమని ఆయన వివరించారు. (కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న నర్స్ మృతి) -
ఆర్టీపీసీఆర్లో చిక్కని బ్రిటన్ స్ట్రెయిన్..!
సాక్షి, హైదరాబాద్: సాధారణ కరోనా వైరస్ సోకినవారు 7 రోజులు ఐసోలేషన్లో ఉండాలని, బ్రిటన్ స్ట్రెయిన్ కరోనా వైరస్కు 14 రోజులు ఐసోలేషన్ తప్పనిసరని వైద్య, ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు మంగళవారం కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. సాధారణ వైరస్ నుంచి కోలుకున్నవారికి ప్రస్తుతం 7 రోజులు దాటాక లక్షణాలు ఏమీ లేకుంటే ఎలాంటి టెస్టులు చేయకుండానే సాధారణ వ్యక్తులుగా పరిగణిస్తున్నారు. వారి ఐసోలేషన్ కాలం పూర్తయినట్లుగా గుర్తిస్తున్నారు. అయితే బ్రిటన్ స్ట్రెయిన్ విషయంలో 14 రోజులపాటు ఐసోలేషన్లో ఉంచాక వారికి మరోసారి కరోనా పరీక్ష చేస్తారు. అందులో నెగటివ్ వచ్చాకే బాధితులను ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేస్తారు. పాజిటివ్ వస్తే మరికొన్ని రోజులు ఉంచుతారు. ఇక బ్రిటన్ స్ట్రెయిన్ కరోనా వచ్చిన వారిని తప్పనిసరిగా ఆసుపత్రిలోనే ఉంచి వైద్యుల పర్యవేక్షణలో ఉంచుతారు. హోం ఐసోలేషన్కు అనుమతివ్వరు. అయితే ప్రస్తుత సాధారణ కరోనా వైరస్ మాదిరిగానే బ్రిటన్ వైరస్ సోకినవారికి చికిత్స చేస్తారు. బ్రిటన్ వైరస్కు ప్రత్యేక వైద్యం లేదని వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. అలాగే సాధారణ కరోనా వైరస్ వార్డుల్లో బ్రిటన్ వైరస్ బాధితులను ఉంచకూడదని నిర్ణయించారు. బ్రిటన్ వైరస్ సాధారణ వైరస్ రోగులకు వ్యాపించే ప్రమాదం ఉందని ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికోసం రాష్ట్రంలో 12 ఆసుపత్రులను బ్రిటన్ నుంచి వచ్చిన కరోనా బాధితులకు కేటాయించాలని వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ప్రతీ ఉమ్మడి జిల్లా కేంద్రంలో ఒకటి, మిగిలినవి హైదరాబాద్లో ఆయా ఆసుపత్రులను అందుబాటులో ఉంచుతారు. ఉదాహరణకు ప్రస్తుతం బ్రిటన్ నుంచి వచ్చిన కరోనా పాజిటివ్ బాధితుల్లో 14 మందిని హైదరాబాద్ టిమ్స్లో ఉంచారు. మిగిలిన వారిని వివిధ జిల్లాల్లో ఉంచారు. టిమ్స్లో బ్రిటన్ నుంచి వచ్చిన కరోనా బాధితుల కోసం మూడు ఫ్లోర్లు సిద్ధం చేశారు. (చదవండి: కొత్త వైరస్కూ పాత జాగ్రత్తలే ) పోలీస్, రెవెన్యూల సహకారం... బ్రిటన్ నుంచి వచ్చే వారి వివరాలను ఎప్పటికప్పుడు గుర్తించేందుకు పోలీసు, రెవెన్యూ సహా ఇతర శాఖల సహకారం తీసుకోవాలని వైద్య, ఆరోగ్యశాఖ కార్యాచరణ ప్రణాళికలో పేర్కొంది. కరోనా వైరస్ వచ్చిన మొదట్లో ఎలాంటి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారో ఇప్పుడు కూడా బ్రిటన్ వైరస్ పట్ల అలాగే వ్యవహరించాలని నిర్ణయించింది. బ్రిటన్ స్ట్రెయిన్ వచ్చిన బాధితులు ఎవరెవరిని కలిశారో వారి మొదటి, రెండు, మూడు కాంట్రాక్టు వ్యక్తులను గుర్తిస్తారు. ఒకవేళ కేసులు పెరిగితే మొదట్లో మాదిరిగానే కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. వైరస్కు వేగంగా విస్తరించే గుణం ఉన్నందున అంతే వేగంగా బాధితులను గుర్తించాల్సి ఉందని కార్యాచరణ ప్రణాళికలో వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఆర్టీపీసీఆర్లో చిక్కని బ్రిటన్ స్ట్రెయిన్... బ్రిటన్ వైరస్ ప్రస్తుత సాధారణ పరీక్షల్లో కనుగొనే వీలే లేదని తేలిపోయింది. ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు సాధారణ కరోనాను నిర్ధారించడానికే పరిమితమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. బ్రిటన్ స్ట్రెయిన్ ఉందా.. లేదా.. తెలుసుకోవాలంటే ముందుగా వారిలో సాధారణ కరోనా వైరస్ ఉందా.. లేదా.. తెలుసుకునేందుకు ఆర్టీపీసీఆర్ పరీక్ష చేస్తారు. అందులో పాజిటివ్ వస్తే బ్రిటన్ స్ట్రెయిన్ వైరస్ ఉందో.. లేదో.. తెలుసుకునేందుకు సీసీఎంబీ వంటి ప్రతిష్టాత్మక పరిశోధనాత్మక సంస్థల్లో జీనోమ్ సీక్వెన్సీ (జన్యు విశ్లేషణ) చేయాల్సిందేనని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఒకవేళ బ్రిటన్ స్ట్రెయిన్ వైరస్ విస్తరిస్తే దాన్ని గుర్తించేందుకు రాష్ట్రంలో నిమ్స్లో జీనోమ్ సీక్వెన్సీ టెస్టింగ్ మెషీన్ను నెలకొల్పాలని భావిస్తున్నారు. దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. బ్రిటన్ స్ట్రెయిన్ కరోనా వైరస్ను గుర్తించాలంటే జీనోమ్ సీక్వెన్సీతోపాటు ఆర్టీపీసీఆర్ టెస్ట్ కిట్లలో మార్పులు చేయాల్సి ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. బ్రిటన్ స్ట్రెయిన్ కరోనా వైరస్ విస్తరించకుండా జిల్లాల్లో అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ జిల్లాల అధికారులను ఆదేశించింది. -
కొత్త వైరస్కూ పాత జాగ్రత్తలే
సాక్షి, హైదరాబాద్: రూపాంతరం చెందిన కరోనా వైరస్ను అడ్డుకునేందుకు కూడా ఇప్పటివరకు పాటిస్తున్న జాగ్రత్తలను కొనసాగిస్తే చాలని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ మంగళవారం స్పష్టం చేసింది. ‘వీయూఐ 202012/1’ లేదా బీ.1.1.7 అని పిలుస్తున్న ఈ రూపాంతరిత వైరస్ యూరోపియన్ దేశాల్లో వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో సీసీఎంబీ ప్రకటనకు ప్రాధాన్యం ఏర్పడింది. కొత్త వైరస్ వ్యాప్తి నిరోధానికి ఇప్పటివరకు పాటిస్తున్న జాగ్రత్తలు అంటే మాస్కులు ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం, జనసమ్మర్ధం ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు వెళ్లకుండా ఉండటం చాలని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా వెల్లడించారు. వైరస్ జన్యుక్రమంపై విస్తృతస్థాయిలో నిఘా పెట్టాల్సిన అవసరం ఇప్పుడు వచ్చిందని, ఎంతమేరకు వ్యాప్తి చెందిందన్నది తెలుసుకునేందుకు ఇది కీలకమని చెప్పారు. (చదవండి: ఆరుగురికి ‘యూకే’ వైరస్) ఇక బ్రిటన్ నుంచి భారత్కు వచ్చిన సుమారు 33 వేల మందిని గుర్తించి, పరీక్షించడం ద్వారా ఈ కొత్త రకం వైరస్ ఇక్కడ కూడా ఉందని తెలిసిందని సీసీఎంబీ శాస్త్రవేత్త డాక్టర్ దివ్య తేజ్ సౌపతి తెలిపారు. ఈ వైరస్లో మొత్తం 17 జన్యుమార్పులుండగా, ఎనిమిదింటి ప్రభావం దాని కొమ్ముపై ఉంటుందన్నారు. అత్యాధునిక జీన్ సీక్వెన్సింగ్ పరికరాల సాయంతో వైరస్ జన్యుక్రమాన్ని విశ్లేషించామని వివరించారు. ఈ మార్పులు వ్యాధి తీవ్రతను, లక్షణాలను ఎక్కువ చేయలేదని తెలిపారు. అంతేకాకుండా వ్యాక్సిన్ అభివృద్ధికి ఈ కొత్త రకం వైరస్ అడ్డు కాబోదని స్పష్టం చేశారు. వైరస్ గుర్తింపు పరీక్షలోనూ ఎలాంటి మార్పు అవసరం లేదని అభిప్రాయపడ్డారు. -
యూకే స్ట్రెయిన్ ప్రమాదకరం కాదు: సీసీఎంబీ
సాక్షి, హైదరాబాద్ : బ్రిటన్ స్ట్రెయిన్పై ఉత్కంఠ కొనసాగుతోంది. యూకేలో కొత్త రకం కరోనా వైరస్ వెలుగుచూడటంతో అక్కడి నుంచి అనేక మంది భారత్కు తిరిగి వచ్చారు. ఈ క్రమంలో అక్కడి నుంచి వచ్చినవారిని గుర్తించి వైరస్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. వీరిలో కొందరికి పాజిటివ్గా తేలగా, ఈ వైరస్ యూకే రకానికి చెందిందా లేదా అనే విషయం తెలుసుకునేందుకు సీసీఎంబీకి శాంపిళ్లు పంపించారు. ఈ పరిశోధనలో యూకే స్ట్రెయిన్ ప్రమాదకరం కాదని సీసీఎంబీ వెల్లడించింది. కానీ వేగంగా విస్తరిస్తోందని తెలిపింది. స్ట్రెయిన్ను B.1.1.7 రకం కరోనా వైరస్గా సీసీఎంబీ పేర్కొంది. స్ట్రెయిన్కు 71శాతం వేగంగా వ్యాపించే శక్తి ఉందని తెలిపింది. స్ట్రెయిన్ 17 రకాల పరివర్తన కలిగి ఉందని పేర్కొంది. చదవండి: ఫ్లైట్ దిగారు.. పత్తా లేరు -
లే'టెస్ట్' డ్రై స్వాబ్..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) కరోనా వ్యాధి నిర్ధారణకు అభివృద్ధి చేసిన ఓ వినూత్న పద్ధతికి భారత వైద్య పరిశోధన సమాఖ్య (ఐసీఎంఆర్) గుర్తింపు లభించింది. కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి వైరస్ నమూనాలను సీసీఎంబీలో పరీక్షిస్తుండగా... ఆయా పరీక్షా పద్ధతుల్లో చోటుచేసుకుంటున్న లోటుపాట్లను సవరిస్తూ శాస్త్రవేత్తలు కొత్త పద్ధతిని రూపొందించారు. ప్రస్తుతం కరోనా అనుమానితులకు చేసే పరీక్షల్లో భాగంగా ముక్కు లేదా గొంతు లోపల స్వాబ్స్ను ఉంచి శరీర ద్రవాల నమూనాలు సేకరించి వాటిని పరీక్ష కేంద్రాలకు తరలిస్తున్నారు. రవాణా సమయంలో స్వాబ్స్ను వైరల్ ట్రాన్స్పోర్ట్ మీడియం (వీటీఎం) పేరున్న ద్రావణంలో ఉంచుతున్నారు. అయితే ఈ ద్రావణం బయటకు రాకుండా నమూనాలను ప్యాక్ చేసే క్రమంలో ఎంతో సమయం వృధా అవుతోందని సీసీఎంబీ శాస్త్రవేత్తలు గుర్తించారు. పైగా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొన్ని సందర్భాల్లో వీటీఎం లీక్ అవుతున్నట్లు కూడా తెలిసింది. దీనివల్ల ఆయా నమూనాలు పరీక్షించేందుకు పనికిరాకుండా పోవ డమే కాకుండా అవి ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుందని తేలింది. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టిన సీసీఎంబీ... వీటీఎంను పూర్తిగా నివారించవచ్చని గుర్తించింది. పొడిగా ఉండే స్వాబ్ ద్వారా రైబోన్యూక్లిక్ యాసిడ్ (ఆర్ఎన్ఏ)ను వేరు చేయాల్సిన అవసరం కూడా రాదని, నేరుగా ఆర్టీ–పీసీఆర్ పరీక్షలు జరపవచ్చని శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు. ఈ పద్ధతిని ఇప్పుడు ఐసీఎంఆర్ కూడా గుర్తించింది. ఆర్ఎన్ఏ వెలికితీతకు తగిన సౌకర్యాలు లేనిచోట ఈ పద్ధతిని వాడవచ్చని తెలిపింది. సమయం కలిసొస్తుంది: డాక్టర్ రాకేశ్ మిశ్రా సీసీఎంబీ అభివృద్ధి చేసిన డ్రై స్వాబ్ టెక్నిక్ ద్వారా కరోనా పరీక్షల్లో ఎంతో సమయం ఆదా అవుతుందని సంస్థ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా తెలిపారు. ఆటోమేషన్ పద్ధతిలో నిర్వహించే ఆర్ఎన్ఏ వెలికితీత కోసం 500 నమూనాలకు సుమారు 4 గంటల సమయం పడుతుందని ఆయన చెప్పారు. వీటీఎం, ఆర్ఎన్ఏ వెలికితీత వల్ల ఖర్చులు, ఫలితాల వెల్లడికి పట్టే సమయం పెరిగిపోతాయని, భారీ సంఖ్యలో నమూనాలను పరీక్షించాల్సిన పరిస్థితుల్లో వాటిని పరిహరించేందుకు కొత్త పద్ధతి ఉపయోగపడుతుందని వివరించారు. డ్రై స్వాబ్ టెక్నిక్ను వాడటం ద్వారా పరీక్షల ఖర్చు 40–50 శాతం తగ్గుతుందని తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యవస్థల ద్వారానే కొత్త రకం పరీక్షలను నిర్వహించగలగడం మరో విశేషమన్నారు. -
మాస్కే మన వ్యాక్సిన్
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ నిరోధానికి టీకాపై అతిగా ఆధారపడటం తగదని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) డైరెక్టర్ రాకేశ్ మిశ్రా స్పష్టం చేశారు. టీకా రాకపోయినా దాన్ని ఎదుర్కోవడం ఎలా అనే దానిపై దృష్టి పెట్టాలని సూచించారు. వ్యాక్సిన్ కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రయోగాలు తుది దశలో ఉన్నప్పటికీ వాటి సామర్థ్యం తెలియాలంటే మరికొంత సమయం పడుతుందని అటల్ ఇంక్యుబేషన్ సెంటర్లో జరిగిన ఓ కార్యక్రమంలో చెప్పారు. ‘సమర్థంగా పనిచేసే టీకా అందుబాటులోకి వస్తే సరి. లేదంటే భౌతిక దూరం, చేతులు శుభ్రం చేసుకోవడం బహిరంగ ప్రదేశాల్లో మాస్కు వేసుకోవడం వంటి చర్యల ద్వారా వ్యాప్తిని అడ్డుకోవచ్చు’అని వివరించారు. ముఖానికి తొడుక్కునే మాస్క్.. వ్యాక్సిన్ లాంటిదే అనే విషయం గుర్తించాలని పేర్కొన్నారు. కరోనా రక్షణ చర్యలన్నీ పాటిస్తే కొంత కాలానికి నిరోధకత ఏర్పడుతుందని, తద్వారా సహజ సిద్ధంగానే వైరస్కు చెక్ పెట్టొచ్చని చెప్పారు. అతి తక్కువ సమయంలో ఆ మహమ్మారిని ఎదుర్కొనేందుకు పలు విధానాలు అందుబాటులోకి రావడం, అందరూ కలసికట్టుగా కృషి చేయడం ఇందుకు నిదర్శనమన్నారు. ఒకవేళ టీకా అందుబాటులోకి వచ్చినా దేశంలోని ప్రతి ఒక్క పౌరుడికి అందించేందుకు కనీసం ఏడాది సమయం పడుతుందని పేర్కొన్నారు. అలాగే టీకా ఇచ్చినా దాని ప్రభావం ఎంత కాలం పాటు ఉంటుందో కూడా తెలియదని, ఆ విషయం తెలుసుకునేందుకు కనీసం రెండేళ్లు పడుతుందని వివరించారు. అప్పటివరకూ ప్రస్తుతం పాటిస్తున్న అన్ని రకాల జాగ్రత్తలను కొనసాగించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ‘మిషన్’కు రూ. 50 వేల కోట్లు! న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత దేశ ప్రజలకు అందజేయడానికి కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ.50వేల కోట్లు కేటాయించినట్లు సమాచారం. ఒక్కో వ్యక్తికి వ్యాక్సిన్ ఇవ్వడానికి 6 నుంచి 7 డాలర్ల వరకు ఖర్చవుతుందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేసినట్లు తెలుస్తోంది. భారత్లో ప్రస్తుత జనాభా 130 కోట్ల పైమాటే. వ్యాక్సినేషన్ మిషన్కు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం రూ.50 వేల కోట్లు కేటాయించిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కరోనా టీకాలను ప్రజలందరికీ అందజేసే విషయంలో ఖర్చుకు ప్రభుత్వం వెనుకాడబోదని వెల్లడించాయి. భారత్లో ఒక్కో టీకా డోసుకు 2 డాలర్ల చొప్పున ఖర్చు కానుందని అంచనా. ఒక్కో వ్యక్తికి రెండు డోసుల చొప్పున ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఒక్కొక్కరికి 4 డాలర్లు ఖర్చవుతాయి. వ్యాక్సిన్ రవాణా, నిల్వ కోసం మరో 3 డాలర్లు అవసరం. మొత్తంమీద ఒక్కో పౌరుడిపై ప్రభుత్వం 7 డాలర్ల (రూ.515) చొప్పున వ్యయం చేయనుంది. -
కరోనా వ్యాక్సిన్పై సంచలన ప్రకటన
సాక్షి, హైదరాబాద్ : ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తున్న ప్రాణాంతక కరోనా వైరస్ విరుగుడును కనిపెట్టేందుకు శాస్త్రవేత్తలు రేయింబవళ్లు కష్టపడుతున్నారు. వ్యాక్సిన్ తయారీ కోసం ప్రపంచ దేశాలన్నీ తీవ్రంగా కృషి చేస్తున్నాయి. పలు దేశాల్లో తొలి దశ ప్రయోగాలను పూర్తి చేసుకుని చివరి దశ ప్రయోగాల్లో ఉంది. మరోవైపు కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది ప్రజలకు ఎదురచూస్తున్నారు. లక్షలాది మంది ప్రజలకు బలి తీసుకున్న మహమ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సిన్ను వీలైనతం త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు. రానున్న కొత్త ఏడాది ప్రథమార్థంలో వ్యాక్సిన్ను అందుబాటులోకి తీసుకువస్తామని ప్రభుత్వాలు సైతం ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యూలర్ బయాలజీ (సీసీఎంబీ) సంచలన ప్రకటన చేసింది. చాలా దేశాల్లో వ్యాక్సిన్ తయారీ ప్రస్తుతం ప్రయోగాల దశలోనే ఉందని, వాటన్నింటినీ పూర్తి చేసుకుని అందుబాటులోకి రావాంటే మరో ఏడాది సమయం పటుడుతుందని తెలిపింది. ఈ మేరకు సీసీఎంబీ సీఈవో మదుసూధన్రావు ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ గురువారం ఈ వ్యాఖ్యలు చేశారు. కరోనా కేసులు మాత్రమే తగ్గాయి, తీవ్రత తగ్గలేదని అన్నారు. వైరస్ విజృంభణ ఇలానే కొనసాగితే మరోసారి దేశంలో లాక్డౌన్ విధించక తప్పదని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ మాస్క్లు ధరించాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రస్తుతం తయారువుతున్న వ్యాక్సిన్స్లో ఏది ఏవిధంగా పనిచేస్తుందో కూడా చెప్పలేమని ఆయన అభిప్రాయపడ్డారు. కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాల్లో చాలా కష్టపడుతున్నాయని, కానీ అనుకున్నంత సామన్యంగా అందుబాటులోకి రాదని పేర్కొన్నారు. -
పరీక్షల్లో 12 ఔషధాలు
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ని ఎదుర్కొనేందుకు ఒకవైపు టీకా తయారీ ప్రయత్నాలు జోరుగా సాగుతుం డగా, మరోవైపు ఇప్పటికే వ్యాధి బారినపడ్డ వారికి చికిత్స అందించే దిశగా హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) సిద్ధమవుతోంది. ఈ క్రమం లో ఇప్పటికే పలు వైరల్ వ్యాధుల చికిత్స ఉపయోగిస్తున్న మందులు కోవిడ్కూ పనికొస్తాయేమోనని పరిశీలిస్తోంది. వీటిల్లో స్మాల్పాక్స్ కోసం వాడే మందులతోపాటు మరో 11 మందు లు ఉన్నట్లు తెలిసింది. స్మాల్పాక్స్ మందు, ఉబ్బసం రోగులకు ఇచ్చే యాంటీ ఇన్ఫ్లమేటరీ మందు ఒకటి కరోనాను ఎదుర్కోవడంలో ఉపయోగపడుతున్నట్లు ప్రాథమిక అంచనాల ద్వారా తెలిసింది. ఎంపిక చేసిన మందులు కరోనా రోగుల్లో ఎంతవరకు సురక్షితమనే విషయంలో ఇప్పటికే తొలి రెండు దశల ప్రయోగాలు పూర్తి కాగా, మూడో దశ ప్రయోగాల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మందులు జంతువులతోపాటు మనుషులపై కూడా ఎలాంటి దుష్ప్రభావాలు చూపలేదని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా తెలిపారు. ప్రైవేట్ కంపెనీల్లోనూ ఈ మందులపై కొన్ని ప్రయోగాలు జరుగుతున్న కారణంగా వాటి పేర్లను వెల్లడించలేమన్నారు. కరోనాకు వ్యతిరేకంగా వీటి సామర్థ్యం నిరూపితమైతే ఆయా కంపెనీలు తయారీ కోసం డ్రగ్ కంట్రోలర్కు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. వీటిని కోవిడ్ కారక వైరస్పై కూడా ప్రయోగించి చూస్తున్నట్లు తెలి సింది. తద్వారా వ్యాధి ముదిరిన వారి ని కూడా ఈ మందుల ద్వారా రక్షించగలమా? అన్నది నిర్ధారించుకుంటోంది. మందుల తయారీకి సెల్ కల్చర్ కరోనా దేశంలో అడగుపెట్టినప్పటి నుంచి సీసీఎంబీ తక్కువ ఖర్చుతో వ్యాధి నిర్ధారణకు సరికొత్త పరీక్షలు సిద్ధం చేయడంతోపాటు కరోనా వైరస్తో కూడిన కణాలను పరిశోధనశాలలోనే అభివృద్ధి చేసి పలు ఫార్మా కంపెనీలకు అందించిన విషయం తెలిసిందే. వ్యాక్సిన్ తోపాటు చికిత్సకు అవసరమయ్యే మందుల తయారీకి కూడా ఈ సెల్ కల్చర్ ఎంతో ఉపయోగపడుతుంది. కరోనా వ్యాధి చికిత్స కోసం ప్రస్తుతం హైడ్రాక్సీ క్లోరోక్విన్తోపాటు రెమిడెస్విర్, ఫావాపిరవిర్ వంటి అనేక మందులు ప్రయోగాత్మకంగా ఉపయోగిస్తున్నారు. ఈ వ్యాధి కోసమే ప్రత్యేకమైన మందులు లేకపోవడం దీనికి కారణం. అందుకే సీసీఎంబీ ఇప్పటికే ఇతర వ్యాధుల కోసం అభివృద్ధి చేసిన మందులను కోవిడ్–19కూ పనికొస్తాయా? అన్నది పరిశీలిస్తోంది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఆవ్రా ల్యాబ్స్తోపాటు మరికొన్ని ఇతర ప్రాంతాల కంపెనీలు ఈ మందులను పరీక్షించాల్సిందిగా సీసీఎంబీకి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మందులు కరోనాపై కూడా సమర్థంగా పనిచేస్తే... పేటెంట్లేవీ లేని నేపథ్యంలో వీటిని చాలా చౌకగా ఉత్పత్తి చేసి అందరికీ అందించవచ్చునని అంచనా. -
శాస్త్రీయతే సరైన సమాధానం
సాక్షి, హైదరాబాద్: కరోనా నియంత్రణకు కేరళలో ఆయుర్వేదం.. తమిళనాడులో సిద్ధ.. చైనాలోనూ సంప్రదాయ వైద్యంతో మెరుగైన ఫలితాలు. తాజాగా రోగనిరోధక శక్తిని పెంచుతుందంటూ పతంజలి సంస్థ తయారీ కరోనిల్.. ఇదంతా బాగానే ఉంది. మరి మన పెరటి చెట్టు.. అంటే ఆయుర్వేదం కరోనా చికిత్సకు ఎందుకు ఉపయోగపడదు?. ఒకవేళ ఎవరైనా ఆయుర్వేద మందుతో కరోనాను పారదోలవచ్చనగానే.. అది శాస్త్రీయమైంది కాదనే విమర్శలెందుకు వస్తున్నాయి? వేల ఏళ్లుగా భారతీయ సంస్కృతిలో భాగమైన ఆయుర్వేదం శాస్త్రీయ వైద్యం కంటే తీసికట్టైందా? ఆసక్తికరమైన ఈ ప్రశ్నలకు సమాధానం కనుక్కునేందుకు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రాను ‘సాక్షి’ సంప్రదించింది. దీనిపై ఆయన ఏమన్నారంటే.. శాస్త్రీయంగా విశ్లేషించాలి.. ఆయుర్వేదమైనా, మరే ఇతర సంప్రదాయ వైద్యవిజ్ఞానమైనా వందల ఏళ్ల పరిశీలన, అనుభవాల విశ్లేషణ ఫలితంగా పుట్టుకొచ్చినవే. ఆధునిక వైద్య విధానం స్థూలమైన అంశాలను కాకుండా అత్యంత సూక్ష్మస్థాయిలో పరిశీలనలు చేసి ఫలితాలను రాబడుతుంది. అలాగని ఆయుర్వేదం పనికిరాదని కాదు. నిజానికి భారతీయులు గర్వించదగ్గ వైద్య విధానమిది. కాకపోతే శంఖంలో పోస్తేనే తీర్థమవుతుందన్నట్లు ఈ ప్రాచీన పద్ధతులను, మందులను కూడా శాస్త్రీయ వైద్యం కాటాలో తూచాల్సి ఉంటుంది. ఒక్క కరోనాకు మాత్రమే కాదు, అన్ని రుగ్మతలకు సంప్రదాయ వైద్య విజ్ఞానం అందించే పరిష్కారాలేమిటో గుర్తించి వాటిని శాస్త్రీయంగా విశ్లేషించి నిజానిజాలను నిగ్గుతేలిస్తే ప్రజలకు చౌకగా, సమర్థమైన చికిత్సలు అందించడం వీలవుతుంది. అంతేకాదు.. కృత్రిమ రసాయనాల స్థానంలో ప్రకృతిలోని మొక్కల నుంచి వనరులను సేకరించే పరిస్థితి ఏర్పడితే రైతులకూ లాభమే. ఆయుర్వేద మందుల్లో కొన్ని వందల మూలకాలుంటాయి. వీటిలో ఏది చికిత్సలో ఉపయోగపడుతుందో? ఏది కాదో తేల్చడం కష్టం. బహుశా అందువల్లే ఆయుర్వేద వైద్యం కొంత అననుకూల పరిస్థితులను ఎదుర్కొంటుందేమో. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్న పరిశోధనా సంస్థలు, ప్రైవేట్ ఫార్మా కంపెనీలు చొరవ తీసుకుని శాస్త్రీయంగా ఆయుర్వేద మందులను విశ్లేషించాలి. పొరుగున ఉన్న చైనా ఇప్పటికే ఈ పనిని విజయవంతంగా చేస్తోంది. ఆయుర్వేదం, ఇతర సంప్రదాయ వైద్య విధానాల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ తగిన ఏర్పాట్లు చేయడం కూడా అవసరం. పరీక్షించకుండానే మందు అనలేం ప్రస్తుత కరోనా కష్టకాలంలో పతంజలి కరోనిల్ పేరుతో ఒక మందును తెచ్చింది. దీనిపై ఎలాంటి పరీక్షలు జరిగాయో ఎవరికీ తెలియదు. ఆయుర్వేద విధానంలోని మందులు ఎంతో విలువైనవి. ఇందులో సందేహం లేదు. అయితే వీటి తయారీకి ప్రామాణిక పద్ధతులు, వాడిన రోగులకు సంబంధించిన సమాచారం లేకపోతే దుర్వినియోగమయ్యే అవకాశాలెక్కువ. ఫలితంగా ఆయుర్వేదానికే ఎక్కువ నష్టం. పతంజలి ఉత్పత్తి కరోనిల్ ఉపయోగపడవచ్చు. కానీ దీన్ని ఉపయోగించే ముందు పరీక్షలు మాత్రం తప్పనిసరిగా జరగాల్సిందే. మనమిచ్చే మందు వల్ల రోగికి మేలు జరగకున్నా.. హాని జరగకూడదు. అందుకే ఈ పరీక్షలు అవసరం. మందులు తీసుకున్న వారు ఇతరుల కంటే మెరుగ్గా ఉన్నారని నిరూపించాలి కూడా. ఇలాంటి పరీక్షలు జరపకపోవడం వల్ల మనం మన వారసత్వాన్ని పోగొట్టుకుంటున్నట్లే. సీసీఎంబీ, ఇతర పరిశోధన సంస్థల్లో కణస్థాయిలో పరీక్షలు చేసేందుకు తగిన ఏర్పాట్లున్నాయి. వీటిని ఉపయోగించుకుని ఆయుర్వేద మందులను పరీక్షించవచ్చు. కరోనా విషయాన్నే తీసుకుంటే ఫలానా మందు నేరుగా వైరస్ను చంపుతుందని చెబితే దాన్ని పరీక్షించి నిర్ధారించవచ్చు. అలాకాక పరోక్ష పద్ధతుల్లో పనిచేసి అంటే రోగ నిరోధకశక్తిని పెంచడం ద్వారా వ్యాధిని నియంత్రిస్తుంటే మాత్రం ప్రత్యేక పద్ధతులను అవలంబించాల్సి ఉంటుంది. -
ప్రజారోగ్యానికే ప్రాధాన్యం
న్యూఢిల్లీ: కరోనాని కట్టడి చేయడానికి వ్యాక్సిన్ రూపకల్పనలో భారత్ పురోగతి సాధించడంతో ప్రపంచ దేశాల దృష్టి భారత్పై పడింది. ఈ వ్యాక్సిన్ను ఆగస్టు 15నాటికి అందుబాటులోకి తెస్తామన్న ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) చేసిన ప్రకటనపై సందేహాలు వెల్లువెత్తాయి. హైదరాబాద్లోని భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న కొవాగ్జిన్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ని ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో నిర్వహించాలని ఆగస్టు 15 వరకు గడువు ఇస్తూ ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ్ రాసిన లేఖ బయటకి వచ్చి వివాదాస్పదమైంది. అంత త్వరగా వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం ఆచరణ సాధ్యం కాదని చాలా మంది వైరాలజిస్టులు తేల్చేయడంతో ఐసీఎంఆర్ వివరణనిచ్చింది. అంతర్జాతీయ నిబంధనలకు లోబడే ఫాస్ట్ ట్రాక్ ప్రయోగాలు చేస్తున్నామని శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. అధికారికంగా అనుమతుల మంజూరులో జాప్యాన్ని నివారించడానికే ఫాస్ట్ ట్రాక్ పద్ధతి అవలంబిస్తున్నామని స్పష్టం చేసింది. ప్రజారోగ్య ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకునే ప్రక్రియని వేగవంతం చేశామని తెలిపింది. ఈ ఏడాది వ్యాక్సిన్ రాదు: సీసీఎంబీ కోవిడ్ వ్యాక్సిన్ ఈ ఏడాది వచ్చే అవకాశాల్లేవని సీఎస్ఐఆర్–సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మొలెక్యులర్ బయోలజీ (సీసీఎంబీ) డైరెక్టర్ రాకేశ్ కె మిశ్రా చెప్పారు. వ్యాక్సిన్ అభివృద్ధిలో జరిగే ప్రక్రియలో పెద్ద సంఖ్యలో క్లినికల్ ట్రయల్స్ జరగాల్సి ఉంటుందని వచ్చే ఏడాది లోపు అది పూర్తి చెయ్యడం సాధ్యం కాదని అన్నారు. వ్యాక్సిన్ ప్రయోగాలను పక్కా ప్రణాళికతో ముందుకు తీసుకువెళ్లినప్పటికీ ఆరు నుంచి ఎనిమిది నెలలు పడుతుందని అన్నారు. ఎందుకంటే వ్యాక్సిన్ను అత్యంత ఎక్కువ మందిపై ప్రయోగాలు చేయాల్సి ఉంటుందని అన్నారు. వ్యాక్సిన్ అంటే అదేదో మందు కాదని, అది వేశాక తగ్గిపోతుందో లేదో చూడడానికని మిశ్రా అన్నారు. మానవ ప్రయోగాలకి 12–18 నెలలు మొత్తం మూడు దశల్లో క్లినికల్ ట్రయల్స్ జరుగుతాయి. మొదటి దశలో వ్యాక్సిన్ మనుషులకి సురక్షితమా కాదా అని తెలుసుకోవడానికి చాలా తక్కువ మందిపై ప్రయోగించి చూస్తారు. రెండో దశలో అన్ని వయసుల వారికి వ్యాక్సిన్ ఎలా పని చేస్తుందో చూస్తారు. ఇక మూడో దశలో కొన్ని నెలల పాటు ఈ వ్యాక్సిన్ సమర్థతను పరీక్షించి చూస్తారు. ఈ దశలో వేలాది మంది పాల్గొనాల్సి ఉంటుంది. అన్ని రకాలుగా వ్యాక్సిన్ పనిచేస్తోందని నిర్ధారణయ్యాకే ప్రజలకి టీకాని అందుబాటులోకి తెస్తారు. ఒక వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటు రావాలంటే కనీసం 12–18 నెలల కాలం పడుతుందని కోల్కతాకు చెందిన వైరాలజిస్టు ఉపాసన రే అన్నారు. -
తక్కువ ధరలో కరోనా టెస్టింగ్ కిట్
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ నిర్థారణ కోసం అతి తక్కువ ధరలో, తక్కువ సాంకేతికత అవసరమయ్యే ఒక టెస్టింగ్ కిట్ను సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) రూపొందించింది. ఈ టెస్టింగ్ కిట్ ధర ప్రస్తుత్తం కరోనా వైరస్ను పరీక్షించడానికి ఉపయోగిస్తున్న రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ పాలిమరేస్ చైన్ రియాక్షన్ (RT-qPCR) ధర కంటే చవకైనది. దీనిని రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ నెస్టెడ్ పీసీఆర్ (RT-nPCR) పరీక్షగా వ్యవహరిస్తున్నారు. కొత్తగా రూపొందించిన ఈ కిట్ను ఉపయోగించడానికి ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్ అనుమతి పొందాల్సి ఉంది. ప్రస్తుతం కరోనా వైరస్ పరీక్షల కోసం రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ పాలిమరేస్ చైన్ రియాక్షన్ (RT-qPCR) టెస్ట్ చేయడానికి మాత్రమే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సిఫార్స్ చేసింది. (భారీ ఊరట : మరణాల రేటు అత్యల్పం) ప్రస్తుతం ఉపయోగిస్తున్నఆర్టీ- క్యూపీసీఆర్(RT-qPCR) కిట్ను కొత్తగా రూపొందించిన ఆర్టీ-ఎన్పీసీఆర్ (RT-nPCR) తో పోల్చి చూస్తే 50 శాతం తక్కువ సామార్థ్యం కలిగి ఉందని సీసీఎంబీ పరిశోధకులు డాక్టర్ రాకేశ్ మిశ్రా తెలిపారు. పాత టెస్టింగ్ కిట్ ఆర్టీ- క్యూపీసీఆర్(RT-qPCR) ద్వారా పరీక్షించిన కరోనా వైరస్ నమూనాలను కొత్తగా రూపొందిచిన కిట్తో పరీక్షించగా 90 శాతం పాజిటివ్గా తేలాయన్నారు. మరోవైపు పాత టెస్టింగ్ కిట్ ఆర్టీ- క్యూపీసీఆర్(RT-qPCR) ద్వారా నెగిటివ్ అని తేలిన 13 శాతం నమూనాలు కూడా పాజిటివ్ ఫలితాలను చూపించాయన్నారు. దీని బట్టి చూస్తే ప్రస్తుతం ఉపయోగిస్తున్న టెస్టింగ్ కిట్ల ద్వారా పరీక్షిస్తే కొన్ని కరోనా పాజిటివ్ కేసులు తప్పుగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని రాకేష్ మిశ్రా తెలిపారు. కొత్తగా రూపొందించిన టెస్టింగ్ కిట్ ఐసీఎమ్ఆర్ అనుమతి పొందాల్సి ఉందని, ప్రస్తుతం ఉపయోగిస్తున్న టెస్టింగ్ కిట్లో కరోనా నెగిటివ్గా నమోదు అవుతుందో అక్కడ కొత్త కిట్తో పరీక్షిస్తే వంద శాతం సరైన ఫలితాలు పొందవచ్చని డాక్టర్ మిశ్రా పేర్కొన్నారు. (మరోసారి సంపూర్ణ లాక్డౌన్: నిజమేనా?) -
వ్యాక్సిన్ తయారీకి మరో 8 నెలలు
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ నివారణకు వ్యాక్సిన్ను అభివృద్ధి చేసేందుకు సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) కృషి చేస్తోందని, ఫలితాలు వచ్చేందుకు 6 నెలల నుంచి 8 నెలల సమయం పట్టే అవకాశముందని డాక్టర్ సోమ్దత్తా కరక్ తెలిపారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో సీసీఎంబీ ఈ దిశగా కొన్ని నెలల క్రితమే ప్రయత్నాలు మొదలుపెట్టిందని గుర్తు చేశారు. ఇందులో భాగంగా దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లోని కరోనా రోగుల నుంచి తాము ఇప్పటికే వైరస్ నమూనాలు సేకరించి వాటిని పరిశోధన శాలలోనే వృద్ధి చేస్తున్నామని ఆమె తెలిపారు. (‘కరోనా’పై పోరులో సీసీఎంబీ ముందడుగు) జీవకణాలు ఉంటేనే మనుగడలో ఉండే వైరస్ను పరిశోధనశాలలో వృద్ధి చేయడం అంత ఆషామాషీ వ్యవహారమేమీ కాదని, ఇందుకోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు, పద్ధతులు అవసరమని చెప్పారు. ఈ వైరస్ను ఉపయోగించుకుని ప్రైవేటు కంపెనీలతో కలిసి టీకా ఉత్పత్తి చేయాలన్నది సీసీఎంబీ ఉద్దేశమని ఆమె వివరించారు. ఈ దిశగా సీసీఎంబీ ఇప్పటికే విన్స్ బయోటెక్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుందని, మరిన్ని కంపెనీలు సీసీఎంబీతో కలసి పనిచేసేందుకు ఆసక్తి చూపాయని తెలిపారు. టీకా అభివృద్ధిలో పలు దశలుంటాయని, వీలైనంత ఎక్కువ పరీక్షలు నిర్వహించడం ద్వారా టీకా సమర్థతను, పనితీరును మదింపు చేయకపోతే సమస్య మరింత జటిలమవుతుందన్నారు. అందువల్లనే టీకా అభివృద్ధికి కొంచెం ఎక్కువ సమయం పడుతోందని వెల్లడించారు. -
‘నవంబర్, డిసెంబర్లోనే భారత్లో కరోనా?’
హైదరాబాద్: దేశంలోకెల్లా ప్రసిద్ధి గాంచిన రీసర్చ్ ఇన్స్టిట్యూట్కు చెందిన పలువురు శాస్త్రవేత్తలు కరోనా వైరస్కు సంబంధించి కొన్ని దిగ్భ్రాంతికర విషయాలను వెల్లడించారు. ఇందుకు సంబంధించిన నివేదిక టైమ్స్ ఆఫ్ ఇండియాలో ప్రచురితమైంది. దీని ప్రకారం వుహాన్లో గుర్తించిన కరోనా వైరస్ జాతి పూర్వ వైరస్ ఒకటి 2019 డిసెంబర్ 11 నుంచి భారతదేశంలో వ్యాప్తిలో ఉన్నట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ‘ఎమ్ఆర్సీఏ’(మోస్ట్ రిసెంట్ కామన్ అన్సెస్టర్) అనే శాస్త్రీయ పద్దతి ద్వారా ప్రస్తుతం తెలంగాణ, ఇతర రాష్ట్రాల్లో విజృంభిస్తోన్న కరోనా వైరస్ నవంబర్ 26 నుంచి డిసెంబర్ 25 మధ్య కాలంలో ఉద్భవించిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ రెండు తేదీల మధ్యస్థ సగటు సగటు డిసెంబర్ 11 కాబట్టి అప్పటినుంచే ఇది వ్యాప్తిలో ఉన్నట్టుగా పరిశోధకులు చెబుతున్నారు. అయితే జనవరి 30కి ముందే చైనా నుంచి వచ్చిన ప్రయాణికులు ఈ వైరస్ను తీసుకువచ్చారా, లేదా అనే విషయంలో స్పష్టత లేదు. ఎందుకంటే ఆ సమయంలో భారతదేశంలో సామూహిక పరీక్షలు ఎక్కువ జరగలేదు కాబట్టి ఈ అంశంలో స్పష్టత లేదంటున్నారు శాస్త్రవేత్తలు. హైదరాబాద్లోని సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు కరోనా వైరస్కు చెందిన అనేక జాతుల ‘మోస్ట్ రిసెంట్ కామన్ అన్సెస్టర్’ వయస్సును లెక్కించారు. దీని ఆధారంగా ప్రస్తుతం ఉన్న వాటికి భిన్నమైన మరో కొత్త జాతిని గుర్తించారు. దీనికి క్లాడ్ ఐ/ ఏ3(I / A3) అని పేరు పెట్టినట్లు ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ వెల్లడించింది. భారతదేశంలో కేరళలో మొదటి కరోనా కేసును గుర్తించారు. ఈ వైరస్.. వుహాన్లో గుర్తించబడిన వైరస్ కుటుంబానికి చెందినది. అయితే, హైదరాబాద్లో గుర్తించిన వైరస్, వుహాన్ వైరస్కు భిన్నంగా ఉంది. క్లాడ్ ఐ/ ఏ3(I / A3) వైరస్ మూలం వుహాన్ కాదని.. ఆగ్నేయాసియాలో ఎక్కడో ఉందని నిర్ధారించబడినట్లు నివేదిక తెలిపింది. ఈ వైరస్ కచ్చితంగా ఏ దేశంలో ఉద్భవించింది అనే విషయం ఇంకా తెలియలేదని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ కె మిశ్రా వెల్లడించారు. మోస్ట్ రిసెంట్ కామన్ అన్సెటర్ ప్రకారం ఈ కొత్త వైరస్ జాతి క్లాడ్ ఐ/ ఏ3 (I / A3) జనవరి 17, ఫిబ్రవరి 25 మధ్య కాలంలో వ్యాప్తి చెందడం ప్రారంభించిదని తెలిపింది. తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్ర, ఢిల్లీలో ఈ కొత్త క్లాడ్ కేసులు గరిష్టంగా ఉన్నాయని రాకేశ్ మిశ్రా తెలిపారు. (నిమ్స్లో భయం భయం: వైద్య సిబ్బందికి కరోనా) -
‘కరోనా’పై పోరులో సీసీఎంబీ ముందడుగు
సాక్షి, హైదరాబాద్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ నియంత్రణ విషయంలో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ (సీసీఎంబీ) కీలకమైన ముందడుగు వేసింది. టీకాతో పాటు కరోనా చికిత్సకు అవసరమైన మందులను అభివృద్ధి చేసేందుకు వీలుగా వ్యాధికారక వైరస్ను పరిశోధనశాలలోనే తయారు చేయడంలో విజయం సాధించింది. దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లోని రోగుల ద్వారా సేకరించిన వైరస్ను వైరాలజిస్ట్ డాక్టర్ క్రిష్ణన్ హెచ్ హర్షన్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం విజయవంతంగా వృద్ధి చేయగలిగిందని సీసీఎంబీ ఓ ప్రకటనలో తెలిపింది. శ్వాసకోశంలోని ఉపరితల కణాలపై వైరస్ దాడి చేస్తుందని తెలిసిన విషయమే. ఏస్–2 రిసెప్టార్ల ద్వారా వైరస్ కణాల్లోకి చొరబడుతుంది. ఎండోసైటోసిస్ అని పిలిచే ఈ ప్రక్రియ తర్వాత వైరస్లోని ఆర్ఎన్ఏ కణాల్లోని సైటోప్లాజంలోకి విడుదలవుతుంది. అక్కడ వైరల్ ప్రొటీన్ల ఉత్పత్తి జరిగిన తర్వాత ఆర్ఎన్ఏ నకళ్లు తయారవడం మొదలవుతుంది. ఇంకోలా చెప్పాలంటే వైరస్ నకళ్లను కృత్రిమంగా అభివృద్ధి చేయడం అంత ఆషామాషీ వ్యవహారమేమీ కాదు. ఉపరితల కణాలు పరిశోధనశాలలో ఎక్కువ తరాలపాటు పెరగకపోవడం దీనికి ఓ కారణం. వైరస్ను సమర్థంగా పెంచాలంటే నిరంతరం విభజన చెందుతూ ఉండే కణాలు కావాలని, ఇందుకు తాము ఆఫ్రికా కోతిలోని మూత్రపిండాల కణాలను ఎంచుకున్నామని డాక్టర్ కృష్ణన్ తెలిపారు. ఈ కణాలు కూడా మన శ్వాసకోశ కణాల మాదిరిగానే ఏస్–2 రిసెప్టార్లను కలిగి ఉంటా యని వివరించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న వైరస్ రకాలను తాము అభివృద్ధి చేశామని, భారీ సంఖ్యలో వైరస్ను వృద్ధి చేయడమే కాకుండా వాటిని నిర్వీర్యం చేయడం ద్వారా టీకా అభివృద్ధికి ఉపయోగించేందుకు ప్రయత్నిస్తున్నామని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా తెలిపారు. డీఆర్డీవో వంటి సంస్థలతో కలసి ఇప్పటికే కరోనా చికిత్సకు మందులపై ప్రయోగాలు మొదలుపెట్టామని చెప్పారు. ఉపయోగాలు బోలెడు.. కరోనా వైరస్ను కృత్రిమంగా వృద్ధి చేయడం ద్వారా ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. వీటిల్లో ముందుగా చెప్పుకోవాల్సింది టీకా తయారీ గురించి. నిర్వీర్యం చేసిన లేదా బలహీనం చేసిన వైరస్లతో వ్యాక్సిన్లు రూపొందించడం చాలాకాలంగా జరుగుతున్నదే. కరోనా నివారణ కోసం ఆ వైరస్ను నిర్వీర్యం చేసి ఉపయోగించేందుకు పలువురు ప్రయత్నిస్తున్నారు. వైరస్ను ఎదుర్కొనేందుకు రోగ నిరోధక వ్యవస్థ సిద్ధం చేసే యాంటీబాడీలను ఉపయోగించడం ఒక పద్ధతి. ఇందుకు నిర్వీర్యం చేసిన వైరస్లను జంతువులపై ప్రయోగించి ఉత్పత్తి అయిన యాంటీబాడీలను మానవుల చికిత్సకు వాడుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీటి నుంచి సేకరించిన యాంటీబాడీలను శుద్ధి చేసి ప్రయోగిస్తే మానవుల్లో వైరస్ వ్యతిరేక చర్యలు మొదలవుతాయి. ఇవి టీకాలు కాదు గానీ.. వైరస్ను నియం త్రించే యంత్రాంగంగా పరిగణించవచ్చు. వైరస్కు స్పందనగా రోగ నిరోధక వ్యవస్థ పలు రకాల యాంటీబాడీలను తయారు చేస్తుంది. వీటిల్లో న్యూట్రలైజింగ్ యాంటీబాడీలు ఒకటి. క్షీరదాల్లో వీటిని ఉత్పత్తి చేయడం ద్వారా అవి వైరస్ను ఎంత మేరకు ఎదుర్కోగలుగుతున్నాయో పరీక్షించొచ్చు. సమర్థంగా పనిచేసే వాటిని ఉపయోగించొచ్చు. వైరస్లను కృత్రిమంగా పెంచడం ద్వారా మాత్రమే ఈ యాంటీబాడీలను పరీక్షించొచ్చు. కరోనా చికిత్సకు ఉపయోగపడే రసాయనాలను పరీక్షించేందుకు, వేర్వేరు డిస్ఇన్ఫెక్టెంట్ల సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు వైరస్లను కృత్రిమంగా వృద్ధి చేయడం అత్యవసరం. -
కరోనా.. నీ కథేంటి?
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. మన దేశంలోనూ, రాష్ట్రంలోనూ జనజీవనాన్ని అతలాకుతలం చేస్తోంది. మన రాష్ట్రంలో వైరస్ తీవ్రత ఏ స్థాయిలో ఉంది? దాని మూలాలు ఎక్కడ ఉన్నాయి? వంటి అంశాలపై ప్రతిష్టాత్మక సీసీఎంబీ పరిశోధనలు చేస్తోంది. గాంధీ ఆసుపత్రిలోని పాజిటివ్ రోగుల శాంపిళ్ల నుంచి కరోనా వైరస్ జీనోమ్ (జన్యు క్రమం)లను రూపొందించారు. వాటి ఆధారంగా జన్యు నమూనాలను తయారు చేసినట్లు వైద్య, ఆరోగ్య శాఖకు చెందిన ఓ కీలకాధికారి తెలిపారు. ‘వైరస్ పరిణామాన్ని, ఇది ఎంత వేగంగా విస్తరిస్తుందో తెలుసుకోవడానికి ఈ అధ్యయనం ఉపయోగపడుతుంది. దాని భవిష్యత్తు ఎలా ఉండబోతుందో కూడా అంచనా వేయడానికి సాయపడుతుంది’అని సీసీఎంబీ వర్గాలు చెబుతున్నాయి. జీనోమ్ సీక్వెన్సింగ్ అధ్యయనం కోసం చాలా నమూనాలు అవసరం. అందుకే గాంధీ ఆస్పత్రితో పాటు కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల్లోని పాజిటివ్ రోగుల వైరస్ జీనోమ్లను కూడా సేకరించినట్లు తెలిసింది. ఇలా చేయడం వల్ల వైరస్ వంశ వృక్షాన్ని గుర్తించడానికి వీలవుతుందని సీసీఎంబీ చెబుతోంది. (ఇవాంకను ఆకట్టుకున్న జ్యోతి కథ) వైరస్ బలహీనపడుతోందా? ఐసీఎంఆర్ కూడా దేశంలోని వివిధ సంస్థలతో కలసి జీనోమ్ సీక్వెన్స్పై అధ్యయనం చేసింది. ఆ అధ్యయన నివేదికను ఇటీవల విడుదల చేసింది. ఈ అధ్యయనంలో హైదరాబాద్కు చెందిన రెండు సంస్థలు కూడా పాలుపంచుకున్నాయి. భారత్లో వివిధ ప్రాంతాల నుంచి తీసుకున్న 25 వైరస్ జీనోమ్లపై ఐసీఎంఆర్ అధ్యయనం చేసింది. ఆ వివరాలను గ్లోబల్ ఇనిషియేటివ్ ఆన్ షేరింగ్ ఆల్ ఇన్ఫ్లుయెంజా డేటా (జీఐఎస్ఏఐడీ)కి అందజేసింది. వీటితో కలిపి ఇప్పుడు జీఐఎస్ఏఐడీ సంస్థ వద్ద మొత్తం 3,993 జీనోమ్ల చరిత్ర ఉంది. మన దేశంలో ఏ జీనోమ్ ద్వారా వైరస్ ఎక్కడ నుంచి వచ్చింది.. ఏ జాతితో ఎక్కువ సారూప్యత కలిగి ఉంది.. ఏ జాతి వైరస్ బలహీనంగా ఉంది.. ఏ జాతి వైరస్ బలంగా ఉందో అధ్యయనం చేసినట్లు చెబుతున్నారు. (ఫేస్మాస్క్ల గురించి మనకు ఏం తెలుసు?) దేశంలో మొదట్లో నమోదైన కేసులకు చైనాతో సంబంధముంది. ఆ తర్వాత చైనాతో అంతర్జాతీయ ప్రయాణాలు నిలిపేశారు. అనంతరం ఇతర ఆగ్నేయ ఆసియా దేశాల నుంచి కేసులు వచ్చాయి. చివరకు ఎక్కడ మూలాలున్నాయో తెలుసుకుంది. మన జీనోమ్లకు చైనా, అమెరికా, కెనడా, స్పెయిన్, కువైట్ల జీనోమ్లతో సంబంధం ఉన్నట్లు గుర్తించింది. అయితే మన దేశంలో వైరస్ వేగంగా మార్పు చెందుతోందని ఐసీఎంఆర్ గుర్తించింది. వైరస్ మార్పు చెందడమంటే అది బలహీనం అవుతున్నట్లు చెప్పొచ్చని వైద్య నిపుణులు అంటున్నారు. వాస్తవంగా పుట్టినచోట ఒరిజినల్ వైరస్ తీవ్ర ప్రభావం చూపుతుందని, రాను రానూ దాని తీవ్రత తగ్గుతుందని చెబుతున్నారు. (అమెరికాను బ్రేక్ చేయనున్న బ్రెజిల్!) -
ఇలా చేస్తే జూన్ చివరినాటికి మహమ్మారి దూరం..
సాక్షి, హైదరాబాద్ : కోవిడ్-19 మార్గదర్శకాలకు అనుగుణంగా సామాజిక దూరం పాటించాలనే సూచనను మనం విధిగా అనుసరిస్తే జూన్ మాసాంతానికి కరోనా మహమ్మారి నుంచి బయటపడతామని, లేని పక్షంలో ఈ ఏడాది చివరి వరకూ దీనిపై పోరాటం తప్పదని సెంటర్ ఫర్ సెల్యులార్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) డైరెక్టర్ డాక్టర్ రాకేష్ మిశ్రా అన్నారు. కోవిడ్-19ను దీటుగా ఎదుర్కొనేందుకు అవసరమైన యాంటీబాడీల అభివృద్ధిపై సీసీఎంబీ శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారని చెప్పారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మిశ్రా మాట్లాడుతూ లాక్డౌన్ను పొడిగించడం లేదా పాక్షిక లాక్డౌన్ను కఠినంగా అమలు చేయాలని సూచించారు. ఇక కరోనా వైరస్ చికిత్సలో మలేరియా మందు హైడ్రాక్సీక్లోరోక్వీన్ పనితనంపై ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని, అయితే మహమ్మారిపై ముందుడి పోరాడుతున్న సిబ్బందికి వైరస్ నుంచి రక్షణగా ఈ మందును ఇస్తున్నారని చెప్పారు. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే భారత్లో కరోనా వైరస్ బలహీనంగా ఉందనేందుకు ఆధారాలు లేవని అన్నారు. భారత్లో ఇప్పటివరకూ వేయి మందిని పైగా బలిగొన్న కరోనా మహమ్మారి మ్యుటేషన్ కొనసాగుతోందని చెప్పారు. లాక్డౌన్ నియంత్రణలు కొనసాగిస్తూనే భారత్లో పెద్దసంఖ్యలో పరీక్షలు నిర్వహించాలని, లక్షణాలు లేకుండా వ్యాధి వ్యాప్తి చెందుతున్న క్రమంలో టెస్టింగ్ కీలకమని వ్యాఖ్యానించారు. చదవండి : కరోనా కాదు ఆకలే చంపేస్తుంది.. -
CCMBలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు
-
తక్కువ ఖర్చులో కరోనా నిర్ధారణ కిట్!
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు ప్రాథమిక దశలోనే పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) చెబుతోంది. దీనివల్ల కరోనా మహమ్మారిని ప్రారంభంలోనే గుర్తించి ప్రజల ప్రాణాలు కాపాడొచ్చని అంటోంది. డబ్ల్యూహెచ్వో పిలుపునకు అనుగుణంగా, సెంటర్ ఫర్ సెల్యులార్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) తక్కువ ఖర్చుతో, కచ్చితమైన ఫలితాలు కనుగొనే విధంగా వ్యాధి నిర్ధారక కిట్ను ఎక్కువ మందికి అందుబాటులోకి తెచ్చేందుకు శ్రమిస్తోంది. అంతా సజావుగా సాగితే రెండు, మూడు వారాల్లో మంచి కిట్లు రూపొందించగలమని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ ఆర్కే మిశ్రా ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కిట్లు నాణ్యమైన విగా, కచ్చితమైన ఫలితాలు ఇచ్చేవిగా ఉండటం అత్యంత ముఖ్యమన్నారు. ఈ కిట్లు వంద శాతం ఫలితాలిచ్చినప్పుడే వాటిని ఆమోదిస్తామన్నారు. అలాగే వ్యాధి నిర్ధారణ పరీక్ష ఖర్చు గురించి కూడా తాము ఆలోచిస్తున్నామని, ఇది రూ.వెయ్యి కంటే తక్కువ ఉండాలన్నది తమ ఆలోచన అని చెప్పారు. రూ.400 నుంచి రూ.500 చౌక కిట్స్ గురించి ఆలోచన కూడా ఉందని, ప్రస్తుతం తాము ఇందుకు హామీ ఇ వ్వలేమని ఆయన చె ప్పారు. అన్నింటి కం టే ముఖ్యమైనది ప్రా మాణికత గల కిట్ అని మిశ్రా చెప్పారు. పరీక్షలు చేసేందుకు సీసీ ఎంబీలో సదుపాయాలున్నాయని, ప్రభుత్వం నుంచి అనుమతి కూడా వచ్చిందన్నారు. తాము ఇంకా శాంపిళ్లు, కిట్ అందుకోవలసి ఉందని డా క్టర్ మిశ్రా తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వం నిర్దేశించిన 5 టెస్టింగ్ కేంద్రాలున్నాయి. సీసీఎంబీ 25 మందికి శిక్షణ ఇచ్చింది. దీంతో వీరు ఈ కేంద్రా ల్లో పరీక్షలు చేయడానికి వీలు కలుగుతుంది. కరోనా పరీక్షల సదుపాయం హైదరాబాద్లోని నిమ్స్, గాంధీ ఆస్పత్రి, ఉస్మానియా ఆస్పత్రి, సర్ రోనాల్డ్ రోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాఫికల్ అండ్ కమ్యూనికబుల్ డిసీజెస్ లేదా ఫీవర్ ఆస్పత్రి, వరంగల్ ఆస్పత్రిలో ఉంది. సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నస్టిక్స్ (సీడీఎఫ్డీ) కూడా ఈ కేంద్రాల జాబితాలో చేరనుంది. ఇక ఈ వైరస్ను ఎదుర్కోవడానికి వ్యాక్సిన్, ఔషధాలు తయారు చేయడం మరో అంశం. ప్రస్తుతానికి వాక్సిన్ లేదా ఔషధాల అభివృద్ధిపై తాము పనిచేయడం లేదని డాక్టర్ మిశ్రా చెప్పారు. -
'సీసీఎంబీలో పరీక్షలకు అనుమతివ్వండి'
సాక్షి, హైదరాబాద్ : కరోనా పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా హైదరాబాద్లోని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయోలజీ (సీసీఎంబీ) సెంటర్ను ఉపయోగించుకునేందుకు అనుమతివ్వాలని ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. కేవలం తెలంగాణ వారికే కాకుండా దేశంలో ఏ ప్రాంతానికి చెందిన వారికైనా సీసీఎంబీలో రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని కేసీఆర్ ప్రధాని దృష్టికి తెచ్చారు. కేంద్ర ప్రభుత్వ అధీనంలోని సీసీఎంబీని జీవ సంబంధ పరిశోధనల కోసం ఉపయోగిస్తున్నారని, పరీక్షలకు అనుమతిస్తే ఏకకాలంలో వెయ్యి శాంపిళ్లు పరీక్షించే అవకాశం ఉందన్నారు. కరోనా వైరస్ నియంత్రణలో కేంద్రంతో కలసి పనిచేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. శుక్రవారం సాయంత్రం వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో సీఎం కేసీఆర్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి సీఎం పలు సూచనలు చేశారు. విదేశాల నుంచి వస్తున్న వారి ద్వారానే వైరస్ ప్రబలే అవకాశం ఉన్నందున కొన్ని రోజులపాటు విదేశాల నుంచి విమాన రాకపోకలను పూర్తిగా నిలిపేయాలన్నారు. రైళ్ల ద్వారా దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ప్రయాణికులు వెళ్లే అవకాశం ఉన్నందున రైల్వే స్టేషన్లలో వైద్య పరీక్షలు నిర్వహించడంతోపాటు రైల్వే స్టేషన్లు, బోగీల్లో పారిశుద్ధ్య చర్య లు చేపట్టాలని కేసీఆర్ కేంద్రాన్ని కోరారు. ఢిల్లీ, కోల్కతా, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వంటి పెద్ద నగరాలకు పెద్ద ఎత్తున విదేశాల నుంచి ప్రయాణికులు వస్తారని, వారికి క్షుణ్ణంగా కోవిడ్ వైద్య పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందని సీఎం పేర్కొన్నారు. జనసమ్మర్థం ఎక్కువ ఉండే ప్రధాన నగరాలపై దృష్టి కేంద్రీకరించి కోవిడ్ నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీని కేసీఆర్ కోరారు. పండుగలు, ఉత్సవాలకు దూరం...: కోవిడ్ వ్యాప్తి నిరోధ చర్యలను కేసీఆర్ వీడియో కాన్ఫరెన్స్లో ప్రధానికి వివరించారు. జనం గుమిగూడకుండా చర్యలు తీసుకోవడంతోపాటు శ్రీరామ నవమి, జగ్నే కీ రాత్ వంటి పండుగలు, ఉత్సవాలను రద్దు చేశామన్నారు. -
సంతాన యోగం!
సాక్షి, హైదరాబాద్: ప్రజలు మరీ ముఖ్యంగా పురుషులు యోగా సాధన చేసేందుకు మరో బలమైన కారణాన్ని ఆవిష్కరించారు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు. అననుకూల వాతావరణ పరిస్థితుల కారణంగా తగ్గిపోతున్న పురుషుల వీర్యం నాణ్యత పెంచేందుకు యోగా ఉపయోగపడుతుందని సీసీఎంబీ, ఢిల్లీలోని అఖిల భారత వైద్యవిజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) సంయుక్తంగా చేసిన పరిశోధన స్పష్టం చేసింది. మానవ జన్యు వ్యవస్థపై వాతావరణం ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నది తెలిసిందే. అనారోగ్యకర జీవనశైలి, దురలవాట్ల కారణంగా డీఎన్ఏలో రసాయన మార్పులు చో టుచేసుకుని వీర్యం నాణ్యత తగ్గుతుందని కూ డా వింటుంటాం. ఈ మార్పులను యోగాతో అ ధిగమించొచ్చని తాజా అధ్యయనం చెబుతోంది. ఆండొలోగియా జర్నల్ తాజా సంచికలో ప్ర చురితమైన దాని ప్రకారం వంధ్యత్వ సమస్యల తో బాధపడుతున్న పురుషులు యోగా ఆధారిత జీవనశైలి అలవర్చుకుంటే వీర్యకణాలు చురు గ్గా మారడంతో పాటు వీర్యంపై ఆక్సిడేటివ్ స్ట్రెస్ కూడా తగ్గుతుంది. తద్వారా సంతానం కలిగేందుకు ఉన్న అవకాశాలు పెరుగుతాయి. సీసీఎంబీలో పరిశీలన.. ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యశాలలో వంధ్యత్వ సమస్యలకు చికిత్స పొందుతున్న కొంతమందిని ఎంచుకుని తాము అధ్యయనం చేశామని సీసీఎంబీ శాస్త్రవేత్త సురభి శ్రీవాత్సవ తెలిపారు. వీరు రోజుకు గంట చొప్పున వేర్వేరు ఆసనాలు వేయడంతో పాటు ప్రాణాయామం, ధ్యానం వంటి యోగా క్రియలను అనుసరించారు. యోగా కార్యక్రమంలో చేరే ముందు.. ఆ తర్వాత వీరి వీర్యాన్ని పరిశీలించగా ఆసక్తికరమైన మార్పులు కనిపించాయని శ్రీవాత్సవ వివరించారు. 400 జన్యువులు ఆన్/ఆఫ్ అయ్యేందుకు కీలకమైన మిథైలోమ్ను యోగా ప్రభావితం చేస్తున్నట్లు స్పష్టమైందన్నారు. వీటిల్లో పురుషుల సంతాన లేమికి వీర్య ఉ త్పత్తికి ఉపయోగపడే జన్యువులు ఉన్నాయి. ఈ అధ్యయనంలో గుర్తించిన జన్యువులపై మరి న్ని పరిశోధనలు జరపడం, వీర్యంపై యోగా ప్రభావంపై విస్తృత అధ్యయనం ద్వారా వంధ్య త్వ సమస్యలను అధిగమించేందుకు మెరుగైన మార్గం లభిస్తుందని సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా తెలిపారు. యోగా అధ్యయనంలో పాల్గొన్న వారిలో ఇద్దరు ఏడాది తిరగకుండానే తండ్రులు అవుతుండటం విశేషం. -
వెంట్రుక.. ఒత్తిడి తెలుస్తుందిక
హైదరాబాద్: గోవుల్లో ఒత్తిడిస్థాయిని తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు కొత్త విధానాన్ని కనుగొన్నారు. ఇప్పటివరకు పశువుల రక్తం, మూత్రం, మలాన్ని సేకరించి అందులోని హార్మోన్ల పెరుగుదల ఆధారంగా వాటి శారీరకఒత్తిడి తీవ్రతను గుర్తించే పద్ధతిని పాటిస్తుండగా తాజాగా గోవుల వెంట్రుకలను పరీక్షించడం ద్వారా ఒత్తిడిని కచ్చితంగా నిర్ధారించొచ్చని సీసీఎంబీ శాస్త్రవేత్తలు వెల్లడించారు. సీసీఎంబీకి చెందిన శాస్త్రవేత్తలు డాక్టర్ ఉమాపతి, డాక్టర్ వినోద్కుమార్, హిమాచల్ప్రదేశ్ వెటర్నరీ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ అరవింద్, ఆస్ట్రేలియా క్వీన్స్లాండ్లోని ప్రొఫెసర్ క్లైవ్ ఈ ప్రయోగాలు చేపట్టారు. దేశంలోని 54 గోశాలల్లో 11 ఏళ్ల వయసుగల 540 ఆవుల వెంట్రుకల నమూనాలను సేకరించి ప్రయోగాలు జరిపారు. పశువుల శారీరక ఒత్తిడికి కారణమైన కాట్రిసోల్ హార్మోన్లు వాటి వెంట్రుకల్లో అధికంగా ఉన్నట్లు ఈ ప్రయోగాల్లో గుర్తించారు. ఒత్తిడికి కారణం జీవన పరిస్థితులే... పశువుల కొట్టాలు, గోశాలలు, ఇతర షెల్టర్లలో పెంచే ఆవులు సాధారణ సమయాల్లో ఉన్నప్పుడు వాటిలో విడుదలయ్యే హార్మోన్లు, ఒత్తిడికి గురైనప్పుడు ఉత్పత్తి అయ్యే హార్మోన్లను అనేకసార్లు పరిశీలించారు. మైదాన ప్రాంతాల్లో ఉండే ఆవులను, షెడ్లలోని పశువుల పరిస్థితులతో పోల్చగా గోశాలల్లో ఉండే వాటిలోనే శారీరక ఒత్తిడి అధికంగా ఉం టోందని తేల్చారు. షెడ్లలో పడుకునేందుకు నేల సరిగా లేకపోవడం, పరిశుభ్రంగా ఉంచకపోవడం, తక్కువస్థలంలో ఎక్కువ పశువులను పెట్టడం, అధిక వయసు వంటి సమస్యల వల్ల గోవుల్లో కాట్రిసోల్ హార్మ న్ అధికంగా విడుదలై అవి ఎక్కువ ఒత్తిడికి గురవుతాయని శాస్త్రవేత్తలు పరిశోధనల్లో కనుగొన్నారు. దేశంలో పశుసంపదను కాపాడాలంటే పశువుల పెంపకం, వాటి రక్షణ విషయంలో మార్పులు జరగాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. పరిశుభ్రమైన పరిసరాలు, మంచి వాతావరణం, శాస్త్రీయ పద్ధతులు పాటించి షెడ్లు ఏర్పాటు చేయాలంటున్నారు. -
వరి.. బ్యాక్టీరియా పని సరి
హైదరాబాద్: వరి.. దేశంలోనే అతి ముఖ్యమైన పంట. వరి పంట వేసిన తర్వాత అది చేతికందే లోపు అనేక రకాల బ్యాక్టీరియాలు దాడి చేసి రైతుకు నష్టాన్ని కలిగిస్తున్నాయి. ముఖ్యంగా వరిని పట్టిపీడిస్తున్న వాటిలో జాంతోమోనాస్ ఒరిజే అనే బ్యాక్టీరియా ఒకటి. ఇది సోకడం వల్ల దేశంలోని రైతులు 60 శాతం పంటను నష్టపోతున్నారు. ఈ బ్యాక్టీరియా తెగులు నుంచి వరి పంటను కాపాడేందుకు గాను హైదరాబాద్లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు డాక్టర్ హితేంద్రపటేల్, డాక్టర్ రమేష్, సోహినీదేవ్లు అధ్యయనం నిర్వహించారు. జాంతోమోనాస్ బ్యాక్టీరియాలోని జోప్– క్యూ అనే ఎంజైమ్ వరి పంట నష్టానికి కారణమని గుర్తించారు. జోప్– క్యూ వరి మొక్క కణాలపై దాడి చేసి మొక్క కణకవచాన్ని బలహీన పరిచేందుకు ప్రయత్నిస్తుంది. రోగనిరోధక శక్తి కలిగిన మాలిక్యూల్స్ను టార్గెట్ చేసి వాటిని నిర్వీర్యం చేయడానికి వాటిపై దాడి చేస్తుంది. ప్రోటీన్ దిశను మార్చి... కణాల మీద బ్యాక్టీరియా దాడి చేసినపుడు మొక్కలోని రక్షిత వ్యవస్థకు, సూక్ష్మక్రిమికి మధ్య జరిగే పోరాటంలో మొక్క తనను తాను కాపా డుకుంటే రక్షించబడుతుంది. లేదంటే వ్యాధి బారిన పడుతుంది. అయితే బ్యాక్టీరియాదే పైచేయిగా నిలవడంతో వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లు తూ వస్తోందని చెప్పారు. సీసీఎంబీ శాస్త్రవేత్తలు వరి మొక్కలో వ్యాధికి కారకంగా మారిన ప్రోటీన్ అనుక్రమాన్ని ఒక దశ వద్ద మార్చివేశారు. రోగనిరోధక శక్తి కలిగి వ్యాధి బారిన పడుతున్న 14–3–3 అనుక్రమం కలిగిన ప్రోటీన్ దిశలో మార్పు చేయడం వల్ల బ్యాక్టీరియా దాడి ప్రభావం చూపలేదని శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రోటీన్ దిశను మార్చడం వల్ల వరి మొక్కకణాలను నాశనం చేసే బ్యాక్టీరియల్ హైజాక్ను అడ్డుకోవడంతో పాటు మొక్క కణజాలంలో రక్షణ సంబంధ ప్రతిచర్యలను పటిష్టపర్చడం కూడా సాధ్యపడుతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. -
క్షీరదాలలో కొత్తరకం సూక్ష్మజీవ నిరోధక మూలాలు
హైదరాబాద్: గుడ్లు పెట్టే క్షీరదాలలో ఎకిడ్నా జాతికి చెందిన జంతువుల పాలలో సరికొత్తరకం సూక్ష్మజీవ నిరోధక ప్రొటీన్ ఆనవాళ్లు ఉన్నట్లు సీఎస్ఐఆర్-సీసీఎంబీ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ కోవకు చెందిన జంతువులు, వాటి సంతానం ఎటువంటి అంటురోగాల బారిన పడకుండా తమ పాల ద్వారా సంరక్షించుకొంటున్నట్లు పరిశోధన ద్వారా తెలిసింది. సీఎస్ఐఆర్-సీసీఎంబీకి చెందిన డాక్టర్ సతీశ్ కుమార్ నాయకత్వంలోని పరిశోధక బృందం ఈ ప్రొటీను, కణంపై పొరలో రంధ్రాలను ఏర్పరుస్తున్నట్లు కనిపెట్టారు. ఈ కారణంగా వీటిని సూక్ష్మజీవి నాశక మందులకు ప్రత్యామ్నాయాలుగా ఉపయోగించవచ్చునని సతీశ్ చెబుతున్నారు. ఈకోలిని ఉపయోగిస్తూ సూక్ష్మజీవ నిరోధక ప్రొటీన్ను భారీ పరిమాణంలో ఉత్పత్తి చేసేందుకు కూడా ఈ బృంద సభ్యులు మార్గాలను కనుగొన్నారు. మూగజీవుల ఆరోగ్యాన్ని సంరక్షించడం కోసం పశు పోషణ రంగంలో సూక్ష్మజీవి నాశకాల(యాంటి బయోటిక్)ను విచక్షణా రహితంగా ఉపయోగిస్తున్నారని, ఫలితంగా సూక్ష్మజీవి నాశకాలను తట్టుకుని నిలిచే బ్యాక్టీరియా సంతతి పెరుగుతోందని సతీష్ చెప్పారు. డాక్టర్ సతీశ్ కుమార్ నేతృత్వంలోని బృందం ఎకిడ్నా నుంచి సంగ్రహించిన సూక్ష్మజీవ నిరోధక ప్రొటీన్కు మాస్టయిటిస్ కారక బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా పనిచేసే శక్తి ఉన్నదని రుజువు చేయగలిగింది. ఈ పరిశోధన తాలూకు నివేదికను ఇటీవల ‘బయోచిమికా ఎట్ బయోఫిజికా యాక్టా-బయోమెంమెబ్రేన్స్’లో ప్రచురించారు.సీఎన్ఐఆర్-సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా మాట్లాడుతూ.. సాంక్రమిక వ్యాధులు అంతకంతకూ పెరుగుతున్నటువంటి ప్రస్తుత వాతావరణంలో ముందంజ వేసేందుకు ఈ అధ్యయనాలు ఒక ఉత్తమ మార్గంగా ఉన్నాయని అన్నారు. -
సీసీఎంబీ ప్రాజెక్టుపై నీలి నీడలు
సాక్షి, యాదాద్రి: అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అయిన సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ (సీసీఎంబీ) ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. ఏడాదిన్నర క్రితం ఈ ప్రాజెక్టులో కదలిక మొదలైనా పనులు మాత్రం ముందుకు సాగలేదు. ఈ పరిశోధనా కేంద్రం నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని కేటాయించడంలో జరుగుతున్న జాప్యం వల్ల ప్రాజెక్టు మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ సంబంధిత కేంద్ర మంత్రి హర్షవర్ధన్కు సీసీఎంబీ కేంద్రాన్ని ప్రారంభించాలని విజ్ఞప్తి చేయడంతో ఈ ప్రాజెక్టు ప్రక్రియ ప్రారంభమైంది. దీంతో బీబీనగర్ పక్కనే గల రంగాపురంలోని 180 ఎకరాల్లో సీసీఎంబీని ఏర్పాటు చేయడానికి 11వ ప్రణాళిక కాలంలో కేంద్రం అనుమతినిచ్చింది. రూ.1,200 కోట్లతో ఈ ప్రాజెక్టును నిర్మించాలనుకున్నారు. ఈ నిధులకు జాతీయ ప్రణాళిక సంఘం, ఆర్థిక సంఘం ఆమోదం కూడా లభించింది. అయితే స్థలం విషయంలో ఏర్పడిన వివాదంతో ఈ ప్రక్రియ ముందుకు సాగలేదు. దీనికి ప్రత్యామ్నాయంగా భువనగిరి మండలం పగిడిపల్లి వద్ద మరో స్థలాన్ని భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్మిశ్రా, కలెక్టర్ అనితారామచంద్రన్, ఆర్డీఓ ఎంవీ భూపాల్రెడ్డి తదితరులు పరిశీలించారు. ప్రాజెక్టు స్వరూపం... 180 ఎకరాల స్థలం, రూ.1,200 కోట్ల వ్యయం.. మానవ మూలకణాలతోపాటు పలు అంశాలపై నిరంతర పరిశోధనలు చేసే అవకాశం.. వందలాది మందికి ఉపాధి కల్పన.. ఇదీ సీసీఎంబీ పరిశోధన కేంద్రం స్వరూపం. అయితే స్థలాన్ని ఎంపిక చేయడంలో జరిగిన జాప్యం వల్ల మొత్తం నిధుల్లో రూ. 300 కోట్లను పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి మళ్లించారు. సీసీఎంబీలో ఏం చేస్తారంటే.. మానవుల మూల కణాలపై పరిశోధనలు చేస్తారు. మనుషుల్లో వచ్చే రుగ్మతలు, ప్రధానంగా కేన్సర్ వ్యాధి గురించి ముందే తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ పరిశోధనల కోసమే సీసీఎంబీని ఇక్కడ ఏర్పాటు చేయడానికి కేంద్రం ముందుకొచ్చింది. తార్నాకలోని ప్రాజెక్టు కేంద్ర కార్యాలయానికి చేరువలో ఉండటం, జాతీయ రహదారి 163తో పాటు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులో ఉండటంతో ఇక్కడ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. -
బొక్కలేని ముక్క.. ఎంచక్కా!
సాక్షి, హైదరాబాద్ : మాంసం ప్రియులకు శుభవార్త.. ఎముక(బొక్క).. కొవ్వు లేని మాంసం త్వరలో మీ జిహ్వచాపల్యాన్ని తీర్చనుంది. సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ(సీసీఎంబీ) శాస్త్రవేత్తలు ప్రయోగాత్మ కంగా టిష్యూ ఇంజనీరింగ్, జీనోమ్ ఎడిటింగ్ టెక్నాలజీ ఆధారంగా క్లీన్మీట్ తయారీకి శ్రీకారం చుట్టారు. ఈ సంవత్సరం చివరికి సుమారు టన్ను మాంసం అందుబాటులోకి రానున్నట్లు విశ్వస నీయంగా తెలిసింది. ఈ ప్రయోగం సఫలమై వినియోగదారులకు క్లీన్ మీట్ అందుబాటులోకి వస్తే మాంసం ప్రియులకు పండగేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎలా తయారు చేస్తారంటే.. మేక లేదా కోడి శరీరభాగాల నుంచి కణజాలాన్ని సేకరించి ప్రయోగశాలలో సంరక్షాలను అందజేసి ఈ విధానంలో మాంసాన్ని తయారు చేస్తారు. ఇది సాధారణ మాంసంలానే తాజాగా, రుచిగా ఉంటుందట. ధర కూడా సాధారణ మాంసం ఎంత ధర ఉంటుందో అంతే ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ మాంసంలో సూక్ష్మ జీవ నాశకాలు(యాంటీ బయాటిక్స్), వృద్ధి హార్మోన్ల ఉనికి ఉండదని, దీంతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. హ్యూమన్ సొసైటీ ఇంటర్నేషనల్ ఇండియా, సీసీఎంబీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ మాంసాన్ని ప్రయోగ శాలలో తయారు చేస్తున్నారు. ఈ మాంసంలో బ్యాక్టీరియా ఉనికి కూడా ఉండదని చెబుతుండటం గమనార్హం. రాజస్తాన్లో శాకాహారులే అధికం రాజస్తాన్లో శాకాహారులు అత్యధిక సంఖ్యలో ఉండటం విశేషం. ఆ రాష్ట్రంలో 73.2 శాతం మంది పురుషులు, 76.6 శాతం మంది మహిళలు శాకాహారులే. హరియాణాలో 68.5 శాతం మంది పురుషులు, 70 శాతం మంది మహిళలు.. పంజాబ్లో 65.5 శాతం మంది పురుషులు, 68 శాతం మంది స్త్రీలు శాకాహారాన్నే ఇష్టపడుతున్నారు. గ్రామీణ భారతీయుల్లో 6.4 శాతం మంది మటన్.. 21.7 శాతం మంది చికెన్.. 26.5 శాతం మంది చేపలు.. 29.2 శాతం మంది గుడ్లు తింటున్నట్లు ఎన్ఎస్ఎస్ఓ డేటా చెబుతోంది. పట్టణాల్లో 21 శాతం మంది మటన్.. 21 శాతం మంది చేపలు.. 27 శాతం మంది చికెన్.. 37.6 శాతం మంది గుడ్లను వినియోగిస్తున్నారట. జాతీయ స్థాయి సగటు కంటే అధికం.. జాతీయ స్థాయిలో ఏటా సరాసరిన ఒక్కో వ్యక్తి మాంసం వినియోగం 3.2 కిలోలుగా ఉంది. ప్రపంచ సరాసరి మాత్రం 38.7 కిలోలుగా ఉంది. అమెరికాలో అయితే ఏటా ఒక్కో వ్యక్తి 125 కిలోల మాంసాన్ని సరాసరిన వినియోగిస్తున్నట్లు తేలడం విశేషం. జాతీయ స్థాయి సగటు కంటే చికెన్ వినియోగం తెలంగాణలో అధికంగా ఉండటం విశేషం. జాతీయ స్థాయిలో ఏటా ఒక్కో వ్యక్తి సరాసరిన 3.2 కిలోల మాంసం, 65 గుడ్లను వినియోగిస్తుండగా.. తెలంగాణలో 6.5 కిలోల మాంసం.. 90 గుడ్లను వినియోగిస్తున్నారు. హైదరాబాద్ విషయానికి వస్తే ఏటా ఒక్కో వ్యక్తి సగటున 7.5 కిలోల మాంసం, 100 గుడ్లను లాగించేస్తున్నట్లు అంచనా. కృత్రిమ మాంసంతో ఉపయోగాలివే.. దేశంలో ఏటా పెరుగుతోన్న మాంసం డిమాండ్ను తీర్చవచ్చు. కొవ్వు, ఎముకలు లేకపోవడంతో పోషకాహారంలా ఉపయోగపడుతుంది. కొలెస్ట్రాల్ సమస్య ఉండదు. తక్కువ భూమి, నీరు వినియోగంతో ఈ మాంసాన్ని తయారుచేయవచ్చు. లక్షలాది మూగజీవులను చంపే అవసరం ఉండదు. గుడ్లు, చికెన్ వినియోగం పెరగాలి పోషక విలువలు అధికంగా ఉండే గుడ్ల వినియోగం ఏటా ఒక్కో వ్యక్తికి 118కి పెరగాలని జాతీయ పోషకాహార సంస్థ సూచించింది. చికెన్ వినియోగంలో సైతం జాతీయస్థాయి సగటు 15 కిలోలకు పెరగాల్సి ఉంది. – రంజిత్రెడ్డి, తెలంగాణ పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దేశంలో మాంసం వినియోగం ఇలా.. మాంసం వినియోగంలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్గా నిలుస్తోంది. మూడో స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. 2016–17 మధ్యకాలంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో అత్యధిక సంఖ్యలో మాంసాహారులు ఉన్నట్లు ఎన్ఎస్ఎస్ఓ(నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్) అధ్యయనంలో తేలింది. ఇందులోనూ.. పురుషుల్లో 98.8 శాతం, మహిళల్లో 98.6 శాతం మంది మాంసాహారులే. మాంసాహారులు ప్రధానంగా మటన్, చికెన్, చేపల వంటకాలనే ఇష్టపడుతున్నారు. మాంసాహారుల విషయంలో రెండో స్థానంలో నిలిచిన పశ్చిమబెంగాల్లో 98.7 శాతం, ఏపీలో 98.4 శాతం, ఒడిశాలో 97.7 శాతం, కేరళలో 97.4 శాతం మంది పురుషులు మాంసాహారులే. ఏటా తెలంగాణలో 4.47 లక్షల మెట్రిక్ టన్నులు, ఏపీలో 5.27 లక్షల మెట్రిక్ టన్నుల మాంసం ఉత్పత్తి అవుతోంది. -
మన మూలాలు ఎక్కడ ?
సాక్షి, హైదరాబాద్ : భారత ఉప ఖండం చరిత్రకు సంబంధించిన ప్రధాన ప్రశ్నలతో పాటు, భారతీయ నాగరికతపై చేసిన వివిధ సూత్రీకరణలపై చర్చకు సమాధానాలు కనుక్కునే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 92 మంది శాస్త్రజ్ఞులు రూపొందించిన ‘ ఓ నూతన పత్రం’ దీనికి మార్గం చూపుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవలే ‘ది జెనోమిక్ ఫార్మేషన్ ఆఫ్ సౌత్ అండ్ సెంట్రల్ ఆసియా’ శీర్షికతో ఆన్లైన్లో పోస్టయిన ఈ పత్రంలో జన్యుశాస్త్రం మొదలుకుని ఉప ఖండంలో ప్రాచీన నివాసితుల వంశ పారంపర్య వివరాల వరకు పరిశీలించారు. అన్ని ప్రతిష్టాత్మక సంస్థలే... మనదేశ నాగరికతపై కొత్త కోణాన్ని వెలుగులోకి తెచ్చేందుకు ఉపకరించే ఈ పత్రాన్ని తయారు చేయడంలో హైదరాబాద్లోని సీసీఎంబీ మొదలుకుని హార్వర్డ్, ఎంఐటీ, ద రష్యన్ అకాడమి ఆఫ్ సైన్సెస్, ద బీర్బల్ సహాని ఇనిస్టిట్యూట్ ఆఫ్ పాలియో సైన్సెన్ (లక్నో), ద దక్కన్ కాలేజీ, ద మాక్స్ ప్లాంక్ ఇనిస్టిట్యూట్, ద ఇనిస్టిట్యూట్ ఫర్ ఆర్కియాలాజికల్ రిసెర్చ్ ఇన్ ఉజ్బెకిస్తాన్... ఇలా 92 ప్రపంచప్రసిద్ధి పొందిన శాస్త్ర,సాంకేతిక, పరిశోధన సంస్థలకు చెందిన వారు భాగస్వాములయ్యారు. ఈ అధ్యయనానికి సహ డైరెక్టర్లుగా వ్యవహరించిన వారిలో జన్యుశాస్త్ర నిపుణుడు డేవిడ్ రీచ్ కూడా ఉన్నారు. అధ్యయనం ఇలా... వందేళ్ల క్రితం నాటి ప్రజల డీఎన్ఏ శాంపిళ్లతో (612 మంది ప్రాచీన పౌరులు) జన్యువుల ఆధారంగా ఈ పరిశీలన నిర్వహించారు. ఇందులో దక్షిణాసియా మొదలుకుని తూర్పు ఇరాన్, ప్రస్తుత ఉజ్బెకిస్తాన్లోని తురాన్, తుర్కెమినిస్తాన్, తజికిస్తాన్, ఖజకిస్తాన్లకు చెందిన వారి నమూనాలున్నాయి. మొత్తం 612 జన్యువుల్లో 362 మంది డీఎన్ఏలను తొలిసారి పరీక్షించారు. ఈ జన్యువుల నుంచి తీసుకున్న డేటాను ప్రస్తుతం దక్షిణాసియాలోని 246 విలక్షణ గ్రూపులతో సహా పైన పేర్కొన్న ఆయా ప్రాంతాల వ్యక్తుల సమాచారంతో పోల్చి చూశారు. దేనికోసమీ పరిశోధన ? మధ్య, దక్షిణాసియాలలో ప్రజలు ఎలా స్థిరపడ్డారు ? అన్న విషయంపై అంచనాకు వచ్చేందుకు తగిన స్థాయిలో పురాతన డీఎన్ఏతో పాటు పరిశీలన కొరవడింది. దీనికి సంబంధించి అనేక సూత్రీకరణలు ప్రచారంలో ఉన్నాయి. వాటిలో కొన్నింటిని దక్షిణాసియాలోని రాజకీయాలతో ముడిపెట్టి చేసినవీ ఉన్నాయి. ఆర్యుల దండయాత్ర సిద్ధాంతానికి బలం చేకూర్చేలా నీలికళ్ల శ్వేతజాతీయులు గుర్రాలపై ఉపఖండానికి వచ్చి తమకు ఎదురైనా ప్రతీ దేశంపై విజయం సాధించారన్నది వీటిలో భాగంగా ఉన్నాయి. దీనికి పూర్తి విరుద్ధ వాదననను హిందుత్వవాదులు తీసుకొచ్చారు. భారత–ఐరోపా భాషలన్నీ భారత్ నుంచే పశ్చిమానికి వ్యాపించాయనే సూత్రీకరణా ఉంది. స్త్రీల నుంచి స్ల్రీలకు బదిలీ అయ్యే మైటోకాండ్రియల్ డీఎన్ఏ మన ఉపఖండ ప్రత్యేకతగా ఉంది. కొన్ని వేల సంవత్సరాలుగా స్థానికులు( ఇండీజీనియస్) భారత్లో ఉన్నారని ఈ పరిశీలన సూచిస్తోంది. అయితే పురుషుల నుంచి పురుషులకు బదిలీ అయ్యే ‘వై’ క్రోమోజోమ్ల ప్రాతిపదికన పశ్చిమ యూరో ఆసియన్లు, ఇరాన్ పీఠభూమి, మధ్య ఆసియన్లతో భారత్కు ఎక్కువ సంబంధాలున్నట్టు ఈ అధ్యయనంలో తేలింది. ఈ నేపథ్యంలో అసలు సింధు నాగరికతకు చెందిన ప్రజలెవరన్న ప్రశ్న ముందుకొచ్చింది. వారికి ద్రవిడియన్లుగా ముద్రపడ్డవారితో లేక ఆర్యుల వలసల కారణంగా దక్షిణాదికి పరిమితమైన వారితో వీరికి సంబంధాలున్నాయా ? లేదా వారే ఆర్యులా ? వారే క్రమంగా దక్షిణాదికి తరలివచ్చారా అన్న ప్రశ్నలకు జవాబులు ఈ అధ్యయనంలో లభించవచ్చునని భావిస్తున్నారు. కనుక్కున్నది ఏమిటీ ? ఈ అధ్యయనంలోని జన్యుపరమైన అంచనా ప్రకారం ప్రాచీన భారతం... ఉత్తర, దక్షిణ ప్రాంతాల ప్రజల పూర్వీకులను రెండు ప్రత్యేక బృందాలుగా విభజించారు. ప్రస్తుత యూరోపియన్లు, తూర్పు ఆసియన్ల మాదిరిగా ఈ బృందాలు రెండు కూడా ఒక దానికి ఒకటి పూర్తిగా భిన్నమైనవని పేర్కొన్నారు. అయితే ఈ రెండు జాతులు కూడా ఎక్కడి నుంచి వచ్చాయన్నది ప్రశ్న. వివిధ కాంబినేషన్లలో మూడు బృందాలు కలగలిసి పోయి ఈ రెండు జాతులు ఏర్పడడానికి కారణమనే అభిప్రాయం వ్యక్తమైంది. అవి... –ఈ అధ్యయనంలో దక్షిణ భారత ప్రాంత పూర్వీకులుగా పేర్కొన్నవారు (దక్షిణాసియాలో వేట ప్రధాన వృత్తిగా ఉన్న వారు) ఉపఖండంలో అతి ప్రాచీన ప్రజలని తేల్చారు. వీరికి ఆధునిక అండమాన్ ద్వీప ప్రజలతో సారూప్యతలున్నాయి. –ఇరాన్కు చెందిన రైతులు ఉపఖండానికి వలస వచ్చారు. వారి ద్వారా గోధుమలు, బర్లీ వంటి పంట పద్ధతులు ఇక్కడకు వచ్చాయి. – మధ్య ఆసియా నుంచి ఉత్తర అప్ఘనిస్తాన్ వరకున్న ప్రాంతంలోని ప్రజలు (ఆర్యులుగా గతంలో పిలిచేవారు) భారత్కు వలస వచ్చినవారిలో ఉన్నారు. వీరితో పాటు దక్షిణ ఆసియాతో సంబంధాలున్న ముఖ్యమైన జనాభా సింధు నాగరికతకు చెందినదిగా భావిస్తున్నారు.సింధు లోయ నాగరికతకు చెందిన ప్రజలు చాలా మటుకు భారత జనాభాకు వారధిగా నిలుస్తూ దక్షిణాసియా పూర్వీకులకు సంబంధించి ప్రధాన వనరుగా నిలుస్తున్నట్టు ఈ అథ్యయనం పేర్కొంది. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
సీసీఎంబీని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు
పీఎం.భార్గవ సంతాప సభలో జైపాల్ రెడ్డి హైదరాబాద్ : సెంటర్ ఫర్ సెల్యులర్ మాలిక్యులర్ బయోలజీ (సీసీఎంబీ)ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన గొప్ప వ్యక్తి పీఎం భార్గవ అని కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్ రెడ్డి అన్నారు. భార్గవ లాంటి వ్యక్తులను దేశం పుట్టించకపోతే భవిష్యత్ అంధకారంగా మారే ప్రమాదం ఉందన్నారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సీసీఎంబీ వ్యవస్థాపక డైరెక్టర్ పీఎం భార్గవ సంతాప సభలో పలువురు ఘనంగా నివాళులర్పించా రు. జైపాల్ రెడ్డి మాట్లాడుతూ.. భార్గవ ఒక వ్యక్తి కాదు సంస్థగా ఎదిగారని..సైన్స్కు సమాజానికి మధ్య సంబంధాన్ని పెంచాలనే తపన భార్గవలో కనిపించేదన్నారు. నెహ్రూ తరం ఆఖరి ప్రతినిధిగా భార్గవను పేర్కొనవచ్చు అన్నారు. శాస్త్రవేత్తలు మౌనం వహించటం సమాజానికి తీవ్రవాదం కంటే ప్రమాదకరమని మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య అన్నారు. సైన్స్ ప్రభావంతోనే రాజకీయాల్లోకి వచ్చానని అందుకే శాస్త్రవేత్తలంటే నాకు ఎంతో గౌరవం అని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. ప్రొఫెసర్ ఆదినారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ నాయకులు కె.నారాయణసీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ శర్మ, మాజీ డైరెక్టర్లు లాల్జీసింగ్, డాక్టర్ సీహెచ్.మోహన్ రావు, డాక్టర్ మెహతాబ్, ఎస్.బామ్జీ, ఐఐసీటీ మాజీ డైరెక్టర్ డాక్టర్ అహ్మద్ కమాల్, డాక్టర్ హర్ష గుప్త, ప్రొఫెసర్ బీఎన్.రెడ్డి, సత్యప్రసాద్, టి.రమేశ్, శ్రీనా«థ్, ఎ.రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. -
ప్రొఫెసర్ పీఎం భార్గవ కన్నుమూత
తీవ్ర అనారోగ్యంతో స్వగృహంలో తుదిశ్వాస సీసీఎంబీ వ్యవస్థాపక డైరెక్టర్గా ఎనలేని సేవలు భార్గవ మృతికి శాస్త్రవేత్తలు, ప్రముఖుల సంతాపం రేపు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు సాక్షి, హైదరాబాద్: ప్రఖ్యాత శాస్త్రవేత్త, సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ (సీసీఎంబీ) వ్యవస్థాపక డైరెక్టర్ ప్రొఫెసర్ పుష్పమిత్ర భార్గవ (89) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. వయోభారం, తీవ్ర అనారోగ్యంతో మంగళవారం సాయంత్రం 5.45 గంటలకు ఉప్పల్ ప్రశాంత్నగర్లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయన కొడుకు మోహిత్ భార్గవ కెనడాలో ఉంటున్నారు. కూతురు వినీత గుంటూరులో ఒక స్వచ్ఛంద సంస్థలో పని చేస్తున్నారు. కొడుకు మోహిత్ వచ్చిన తర్వాత 3న జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో భార్గవ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతికి పలువురు శాస్త్రవేత్తలు, ప్రముఖులు సంతాపం తెలిపారు. సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా, మాజీ డైరెక్టర్లు మోహన్రావు, లాల్జీసింగ్, సీనియర్ సైంటిస్టులు శివాజీ, జ్యోత్స్న ధావన్, ఇమ్రాన్ సిద్ధిఖీ ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. జ్యోతిష్య శాస్త్రం కోర్సుపై సుప్రీంకు: ఆధునిక జీవశాస్త్రానికి ఆర్కిటెక్ట్గా ప్రశంసలం దుకున్న భార్గవ.. సీసీఎంబీ వ్యవస్థాపక డైరెక్టర్గా 13 ఏళ్ల పాటు విశేష సేవలందిం చారు. 2006లో అప్పటి ఎన్డీఏ ప్రభుత్వం 220 విశ్వవిద్యాలయాల్లో జ్యోతిష్య శాస్త్రాన్ని కోర్సుగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేసినప్పుడు నిర్ద్వంద్వంగా వ్యతిరేకించి సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు, సైన్స్ టెంపర్ పెంచేందుకు 500కు పైగా వ్యాసాలు రాశారు. నేషనల్ నాలెడ్జ్ సెంటర్ వైస్ చైర్మన్గా పని చేశారు. చేప మందుకు వ్యతిరేకంగా.. హైదరాబాద్లో బత్తిన సోదరులు పంపిణీ చేసే చేప మందు శాస్త్రీయతను సవాల్ చేస్తూ 2008 నుంచి జన విజ్ఞాన వేదిక చేపట్టిన అన్ని ఆందోళన కార్యక్రమాల్లో భార్గవ పాల్గొన్నారు. హైకోర్టుకు వెళ్లారు. చివరకు దాన్ని చేప మందుగా పరిగణించరాదని, చేప ప్రసాదంగానే భావించాలని కోర్టు పేర్కొంది. చేప మందే కాకుండా హోమియో వైద్యమూ మూఢ నమ్మకమేనని భార్గవ కొట్టిపారేశారు. శాస్త్రవేత్తగా ఆయన కృషికి 1986లో ప్రభుత్వం పద్మభూషణ్తో సత్కరించింది. కానీ గతేడాది దేశవ్యాప్తంగా రచయితలు, మేధావి వర్గంపై జరిగిన దాడులు, అసహనానికి వ్యతిరేకంగా అవార్డు తిరిగిచ్చేశారు. ‘హెడిల్బర్గర్’ వ్యవస్థాపకుల్లో ఒకరు.. 1928 ఫిబ్రవరి 22న రాజస్తాన్లోని అజ్మీర్లో భార్గవ జన్మించారు. ఆయన తండ్రి రామచంద్ర భార్గవ, తల్లి గాయత్రీ భార్గవ. వారణాసి బీసెంట్ థియోసాఫికల్ స్కూల్లో ప్రాథమిక విద్య అభ్యసించిన భార్గవ.. లక్నో విశ్వవిద్యాలయం నుంచి 1946లో ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఎమ్మెస్సీ పట్టా పొందారు. 21వ ఏటనే సింథటిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అంశంపై పీహెచ్డీ పరి శోధన చేశారు. 1950 నుంచి 1953 వరకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ)లో, అదే సమయంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం కెమిస్ట్రీ విభాగంలో లెక్చరర్గా విధులు నిర్వహించారు. 1953 నుంచి 1956 వరకు అమెరికాలోని విస్కాన్సన్ వర్సిటీలో పని చేశారు. అక్కడే హెడిల్బర్గర్ లేబొరేటరీ వ్యవస్థాపకుల్లో ఒకరుగా నిలిచారు. వైఎస్ జగన్ సంతాపం సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ మాజీ అధిపతి, ప్రముఖ శాస్త్రవేత్త పి.ఎం. భార్గవ మృతికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తన సంతాపాన్ని తెలియజేశారు. విజ్ఞానశాస్త్ర రంగంలో భార్గవ చేసిన సేవలను వైఎస్ జగన్ కొనియాడుతూ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
అటల్ ఇన్నోవేషన్ సెంటర్గా సీసీఎంబీ ఎంపిక
సాక్షి, హైదరాబాద్: సృజనాత్మకతకు ప్రోత్సాహించే లక్ష్యంతో కేంద్ర నీతి ఆయోగ్ ఏర్పాటు చేస్తున్న అటల్ ఇన్నోవేషన్ సెంటర్గా హైదరాబాద్లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) ఎంపికైనట్లు సంస్థ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ కుమార్ మిశ్రా తెలిపారు. వినూత్నమై ఆలోచనలతో ముందుకొచ్చే ఔత్సాహికులకు సీసీఎంబీలోని సౌకర్యాలన్నీ అందుబాటులోకి తేవడం, తద్వారా సామాజిక ప్రయోజనాలున్న ఉత్పత్తి లేదా సేవగా అభివృద్ధి చేసేందుకు ఈ కేంద్రం ప్రయత్నిస్తుందని ఆయన గురువారం విలేకరులకు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగానికి చెందిన దాదాపు 3,780 సంస్థలు వరకూ ఈ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తు చేయగా నీతి ఆయోగ్ పదింటిని ఎంపిక చేసిందని, ఇందులో సీసీఎంబీ ఒకటని మిశ్రా తెలిపారు. ఈ కేంద్రంలో బయోటెక్నాలజీ ఆధారిత స్టార్టప్లకు అవకాశం కల్పిస్తామని, సీసీఎంబీ అనెక్స్–2లో దాదాపు పదివేల చదరపు అడుగుల స్థలం, రెండు – మూడు కోట్ల విలువైన యంత్ర సామాగ్రి అందుబాటులో ఉంటుందన్నారు. ఔత్సాహికుల ఆలోచనలను అంచనా వేయడం మొదలుకొని.. మేధోహక్కుల పరిరక్షణ, పరిశ్రమ ఏర్పాటుకు సహకారం అందిస్తామని తెలిపారు. ఫార్మా, ప్రిస్కిప్షన్ మెడిసన్, స్టెమ్సెల్ వైద్య రంగాల్లో స్టార్టప్లపై తాము దృష్టిపెడతామని చెప్పారు. దీని కోసం నీతి ఆయోగ్ ఏడాదికి గరిష్టంగా రూ.పది కోట్ల వంతున ఐదేళ్లపాటు నిధులు అందిస్తుందని.. ఆ తరువాత సంస్థ తనంతట తానే మనుగడ సాగించాలన్నారు. సీసీఎంబీలో ఇప్పటికే ఇలాంటి ఇన్క్యుబేషన్ కేంద్రం ఒకటి పనిచేస్తోందని.. అటల్ ఇన్నొవేషన్ సెంటర్ దీనికి అదనమని అన్నారు. ఈ కేంద్రం ఏర్పాటుకు సీసీఎంబీ ఒక సెక్షన్ –8 కంపెనీని ఏర్పాటు చేస్తోందని.. వ్యాపార సంస్థ మాదిరిగానే దీనికి సీఈవో, బోర్డ్ ఆఫ్డైరెక్టర్లు తదితరులు ఉంటారని తెలిపారు. ఔత్సాహికుల ఐడియాలను మదింపు చేసేందుకు సీసీఎంబీ శాస్త్రవేత్తలతోపాటు ఆయా రంగాల్లో నిష్ణాతులైన ప్రైవేట్ వ్యక్తుల సేవలను తీసుకుంటామని తెలిపారు. -
మన చరిత్రలో కీలక ‘పాత్ర’!
♦ పూర్వీకుల గుట్టువిప్పే ఆధారాలు ♦ పాల్మాకుల, నర్మెట్ట తవ్వకాల్లో కీలక అవశేషాలు ♦ మూడు వేల ఏళ్లకు పైవేనంటున్న పురావస్తు శాఖ సాక్షి, హైదరాబాద్ వేల ఏళ్ల క్రితమే మధ్య ఆసియా, ఆఫ్రికా ప్రాంతాల నుంచి తెలంగాణ ప్రాంతానికి మానవుల వలస, అందులో కొన్ని తెగలు తిరిగి ఆయా ప్రాంతాలకు వెళ్లిపోయిన దాఖలాలపై అస్పష్టమైన సమా చారం గతంలోనే బయటపడింది. ఇప్పుడు దాన్ని నిరూపించే విలువైన పరిశోధన అవశేషాలను తెలంగాణ పురావస్తు శాఖ గుర్తించింది. కొద్ది రోజుల క్రితం సిద్దిపేట జిల్లా నంగునూను ప్రాంతంలోని నర్మెట్ట, పాల్మాకుల గ్రామ శివార్లలో జరిపిన తవ్వకాల్లో లభించిన అవశేషాలను అత్యంత విలువైనవని పురావస్తు శాఖ గుర్తించింది. ఇక్కడ లభించిన ఆదిమానవుల సమాధు లను తవ్వి కచ్చితమైన సమాచారాన్ని అందించే అవశేషాలు, అత్యంత అరుదైన పనిముట్లు, వాడుక సామగ్రిని సేకరించింది. వీటిని ప్రాథమికంగా పరిశీలించిన అధికారులు... తెలంగాణ పూర్వ చరిత్రలో కొత్త విశేషాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు. మధ్య ఆసియా నుంచి వలసలు..! గతంలో సిద్దిపేట సమీపంలోని పుల్లూరు శివారులో జరిపిన తవ్వకాల్లో లభించిన ఎముకల డీఎన్ఏలను సీసీఎంబీ విశ్లేషించి ఇటీవలే నివేదిక సమర్పించింది. ఆ డీఎన్ఏ మూలాలు ప్రస్తుత మధ్య ఆసియా ప్రాంతానికి చెందిన వ్యక్తుల డీఎన్ఏతో సరిపోలినట్టు తేల్చారు. అంటే మధ్య ఆసియా ప్రాంతం నుంచి వలస వచ్చిన వారు తెలంగాణ ప్రాంతంలో నివాసం ఏర్పాటు చేసుకున్నట్టు దాని ఆధారంగా గుర్తించారు. కానీ ఇప్పుడు ఆ డీఎన్ఏ జాడ మళ్లీ ఇక్కడ గుర్తించలేదు. అంటే.. వలస వచ్చిన వారు తిరిగి వెళ్లిపోయారా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. తాజాగా జరిపిన తవ్వకాల్లో అలాంటి వాటిని నివృత్తి చేసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. తాజా తవ్వకాల్లో ఓ కుండలో మనిషికి సంబంధించి ఏమాత్రం చెక్కు చెదరని పుర్రె సహా ఇతర ప్రధాన ఎముకలు భద్రంగా ఉన్నాయి. ఇప్పటి వరకు ఇన్ని అవశేషాలు ఎక్కడా దొరకలేదు. ఈ ఎముకల డీఎన్ఏలను తేల్చేందుకు త్వరలో సీసీఎంబీ రెండో విడత పరిశోధనలు ప్రారంభించనుంది. ఈ వస్తువులను గన్ఫౌండ్రిలోని పురావస్తు శాఖ సంచాలకుల కార్యాలయం ఆవరణలో ఉన్న శ్రీశైలం పెవిలియన్ మ్యూజియంలో వారం రోజుల పాటు ప్రజల సందర్శనకు ఉంచారు. గది.. అందులో మరో గది.. అవశేషాలు ఇక తవ్వకాల్లో వెలుగు చూసిన సమాధి నిర్మాణం కూడా ప్రత్యేకంగా ఉంది. తిరగేసిన స్వస్తిక్ ఆకృతిలో... గది, అందులో మరో గది నిర్మించి దానిలో అవశేషాలు భద్రపరిచి ఉన్నాయి. గతంలో ఈ తరహా నిర్మాణం శ్రీశైలం ప్రాజెక్టు వద్ద తొలిసారి కనుగొన్నారు. ‘ఓ మనిషికి చెందిన పూర్తి ఎముకల నిర్మాణం ఓ కుండలో భద్రంగా ఉంది. ఇప్పటి వరకు అలాంటి అవశేషాలు లభించలేదు. భవిష్యత్తు పరిశోధనలకు ఇది ఎంతో దోహదం చేస్తుంది. ఎముకలతో చేసిన ఆభరణాలు కూడా తొలిసారిగా దొరికాయి’అని పురావస్తు శాఖ సంచాలకులు విశాలాచ్చి పేర్కొన్నారు. -
సీసీఎంబీ కొత్త డెరైక్టర్గా రాకేశ్ మిశ్రా
హైదరాబాద్: దేశంలోనే ప్రతిష్టాత్మక పరిశోధన సంస్థ సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ నూతన డెరైక్టర్గా డాక్టర్ రాకేశ్ మిశ్రా గురువారం బాధ్యతలు చేపట్టారు. డాక్టర్ సీహెచ్ మోహనరావు పదవీ విరమణ (జనవరి 30, 2016) తరువాత సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ అమిత్ ఛటోపాధ్యాయ మూడు నెలలపాటు యాక్టింగ్ డెరైక్టర్గా వ్యవహరించారు. తాజాగా డాక్టర్ రాకేశ్ మిశ్రా డెరైక్టర్గా బాధ్యతలు చేపట్టారు. అలహాబాద్ విశ్వవిద్యాలయం నుంచి ఎమ్మెస్సీ, పీహెచ్డీ పట్టాలు పొందిన రాకేశ్ మిశ్రా ఇండియన్ ఇన్స్స్టిట్యూట్ ఆఫ్ సెన్సైస్లో కొద్ది సమయం పనిచేశారు. ఫ్రాన్స్, అమెరికా, స్విట్జర్లాండ్లలోని వేర్వేరు విశ్వవిద్యాలయాల్లో పోస్ట్ డాక్టరల్ స్టడీస్ ముగించుకున్న తరువాత 2001లో సీసీఎంబీలో చేరారు.వివిధ జర్నల్స్లో వందకుపైగా పరిశోధన వ్యాసాలు ప్రచురించిన ఈ సీనియర్ శాస్త్రవేత్త జన్యుక్రమ వ్యవస్థలో పరిణామ క్రమంలోనూ భద్రంగా ఉన్న అంశాలపై ఆసక్తి మెండు. దీంతోపాటు క్రొమాటిన్ నిర్మాణం, పిండదశలో జన్యువుల నియంత్రణ వ్యవహారం తదితర అంశాలపై పరిశోధనలు చేస్తూంటారు. సీసీఎంబీ కొత్త డెరైక్టర్గా శాస్త్రీయ విజ్ఞానం సమాజ హితానికి మరింత ఎక్కువగా ఉపయోగపడేలా చేయడం తన లక్ష్యమని డాక్టర్ రాకేశ్ మిశ్రా పేర్కొన్నారు. -
సీసీఎంబీ యాక్టింగ్ డెరైక్టర్గా చటోపాధ్యాయ
హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) యాక్టింగ్ డెరైక్టర్గా ప్రొఫెసర్ అమితబా ఛటోపాధ్యాయ నియమితులయ్యారు. ఈ మేరకు సీసీఎంబీ మాతృసంస్థ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) అధ్యక్షుడి హోదాలో ప్రధాని నరేంద్రమోడీ ఛటోపాధ్యాయ నియామక ఉత్తర్వులు జారీచేశారు. డాక్టర్ సీహెచ్ మోహనరావు ఈ ఏడాది జనవరి 31న పదవీ విరమణ చేయడంతో ఔట్స్టాండింగ్ సైంటిస్ట్గా ఉన్న ప్రొఫెసర్ ఛటోపాధ్యాయ సీసీఎంబీ డెరైక్టర్గా బాధ్యతలు చేపట్టారు. శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డుతోపాటు జేసీబోస్ నేషనల్ ఫెలోషిప్ పొందిన డాక్టర్ ఛటోపాధ్యాయ రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ, ఇండియన్ అకడమీస్ ఆఫ్ సెన్సైస్ సభ్యుడిగానూ ఉన్నారు. వివిధ అంతర్జాతీయ జర్నల్స్లో ఛటోపాధ్యాయ దాదాపు 200 పరిశోధన వ్యాసాలు ప్రచురించారు. -
మరింత చేరువగా జన్యువైద్యం
- కొత్త టెక్నాలజీతో తగ్గుతున్న ఖర్చులు - సీసీఎంబీ డెరైక్టర్ మోహన్రావు - జన్యుశాస్త్ర పోకడలపై అంతర్జాతీయ సదస్సు ప్రారంభం సాక్షి, హైదరాబాద్: జన్యుశాస్త్రంలో, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాల్లో శరవేగంగా వస్తున్న మార్పులు సమీప భవిష్యత్తులో వైద్యంతోపాటు అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్నాయని, వ్యక్తుల జన్యుక్రమం ఆధారంగా వారికే ప్రత్యేకమైన మందులు ఇవ్వడమూ అందుబాటులోకి వస్తుందని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) డెరైక్టర్ డాక్టర్ సి.హెచ్.మోహన్రావు తెలిపారు. సైజినోమ్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్లో ‘నెక్స్ట్ జెన్ జినోమిక్స్, బయాలజీ, బయో ఇన్ఫర్మేటిక్స్ అండ్ టెక్నాలజీస్’ పేరుతో అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది. సీసీఎంబీ సహకారంతో చేపట్టిన ఈ సదస్సు ప్రారంభోత్సవానికి హాజరైన డాక్టర్ మోహన్రావు జన్యుశాస్త్రంలో వస్తున్న మార్పులు, తద్వారా మానవాళికి ఒనగూరనున్న ప్రయోజనాలను విలేకరులకు వివరించారు. మానవ జన్యుపటాన్ని తెలుసుకోవాలంటే కొన్నేళ్ల క్రితం వరకూ కోట్ల రూపాయలు ఖర్చయ్యేవని, ఇమేజ్ ప్రాసెసింగ్, ప్యారెలల్ కంప్యూటింగ్ల పుణ్యమా అని ఇప్పుడు రూ.1.5 లక్షలతోనే తెలుసుకోవచ్చని ఆయన చెప్పారు. అమెరికా, యునెటైడ్ కింగ్డమ్ వంటి దేశాల్లో ప్రజలందరి జన్యుపట ఆవిష్కరణకు, తద్వారా వ్యక్తిగత వైద్యం అందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన వివరించారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో రొమ్ముకేన్సర్కు వ్యక్తి జన్యుక్రమం ఆధారంగా మందులు ఎంపిక చేసే పద్ధతి అవలంబిస్తున్నారు. సదస్సు చైర్మన్ డాక్టర్ శేఖర్ శేషగిరి మాట్లాడుతూ జినోమిక్స్ కేవలం వైద్యరంగానికి మాత్రమే పరిమితం కాలేదని, వ్యవసాయంలోనూ మార్పులు తీసుకురాగలదని అన్నారు. జన్యు పరిశోధనల్లో సామాజిక న్యాయం ఇప్పటివరకూ జరిగిన జన్యుపరిశోధనల్లో అధికశాతం యూరోపియన్ ప్రజలను దృష్టిలో ఉంచుకుని జరిగాయని అమెరికా అధ్యక్షుడు ఒబామా సలహాదారు, డాక్టర్ ఎస్తవాన్ తెలిపారు. అమెరికా జరిపిన అధ్యయనం ద్వారా ఈ విషయం తెలిసిందని, ఫలితంగా జన్యుశాస్త్ర ఫలాలు ప్రజలందరికీ చేరువ కాలేకపోయాయన్నారు. అమెరికా ప్రజలకు జన్యుక్రమ ఆధారిత వ్యక్తిగత వైద్యం అందించే ప్రయత్నాలు వేగంగా ముందుకెళుతున్నాయని చెప్పారు. భారత్ ప్రజల్లో వైవిధ్యం ఎక్కువ: డాక్టర్ తంగరాజ్ జన్యుపరంగా భారత్లో వైవిధ్యం ఎక్కువని, కనుక అన్ని జాతుల ప్రజల జన్యుక్రమాలపై పరిశోధనలు విసృ్తతంగా చేపట్టాల్సిన అవసరం ఉందని సీసీఎంబీ శాస్త్రవేత్త డాక్టర్ తంగరాజ్ తెలిపారు. జన్యుక్రమం ఆధారంగా చూస్తే దేశంలో దాదాపు 4,000 వర్గాలున్నాయని చెప్పారు. -
పుల్లూరు బండలో పురాతన చరిత్ర
సాక్షి, హైదరాబాద్: ‘మెదక్ జిల్లా సిద్దిపేట మండలం పుల్లూరు బండ గ్రామ శివార్లలో దాదాపు రెండు నెలల పాటు పురావస్తు శాఖ నిర్వహించిన తవ్వకాల్లో అత్యంత విలువైన ఆధారాలు లభించాయి... ఇక్కడి సమాధుల్లో అతిపురాతన అస్తిపంజరం లభించింది. ఇలా పూర్తి అస్తిపంజరం లభించడం అరుదు... అది ఎన్నేళ్లనాటిదనే కచ్చితత్వం కోసం దాన్ని సీసీఎంబీకి పంపాలని నిర్ణయించాం’ అని తెలంగాణ పర్యాటక, పురావస్తుశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. బుధవారం పురావస్తుశాఖ ఇన్చార్జి డెరైక్టర్ సునీతాభగవత్తో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. పుల్లూరుబండ తవ్వకాల్లో ఎన్నో విలువైన వస్తువులు లభించాయని, ఇవన్నీ తమ పరిశోధనలకు ఎంతో ఉపయోగపడనున్నాయన్నారు. అతి పురాతన ఆంథ్రోమార్ఫిక్ ఫిగర్ కూడా లభించిందని, ఆదిమానవులు నాటి వ్యక్తులకు గుర్తుగా మానవాకృతిగా రాతిని మలిచేవారని, అలాంటి ఆధారాలు లభ్యమవడం అత్యంత అరుదని చెప్పారు. వరంగల్ జిల్లాలో వెలుగుచూసిన మైలారం గుహలను అభివృద్ధి చేయనున్నామని, 15 కిలోమీటర్ల మేర విస్తరించిన ఇవి ప్రపంచంలోనే పెద్ద గుహల్లో ఒకటిగా చరిత్రకెక్కుతాయన్నారు. బిహార్, ఉత్తరప్రదేశ్ తర్వాత బౌద్ధ జాడలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం తెలంగాణనేనని, కేంద్రం నుంచి ప్రత్యేక బౌద్ధ సర్క్యూట్ అభివృద్ధి కోసం నిధులు పొంది ఆయా ప్రాంతాలను అభివృద్ధి చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్లోని బౌద్ధ జాడలతో సంయుక్తంగా పర్యాటక సర్క్యూట్ అభివృద్ధి చేస్తే దేశంలో ప్రధాన పర్యాటక ప్రాంతాలుగా మారుతాయని అభిప్రాయపడ్డారు. త్వరలో పదవీ విరమణ చేయనున్న తమిళనాడు పురావస్తు శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కన్నన్ సేవలను తెలంగాణలో చారిత్రక ప్రాంతాల పురోగతికి వినియోగించుకునే ఆలోచనలో ఉన్నామని వెంకటేశం వెల్లడించారు. నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం కొండమల్లెపల్లెలో కృష్ణవేణి అనే విద్యార్థినికి లభించిన తాళపత్ర గ్రంథంలో బైండ్ల మగ్గ మాయ చరిత్రకు సంబంధించిన పంచకథలున్నట్టు తెలిపారు. ఖమ్మం జిల్లా గార్ల బయ్యారంలో కృష్ణదేవరాయ, అచ్యుతరాయ కాలం నాటి 40 బంగారు నాణేలు దొరికాయని, నాణేలపై బాలకృష్ణుడి చిత్రం మరోవైపు నగరి లిపిలో శ్రీప్రతాప కృష్ణరాయ అన్న అక్షరాలున్నాయని, మిగతా నాణేలపై ఒకవైపు గండబేరుండం చిత్రం మరోవైపు నగరి లిపిలో శ్రీ ప్రతాపాచ్యుతరాయ అని అక్షరాలున్నాయన్నారు. ఇలాంటి నాణేలు దొరికితే ప్రభుత్వానికి అందజేయాలని, లేనిపక్షంలో నేరమవుతుందని వెంకటేశం తెలిపారు. ఇప్పటి వరకు లభించిన నాణేలతో ప్రత్యేక మ్యూజియం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. -
ఆ గ్రామంలో.. 400 జతల కవలలు
సాక్షి: మీ పాఠశాలలోనో, ఇంటి చుట్టుపక్కలో, బంధువుల్లోనో ఎవరైనా కవల పిల్లలు ఉన్నారా..? ఒక వేళ ఉంటే వారిని అందరూ చాలా ప్రత్యేకంగా చూస్తారు కదా! కవలలు సాధారణంగా ఒకే రకమైన పోలికలు కలిగి ఉంటారు. అందుకే వారికి ఆ ప్రత్యేకత. మనం కవలల్ని చూడటం చాలా అరుదు. ఎందుకంటే చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే కవల జననాలు ఉంటాయి. కానీ ఒక గ్రామంలో మాత్రం ఎక్కడ చూసినా కవలలే కనిపిస్తున్నారు. ఆ గ్రామం ఎక్కడ ఉందో, ఆ విశేషాలేమిటో ఈ రోజు తెలుసుకుందాం..! ఎక్కడ ఉంది? ఆ గ్రామం కవల పిల్లల కారణంగా అంతర్జాతీయ ఖ్యాతినార్జించింది. రెండు వేల కుటుంబాలు నివసించే ఆ చిన్న ఊరిలో 400 జతల కవలలు ఉన్నారంటే ఆశ్చర్యం వేయక మానదు. ఆ గ్రామం కేరళలోని మలప్పురం జిల్లాలో ఉంది. పేరు ‘కొడివి’. ఎక్కడైనా వెయ్యి జననాల్లో ఆరు కవల జననాలు ఉండటం సహజం. కానీ ఈ గ్రామంలో మాత్రం ప్రతి 1000 జననాలకు 45 కవలలు ఉంటున్నారు. సున్నీ ముస్లింలు ఇక్కడ అధిక సంఖ్యలో ఉన్నారు. మరో విశేషం ఏమంటే.. ఇక్కడి మహిళలకు పెళ్లిళ్లై సుదూర ప్రాంతాలకు వెళ్లినా వారికి కూడా కవలలు పుడుతున్నారు. ఇటీవలి కాలంలో వీటి సంఖ్య మరింత పెరిగింది. ఇక్కడ పదేళ్లలోపు పిల్లల్లో 80 జతల కవలలు ఉన్నారు. ఇబ్బందులూ ఉంటాయ్! ఇక్కడి స్కూల్ టీచర్లు కూడా కవల విద్యార్థులను గుర్తుపట్టలేక తికమక పడుతుంటారు. ఈ గ్రామంలోని కవలలు అందరూ ఒక సంఘం (టాకా)గా ఏర్పాడ్డారు. ఇందులో 600 మంది సభ్యులుగా చేరారు. 85 ఏళ్ల మహమ్మద్ హాజీ గ్రామంలోని కవలలందరిలో పెద్దవారు. కవలలు పుడితే ఒక పక్క ఆనందంగా ఉన్నా ఎన్నో ఇబ్బందులు కూడా ఉంటాయంటున్నారు ఈ ఊరి గ్రామస్తులు. ‘ఆర్థికంగా కుటుంబంపై భారం పెరుగుతుంది. ఇద్దరిని పెంచడం తల్లికి కూడా కష్టంగానే ఉంటుంది’... అంటున్నారు. శాస్త్రవేత్తల అధ్యయనం: గ్రామంలోని కవలలపై జాతీయ జన్యు శాస్త్రవేత్తల బృందం అధ్యయనం చేసింది. ఈ బృందంలో హైదరాబాద్లో ఉన్న ‘సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ’ నుంచి జీఆర్ చందక్ కూడా ఉన్నారు. కవలల ఆహారపు అలవాట్లు, వారసత్వం, వాతావరణం వంటి అంశాలను పరిశీలించారు. 14 వేల మంది నివసించే ఈ గ్రామంలో కవలలు అధికంగా ఎందుకు పుడుతున్నారో మాత్రం అంతుబట్టడం లేదు. ఇతర వివరాలు: గత దశాబ్దకాలంగా ఇక్కడ కవల జననాలు పెరిగాయని ఇక్కడి ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. కవలలపై ఆసస్తి ఉన్న డా. కృష్ణన్ శ్రీబిజ రెండేళ్లుగా ఈ విషయంపైనే పరిశోధనలు చేస్తున్నారు. ఈ గ్రామంలో 18-20 ఏళ్ల వయసులో పెళ్లిళ్లు జరుగుతున్నాయి. అక్కడి మహిళలందరూ దాదాపు 5 అడుగుల పొడవు మాత్రమే ఉంటారు. 2008లో మొత్తం 300 మంది పుడితే వారిలో 15 జతల కవలలు ఉన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో కవల పిల్లలు పుట్టడం చాలా అరుదు. కానీ ఇక్కడ మాత్రం ప్రపంచంలో కెల్లా అత్యధిక కవల జననాల రేటు నమోదవుతోంది. దాదాపు ప్రతి కుటుంబంలో కవలలు కనిపిస్తారు. యువత, మధ్య వయస్కులు, వృద్ధులు..అందరిలోనూ కవలలు కనిపిస్తారు. ఇలాంటిదే మరో గ్రామం: ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ జిల్లాలో ఉన్న ‘ఉమ్రీ’ గ్రామం కూడా కవల పిల్లల కారణంగా ప్రసిద్ధి చెందింది. ఆరువేల మంది నివసిస్తున్న ఈ గ్రామంలో 108 జతల కవలలు ఉన్నారు. వీరిని గుర్తుపట్టడానికి వీలులేనంతగా అచ్చుగుద్దినట్టు ఒకే విధంగా ఉంటారు. ఇక్కడి పది జననాల్లో ఒకటి కవలల ప్రసవం. ఇది ప్రపంచ రికార్డు. ప్రత్యేకతలు.. కవలల్లో 22 శాతం మంది ఎడమ చేతి వాటం కలిగి ఉంటారు. ప్రాంతాలను బట్టి కవల జననాల రేటులో వ్యత్యాసం ఉంటుంది. వీరు ఏడు రకాలుగా ఉంటారు. కవలలు ఒకే రోజు జన్మిస్తారనే నియమం ఏమీ లేదు. గరిష్టంగా 85 రోజుల వ్యవధిలో జన్మించిన కవలలు కూడా ఉన్నారు. ఎంత సారూప్యత ఉన్నా వేలి ముద్రల్లో మాత్రం భేదాలుంటాయి. కొన్ని రకాల ఆహార పదార్థాలు కూడా కవలలు జన్మించే అవకాశాలను పెంచుతాయని అధ్యయానాల్లో వెల్లడైంది. కవల జననాల్లో నైజీరియా అగ్ర స్థానంలో, చైనా చివరి స్థానంలో ఉన్నాయి. 40 శాతం మంది కవలలు, సంభాషించుకునేందుకు తమదైన ప్రత్యేక భావజాలాన్ని ఉపయోగిస్తారట. కవలలకు జన్మ నిచ్చిన తల్లి జీవిత కాలం మిగిలిన వారితో పోలిస్తే అధికంగా ఉంటుంది. పొడవుగా ఉండే మహిళలకు కవలలు జన్మించే అవకాశాలు అధికంగా ఉంటాయి. ఎక్కువగా తినే అలవాటు ఉండే వారికి కూడా కవల పిల్లలు పుట్టే అవకాశాలు ఎక్కువే. తల్లి కడుపులో ఉండగానే కవలలు సంభాషించుకోవడం ప్రారంభిస్తారట. కేవలం అతి కొద్ది మంది కవలల్లో మాత్రమే ఒకరు ఏం చేస్తే రెండో వారికి అది చేయాలనిపిస్తుంది. -
ఉద్యోగాలు
సీసీఎంబీ హైదరాబాద్లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ (సీసీఎంబీ) కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టుల వివరాలు.. పాజెక్టు అసిస్టెంట్/ జూనియర్ రీసెర్చ్ ఫెలో/ ప్రాజెక్టు ఫెలో అర్హత: బయో టెక్నాలజీ/ బయో ఇన్ఫర్మాటిక్స్/ కంప్యూటర్ సైన్స్/ కెమిస్ట్రీ/ బయలాజికల్ సెన్సైస్లో మాస్టర్స్ డిగ్రీ/ బీఈ/ బీటెక్ ఉండాలి. వయసు: 28 ఏళ్లకు మించకూడదు. పోస్ట్ డాక్టోరల్ ఫెలో/ రీసెర్చ అసోసియేట్ అర్హత: బయలాజికల్ సెన్సైస్లో పీహెచ్డీ. వయసు: 35 ఏళ్లకు మించకూడదు. పోస్ట్ డాక్టోరల్ సైంటిస్ట్ ఫెలో అర్హత: బయోఇన్ఫర్మాటిక్స్లో పీహెచ్డీ. వయసు: 40 ఏళ్లకు మించకూడదు. ల్యాబొరేటరీ టెక్నీషియన్ అర్హత: కంప్యూటర్ సైన్స్లో బీఎస్సీ/ బీసీఏ. సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి. వయసు: 28 ఏళ్లకు మించకూడదు. ఫీల్డ్ అసిస్టెంట్/ ల్యాబొరేటరీ అటెండెంట్ అర్హత: ఇంటర్/ డిప్లొమా ఉండాలి. వయసు: 28 ఏళ్లకు మించకూడదు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు చివరితేది: అక్టోబరు 9 వెబ్సైట్: http://www.ccmb.res.in మరిన్ని నోటిఫికేషన్ల కోసం http://sakshieducation.com చూడవచ్చు -
మూలకణాలతో గుండెకు చికిత్స
15 నిమిషాల్లో డీఎన్ఏ పరీక్షలు పూర్తి చేసే పరిజ్ఞానం సీఎస్ఐ వార్షిక సదస్సులో సీసీఎంబీ డెరైక్టర్ మోహన్రావు వెల్లడి సాక్షి, హైదరాబాద్: మూలకణాల (స్టెమ్సెల్స్) ద్వారా హృద్రోగ సంబంధ సమస్యలను నయం చేసే సరికొత్త పరిజ్ఞానం త్వరలోనే అందుబాటులోకి రానుందని సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) డెరైక్టర్ మోహన్రావు స్పష్టం చేశారు. గుండెలో మూల కణాలు ఉండవనేది అపోహ మాత్రమేనని, ఇప్పటికే జరిగిన అనేక పరిశోధనలు ఇదే అంశాన్ని నిర్ధారించాయన్నారు. బంజారాహిల్స్లోని హోటల్ పార్క్హయత్లో శనివారం ఏర్పాటు చేసిన కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా (ఏపీ చాప్టర్) 19వ వార్షిక సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై, సదస్సును ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ హృద్రోగ బాధితుల్లో చాలామందికి ప్రస్తుతం ఓపెన్ హార్ట్ సర్జరీ, మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీలు చేస్తున్నారని, ఖరీదైన స్టంట్స్ను అమర్చి మూసుకుపోయిన రక్తనాళాలను పునరుద్ధరిస్తున్నారని చెప్పారు. ఇకపై ఇలాంటి శస్త్రచికిత్సల అవసరం ఉండబోదన్నారు. స్టెమ్సెల్స్ పరిజ్ఞానం ద్వారా హృద్రోగ సంబంధ సమస్యలను పరిష్కరించుకునే అవకాశం త్వరలో అందుబాటులోకి రానుందని చెప్పారు. గుండెనొప్పికి కారణాలను కనుగొనేందుకు చేసే డీఎన్ఏ పరీక్షలు 15 నిమిషాల్లోనే పూర్తిచేసే సరికొత్త పరిజ్ఞానాన్ని మరో మూడేళ్లలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. అలాగే ఫార్మికోజెనిటిక్స్ ఆధారంగా రోగి అవ సరానికి తగినట్లుగా మందులు తయారు చేసే పరిజ్ఞానం కూడా రాబోతుందన్నారు. సదస్సుకు దేశ విదేశాల నుంచి సుమారు 200 మంది హృద్రోగ నిపుణులు హాజరయ్యారు. -
వాళ్లెందుకు తెల్లన?
* జన్యుమార్పే కారణమంటున్న సీసీఎంబీ * అంతర్జాతీయ శాస్త్రవేత్తలతో కలిసి అధ్యయనం * భారతీయులతోపాటు యూరోపి యన్లలోనూ ఒకేతరహా జన్యుమార్పు సాక్షి, హైదరాబాద్: ప్రపంచంలో ఏ మూలకెళ్లినా అక్కడి మనుషుల రంగుల్లో ఎన్నో తేడాలు కనిపిస్తాయి. కొందరు తెల్లగా, మరికొందరు చామనఛాయతో, ఇంకొందరు నల్లగా! ఉన్న ప్రాంతాన్నిబట్టి శరీరాన్ని అతినీలలోహిత కిరణాల నుంచి రక్షించుకునేందుకు ప్రకృతి చేసిన ఏర్పాటు ఇదని పరిణామ సిద్ధాంతం చెబుతుంది. చర్మంలో మెలనిన్ అనే రసాయనం మోతాదు, విస్తృతుల ఆధారంగా మన రంగు నిర్ణయమవుతుందనీ మనకు తెలుసు. అయితే ధ్రువ ప్రాంతాలకు దగ్గరగా ఉన్నవాళ్లకు తెల్లరంగు ఉందంటే అర్థం చేసుకోవచ్చుగానీ.. భారత్తోపాటు దక్షిణాసియా దేశాల్లోని కొంత మంది కూడా యూరోపియన్ల మాదిరిగానే తెల్లరంగుతో మెరిసిపోయేందుకు కారణమేమిటి? ఈ ప్రశ్నకు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) సమాధానం కనుక్కుంది. శరీర రంగును నిర్ధారించే జన్యువుల్లో ఒకటైన ‘ఎస్ఎల్సీ 24 ఏ5’లో వచ్చిన మార్పులే దీనికి కారణమని ఈస్టోనియాలోని టర్టూ, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలతో కలిసి సీసీఎంబీ నిర్వహించిన పరిశోధనలో వెల్లడైంది. 20 వేల ఏళ్ల క్రితమే తెల్లని భారతీయులు! ‘‘భారత్లోని కొంతమందిపై మేం పరిశోధనలు జరిపాం. ఎస్ఎల్సీ 24 ఏ5 జన్యువు ఆధారంగా వారి చర్మపు రంగులోని తేడాలను అర్థం చేసుకోగలిగాం. అంతేకాదు.. ఈ జన్యువులోని మ్యూటేషన్ (సూక్ష్మస్థాయిలో జరిగే మార్పు-ఉత్పరివర్తనం) కారణంగా కొంతమంది చర్మపు రంగు తెల్లగా ఉన్నట్లు స్పష్టమైంది’’ అని ఈ అధ్యయనంలో పాలుపంచుకున్న సీసీఎంబీ శాస్త్రవేత్త డాక్టర్ కె.తంగరాజ్ ‘న్యూస్లైన్’కు తెలిపారు. భారతీయులతోపాటు యూరోపియన్లలోనూ ఈ మ్యూటేషన్ కనిపిస్తుందని, ముఖ్యంగా ఉత్తర భారతీయులకూ యూరోపియన్లకు మధ్య ఉన్న జన్యుపరమైన సంబంధాన్ని ఇది మరింత స్పష్టం చేస్తుందన్నారు. ఈ జన్యుపరమైన మార్పు సుమారు 22-28 వేల ఏళ్ల క్రితమే జరిగిందని, పరిణామ క్రమంలో మనిషి శరీరపు రంగు ఎప్పుడు మారిందో అర్థం చేసుకునేందుకు తమ అధ్యయనం దోహదపడుతుందని వివరించారు. ‘‘చర్మపు రంగులో వచ్చిన మార్పును అర్థం చేసుకునేందుకు మాత్రమే కాకుండా.. మరింత విసృ్తత అధ్యయనం ద్వారా సౌందర్యపోషణ పదార్థాలను మరింత సమర్థంగా ఎలా వాడాలో కూడా ఈ అధ్యయనం చెబుతుంది’’ అని సీసీఎంబీ డెరైక్టర్ డాక్టర్ సీహెచ్ మోహనరావు పేర్కొన్నారు. ఈ పరిశోధన వివరాలు ‘పీఎల్ఓఎస్ జెనెటిక్స్’ మ్యాగజైన్లో ప్రచురితమయ్యాయి.