central govt employees
-
కేంద్ర అధికారులపై కేసు నమోదుకు.. సీబీఐకి రాష్ట్రాల అనుమతి అవసరం లేదు
న్యూఢిల్లీ: రాష్ట్రాల్లో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ అధికారులపై సీబీఐ కేసు నమోదు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసింది. జస్టిస్ సీటీ రవి కుమార్, జస్టిస్ రాజేశ్ బిందాల్ల ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ‘ఏ హోదాలో ఉన్నాసరే, ఆ ఇద్దరూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు/ కేంద్ర ప్రభుత్వ ఆదీనంలోని సంస్థలు విభాగాల్లో పనిచేస్తున్న అధికారులు, కేంద్ర ప్రభుత్వ చట్టాల ప్రకారం వారిపై తీవ్ర అభియోగాలున్నాయి’అని ధర్మాసనం కుండబద్దలు కొట్టింది. ఆంధ్రప్రదేశ్లో పనిచేసే ఇద్దరు కేంద్ర అధికారులపై అవినీతి ఆరోపణలకు సంబంధించి అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్–1946 కింద సీబీఐకి గతంలో అనుమతిచ్చిందని, రాష్ట్రం వేరు పడినందున మళ్లీ అనుమతులు అవసరమన్న నిందితుల వాదనతో హైకోర్టు ఏకీభవిస్తూ వారిపై నమోదైన ఎఫ్ఐఆర్లను కొట్టివేసింది. దీనిని తప్పుబట్టిన సుప్రీం ధర్మాసనం.. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్కు వర్తించిన అన్ని చట్టాలు కొత్తగా ఏర్పాటైన రెండు రాష్ట్రాలకు యథాప్రకారం కొనసాగుతాయని తేలి్చచెప్పింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై ఎఫ్ఐఆర్ నమోదుకు తాజాగా ఎలాంటి అనుమతి అవసరం లేదని తెలిపింది. -
ఆరు పంటలకు ‘మద్దతు’
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రైతన్నలకు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర సర్కారు తీపి కబురు అందించింది. 2025–26 మార్కెటింగ్ సీజన్కు గాను ఆరు పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) పెంచుతూ కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే ఉద్యోగులకు కరువు భత్యాన్ని(డీఏ) మరో 3 శాతం పెంచింది. దీంతో మొత్తం డీఏ 53 శాతానికి చేరుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆర్థిక వ్యవహారాలపై కేంద్ర కేబినెట్ బుధవారం సమావేశమైంది. ఈ భేటీలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. గోధుమలు, ఆవాలు, మైసూరు పప్పు, శనగలు, పొద్దుతిరుగుడు గింజలు, బార్లీ పంటలకు మద్దతు ధర పెంచినట్లు తెలిపారు. రబీ పంట సీజన్కు సంబం«ధించి నాన్–యూరియా ఎరువులకు రూ.24,475 కోట్ల రాయితీ ఇస్తున్నట్లు వివరించారు. రైతుల ఆదాయం పెంచడమే ధ్యేయంగా ‘పీఎం అన్నదాత ఆయ్ సంరక్షణ్ అభియాన్’కు రూ.35 వేల కోట్లు ఇచ్చేందుకు అంగీకారం తెలిపినట్లు వివరించారు. పంటలకు కనీస మద్దతు ధర పెంపునకు త్వరలో జరగబోయే పలు రాష్ట్రాల అసెబ్లీ ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేశారు. నరేంద్ర మోదీ పాలనలో రైతుల జీవితాల్లో గణనీయమైన మార్పులు వచ్చాయని చెప్పారు. మోదీ ప్రభుత్వం పట్ల రైతన్నలు సానుకూలంగా ఉన్నారని వివరించారు. రూ.2,642 కోట్లతో చేపట్టనున్న వారణాసి–పండిత్ దీన్దయాళ్ ఉపాధ్యాయ(డీడీయూ) మల్టీ–ట్రాకింగ్ పాజెక్టుకు కేబినెట్ ఆమోదముద్ర వేసినట్లు అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. ఈ ప్రాజెక్టులో భాగంగా వారణాసిలో గంగా నదిపై రైల్ కమ్ రోడ్ బ్రిడ్జి నిర్మించనున్నట్లు తెలిపారు. రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా ఆరు రకాల రబీ పంటలకు కనీస మద్దతు ధర పెంచినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో పోస్టు చేశారు. కనీస మద్దతు ధర పెంచినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు. రైతాంగం సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఉద్యోగులకు, పెన్షనర్లకు దీపావళి కానుక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రభుత్వం దీపావళి కానుక ప్రకటించింది. వారికి కరువు భత్యం 3 శాతం పెంచుతూ కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈ పెంపు ఈ ఏడాది జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందన్నారు. దీనికారణంగా కేంద్ర ఖజానాపై రూ.9,448 కోట్ల భారం పడనుందని వెల్లడించారు. డీఏ పెంపుతో దాదాపు కోటి మందికిపైగా ఉద్యోగులు, పెన్షనర్లు ప్రయోజనం పొందుతారని చెప్పారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ ఏడాది మార్చి నెలలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో డీఏ 4 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఇది అమల్లోకి వచి్చంది. ప్రస్తుతం దేశంలో 49.18 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 64.89 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. -
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇకపై భారీగా రిటైర్మెంట్ సొమ్ము
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇకపై రిటైర్మెంట్ సొమ్ము భారీగా పెరగనుంది. ఈ మేరకు నేషనల్ పెన్షన్ సిస్టమ్లో నిబంధనలను ప్రభుత్వం సవరించింది. పెన్షన్, పెన్షనర్ల సంక్షేమ శాఖ నేషనల్ పెన్షన్ సిస్టమ్ పరిధిలోకి వచ్చే కేంద్ర ప్రభుత్వ సివిల్ ఉద్యోగుల సర్వీస్ సంబంధిత విషయాలను నియంత్రించడానికి సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (నేషనల్ పెన్షన్ సిస్టమ్ అమలు) రూల్స్, 2021ని నోటిఫై చేసింది.కేంద్ర ప్రభుత్వ సిబ్బందికి ఎన్పీఎస్ కింద ఉద్యోగి ప్రాథమిక వేతనంలో యజమాని చెల్లించే మొత్తాన్ని 14 శాతానికి పెంచాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవలి కేంద్ర బడ్జెట్ 2024-25లో ప్రతిపాదించారు. కేంద్ర సిబ్బంది, పబ్లిక్ గ్రీవెన్స్,పెన్షన్ల మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చే పెన్షనర్ల సంక్షేమ విభాగం ఎన్పీఎస్ కింద చెల్లించే మొత్తాలను వివరిస్తూ కొత్త ఆఫీస్ మెమోరాండమ్ను విడుదల చేసింది.సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (నేషనల్ పెన్షన్ సిస్టమ్ అమలు) రూల్స్, 2021లోని రూల్ 7 ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఉద్యోగి జీతంలో 14 శాతాన్ని వారి వ్యక్తిగత పెన్షన్ ఖాతాకు ప్రతి నెలా జమ చేస్తుంది. మెడికల్ లీవ్, ఉన్నత విద్య కోసం వెళ్లడం కొన్ని సందర్భాలలో మినహా ఉద్యోగి పెన్షన్ కాంట్రిబ్యూషన్ చెల్లించని సమయంలో ప్రభుత్వం కూడా తన వంతు మొత్తాన్ని చెల్లించదు.ఇక ఉద్యోగి సస్పెన్షన్లో ఉన్నప్పుడు పెన్షన్ కాంట్రిబ్యూషన్స్ ఉద్యోగికి చెల్లించే జీవనాధార భత్యంపై ఆధారపడి ఉంటాయి. సస్పెన్షన్ కాలం తరువాత ఒకవేళ అది జీతం చెల్లించాల్సిన డ్యూటీ లేదా సెలవుగా వర్గీకరిస్తే ఆ మేరకు ప్రభుత్వం చందాలను సర్దుబాటు చేస్తుంది. ఉద్యోగులు ఫారిన్ సర్వీస్లో ఉన్నప్పుడు ఎన్పీఎస్ చందాలకు సంబంధించి కూడా మెమోరాండం వివరించింది. ఇవి డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరిస్తాయి. -
కేంద్రం శుభవార్త: ఆ ఉద్యోగులకు రూ.2,029 కోట్ల బోనస్
దసరా, దీపావళి వచ్చిందంటే.. ఉద్యోగుల్లో ఆనందం రెట్టింపు అవుతుంది. ఎందుకంటే ఈ సమయంలో చాలా కంపెనీలు బోనస్, ఇంక్రిమెంట్స్ వంటివి అందిస్తాయి. మరికొన్ని ప్రైవేట్ సంస్థలైతే ఖరీదైన కార్లు, బైకులను శాతం గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇప్పుడు తాజాగా కేంద్రం రైల్వే ఉద్యోగులకు శుభవార్త చెప్పింది.రైల్వే ఉద్యోగులకు రూ. 2,029 కోట్ల ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇది 11,72,140 మంది కార్మికులకు ప్రయోజనం చేకూర్చుతుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. అర్హత కలిగిన ఉద్యోగులందరికీ.. రూ. 7000 కనీస వేతనం కింద 78 రోజులకు బోనస్ అందించనున్నట్లు సమాచారం.ఇదీ చదవండి: ఎస్బీఐ చైర్మన్ కీలక ప్రకటన: ఈ ఆర్థిక సంవత్సరంలో..రైల్వే శాఖలో ట్రాక్ మెయింటెనెర్స్, స్టేషన్ మాస్టర్స్, టెక్నీషియన్స్, సూపర్ వైజర్స్, పాయింట్స్ మెన్, గార్డ్స్, లోకో పైలెట్స్, మినిస్టీరియల్ స్టాప్, గ్రూప్-సీ విభాగాలకు చెందిన ఉద్యోగులు బోనస్ పొందనున్నారు. 58,642 ఖాళీల భర్తీ ప్రక్రియ కూడా కొనసాగుతుందని, రిక్రూట్మెంట్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అశ్విని వైష్ణవ్ అన్నారు.रेलवे इम्प्लॉईज़ के लिए 2 हजार 29 करोड़ रुपये का प्रोडक्टिविटी लिंक्ड बोनस माननीय प्रधानमंत्री जी की अध्यक्षता में कैबिनेट में अप्रूव हुआ है-माननीय रेल मंत्री @ashwinivaishnaw जी#ShramevJayate pic.twitter.com/15bHeQufpZ— Ministry of Railways (@RailMinIndia) October 3, 2024 -
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక!
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు డియర్నెస్ అలవెన్స్ (డీఏ) పెంపు కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అక్టోబర్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నా దీనికి సంబంధించిన సమాచారమేదీ ఇంకా బయటకు రాలేదు. గతేడాది అక్టోబర్ మొదటి వారంలో డీఏ పెంపును ప్రకటించారు.నివేదికల ప్రకారం.. దీపావళికి ముందు ప్రభుత్వం 3-4 శాతం డీఏ పెంపును ప్రకటించే అవకాశం ఉంది. దీని ప్రకారం రూ. 18,000 బేసిక్ జీతం ఉన్న ఉద్యోగికి నెలకు రూ. 540-720 జీతం పెరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ ఉన్నట్లే పెన్షనర్లకు డియర్నెస్ రిలీఫ్ (డీఆర్) అందజేస్తారు. రెండూ సంవత్సరానికి రెండుసార్లు జనవరి, జూలై నెలల్లో సవరిస్తారు. ప్రస్తుతం కోటి మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు 50 శాతం డీఏ పొందుతున్నారు.ఇదీ చదవండి: ‘సుకన్య సమృద్ధి’పై వడ్డీ పెరిగిందా?ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వం ఇప్పటికే డీఏ, డీఆర్లను 4 శాతం పెంచింది. వాటిని బేసిక్ పేలో 50 శాతానికి తీసుకువచ్చింది. డీఏలో పెరుగుదల శాతం ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (ఏఐసీపీఐ)పై ఆధారపడి ఉంటుంది. -
‘యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్’..కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వోద్యోగుల కోసం మోదీ సర్కారు తాజాగా ఏకీకృత పెన్షన్ విధానాన్ని (యూపీఎస్) తీసుకొచ్చింది. ఉద్యోగుల చిరకాల డిమాండ్లను నెరవేరుస్తూ హరియాణా, జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా కనీసం పాతికేళ్ల సర్వీసు పూర్తి చేసుకునే వారికి వేతనంలో సగం మొత్తాన్ని అష్యూర్డ్ పెన్షన్గా అందిస్తారు. దీనికి అదనంగా రిటైర్మెంట్ సమయంలో నిర్దిష్ట మొత్తాన్ని ఏకమొత్త ప్రయోజనంగా కూడా అందజేస్తారు. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో శనివారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం యూపీఎస్కు ఆమోదముద్ర వేసింది. దీనితో 23 లక్షల మంది కేంద్ర ప్రభుత్వోద్యోగులకు లబ్ధి చేకూరుతుందని కేంద్ర సమాచార, ప్రసార మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. వారికి సామాజిక భద్రత లభిస్తుందన్నారు. కేబినెట్ నిర్ణయాలను ఆయన మీడియాకు వెల్లడించారు. నూతన జాతీయ పెన్షన్ విధానం (ఎన్పీఎస్)లో ఉన్న ఉద్యోగులు యూపీఎస్కు మారవచ్చని చెప్పారు. 2004 జనవరి 1 తర్వాత సర్వీసుల్లో చేరిన వారికి ఈ పథకం వర్తించనుంది. సైనికోద్యోగులను మినహాయించి 2004 జనవరి 1 నుంచి కేంద్ర ప్రభుత్వోద్యోగాల్లో చేరిన వారందరికీ ఎన్పీఎస్ను అమలు చేయడం తెలిసిందే. సోమనాథన్ కమిటీ సూచనలతో..మోదీ సర్కారు తీసుకొచ్చిన ఎన్పీఎస్పై ప్రభుత్వోద్యోగుల్లో వ్యతిరేకత రావడం తెలిసిందే. డీఏ ఆధారిత పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) కోసం వాళ్లు పట్టుబడుతున్నారు. పలు రాష్ట్రాలు, ముఖ్యంగా బీజేపీయేతర పారీ్టల పాలనలోని రాష్ట్రాలు ఇప్పటికే ఓపీఎస్ వైపు మళ్లాయి. ఈ నేపథ్యంలో కేంద్రం తాజాగా యూపీఎస్ను తెరపైకి తెచ్చింది. ఇందుకోసం కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్ సారథ్యంలో గతేడాది ఒక కమిటీ వేసింది. ప్రభుత్వోద్యోగుల పెన్షన్ పథకాన్ని సమీక్షించి, దానికి చేయాల్సిన మార్పుచేర్పులపై సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిగా కోరింది. కమిటీ 100కు పైగా భేటీలు జరిపిన మీదట యూపీఎస్ విధి విధానాలను రూపొందించినట్టు వైష్ణవ్ వెల్లడించారు. ఈ పథకం వచ్చే ఆర్థిక సంవత్సరం (2025 ఏప్రిల్ 1) నుంచి అమల్లోకి వస్తుందని సోమనాథన్ తెలిపారు. ఉద్యోగుల గౌరవం, ఆర్థిక భద్రత: మోదీ యూపీఎస్తో ప్రభుత్వోద్యోగులకు గౌరవం, ఆర్థిక భద్రత పెరుగుతాయని ప్రధాని మోదీ అన్నారు. ‘‘జాతి ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రభుత్వోద్యోగులు మనకు గర్వకారణం. వారి సంక్షేమానికి, భావి జీవిత భద్రతకు కేంద్రం కట్టుబడి ఉంది’’ అంటూ ఎక్స్లో పోస్టు చేశారు. బాక్సు యూపీఎస్ విశేషాలివీ... 👉 అష్యూర్డ్ పెన్షన్: ఉద్యోగులు రిటైర్మెంట్కు ముందు తమ చివరి 12 నెలల సగటు బేసిక్ వేతనంలో సగం మొత్తాన్ని పెన్షన్గా అందుకుంటారు. ఇందుకోసం కనీసం పాతికేళ్ల సరీ్వసు పూర్తి చేసుకుని ఉండాలి. అంతకంటే తక్కువైతే సరీ్వసు కాలాన్ని బట్టి పెన్షన్ మొత్తం నిర్ధారణ అవుతుంది. 👉అష్యూర్డ్ మినిమం పెన్షన్: కనీసం పదేళ్ల సరీ్వసు పూర్తి చేసుకున్న వారికి రిటైర్మెంట్ అనంతరం నెలకు రూ.10 వేల కనీస పెన్షన్ అందుతుంది. తద్వారా అల్ప వేతనాలుండే దిగువ స్థాయి ఉద్యోగులకు ఇది ఆర్థిక భద్రత కలి్పస్తుంది. 👉 అష్యూర్డ్ ఫ్యామిలీ పెన్షన్: పెన్షనర్ మరణిస్తే కుటుంబానికి అతని పెన్షన్లో 60 శాతాన్ని అందజేస్తారు. తద్వారా ఆ కుటుంబానికి కనీస ఆర్థిక భద్రత కలుగుతుంది. కొత్తగా ఏకమొత్త ప్రయోజనం 👉 ప్రతి ఆర్నెల్ల సర్వీసుకూ నెలవారీ వేతనం (జీతం+డీఏ)లో పదోవంతు చొప్పున రిటైర్మెంట్ సమయంలో ఏకమొత్తంగా అందజేస్తారు. గ్రాట్యుటీ తదితర బెనిఫిట్లకు ఇది అదనం. 👉 సర్వీసులో ఉన్న ఉద్యోగుల మాదిరిగా యూపీఎస్ పెన్షనర్లకు కూడా ద్రవ్యోల్బణ సూచిక, డీఆర్ ప్రయోజనాలను వర్తింపజేస్తారు. 👉ఇప్పటికే ఎన్పీఎస్ కింద రిటైరైన వారితో పాటు 2025 మార్చి 31 నాటికి రిటైరయ్యే ఉద్యోగులకు కూడా యూపీఎస్ వర్తిస్తుంది. వారికి గత బకాయిలను పీపీఎఫ్ వడ్డీరేటుతో చెల్లిస్తారు. 👉 ఉద్యోగులు ఎన్పీఎస్, యూపీఎస్ల్లో దేన్నయినా ఎంచుకోవచ్చు. 👉 యూపీఎస్ బెనిఫిట్ల నిమిత్తం ఉద్యోగులపై అదనపు భారమేమీ పడబోదు. పెన్షన్ ఖాతాకు వారి చెల్లింపుల వాటా 10 శాతంగానే కొనసాగుతుంది. కేంద్రం వాటా ఇప్పుడున్న 14 శాతం నుంచి 18.5 శాతానికి పెరగనుంది. దీనివల్ల కేంద్రంపై రూ.6,250 కోట్ల దాకా భారం పడనుందని సోమనాథన్ వెల్లడించారు. బకాయిల రూపేణా మరో రూ.800 కోట్ల భారం పడుతుందన్నారు. 👉 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా యూపీఎస్ను అమలు చేయాలని కేంద్రం సూచించింది. తద్వారా 90 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుందని పేర్కొంది. బాక్సు కేబినెట్ ఇతర నిర్ణయాలు బయో ఈ–3, విజ్ఞాన్ధారతో పాటు 11, 12వ తరగతి విద్యార్థులకు ఇంటర్న్షిప్ పథకాలకు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. విజ్ఞాన్ధారలో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, రీసెర్చ్, ఇన్నొవేషన్లకు సంబంధించి మూడు ప్రస్తుత పథకాలను ఒకే గొడుగు కిందకు తెచి్చంది. ఇందులో భాగంగా ప్రభుత్వం, విద్యా, పరిశ్రమల రంగాల మధ్య పరస్పర సహకారాన్ని మరింతగా పెంచేలా ప్రోత్సహిస్తారు. ఈ పథకానికి రూ.10,579 కోట్లు కేటాయించారు. బయో ఈ–3 కింద ఆర్థిక, పర్యావరణ, ఉపాధి రంగాల్లో బయో టెక్నాలజీకి మరింత ప్రోత్సహమందిస్తారు. దీన్ని ఒక చరిత్రాత్మక ముందడుగుగా ప్రధాని మోదీ అభివరి్ణంచారు. విజ్ఞాన్ధార పథకం యువతను శాస్త్రీయ పరిశోధనల వైపు మరింతగా మళ్లించి ఆ రంగంలో భారత్ను ప్రపంచంలో అగ్ర స్థానంలో నిలుపుతుందని అభిప్రాయపడ్డారు. -
చాక్లెట్లు కొనుక్కొని ఇంటికి వెళ్తుండగా..
సైదాబాద్: షాపులో చాక్లెట్లు కొనుక్కొని ఇంటికి వెళుతున్న మైనర్ బాలికను ఓ కామాంధుడు ఇంట్లోకి పిలిచి లైంగిక దాడికి పాల్పడ్డాడు. వివరాలు... సైదాబాద్ పోలీసుస్టేషన్ పరిధిలోని ఒక కాలనీలో నివసించే ఓ కుటుంబానికి చెందిన బాలిక(10) ఈ నెల 11న కిరాణషాపులో చాక్లెట్లు కొనుక్కొని ఇంటికి వెళుతోంది. బాలిక ఇంటికి సమీపంలో నివసించే ఓ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి(58) ఆమెను ఇంట్లోకి తీసుకెళ్లి లైంగికంగా వేధించాడు. దాంతో భయపడిన బాలిక తప్పించుకొని ఏడుస్తూ ఇంటికి చేరుకుంది. ఏం జరిగిందని తల్లి అడగటంతో విషయం బయట పడింది. నెల రోజుల క్రితం కూడా ఇంటి వద్ద తాను ఆడుకుంటుండగా అతడు ఇంట్లోకి పిలిచి అసభ్యంగా ప్రవర్తించాడని తల్లికి చెప్పింది. వెంటనే బాలిక తల్లి అతని ఇంటికి వెళ్లి నిలదీయగా ఎదురుదాడి చేశాడు. ఈ ఘటనపై అదే రోజు సైదాబాద్ పోలీసులను బాలిక తల్లి ఆశ్రయించగా నిందితుడితో రాజీ చేసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. రెండురోజులపాటు పోలీసుస్టేషన్ చుట్టూ తిరిగినా కేసు నమోదు కాలేదు. బాధితురాలి తండ్రి ఒక పోలీస్ ఉన్నతాధికారి వద్ద వంటమనిషిగా పనిచేస్తున్నాడు. ఆయనకు విషయం చెప్పగా సైదాబాద్ పోలీసులకు ఫోన్ చేసినట్లు సమాచారం. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులు ఈ నెల 13న నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. అయితే నిందితుడి భార్య, కూతురు తమను తిట్టారని, ఎక్కడికి వెళ్లి ఫిర్యాదు చేసుకుంటారో చేసుకోండని బెదిరించారని బాధితురాలి తల్లి ఫిర్యాదులో పేర్కొంది. -
ఉద్యోగులకు శుభవార్త.. బడ్జెట్లో ఆ ప్రకటన?
Budget 2024-25: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై 23న పార్లమెంట్లో 2024-25 పూర్తిస్థాయి బడ్జెట్ను సమర్పించనున్నారు. ఈ బడ్జెట్కు సంబంధించి వివిధ రంగాలు అనేక అంచనాలను పెట్టుకున్నాయి. మరోవైపు ఉద్యోగులు, పెన్షనర్లకు 8వ వేతన సంఘం అమలును కేంద్ర ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.వాస్తవానికి 8వ వేతన సంఘం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికుల సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఎస్బీ యాదవ్ భారత ప్రభుత్వ కేబినెట్ కార్యదర్శికి లేఖ రాశారు. పాత పెన్షన్ స్కీమ్ (OPS)ని పునరుద్ధరించాలని, 18 నెలల డియర్నెస్ అలవెన్స్ను విడుదల చేయాలని లేఖలో డిమాండ్ చేశారు.8వ వేతన సంఘం అమలు ఎప్పటి నుంచి?సాధారణంగా సెంట్రల్ పే కమిషన్ ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఏర్పడుతుంది. ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, అలవెన్సులు అలాగే ప్రయోజనాలను సమీక్షించి, సవరణలను సిఫారసు చేస్తుంది. ద్రవ్యోల్బణం, ఇతర బాహ్య కారకాలను దృష్టిలో ఉంచుకుని ఈ సిఫార్సులు చేస్తుంది. ఏడవ వేతన సంఘాన్ని 2014 ఫిబ్రవరి 28న అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఏర్పాటు చేశారు. ఈ పే కమిషన్ 2015 నవంబర్ 19న తమ నివేదికను సమర్పించింది. ఆ సిఫార్సులు 2016 జనవరి 1న అమలయ్యాయి. దీని ప్రకారం చూస్తే 8వ పే కమిషన్ 2026 జనవరి 1 నుంచి అమలు కావాలి. అయితే, దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.8వ పే కమిషన్ ప్రకటనపై సానుకూలం!గత వేతన సంఘాన్ని ఫిబ్రవరి నెలలోనే ప్రకటించిన నేపథ్యంలో ఈ సారి పే కమిషన్ను ఎన్నికల దృష్ట్యా ఫిబ్రవరిలో 2024 మధ్యంతర బడ్జెట్లో ప్రకటించలేదు. పే కమిషన్ను వెంటనే ఏర్పాటు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తుండటం, పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెడుతున్న క్రమంలో ఇప్పుడు 8వ పే కమిషన్ ఏర్పాటుపై ఖచ్చితంగా ప్రకటన ఉంటుందని భావిస్తున్నారు. -
లేటుగా వస్తే.. ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం హెచ్చరిక
ఢిల్లీ: కార్యాలయాలకు ఆలస్యంగా వచ్చే ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. దీనికి అనుగుణమైన ఆదేశాలు ఇప్పటికే ఉన్నతాధికారులకు అందాయి. కొందరు ఉద్యోగులు బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టమ్ (ఏఈబీఏఎస్)లో హాజరు నమోదు చేయకపోవడం, మరికొందరు ఉద్యోగులు నిత్యం ఆఫీసుకు ఆలస్యంగా రావడం జరుగుతోంది. దీనిపై వస్తున్న ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకుని కేంద్రప్రభుత్వ ఈ విధమైన ఆదేశాలు జారీచేసింది.సిబ్బంది మంత్రిత్వ శాఖ తాజాగా మొబైల్ ఫోన్ ఆధారిత ప్రమాణీకరణ వ్యవస్థను ఉపయోగించాలని ఉన్నతాధికారులకు సూచించింది. ఏఈబీఏఎస్ అమలు తీరును సమీక్షించిన ప్రభుత్వానికి దీని అమలులో అలసత్వం కనిపించింది. దీనిని సీరియస్గా తీసుకున్న మంత్రిత్వ శాఖ అన్ని ప్రభుత్వ విభాగాల సిబ్బంది హాజరు నివేదికలను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని నిర్ణయించింది. కొందరు ఉద్యోగులకు కార్యాలయానికి ఆలస్యంగా రావడం, త్వరగా బయలుదేరడం అలవాటుగా మారిందని, దీనిని నియంత్రించాలని ప్రభుత్వం ఉన్నతాధికారులను కోరింది.ఈ నిబంధనలు పాటించనివారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. అప్పుడే ఏఈబీఏఎస్లో రిజిస్టర్డ్, యాక్టివ్ ఉద్యోగుల మధ్య ఎలాంటి తేడాలు ఉండవని ప్రభుత్వం అన్ని శాఖల కార్యదర్శులకు జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. సంబంధిత సీనియర్ అధికారులు ఎప్పటికప్పుడు నివేదికలను పోర్టల్ నుంచి డౌన్లోడ్ చేసుకుని, డిఫాల్టర్లను గుర్తించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. కార్యాలయానికి సిబ్బంది ఎవరైనా ఆలస్యంగా వస్తే, దానిని హాఫ్-డే క్యాజువల్ లీవ్గా పరిగణించాలని సూచించింది. నెలలో ఒకటి లేదా రెండుసార్లు, న్యాయమైన కారణాలతో ఆలస్యంగా కార్యాలయానికి ఎవరైనా సిబ్బంది వస్తే అధికారులు వారిపై చర్యలు తీసుకోవలసిన అవసరం లేదని ప్రభుత్వం పేర్కొంది. -
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో శుభవార్త?
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో శుభవార్త. ఇటీవల కేంద్రం..కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్ 4శాతం పెంచింది. అయితే తాజాగా హెచ్ఆర్ఏ (హౌస్ రెంట్ అలవెన్స్) వంటి నిర్దిష్ట అలవెన్సులు సవరించే యోచనలో ఉన్నట్లు సమాచారం. డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ ప్రకారం..త్వరలో హెచ్ఆర్ఏ పెంపుకు సంబంధించిన ఉత్తర్వులు త్వరలో వెలువడనున్నట్లు తెలుస్తోంది.దీంతో డీఏ 50శాతానికి చేరినందున హెచ్ఆర్ఏ పెంపును ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు విడుదల చేస్తుందా? ఒకే వేళ విడుదల చేస్తే హెచ్ఆర్ఏలో ఎంత పెంపు ఉంటుందా? అని ఉద్యోగులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 50 శాతానికి చేరినందున హెచ్ఆర్ఏ ఎంత పెరుగుతుంది? హెచ్ఆర్ఏ అనేది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి నివాసం ఉండే ప్రాంతాన్ని బట్టి ఉంటుంది. హెచ్ఆర్ఏ గణన కోసం జనాభా లెక్కలు ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని వాటి ఆధారంగా నగరాలను టైప్ ఎక్స్, వై, జెడ్గా వర్గీకరించబడ్డాయి. 7వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం జులై 1, 2017 నుండి ఉద్యోగులు తమ బేసిక్ శాలరీ రూ.35,000లలో ఎక్స్ కేటగిరీ నగరానికి చెందిన ఉద్యోగి బేసిక్ పే రూ. 35,000లో 27శాతం = రూ. 9,450 వై కేటగిరీ నగరానికి చెందిన ఉద్యోగి బేసిక్ పే రూ. 35,000లో 18శాతం అంటే = రూ. 6,300 జెడ్ కేటగిరీ నగరానికి చెందిన ఉద్యోగి బేసిక్ పే రూ.35,000లో 9శాతం అంటే = రూ. 3,150 దీన్ని బట్టి 7వ పే కమీషన్ డీఏ 50శాతానికి చేరుకున్నప్పుడు ఉద్యోగికి చెల్లించే బేసిక్ పేలో ఎక్స్ కేటగిరీ నగరాల ఉద్యోగులకు 30 శాతం, వై కేటగిరీ నగరాల ఉద్యోగులకు 20 శాతం, వై కేటగిరీ నగరాల ఉద్యోగులకు 10 శాతంతో హెచ్ఆర్ఏ రేట్లు సవరించాలని సిఫార్సు చేసింది. దీన్ని బట్టి ఉద్యోగి బేసిక్ పే రూ.35,000లలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి హెచ్ఆర్ఏకి ఎక్స్ కేటగిరీ నగరానికి చెందిన ఉద్యోగి బేసిక్ పే రూ. 35,000లో 30శాతం అంటే = రూ. 10,500 వై కేటగిరీ నగరానికి చెందిన ఉద్యోగి బేసిక్ పే రూ. 35,000లో 20శాతం అంటే = రూ. 7,000 జెడ్ కేటగిరీ నగరానికి చెందిన ఉద్యోగి బేసిక్ పే రూ.35,000లో 10శాతం = రూ. 3,500 లు అందించే అవకాశం ఉందని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్ఆర్ఏ పెంపు: హెచ్ఆర్ఏ సవరణకు సంబంధించి కేంద్రం ప్రత్యేక ఉత్తర్వులు విడుదల చేస్తుందా? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల హెచ్ఆర్ఏలో ఈ సవరణను ప్రస్తావిస్తూ కేంద్రం ప్రత్యేక ఉత్తర్వులు విడుదల చేస్తుందా అన్న ప్రశ్నలకు ఆర్ధిక నిపుణులు మాట్లాడుతూ.. జూలై 7, 2017 నాటి ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆఫీస్ మెమోరాండం ప్రకారం డీఏ 50శాతం దాటిన తర్వాత హెచ్ఆర్ఏకి సంబంధించి స్పష్టమైన సూచనలు ఉన్నాయి. అందువల్ల, మరొక నోటిఫికేషన్ అవసరం లేదని, ఈ నోటిఫికేషన్ నేరుగా అమలు చేస్తుందని చెబుతున్నారు. -
ఉద్యోగులకు, పెన్షనర్లకు కేంద్రం శుభవార్త!
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త చెప్పనున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించే కరువు భత్యాన్ని (డీఏ)ని కేంద్రం 4శాతం పెంచే అవకాశం ఉన్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈ పెంపు తర్వాత డియర్ నెస్ అలవెన్స్, డియర్ నెస్ రిలీఫ్ (డీఆర్) 50 శాతానికి పైగా పెరగనుంది. చివరి సారిగా 2023 అక్టోబర్ లో కేంద్రం డీఏని 4 శాతం పెంచింది. ఆ నాలుగు శాతం పెంపుతో డీఏ 42 శాతం నుంచి 46 శాతానికి పెరిగింది. తాజా నిర్ణయంతో 48.67 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 67.95 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. గతంలో పారామిలటరీ బలగాలతో సహా గ్రూప్ సి, నాన్ గెజిటెడ్ గ్రూప్ బి స్థాయి అధికారులకు దీపావళి బోనస్లను ప్రభుత్వం ఆమోదించింది. 2022–2023కి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉత్పాదకత లేని బోనస్ల (అడ్ హాక్ బోనస్లు) లెక్కింపు కోసం ఆర్థిక మంత్రిత్వ శాఖ రూ.7,000 పరిమితిని నిర్ణయించింది . దేశ ద్రవ్యోల్బణం రేటు ఆధారంగా ప్రభుత్వం డీఏ పెంపుపై నిర్ణయం తీసుకుంటుంది. ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉంటే, డీఏ మరింత పెరిగే అవకాశం ఉంది. డీఏ, డీఆర్ పెరుగుదలలు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (AICPI) యొక్క 12 నెలల సగటు పెరుగుదల శాతం ద్వారా నిర్ణయించబడతాయి. -
కేంద్ర ప్రభుత్వోద్యోగులకు 4 శాతం డీఏ
న్యూఢిల్లీ: పండుగ సీజన్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు. ఉద్యోగులకు డీఏ, పెన్షనర్లకు డీఆర్ను 4 శాతం పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో ఉద్యోగులకు డీఏ వారి మూలవేతనంలో 46 శాతానికి చేరింది. అలాగే నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనాన్ని బోనస్గా ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ మేరకు పలు నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ నిర్ణయాలను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తర్వాత మీడియా సమావేశంలో వెల్లడించారు. డీఏ, డీఆర్ పెంపుతో 48.67 లక్షల మంది కేంద్ర ప్రభుత్వోద్యోగులు, 67.95 లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందుతారని ఆయన తెలిపారు. వీటితో ఖజానాపై రూ.2,857 కోట్ల భారం పడనుంది. డీఏ పెంపు 2023 జూలై 1 నుంచి వర్తిస్తుంది. గత మార్చి, 2022 సెపె్టంబర్లో డీఏ, డీఆర్ 4 శాతం మేరకు పెరిగాయి. ఇక బోనస్ పెంపుతో లోకో పైలట్లు, గార్డులు, స్టేషన్ మాస్టర్లు, సూపర్వైజర్లు, టెక్నీషియన్లు, పాయింట్స్ మెన్, ఇతర గ్రూప్– సి సిబ్బంది సహా 11.07 లక్షల మంది రైల్వే ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. దీని ద్వారా రైల్వేలపై రూ.1,969 కోట్ల ఆరి్ధక భారం పడనుందని ఠాకూర్ తెలిపారు. మరోవైపు చక్కెర ఎగుమతులపై నిషేధాన్ని అక్టోబర్ నెలాఖరును దాటి నిరవధికంగా కేంద్రం పొడిగించింది. భారత్ ప్రపంచంలో అతి పెద్ద చక్కెర తయారీదారు. రెండో అతి పెద్ద ఎగుమతిదారు. 2024–25 రబీ మార్కెటింగ్ సీజన్కు సంబంధించి గోధుమలకు మద్దతు ధరను మరో రూ.150 మేర పెంచుతూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం క్వింటాల్కు మద్దతు ధర రూ.2,125గా ఉంది. దీన్ని రూ.2,275కు పెంచినట్లుగా కేంద్రం ప్రకటించింది. కేంద్రంలో మోదీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచి్చన తర్వాత ఈ స్థాయిలో మద్దతు ధరను పెంచడం ఇదే తొలిసారి. ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో గోధుమలు సహా బార్లీ, ఎర్రపప్పు, శనగలు, కుసుమ, ఆవాల మద్దతు ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఎర్రపప్పు (మసూర్) ధర రూ.425 మేర పెంచడంతో క్వింటాల్ ధర రూ.6,425కి చేరింది. ఆవాలకు కనీస మద్దతు ధరను రూ.200 పెంచడంతో అది రూ.5,650కి చేరుకుంది. కుసుమలు క్వింటాల్ రూ.5,650గా ఉండగా, రూ.150 చొప్పున పెంచడంతో రూ.5,800లకు చేరింది. బార్లీ మద్దతు ధరను రూ.115 మేర పెంచడంతో ధర 1,735 నుంచి రూ.1,850కి చేరింది. శనగల «కనీస మద్దతు ధరను రూ.150 మేర పెంచారు. దీని ధర క్వింటాల్కు రూ.5,335 నుంచి రూ.5,440కి చేరింది. -
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపు..
ఉద్యోగులకు కేంద్రం శుభవార్త చెప్పింది. దీపావళి బోనస్తో పాటు డియర్నెస్ అలవెన్స్ (dearness allowance (DA)) 4 శాతం పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో డీఏ అలవెన్స్ 42 శాతం నుంచి 46 శాతానికి పెరిగింది. ఈ ఏడాది మార్చి నెలలో కేంద్ర కేబినెట్ ఉద్యోగుల డీఏ అలెవన్స్ను 4 శాతానికి పెంచింది. కేంద్ర నిర్ణయంతో 47.58 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 69.76 లక్షల మంది పెన్షన్లకు లబ్ది చేకూరుతుందని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. తద్వారా ఏడాదికి ప్రభుత్వ ఖజానాపై ఏకంగా రూ.12,815.60 కోట్ల అదనపు భారం పడనుందని అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. కాగా, ఈ పెంపు జనవరి 01, 2023 నుండి అమలులోకి రానుంది. డియర్నెస్ అలవెన్స్ అంటే..? ఏటా రెండుసార్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏను కేంద్రం సవరిస్తూ ఉంటుంది. పెరుగుతున్న ధరలకు పరిహారంగా ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ అందజేస్తారు. డీఏను మన దేశంలో మొదటిసారిగా 1972లో ముంబై నుంచి ప్రవేశపెట్టారు. ఆ తరువాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ డియర్నెస్ అలవెన్స్ ఇవ్వడం ప్రారంభించారు. 👉 : Follow the Sakshi TV channel on WhatsApp: -
దీపావళి బోనస్: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు!
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కారు పండుగ వేళ తీపి కబురు అందించింది. పారామిలటరీ బలగాలతో సహా కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న గ్రూప్-సి, నాన్ గెజిటెడ్ గ్రూప్-బి ఉద్యోగులకు దీపావళి బోనస్లను ఆమోదించింది. 2022-23 సంవత్సరానికి గానూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉత్పాదకతతో సంబంధం లేని బోనస్లను (తాత్కాలిక బోనస్లు) గరిష్టంగా రూ.7,000గా ఆర్థిక శాఖ నిర్ణయించింది. గ్రూప్-సి ఉద్యోగులతోపాటు గ్రూప్-బి లోని ఉత్పాదక బోనస్ పరిధిలోకి రాని నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు 2022-23 అకౌంటింగ్ సంవత్సరానికి గానూ 30 రోజుల వేతనాలకు సమానమైన తాత్కాలిక బోనస్ మంజూరు చేసినట్లు ఆర్థిక శాఖ ఆధ్వర్యంలోని వ్యయ విభాగం ఒక ప్రకటనలో పేర్కొంది. బోనస్ నియమ నిబంధనలు 31.3.2023 నాటికి సర్వీస్లో ఉండి 2022-23 సంవత్సరంలో కనీసం ఆరు నెలల నిరంతర సర్వీస్ అందించిన ఉద్యోగులు మాత్రమే ఈ బోనస్కు అర్హులు. ఉద్యోగుల సగటు వేతనం లేదా గరిష్ట బోనస్ మొత్తం (ఏదీ తక్కువ ఉంటే అది) ఆధారంగా ఈ తాత్కాలిక బోనస్ను నిర్ణయిస్తారు. వారానికి 6 రోజుల పని విధానం పాటించే కార్యాలయాల్లో ఏడాదికి కనీసం 240 రోజులు మూడు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలపాటు, వారానికి 5 రోజుల పని విధానం పాటించే కార్యాలయాల్లో అయితే కనీసం 206 రోజులు హాజరై ఉండాలి. The central government has approved a Diwali bonus for Group C and non-gazetted Group B rank officials, including paramilitary forces, with a maximum limit of Rs 7,000. (n/1) pic.twitter.com/IK0if6Swxh — Press Trust of India (@PTI_News) October 17, 2023 -
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త!
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. దేశంలో కోటి మంది ఉద్యోగులకు 4 శాతం డేర్నెస్ అలవెన్స్ (dearness allowance)లను పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. 38 శాతం నుంచి 42 శాతానికి పెరిగిన ఈ డీఏ జనవరి 1, 2023 నుంచి అమల్లోకి వస్తున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా డీఏ పెంపును కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు. దీంతో కేంద్రంపై రూ. 12,815 కోట్ల భారం పడనున్నట్లు చెప్పారు. కరువు భత్యం(డీఏ) పెంపుతో 47.58లక్షల కేంద్రం ప్రభుత్వ ఉద్యోగులకు 69.76లక్షల మందికి పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. 7వ వేతన సంఘం సిఫార్సుల ఆధారంగా నిర్ణయించిన ఫార్ములా ఆధారంగా ఈ పెంచుతుంది. -
కేంద్ర ఉద్యోగుల్లో కొందరికి పాత పెన్షన్
న్యూఢిల్లీ: జాతీయ పెన్షన్ విధానం(ఎన్పీఎస్) అమల్లోకి వచ్చిన 2003 డిసెంబర్ 22వ తేదీకి ముందే ఉద్యోగంలో చేరిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ‘పాత పెన్షన్’ స్వీకరించే అవకాశం పొందారు. అంటే ఆ తేదీ కంటే ముందే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్/అడ్వర్ట్టైజ్డ్ చేసిన పోస్టుల్లో చేరిన ఉద్యోగులు మాత్రమే పాత పెన్షన్ పథకంలో చేరడానికి అర్హులు. ఈ పథకంలో చేరేందుకు వన్–టైమ్ ఆప్షన్ ఎంచుకోవాలని సూచిస్తూ కేంద్ర సిబ్బంది శాఖ తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. ‘ఎన్పీఎస్ నోటిఫికేషన్కు ముందే ప్రకటించిన పోస్టులు/ఖాళీలకు అనుగుణంగా ఎంపికైనందున పాత పెన్షన్ స్కీమ్ను తమకు వర్తింపజేయాలని 2003 డిసెంబర్ 22కు ముందు కేంద్ర ఉద్యోగాల్లో చేరిన వారి వినతులు మాకు అందాయి. పలు రాష్ట్రాల హైకోర్టులు, కేంద్ర పరిపాలనా ట్రిబ్యూనళ్లు వెలువర్చిన తీర్పులు, ఆ ఉద్యోగుల అభ్యర్థనమేరకు ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని ఉత్వర్వులో కేంద్రం పేర్కొంది. -
కేంద్రం కీలక నిర్ణయం.. ఉద్యోగులకు తీపికబురు, త్వరలో జీతం పెరగనుందా!
మోదీ సర్కార్ ఉద్యోగులకు తీపికబురు చెప్పనుంది. వచ్చే ఏడాది ఎన్నికల నేపథ్యంలో కేంద్రం ఈసారి ఉద్యోగుల డియర్నెస్ అలవెన్స్ను (DA) 4 శాతం మేర పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ పెంపు జరిగితే కోటి మందికి పైగా ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్నెస్ అలవెన్స్ (డీఏ) 42 శాతానికి చేరుకుంటుంది. దీనికి అనుగుణంగా ఉద్యోగుల శాలరీ కూడా పైకి కదలనుంది. ప్రస్తుతం వారి డీఏ 38 శాతంగా ఉంది. ఆల్ ఇండియా రైల్వేమెన్ ఫెడరేషన్, జనరల్ సెక్రటరీ, శివ గోపాల్ మిశ్రా దీనిపై మాట్లాడుతూ, "డిసెంబర్ 2022కి సంబంధించిన సీపీఐ-ఐడబ్ల్యూ జనవరి 31, 2023న విడుదలైంది. కరువు భత్యం పెంపు 4.23 శాతంగా ఉంది. అయితే కేంద్రం పాయింట్ తర్వాత ఉన్న నెంబర్లను పరిగణలోకి తీసుకోదు. అందువల్ల డీఏ పెంపు 4 శాతంగా ఉండొచ్చని వివరించారు. అందువల్ల డీఏ అనేది 42 శాతానికి పెరిగే అవకాశం ఉందన్నారు. ఆర్థిక మంత్రిత్వ శాఖలోని వ్యయ విభాగం దాని ఆదాయ చిక్కులతో పాటు డీఏ పెంపు ప్రతిపాదనను రూపొందిస్తుందని, ఆమోదం కోసం కేంద్ర మంత్రివర్గం ముందు ప్రతిపాదనను ఉంచుతుందని ఆయన వెల్లడించారు. ఈ డీఏ పెంపు అనేది జనవరి 1, 2023 నుంచి అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం కోటి మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు 38 శాతం కరువు భత్యం పొందుతున్నారు. గతంలో చివరి సవరణ సెప్టెంబర్ 28, 2022న జరగగా, ఇది జూలై 1, 2022 నుండి అమలులోకి వచ్చింది. -
ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్: ఇలా చేస్తే మీ పెన్షన్, గ్రాట్యుటీ ఆగిపోతాయ్!
పండుగల సీజన్కు ముందు కేంద్ర ఉద్యోగులకు డీఏ( DA), బోనస్లను అందించి ఉద్యోగులకు శుభవార్త కేంద్రం తాజాగా గ్రాట్యుటీ, పెన్షన్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (పెన్షన్) రూల్స్ 2021 ప్రకారం, రిటైర్డ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి ఉద్యోగంలో ఉన్నప్పుడు దుష్ప్రవర్తన లేదా నిర్లక్ష్యపు పనితీరు కలిగి ఉన్నట్లు తేలితే సదరు ఉద్యోగి పెన్షన్, గ్రాట్యుటీని ఇకపై రద్దు చేయనున్నారు. CCS (పెన్షన్) రూల్స్, 2021లోని రూల్ 8పై కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. సవరించిన రూల్ 8 ప్రకారం, ఏదైనా డిపార్ట్మెంటల్లో ఉద్యోగ సమయంలో ఉద్యోగి పదవీ విరమణ పొందిన తర్వాత అతని ఉద్యోగ సమయంలో ఏదైనా శాఖలో ఇలా చేసి ఉండకూడదు..సదరు ఉద్యోగి తీవ్రమైన దుష్ప్రవర్తన లేదా పనిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ దోషిగా తేలితే, పైన పేర్కొన్న ఏజెన్సీలు పూర్తిగా లేదా పాక్షికంగా అతని పెన్షన్ను రద్దు చేసే అధికారం కలిగి ఉంటాయి. ఒకవేళ తప్పు చేసిన ఉద్యోగికి పెన్షన్ లేదా గ్రాట్యుటీ ఇవ్వడం వల్ల ఆర్థికంగా నష్టం వాటిల్లిందని ప్రభుత్వశాఖ భావిస్తే, ఆ ఉద్యోగి నుంచి పరిహారం తీసుకోవచ్చు. అయితే ఈ అంశంపై యూపీఎస్సీ బోర్డును సంప్రదించిన తర్వాత రాష్ట్రపతి తుది నిర్ణయం తీసుకువాల్సి ఉంటుంది. చదవండి: ‘నిజం తెలుసుకున్నా, ఆ కంపెనీ నాకొద్దు’.. ఊహించని షాకిచ్చిన బిలియనీర్! -
ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం!
ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల ప్రారంభంలో కేంద్రం, 7వ వేతన సంఘం ప్రకారం జీతం తీసుకునే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 4% డీఏ పెంపును ప్రకటించిన సంగతి తెలిసిందే. దీపావళికి కొద్ది రోజులే ముందు, తాజాగా ఉద్యోగుల డీఏను 15 శాతం పెంచింది. ఈ పెంపు 5వ, 6వ పే కమీషన్ కింద జీతాలు తీసుకుంటున్నట్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర సంస్థ ఉద్యోగులకు వర్తించనున్నట్లు తెలిపింది. 5వ వేతన సంఘం ప్రకారం.. వేతనాలను విత్ డ్రా చేసుకునే ఉద్యోగుల డీఏ రేటును 15% మేర 381% నుంచి 396%కి పెంచారు. ఇది జూలై 1, 2022 నుంచి అమలులోకి వస్తుంది. అదేవిధంగా, 6వ వేతన సంఘం ప్రకారం.. తమ వేతనాలను తీసుకుంటున్న ఉద్యోగుల డీఏ రేటును 9% పెంచి బేసిక్ పేలో 203% నుంచి 212%కి పెంచారు. ఇది జూలై 1, 2022 నుండి అమలులోకి వస్తుంది. చదవండి: ఇది ఊహించలేదు.. యూజర్లకు భారీ షాకిచ్చిన జియో! -
కేంద్ర ప్రభుత్వోద్యోగులకు... 4% డీఏ పెంపు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దసరా కానుక లభించింది. ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యాన్ని (డీఏ), 4 శాతం పెంచుతూ కేంద్ర కేబినెట్ బుధవారం నిర్ణయం తీసుకుంది. ఈ పెరుగుదల జులై 1 నుంచి అమల్లోకి తీసుకురానున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వంలోని 41.85 లక్షల మంది ఉద్యోగులకు, 69.76 లక్షల మంది ఫించనుదారులకు లబ్ధి చేకూరుతుంది. మూల వేతనంపై 34శాతంగా ఉన్న డీఏకి అదనంగా 4% పెంచడంతో 38శాతానికి చేరుకుంది. ఈ పెంపుతో ఖజానాపై ఏడాదికి 12.852 కోట్ల అదనపు భారం పడుతుంది. మరో మూడు నెలలు ఉచితంగా రేషన్ కరోనా సంక్షోభ సమయంలో లాక్డౌన్లతో ఉపాధి కోల్పోయిన నిరుపేదల్ని ఆదుకోవడానికి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై) పేరుతో ఉచితంగా ఇచ్చే రేషన్ పథకం ఈ శుక్రవారంతో ముగిసిపోనుంది. ధరల భారం, పండుగ సీజన్ వస్తూ ఉండడంతో మరో మూడు నెలలు ఉచితంగా రేషన్ అందించాలని కేంద్ర మంత్రిమండలి నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర కేబినెట్ బుధవారం సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పీఎంజీకేఏవై కింద ఉచిత రేషన్ పథకాన్ని మరో మూడు నెలలు కొనసాగించాలని నిర్ణయించింది. వివరాలను కేంద్ర సమాచార, ప్రసార మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు వెల్లడించారు గరీబ్ కళ్యాణ్ అన్న యోచన పథకం కింద నిరుపేదలు ఒక్కొక్కరికి ప్రతీ నెల 5 కేజీల బియ్యం, గోధుమలు ఉచితంగా అందిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు ఈ పథకాన్ని పొడిగించడంతో కేంద్రానికి అదనంగా రూ.44,762 కోట్లు ఖర్చు అవుతుంది. ప్రతీ నెల 80 కోట్ల మంది ఉచిత రేషన్ని తీసుకుంటున్నారు. రైల్వేల అభివృద్ధికి రూ.10వేల కోట్లు రైల్వేల అభివృద్ధి ప్రాజెక్టుకి రూ.10 వేల కోట్లు కేటాయించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయింది. న్యూఢిల్లీ, అహ్మదాబాద్, ముంబై సీఎస్ఎంటీ రైల్వే స్టేషన్ల ఆధునీకరణ కోసం రైల్వే చేసిన ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. అత్యంత ఆధునిక టెక్నాలజీతో ఈ రైల్వే స్టేషన్ల ఆధునీకరణ 2.5 నుంచి మూడున్నరేళ్లలో పూర్తి చేయనున్నట్టు రైల్వే శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్ వెల్లడించారు. -
‘21 రోజుల ముందే టికెట్లు బుక్ చేసుకోండి’.. ఉద్యోగులకు కేంద్రం సూచనలు
న్యూఢిల్లీ: రైతులకు ఎరువులు భారీ స్థాయిలో రాయితీలకు ఇస్తుండటంతో ప్రభుత్వంపై పడిన సబ్సిడీ భారం, పేదలకు ఉచిత ఆహార ధాన్యాలు తదితరాల పథకాల ఆర్థికభారం నుంచి కాస్తంత ఉపశమనం కోసం కేంద్రప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందులోభాగంగా ప్రభుత్వ ఉద్యోగులు విధి నిర్వహణ నిమిత్తం చేసే విమాన, రైలు ప్రయాణాల్లో ఖర్చులు తగ్గించుకోవాలంది. ఆ సూచనలు.. ► అప్పటికప్పుడు టికెట్ బుక్ చేసి అధిక ధర చెల్లించేకన్నా 21 రోజుల ముందే తక్కువ ధరల శ్రేణి టికెట్లు బుక్ చేసుకోండి. ► అనవసరంగా టికెట్లు క్యాన్సిల్ చేయొద్దు. ► వేర్వేరు టైమ్–స్లాట్లుంటేనే, తప్పనిసరి అయితేనే రెండు టికెట్లు బుక్ చేయాలి. లేదంటే ఒక ప్రయాణానికి ఒక్కటే తీసుకోవాలి. ► విమాన టికెట్లను 72 గంటల్లోపు బుక్చేసినా, 24 గంటల్లోపు క్యాన్సిల్ చేసినా అందుకు కారణం తెలుపుతూ సంబంధిత విభాగానికి సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. ► తక్కువ క్లాస్ టికెట్తోనే ప్రయాణించండి. నాన్–స్టాప్ ఫ్లైట్ అయితే మరీ మంచిది. చదవండి👇 ఆర్మీలో అగ్నివీర్ తొలి నోటిఫికేషన్ విడుదల వందల సంఖ్యలో రైళ్లు రద్దు..రైళ్ల వివరాలు ఇవే.. -
బిగ్ రిలీఫ్: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం బంపరాఫర్!
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం బంపరాఫర్ ప్రకటించింది.ఇల్లు నిర్మించుకోవాలనుకునే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తక్కువ వడ్డీ రేటుతో హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ను అందిస్తున్నట్లు తెలిపింది. ఈ సదుపాయాన్ని ఉద్యోగులకు అందుబాటులోకి తెస్తూ..కేంద్రం ఏప్రిల్ 1న మార్గదర్శకాలను విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్(హెచ్బీఏ) రుణ వడ్డీ రేటును 7.9 శాతం నుంచి 7.1 శాతానికి తగ్గించింది. ఈ తగ్గిన వడ్డీ రేట్లకే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు హెచ్బీఏను పొందవచ్చని కేంద్రం వెల్లడించింది. తాజాగా అందుకు సంబంధించిన మార్గదర్శకాలను మినిస్టీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ ఏప్రిల్1న విడుదల చేసిన మెమోరాండంలో పేర్కొంది. ఇక సవరించిన వడ్డీ రేట్లు ఈ ఏడాది ఏప్రిల్1 నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు అందుబాటులో ఉంటాయి. దీంతో ఫైనాన్షియల్ ఇయర్ 2022-2023లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ వడ్డీ రేటు 7.1 శాతంగా ఉండనుంది. ఇక సవరించిన వడ్డీ రేట్లు మార్చి 2022 వరకు 7.9 శాతంగా ఉన్న విషయం తెలిసిందే. 7వ వేతన సంఘం 7వ వేతన సంఘం హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ రూల్స్ 2017 ప్రకారం.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి 34 నెలల ప్రాథమిక వేతనం లేదా రూ. 25 లక్షలు లేదా ఇంటి ఖర్చు లేదా దాని ప్రకారం మొత్తం అడ్వాన్స్ తీసుకోవచ్చు. తిరిగి చెల్లించే సామర్థ్యం, కొత్త నిర్మాణం లేదా కొత్త ఇల్లు లేదా ఫ్లాట్ కొనుగోలు కోసం తీసుకున్న బ్యాంకు రుణాన్ని తిరిగి చెల్లించడానికి ఇంటి నిర్మాణ అడ్వాన్స్ను పొందవచ్చు. ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అందించే హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్(హెచ్బీఏ) వడ్డీ రేట్లు మార్చి 2022 వరకు 7.9శాతంగా ఉంది. అయితే తాజాగా కేంద్ర మంత్రిత్వ శాఖ హెచ్బీఏలను ఫైనాన్షియల్ ఇయర్లో 80బీపీఎస్లను తగ్గించడం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉపశమనం కలిగించినట్లైంది. చదవండి: పెరిగిపోతున్న అమ్ముడుపోని ఇళ్ల సంఖ్య, హైదరాబాద్లో ఎన్ని గృహాలు ఉన్నాయంటే! -
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్
-
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు శుభవార్త..!
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్రం శుభవార్తను అందించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అదనపు విడత డియర్నెస్ అలవెన్స్ (డీఏ) , పెన్షనర్లకు డియర్నెస్ రిలీఫ్ (డీఆర్) విడుదల చేయడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ను 3 శాతం పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో డియర్నెస్ అలవెన్స్ 34 శాతంకు చేరనుంది. గతంలో ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు 31 శాతం మేర డీఏను పెంచాలని కేంద్రం నిర్ణయించగా..ఇప్పుడు అనూహ్యంగా డీఏను 34 శాతంగా పెంచింది. 7వ వేతన సంఘం సిఫార్సులు ఆధారంగా డీఏ అమలు జనవరి 1, 2022 అమల్లోకి రానుంది. ధరల పెరుగుదల నేపథ్యంలో బేసిక్ పే/పెన్షన్కు అదనంగా 3 శాతం డీఏ పెంపును వేతన సంఘం సిఫార్సు చేసింది. డీఏ పెంపు నిర్ణయం 47.68 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68.62 లక్షల మంది పెన్షనర్లకు లబ్ది చేకూరనుంది. ఇది సివిల్ ఉద్యోగులు, రక్షణ సేవల్లో పనిచేస్తున్న వారికి వర్తిస్తుంది. ఇక 3 శాతం డీఏ పెంపుతో కేంద్ర ఖజానాపై ఏటా రూ.9,544.50 కోట్ల మేర అదనపు భారం పడనున్నుట్లు సమాచారం. కోవిడ్-19 కారణంగా 2020లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్ను కేంద్రం నిలిపివేసింది. కాగా 2021 జూలైలో డీఏను 17 శాతం నుంచి 28 శాతానికి పెంచింది. తరువాత మరో 3 శాతం పెంచి 31 శాతం డీఏను ఫిక్స్ చేసింది. చదవండి: టాక్స్ పేయర్లకు అలర్ట్..! ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్..! -
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త?!
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త చెప్పనుంది. హోలీ పండుగ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్ (డీఏ) పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై మార్చి 16న కేంద్రం కేబినెట్ సమావేశం నిర్వహించనుందని, ఈ భేటీ అనంతరం డీఏపై స్పష్టమైన ప్రకటన వెలువడనుందని కొన్ని నివేదికలు వెలుగులోకి వచ్చాయి. డీఏ ఎంత పెరుగుతుందనే అంశంపై కేంద్రం స్పష్టత ఇవ్వనప్పటికీ ప్రస్తుతం ఉన్న 31శాతం డీఏను 34శాతానికి పెంచే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఒక వేళ కేంద్ర ప్రభుత్వం డీఏ పెంపుపై అధికారిక ప్రకటన చేస్తే.. 50 లక్షల మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షలకుపైగా పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. డీఏ పెంపుతో శాలరీ ఎంత పెరుగుతుంది? ఈ సారి ప్రకటనలో 3 శాతం డీఏ పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే ఉద్యోగుల సగటు వేతనం కనీసం రూ.6,480 నుంచి.. అత్యధికంగా రూ.20 వేల వరకు పెరగొచ్చని తెలుస్తోంది. ఒక ఉద్యోగి బేసిస్ శాలరీ రూ.18,000 ఉంటే..కొత్త డీఏ (34 శాతం) వాటా రూ.6,120గా ఉంటుంది. ప్రస్తుతం 31 శాతం డీఏ (రూ.5,580) వస్తోంది. చదవండి: గ్యాప్ తీసుకోలేదు..వచ్చింది అంతే! ఎలన్ మస్క్ యుద్ధం వచ్చినా ఆగేలా లేడే! -
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త!
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త చెప్పనుంది. హోలీ అంటేనే రంగుల పండుగ. చిన్నా, పెద్ద వయసుతో సంబంధం లేకుండా జరుపుకునే ఈ పండుగకి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీవితాల్ని మరింత రంగుల మయం చేసేందుకు కేంద్రం ప్రత్యేకంగా ఫెస్టివల్ అడ్వాన్స్ స్కీమ్ను అందుబాటులోకి తెస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. కోవిడ్ కారణంగా ఆర్ధిక ఇబ్బందులు పడుతున్న కేంద్రం ఉద్యోగులకు రూ.10,000 అడ్వాన్స్గా అందించనుంది. ఉద్యోగులు ఎలాంటి వడ్డీ లేకుండా హోలీకి ముందే రూ.10వేలు అడ్వాన్స్గా తీసుకోవచ్చు. దీనివల్ల వ్యాపారాలు ఊపందుకోవడంతోపాటు, ఆర్థిక వ్యవస్థ మంద గమనాన్ని అధిగమించవచ్చని కేంద్రం భావిస్తున్నట్లు వెలుగులోకి వచ్చిన రిపోర్ట్లలో పేర్కొన్నాయి. ఇప్పటికే కేంద్ర ఉద్యోగుల కోసం ప్రభుత్వం గతేడాది కూడా ఈ పథకాన్ని ప్రకటించింది. దీంతో ప్రభుత్వం మళ్లీ అదే పథకాన్ని ప్రకటించే అవకాశం ఉందని ఆర్ధిక నిపుణులు భావిస్తున్నారు. ఇక కేంద్రం అందించనున్న ఈ రూ.10వేల అడ్వాన్స్ వారి అకౌంట్లలో జమవుతాయి.ఉద్యోగులు తీసుకున్న మొత్తాన్ని10 వాయిదాల్లో నెలకు రూ.1000 చొప్పున రూ.10,000 మొత్తాన్ని తిరిగి ఇచ్చేలా కేంద్రం వెసలు బాటు కల్పించనుంది. -
కేంద్ర ప్రభుత్వంపై బీజేపీ నేత అసంతృప్తి
ఢిల్లీ: బీజేపీ నేత వరుణ్ గాంధీ మరోసారి కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణను తీవ్రంగా తప్పుబట్టారు. పలు సంస్థలను ప్రైవేటీకరణ చేస్తే.. వాటిల్లో ఉద్యోగం చేసేవారు ఉపాధి కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘బ్యాంకింగ్ రంగం, రైల్వేలను ప్రైవేటీకరణ చేస్తే.. సుమారు ఐదు లక్షల మంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఒక వ్యక్తి తన ఉపాధి కోల్పోయడంటే.. అతని కుటుంబంలోని మిగతా సభ్యులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొవల్సి వస్తుంది. వారి భవిష్యత్తు అంధకారంగా మారుతుంది. ప్రభుత్వాలు ప్రజా సంక్షేమాన్ని పెంపొందిస్తాయి కానీ, ప్రజల్లో ఆర్థిక అసమానతలను పెంచవు. పెట్టుబడిదారీ విధానాన్ని ప్రోత్సహించవు’ అని వరుణ్ గాంధీ ట్వీటర్లో పేర్కొన్నారు. గతంలో వరుణ్ గాంధీ వ్యవసాయ చట్టాలు, లఖిమ్పూర్ ఖేరీ ఘటనలపై కేంద్రాన్ని ప్రశ్నించిన సంగతి తెలిసిందే. केवल बैंक और रेलवे का निजीकरण ही 5 लाख कर्मचारियों को ‘जबरन सेवानिवृत्त’ यानि बेरोजगार कर देगा। समाप्त होती हर नौकरी के साथ ही समाप्त हो जाती है लाखों परिवारों की उम्मीदें। सामाजिक स्तर पर आर्थिक असमानता पैदा कर एक ‘लोक कल्याणकारी सरकार’ पूंजीवाद को बढ़ावा कभी नहीं दे सकती। — Varun Gandhi (@varungandhi80) February 22, 2022 -
వాట్సాప్, టెలిగ్రామ్ వాడుతున్న ఉద్యోగులకు కేంద్రం గట్టి హెచ్చరిక..!
ఇక నుంచి వాట్సాప్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా యాప్లలో ముఖ్యమైన సమాచారం, పత్రాలను షేర్ చేయడం సురక్షితం కాదని కేంద్ర ప్రభుత్వం తన అధికారులకు తెలిపింది. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని, కేంద్రం కొత్తగా కమ్యూనికేషన్ మార్గదర్శకాలను విడుదల చేసింది. ముఖ్యమైన సమాచారాన్ని పంచుకోవడానికి వాట్సాప్, టెలిగ్రామ్ లేదా ఇతర సోషల్ మీడియా యాప్లను అస్సలు ఉపయోగించవద్దని కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులందరినీ ఆదేశించింది. ఇందుకు గల కారణాలను కూడా కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ సోషల్ మీడియా యాప్ల సర్వర్లు ప్రపంచవ్యాప్తంగా ప్రైవేట్ సంస్థల యాజమాన్యంలో ఉన్నాయని, అందుకే దేశ భద్రతకు సంబంధించిన సమాచారాన్ని భారత వ్యతిరేక శక్తులు దుర్వినియోగం చేయవచ్చు అని తెలిపింది. ప్రస్తుతం కరోనా మహమ్మారి విస్తరిస్తూ ఉండటంతో ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేస్తున్న సంగతి తెలిసిందే. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన సాధనాల ద్వారా మాత్రమే కనెక్ట్ కావాలని ప్రభుత్వ అధికారులు పేర్కొన్నట్లు వార్తా సంస్థ ఐఎఎన్ఎస్ తెలిపింది. ఈ ఆర్డర్ అమెజాన్ అలెక్సా, యాపిల్ హోమ్ పాడ్, గూగుల్ మీట్, జూమ్ మొదలైన వాటికి కూడా ఈ నిబందనలు వర్తిస్తాయని తెలిపింది. ప్రస్తుత వ్యవస్థలోని లొసుగులను విశ్లేషించిన తర్వాత వాట్సాప్, టెలిగ్రామ్, ఇతర సోషల్ మీడియా యాప్లను వాడవద్దు అని కేంద్రం ఆర్డర్ జారీ చేసింది. ప్రభుత్వానికి చెందిన రహస్య సమాచార లీక్ కావడం, జాతీయ కమ్యూనికేషన్ నిబంధనలు & ప్రభుత్వ ఆదేశాలను ఈ యాప్స్ నిరంతరం ఉల్లంఘించిన ఫలితంగా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు రూపొందించిన ఆదేశాలను కేంద్రం విడుదల చేసింది. ఈ ఆదేశాలను అన్నీ మంత్రిత్వ శాఖల అధికారులు పాటించాలని సూచించింది. గోప్యమైన లేదా జాతీయ భద్రతా సంబంధిత సమస్యలను చర్చించే సమావేశాల సమయంలో స్మార్ట్-వాచీలు, స్మార్ట్ ఫోన్లను ఉపయోగించవద్దని కేంద్రం ఉన్నతాధికారులను ఆదేశించింది. ఈ ఆదేశాలు వర్చువల్ సమావేశాల కూడా వర్తిస్తుంది అని తెలిపింది. డిపార్ట్ మెంట్ ఆఫ్ అడ్వాన్స్ డ్ కంప్యూటింగ్(సి-డిఎసి), నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్(ఎన్ఐసీ) ఏర్పాటు చేసిన మద్యమాల ద్వారా మాత్రమే వీడియో కాన్ఫరెన్స్ జరపాలని కేంద్రం పేర్కొంది. (చదవండి: ఫ్లిప్కార్ట్ 'ది గ్రాండ్ గాడ్జెట్ డేస్ సేల్'లో వాటిపై అదిరిపోయే ఆఫర్స్..!) -
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్
-
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్..!
మీరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారా? అయితే మీకు ఒక ముఖ్యమైన గమనిక. దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని రద్దు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. అయితే, ఉద్యోగులందరూ తమ హాజరు రిజిస్టర్లను మాన్యువల్'గా నిర్వహించాల్సిన అవసరం ఉందని సిబ్బందికి మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో తెలిపింది. "గత కొన్ని రోజులుగా #COVID కేసులు పెరగడాన్ని దృష్టిలో ఉంచుకొని, తదుపరి ఆదేశాల వచ్చే వరకు ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరు విధానాన్ని నిలిపివేశాం. ప్రధాని @NarendraModi నాయకత్వంలో, ప్రభుత్వ ఉద్యోగుల భద్రత, ఆరోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు" అని జితేంద్ర సింగ్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. అన్ని విభాగాల అధిపతులు కూడా ఉద్యోగులందరూ అన్ని వేళలా మాస్కులు ధరించేలా చూడాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గత ఏడాది ఉద్యోగుల ఆరోగ్యాన్ని భద్రతను దృష్టిలో ఉంచుకొని బయోమెట్రిక్ విధానం నుంచి మినహాయింపు కల్పించిన సంగతి తెలిసిందే. అయితే, మళ్లీ తిరిగి నవంబర్ 8 నుంచి కరోనా కారణంగా ఉద్యోగులకు అందించిన సౌకర్యాలన్నీ తొలగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ డిప్యూటీ సెక్రటరీ ఉమేష్ కుమార్ భాటియా తెలిపారు. decision has been taken in the interest of safety and health of the govt employees. 2/2 #DoPT — Dr Jitendra Singh (@DrJitendraSingh) January 3, 2022 (చదవండి: గూగుల్ సెర్చ్లో ట్రెండ్ కరోనాదే.. టాప్ 10 జాబితా ఇదే!) -
పెన్షన్ తీసుకునే వారికి కేంద్రం శుభవార్త..!
కేంద్ర ప్రభుత్వ పెన్షన్ దారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. పెన్షన్ దారులు తమ లైఫ్ సర్టిఫికెట్స్ సమర్పించేందుకు గడువును ఫిబ్రవరి 28, 2022 వరకూ పెంచుతూ నేడు ప్రకటన చేసింది కేంద్రం. "వివిధ రాష్ట్రాల్లో కొనసాగుతున్న కోవిడ్-19 మహమ్మారి కేసుల సంఖ్య పేరుగతున్న దృష్ట్యా వృద్ధుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పెన్షనర్ లైఫ్ సర్టిఫికెట్ పత్రాన్ని సమర్పించడానికి ప్రస్తుతం ఉన్న 31.12.2021 కాలవ్యవధిని ఫిబ్రవరి 28, 2022 వరకూ పొడిగించాలని నిర్ణయించినట్లు" పెన్షన్ల విభాగం పెన్షన్ అండ్ పెన్షనర్ల సంక్షేమ మంత్రిత్వ శాఖ ఒక మెమోరాండంలో తెలిపింది. అప్పటి వరకూ వారి పెన్షన్ పంపిణీకి ఎలాంటి ఢోకా ఉండబోదని పేర్కొంది. వృద్ధులకు కరోనా సోకే ప్రమాదం ఎక్కువగా ఉన్న కారణంగా లైఫ్ సర్టిఫికెట్ గడువును పొడిగిస్తున్నట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పెన్షన్ తీసుకునే వారు నవంబర్ నెలలో కచ్చితంగా లైఫ్ సర్టిఫికెట్ను అందించాల్సి ఉంటుంది. ఇలా చేస్తేనే ప్రభుత్వం నుంచి పెన్షన్ లభిస్తుంది. అయితే ఈసారి మాత్రం కేంద్ర ప్రభుత్వం వీరికి ఊరట కలిగించింది. కరోనా వైరస్ నేపథ్యంలో లైఫ్ సర్టిఫికెట్ సమర్పించే గడువును పొడిగించింది. (చదవండి: ఈ ఎలక్ట్రిక్ బైక్ రేంజ్ తెలిస్తే కుర్రకారు ఫిదా కావాల్సిందే..!) -
పెన్షనర్లకు కేంద్రం శుభవార్త!
పెన్షన్లరకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు లైఫ్ సర్టిఫికేట్(జీవన్ ప్రమాన్) సమర్పించాల్సిన గడువును 2021 డిసెంబర్ 31 వరకు పొడగించింది. ఇంతక ముందు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లను పొందడానికి వారు కచ్చితంగా లైఫ్ సర్టిఫికెట్లను నవంబర్ 30లోపు సబ్మిట్ చేయాల్సి ఉండేది. ఇప్పుడు ఆ గడువును మరో నెల పొడగించింది. దీంతో పెన్షనర్లకు ఊరట కలగనుంది. దేశంలో కరోనా మహమ్మారి విజృంబిస్తున్న తరుణంలో వృద్ధుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది. ఇప్పుడు, డిసెంబర్ 31 వరకు లైఫ్ సర్టిఫికేట్ పత్రాలను బ్యాంకులు/పోస్ట్ ఆఫీస్ కేంద్రాలకు సబ్మిట్ చేయవచ్చు. అలాగే, లైఫ్ సర్టిఫికేట్ పత్రాలను డిజిటల్ రూపంలో పొందడం కోసం రికగ్నైషన్ టెక్నాలజీని కేంద్రం ప్రారంభించింది. పెన్షనర్ల ఫిర్యాదుల మేరకు పెన్షన్ల మంత్రిత్వ శాఖ ఇప్పటికే డిజిటల్గా లైఫ్ సర్టిఫికేట్లను జారీ చేసే సదుపాయాన్ని ప్రారంభించింది. డిసెంబర్ 31 వరకు ఎటువంటి అంతరాయం లేకుండా పెన్షనర్లు పెన్షన్ పొందవచ్చు. (చదవండి: ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరం ఏంటో తెలుసా?) -
రేపటి నుంచే, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆ సౌకర్యాలన్నీ బంద్
Central Government Employees Facilities Will Be Removed From November 8: దేశంలో కరోనా కేసులు రోజురోజుకీ తగ్గుముఖం పడుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం సైతం దశలవారీగా అన్లాక్ చేస్తుంది.ఇక ఇప్పటికే రాష్ట్రప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్నారు. తాజాగా కేంద్రం 'కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల విధుల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి అంటే నవంబర్ 8 నుంచి కరోనా కారణంగా ఉద్యోగులకు అందించిన సౌకర్యాలన్నీ తొలగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ డిప్యూటీ సెక్రటరీ ఉమేష్ కుమార్ భాటియా తెలిపారు. కేంద్రప్రభుత్వ డిప్యూటీ సెక్రటరీ ఉమేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం..కరోనా మహమ్మారి కారణంగా కార్యాలయాలకు తక్కువ సంఖ్యలో ఉద్యోగులు విధులు నిర్వహించినట్లు తెలిపారు. తక్కువ సంఖ్యలో ఉద్యోగులతో పాటు పనిగంటల్ని తగ్గించినట్లు తెలిపారు. అయితే నవంబర్ 8నుంచి ఈ సౌకర్యాల్ని తొలగిస్తున్నట్లు తెలిపారు. వాటితో పాటు కొత్త నిబంధనల్ని అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ ఉత్తర్వుల్లో జారీ చేసిన మార్గదర్శకాలు: ►బయోమెట్రిక్ యంత్రం దగ్గర తప్పనిసరిగా శానిటైజర్ ఉండాలి ►ఉద్యోగులందరూ హాజరు నమోదుకు ముందు, తర్వాత చేతుల్ని శానిటైజ్ చేసుకోవాలి ► బయోమెట్రిక్ హాజరు నమోదు చేసేటప్పుడు ఉద్యోగులు తమ మధ్య ఆరు అడుగుల దూరం పాటించాలి ► ఉద్యోగులందరూ ఎల్లప్పుడూ మాస్క్ ధరించాలి లేదా ఫేస్ కవరింగ్ ధరించాలి ► బయోమెట్రిక్ మిషన్ టచ్ప్యాడ్ను తరచుగా శుభ్రం చేయడానికి నియమించబడిన సిబ్బందిని నియమించాలి ► బయోమెట్రిక్ యంత్రాలను బహిరంగ వాతావరణంలో ఉంచాలి. ► యంత్రం లోపల ఉంటే, తగినంత సహజ వెంటిలేషన్ ఉండాలి. -
దీపావళి కానుక.. 3 శాతం డీఏ పెంపు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం దీపావళి కానుక ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన గురువారం భేటీ అయిన కేంద్ర మంత్రివర్గం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యం (డీఏ), పింఛనుదారులకు డియర్నెస్ రిలీఫ్ (డీఆర్) ప్రకటించింది. జూలై 1, 2021 నుంచి అమలులోకి వచ్చేలా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మూడు శాతం డీఏ, పింఛనర్లకు మూడు శాతం డీఆర్ ప్రకటించింది. ఏడో వేతన సంఘం సిఫార్సుల మేరకు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది. డీఏ, డీఆర్ వల్ల కేంద్ర ఖజానాపై ఏటా రూ.9,488.70 కోట్లు భారం పడనుంది. 47.14 లక్షల కేంద్ర ఉద్యోగులు, 68.62 లక్షల పింఛనర్లు లబ్ధి పొందనున్నారు. కరోనా నేపథ్యంలో గతేడాది కరువు భత్యం నిలిపివేసిన విషయం విదితమే. ఈ ఏడాది జూలైలో పునరుద్ధరిస్తూ 17% నుంచి 28 శాతానికి పెంచారు. తాజా పెంపుతో అది 31 శాతానికి చేరుకుంది. మూడంచెల పర్యవేక్షణ పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ (ఎన్ఎంపీ) అమలుకు మార్గం సుగమమైంది. గురువారం భేటీ అయిన కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం (సీసీఈఏ) రూ.100 లక్షల కోట్ల విలువైన పీఎం గతిశక్తికి ఆమోదం తెలిపింది. మూడంచెల పద్ధతిలో దీన్ని పర్యవేక్షించనున్నట్లు కేంద్రం పేర్కొంది. పీఎం గతిశక్తి మౌలిక సదుపాయాల కల్పన ప్రణాళికలో అంతర్ మంత్రిత్వశాఖల సహకారంతో పాటు అంతర్ విభాగాల సహకారం ఓ గేమ్ చేంజర్ కానుందని తెలిపింది. పీఎం గతిశక్తి ని ప్రధాని 13న ప్రారంభించారు. రాబోయే పాతికేళ్ల అభివృద్ధికి ఈ ప్రణాళికతో పునాది వేస్తున్నట్లు చెప్పారు. -
కేంద్ర ఉద్యోగులకు బోనస్
న్యూఢిల్లీ: 2020–21 ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు తాత్కాలిక బోనస్ను మంజూరుచేసింది. కేంద్ర పారా మిలటరీ బలగాలు, సాయుధ బలగాలకూ ఈ బోనస్ను మంజూరుచేసినట్లు కేంద్ర ఖర్చుల వ్యవహారాల విభాగం పేర్కొంది. ఈ ఏడాది మార్చి 31 నాటికి ఉద్యోగంలో ఉన్నవారు, 2020–21 కాలంలో మధ్యలో ఎలాంటి విరామంలేని ఆరునెలల కనిష్ట సర్వీస్కాలం ఉన్నవారు ఈ బోనస్ పొందేందుకు అర్హులు. ఉత్పత్తి ఆధారిత బోనస్ పథకాలతో లబ్దిపొందని గ్రూప్–బి నాన్ గెజిటెడ్ ఉద్యోగులు, గ్రూప్–సీ ఉద్యోగులకు ఈ తాత్కాలిక బోనస్ను ఇవ్వనున్నారు. ఈ బోనస్ను లెక్కించేటపుడు గరిష్టంగా రూ.7,000 వేతనాన్ని మాత్రమే లెక్కలోకి తీసుకుంటారు. 30 రోజుల వేతనాన్ని బోనస్గా చెల్లిస్తారు. చదవండి: టీకా రెండో డోస్పై దృష్టి పెట్టండి -
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం దీపావళి పండుగ సందర్భంగా గ్రూప్ సీలోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, గ్రూపు 'బి'లోని నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు శుభవార్త తెలిపింది దీపావళి పండగ సీజన్ కావడంతో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు బోనస్ ప్రకటించింది. 2020-21 సంవత్సరానికి 30 రోజుల వేతనాలకు సమానమైన నాన్ ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్(అడ్-హాక్ బోనస్)ను గ్రూప్ 'సీ'లోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, గ్రూపు 'బి'లోని నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు మంజూరు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వీరు ఎలాంటి ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ స్కీం కింద కవర్ కారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. "ఈ తాత్కాలిక బోనస్ సెంట్రల్ పారా మిలటరీ దళాలు, సాయుధ దళాలలో అర్హులైన ఉద్యోగులకు కూడా లభిస్తుంది. కేంద్ర పాలిత ప్రాంత పరిపాలన ఉద్యోగులకు ఈ బోనస్ లభిస్తుంది. ఇతర బోనస్ లేదా ఎక్స్ గ్రేషియా దీని కింద కవర్ చేయబడదు" అని ఆర్థిక మంత్రిత్వ శాఖ(డిఓఈ) ఈ రోజు(అక్టోబర్ 18) ఆఫీస్ మెమోరాండంలో తెలిపింది. 31-3-2021 నాటికి సర్వీసులో ఉండి 2020-21 సంవత్సరంలో కనీసం ఆరు నెలల నిరంతర సేవ చేసిన ఉద్యోగులు మాత్రమే అడ్ హాక్ బోనస్ చెల్లింపుకు అర్హులు. (చదవండి: దేశంలో అత్యంత సురక్షితమైన టాప్-10 కార్లు ఇవే!) -
కేంద్రం పెన్షన్ పథకం రూల్స్ మారాయ్.. వివరాలు తెలుసుకోండి
రీటైర్మెంట్ తర్వాత జీవితం సాఫిగా సాగేలా కేంద్ర ప్రభుత్వం నేషనల్ పెన్షన్ సిస్టం(ఎన్పీఎస్)పేరిట పథకాన్ని అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే.అయితే తాజాగా పెన్షన్ నిధి నియంత్రణ సంస్థ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ ఆర్డీఏ) కొన్ని నిబంధనల్ని సడలించింది. మారిన సడలింపులు లబ్ధిదారులకు ఉపయోగకరంగా ఉంటుందని ఆర్ధిక నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సడలించిన నిబంధనలు ►పీఎఫ్ ఆర్డీఏ సడలించిన నిబంధనల ప్రకారం..ప్రభుత్వ ఉద్యోగులు సెక్షన్ 80సీసీడీ(1బీ) కింద సూచించిన పరిమితి వరకు ఎన్పీఎస్లో అదనంగా రూ.50,000 వరకు మినహాయింపు పొందవచ్చు. ►ఎన్పీఎస్ అకౌంట్లో జమచేసే సొమ్ము మొత్తంలో రిటైర్మెంట్కు ముందు 25 శాతం దాకా తీసుకోవచ్చు ►రిటైర్మెంట్ తర్వాత ఎన్పీఎస్లో జమయ్యే నిధిలో 60 శాతం మేరకు పన్ను మినహాయింపు వర్తిస్తుంది. మరో 40 శాతం యాన్యుటీ కొనుగోలుకు వెచ్చించాలి. ►గడువుకు ముందే ఎవరైనా ఎన్పీఎస్ నుంచి బయటకు రావాలనుకుంటే.. ఇప్పటి వరకూ ఉన్న రూ.లక్ష పరిమితిని రూ.2.5 లక్షలకు పెంచింది. ►ఎన్పీఎస్లో చేరే వయసు ఇప్పటివరకూ 65 ఏళ్లు ఉండగా.. దీన్ని 70 ఏళ్లకు పెంచారు. ►ఎవరైనా 65 సంవత్సరాల తర్వాత ఎన్పీఎస్లో చేరితే, కనీసం 3ఏళ్ల పాటు కొనసాగాలి. ►ఒకవేళ 65 ఏళ్ల తర్వాత ఎన్పీఎస్లో చేరి..3 సంవత్సరాల ముందే విత్డ్రా చేయాలనుకుంటే..జమ చేసిన మొత్తంలో 20% వరకు మాత్రమే పన్నురహిత ఉపసంహరణను అనుమతిస్తారు. మిగతా మొత్తం జీవితకాలం పెన్షన్గా ఉంటుంది. రూ.5 లక్షల నిధి మాత్రమే ఉంటే.. మొత్తం వెనక్కి.. గతంలో ఎన్పీఎస్ నుంచి పెట్టుబడిని పూర్తిగా వెనక్కి తీసుకునే సదుపాయం లేదు. ఉదాహరణకు పథకంలో జమ చేసిన మొత్తం రూ.2లక్షలు దాటితే.. పదవీ విరమణ తర్వాత లేదా 60 ఏళ్ల తర్వాత కనీసం 40శాతంతో ఇన్సూరెన్స్ కంపెనీలు అందించే యాన్యుటీ పథకాలను తప్పనిసరిగా కొనాల్సి వచ్చేది. మిగిలిన 60 శాతాన్ని ఒకేసారి వెనక్కి తీసుకునే వీలుండేది. కానీ తాజాగా సడలించిన నిబంధనలతో రూ.5 లక్షల లోపు ఎన్పీఎస్ నిధి ఉన్నవారు పదవీ విరమణ చేసినా..ఎన్పీఎస్ నుంచి బయటకు రావాలని అనుకున్నా.. మొత్తం సొమ్మును వెనక్కి తీసుకునే వెసులుబాటును కేంద్రం కల్పించింది. -
కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో కొత్త బ్రేక్.. 5 నిముషాల సమయం
న్యూఢిల్లీ: టీ బ్రేక్, లంచ్ బ్రేక్ అంటే మనకి తెలుసు. ఇప్పుడు కేంద్ర కార్యాలయాల్లో ఇంకో కొత్త బ్రేక్ రాబోతోంది. అదే యోగా బ్రేక్.. పనిలో వచ్చే ఒత్తిళ్లను జయించి రెట్టించిన ఉత్సాహంతో ఉద్యోగులు పని చేస్తారన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ యోగా బ్రేక్ ప్రవేశపెట్టింది. ఒక అయిదు నిమిషాల సేపు ఉద్యోగులు అన్నీ మర్చిపోయి ప్రాణాయామం, ఆసనాలు, ధ్యానం చేస్తే శారీరక, మానసిక ఆరోగ్యం బాగుంటుందని కేంద్రం భావిస్తోంది. ఇందుకోసం కేంద్ర ఆయుష్ శాఖ వై–బ్రేక్ యాప్ అనే యాప్ని రూపొందించింది. అందులో యోగా, ప్రాణాయామం ఎలా చేయాలో 5 నిమిషాల వీడియో ఉంటుంది. యోగా బ్రేక్ సమయంలో వై–బ్రేక్ యాప్లో చూపించినట్టుగా ఉద్యోగులు చేస్తే సరిపోతుంది. ఈ నెల 30 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ యోగా బ్రేక్ తీసుకోవాలని సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కేవలం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులే కాకుండా ప్రైవేటు కార్యాలయాల్లో సిబ్బందికి కూడా యోగా బ్రేక్ ఇచ్చేలా చర్యలు చేపట్టాలని ఆ శాఖ తన ఆదేశాల్లో పేర్కొంది. ఆ యాప్లో ఏముంది ? పని చేసే ప్రాంతాల్లో 5 నిమిషాల సేపు రిలాక్స్ అవడానికి ఏమేం చెయ్యాలన్న దానిపై 2019లోనే కేంద్రం యోగా నిపుణులతో ఒక కమిటీ వేసింది. వారి సూచనల మేరకు ఈ 5 నిమిషాల యోగా ప్రోటోకాల్ను రూపొందించారు. గత ఏడాది జనవరిలో ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కోల్కతాలలో దీనిని ఒక పైలెట్ ప్రాజెక్టులా ప్రారంభించారు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఈ 5 ని.ల యోగా ప్రోటోకాల్ని తప్పనిసరి చేశారు. ఈ నెల 1న కేంద్రం వై–బ్రేక్ యాప్ని ప్రారంభించింది. -
పామాయిల్ సాగుకన్నా ముఖ్యం ఇదీ...
ప్రపంచ వాణిజ్య సంస్థ విధివిధానాలను నెరవేర్చడం కోసం దిగుమతి పన్నులను క్రమానుగతంగా తగ్గించడాన్ని భారత్ మొదలెట్టినప్పుడు ‘ఎల్లో రివల్యూషన్’ (నూనెగింజల ఉత్పత్తి) ద్వారా దేశం సాధించిన ఫలితాలు హరించుకుపోయాయి. వంటనూనెల దిగుమతిపై దేశం 300 శాతం వరకు పన్ను విధించే అవకాశం ఉన్నప్పటికీ ఒకవైపు దిగుమతి లాబీలు, మరోవైపు దేశంలోని ప్రముఖ ఆర్థికవేత్తల ఒత్తిడితో దిగుమతి పన్ను రేట్లను ఒక దశలో జీరోకి తగ్గించేశారు. దీంతో స్వల్ప కాలంలో ప్రపంచంలోనే అతిపెద్ద వంటనూనెల దిగుమతిదారుగా భారత్ మారిపోయింది. పామాయిల్ సాగుకోసం భూమిని అధికంగా కేటాయించడానికి బదులుగా, మనం మర్చిపోయిన ‘నూనెగింజల విప్లవా’న్ని పునరుద్ధరించడం తక్షణావసరంగా ఉంది. కొన్ని రోజుల క్రితం పామాయిల్ని దేశీ యంగా ఉత్పత్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం వంటనూనెలు– ఆయిల్ పామ్పై జాతీయ మిషన్ (ఎన్ఎమ్ఈఓ–ఓపీ) కోసం రూ. 11,040 కోట్లకు ఆమోదముద్ర వేసింది. వంట నూనెల దిగుమతిపై అతిగా ఆధారపడటాన్ని తగ్గించుకోవడమే దీని లక్ష్యం. కాయధాన్యాలు, నూనెగింజలకు సంబంధించిన ఉత్పత్తి పరి స్థితులపై చర్చించడానికి ఒక టీవీ ప్యానెల్లో కూర్చున్నాను. ఆ ప్యానెల్లో నీతి ఆయోగ్ సభ్యుడొకరు ముఖ్యమైన సమాచారం తెలిపారు. రాబోయే కొన్నేళ్లలో దేశీయ వంటనూనెల అవసరాల్లో 40 శాతం పైగా పామాయిల్ సాగు ద్వారా పూరించాలన్నదే ఈ పథకం లక్ష్యమట. పర్యావరణ, వాతావరణ కారణాల వల్ల పామాయిల్ ఇప్పటికే ఆరోగ్యపరమైన వివాదంలో చిక్కుకుని ఉన్న నేపథ్యంలో కేంద్రప్రభుత్వ తాజా పథకం దిగ్భ్రాంతిని కలిగించింది. ఇతర వంటనూనెలతో పోలిస్తే పామాయిల్ ధర తక్కువ కాబట్టి నీతినియమాలు లేని వర్తకులు తరచుగా పామాయిల్ని ఇతర వంటనూనెలతో కల్తీ చేసి ప్రయోజనం పొందుతున్నారు. పైగా స్థానిక ఉత్పత్తి, స్థానిక అవసరాలపై ఆధారపడి దేశంలో అనేకరకాల ఆరోగ్యకరమైన వంటనూనెలు అంటే– ఆవ, పొద్దుతిరుగుడు, వేరుశనగ, నువ్వులు, కుసుమలు, వెర్రి నువ్వులు (ఒడిసలు) వంటి నూనె గింజలపై భారతీయులు సాంప్రదాయకంగా ఆధారపడి ఉన్నారు. అందుకే భారతీయులు పామాయిల్ పట్ల ఏ ఆసక్తీ చూపలేదు. పైగా పామాయిల్ని జంక్ ఫుడ్, ప్రాసెసింగ్ పరిశ్రమ, సౌందర్య ఉత్పత్తులు, షాంపూ, డిటర్జెంట్స్, క్యాండిల్స్, టూత్ పేస్టులు వంటి వేగంగా అమ్ముడయ్యే వినియోగదారీ ఉత్పత్తులలో ఉపయోగించడానికే పరిమితం చేస్తున్నారు. పామాయిల్ దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి ప్రతిపాదిం చిన కేంద్ర పథకం గురించి మనం మొదటగా తెలుసుకుందాం. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో సమాచారం ప్రకారం 2025–26 నాటికి దేశంలో పది లక్షల హెక్టార్లలో పామాయిల్ తోటల సాగును పెంచాలనీ, 2029–30 నాటికి దీన్ని 16.7 లక్షల హెక్టార్లకు విస్తరించాలని కేంద్ర పథకం లక్ష్యం. ఈ కొత్త పంటలో చాలా భాగాన్ని పర్యావరణపరంగా దుర్బలంగా ఉండే ఈశాన్య భారత్లో, అండమాన్, నికోబార్ దీవుల్లో సాగు చేయనున్నారు. పామాయిల్ సాగుకోసం అవసరమైన ఉత్పాదకాలకు రాయితీ కల్పించడతోపాటు, ప్రారంభ సంవత్సరాల్లో ఎరువులపై ఖర్చును నూరుశాతం రీయింబర్స్మెంట్ కూడా ఇవ్వనున్నారు కాబట్టి రైతులు పామాయిల్ సాగుపట్ల తప్పక ఆకర్షితులవుతారు. పైగా ధరల హెచ్చుతగ్గులను అధిగమించడానికి పామాయిల్ సాగుకు గ్యారంటీ ధర చెల్లిస్తామనే హామీని కూడా కేంద్ర పథకం ప్రతిపాదిం చింది. టోకు ధరల సూచీకి అనుగుణంగా గత అయిదేళ్లలో సగటు ముడి పామాయిల్ ధరపై ఆధారపడి పామాయిల్ ధరను నిర్ణయించనున్నారని సమాచారం. ఒకవేళ ప్రాసెసింగ్ పరిశ్రమ పామాయిల్ సాగు రైతులకు ఇచ్చిన హామీమేరకు ధర చెల్లించకపోతే, రెండు శాతం ప్రోత్సాహకాన్ని ప్రభుత్వమే చెల్లించనుంది. భారతదేశం తన వంట నూనెల అవసరాల్లో దాదాపు 55 నుంచి 60 శాతం దిగుమతుల ద్వారా తీర్చుకుంటోంది కానీ, దిగుమతుల చెల్లింపుల అంతరం మొత్తంమీద రూ. 75 వేల కోట్లకు చేరుకుంది. పర్యావరణ వైపరీత్యాలకు ప్రధాన కారణం పెరుగుతున్న అడవుల నిర్మూలన, జీవవైవిధ్య విధ్వంసమేనని వాతావరణ మార్పుపై అంతర్ ప్రభుత్వ ప్యానెల్ (ఐపీసీసీ) పదేపదే హెచ్చరిస్తూ వచ్చింది. సహజ వర్షాటవుల స్థానంలో వైవిధ్య రహితమైన తోటలను సాగుచేసే ప్రయత్నాలు అత్యంత విలువైన జీవజాతులు నశించిపోయేలా చేస్తున్నాయని, కర్బన ఉద్గారాలు పెరిగిపోవడానికి కారణమవుతున్నాయని పలు అధ్యయనాలు చూపించాయి. 2020 జనవరిలో సమర్పించిన ఒక నివేదిక ప్రకారం భారతీయ అటవీ పరిశోధనా, విద్యా మండలి కూడా జీవవైవిధ్య పరంగా మెరుగ్గా ఉన్న ప్రాంతాలను పామాయిల్ తోటల సాగుకు అప్పగించడంపై తీవ్రంగా హెచ్చరించింది. భారీస్థాయిలో పెరిగిపోతున్న దిగుమతుల బిల్లును తగ్గించడానికి దేశీయంగా వంటనూనెల ఉత్పత్తిని పెంచాలనుకోవడంలో ఆర్థికపరంగా ఔచిత్యం ఉన్నప్పటికీ, 1993–94 నాటికే దేశీయ వంటనూనెల అవసరాల్లో 97 శాతాన్ని ఉత్పత్తి చేసి దాదాపుగా స్వయంసమృద్ధిని సాధించిన భారతదేశం... ఇంత తక్కువ కాలంలో ప్రపంచంలోనే అతిపెద్ద వంటనూనెల దిగుమతిదారుగా ఎలా మారిపోయిందన్నది పెద్ద ప్రశ్న. 1985–86లో భారత్ ప్రారంభించిన చమురుగింజల టెక్నాలజీ మిషన్ లక్ష్యం ఏమిటంటే, దేశీయ ప్రాసెసింగ్ ఉత్పత్తిని బలోపేతం చేస్తూనే నూనెగింజల ఉత్పత్తి పెంపుదలపై దృష్టిపెట్టడమే. దీన్నే తదనంతరం ‘ఎల్లో రివల్యూషన్’ అని ప్రశంసించారు. వ్యవసాయంపై డబ్ల్యూటీఓ ఒడంబడిక ప్రకారం భారతదేశం సోయాబీన్ మినహా ఇతర వంటనూనెలపై 300 శాతం వరకు దిగుమతి పన్నులు విధించవచ్చు. వంటనూనెల దిగుమతిపై దేశం ఇంత అత్యధిక శాతం పన్ను విధించే అవకాశం ఉన్నప్పటికీ ఒకవైపు దిగుమతి లాబీలు, మరోవైపు దేశంలోని ప్రముఖ ఆర్థికవేత్తల ఒత్తిడి కారణంగా ఎగుమతి పన్ను రేట్లను తగ్గించేశారు. ఇది ఏ స్థాయికి చేరుకుం దంటే ఒక దశలో దిగుమతి పన్నులు దాదాపుగా జీరోకి చేరుకున్నాయి. దీంతో చౌక నూనె దిగుమతుల వెల్లువ మొదలై దేశీయ నూనెగింజల సాగుదారులు రంగం నుంచే తప్పుకోవలసివచ్చింది. దేశీయ వంటనూనె ఉత్పత్తిని ప్రోత్సహించే ఉత్తమ మార్గం ఏదంటే, ఎల్లో రివల్యూషన్ ఎక్కడ తన ప్రభను కోల్పోయిందో గ్రహించి, నూనె గింజల ఉత్పత్తిని తిరిగి పెంచడంపై దృష్టి పెట్టడమే. ప్రభుత్వం దేశంలోని పామాయిల్ సాగుదారులకు గ్యారంటీ ధర కల్పించాలని భావిస్తున్నట్లయితే, నూనె గింజల సాగుదారుల్లో చాలామంది చిన్న రైతులే కాబట్టి, వీరికి గ్యారంటీ ధరకు హామీని కల్పించకపోవడంలో ఎలాంటి హేతువును నేను చూడటం లేదు. ఆర్థిక నిచ్చెనలో రైతులు అత్యంత దిగువన ఉంటున్నారన్న వాస్తవాన్ని గుర్తించి గ్యారంటీ ధర, మార్కెటింగ్ వ్యవస్థ కల్పనతో నూనె గింజల సాగుకు తిరిగి ప్రాణం పోయాలి. ఇది ఆర్థికంగా చెల్లుబాటు కాగల ప్రత్యామ్నాయంగా మారితే అధిక నీటిని ఉపయోగించి వరి సాగు చేసే పంజాబ్ రైతులు కూడా తమ ప్రాధాన్యతను మార్పు చేసుకుంటారు. పైగా ఆబ్సెంటీ భూస్వాములకు, కొద్దిమంది పారిశ్రామిక దిగ్గజాలకు మాత్రమే ప్రయోజనం కలిగించే పామాయిల్ సాగుకి కాకుండా, నూనెగింజల సాగును ప్రోత్సహిస్తే అది దేశంలోని కోట్లాది సన్నకారు రైతులకు వ్యవసాయాన్ని లాభదాయకంగా మారుస్తుంది. ఎల్లో రివల్యూషన్ కుప్పగూలిపోయాక దేశంలో నూనె గింజల సాగుదారుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. పైగా నూనెగింజల సాగుకు భూముల విస్తరణ కోసం పెద్ద ఎత్తున సహజ అడవులపై వేటు వేయాల్సిన అవసరం లేదు. దేశంలో భూగర్భజలాలు అడుగంటిపోవడానికి విస్తృతంగా గోధుమ, వరి పంటలను పండించడమే కారణమని నిపుణులు మొత్తుకుంటున్న సమయంలో, నీటిని అధికంగా ఉపయోగించుకునే పామాయిల్ సాగువైపు దేశాన్ని నెట్టడంలో అర్థం లేదు. సగటున ఒక పామ్ చెట్టు రోజుకు 300 లీటర్ల నీటిని పీల్చుకుంటుంది. ఒక హెక్టార్లోని పామ్ చెట్ల సంఖ్యను లెక్కించి చూస్తే పామాయిల్ తోటలు నీటిని తోడేస్తాయని చెప్పాలి. కాబట్టే మరో పర్యావరణ సంక్షోభంలో మనం కూరుకుపోవడానికి ముందుగా ఖర్చులు తగ్గించుకునే నిష్పత్తిని సమగ్రంగా అధ్యయనం చేయాల్సి ఉంది. పామాయిల్ సాగుకోసం సాగుభూమి విస్తరణను ప్రతిపాదించడానికి బదులుగా, మనం మర్చిపోయిన నూనెగింజల విప్లవాన్ని పునరుద్ధరించడం తక్షణావసరంగా ఉంది. నూనె గింజల్లో స్వయం సమృద్ధిని సాధించే మార్గం ఇదే. వ్యాసకర్త: దేవీందర్ శర్మ ఆహారం, వ్యవసాయరంగ నిపుణులు ఈ–మెయిల్ : hunger55@gmail.com -
కేంద్ర ఉద్యోగులకు 28% డీఏ
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం(డీఏ), పెన్షనర్లకు కరువు ఉపశమనం(డీఆర్) 28 శాతానికి పెంచేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన మంత్రివర్గం ప్రస్తుతం మూలవేతనంపై 17 శాతంగా ఉన్న డీఏను మరో 11 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పెంపు ఈ ఏడాది జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్సింగ్ ఠాకూర్ వెల్లడించారు. దీనివల్ల కేంద్రంపై అదనంగా రూ.34,401 కోట్ల ఆర్థిక భారం పడనున్నట్టు చెప్పారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో 48.34 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65.26 లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందుతారని చెప్పారు. కాగా, 2020 జనవరి 1, 2020 జులై 1, 2021 జనవరి 1 తేదీల్లో చెల్లించాల్సిన మూడు అదనపు డీఏ, డీఆర్ వాయిదాలను.. కోవిడ్–91 మహమ్మారి కారణంగా తలెత్తిన పరిస్థితుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. 2020 జనవరి 1 నుంచి 2021 జూన్ 30 మధ్య గల కాలానికి డీఏ, డీఆర్ 17 శాతంగానే ఉంటుందని కేంద్రం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ‘ఆయుష్ మిషన్’ ఐదేళ్లపాటు పొడిగింపు నేషనల్ ఆయుష్ మిషన్(నామ్)ను కేంద్ర ప్రాయోజిత పథకంగా 2021 ఏప్రిల్ 1 నుంచి 2026 మార్చి 31 వరకూ కొనసాగింపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకు రూ.4,607.30 కోట్ల వ్యయం కానుంది. ఇందులో కేంద్రం వాటా రూ.3,000 కోట్లు, రాష్ట్రాల వాటా రూ.1,607 కోట్లుగా ఉంటుంది. నేషనల్ ఆయుష్ మిషన్ను కేంద్ర ప్రభుత్వం 2014 సెప్టెంబరు 15న ప్రారంభించింది. అర్హులందరికీ వైద్య సేవలు అందేలా చూడడం, ఔషధాలు, మానవ వనరుల లభ్యత పెరిగేలా చూడడం, ఆయుష్ విద్యా సంస్థల సంఖ్యను పెంచడం వంటివి ఆయుష్ మిషన్ లక్ష్యాలు. కేబినెట్ మరికొన్ని నిర్ణయాలు ∙న్యాయ వ్యవస్థలో మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.9,000 కోట్లతో కేంద్ర ప్రాయోజిత పథకం కొనసాగింపు ప్రతిపాదనలకు ఆమోదం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సహా ఐదేళ్లపాటు ఇది అమలవుతుంది. ఓబీసీ ఉప కులాల వర్గీకరణ కమిషన్ కాలపరిమితి మరో ఆరు నెలల పాటు.. అంటే జనవరి 31 వరకు పొడిగింపు. నార్త్ ఈస్ట్రన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫోక్ మెడిసిన్ సంస్థ పేరు ఇకపై నార్త్ ఈస్ట్రన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద, ఫోక్ మెడిసిన్ రీసెర్చ్గా మార్పు. ప్రత్యేక పశు సంవర్థక ప్యాకేజీ అమలుకు ఆమోదం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి ఐదేళ్లపాటు అమలయ్యేలా కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో మార్పులు చేస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ప్రత్యేక పశు సంవర్థక ప్యాకేజీ అమలు చేయాలని తీర్మానించింది. పశు సంవర్థక రంగం వృద్ధితోపాటు ఈ రంగంలో ఉన్న 10 కోట్ల మంది రైతులకు మెరుగైన ప్రతిఫలం దక్కేలా ఈ చర్య దోహదపడుతుందని ప్రభుత్వం తెలిపింది. ఈ ప్యాకేజీ కింద కేంద్రం రూ.9,800 కోట్ల మేర ఆర్థిక సాయం అందించనుంది. మొత్తంగా రూ.54,618 కోట్ల పెట్టుబడులు వస్తాయని ఆశిస్తోంది. వివిధ విభాగాలను రాష్ట్రీయ గోకుల్ మిషన్, జాతీయ పాడి అభివృద్ధి కార్యక్రమం(ఎన్పీడీడీ), జాతీయ పశు సంపద మిషన్గా విభజించారు. రాష్ట్రీయ గోకుల్ మిషన్ దేశీయ జాతుల అభివృద్ధి, పరిరక్షణకు సహాయపడుతుంది. ఎన్పీడీడీ పథకం సుమారు 8,990 బల్క్ మిల్క్ కూలర్స్ ఏర్పాటు లక్ష్యంగా పనిచేస్తోంది. -
రాష్ట్రాలకు రూ.400లకు డోసు
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ తయారీదారు, పుణేకు చెందిన సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (సీఐఐ) తమ కరోనా వ్యాక్సిన్ ’కోవిషీల్డ్’బహిరంగ మార్కెట్ ధరలను బుధవారం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాలకైతే రూ.400 డోసు చొప్పున అందజేస్తామని, ప్రైవేటు ఆసుపత్రులకు ఒక డోసుకు రూ.600 వసూలు చేస్తామని వెల్లడించింది. భారత్లో జనవరి 16న వ్యాక్సినేషన్ ప్రారంభం కాగా, కేంద్ర ప్రభుత్వం వైద్య సిబ్బందికి, ఫ్రంట్లైన్ వర్కర్స్కు, 45 ఏళ్ల పైబడిన వారందరికీ ఉచితంగా టీకాలు వేస్తున్న విషయం తెలిసిందే. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు, నిపుణుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను దృష్టిలో పెట్టుకొని మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్కు అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం రెండు రోజుల కిందట నిర్ణయం తీసుకుంది. ఫార్మా కంపెనీలు ఉత్పత్తి చేసే టీకాల్లో 50 శాతం కేంద్ర ప్రభుత్వానికి ఎప్పటిలాగే తక్కువ ధరకు అందిస్తూ... మిగతా 50 శాతం వ్యాక్సిన్లను బహిరంగ మార్కెట్లలో రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు ఆసుపత్రులు, సంస్థలకు అమ్ముకోవడానికి వీలు కల్పించింది. అయితే ఫార్మా కంపెనీలు మే1 లోపే పారదర్శకంగా తమ బహిరంగ మార్కెట్ ధరలను ప్రకటించాలని కేంద్రం షరతు విధించింది. కేంద్ర అదేశాలకు అనుగుణంగా సీరమ్ కోవిషీల్డ్ ధరలను ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు రూ. 400 డోసు, ప్రైవేటు ఆసుపత్రులకు రూ.600 డోసు చొప్పున అందజేస్తామని ఒక ప్రకటనలో తెలిపింది. ‘ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ల ధరలను దృష్టిలో పెట్టుకొని... వాటితో పోల్చితే తక్కువ ధర ఉండేలా, అందరికీ అందుబాటులో ఉండేలా కోవిషీల్డ్ ధరలను నిర్ణయించాం. అమెరికా వ్యాక్సిన్లు బహిరంగ మార్కెట్లో ఒక్క డోసుకు రూ.1,500 కంటే ఎక్కువగా, రష్యా, చైనా వ్యాక్సిన్లు ప్రతి డోసుకు రూ.750కి పైగా ఉన్నాయి. రాబోయే రెండు నెలల్లో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం ద్వారా సరఫరాను పెంచుతాం. నాలుగైదు నెలల తర్వాత వ్యాక్సిన్ రిటైల్ మార్కెట్లో అందుబాటులోకి వస్తుంది’అని సీరమ్ ఇన్స్టిట్యూట్ వివరించింది. కేంద్ర ప్రభుత్వం ఎప్పటిలాగే 45 ఏళ్ల పైబడిన వారందరికీ ఉచితంగా టీకా కార్యక్రమాన్ని ఇకపై కూడా కొనసాగించనుంది. 18–45 ఏళ్ల లోపు వయసు వారికి టీకాలు వేసే విషయం రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రైవేటు ఆసుపత్రుల్లో వేసుకోదలచుకున్న వారు నేరుగా వెళ్లి ఆసుపత్రి నిర్ధారించిన ఫీజు చెల్లించి వేసుకోవచ్చు. గతంలో 45 ఏళ్ల పైబడిన వారికి ప్రభుత్వం తరఫున టీకాలు సరఫరా అయ్యాయి కాబట్టి... ప్రైవేటులో వేసుకుంటే టీకాకు రూ. 150, సర్వీసు ఛార్జీ కింద రూ.100 వసూలు చేసుకోవడానికి అనుమతించారు. ఇప్పుడు సీరమ్ డోసును రూ.600లకు అమ్మనుంది. దీనిపై ప్రైవేటు ఆసుపత్రులు ఎంత అదనంగా వసూలు చేస్తాయనేది చూడాలి. కాంట్రాక్టు ముగిశాక కేంద్రానికీ అదే ధర కేంద్ర ప్రభుత్వానికి రూ.150 డోసు చొప్పున అందిస్తూ... రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రం రూ.400 ధర నిర్ణయించడంపై విపక్షాలు మండిపడ్డాయి. ఇంత అధికధర వసూలు చేయడంలోని ఔచిత్యాన్ని ప్రశ్నించాయి. వైరస్ సమర్థత ఎంత ఉంటుందో ఇంకా పూర్తిగా తెలియకముందే, చాలాకాలం ముందే కేంద్ర ప్రభుత్వం గంపగుత్తగా తమకు 10 కోట్ల డోసులకు అర్డర్ ఇచ్చిందని, రిస్క్ను తాము కూడా పంచుకొనే దాంట్లో భాగంగానే రూ.150 డోసును కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడానికి అంగీకరించామని సీరం సీఈవో అదర్ పూనావాలా తెలిపారు. ఈ పది కోట్ల డోసుల సరఫరా పూర్తికాగానే కేంద్ర ప్రభుత్వానికి కూడా రూ.400 డోసు చొప్పునే ఇస్తామన్నారు. ప్రస్తుతం నెలకు 6–7 కోట్ల డోసులు ఉత్పత్తి చేస్తున్నామని, జులై కల్లా దీన్ని 10 కోట్ల డోసులకు పెంచుతామన్నారు. -
ప్రభుత్వ ఉద్యోగులకు హోలీ పండుగ బంపర్ ఆఫర్!
హోలీ పండుగ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల అందరికి హోలీ బోనాంజా బహుమతిని ప్రకటించింది. స్పెషల్ ఫెస్టివెల్ అలవెన్స్ స్కిమ్ కింద రూ.10,000 అడ్వాన్స్ను ఇస్తున్నట్లు తెలిపింది. ఈ స్పెషల్ ఫెస్టివెల్ అలవెన్స్ స్కీం పొందేందుకు చివరి తేదీ మార్చి 31. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉద్యోగులకు బంపరాఫర్ ప్రకటించాయి. మధ్యప్రదేశ్ ప్రభుత్వం హోలీకి ముందు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. మూడో ఇన్స్టాల్మెంట్ ఎర్రీర్స్ను విడుదల చేస్తోంది. అయితే ఇందుకు సంబంధించి నిర్ణయం అధికారికంగా వెలువడాల్సి ఉంది. త్రిపుర ప్రభుత్వం హోలీ సందర్భంగా డియర్నెస్ అలవెన్స్ హైక్ను ప్రకటించింది. ఇదొక్కటే కాదు పెన్షనర్స్ 3 శాతం డీఏ హైక్ పొందనున్నారు. అలాగే, గత జూలై నుండి పెండింగ్లో ఉన్న డియర్నెస్ అలవెన్స్, డియర్నెస్ రిలీఫ్ కు సంబంధించిన శుభవార్త చెప్పింది. చదవండి: హైదరాబాద్ రోడ్ల మీదకి డ్రైవింగ్ లైసెన్స్ అక్కర్లేని ఎలక్ట్రిక్ బైక్ -
సెప్టెంబర్లో ఉమ్మడి అర్హత పరీక్ష!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఉమ్మడి అర్హత పరీక్ష(సెట్)ను ఈ ఏడాది సెప్టెంబర్లో నిర్వహించే అవకాశం ఉందని కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ శనివారం వెల్లడించారు. ఈ పరీక్షను నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ(ఎన్ఆర్ఏ) నిర్వహిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరాలనుకొనే యువతకు మంచి అవకాశమన్నారు. గ్రూప్–బి, గ్రూప్–సి(నాన్ టెక్నికల్) ఉద్యోగాల భర్తీకి ‘సెట్’ను దేశవ్యాప్తంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. దేశంలో ప్రతి జిల్లాలో కనీసం ఒక పరీక్షా కేంద్రం ఉంటుందన్నారు. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో నివసించే యువతకు ఇది ఉపయోగకరమని చెప్పారు. ముఖ్యంగా మహిళలు, దివ్యాంగులు పరీక్ష కోసం ఎక్కువ దూరం ప్రయాణించాల్సిన అవసరం ఉండదని తెలిపారు. యువతకు ఉద్యోగాలు కల్పించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృఢ సంకల్పంతోనే ఈ ఏడాది నుంచి ‘సెట్’ అమల్లోకి వస్తోందని పేర్కొన్నారు. ఇదొక గొప్ప సంస్కరణ అని అభివర్ణించారు. ‘సెట్’ ఉన్నప్పటికీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ), రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు(ఆర్ఆర్బీ), ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్) వంటి సెంట్రల్ రిక్రూటింగ్ ఏజెన్సీలు కొనసాగుతాయని జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. -
కేంద్ర ఉద్యోగులకు బోనస్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. దసరా సందర్భంగా బోనస్ ప్రకటించింది. సుమారు 30.67 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రూ. 3,737 కోట్ల బోనస్ను అందజేయాలన్న ప్రతిపాదనకు బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 2019–2020 సంవత్సరానికి గానూ ఉద్యోగులకు ఉత్పాదకత ఆధారిత బోనస్ (ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్– పీఎల్బీ), ఉత్పాదకతకు సంబంధం లేని బోనస్ (నాన్ పీఎల్బీ లేదా అడ్హాక్) ఇవ్వాలని నిర్ణయించినట్లు∙సమాచార, ప్రసార శాఖ మంత్రి జవదేకర్ వెల్లడించారు. ఈ బోనస్ వల్ల దసరా, దీపావళి ఉత్సవాల సందర్భంగా ఉద్యోగుల కొనుగోళ్లు పెరిగి, తద్వారా ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ పెరుగుతుందని భావిస్తున్నామన్నారు. ‘ప్రతీ సంవత్సరం దసరా సమయంలో ఉద్యోగులకు గత సంవత్సర ఉత్పాదకత ఆధారంగా బోనస్ ప్రకటించడం ఆనవాయితీ. ఈ సంవత్సరం కూడా పీఎల్బీ, అడ్హాక్ బోనస్ను తక్షణమే అందించనున్నాం’ అని కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. రైల్వే, పోస్ట్స్, డిఫెన్స్, ఈపీఎఫ్ఓ, ఈఎస్ఐసీ, తదితర విభాగాలకు చెందిన సుమారు 16.97 లక్షల మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు రూ. 2,791 కోట్లతో 2019–20 సంవత్సరానికి గానూ పీఎల్బీ అందించనున్నారు. సుమారు 13.70 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ నాన్గెజిటెడ్ ఉద్యోగులకు రూ. 946 కోట్లతో అడ్హాక్ బోనస్ను ఇవ్వనున్నారు. జమ్మూకశ్మీర్లో నాఫెడ్ (నేషనల్ అగ్రికల్చరల్ కో ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్) ద్వారా 12 లక్షల టన్నుల యాపిల్ను సేకరించే పథకాన్ని 2020–21 సీజన్లో కొనసాగించాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందుకు నాఫెడ్ వద్ద ప్రభుత్వ హామీగా ఉన్న రూ. 2500 కోట్లను వినియోగించేందుకు అనుమతించింది. కశ్మీర్లో పంచాయతీరాజ్ చట్టం– 1989 అమలు ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించింది. మూడంచెల పంచాయతీరాజ్ విధానం కశ్మీర్లోనూ అమలు కానుంది. -
కేంద్ర ఉద్యోగులకు బొనాంజా
న్యూఢిల్లీ: పండుగ సీజన్ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పండుగల సమయంలో వినిమయ డిమాండ్ను పెంచి, ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రూ. 10 వేల వేతన అడ్వాన్స్ను, ఎల్టీసీ స్థానంలో నగదు ఓచర్లను అందించనున్నట్లు ప్రకటించింది. అలాగే, రాష్ట్రాలకు 50 ఏళ్ల పాటు వడ్డీ లేని రుణంగా అందించేందుకు రూ. 12 వేల కోట్లను కేటాయించింది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ఈ వివరాలను వెల్లడించారు. ఆర్థిక మంత్రి తెలిపిన వివరాల ప్రకారం.. ఉద్యోగులకు ఇచ్చే లీవ్ ట్రావెల్ కన్సెషన్(ఎల్టీసీ) స్థానంలో ఈ సంవత్సరం క్యాష్ ఓచర్లను ఇస్తారు. జీఎస్టీ రిజిస్టర్డ్ అమ్మకందారు వద్ద, డిజిటల్ మోడ్లో, 12% లేదా అంతకుమించి జీఎస్టీ ఉన్న వస్తువులను కొనేందుకే వాటిని వినియోగించాలి. ఆహార ఉత్పత్తుల కొనుగోలుకు ఆ ఓచర్లను వినియోగించడం కుదరదు. 2021 మార్చి 31లోగా వాడేయాలి. ఎల్టీసీ ద్వారా పొందే విమాన/రైలు చార్జీ కన్నా 3 రెట్లు ఎక్కువ విలువైన వస్తువులు/ సేవలను కొనుగోలు చేయాలి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులు తమ ఉద్యోగులకు ఎల్టీసీల స్థానంలో నగదు ఓచర్లు ఇవ్వనున్నాయి. శాలరీ అడ్వాన్స్, ఎల్టీసీ స్థానంలో నగదు ఓచర్లతో మార్కెట్లో రూ. 28 వేల కోట్ల విలువైన డిమాండ్ ఉంటుందని నిర్మల వెల్లడించారు. ఎల్టీసీ ఇచ్చే రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు రంగ సంస్థలకు కూడా, షరతులకు లోబడి, సంబంధిత మొత్తంపై పన్ను రాయితీ ఉంటుందని పేర్కొన్నారు. రూ. 10 వేల శాలరీ అడ్వాన్స్ను 2021మార్చి 31లోగా ఉద్యోగులు ప్రీలోడెడ్ రూపే కార్డుల రూపంలో తీసుకోవాలి. వడ్డీ లేని ఆ రుణాన్ని గరిష్టంగా 10 వాయిదాల్లో చెల్లించాలి. సొంత ఊరికి లేదా దేశంలోని పర్యాటక ప్రాంతాలకు వెళ్లేందుకు పలు షరతులతో ఉద్యోగులకు ఎల్టీసీ లభిస్తుంది. అయితే, కరోనా కారణంగా ప్రయాణాలు సాధ్యం కాని పరిస్థితులు నెలకొనడంతో ఆ స్థానంలో నగదు ఓచర్లు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. మొత్తం రూ. 73 వేల కోట్ల ఉద్దీపన ఎల్టీసీ క్యాష్ ఓచర్లు, శాలరీ అడ్వాన్స్ సహా మొత్తంగా రూ. 73 వేల కోట్ల ఉద్దీపన ప్యాకేజీని ప్రకటిస్తున్నట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇందులో ఎల్టీసీ, శా లరీ అడ్వాన్స్ కోసం రూ. 11,575 కోట్లు, రా ష్ట్రాలకు 50 ఏళ్ల పాటు వడ్డీలేని రుణంగా రూ. 12 వేల కోట్లు ఉన్నాయన్నారు. అదనంగా రూ. 2500 కోట్లను కేంద్రం రోడ్లు, డిఫెన్స్, పట్టణాభివృద్ధి తదితర రంగాల్లో మౌలిక వసతుల కోసం ఖర్చు చేయనుందని తెలిపారు. రాష్ట్రాలకు ప్రకటించిన రూ. 12 వేల కోట్ల రుణంలో రూ. 1,600 కోట్లు ఈశాన్య రాష్ట్రాలకు, రూ. 900 కోట్లు ఉత్తరాఖండ్, హిమాచల్ప్రదేశ్లకు, రూ. 7,500 కోట్లు ఇతర రా ష్ట్రాలకు కేటాయించామన్నారు. ప్యాకేజీతో ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ పెరుగుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
కరోనా: కేంద్రం కొత్త మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. మళ్లీ వర్క్ ఫ్రం హోం ప్రారంభిస్తున్నట్టు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ మంగళవారం తెలిపింది. పూర్తి ఆరోగ్యంగా ఉన్నవారికి మాత్రమే కార్యాలయాల్లోకి అనుమతినిస్తున్నట్టు, మిగతావారు ఇంటి నుంచే పనిచేయాలని ఆదేశాలు జారీ చేసింది. కంటైన్మెంట్ జోన్ పరిధిలో ఉన్న ఉద్యోగులు ఇంట్లో నుంచే పనిచేయాలని చెప్పింది. జ్వరం, దగ్గు లక్షణాలు ఉంటే ఆఫీసులకు రావద్దని మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. ఒక్కో విభాగంలో రోస్టర్ పద్ధతిన 20 మంది సిబ్బంది లేదా అధికారులకు మాత్రమే అనుమతి ఉంటుందని కేంద్రం తెలిపింది. సెక్రటరీ స్థాయి అధికారులు రోజు విడిచి రోజు హాజరుకావాలని వెల్లడించింది. అలాగే ఎదురెదురుగా కూర్చోవద్దని, ఇంటర్ కాం లోనే మాట్లాడుకోవాలని తెలిపింది. మాస్కు, ఫేస్ షీల్డ్ తప్పనిసరిగా వాడాలని, మాస్కు పెట్టుకోకుంటే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే సమావేశాలు నిర్వహించాలని తెలిపింది. కామన్ ఏరియాలో ప్రతి గంటకోసారి శుభ్రం చేయాలని, కంప్యూటర్ కీబోర్డులు ఎవరివి వారే శానిటైజర్ తో శుభ్రం చేసుకోవాలని తెలిపింది. తమను తాము కాపాడుకొని, కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఉద్యోగులంతా తాజా మార్గదర్శకాలను తప్పక పాటించాలని కేంద్రం చెప్పింది. (చదవండి: 24 గంటల్లో 9,987 కేసులు, 331 మరణాలు) -
ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఆ ఛాన్స్!
సాక్షి, న్యూఢిల్లీ: లాక్డౌన్ ఎత్తివేసిన తరువాత కూడా మనం చాలా కాలం కరోనా వైరస్తో కలిసి సహజీవనం చేయాల్సి ఉంటుందని భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు ఎంతో మంది ప్రముఖులు కూడా అభిప్రాయపడ్డారు. చాలాకాలం పాటు సామాజిక దూరం పాటించడం, మాస్క్లు ధరించడం, శానిటైజర్లు వాడటం నిత్యవసరంగా మారనున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకునే దిశగా ఆలోస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ కల్పిస్తే ఎలా ఉంటుందన్న అంశంపై ప్రతిపాదనలతో కూడిన మూసాయిదా రూపొందిస్తోంది. ఈ ప్రతిపాదనపై మంత్రులు శాఖల వారిగా సమీక్షించి నిర్వహించి తమ ప్రతిపాదనలను అందజేయాలని కోరింది. దీనికి సంబంధించిన పత్రాలను ఆయా శాఖలకు పంపించింది. (బ్యాంకు క్యూలో నిల్చుంది కరోనాతో చనిపోయింది.) ఈ విధానం ప్రకారం ఇంటి నుంచి పనిచేయడానికి అవకాశం ఉండే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సంవత్సరంలో 15 రోజుల వరకు వర్క్ఫ్రం హోం చేసే వీలు కల్పించే విధంగా ముసాయిదాలో ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. మొత్తం దేశంలో 48.34 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. ఇంటి నుంచి పని చేయడానికి సంబంధించి సాధ్యాాసాధ్యాలతో పాటు ఇతర అంశాలపై మంత్రులు, సంబంధిత అధికారులు మే 21 లోగా తమ ప్రతిపాదనలను అందజేయాల్సి ఉంటుంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇలాంటి పలు చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించింది. దేశంలో ఇప్పటివరకు 78,000లకు పైగా కరోనా కేసులు నమోదు కాగా, 2,549 మంది చనిపోయారు. 26,000 మంది కోలుకున్నారు. (వాటిని చైనాకు పంపించేయనున్న కెనడా) -
కేంద్ర ఉద్యోగుల వేతనాల్లో కోత అబద్ధం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోతకు సంబంధించిన ప్రతిపాదనేదీ లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి వస్తున్న వార్తలపై మంత్రి ట్విట్టర్లో స్పందించారు. ‘కేంద్ర ప్రభుత్వానికి చెందిన అన్ని రకాల ఉద్యోగుల ప్రస్తుత వేతనాల్లో కోత విధించాలన్న ప్రతిపాదనేదీ ప్రభుత్వ పరిశీలనలో లేదు. వేతనాల్లో కోత ఉంటుందంటూ ఒక వర్గం మీడియాలో వస్తున్న వార్తలు అబద్ధం. అవి నిరాధార వార్తలు’అని పేర్కొన్నారు. కేంద్ర ఉద్యోగుల పెంచిన డీఏ అమలును వాయిదా వేస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన ప్రభుత్వం.. వేతనాల్లో కూడా కోత పెడుతుందంటూ వస్తున్న వార్తలపై ఆమె పై విధంగా స్పందించారు. -
వేతనాల్లో కోత : ఆర్థిక శాఖ వివరణ
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలకు కోత విధిస్తారనే వార్తలను ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం తోసిపుచ్చింది. ఈ ప్రచారం నిరాధారమని, అవాస్తవమని స్పష్టం చేసింది. ఏ క్యాటగిరీకి చెందిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ప్రస్తుత వేతనాల్లో కోత విధించే ఎలాంటి ప్రతిపాదననూ పరిశీలించడం లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. ఈ దిశగా ఓ వర్గం మీడియాలో వచ్చిన కథనాలు నిరాధారమని పేర్కొంది. కాగా పెన్షన్ల జారీలోనూ ఎలాంటి కోత విధించడం లేదని, అత్యవసర సమయాల్లో వేతనాలు, పెన్షన్లను తగ్గించే ప్రసక్తి లేదని గతంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ పెన్షన్లలో 20 శాతం కోత విధిస్తారనే ప్రచారం సాగిందని ఇది పూర్తి అవాస్తవమని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఇలాంటి వదంతులను నమ్మరాదని సూచించింది. చదవండి : కోతల్లేవ్..ఫుల్ జీతం -
ఆ ఉద్యోగులకు ‘ఆరోగ్య సేతు’ తప్పనిసరి
సాక్షి, న్యూఢిల్లీ : ప్రాణాంతక కరోనా వైరస్ని కట్టడి చేయడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ఆరోగ్య సేతు యాప్’ను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరు తమ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకోవాలని కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, ప్రజా ఫిర్యాదుల శాఖ బుధవారం నాడు పిలుపునిచ్చింది. ఆరోగ్య సేతు అనేది ‘కాంటాక్ట్ ట్రేసింగ్ మొబైల్ అప్లికేషన్’. ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకున్న వ్యక్తి ఎవరినయితే కలుసుకోబోతున్నారో, వారికి కరోనా వైరస్ సోకిందా, లేదా అన్న విషయాన్ని ముందుగానే హెచ్చరించి చెబుతుంది. (చదవండి : మీడియా మిత్రులకు కేజ్రీవాల్ ‘గుడ్న్యూస్’) అందుకని ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకున్న ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తప్పనిసరిగా ఆఫీసుకు బయల్దేరే ముందు తన ఆరోగ్య పరిస్థితిని, లక్షణాలను యాప్లో స్టోర్ చేయాలి. ఆఫీసుకు వెళ్లే ముందు ‘సేఫ్, లో రిస్క్’ అని సందేశం వచ్చినప్పుడు మాత్రమే ఆఫీసుకు వెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ బ్లూటూత్ సామీప్యత ఆధారంగా యాప్లో ‘మోడరేట్’ లేదా ‘హై రిస్క్’ అని స్టేటస్ చూపెడితే ఆఫీస్కు రానవసరం లేదని కేంద్రం తెలిపింది. 14 రోజులు స్వీయ నిర్బంధంలో ఉండటం కానీ, యాప్లో స్టేటస్ లో రిస్క్ లేదా సేఫ్ అని చూపెట్టేవరకు ఇంటివద్దే ఉండాలని సూచించింది. కేంద్ర మంత్రిత్వశాఖల్లో, కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఈ ఆదేశాలు తప్పకుండా అమలయ్యే చూడాలని జాయింట్ సెక్రటరీలకు ఆదేశాలు చేసింది. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1341281459.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
అలా అయితే ఆఫీస్కు రావద్దు : కేంద్రం
న్యూఢిల్లీ : కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకట్ట వేయడానికి ప్రతి ఒక్కరు ఆరోగ్య సేతు ఉపయోగించాలని కేంద్రం చెబుతున్న సంగతి తెలిసిందే. అలాగే కరోనా తాజా సమాచారంతో పాటుగా వైరస్ వ్యాప్తి చెందకుండా పాటించాల్సిన జాగ్రత్తలు, కేంద్రం అనుసరిస్తున్న నియంత్రణ చర్యలు వంటి అంశాలను అందించే ఆరోగ్య సేతు యాప్ను ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా వినియోగించేలా కేంద్రం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఉద్యోగుల భద్రత దృష్ట్యా కేంద్రం బుధవారం మరిన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది, ఔట్ సోర్సింగ్ సిబ్బంది తమ మొబైల్ ఫోన్లలో ఆరోగ్య సేతు యాప్ను తప్పనిసరిగా డౌన్లోడ్ చేసుకోవాలని ఆదేశించింది. ఆఫీస్కు బయలుదేరే ముందు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది ఆరోగ్య సేతు యాప్ తమ స్టేటస్ను చెక్ చేసుకోవాలని.. యాప్లో ‘సేఫ్’ లేదా ‘లో రిస్క్’ అని చూపెడితేనే ఆఫీస్కు రావాలని సూచించింది. ఒకవేళ బ్లూటూత్ సామీప్యత ఆధారంగా యాప్లో ‘మోడరేట్’ లేదా ‘హై రిస్క్’ అని స్టేటస్ చూపెడితే ఆఫీస్కు రానవసరం లేదని తెలిపింది. అటువంటి వారు 14 రోజులు స్వీయ నిర్బంధంలో ఉండటం కానీ, యాప్లో స్టేటస్ లో రిస్క్ లేదా సేఫ్ అని చూపెట్టేవరకు ఇంటివద్దే ఉండాలని సూచించింది. కేంద్ర మంత్రిత్వశాఖల్లో, కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఈ ఆదేశాలు తప్పకుండా అమలయ్యే చూడాలని జాయింట్ సెక్రటరీలను ఆదేశించింది. చదవండి : ఆరోగ్య సేతు యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి -
రిటైర్మెంట్ వయస్సు తగ్గించే ఆలోచన లేదు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును తగ్గించే ప్రతిపాదనేమీ లేదని కేంద్ర సిబ్బంది శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ఆదివారం స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 50 ఏళ్లకు తగ్గించనున్నారని మీడియాలో వచ్చిన కథనాలను ఆయన తోసిపుచ్చారు. ప్రస్తుతం వారి రిటైర్మెంట్ వయసు 60 ఏళ్లుగా ఉంది. స్వార్థ ప్రయోజనాల కోసం, ప్రభుత్వంపై బురద జల్లేందుకు కొందరు ఇలాంటి తప్పుడు వార్తలను ఒక వర్గం మీడియాలో ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కరోనా కారణంగా సంక్షోభ పరిస్థితులు నెలకొన్న సమయంలో కొన్ని స్వార్థ శక్తులు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయని ఒక ప్రకటనలో సింగ్ ఆరోపించారు. 80 ఏళ్లు దాటిన వారికి పెన్షన్ నిలిపివేత, మిగతావారి పెన్షన్లో 30% కోత అంటూ తప్పుడు వార్తలను ప్రచారం చేశారన్నారు. లాక్డౌన్ సమయంలోనూ ఉద్యోగుల ప్రయోజనం కోసం చర్యలు తీసుకున్నామన్నారు. కనీస సిబ్బందితో విధులు నిర్వహించాలని, దివ్యాంగులకు అత్యవసర విధులు వేయవద్దని ఆదేశించామన్నారు. -
డీఏ నిలుపుదలకు ఇది సమయం కాదు
న్యూఢిల్లీ : కరోనా సంక్షోభం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్దారులకు ఇటీవల పెంచిన కరువు భత్యాన్ని (డీఏ) కేంద్ర ప్రభుత్వం నిలిపివేడయంపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్పందించారు. ప్రస్తుత సమయంలో ప్రభుత్వ ఉద్యోగుల డీఏను నిలిపివేయడం సరికాదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, రక్షణ దళాలపై భారం వేయడం తగదన్నారు. కోవిడ్–19 సంక్షోభం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2021 జూలై వరకు పెంచిన కరువుభత్యం(డీఏ) చెల్లింపులను నిలిపివేస్తున్నట్లు ఆర్థిక శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం ప్రభావం 50 లక్షల మంది ఉద్యోగులతోపాటు 61 లక్షల మంది పింఛనుదారులపై పడనుంది. ‘కోవిడ్–19తో ఉత్పన్నమైన సంక్షోభం దృష్ట్యా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, కేంద్ర పింఛనుదారులకు 2020 జనవరి 1వ తేదీ నుంచి చెల్లించాల్సిన అదనపు వాయిదా డీఏను 2021 జూన్ 30 వరకు నిలిపివేయాలని నిర్ణయించడమైంది’ అని ఆర్థిక శాఖ తెలిపింది. అయితే, ప్రస్తుతం ఉన్న 17 శాతం డీఏను యథాప్రకారం చెల్లిస్తామని పేర్కొంది. దీంతో 2020 జూలై 1వ తేదీ, 2021 జనవరి 1వ తేదీల్లో ఇవ్వాల్సిన డీఏ బకాయిల చెల్లింపులు నిలిచిపోనున్నాయి. కేంద్ర ఉద్యోగులకు 4 శాతం, పింఛనుదారులకు 21 శాతం మేర డీఏను పెంచేందుకు గత నెలలో కేబినెట్ ఆమోదం తెలిపింది. కానీ, ఆర్థిక శాఖ తాజా ఉత్తర్వులతో ఆ నిర్ణయం అమలు ఆగిపోనుంది. డీఏను 2021 జూలై 1వ తేదీ నుంచి డీఏ పెంపుదలను వర్తింపజేస్తామని ఆర్థిక శాఖ వ్యయ విభాగం స్పష్టత నిచ్చింది. డీఏ విషయంలో కేంద్రం నిర్ణయాన్ని రాష్ట్రాలు కూడా అమలు చేసే అవకాశముంది. ఆర్థిక శాఖ ఉత్తర్వుల ఫలితంగా.. కేంద్రానికి రూ.37,530 కోట్లు, రాష్ట్రాలకు 82,566 కోట్లు కలిపి సుమారు రూ.1.20 లక్షల కోట్లు ఆదా కానున్నాయి. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగుల డీఏను ద్రవ్యోల్బణం ఆధారంగా ఏడాదిలో రెండుసార్లు సవరిస్తారు. ఆర్థిక శాఖ నిర్ణయంతో మిగిలిన మొత్తాన్ని కోవిడ్పై పోరాటానికి మళ్లించేందుకు వీలు కలుగుతుందని అధికార వర్గాలు వెల్లడించాయి. కోవిడ్పై పోరుకు గాను రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, గవర్నర్ల వేతనాల్లో 30 శాతం కోత విధిస్తూ ఇప్పటికే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇలా ఆదా అయిన మొత్తం భారత ప్రభుత్వ కన్సాలిడేటెడ్ ఫండ్లో జమ అవుతుంది. ఈ నిధులను ఆరోగ్య సేవల నిర్వహణకు, కరోనాపై పోరుకు వాడతారు. -
కేంద్ర ఉద్యోగులకు డీఏ పెంపు నిలిపివేత
న్యూఢిల్లీ: కోవిడ్–19 సంక్షోభం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2021 జూలై వరకు పెంచిన కరువుభత్యం(డీఏ) చెల్లింపులను నిలిపివేస్తున్నట్లు ఆర్థిక శాఖ ప్రకటించింది. ఈ నిర్ణయం ప్రభావం 50 లక్షల మంది ఉద్యోగులతోపాటు 61 లక్షల మంది పింఛనుదారులపై పడనుంది. ‘కోవిడ్–19తో ఉత్పన్నమైన సంక్షోభం దృష్ట్యా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, కేంద్ర పింఛనుదారులకు 2020 జనవరి 1వ తేదీ నుంచి చెల్లించాల్సిన అదనపు వాయిదా డీఏను 2021 జూన్ 30 వరకు నిలిపివేయాలని నిర్ణయించడమైంది’ అని ఆర్థిక శాఖ తెలిపింది. అయితే, ప్రస్తుతం ఉన్న 17 శాతం డీఏను యథాప్రకారం చెల్లిస్తామని పేర్కొంది. దీంతో 2020 జూలై 1వ తేదీ, 2021 జనవరి 1వ తేదీల్లో ఇవ్వాల్సిన డీఏ బకాయిల చెల్లింపులు నిలిచిపోనున్నాయి. కేంద్ర ఉద్యోగులకు 4 శాతం, పింఛనుదారులకు 21 శాతం మేర డీఏను పెంచేందుకు గత నెలలో కేబినెట్ ఆమోదం తెలిపింది. కానీ, ఆర్థిక శాఖ తాజా ఉత్తర్వులతో ఆ నిర్ణయం అమలు ఆగిపోనుంది. డీఏను 2021 జూలై 1వ తేదీ నుంచి డీఏ పెంపుదలను వర్తింపజేస్తామని ఆర్థిక శాఖ వ్యయ విభాగం స్పష్టత నిచ్చింది. డీఏ విషయంలో కేంద్రం నిర్ణయాన్ని రాష్ట్రాలు కూడా అమలు చేసే అవకాశముంది. ఆర్థిక శాఖ ఉత్తర్వుల ఫలితంగా.. కేంద్రానికి రూ.37,530 కోట్లు, రాష్ట్రాలకు 82,566 కోట్లు కలిపి సుమారు రూ.1.20 లక్షల కోట్లు ఆదా కానున్నాయి. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగుల డీఏను ద్రవ్యోల్బణం ఆధారంగా ఏడాదిలో రెండుసార్లు సవరిస్తారు. ఆర్థిక శాఖ నిర్ణయంతో మిగిలిన మొత్తాన్ని కోవిడ్పై పోరాటానికి మళ్లించేందుకు వీలు కలుగుతుందని అధికార వర్గాలు వెల్లడించాయి. కోవిడ్పై పోరుకు గాను రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, గవర్నర్ల వేతనాల్లో 30 శాతం కోత విధిస్తూ ఇప్పటికే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇలా ఆదా అయిన మొత్తం భారత ప్రభుత్వ కన్సాలిడేటెడ్ ఫండ్లో జమ అవుతుంది. ఈ నిధులను ఆరోగ్య సేవల నిర్వహణకు, కరోనాపై పోరుకు వాడతారు. -
పెన్షన్ల కోతపై స్పష్టతనిచ్చిన కేంద్రం
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పింఛన్లు తగ్గించడం కానీ, నిలిపివేయడం కానీ చేయడం లేదని కేంద్రం స్పష్టం చేసింది. కరోనా వ్యాప్తి కారణంగా నెలకొన్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో పింఛన్లలో కేంద్రం కోత విధించనుందనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. దీంతో చాలా మంది రిటైర్డ్ ఉద్యోగులు ఆందోళనకు గురయ్యారు. అయితే తాజాగా ఆ వార్తలపై స్పందించిన సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల మంత్రిత్వ శాఖ.. అందులో ఎలాంటి వాస్తవం లేదని తెలిపింది. ఇంతకు ముందు చెప్పినట్టుగానే పింఛన్లు తగ్గించే ఆలోచన ఏది లేదని స్పష్టం చేసింది. ఈ విషయంలో భారత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని వెల్లడించింది. పింఛన్దారుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొంది. పెన్షన్దారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పింది అలాగే ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. పింఛన్లు తగ్గించే ఎలాంటి ప్రతిపాదన తమ వద్ద లేదని స్పష్టం చేసింది. ‘కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పింఛన్లలో 20 శాతం కోత విధించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఆ వార్తలు నిరాధారమైనవి’ అని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. -
‘రిటైర్మెంట్ గడువు పెంచం’
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ ప్రక్రియ యథావిధిగా కొనసాగుతుందని, గడువు పొడిగించే ప్రతిపాదనేదీ లేదని కేంద్రం స్పష్టం చేసింది. పదవీ విరమణ వయస్సు ముగిసిన వారు నిబంధనల మేరకు మార్చి 31వ తేదీన రిటైర్ కావాల్సిందేనని తెలిపింది. దేశవ్యాప్తంగా నెలకొన్న అసాధారణ పరిస్థితులున్నప్పటికీ ఉద్యోగుల పదవీ కాలాన్ని పెంచడం లేదని సిబ్బంది శాఖ వివరించింది. లాక్డౌన్ కారణంగా వారు ఇంటి వద్ద నుంచి పనిచేస్తున్నా లేదా కార్యాలయానికి హాజరవుతున్నా నిబంధన –56 ప్రకారం మార్చి 31, 2020న రిటైర్ కావాల్సిందేనని పేర్కొంది. (చదవండి: కొంపముచ్చిన మొక్కుబడి హెచ్చరికలు) ప్రభుత్వం ఆ రోజులను లెక్కించదు న్యూఢిల్లీ: గడువు ముగిసేలోగా సస్పెన్షన్ ఉత్తర్వులను సమీక్షించడం, ప్రభుత్వాధికారులు స్వచ్ఛంద పదవీ విరమణ నోటీసులను అంగీకరించడం వంటివి లాక్ డౌన్ సమయంలో పరిగణించబోమని కేంద్ర సిబ్బంది శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పలు విధుల గడువు కాలాన్ని పెంచనున్నట్లు తెలిపింది. ఉదాహరణకు ఒక పనిని పూర్తి చేయడానికి ప్రభుత్వం 20 రోజుల గడువు విధిస్తే, లాక్ డౌన్ మధ్యలో రావడం వల్ల ఆ పని ఆగిపోతుంది. ఈక్రమంలో లాక్డౌన్ కాలాన్ని ప్రభుత్వం పరిగణించదు. లాక్డౌన్ ఎత్తివేశాక ఆ పనిని పూర్తి చేసేందుకు మళ్లీ 20 రోజుల కాలం ఉంటుంది. విధిని పూర్తి చేసేందుకు 15 రోజుల కంటే తక్కువ సమయం ఉంటే, లాక్ డౌన్తర్వాత దాన్ని పూర్తి చేసేందుకు 15 రోజుల వరకూ గడువు ఉంటుంది. (చదవండి: మగాళ్లూ.. ఇంటి పనులు చేయండి: సీఎం) -
కేంద్ర ఉద్యోగులకూ వర్క్ ఫ్రమ్ హోం
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కట్టడే లక్ష్యంగా భారత ప్రభుత్వ సంస్థలు, వేర్వేరు మంత్రిత్వ శాఖలు మరిన్ని చర్యలకు శ్రీకారం చుట్టాయి. ప్రజలు గుమికూడేందుకు ఉన్న అన్ని అవకాశాలను వీలైనంత వరకూ తగ్గించే దిశగా పలు చర్యలు చేపట్టాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో సగం మంది ఇంటి నుంచే పని చేయవచ్చునని ఆదేశించడం మాత్రమే కాకుండా... రైలు ప్రయాణాలను తగ్గించేందుకు రైల్వే శాఖ రోగులకు మినహా మిగిలిన వారందరికీ రాయితీలు తొలగించగా, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అన్ని రకాల పరీక్షలను ఈ నెలాఖరు వరకూ వాయిదా వేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. వైరస్ తీవ్రత దృష్ట్యా పదవ తరగతి నుంచి పన్నెండవ తరగతి ఐసీఎస్ఈ బోర్డు పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ‘ద కౌన్సిల్ ఫర్ ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్’ప్రకటించింది. సగం మంది ఇంటి నుంచే.. కోవిడ్ విజృంభణ నేపథ్యంలో ఇప్పటికే దేశంలోని పలు ఐటీ కంపెనీలు ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేయాల్సిందిగా ఆదేశించగా కేంద్ర ప్రభుత్వం గురువారం నుంచి సగం మంది ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోం చేయవచ్చునని ప్రకటించింది. మిగిలిన సగం మంది మాత్రం ఆఫీసులకు రావాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా ఉద్యోగులకు వేర్వేరు పనిగంటలను కేటాయించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతోంది. సిబ్బంది మంత్రిత్వ శాఖ విభాగాధిపతులకు జారీ చేసిన ఆదేశాల ప్రకారం ఆఫీసుల్లో కనీసం యాభై శాతం మంది గ్రూప్ బీ, సీ ఉద్యోగులు కచ్చితంగా ఉండాలి. మిగిలిన వారు ఇంటి నుంచి పనిచేయవచ్చు. ఈ రెండు వర్గాల ఉద్యోగులు వారానికి ఒకసారి ఎక్కడి నుంచి పనిచేస్తారన్నది మార్చుకుంటారు. తొలి వారం ఎవరు ఆఫీసుకు రావాలన్న అంశంలో ఆఫీసుకు దగ్గరగా ఉన్న వారు...సొంత వాహనాలు వాడేవారికి ప్రాధాన్యమివ్వాలని సూచించారు. ఉద్యోగులందరినీ మూడు వర్గాలుగా విభజించి ఒకరికి 9 – 5 గంటలు, ఇంకొకరికి 9.30 –5.30, మరొకరికి 10 – 6 గంటల పనివేళలు నిర్ణయించాలని కూడా సూచించారు. ఇళ్ల నుంచి పనిచేసే ఉద్యోగులు టెలిఫోన్ ద్వారా, ఎలక్ట్రానిక్ పద్ధతుల్లోనూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు. రైల్వే రాయితీలు కట్ రైళ్లలో జనసమ్మర్ధాన్ని నివారించే ఉద్దేశంతో కేంద్ర రైల్వే శాఖ ఇస్తున్న పలు రాయితీలను నిలిపివేస్తూ గురువారం ఆదేశాలు జారీ అయ్యాయి. రోగులు, విద్యార్థులు, దివ్యాంగుల కేటగిరీలో కొందరికి మాత్రం మినహాయింపు ఉంటుంది. మార్చి 20వ తేదీ అర్ధరాత్రి నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ ఈ ఆదేశాలు కొనసాగుతాయి. ఇప్పటివరకూ దాదాపు 53 వర్గాల వారికి రాయితీలు లభిస్తూండగా ఇక ఇవి 15కు మాత్రమే పరిమితమవుతాయి. వయోవృద్ధులు అనవసర ప్రయాణాలను నివారించేందుకు ఈ ఆదేశాలు ఉపయోగపడ తాయని అంచనా. ఈ నెల 20వ తేదీ ఆ తరువాత బుక్ చేసుకున్న టికెట్లకు ఈ షరతులు వర్తిస్తాయి. ఇప్పటికే బుక్ చేసుకున్న రాయితీ టికెట్లను ఎవరైనా క్యాన్సిల్ చేసుకుంటే వారి నుంచి క్యాన్సలేషన్ ఛార్జీలు వసూలు చేయమని రైల్వే శాఖ స్పష్టం చేసింది. ఐసీఎస్ఈ పరీక్షలువాయిదా ఐసీఎస్ఈ సిలబస్లో 10, 12వ తరగతుల పరీక్షలను వాయిదావేస్తూ కౌన్సిల్ ఫర్ ద ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్స్ నిర్ణయం తీసుకుంది. సీబీఎస్ఈ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఈ నెలాఖరు వరకూ పరీక్షలను వాయిదా వేసుకోవాలని మానవ వనరుల శాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో పరీక్షలను యూజీసీ వాయిదావేసింది. స్టాఫ్ సెలక్షన్ పరీక్షలు సైతం కరోనా వైరస్ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ముందు జాగ్రత్త చర్యగా ఉద్యోగ నియామక పరీక్షలన్నింటినీ వాయిదా వేస్తున్నట్లు స్టాఫ్ సెలక్షన్ కమిటీ (ఎస్ఎస్సీ)గురువారం ప్రకటించింది. వాయిదా వేసిన పరీక్షల్లో మార్చి 20న జరగాల్సిన కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్తోపాటు మార్చి 30న జరగాల్సిన జూనియర్ ఇంజినీర్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, క్వాంటిటీ సర్వేయింగ్ కాంట్రాక్ట్) పరీక్షలు ఉన్నాయి. వృద్ధులు, పిల్లలు ఇళ్లకే పరిమితం వైరస్ విస్తృతి నేపథ్యంలో దేశంలో 65 ఏళ్ల పైబడ్డ వృద్ధులు, పదేళ్ల లోపు వయసున్న వారు ఇళ్లకే పరిమితం కావాలని కేంద్ర ఆరోగ్య శాఖ సలహా ఇచ్చింది. ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, వైద్యనిపుణులకు మాత్రం ఈ ఆదేశాల నుంచి మినహాయింపు ఉంటుందని విదేశీ వ్యవహారాల శాఖ జాయింట్ సెక్రటరీ రవి తెలిపారు. మాస్కులు, శానిటైజర్ల వంటివాటిని అధిక ధరలకు అమ్మే వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఫార్మాస్యూటికల్ డిపార్ట్మెంట్, వినియోగదారుల శాఖలను కోరినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. దేశంలో వైరస్ సామూహికంగా వ్యాప్తి చెందడం లేదని ఆరోగ్యశాఖ తెలిపింది. పంజాబ్లో మరణించిన వ్యక్తి వృద్ధుడే కాకుండా మధుమేహం, గుండె సంబంధిత సమస్యలు కూడా ఉన్న వారని తెలిపారు. మార్చి 22వ తేదీ నుంచి మార్చి 29 వరకూ అన్ని అంతర్జాతీయ విమానాలు భారత్లో అడుగుపెట్టకుండా నిషేధం విధించినట్లు భారత్ ప్రకటించింది. -
కేంద్ర ఉద్యోగుల డీఏ పెంపు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త చెప్పింది. కరువు భత్యం (డీఏ)ను 4శాతం పెంచే నిర్ణయానికి ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఆమోదం లభించిం ది. దీనివల్ల 1.13 కోట్ల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దార్లకు లబ్ధి చేకూరనుంది. పెరిగిన డీఏ 2020 జనవరి 1 నుంచే అమల్లోకి వస్తుందని తెలిపింది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే డీఏ 17 నుంచి 21శాతానికి చేరుకుంది. పెరిగిన రేట్లకు అనుగుణంగా దీన్ని పెంచినట్లు కేంద్రం విడుదల చేసిన నివేదిక తెలిపింది. దీనివల్ల కేంద్ర ప్రభుత్వంపై సంవత్సరానికి రూ. 12,510 కోట్లు, 2020–21 సంవత్సరానికి (2020 జనవరి నుంచి 2021 ఫిబ్రవరి వరకు) రూ. 14,595 కోట్ల అదనపు భారం పడనుంది. దాదాపు 48 లక్షల మంది ఉద్యోగులు, 65 లక్షల మంది పింఛన్దారులు లబ్ధి పొందనున్నారని సమాచార, ప్రసార శాఖ మంత్రి జవడేకర్ చెప్పారు. -
ఉద్యోగులకు తీపి కబురు
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏను పెంచుతూ శుక్రవారం కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 4 శాతం డీఏను పెంచేందుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు అనుగుణంగా డీఏ పెంపును చేపడతారు. 4 శాతం డీఏ పెంపుతో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల వేతనం నెలకు రూ క్యాడర్ను బట్టి రూ 720 నుంచి రూ 10,000 వరకూ పెరగనుంది. కాగా, 2019 అక్టోబర్లో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు వర్తింపచేసే డీఏను మూల వేతనంలో 12 శాతం నుంచి 17 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. డీఏ పెంపుపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో దాదాపు 90 లక్షలకు పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. చదవండి : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక -
కేంద్ర ఉద్యోగుల పథకమే మోడల్
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల ఆరోగ్యపథకంలో మార్పులు, చేర్పులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. వేతనాలను బట్టి వారి నుంచి కొంత వాటా వసూలు చేయాలని భావిస్తోంది. దీనికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పథకమే ఆదర్శం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్యపథకాన్ని ఆధారం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నగదు రహిత వైద్యసేవలు అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కేడర్, జీతభత్యాలను ఆధారం చేసుకొని నెలవారీగా కొద్దిమేరకు కోత విధిస్తున్నారు. కొందరి నుంచి రూ.250 మొదలుకొని రూ.650 వరకు వారి వేతనం నుంచి మినహాయించుకుంటున్నారు. అదేవిధంగా తెలంగాణలోనూ అమలు చేయాలని రాష్ట్రప్రభుత్వం భావిస్తున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వ పథకాన్ని అధ్యయనం చేసి దానికి అనుగుణంగానే ఎన్నికల కోడ్ పూర్తి అయిన తర్వాత తెలంగాణలోనూ కసరత్తు చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. పథకం అమలులో ఉన్న సమస్యల వల్లే... తెలంగాణలో ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకం(ఈజేహెచ్ఎస్) అమలవుతోంది. దాని ద్వారా నగదు రహిత వైద్యసేవలను ప్రభుత్వం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. మొదట్లో ఈ పథకం ప్రారంభమైన సమయంలో ఉద్యోగులు కూడా తమ వాటాగా కొంత చెల్లిస్తామని ముందుకు వచ్చారు. అయినా సర్కార్ ఉచిత సేవలు ప్రారంభించింది. అందుకోసం ఆరోగ్యశ్రీ ట్రస్టులో కలపకుండా ప్రత్యేకంగా ఈజేహెచ్ఎస్ ఏర్పాటు చేశారు. ఆరోగ్యశ్రీలో లేనటువంటి అనేక జబ్బులకు కూడా ఈజేహెచ్ఎస్లో అమలు చేస్తున్నారు. ఈ పథకం కింద దాదాపు 5.50 లక్షల మంది ఉద్యోగులు, పింఛన్దారులు లబ్ధిపొందుతున్నారు. రాష్ట్రంలో 236 ప్రైవేటు నెట్వర్క్ ఆసుపత్రులు, 96 ప్రభుత్వ నెట్వర్క్ ఆసుపత్రులు పనిచేస్తున్నాయి. వీటికితోడు మరో 67 డెంటల్ నెట్వర్క్ ప్రైవేటు ఆసుపత్రులు కూడా ఉన్నాయి. ఆయా ఆసుపత్రుల్లో 800 రకాల వ్యాధులకు వైద్యం చేస్తారు. దాదాపు 300 నుంచి 400 రకాల వ్యాధులకు వివిధ రకాల ఆపరేషన్లు కూడా చేస్తుంటారు. అయితే, ప్రభుత్వం నెట్వర్క్ ఆసుపత్రులకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగులకు వైద్యసేవలు సరిగా అందించడంలేదు. దీంతో ఉద్యోగులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. దీనిపై సర్కారుకు ఫిర్యాదులు వెళ్లాయి. తమకు ఉచిత వైద్యసేవలు అవసరంలేదని, నెలకు ఎంతోకొంత చెల్లిస్తామని సర్కారుకు తేల్చి చెప్పాయి. ఆ మేరకు లేఖ రాసిస్తామని కూడా ప్రభుత్వానికి హామీ ఇచ్చాయి. నాలుగు లెవల్స్లో వాటా..! కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నుంచి కేడర్వారీగా వాటా సొమ్ము వసూలు చేస్తున్నారు. వారి వేతనం ప్రకారం మొత్తం 12 లెవల్స్ ఆపై ఉండ గా, వాటిని నాలుగు వర్గాలుగా విభజించారు. లెవల్ ఒకటి నుంచి ఐదు వరకు ఉన్న ఉద్యోగుల నుంచి నెలకు రూ.250, లెవల్ ఆరు ఉద్యోగుల నుంచి నెలకు రూ.450, లెవల్ 7 నుంచి 11 వరకు ఉన్న ఉద్యోగుల నుంచి రూ.650, లెవల్ 12 నుంచి ఆపై ఉద్యోగుల నుంచి నెలకు రూ.వెయ్యి వరకు వసూలు చేస్తున్నారు. ఆ తర్వాత ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే నిర్దేశిత ప్రభుత్వ వెల్నెస్ వంటి ఆసుపత్రులకు వెళ్తారు. అక్కడ ప్రాథమిక పరీక్షల అనంతరం ఉన్నతస్థాయి ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులకు రిఫర్ చేస్తారు. వాటికి అయ్యే ఖర్చును కేంద్రమే భరిస్తోంది. ఉద్యోగుల నుంచి వాటా సొమ్ముగా తీసుకుంటున్నందున కేంద్రంపై పెద్దగా భారం పడడంలేదని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు అంటున్నాయి. తెలంగాణలోనూ వేతనాలను బట్టి లెవల్స్ నిర్దారించి నాలుగు శ్లాబుల్లో ఉద్యోగుల నుంచి వారి వాటాను తీసుకునే అవకాశముంది. తెలంగాణలో తక్కువ వేతనం తీసుకుంటున్న వారి నుంచి రూ. 250 భారీ వేతనం తీసుకునే వారి నుంచి రూ.600 వరకు వసూలు చేసే అవకాశాలపై చర్చ జరుగుతోంది. తాము నెలకు రూ.500 చెల్లించడానికైనా సిద్ధంగా ఉన్నామని టీఎన్జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కారెం రవీందర్రెడ్డి ఇప్పటికే విన్నవించారు. అలా ప్రభుత్వం ఏడాదికి రూ.300 నుంచి రూ. 350 కోట్లు ప్రభుత్వ ఉద్యోగుల నుంచి వసూలు చేసే అవకాశముంది. దీనివల్ల తమ సమస్యలు తీరుతాయని ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
మహిళలకు 33 శాతం రిజర్వేషన్
హోషంగాబాద్: అధికారంలోకి వచ్చిన వెంటనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ తెలిపారు. లోక్సభ, రాజ్యసభతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లో ఈ కోటాను అమలుచేస్తామని వెల్లడించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మధ్యప్రదేశ్లోని హోషంగాబాద్లో ఉన్న పిపరియాలో నిర్వహించిన ర్యాలీలో రాహుల్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘దేశంలోని నిరుపేదలందరికీ న్యాయ్ పథకం కింద ఏటా రూ.72 వేలు అందజేస్తాం. ఈ మొత్తాన్ని మహిళల బ్యాంకు ఖాతాల్లో జమచేస్తాం. ఈ పథకం మన ఆర్థిక వ్యవస్థను పునరుత్తేజం చేస్తుంది. పెద్దనోట్ల రద్దు కారణంగా సామాన్యుల దగ్గర నగదు లేకుండా పోయింది. న్యాయ్ వల్ల ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది. తద్వారా ఆర్థిక వ్యవస్థలోకి నగదు ప్రవాహం జోరందుకుంటుంది’ అని పేర్కొన్నారు. 2014 తర్వాత దేశంలో బాంబు పేలుళ్లు విన్పించలేదన్న మోదీ వ్యాఖ్యలపై రాహుల్ ..‘పఠాన్కోట్, ఉడీ, పుల్వామా, గడ్చిరోలి.. గత ఐదేళ్లలో మొత్తం 942 ఉగ్రదాడులు జరిగాయి. చెవులు తెరిచి వింటే ఈ పేలుళ్లు విన్పిస్తాయి’ అని చురకలు అంటించారు. -
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు డీఏ 3 శాతం పెంపు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దారులకు తీపి కబురు. వారి కరువు భత్యం(డీఏ)ను 3 శాతం పెంచుతూ కేం ద్రం నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీ నేతృత్వంలో మంగళవారం సమావేశమైన కేబినెట్ ఇందుకు అంగీకరించింది. ఈ నిర్ణయంతో సుమారు 48.41 లక్షల మంది ఉద్యోగులకు, 62.03 లక్షల మంది పింఛన్దారులకు లబ్ధి చేకూరుతుంది. ఈ పెంపు జనవరి 1 నుంచే అమల్లోకి వస్తుందని కేంద్రం ప్రకటించింది. ఫలితంగా 2019 జనవరి, 2020 ఫిబ్రవరి మధ్యకాలంలో ఖజానాపై సుమారు రూ. 19,864 కోట్ల భారం పడుతుందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. కేబినెట్ మరిన్ని నిర్ణయాలు.. తలాక్ ఆర్డినెన్స్, కంపెనీల చట్టం (రెండో సవరణ) ఆర్డినెన్స్, మెడికల్ కౌన్సిల్ ఆర్డినెన్స్, పోంజి పథకాల నివారణ ఆర్డినెన్స్కు ఆమోదం. రాజ్యసభలో సంబంధిత బిల్లు లు నిలిచిపోవడంతో ఆర్డినెన్స్లు తెచ్చింది. రూ.30,274 కోట్ల వ్యయంతో ఢిల్లీ–గజియాబాద్–మీరట్ మార్గంలో రీజినల్ ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ (ఆర్ఆర్టీఎస్) ఏర్పాటుకు అంగీకారం. 82 కి.మీ దూరాన్ని 60 నిమిషాల్లో చేరుకునేలా వేగవంతమైన, పర్యావరణ హితమైన రైల్వే వ్యవస్థను అందుబాటులోకి తెస్తారు. 2025నాటికి కోటి ఉద్యోగాల కల్పనే లక్ష్యం గా నూతన ఎలక్ట్రానిక్స్ పాలసీసి ఓకే క్యాప్టివ్ మైనింగ్(సొంత అవసరాలకు మాత్రమే వినియోగించే) ద్వారా ఉత్పత్తి చేసిన బొగ్గులో నిర్వహణ కంపెనీలు 25 శాతాన్ని బహిరంగ మార్కెట్లో విక్రయించేందుకు అనుమతి. చమురు, సహజవాయువు బావుల వేలానికి రెండు దశాబ్దాల క్రితం నాటి విధానం పునరుద్ధరణ. ఇందులో భాగంగా గతంలో మాదిరిగా ప్రభుత్వానికి రెవెన్యూలో నేరుగా వాటా లభించదు. కానీ ఆపరేటర్ సదరు క్షేత్రం నుంచి ఏడాదిలో 2.5 బిలియన్ డాలర్లకు పైగా అనూహ్య లాభాలు గడిస్తే మాత్రం ఆదాయం పొందుతుంది. -
ఏటా 20 ఈఎల్స్ వాడాల్సిందే!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇకపై ఏడాదిలో 20 ఎర్న్›్డ లీవులు(ఈఎల్స్–ఆర్జిత సెలవులు) తప్పనిసరిగా వాడుకోవలసి ఉంటుంది. పదవీ విరమణ సమయంలో అదనపు భత్యం కింద వీటిని దాచుకోవడానికి ఇకపై వీలుండదు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం త్వరలో ఉత్తర్వులు జారీ చేయనుంది. కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు ఏడాదికి 30 ఈఎల్లు ఉంటాయి. ఇకపై ఏడాదికి పది ఈఎల్స్ మాత్రమే తర్వాతి సంవత్సరం సెలవుల్లో కలుస్తాయని పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేయనుంది. అంటే మిగతా 20 సెలవులను వాడుకోకుంటే వృథా అవుతాయి. ప్రభుత్వ బ్యాంకులు గత ఏడాది చివరి నుంచే ఈ పద్ధతిని అమలు చేస్తున్నాయి. తమ సిబ్బందిని కచ్చితంగా పది రోజులు సెలవుపై పంపుతున్నాయి. 2019–20 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో 3.5 కోట్ల ప్రభుత్వ ఉద్యోగుల భత్యాల చెల్లింపు కోసం దాదాపు రూ.63,232 కోట్లు కేటాయించింది. -
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏడున సెలవు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా ఈ నెల ఏడో తేదీన రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించేందుకు వీలు కల్పిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏడో తేదీన రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు ప్రకటించారు. మరో రెండు రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి ఫుల్ స్టాప్ పడింది. శుక్రవారం జరగననున్న పోలింగ్ కోసం ఎన్నికల సంఘం అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజలు నిర్భయంగా ఓటు వేయాలని, ఓటు హక్కును పెద్ద ఎత్తున వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం పిలుపునిస్తోంది. -
కేంద్ర ఉద్యోగులకు డీఏ 2% పెంపు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యం(డీఏ), కరవు సాయం(డీఆర్)ను అదనంగా 2 శాతం పెంచడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో సుమారు 48.41 లక్షల మంది ఉద్యోగులు, 62.03 లక్షల మంది పించన్దారులకు(మొత్తం 1.1 కోట్ల మంది) ప్రయోజనం కలగనుంది. ప్రధాని అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. డీఏ, డీఆర్లను పెంచడం ద్వారా కేంద్ర ఖజానాపై ఏటా రూ.6,112.20 కోట్ల భారం పడుతుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పెంచిన భత్యాలు ఈ జూలై 1 నుంచే అమల్లోకి రానున్నాయి. ఖజానాపై రూ.4074.80 కోట్ల అదనపు భారం పడుతుంది. మరోవైపు, రైల్వే రంగంలో శాస్త్రీయ, సాంకేతికత సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి దక్షిణ కొరియా రైల్వేతో కుదుర్చుకున్న ఒప్పందం గురించి అధికారులు కేబినెట్కు వివరించారు. -
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏలో రెండు శాతం అదనపు పెంపునకు బుధవారం కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. డీఏ పెంపు నిర్ణయం ఈ ఏడాది జులై 1 నుంచి వర్తింపచేస్తారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో పెన్షనర్లకు డీఏ అదనపు ఇన్స్టాల్మెంట్ విడుదలకూ గ్రీన్సిగ్నల్ లభించింది. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మూల వేతనం లేదా పెన్షన్లో ప్రస్తుతం ఏడు శాతంగా ఉన్న డీఏకు అదనంగా మరో రెండు శాతాన్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. డీఏ, డీఆర్ల పెంపుతో ప్రభుత్వ ఖజానాపై ఏటా రూ 6112 కోట్ల భారం పడనుంది. క్యాబినెట్ నిర్ణయంతో 48.41 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు 62.03 లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు. ఏడవ వేతన సంఘం సిఫార్సుల మేరకు డీఏ పెంపు నిర్ణయం జరిగిందని అధికార వర్గాలు తెలిపాయి. -
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త?
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఓ శుభవార్త. 7వ వేతన సంఘం సిఫారసుల కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే కరువు భత్యాన్ని (డియర్నెస్ అలవెన్స్)మార్చినుంచి అమలు చేయవచ్చని ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారి శుక్రవారం ప్రకటించినట్టు తెలుస్తోంది. దీంతో ఆర్థిక మంత్రిత్వ శాఖ మార్చికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏను ప్రకటించ వచ్చని భావిస్తున్నారు. గత అక్టోబర్ లో వేతన సంఘం కమిటీ ఉద్యోగుల డీఏ చెల్లింపు ఫైనల్ రిపోర్టు ను సమర్పించింది. 7వ వేతన సంఘం 196 సిఫారసుల్లో 51 లను రద్దు చేయగా 37 ని పునస్సమీక్షించింది. కరవు భత్యం కంటే ఇతర భత్యాలు ఎక్కువగా ఉనాయని వీటిని సమీక్షించాలని తెలిపింది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నిరసన వెల్లువెత్తింది. అయితే ఆర్థిక కార్యదర్శి అశోక్ లావాసౌప్ నేతృత్వంలో ఒక కమిటీని ప్రభుత్వం నియమించింది. నివేదిక సమర్పణకు గడువును ప్రభుత్వం ఫిబ్రవరి 22, 2017కు పొడిగించింది. కాగా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల 6 వ వేతన సంఘం సిఫార్సులు కింద డీఏ ను పొందుతున్నారు.అయితే డీఏ ఏ మేరకు ఇస్తారనేది అనేది ఇప్పటికీ అస్పష్టమే. -
జూలై 11 నుంచి కేంద్ర ఉద్యోగుల సమ్మె
సాక్షి, న్యూఢిల్లీ: ఏడో వేతన సంఘం సిఫార్సులను సవరించాలన్న డిమాండ్తో జూలై 11 నుంచి 32 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు నిరవధిక సమ్మె చేస్తారని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేమెన్(ఎన్ఎఫ్ఐఆర్)ప్రధాన కార్యదర్శి ఎం. రాఘవయ్య తెలిపారు. సమ్మెకు జూన్ 9న నోటీసు ఇస్తామన్నారు. -
కేంద్రప్రభుత్వ ఉద్యోగులు ఓటేసేందుకు గంట సడలింపు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ జరిగే ఫిబ్రవరి 2వ తేదీన స్థానికంగా ఉండే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు ప్రకటించేందుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరించింది. పోలింగ్ రోజు ఓటేసేందుకు తమ ఉద్యోగులు ఉదయం లేదా మధ్యాహ్నపు పని వేళల్లో అర్థగంట/గంట పాటు సడలింపు తీసుకోవచ్చని తెలిపింది. పోలింగ్ రోజు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు ప్రకటించాలని కోరుతూ రాసిన లేఖకు స్పందనగా కేంద్రం నుంచి తాజాగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్ శర్మకు సమాధానం అందింది. దీంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కేంద్ర ప్రభుత్వ శాఖలు/సంస్థల కార్యాలయాల్లో పనిచేస్తున్న వేల మంది ఉద్యోగులు పోలింగ్ రోజు విధులకు హాజరుకాక తప్పని పరిస్థితి ఏర్పడింది. ప్రైవేటు ఉద్యోగులకు 2న సెలవు.. జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ రోజు ఫిబ్రవరి 2న స్థానిక ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అదే విధంగా జీహెచ్ఎంసీ పరిధిలో నివాసం ఉంటూ ఇతరాత్ర ప్రాంతాల్లోని ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు సైతం పోలింగ్ రోజు సెలవును వర్తింపజేస్తూ రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి ఎం.జి.గోపాల్ శనివారం మెమో జారీ చేశారు. అదే విధంగా జీహెచ్ఎంసీ ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి పోలింగ్కు మరుసటి రోజు ఫిబ్రవరి 3న ఆన్డ్యూటీ(ఓడీ) సౌకర్యం కల్పిస్తూ మరో మెమో జారీ చేశారు. -
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు చేదు వార్త
ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు చేదు వార్త. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల పెంపు మరో రెండు నెలలు వాయిదా పడనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సుపై నివేదిక ఆలస్యమే ఇందుకు కారణమని తెలిసింది. సెప్టెంబర్ 15 నాటికి కేంద్రానికి నివేదిక అందే అవకాశం ఉందని సమాచారం. దాదాపు 90 శాతం మంది ప్రభుత్వ ఉద్యోగులు సైనికులుగా, పారామిలిటరీ దళాలుగా పనిచేస్తున్నారు. కొందరు రైల్వేశాఖలో, పోస్టల్ శాఖలలో పనిచేస్తున్నారు. దీంతో జీతాల పెంపుకోసం ఎదురుచూస్తున్న 54 లక్షల మంది ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లినట్టైంది. ఉద్యోగుల జీతాల పెంపుపై 7వ వేతన సంఘం చైర్మన్, జస్టీస్ ఏకె మాథూర్ ప్రభుత్వాన్ని రెండు నెలల గడువును కోరారు. అయితే అప్పటివరకు వేతన సంఘం నుంచి మధ్యంతర నివేదిక వెలువబడే అవకాశం లేదని సమాచారం. కొత్త జీతాల పెంపుపై ప్రధాని నరేంద్ర మోదీ అంగీకారం తెలిపిన అనంతరం వచ్చే సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, గత ఫిబ్రవరి 2014లో 7వ వేతన సంఘాన్ని నియమించిన యూపీఏ ప్రభుత్వం, దీనికి సంబంధించిన నివేదికను సమర్పించడానికి 18 నెలల గడువు ఇచ్చిన సంగతి తెలిసిందే. -
7వ వేతన సంఘం చైర్మన్గా జస్టిస్ మాథుర్
సిఫార్సులు అందజేసేందుకు రెండేళ్ల గడువు న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వోద్యోగుల ఏడవ వేతన సంఘం చైర్మన్గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అశోక్కుమార్ మాథుర్ నియమితులయ్యారు. ఈ మేరకు ఏడవ వేతన సంఘం కూర్పునకు ప్రధానమంత్రి ఆమోదం తెలిపినట్టు ఆర్థిక మంత్రిత్వశాఖ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. వేతన సంఘంలోని ఇతర సభ్యులు.. చమురుశాఖ కార్యదర్శి వివేక్ రే(పూర్తి స్థాయి సభ్యుడు), ఎన్ఐపీఎఫ్పీ డెరైక్టర్ రాథిన్ రాయ్(పార్ట్టైమ్ సభ్యులు), వ్యయశాఖలోని ఓఎస్డీ మీనా అగర్వాల్(కార్యదర్శి). 50 లక్షల మందికిపైగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల సవరణతోపాటు 30 లక్షల మంది పెన్షనర్లకు చెల్లించే రెమ్యునరేషన్ సవరణలపై ఏడవ వేతన సంఘం తగిన సిఫార్సులు చేస్తుంది. కమిషన్ తన నివేదికను రెండేళ్లలోగా సమర్పించాలని గడువు నిర్దేశించారు. వేతన సంఘం చేసే సిఫార్సులు 2016, జనవరి ఒకటి నుంచి అమలులోకి వస్తాయి. వాస్తవానికి గతేడాది సెప్టెంబర్లోనే ఏడవ వేతన సంఘం ఏర్పాటుకు ప్రధాని ఆమోదం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగుల పే స్కేళ్లను సవరించేందుకు ప్రతి పదేళ్లకు ఒకసారి వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తుంది. ఆరవ వేతన సంఘం సిఫార్సులు 2006, జనవరి 1 నుంచి అమలులోకి వచ్చాయి.