CHITTURU
-
40 ఇయర్స్ ఇండస్ట్రీ భ్రమరావతి వర్సెస్ రియల్ సీఎం
ఏపీలో చిట్టచివరి నియోజకవర్గం, ఒక మూలకు విసిరేసినట్లు ఉండే కుప్పానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాను చెప్పినట్లే తాగునీరు, సాగునీరు విడుదల చేశారు. ఇందుకు అవసరమైన కాల్వలను తవ్వించి, ఇతర ఏర్పాట్లు చేసి హంద్రీనీవా సుజల స్రవంతిలో భాగంగా నీటిని కుప్పం వరకు తీసుకువెళ్లగలిగారు. పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా, ముప్పైఐదేళ్లు ఎమ్మెల్యేగా ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిన చంద్రబాబు నాయుడు పూర్తి చేయలేని పనిని జగన్ చేసి చూపించారు. తద్వారా ఈ ప్రజల దాహార్తిని తీర్చే యత్నం చేశారు. అలాగే ఆరువేల ఎకరాలకు సాగు నీరు కూడా ఇవ్వడానికి సంకల్పించారు. ఇందుకోసం సుమారు అరు వందల కోట్ల రూపాయలను వ్యయం చేశారు. కుప్పంలో జరిగిన సభలో సీఎం జగన్ మాట్లాడుతూ "ఇంతకాలం చంద్రబాబును ఈ నియోజకవర్గ ప్రజలు భరించినందుకు జోహార్లు" అని వ్యంగ్య వ్యాఖ్య చేశారు. ఈ సభలో చంద్రబాబు టైమ్లో కుప్పంకు జరిగిన పనులు, తన హయాంలో జరిగిన కార్యక్రమాలను వివరించారు. ప్రత్యేకించి కుప్పం నియోజకవర్గ ప్రజలకు వివిధ స్కీముల ద్వారా 1400 కోట్ల మేర లబ్ది జరిగిన విషయాలను లెక్కలతో సహా వివరించారు. తాను ప్రాంతం, కులం, మతం, పార్టీ చూడకుండా, ఎలాంటి వివక్ష లేకుండా స్కీములు అమలు చేశానని ఆయన అన్నారు. చంద్రబాబు నాయుడు తనపై కోపం వచ్చినప్పుడల్లా, పులివెందుల , కడప, రాయలసీమ ప్రజలను దూషిస్తుంటారని, తాను మాత్రం ఎప్పుడు అలా చేయలేదని ప్రజల మనసులను ఆకట్టుకునే యత్నం చేశారు.ఇంతవరకు ఒప్పుకోవలసిందే. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తుని వద్ద కాపు ఉద్యమకారులు రైలును దగ్దం చేస్తే, ఆ పని చేసింది కడప రౌడీలంటూ మీడియా సమావేశం పెట్టి ఆరోపించారు. కాని పోలీసులు అన్నిటిని విచారించి ఉభయ గోదావరి జిల్లాలకు చెందినవారిని అరెస్టు చేశారు. అలాగే ఆయన తనకు ఓటు వేయని వారికి తాను ఎందుకు సదుపాయాలు కల్పించాలని అనేవారు. తనకు ఓటు వేయకపోతే తాను వేసిన రోడ్డు, తాను మంజూరు చేసిన మరుగు దొడ్డి ఎలా వాడతారని చంద్రబాబు ప్రజలను ప్రశ్నించేవారు. కానీ జగన్ అందుకు విరుద్దంగా తనకు ఓటు వేసినా, వేయకపోయినా, తన ప్రభుత్వ స్కీములు ప్రాంతం, కులం, పార్టీ,మతం వంటివాటితో సంబంధం లేకుండా అమలు చేస్తున్నారు. కుప్పం ప్రజలు సైతం అందులో భాగమేనని, అందుకే మాట ఇచ్చిన ప్రకారం నీరు అందించానని, వివిధ అబివృద్ది పనులు చేపట్టానని సీఎం జగన్ చెప్పారు. దీనికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. కుప్పంలోని గ్రామీణ ప్రాంతంలో మీటింగ్ పెట్టినా భారీ ఎత్తున జనం రావడం, వారు ఆయా సమయాలలో అనుకూల నినాదాలతో హోరెత్తించడం కనిపించింది. దీంతో టిడిపి అధినేత కుప్పంలో తన పోటీపై గట్టిగా ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి. కుప్పం ప్రజలు చంద్రబాబును ఇంతకాలం భరించినందుకు వారికి జోహార్లు అని జగన్ చమత్కరించారు. కుప్పం ఎమ్మెల్యేగా భరత్ను గెలిపిస్తే మంత్రిని చేస్తానని ఆయన హామీ ఇవ్వడం ద్వారా కుప్పం ప్రాముఖ్యత తగ్గదని ప్రజలకు ఆయన సంకేతం ఇచ్చారు. గత సాధారణ ఎన్నికల తర్వాత జరిగిన స్థానిక ఎన్నికలలో YSRCP విజయఢంకా మోగించడం, కుప్పానికి నీరు, బలహీనవర్గాలకు ఇళ్ల పట్టాలు, ఇళ్లు, కుప్పం మున్సిపాలిటీగా మారడం, రెవెన్యూ డివిజన్ ఇవ్వడం వంటివి పార్టీకి ప్లస్ అవుతాయి. జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని కుప్పంలో చంద్రబాబును ఓడించాలన్న పట్టుదలతో పనులు చేశారు. దాని ప్రభావం ఏ రకంగా ఉంటుందన్నది చర్చనీయాంశంగా ఉంది. ఇప్పటికైతే చంద్రబాబు గతంలో మాదిరి నల్లేరు మీద బండి మాదిరి ఎన్నిక చేసుకోలేకపోవచ్చని, తీవ్రమైన పోటీని ఎదుర్కోక తప్పదన్న విశ్లేషణలు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు తన టైమ్ లో కుప్పం బ్రాంచ్ కెనాల్ ను పూర్తి చేయలేకపోవడం పెద్ద వైఫల్యంగా చెప్పాలి. హంద్రీ-నీవా ప్రాజెక్టు ప్రతిపాదన ఎన్.టి.ఆర్.టైమ్ లో వచ్చినా,దానిని ఆచరణ లో పెట్టింది వైఎస్ రాజశేఖరరెడ్డి. ఇప్పుడు ఈ ప్రాజెక్టు చివరిలో ఉన్న కుప్పంకు సైతం నీరు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిది. కుప్పం ప్రాంతానికి శాశ్వతంగా నీటి సమస్య తీర్చడానికి వీలుగా రెండు రిజర్వాయర్లను నిర్మించడానికి కూడా ఆయన శంకుస్థాపన చేశారు. ఈ రకంగా కుప్పం ప్రజల అభిమానం పొందడానికి జగన్ యత్నించారు. కాగా చంద్రబాబు మాత్రం పులివెందుల ప్రజలను తరచుగా అవమానించేవారు. కుప్పంకు నీరు ఇవ్వడంపై చంద్రబాబు స్పందించిన తీరు కూడా సరిగా లేదు. నిజానికి ఆయన హర్షం వ్యక్తం చేసి ఉంటే హుందాగా ఉండేది. ఆ పని చేయకపోగా, కుప్పం ప్రజలను దోచుకున్నారంటూ, ఏదో హింస జరిగిందంటూ పిచ్చి ఆరోపణలను చంద్రబాబు చేసి తన విలువను మరింత తగ్గించుకున్నారు. పులివెందులలో పొలాలు ఎండిపోతున్నాయని అంటూ ఏవేవో మాట్లాడారు. రాయలసీమలో నీటి పారుదల ప్రాజెక్టులకు అదికంగా ఖర్చు చేసింది తానేనని ఆయన ప్రకటించుకున్నారు. పదమూడు శాతం పనులు కుప్పం బ్రాంచ్ కెనాల్ కు సంబంధించి మిగిలాయని, కాని జగన్ మొత్తం తానే చేసేసినట్లు చెప్పుకుంటున్నారని చంద్రబాబు విమర్శించారు. అంతే తప్ప తాను పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కుప్పం కు ఎందుకు నీళ్లు తేలకపోయింది మాత్రం చెప్పలేకపోయారు. దీంతో ఆయన ఆత్మరక్షణలో పడ్డారు. కాకపోతే బుకాయింపులో దిట్ట కనుక యధాప్రకారం డబాయిస్తూ ప్రకటన చేశారు. దానిని ఈనాడు,ఆంధ్రజ్యోతి బాకా మీడియాలు ప్రచారం చేశాయి. ఈనాడు అయితే కుప్పంను తానే ఉద్దరించినట్లు జగన్ మాట్లాడడం విని స్థానికులు విస్మయం చెందుతున్నారని ఒక దిక్కుమాలిన కధనాన్ని ఇచ్చింది. కుప్పంకు 35 ఏళ్లపాటు ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు పద్నాలుగేళ్లు సీఎంగా ఉన్నప్పటికీ పట్టణాన్ని ఎందుకు మున్సిపాలిటీ చేయలేకపోయారు? ఎందుకు రెవెన్యూ డివిజన్ చేయలేకపోయారు? ఎందుకు 15వేలమందికి ఇళ్ళ స్థలాలు ఇవ్వలేకపోయారు? అసలు కుప్పంలో కొన్ని వార్డులకు వెళ్లడానికి సరైన రోడ్లే ఎందుకు లేవు? రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టి ఎందుకు పూర్తి చేయలేకపోయారు? కుప్పం కన్నా పులివెందుల ఎంత చక్కగా ఉంటుందో స్వయంగా ఎవరైనా వెళ్లి చూడవచ్చు. పులివెందుల చుట్టూ రోడ్డు, పరిశ్రమలు, పలు విద్యా సంస్థలు, మెడికల్ కాలేజీ మొదలైనవి ఏర్పాటు చేసింది వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్మోహన్రెడ్డి కాదా? కుప్పంకు ఎయిర్ పోర్టు ఇస్తానని పిచ్చి ప్రకటనలు చేస్తున్న చంద్రబాబు నాయుడు ఆ ప్రాంతంలో ఒక పరిశ్రమనైనా ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారు? వీటన్నిటిని కప్పిపుచ్చుతూ, జగన్ కుప్పం కు నీళ్లు ఇవ్వడాన్ని చూసి ఓర్వలేక ఈనాడు ఇలాంటి దద్దమ్మ వార్తలు ఇస్తోంది. చంద్రబాబు ఇంతకాలం దొంగ ఓట్లపై ఆధారపడి ఎక్కువ మెజార్టీ పొందగలిగారన్నది బహిరంగ రహస్యం. ప్రస్తుతం ఆ దొంగ ఓట్లను చాలావరకు తొలగించినట్లు చెబుతున్నారు. దాంతో ఇప్పుడు ఆయన తీవ్రమైన పోటీని ఎదుర్కునే పరిస్థితి ఏర్పడింది. అందుకే చంద్రబాబు ఎక్కువగా కంగారు పడుతున్నారు. దానికి తోడు జగన్ కుప్పంపై దృష్టి పెట్టి అభివృద్ది పనులు, సంక్షేమ స్కీములు అమలు చేశారు. కుప్పంకు నీరు కూడా వచ్చేలా చేశారు. ఇది YSRCPకి ప్లస్ గా మారే అవకాశం ఉంది. ఈ నేపధ్యంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి టిడిపి మీడియాలు నీరు విడుదల చేసిన మరుసటి రోజు కాల్వలో నీరు లేదంటూ ఒక తప్పుడు కదనాన్ని వండి జనాన్ని ఏమార్చడానికి యత్నించారు. ఇంకా నీళ్లురాని కాల్వలో దిగి టిడిపి నేతలు యాగీ చేశారు. దీనిని బట్టే వారు ఎంత భయపడుతున్నదీ తెలుసుకోవచ్చు. గెలుపు ఓటములు సంగతి ఎలా ఉన్నా, జగన్ మాత్రం కచ్చితంగా తన రాజకీయ ప్రత్యర్ధి అని కూడా చూడకుండా, తన పార్టీకి ఓటు వేశారా? లేదా? అన్నదానితో నిమిత్తం లేకుండా కుప్పం ప్రజలకు కూడా మేలు చేశారన్నది నిజం. అందుకు ఎవరైనా అభినందించాల్సిందే. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్టు -
డప్పు వాయించి ఆకట్టుకున్న ఎమ్మెల్యే రోజా
-
ట్రెండింగ్గా మారిన అశ్విని.. మరోసారి 23 సెంటిమెంట్
స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత ఒక్కసారిగా అశ్వినీ పేరు మార్మోగిపోతోంది. కుప్పం మండలం టీ సద్దుమూరు ఎంపీటీసీ స్థానం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన అశ్వినీ ఒక్కసారిగా సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారింది. 1989 నుంచి ఇక్కడ టీడీపీ పార్టీనే వరుసగా గెలుస్తూ వస్తోంది. అలాంటి స్థానంలో టీడీపీ అభ్యర్థిపై వైఎస్సార్సీపీ అభ్యర్థి అశ్విని 1073 ఓట్ల మెజారిటీతో విజయం సాధించడంతో ఆమె గురించి తెలుసుకోవాలనే ఆసక్తి జనాల్లో పెరిగింది. మరోసారి తెరపైకి 23 వైఎస్సార్సీపీ, టీడీపీల మధ్య నెలకొన్న పొలిటికల్ వార్లో 23 నంబర్కి ప్రత్యేకత ఉంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి వైఎస్సార్సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంది. ఆ తర్వాత 2019లో జరిగిన సాధారణ ఎన్నికల ఫలితాలు మే 23న వెల్లడయ్యాయి. అందులో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధిస్తే, టీడీపీ కేవలం 23 స్థానాలకే పరిమితం అయ్యింది. తాజాగా కుప్పంలో టీ సద్దుమూరు స్థానం నుంచి విజయం సాధించి వెలుగులోకి వచ్చిన అశ్విని వయస్సు కూడా 23 ఏళ్లే కావడం గమనార్హం. దిష్టి గట్టిగా తీయండమ్మా !! ఆ పాపిష్టి కళ్ళు అన్ని ఈ అమ్మాయి మీదే ఉన్నాయి ! pic.twitter.com/Ka7lCYwlh5 — Ram (@iamSidde) September 19, 2021 -
పరుగులు తీసి.. ప్రాణం కాపాడి..
సాక్షి,చిత్తూరు(రేణిగుంట): ఏ కష్టమొచ్చిందో ఆ వృద్ధురాలికి ప్రాణాలు తీసుకోవాలనుకుంది.. ఆగి ఉన్న గూడ్సు కింద పట్టాలపై తలపెట్టి పడుకుంది.. అదే సమయంలో రైలు కదిలేందుకు సిగ్నల్ పడింది.. సీసీ కెమెరా ద్వారా గుర్తించిన రైల్వే పోలీసులు పరుగులు పెట్టారు.. పట్టాలపై నుంచి వృద్ధురాలిని పక్కకు లాగి కాపాడారు. ఆర్పీఎఫ్ సిబ్బందిని ఉరుకులు పెట్టించిన ఈ ఘటన ఆదివారం రేణిగుంట రైల్వే స్టేషన్లో జరిగింది. జీఆర్పీ ఎస్ఐ అనిల్కుమార్ కథనం మేరకు.. రేణిగుంట బాలాజీ కాలనీకి చెందిన వరదరాజులు భార్య పాండియమ్మ(76) సాయంత్రం 6.30గంటల సమయంలో రైల్వేస్టేషన్కు వచ్చింది. ఐదో నంబర్ ప్లాట్ఫామ్ చివరకు వెళ్లి ఆగి ఉన్న గూడ్స్ కింద తలపెట్టింది. ఈ విషయం ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ సీసీ కెమెరాలో గమనించారు. వెంటనే ఆయన జీఆర్పీ స్టేషన్ సమాచారం అందించారు. అప్పటికే రైలుకు సిగ్నల్ పడడంతో ఎస్ఐ అనిల్కుమార్ తన సిబ్బందితో కలిసి పరుగుపరుగున పట్టాలపై పడుకున్న వృద్ధురాలి వద్దకు చేరుకున్నారు. ఆమెను బలవంతంగా పక్కకు లాగేయడంతో అందరూ ఊపిరి తీసుకున్నారు. వృద్ధురాలిని కాపాడిన కొద్దిక్షణాల్లోనే రైలు కదలింది. అనంతరం రైల్వే పోలీసులు పాండియమ్మ వివరాలు తెలుసుకుని ఆమె కుటుంబసభ్యులను పిలిపించారు. వారికి కౌన్సెలింగ్ ఇచ్చి వృద్ధురాలితో ఇంటికి పంపించారు. చదవండి: కత్తులు పట్టుకొని బాలీవుడ్ డైలాగులు.. వాట్సాప్ స్టేటస్ -
పాపం.. పసిహృదయాలు!
విధి ఆడిన వింతనాటకంలో.. తల్లిదండ్రులు దూరమై ఇద్దరు పిల్లలు వీధినపడిన ఘటన కేవీబీపురం మండలం, తిమ్మసముద్రం గ్రామంలో మంగళవారం కలచివేసింది. గత ఏడాది కరోనా మహమ్మారికి తండ్రి బలవ్వగా, ఇప్పు డు గుండె పోటుతో తల్లి దూరమవ్వడం ఆ చిన్నారులకు తీరని వేదనను మిగిల్చింది. నా అన్న వాళ్లు లేక.. తమ కాళ్లపై తాము నిలబడలేక తల్లడిల్లితున్న ఆ పసిహృదయాలను చూసి పలువురు కంటతడి పెట్టడం కనిపించింది. సాక్షి,చిత్తూరు: మండలంలోని తిమ్మసముద్రం గ్రా మానికి చెందిన ప్రతాప్రెడ్డి(48), సుగుణ(44) భా ర్యభర్తలు. వీరికి కుశి్మతా(17), నితీష్ సంతానం. మూడేళ్ల కిందట వరకు కిడ్నీ వ్యాధితో ప్రతాప్రెడ్డి వారంవారం డయాలసిస్ చేయించుకుంటూ కుటుంబానికి తోడుగా ఉండేవాడు. ప్రభుత్వం ఇచ్చే రూ.10వేల పింఛన్తో వైద్య ఖర్చులు పోను అంతోఇంతో కూడబెట్టి పిల్లల చదువుకు ఉపయోగించేవాడు. కుటుంబం సాఫీగా సాగుతున్న వేళ గత ఏడాది కరోనా మహమ్మారి ఆ కుటుంబంలో కల్లోలం సృష్టించింది. కుటుంబ పెద్దను పొట్టబెట్టుకుంది. అప్పటి వరకు లోకం తెలియని ఆ ఇల్లాలు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. అందుబాటులో ఉన్న కూలిపనులకు వెళ్లి బిడ్డలకు ఏ లోటూ రాకుండా చూసుకోవాలని నిశ్చయించుకుంది. రెక్కలు ముక్కలు చేసుకుని, కడుపు మాడ్చుకుని పిల్లలకు తండ్రి లేనిలోటు లేకుండా చదివించింది. ఇలాంటి తరుణంలో మంగళవారం సుగుణకు ఆకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఇంటివద్దే ప్రాణాలు వదిలింది. పెద్దగా బంధువులు కూడా లేకపోవడంతో ఎవ్వరూ దగ్గరకు రాలేదు. అంత్యక్రియలు ఎలా చేయాలో తెలియక ఆ పసిహృదయాలు తల్లడిల్లిపోయాయి. తల్లి మృతదేహం వద్దే దిగాలుగా ఉండిపోయారు. ఈ నేపథ్యంలో స్థానికులు చేయిచేయి కలిపి వారికి అంతిమయాత్రను కొనసాగించారు. ఇద్దరు పిల్లల చేత తల్లికి తలకొరివి పెట్టించారు. వీధినపడిన పిల్లలను ప్రభుత్వం అక్కున చేర్చుకుని చదివించాలని స్థానికులు కోరుతున్నారు. -
విషాదం: చెరువులో పడి ఇద్దరు యువకులు మృతి
సాక్షి,చిత్తూరు: మండలంలోని విరూపాక్షపురం గ్రామ సమీపంలో ఉన్న నాయునిచెరువులో ప్రమాదవశాత్తు కాలుజారి పడి ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన ఆదివారం విషాదం నింపింది. ఎస్ఐ మునిస్వామి కథనం మేరకు.. కడప జిల్లా పూలంపేట మండలంలోని టీ.జీ.వీ పల్లెకు చెందిన మల్లికార్జునకు పక్షవాతం రావడంతో బంధువుల సాయంతో విరూపాక్షపురానికి వచ్చాడు. పక్షవాతం మందు సేవించిన మల్లికార్జున కొంతసేపు అక్కడే ఉన్నాడు. అతని తోడుగా వచ్చిన వెంకటకృష్ణ (17), కార్తీక్(15) గ్రామ సమీపంలో ఉన్న నాయునిచెరువు వద్దకు వెళ్లారు. ప్రమాదవశాత్తు వెంకటకృష్ణ కాలుజారి చెరువులో పడిపోవడంతో అక్కడే ఉన్న కార్తీక్ కాపాడబోయాడు. దీంతో ఇద్దరూ చెరువులో మునిగిపోయారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఇద్దరినీ ఒడ్డుకు చేర్చి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ మునిస్వామి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: Payel Sarkar: నటికి ఫేక్ డైరెక్టర్ అసభ్య సందేశాలు -
గుజరాత్ యువతితో చిత్తూరు టెకీ ప్రేమ పెళ్లి.. రక్షణ కల్పించాలంటూ
సాక్షి, మదనపల్లె : తమ పెద్దల నుంచి ప్రాణహాని ఉందని శనివారం మదనపల్లె ఒకటో పట్టణ పోలీసులను ఓ ప్రేమజంట ఆశ్రయించింది. వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని రంగారెడ్డి వీధిలో కాపురం ఉంటున్న విజయ్కుమార్ కొడుకు పి.కృషవ్ (27) బెంగళూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అదే కంపెనీలోనే పనిచేస్తున్న గుజరాత్కు చెందిన బహదూర్ సింగ్ కుమార్తె శివాని (25), కృషవ్ గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ వ్యవహారం ఇద్దరి ఇళ్లలో కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిళ్లు అధికమయ్యాయి. దీంతో ఆ ప్రేమికులు రెండు రోజుల క్రితం బెంగళూరు నుంచి వచ్చి కురబలకోట మండలం చేనేతనగర్లో ఉండే ఓ ఆలయంలో స్నేహితుల సహకారంతో వివాహం చేసుకున్నారు. ఇద్దరు మేజర్లు కావడంతో పోలీసులు వారికి రక్షణ కల్పించారు. చదవండి: పట్టాలెంబడి పాదయాత్రగా తిరిగి వస్తుండగా ఢీకొన్న రైలు -
బాగోతం బట్టబయలు.. అమరరాజా ఆటకట్టు..
వడ్డించే వాడు మనవాడైతే ఏ పంక్తిలో కూర్చున్నా ఒక్కటే అన్నట్లుగా సాగింది గతంలో అమరరాజా వ్యవహారం. టీడీపీ అధికారంలో ఉండగా ఆ ఫ్యాక్టరీ యాజమాన్యం ఆడిందే ఆట, పాడిందే పాటగా అటవీ శాఖ భూముల్లో పాగావేసింది. అనుమతి తీసుకున్న భూమిని కాదని.. పక్కనున్న స్థలాన్నీ కలిపేసుకుంది. ఎంచక్కా గోడ కట్టేసినా.. పెద్దలతో వ్యవహారంతో కావడంతో అధికారులకు తెలిసినా మిన్నకుండిపోయారు. ఇప్పుడు ఈ బాగోతం కాస్తా బట్టబయలు కావడంతో అధికారుల్లోనూ చలనం వచ్చింది. చర్యలకు సిద్ధమైన అటవీశాఖ అధికారులు ఎట్టకేలకు అనధికార ప్రహరీని కూల్చేసి.. ఆక్రమిత స్థలాన్ని స్వాదీనం చేసుకోవడం గమనార్హం. సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతి నగరానికి 12 కిలోమీటర్ల దూరంలోని కరకంబాడి పంచాయతీ పరిధిలో ‘అమరరాజా’ యాజమాన్యం 2000 సంవత్సరంలో తమ ఫ్యాక్టరీ చుట్టూ ప్రహరీ నిర్మాణానికి సమీప అటవీ శాఖ(ఫారెస్ట్ పోరంబోకు) భూమిని భూ మార్పిడి చేసి ఇవ్వాలని ప్రభుత్వాన్ని అభ్యర్ధించింది. ఆ మేరకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సుతో 4.4 హెక్టార్ల అటవీభూమిని కేంద్ర ప్రభుత్వ అనుమతితో అమరరాజాకు కట్టబెట్టారు. అయితే ప్రభుత్వం 4.4 హెక్టార్లకు అనుమతిస్తే.. ఫ్యాక్టరీ యాజమాన్యం మరో 3.04 హెక్టార్లను ఆక్రమించేసింది. ఏకంగా ఆ అటవీ భూముల్లోనే ప్రహరీ కట్టేసింది. రెవెన్యూ రికార్డుల ప్రకారం 766 సర్వే నంబర్ పరిధిలోకి వచ్చే దాదాపు ఏడున్నర ఎకరాలకు పైగా భూమిని అడ్డగోలుగా ఆక్రమించేసింది. ఇలా సుమారు రెండు దశాబ్దాలుగా అటవీభూమిని ఆక్రమించుకున్నా ఎవ్వరూ సదరు ఫ్యాక్టరీ యాజమాన్యం జోలికి వెళ్లే సాహసం చేయలేకపోయారు. అమరరాజా ఫ్యాక్టరీలు వెదజల్లుతున్న విష కాలుష్యంపై హైకోర్టు ఆగ్రహం, కాలుష్య నియంత్రణ మండలి నోటీసులు ఇచ్చిన పరిణామాలతో అమరరాజా వివాదాల తుట్టె ఈ మధ్యకాలంలో కదలడం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత జూలై 20న ‘సాక్షి’లో ‘అటవీభూముల్లో అమరరాజా’ శీర్షికన వచ్చిన కథనంపై అటవీశాఖ అధికారులు ఎట్టకేలకు స్పందించారు. తొలుత ఆయా భూముల్లో ఆక్రమిత గోడను తొలగించాలని యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ స్పందన రాకపోవడంతో ఇటీవల అటవీశాఖ అధికారులు పెద్ద ఎత్తున సిబ్బందితో వెళ్లి అక్రమిత భూమిలోని ప్రహరీని కూల్చేశారు. అమరరాజా కలిపేసుకున్న ఆ మూడు హెక్టార్ల భూమిని తిరిగి స్వాదీనం చేసుకున్నామని తిరుపతి డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్(డీఎఫ్వో) పవన్ కుమార్ స్పష్టం చేశారు. ఆ 18 ఎకరాలూ అటవీభూములే.. అమరరాజా భూ ఆక్రమణలకు సంబంధించి తాజాగా అటవీశాఖ అధికారులు మరో వాదనను తెరపైకి తీసుకొచ్చారు. అమరరాజా ఫ్యాక్టరీస్కు చెందిన మంగళ్ ఇండస్ట్రీస్ పరిధిలో 18 ఎకరాల అటవీ భూములు ఉన్నాయని చెబుతున్నారు. నోటిఫైడ్ గెజిట్ ప్రకారం అవి కచ్చితంగా అటవీ శాఖ భూములేనని స్పష్టం చేస్తున్నారు. వాస్తవానికి టీడీపీ హయాంలో 2015–16 మధ్య కాలంలో కరకంబాడి పంచాయతీ పరిధిలోనే 21 ఎకరాల భూములను అమరరాజా యాజమాన్యం కొనుగోలు చేసింది. 1982లో పేదల కోసం అసైన్ చేసిన ఆ భూములను అడిగిందే తడవుగా ఆరేళ్ల కిందట చంద్రబాబు ప్రభుత్వం అలినేషన్ పేరిట అమరరాజాకు విక్రయించింది. అయితే ఈ 21 ఎకరాల భూముల్లో 18 ఎకరాలు అటవీ భూములేనని, 1979లో నోటిఫై చేసిన అటవీ భూములను రెవెన్యూ అధికారులు ఎలా విక్రయిస్తారని అటవీశాఖ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఆ మేరకు భూముల పూర్తి వివరాలతో రెవెన్యూ ఉన్నతాధికారులకు ఇటీవల లేఖ రాశారు. వాస్తవానికి గతంలో అవి అటవీ భూములేనని, అయితే క్లాసిఫికేషన్ ఆఫ్ ల్యాండ్స్ నేపథ్యంలో డీనోటిఫైగా చూపిస్తున్నాయనేది రెవెన్యూ అధికారుల వాదన. అయితే ఆ భూమి ఎప్పుడు, ఎందుకు డీనోటిఫై చేశారో వివరాలు అందుబాటులో లేవని చెబుతుండడం గమనార్హం. ఈ క్రమంలోనే అటవీ, రెవెన్యూ అధికారులు జాయింట్ సర్వే చేపట్టాలని నిర్ణయించారు. ఆ సర్వేతోనైనా 18 ఎకరాల అటవీ భూముల అసలు ‘కథ’ బయటికొస్తుందో లేదో చూడాలి. -
తెలుగుదేశం పార్టీలో అంతర్గత పోరు..
తెలుగుదేశం పార్టీలో అంతర్గత పోరు మొదలైంది. ఆ పార్టీ అనుబంధ కమిటీల నియామకం చిచ్చు రేపింది. స్థానిక టీడీపీ ఇన్చార్జుల తీరును ఎండగడుతూ అధినేతకు నాయకులు లేఖలు రాయడం మొదలుపెట్టారు. వలస నేతలకు పదవులు కట్టబెట్టడంతో ఆశావహులందరూ అసంతృప్తితో రగిలిపోతూ లేఖల యుద్ధానికి దిగారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా టీడీపీ ముఖ్య నేతలు కొందరు వైఎస్సార్ సీపీలో చేరిపో యిన వైనంపై స్థానిక నేతలు చంద్రబాబు దృష్టికి లేఖల ద్వారా తీసుకెళుతున్నారు. సాక్షి, తిరుపతి: తెలుగుదేశం పార్టీ అనుబంధ కమిటీల నియామకాలపై జిల్లా నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ‘ఇలా ఐతే మా వల్ల కాదు బాబు గారూ’ అంటూ అధినేత చంద్రబాబుకు లేఖలు రాస్తున్నారు. చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం కొట్టాలకు చెందిన రవినాయుడును తిరుపతి కోటాలో టీడీపీ తిరుపతి పార్లమెంట్ యువత అధ్యక్షుడిగా నియమించారు. రవి నాయుడు బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారంటూ, ఎస్వీ యూనివర్సిటీలో మాస్ కాపీయింగ్లో పట్టుబడిన వ్యక్తి అని తిరుపతికి చెందిన టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు బంధువునని, లోకేష్ బాబు బామ్మర్ది అని, తాను చెప్పిన వారికే పదవులు వస్తాయని చెప్పుకుంటూ.... జిల్లాలోని నియోజకవర్గ ఇన్చార్జ్లపైన పెత్తనం చెలాయిస్తున్నారంటూ ఆయనపై టీడీపీ శ్రేణులు చంద్రబాబుకు లేఖ రాశారు. పుంగనూరుకు చెందిన ఆనంద్ గౌడ్కి రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి పదవిని కట్టబెట్టారు. ఇతనికీ తిరుపతి కోటాలోనే పదవిని కట్టబెట్టారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి నగరంలో టీడీపీ యువ నాయకులే లేరా అని లేఖలో నిలదీశారు. ఈ పరిణామం తిరుపతి నగర టీడీపీకే అవమానం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు ఇన్చార్జ్ పదవిని దొరబాబు తిరస్కరించినట్లు తెలిసింది. చంద్రగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ పులివర్తి నాని చిత్తూరు ఇన్చార్జ్ పదవి కోసం ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం మొదలైంది. వాళ్లదే పెత్తనం పీలేరు, మదనపల్లె, తంబళ్లపల్లెలో నియోజకవర్గ ఇన్చార్జులు నల్లారి కిషోర్కుమార్రెడ్డి, దొమ్మల పాటి రమేష్, శంకర్యాదవ్ తీరుపై పార్టీ శ్రేణులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీ కార్యక్రమాలకు వారి అనుచరులను మాత్రం పిలిపించుకుంటున్నారని కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడుతున్న వారిని పక్కనపెట్టి, వలస నేతలను ప్రోత్సహించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. కుప్పంలో టీడీపీ శ్రేణుల్లో ముఖ్యనేతలందరూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ రెడ్డెప్ప, ఇన్చార్జ్ భరత్ ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీలో చేరిపోవడంతో టీడీపీ డీలాపడిపోయింది. ఈ పరిస్థితుల్లో టీడీపీని బతికించుకునేందుకు ఉన్న టీడీపీ శ్రేణులు చంద్రబాబు, లోకేష్ వద్దంటూ, జూనియర్ ఎన్టీఆర్కి జై కొడుతూ జెండాలు ఎగురవేస్తున్నారు. జిల్లాలో ప్రస్తుత పరిస్థితులను ఆయా నియోజకవర్గ నాయకులు చంద్రబాబుకు ఎవరికి వారు లేఖలు రాయడం చర్చనీయాంశంగా మారింది. అక్కడ కుమ్ములాటలు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో టీడీపీ శ్రేణులకూ అన్ని ప్రభుత్వ పథకాలు అందుతుండడంతో సామాన్య కార్యకర్తలు ఎక్కువమంది వైఎస్సార్సీపీకి జై కొడుతున్నారు. నగరి నియోజకవర్గంలో టీడీపీ ఇన్చార్జ్ గాలి భానుప్రకాష్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో లేరనే విమర్శలున్నాయి. అధికార పార్టీ నాయకురాలు ఎమ్మెల్యే ఆర్కే రోజా, వరుస విజ యాలతో దూసుకుపోతుండగా, టీడీపీ ఇన్చార్జ్ కేడర్ను పట్టించుకోవడం లేదన్న అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులైన టీడీపీ శ్రేణులు అనేక మంది ఎమ్మెల్యే రోజా ఆధ్వర్యంలో పార్టీలో చేరిపోతున్నారు. దీంతో ఉన్న కొద్ది మంది టీడీపీ శ్రేణులు రెండు వర్గాలుగా చీలిపోయారు. సత్యవేడులో మాజీ ఎమ్మె ల్యే హేమలత, జేడీ రాజశేఖర్ ఎవరికి వారు వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహిస్తుండడం గమ నార్హం. అధికారం కోల్పోయాక మాజీ ఎమ్మెల్యే తలారి ఆదిత్య నియోజకవర్గానికి రావడమే మానేశారు. దీనిపైనా టీడీపీ శ్రేణులు అధిష్టానానికి లేఖల ద్వారా మొరపెట్టుకుంటున్నారు. చదవండి: పోలీసుల మృతి పట్ల సీఎం వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి -
శ్రీకాళహస్తిలో నవరత్న నిలయం
సాక్షి, తిరుపతి: శ్రీకాళహస్తి పట్టణంలోని రాజీవ్నగర్లో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డి నవరత్నాల నిలయాన్ని నిర్మించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ‘జగనన్న నవరత్న’ పథకాలతో ప్రజల జీవనస్థాయి ప్రమాణాలు ఎలా పెరిగాయో స్ఫురించేలా తొమ్మిది పురుష హస్తాలు, నాలుగు మహిళ హస్తాలతో నవరత్న పథకాలను కళ్లకు కట్టినట్టు నిర్మించారు. నిలయం మధ్యలో పేదలకు కేటాయించిన జగనన్న పక్కాగృహాన్ని ప్రత్యేకంగా రూపొందించారు. నిలయం మధ్యలో జగన్ ఫొటో ఏర్పాటు చేసి నవరత్నాలతో ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా అభివృద్ధి చెందుతుందనే విధంగా చిత్రాలను రూపొందించారు. అద్దాల గోపురంలో జగనన్న నిలయంపైన ప్రత్యేకంగా అద్దాల గోపురం నిర్మించారు. మధ్యలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రాన్ని ఏర్పాటు చేశారు. రాగి ఆకుల్లో సీఎం జగన్ బొమ్మను చిత్రీకరించారు. అద్దాల గోపురంలోకి వెళ్లి ఎటు చూసినా సీఎం వైఎస్ జగన్ ఫొటోలు కనిపిస్తాయి. నిలయం నిర్మాణానికి ప్రత్యేక నిపుణులు నవరత్నాల నిలయం కోసం ప్రత్యేకంగా నిపుణులను రప్పించారు. నిర్మాణానికి అవసరమైన సామగ్రిని కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి తెప్పించారు. నవరత్నాల నిలయం ప్రారంభం అనంతరం 2,500 మందికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేయనున్నారు. ఒక్కో ఇంటి స్థలం విలువ రూ.14 లక్షలు ఉంటుందని అంచనా. -
తెలుగు గడ్డపై హీరో మోటర్ కార్ప్ గిన్నీస్ రికార్డ్
World's Largest Motorcycle Logo: ప్రపంచంలోనే అతి పెద్ద బైకుల తయారీ సంస్థగా పేరొందిన హీరో మోటర్ కార్ప్ మరో రికార్డు సాధించింది. ఆ కంపెనీకి చెందిన 100 మంది సిబ్బంది 90 రోజుల పాటు శ్రమించి హీరో పేరును గిన్నీస్ వరల్డ్ రికార్డులోకి ఎక్కించారు. తెలుగు నేలను వేదికగా హీరో సంస్థ ఈ ఘనత సాధించింది. చిత్తూరులో హోండా కంపెనీ నుంచి హీరో విడిపోయి పదేళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని హీరో అరుదైన కార్యక్రమం చేపట్టింది. దీనికి ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాను వేదికగా చేసుకుంది. ప్రపంచంలోనే అతి పెద్ద మోటర్ సైకిల్ లోగోను ఏర్పాటు చేసి గిన్నీస్బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించింది. గిన్నీస్ రికార్డ్ చిత్తూరులో ఉన్న హీరో మోటార్ కార్ప్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లో స్ప్లెండర్ ప్లస్ బైకులను హీరో లోగో ఆకారంలో ఏర్పాటు చేసింది. ఫ్యాక్టరీ సమీపంలో నేలను చదును చేశారు. ఆ తర్వాత హీరో లోగో ఆకారంలో రోజుకు కొన్ని బైకులను పార్క్ చేశారు. దీని కోసం హీరోకు చెందిన వంద మంది సిబ్బంది 90 రోజుల పాటు నిర్విరామంగా పని చేశారు. ఈ లోగో ఆకారంలో 1845 బైకులను నిలిపి ఉంచారు. ఈ మొత్తం కార్యక్రమాన్ని షూట్ చేసి గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డుకు పంపించారు. అన్ని వివరాలు పరిశీలించిన అనంతరం లార్జెస్ట్ మోటార్ సైకిల్ లోగోగా గిన్నీస్ గుర్తించింది. పదికోట్ల బైకులు హీరో కంపెనీ నుంచి పది కోట్ల బైకులు అమ్మడంతో పాటు హీరో పదేళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమం చేపట్టినట్టు హీరో మోటార్ కార్ప్ గ్లోబల్హెడ్ మాలో ఏ మాసన్ తెలిపారు. ఈ లోగో ఏర్పాటుకు సంబంధించిన వీడియోను ఆగస్టు 9న హీరో రిలీజ్ చేసింది. - సాక్షి, వెబ్డెస్క్ What happens when 100 brilliant minds come together? A world record is made. With 90 days of planning and 300 hours of dedication. Watch the video to know more. pic.twitter.com/QAdK4CijUO — Hero MotoCorp (@HeroMotoCorp) August 10, 2021 -
అన్లోడ్ చేస్తుండగా టిప్పర్కి విద్యుదాఘాతం..ముగ్గురు మృతి
చిత్తూరు: చిత్తూరు జిల్లా పాల సముద్రం మండలం కన్యకాపురంలో పెనువిషాదం చోటు చేసుకుంది. ఇంటి నిర్మాణం కోసం కంకర టిప్పర్ లోడ్ ను అన్లోడ్ చేస్తుండగా విద్యుత్ వైర్లు తగిలి ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటనలో టిప్పర్ డ్రైవర్ మనోజ్ కుమార్ ముందుగా విద్యుత్ షాక్కు గురయ్యాడు. అతని రక్షించడానికి వెళ్లిన దొరబాబు, జ్యోతిష్కులు కూడా అక్కడికక్కడే మృత్యవాత పడ్డారు. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు చనిపోవడంతో స్థానికంగా తీవ్ర విషాదం ఛాయలు నెలకొన్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. -
రహదారులకు ‘పచ్చ తోరణం’
సాక్షి,చిత్తూరు: జిల్లాలోని రహదారులు పచ్చ తోరణంతో కొత్త శోభను సంతరించుకోనున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం ‘జగనన్న పచ్చతోరణం’ కార్యక్రమానికి ఆదివారం శ్రీకారం చుడుతోంది. రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటి సంరక్షించేందుకు నిర్ణయించింది. మొక్కను నాటినప్పటి నుంచి చెట్టయ్యే వరకు సంరక్షించేలా ప్రణాళికలను ప్రభుత్వం సిద్ధం చేసింది. తిరుపతి మినహా మిగిలిన 13 నియోజకవర్గాల్లో జగనన్న పచ్చతోరణం పక్షోత్సవాలను నిర్వహించనున్నారు. జిల్లాలో 6,10,510 మొక్కలను 15 రోజుల్లో నాటేలా అధికారులు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. రహదారులకు ఇరువైపులా 1,526.28 కిలోమీటర్ల వరకు మొక్కలను నాటుతారు. ఆగస్టు ఒకటి నుంచి 15లోపు మొక్కలు నాటడం పూర్తికాకుంటే మరోవారం రోజుల్లో పూర్తి చేయాలన్నది లక్ష్యం. మొక్కకు రూ.385 ఖర్చు ఉపాధి హామీ పథకం నిధులతో ‘జగనన్న పచ్చతోరణం’ పథకాన్ని అమలు చేస్తున్నారు. నాటే మొత్తం మొక్కలకు రూ.23,50,46,350 ఖర్చు చేయనున్నారు. ఒక్కో మొక్కకు ఏడాదికి రూ.385 ఖర్చు చేస్తారు. చిన్న మొక్కలను నాటితే త్వరగా ఎదిగే అవకాశం లేదని గుర్తించిన ప్రభుత్వం ఒక్కో మొక్క 6 నుంచి 10 అడుగుల ఎత్తు, రెండేళ్ల వయసు కలిగినవి నాటేందుకు నిర్ణయించింది. ఒక మొక్క కొనుగోలుకు రూ.95, నాటడానికి రూ.110, క్రిమిసంహారక మందు పిచికారీకి రూ.10, నెలకు నిర్వహణ రూ.10, నీటికి రూ.20, ఫెన్సింగ్కు రూ.140 చొప్పున మొత్తం రూ.385 ఖర్చు చేస్తారు. లక్ష మొక్కలు సిద్ధం పచ్చతోరణం పక్షోత్సవాలకు జిల్లాలో లక్ష మొక్కలను సిద్ధం చేశారు. వివిధ ప్రాంతాల నుంచి అవసరమైన మొక్కలను దశలవారీగా తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రాజమండ్రితో పాటు తమిళనాడులోని పుదుకోట్టై నుంచి మొక్కలను కొనుగోలు చేసి తరలిస్తున్నారు. ప్రస్తుతానికి నిర్దేశించిన ప్రణాళిక మేరకే కాకుండా అదనంగా మరో లక్ష మొక్కలు నాటేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రయోగాత్మకంగా తంబళ్లపల్లెలో ప్రారంభం తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఎమ్మెల్యే ద్వారకనాథ రెడ్డి ఈ పచ్చతోరణాన్ని ప్రయోగాత్మకంగా మొదలుపెట్టారు. ఇప్పటికే పలు చోట్ల రోడ్డుపక్కన మొక్కలు నాటే ప్రక్రియను చేపట్టారు. రాజమండ్రి నుంచి తెప్పించిన మొక్కలను రహదారులకు ఇరువైపులా నాటి సంరక్షించే పనులపై ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి సారించారు. -
కాన్పు కోసం వస్తే కాసులు పిండేస్తున్నారు..
కాన్పు కోసం వస్తే కాసులు పిండేస్తున్నారు.. ప్రసవం చేస్తే వేలకు వేలు గుంజేస్తున్నారు.. సొమ్ము ఇవ్వలేని నిరుపేదలను నీచంగా చూస్తున్నారు.. మాటలతోనే మనసును కుళ్లబొడుస్తున్నారు.. మానవత్వం మరిచి.. ఆమ్యామ్యాల కోసం అర్రులు చాస్తున్నారు. చిత్తూరు జిల్లా ఆస్పత్రిలో సిబ్బందే, రాబందులై ప్రజలను పీక్కుతింటున్నారు. చిత్తూరు రూరల్: చిత్తూరు నగరంలోని జిల్లా ఆస్పత్రికి చికిత్స కోసం అధిక సంఖ్యలో పేదలే వస్తుంటారు. సరిహద్దు ప్రాంతం కావడంతో తమిళనాడువాసులు కూడా ప్రసవం కోసం ఇక్కడికే వస్తుంటారు. రోజుకు సగటున 25 నుంచి 30 కేసులు డెలివరీ కోసం వస్తుంటాయి. వీరిని లక్ష్యంగా చేసుకుని కొందరు సిబ్బంది అదేపనిగా డబ్బులు దండుకుంటున్నారు. వసూళ్లు ఇలా.. ప్రసూతి విభాగంలో ఉదయం, రాత్రి, అత్యవసరమైతే మధ్యాహ్న వేళల్లో ప్రసవం కోసం ఆపరేషన్లు జరుగుతుంటాయి. ఇక్కడ సిబ్బందిలో కొందరు బిడ్డను చూపించిన వెంటనే కాసులు అడుగుతున్నారు. అది కూడా రూ.1000 లేదా రూ.2000 అనుకుంటే పొరబాటే. ఏకంగా రూ.10 వేల నుంచి రూ.30వేల వరకు డిమాండ్ చేస్తున్నారు. గ్రామీణులు, తమిళనాడు వాసులను టార్గెట్ చేసి నిలువు దోపిడీ చేస్తున్నారు. ఆపరేషన్ అయిన వెంటనే బెడ్పైకి మార్చాలని, క్లీనింగ్ పేరు చెప్పి రూ.1000 చొప్పున వసూలు చేస్తున్నారు. పురిటినొప్పులే నయం.. చిత్తూరు ఆస్పత్రికి ప్రసవానికొచ్చే వారికి పురిటినొప్పుల కంటే.. అక్కడ పనిచేసే సిబ్బంది తీరుతో పడే ఇబ్బందులే అధికం అంటే అతిశయోక్తి కాదేమో. వారు అడిగిన డబ్బులిస్తే పని చేస్తారు. లేకుంటే డబ్బు కోసం పీడిస్తారు. ఇచ్చే వరకు దుర్భాషలాడుతారు. ఆ మాత్రం డబ్బులు ఇవ్వలేనివాళ్లు ఎందుకొచ్చారంటూ.. తీవ్రంగా అవమానిస్తారు. డబ్బులిచ్చే వరకు జలగల్లా పట్టుకుంటారు. వారిని అడిగేవారు లేకపోవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ.. ప్రజలను పీల్చి పిప్పిచేస్తున్నారు. ►4 పలమనేరుకు చెందిన కోకిల(19) కాన్పు కోసం తమిళనాడులోని వేలూరులో అరుకంబడి ప్రభుత్వాస్పత్రికి వెళ్లింది. అక్కడ సరైన వసతులు లేకపోవడంతో గతవారం చిత్తూరులోని జిల్లా ఆస్పత్రిలో చేరింది. ఇక్కడ ఆపరేషన్ చేయడంతో ఆడబిడ్డ జన్మించింది. అయితే బిడ్డను చేతిలో పెట్టగానే ఆస్పత్రి సిబ్బంది కోకిల తల్లిని రూ.20 వేలు డిమాండ్ చేశారు. చివరకు రూ.10 వేలు గుంజేశారు. బిడ్డను ఏమైనా చేస్తారేమో అని భయపడి డబ్బు ఇచ్చామని బాధితురాలు కంటతడి పెట్టింది. ►4 తిరుత్తణికి చెందిన అనిత(25) ప్రసవం కోసం జిల్లా ఆస్పత్రిలో చేరి, ఆదివారం డిశ్చార్జ్ అయ్యింది. ఆమె కుటుంబ సభ్యుల వద్ద కూడా సిబ్బంది రూ.10 వేలు లాగేశారు. అడిగినంత ఇస్తేనే.. మీ బిడ్డను బయటకు తెస్తాం అంటూ భయభ్రాంతులకు గురిచేశారు. ఈ మాత్రం ఇవ్వలేని వారు మీకెందుకు బిడ్డలంటూ హేళన చేశారు. బాధితులు చేసేది లేక అప్పుచేసి.. వారికి అడిగినంతా ముట్టజెప్పారు. -
హైటెక్ "కాల్" కేయులు: అంతర్జాతీయ కాల్స్ను లోకల్గా మార్చి..
సాక్షి,తిరుపతి క్రైం: తిరుపతి కేంద్రంగా అంతర్జాతీయ కాల్స్ను లోకల్ కాల్స్గా మార్చి, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల నెట్వర్క్ల ఆదాయానికి గండికొట్టిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం ఈస్ట్ పోలీస్ స్టేషన్లో తిరుమల ఏఎస్పీ మునిరామయ్య, టెలికామ్ సంస్థ సెక్యూరిటీ డైరెక్టర్ జీవీ మనోజ్కుమార్ తెలిపిన వివరాలు..అంతర్జాతీయ కాల్స్ను లోకల్ కాల్స్గా మార్చి కొందరు సంస్థకు నష్టం కలిగిస్తున్నట్లు దృష్టికి రావడంతో ఆంధ్రప్రదేశ్ టెలికం సంస్థ అధికారులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలో దిగిన పోలీస్ అధికారులు లోతుగా దర్యాప్తు చేసేసరికి హైటెక్ ‘కాల్స్’ కేటుగాళ్ల బండారం బట్టబయలైంది. వీరికి టెలికాం సంస్థలో పనిచేస్తున్న కొందరు మార్కెటింగ్ అధికారులు సహకరించినట్లు తేలింది. ఎలా చేశారంటే.. ఫోన్ వినియోగదారులకు తెలియకుండా వందల సంఖ్యలో వారి ఆధార్ కార్డులతో అక్రమంగా సిమ్ కార్డులు పొందారు. ఈకేవైసీ సరిగా పడలేదని ఎన్నోసార్లు వేలిముద్రలు వేయించారు. ఆ తర్వాత ఓటీపీ ద్వారా నగరంలోని కస్టమర్ల నుంచి నాలుగు నుంచి పది వరకు అక్రమంగా సిమ్ కార్డులు పొంది అక్రమాలకు తెరలేపారు. ఇలా పొందిన సిమ్లతో విదేశాల నుంచి +91 ఇన్కమింగ్ లోకల్ కాల్స్ ద్వారా మళ్లించి అధిక ఆదాయం పొందేవారు. దాదాపు ఏడాదిన్నర కాలంగా ఇలా చేస్తుండడంతో బీఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్, వొడాఫోన్, వివిధ ప్రైవేటు సంస్థల సెల్యులర్ నెట్వర్క్ సంస్థల ఆదాయానికే కాకుండా ప్రభుత్వానికి జీఎస్టీ, టాక్స్ల రూపంలో తీవ్రం నష్టం వాటిల్లింది. టెలికం సంస్థ ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు కాల్స్ కూపీ లాగితే డొంక కదిలింది. ఏక కాలంలో వివిధ ప్రాంతాల్లో దాడిచేసి సుమారు 1000 సిమ్ కార్డులు, డిన్స్టార్ గేట్వే 64, సీపీయూ, ల్యాప్టాప్, మొబైల్, ఇతర సాంకేతిక పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరుకు చెందిన కన్నం రవికుమార్, తిరుపతిలో నివసిస్తున్న హరిప్రకా‹Ù, నీలం కిరణ్కుమార్, శేషాఫణి, నారాయణ పార్థసారథి, ఓరుగొండ శ్రీనివాస్ను అరెస్ట్ చేశారు. దీనికంతా వీరే సూత్రధారులని తేలింది. వీరంతా ఎంబీఎ, బీటెక్, డిగ్రీ చదివిన వారే. వీఓఐపీ టెక్నాలజీ సాయంతో వీరు అంతర్జాతీయ కాల్స్ను లోకల్ కాల్స్గా మార్చి వినియోగదారులకు కనెక్టివిటీ ఇచ్చి పెద్దమొత్తంలో ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టినట్లు గుర్తించారు. మరింత లోతుగా దర్యాప్తు ఈ కేసులో ఉగ్రవాదుల ప్రమేయం ఉందా? అనే కోణంలో జాతీయ దర్యాప్తు సంస్థతో సమగ్ర విచారణకు పూనుకుంటున్నారు. నిబంధనలు పాటించని సిమ్ కార్డు డీలర్లు, సంస్థలను గుర్తించి లీగల్ నోటీసులు ఇస్తామని టెలికామ్ సంస్థ సెక్యూరిటీ డైరెక్టర్ జీవీ మనోజ్కుమార్ తెలిపారు. ఈస్ట్ డీఎస్పీ మురళీకృష్ణ, అలిపిరి సీఐ దేవేంద్రకుమార్ పాల్గొన్నారు. -
మేమిద్దరం చనిపోతున్నాం..సెల్ఫీ వీడియో వైరల్..!
సాక్షి,కదిరి: ఓ ప్రేమ జంట బుధవారం కదిరి ప్రాంతంలో ఆత్మహత్యాయత్నం చేసింది. ఇందుకు సంబంధించిన సెల్ఫీ వీడియో సామాజిక మాధ్యమాల్లో పోస్టు కావడంతో అప్రమత్తమైన ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప ఆదేశాల మేరకు కదిరి డీఎస్పీ భవ్యకిశోర్, పోలీసులు వారి ఆచూకీ కనుగొని పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో వారు పురుగుల మందు కలిపిన స్ప్రైట్ బాటిల్ పడేసి, పోలీసులకు చిక్కకుండా పారిపోయారు. సామాజిక మాధ్యమాల్లో ప్రేమజంట పోస్టు చేసిన వివరాలు పోలీసులు వెల్లడించారు. ‘నా పేరు శివప్రత్యూష, నాకు 18 ఏళ్లు. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి గ్రామం. నా ప్రియుడితో కలిసి నేను ఇల్లు వదిలి వచ్చినప్పుడు నాకు 18 ఏళ్లకు రెండు నెలలు తక్కువగా ఉండేది. అప్పుడు మేము పెళ్లి చేసుకోవడానికి నా వయసు అడ్డంకిగా మారింది. అందుకే మా తల్లిదండ్రులు అక్కడ నన్ను ఎవరో కిడ్నాప్ చేశారంటూ కేసు పెట్టినట్లు తెలిసింది. ఇప్పుడు మేము పెళ్లి చేసుకుని ఇంటికి వెళ్లినా మళ్లీ మా తల్లిదండ్రులు మమ్మల్ని విడదీయడం ఖాయం. అందుకే స్ప్రైట్ బాటిల్లో పురుగుల మందు కలుపుకుని తాగేసి చచ్చిపోవాలని డిసైడ్ అయిపోయాం’ అంటూ ఆ యువతి మాట్లాడుతుంటే... ఇరువురూ కనబడే విధంగా ఆ బాటిల్ని పైకెత్తి గుటగుట తాగడం ఆమె ప్రియుడు సెల్ఫీ వీడియో తీసి సామాజిక మా«ధ్యమాల్లో పోస్టు చేశారు. అజ్ఞాతంలో ఉన్న వారి కోసం సీఐ నిరంజన్రెడ్డి, సిబ్బంది గాలిస్తున్నారు. -
నల్లారి కిషోర్కుమార్రెడ్డి : నకిలీ పట్టాలతో నిరుపేదలకు కుచ్చుటోపీ
ఓట్ల కోసం విలువలను వదిలేశారు.. ఇంటి స్థలం కోసం ఆశపడిన నిరుపేదలను నకిలీ పట్టాలతో నయవంచన చేశారు.. పేదలకు ఇచ్చినట్లు చూపిన భూములను టీడీపీ నేతలే కబ్జా చేసుకున్నారు. అడుగులకు మడుగులొత్తే అనుచరులకు మాత్రం రూ.కోట్ల విలువైన స్థలాలు కట్టబెట్టేశారు.. ఇదేమని ప్రశ్నించిన వారికి బురద అంటించేందుకు ప్రయతి్నస్తున్నారు.. వాస్తవాలను తొక్కిపెట్టి గోబెల్స్ ప్రచారానికి తెరతీస్తున్నారు.. టీడీపీ హయాంలో పీలేరు నియోజకవర్గంలో బట్టబయలైన నల్లారి కిషోర్కుమార్రెడ్డి అండ్ కో అవినీతి అక్రమాలను చూసి స్థానికులు నోరెళ్లబెడుతున్నారు. సాక్షి, తిరుపతి: గత టీడీపీ ప్రభుత్వంలో నల్లారి కిషోర్కుమార్రెడ్డి పీలేరు నియోజకవర్గ ఇన్చార్జిగా పెత్తనం చెలాయించారు. అనుచరులతో కలిసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ వందలాది ఎకరాలను ఆక్రమించుకున్నారు. చెరువు, కుంట, కాలువ, పోరంబోకు భూములను యథేచ్ఛగా కబ్జా చేశారు. నిరుపేదలకు పంపిణీ చేయాల్సిన ఇంటి పట్టాలను నల్లారి కిషోర్కుమార్రెడ్డి తన అనుచరులు 500 మందికి కట్టబెట్టారు. అదే సమయంలో నియోజకవర్గంలో సొంత ఇల్లు లేని సుమారు 10వేల మంది నోట్లో మట్టికొట్టారు. ఇంటి స్థలాలు ఇస్తామని ఆశచూపి తన కార్యాలయం చుట్టూ తిప్పించుకున్నారు. అయితే 2019లో సార్వత్రిక ఎన్నికలు సమీపించడంతో కొందరు రెవెన్యూ సిబ్బంది సాయంతో నకిలీ పట్టాలను సృష్టించారు. ఓట్ల కోసం కక్కుర్తి పడి వందలాది మంది పేదలకు పంచి ఈ నకిలీ పట్టాలను పెట్టేశారు. ఈ క్రమంలోనే ఆర్థిక స్థోమత ఉన్న వారి నుంచి రూ.లక్షల్లో సొమ్ము వసూలు చేసుకుని నకిలీ పట్టాలు అంటగట్టేశారు. ఆ పట్టాల్లో ఉన్న సర్వే నంబర్లలో ఉన్న స్థలం పట్టణంలో ఎక్కడా లేకపోవడం గమనార్హం. దీంతో లబి్ధదారులు దిక్కుతోచక లబోదిబోమంటున్నారు. అక్రమాలు వెలుగులోకి.. పీలేరు మండలం బోడుమల్లువారిపల్లె, నాగిరెడ్డి కాలనీ, నాయీబ్రాహ్మణ కాలనీ, జర్నలిస్టు కాలనీ, రజకుల కాలనీ, ఎన్టీఆర్ కాలనీలో సుమారు 200 నకిలీ పట్టాలు బయటపడ్డాయి. తమకు పట్టా ఇచ్చినా స్థలం చూపించలేదని బాధితులు తహసీల్దార్ను కలవడంతో వాస్తవం వెలుగు చూసింది. దీనిపై 22 మంది బాధితులు కోర్టును ఆశ్రయించారు. కేవలం ఆరు కాలనీల్లోనే ఈ స్థాయిలో నకిలీ పట్టాలు ఉంటే, మొత్తం నియోజకవర్గంలో ఇంకెన్ని ఉంటాయోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. టీడీపీ హయాంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని నల్లారి కిషోర్కుమార్రెడ్డి అండ్ కో సాగించిన ఆక్రమణల పర్వంపై గతంలోనే ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నల్లారి భూదందా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుండడంతో తమ్ముళ్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతుండడం గమనార్హం. -
రెండు రోజుల్లో ఇంటికొస్తానని చెప్పి..అంతలోనే!
సాక్షి, కురబలకోట :రెండు రోజుల్లో ఇంటికొస్తానని చెప్పి అనంతలోకాలకు వెళ్లిపోయిన కొడుకును చూసి ఆ తల్లిదండ్రులు తల్ల్లడిల్లిపోయారు. అసలే నిరుపేద కుటుంబం. తల్లిదండ్రులిద్దరూ కూలీలు. తన కొడు కు మాత్రం తమలా కష్టపడకూడదని, ఇంజినీరింగ్ చదివించారు. కోర్సు అయిపోయిందని, త్వరలోనే ఇంటికొస్తానని కొడుకు చెప్పడంతో ఆ పేద తండ్రికి కాస్త ఊరట కలిగింది. అంతలోనే కొడుకు చావు కబురు రావడంతో గుండెలుపగిలేలా రోదించారు. ఈ సంఘటన శుక్రవారం కురబలకోట మండలం అంగళ్లులోని ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో వెలుగుచూసింది. పోలీసుల కథనం మేరకు, కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ మండలం అల్లూరుకు చెందిన రామచంద్రుడు, సావిత్రి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు సంజీవ (21), చిన్న కుమారుడు సతీష్(15). రామచంద్రుడు గౌడౌన్లో హమాలీగా పనిచేస్తున్నారు. సావిత్రి రోజు కూలీ. అయితే, మెరిట్ ప్రాతిపదికన కన్వీనర్ కోటాలో బిటెక్ (మెకానికల్)లో సీటు సాధించిన సంజీవ ప్రస్తుతం ఫైనలియర్ చదువుతున్నాడు. ఐదు రోజుల క్రితం ఫైనలియర్ పరీక్షలు పూర్తయ్యాయి. మిత్రులందరూ ఇళ్లకు బయల్దేరుతున్నా, ఇతను మాత్రం ఒక రోజు హాస్టల్లోనే ఉండి ఇంటికెళతానని చెప్పి అక్కడే ఉన్నాడు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం హోస్టల్లోని తన గదిలో ఫ్యాన్కు ఉరేసుకుని మృతి చెందాడు. సమాచారమందుకున్న పోలీసులు గది తలుపులు పగులగొట్టి మృతదేహాన్ని మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తర లించారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. సంజీవ మొబైల్ను పరిశీలించగా ఎలాంటి ఆధారాలు దొరకలేదని, కుటుంబం నుంచి ఎలాంటి ఒత్తిడి లేదని పోలీసులు తెలిపారు. ప్రేమ వ్యవహారాలు ఉన్నాయేమో అన్న అనుమనాలు వ్యక్తమవుతున్నాయి. అయితే మృతుని చేతులపై రక్తపు మరకలున్నాయని, పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాత వివరాలు వెల్లడిస్తామని రూరల్ సీఐ అశోక్కుమార్, ఎస్ఐ సుకుమార్ తెలిపారు. -
ప్రేమ పేరుతో పెళ్లి: రెండు కిడ్నీలు పాడైపోయాయని...
‘ప్రేమ పేరుతో లొంగదీసుకున్నాడు. 14 ఏళ్లపాటు కలిసి ఉన్నాడు. ఇప్పుడు రెండు కిడ్నీలు పాడైపోయాయని పుట్టింట్లో వదిలేశాడు. ఆఖరు మజిలీలో భార్యగా అంగీకరిస్తే.. సుమంగళిగా వెళ్లాలని ఉంది’ అంటూ ప్రియుడి ఇంటి ఎదుట ఎంబీఏ చదివిన ఓ యువతి ధర్నాకు దిగిన ఘటన మదనపల్లెలోని నీరుగట్టువారిపల్లెలో శుక్రవారం చర్చనీయాంశమైంది. సాక్షి,మదనపల్లె టౌన్: తమిళనాడులోని మదురైకి చెందిన అంబురాజ్ 25 ఏళ్ల క్రితం మదనపల్లెకు వచ్చి స్థిరపడ్డాడు. నీరుగట్టువారిపల్లె గజ్జిలకుంటలో తినుబండారాలు తయారు చేసి, దుకాణాలకు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. తన అక్క కూతురు నదియా ను 2001లో వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు దివ్యంగులున్నారు. ఇదిలావుండగా వ్యాపార అవసరాలకు అదే ప్రాంతంలో గదిని అద్దెకు తీసుకున్నాడు. ఆ ఇంటి యజమాని పెద్ద కూతురు బి.మేఘనను లొంగదీసుకున్నాడు. తరువాత ఉన్నత చదువుల పేరుతో ఇంటి నుంచి బయటకొచ్చిన మేఘన కు కురబలకోట మండలం, అంగళ్లులో ఓ దుకాణం పెట్టించిన అంబురాజ్ అప్పుడప్పుడూ ఆమె వద్దకు వెళ్లి వచ్చేవాడు. అంబురాజ్ ప్రేమ వ్యవహారం మొదటి భార్య నదియాకు తెలియడంతో ఆమె పలుమార్లు ఇద్దరినీ మందలించింది. ఈక్రమంలోనే మేఘనను అంబురాజ్ రిజిస్టర్ వివాహం చేసుకున్నాడు. 14 ఏళ్లు కలిసి ఉన్నా మేఘనకు పిల్లలు కలగలేదు. ఏడాది క్రితం అనారోగ్యం బారిన పడింది. దీంతో ఆమెను పుట్టింట్లో వదిలేశాడు. మేఘనకు కుటుంబ సభ్యులు బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స చేయించగా వైద్యులు రెండు కిడ్నీలు పాడైపోయాయని తేల్చారు. తల్లిదండ్రులు మేఘనను ఇంట్లోనే పెట్టుకుని డయాలసిస్ చేయిస్తున్నారు. తన బిడ్డకు న్యాయం చేయాలని బాధితురాలి తల్లిదండ్రు లు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో అంబురాజ్ ఇంటి ముందు ధర్నాకు దిగారు. తాను భర్త ఇంట్లోనే ఉండి, సుమంగళిగానే మరణిస్తానని మేఘన చెబుతోంది. పోలీసులు ఇరువర్గాలను టూటౌన్ పోలీస్ స్టేషన్కు పిలిపించి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. -
వారి టార్గెట్ యాత్రికులే.. మూడు పార్శిళ్లు ఆరు కర్రీలుగా దందా!
రద్దీ ప్రాంతాల్లోని బేకరీలు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లలో.. ఆకట్టుకునే రంగులతో మసాలాలు దట్టించిన ఆహారం.. నూనెల్లో వేయించిన పదార్థాలు.. చూస్తూనే నోరూరించేలా ఉండే కర్రీలు.. సర్వ సాధారణం. వీటి తయారీలో వాడే కృత్రిమ రంగులు, కల్తీ నూనెలు అత్యంత ప్రమాదకరమని అధికారులు ధ్రువీకరిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్న పలు ఫుడ్ సెంటర్లు, హోటళ్లలో సేకరించిన శాంపిల్స్లో కేన్సర్ కారక పదార్థాలు ఉన్నట్లు తేలడంతో.. ఇవి తింటే రోగాలు తప్పవని ఆహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాక్షి,చిత్తూరు: జిల్లాలో కల్తీ ఆహార పదార్థాలు ప్రజల ప్రాణాలకు ముప్పుగా పరిణమించాయి. ఈ దందా.. రోజురోజుకూ శృతి మించుతుండడంతో జనం రోగాల బారిన పడుతున్నారు. చిత్తూరులోని పాతబస్టాండ్, హైరోడ్డు, కట్టమంచి, తిరుపతిలోని కొత్తబస్టాండ్, లీలామహాల్రోడ్డు, తుడారోడ్డు, పుత్తూరు బస్టాండ్ సమీపంలోని ప్రాంతాలు, మదనపల్లె, పలమనేరు, శ్రీకాళహస్తిలోని కొన్ని కూడళ్లలో జనం రద్దీ అధికంగా ఉంటుంది. ఇక్కడ ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, కర్రీ పాయింట్లు, మాంసాహార ఉత్పత్తులు అధికంగా విక్రయిస్తుంటారు. వీటిలో వినియోగించే పదార్థాలు పలు వ్యాధులకు కారణమవుతున్నాయని అధికారులు గుర్తించారు. జిల్లాలోని 75 హోటల్స్లో అధికారులు ఇటీవల తనిఖీలు నిర్వహించి, ప్రమాదకరమని భావిస్తున్న 17 శాంపిల్స్ను సేకరించి పరీక్షలకు పంపారు. వీటిలో 6 శాంపిల్స్ వినియోగానికి ఏమాత్రం తగవని తేలింది. అయినా ఈ కల్తీఫుడ్ దందా మాత్రం యథేచ్ఛగా సాగుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. యాత్రికులే టార్గెట్.. జిల్లాలో ఆలయాలు ఎక్కువగా ఉండడంతో నిత్యం లక్షలాది మంది యాత్రికులు ఇక్కడికి వస్తుంటారు. తిరుపతి, తిరుచానూరు, కాణిపాకం, బోయకొండ, శ్రీకాళహస్తి వంటి రద్దీ ప్రాంతాల్లో ఫుడ్సెంటర్ల వ్యాపారం మూడు పార్శిళ్లు.. ఆరు కర్రీలు అన్న తరహాలో సాగుతోంది. దీనికితోడూ మాసం భోజన ప్రియులు గతంలో కంటే పెరగడంతో హోటల్స్, డాబా, ఫాస్ట్ఫుడ్, స్నాక్స్, బిర్యానీ దుకాణాలు ఇబ్బడిముబ్బడిగా వెలుస్తున్నాయి. లైసెన్సులుండవు ఆహార పదార్థాలు తయారుచేసేవారు, నిల్వ చేసే వ్యాపారులు, రవాణా చేసే సంస్థలు తప్పనిసరిగా లైసెన్స్లు పొందాలి. ఆహార భద్రతా నియామావళి ప్రకారం లైసెన్సులు లేకుండా వ్యాపారం చేస్తే చట్టప్రకారం కేసులు నమోదు చేసి రూ.5 లక్షల జరిమానా, 6 నెలల జైలు శిక్ష విధిస్తారు. జిల్లా వ్యాప్తంగా లైసెన్స్ ఉన్న హోటళ్లు: 73, రెస్టారెంట్లు–395, క్యాంటీన్లు–98, డాబా లేదా ఫుడ్ వెండింగ్స్–56 మాత్రమే లైసెన్సులు కలిగి ఉన్నాయంటే అతిశయోక్తికాదు. వీటికి రెట్టింపు సంఖ్యలో దుకాణాలకు ఎలాంటి అనుమతులు లేవు. ప్రధాన సమస్య ఇదే.. ముఖ్యంగా మాంసాహార పదార్థాలు విక్రయింటే దుకాణాలు, బేకరీ, స్వీట్స్ తయారీలో ఎసెన్స్ సింథటిక్ రంగులు అధికంగా వినియోగిస్తుండడంతో కేన్సర్ బారిన పడే అవకాశం ఉందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. వీటికితోడు హోటల్స్లో చికెన్, మటన్, రొయ్యలు ఎక్కువ రోజులు డీప్ఫ్రిజ్లో ఉంచి వాడుతున్నారు. ఇవి వినియోగదారుల శరీరాలను దారుణంగా దెబ్బతీస్తున్నాయి. ముఖ్యంగా జీర్ణకోశ సంబంధ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. -
నల్లారి వారి ‘భూ మాయ’.. అక్రమాలకు లెక్కేలేదు!
సాక్షి ప్రతినిధి, తిరుపతి: గత తెలుగుదేశం ప్రభుత్వ ఐదేళ్ల హయాంలో అధికారం దన్నుతో మాజీ ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి సోదరుడు, పీలేరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ నల్లారి కిషోర్ కుమార్రెడ్డి భూదందాలకు లెక్కలేకుండా పోయింది. ఆయన అనుచరులు చెట్టు, పుట్ట, గుట్ట, వాగు, వంక, దేవుడిమాన్యం అనే తేడా లేకుండా ఏది కంటికి కనబడితే అది బినామీ పేర్లతో స్వాహా చేసేశారు. పీలేరు పట్టణంతో పాటు బోడుమల్లువారిపల్లె, ముడుపులవేముల, గూడరేవుపల్లె, యర్రగుంటపల్లె, దొడ్డిపల్లె, వేపులబైలు పంచాయతీలలో ప్రభుత్వ భూములు టీడీపీ నేతల పరమయ్యాయి. ► అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అసెంబ్లీలోనే నేరుగా పీలేరులో జరుగుతున్న భూదందా లను ప్రస్తావించారు. ఎకరాలకు ఎకరాల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నాయని అసెంబ్లీ దృష్టికి తీసుకువచ్చి నిరసన వ్యక్తం చేశారు. దీనిపై అప్పట్లో అసెంబ్లీలో అధికారపక్షం సమాధానమిస్తూ కేవలం ఏడెకరాల భూమి మాత్రమే ఆక్రమణకు గురైందని స్పష్టం చేసింది. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు తీసిన పక్కా లెక్కల్లో వందల ఎకరాల భూములు ఆక్రమణల చెర నుంచి బయటపడ్డాయి. వాటిల్లో కొన్ని భూములను పేదల ఇళ్లకు ప్రభుత్వం కేటాయించింది. అదే ఇప్పుడు టీడీడీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. దీంతో నల్లారి బ్యాచ్ ఎదురుదాడికి దిగుతోంది. కానీ వాస్తవాలు ఇలా ఉన్నాయి. ► పీలేరు మండలం గూడరేవుపల్లె సర్వేనంబరు 198 లో 106.86 ఎకరాల ప్రభుత్వ గయాలు భూమి గతంలో ఆక్రమణకు గురైంది. అక్కడ ఎకరం కోటి రూపాయలపైనే ఉంటుందని అంచనా. ఇప్పుడు ఆ భూమి మొత్తం ప్రభుత్వం స్వాధీనం చేసుకుని జగనన్న కాలనీలకు కేటాయించింది. ► పీలేరు మండలం బోడుమల్లువారిపల్లె పంచాయతీలో సర్వే నంబర్ 906లో 23ఎకరాలు, సర్వేనంబరు 908లో 10.14ఎకరాలు, 909/2లో 96సెంట్ల భూమి అన్యాక్రాంతమైంది. ప్రస్తుత ప్రభుత్వం వీటిల్లో కూడా చాలా వరకు ఆక్రమణలు తొలగించింది. ఇంకా ఇప్పటికీ నల్లారి అండ్ కో ఆదీనంలోనే.. ► పీలేరు మండలం దొడ్డిపల్లె, కాకులారంపల్లె గ్రామ రెవెన్యూ పరిధిలో గతంలో ఇందిరమ్మ గృహాల కోసం సుమారు 90ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. అందులో 2,322 ప్లాట్లు ఏర్పాటు చేశారు. అయితే 1,750మందికి మాత్రమే ఇచ్చి మిగిలిన 572 పట్టాలు, 6.80ఎకరాల భూమిని ఇప్పటికీ టీడీపీ నేతలు తమ ఆధీనంలోనే ఉంచుకున్నారు. అదేవిధంగా సర్వేనంబరు 1136/1లో 10.32ఎకరాల ప్రభుత్వ భూమి నల్లారి అనుచరుల ఆక్రమణలో ఉందని అక్కడ ఎవరినడిగినా చెబుతారు. ► పీలేరు పట్టణంలోని బోడుమల్లువారిపల్లి, నాగిరెడ్డి కాలనీ, నాయీబ్రాహ్మణ కాలనీల్లో అప్పట్లో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అండతో ప్రభుత్వ భూమికి నకిలీ పట్టాలు సృష్టించి అమ్ముకున్న సంగతి అందరికీ తెలిసిందే. ►అప్పట్లో అసైన్మెంట్ ఆమోదం లేకుండానే పీలేరు మండలంలో డీకేటీ పట్టాలను సొంతం చేసుకున్నారు. నిబంధనల ప్రకారం డీకేటీ పట్టాలు జారీ చేస్తే అందుకు సంబంధించిన వివరాలను ఏ రిజిష్టరులో నమోదు చేయాలి. అయితే ఇందుకు భిన్నంగా అడ్డగోలుగా డీకేటీ భూములు పంచేసుకున్నారు. ► అదే విధంగా అప్పట్లో కలికిరిలో సర్వే నంబర్ 547–ఎ, 549 –2ఎ పరిధిలో పంచాయతీ అనుమతులు లేకుండానే లే అవుట్లు వేసి విక్రయించి సొమ్ముచేసుకున్నారు. -
ప్రభుత్వ శాఖల్లో అద్దెకు సొంత వాహనాలు..
ఉన్నతమైన ఉద్యోగం.. రూ.లక్షల్లో వేతనం.. అయినప్పటికీ కాసులకు కక్కుర్తి పడుతున్నారు. గౌరవప్రదమైన హోదాలో ఉంటున్నా అదనపు ఆదాయం కోసం ఆశపడుతున్నారు. ప్రభుత్వం కల్పించిన వాహన సౌకర్యాన్ని కొందరు అధికారులు దుర్వినియోగం చేస్తున్నారు. సొంత వాహనాలనే అద్దెకు తీసుకుని సొమ్ము చేసుకుంటున్నారు. నకిలీ బిల్లులు పెట్టి ప్రజాధనాన్ని జేబులో వేసుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా పలుశాఖల్లో సాగుతున్న ‘అద్దె’ బాగోతంపై సాక్షి ప్రత్యేక కథనం. సాక్షి,చిత్తూరు: జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో ఏళ్ల తరబడి అద్దె వాహనాల దందా సాగుతోంది. ట్రెజరీ, రెవెన్యూ, ఎంపీడీఓలు, విద్యా శాఖ, పంచాయతీరాజ్ ఇంజినీర్లు, హౌసింగ్, మున్సిపల్ అధికారులు.. ఇతర శాఖల్లో సొంత కార్లను వినియోగిస్తూ ప్రతి నెలా బిల్లులు పెట్టి సొమ్ము చేసుకుంటున్నారు. పలు కార్యాలయాల ఉన్నతాధికారులకు ప్రభుత్వం వాహన సౌకర్యం కల్పించింది. ప్రజాసేవ నిమిత్తం క్షేత్రస్థాయిలో పర్యటించేందుకు అవసరమైతే వాహనాలను అద్దెకు తీసుకునే వెసులుబాటు ఇచ్చింది. నిబంధనల ప్రకారం జిల్లాస్థాయి అధికారి వాహనానికి నెలకు రూ.45వేలు, మండలస్థాయి అధికారి అయితే రూ.35వేలు అద్దె చెల్లిస్తోంది. నిరుద్యోగులకు బ్యాంకు రుణాలు, కార్పొరేషన్ల కింద సబ్సిడీపై ఓనర్ కమ్ డ్రైవర్స్కీం ప్రవేశపెట్టి ఉపాధి కల్పించాలనే ప్రభుత్వ లక్ష్యానికి పలువురు ఉన్నతాధికారులు తూట్లు పొడుస్తున్నారు. తమ సొంత వాహనాలను వారు పనిచేస్తున్న శాఖలోనే అద్దెకు వినియోగిస్తున్నారు. మరికొందరు బినామీ పేర్లతో బిల్లులు పెట్టి అద్దెను జేబుల్లోకి వేసుకుంటున్నారు. నకిలీ బిల్లులు! కొందరు అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లకుండానే నకిలీ బిల్లులు పెడుతున్నారు. తమకు కేటాయించిన వాహనంలో నెలకు 2,500 కిలోమీటర్లు తిరగాల్సి ఉంది. అన్ని కిలోమీటర్లు తిరగకపోయినా నకిలీ బిల్లులు పెట్టి ప్రతి నెలా అద్దె పేరుతో ప్రజల సొమ్మును కాజేస్తున్నారు. ఏళ్ల తరబడి గుట్టుగా దందా సాగిస్తున్నారు. ఉపాధికి గండి జిల్లా వ్యాప్తంగా దాదాపు 85 ప్రభుత్వ శాఖలున్నాయి. అందులో సగానికి పైగా శాఖల్లోని అధికారులు వైట్బోర్డు వాహనాలను వినియోగిస్తుండడం గమనార్హం. అదే ఎల్లోబోర్డు వాహనాలను అద్దెకు తీసుకుంటే పలువురికి ఉపాధి కల్పించినట్లు అవుతుంది. ఒకవేళ ఎవరైనా తమ వాహనాన్ని అద్దెకు పెడితే సంబంధిత బిల్లుల మంజూరుకు చుక్కలు చూపిస్తున్నారు. -
కడ చూపునకు వెళ్లొస్తూ.. కానరాని లోకాలకు
సాక్షి, తిరుపతి: బంధువుల చావుకు వెళ్లి వస్తున్న దంపతులు రోడ్డు ప్రమాదంలో కానరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ ఘటన తిరుపతి–చంద్రగిరి మార్గంలోని సి.మల్లవరం క్రాస్ వద్ద బుధవారం చోటు చేసుకుంది. ఎమ్మార్పల్లి ఇన్చార్జి సీఐ ప్రవీణ్కుమార్ కథనం మేరకు తిరుపతి దేవేంద్ర థియేటర్ సమీపంలోని శివాలయం వీధిలో జగన్నాథం(44), నాగజ్యోతి (32) దంపతులు నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు ఆడపిల్లలున్నారు. జగన్నాథం చికెన్షాపులో పనిచేస్తున్నాడు. నెత్తకుప్పంలో బంధువు మృతి చెందడంతో కడ చూపునకు వెళ్లి తిరిగి ద్విచక్రవాహనంపై వస్తుండగా, సి.మల్లవరం క్రాస్ వద్ద తిరుపతి నుంచి చంద్రగిరి వెళుతున్న బొలెరో వాహనం ఢీకొంది. ప్రమాదంలో దంపతులిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సాయంతో 108 ద్వారా తిరుపతి రుయాకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరూ మృతి చెందారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. -
చంద్రగిరిలో టీడీపీ ఇసుక దందా..
సాక్షి,చంద్రగిరి: మండలంలో టీడీపీ నాయకులు ఇసుక దందా కొనసాగిస్తున్నారు. చంద్రబాబు హయాం నుంచి అలవాటైన అక్రమ రవాణా నేటికీ కొనసాగుతోంది. స్థానికులెవరైనా ఫిర్యాదు చేస్తే వారిపై దాడులకు తెగబడుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. చంద్రబాబు సొంత పంచాయతీ కందులవారిపల్లి కేంద్రంగా టీడీపీ మాఫియా ఏర్పాటైంది. శేషాపురానికి చెందిన టీడీపీ నాయకులు, నారావారిపల్లికి చెందిన చంద్రబాబు బంధువుతో కలసి, బుధవారం రాత్రి నుంచి బీమానదిలో ఇసుక తవ్వకం మొదలుపెట్టారు. రెండు జేసీబీలు, పది ట్రాక్టర్లను ఉపయోగించి కందులవారిపల్లి నుంచి పులిచెర్లకు ఇసుకను తరలిస్తున్నారు. మరికొన్ని ట్రాక్టర్ల ద్వారా ఇసుకను కొత్తపేటకు తరలిస్తున్నారు. ట్రాక్టర్ ఇసుకను రూ.5 వేలు చొప్పున విక్రయిస్తున్నారు. వాగులు, వంకల్లో ఇసుక ఖాళీ భీమా నది పరిసర ప్రాంతాల్లోని వంకలు, వాగుల్లో ఇప్పటికే ఇసుకను తోడేశారు. దీంతో సమీప బావులు, బోర్లలో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. పంటల సాగుకు నీరందడం లేదని రైతులు వాపోతున్నారు. అక్రమ రవాణాదారులపై ఫిర్యాదు చేస్తే దౌర్జన్యాలు, దాడులు చేస్తున్నారన్న భయంతో వెనకడుగు వేస్తున్నారు. నాలుగు రోజుల నుంచి యథేచ్ఛగా ఇసుక రవాణా సాగుతుండడం గమనార్హం. పట్టించుకోని యంత్రాంగం అక్రమ ఇసుక రవాణాపై సమాచారం ఉన్నప్పటికీ అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. స్థానికంగా ఉండే వీఆర్ఓ, వీఆర్ఏలతో పాటు గ్రామ పోలీసులు సైతం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అధికారుల్లో కొందరు గుట్టుగా అక్రమ రవాణాదారులకు సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. డీఎస్పీ ఆదేశాలు బేఖాతర్ ఇసుక అక్రమ రవాణాపై సమాచారం అందుకున్న డీఎస్పీ నరసప్ప బుధవారం రాత్రి స్థానిక పోలీసులను అప్రమత్తం చేశారు. వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లి ఇసుక తవ్వుతున్న వాహనాలను సీజ్ చేయాలని చెప్పారు. అయితే డీఎస్పీ ఆదేశాలు బేఖాతర్ చేస్తూ నిమిషాల వ్యవధిలో ఇసుక స్మగ్లర్లకు సమాచారం అందించారు. హుటాహుటిన బీమానది నుంచి జేసీబీలు, ట్రాక్టర్లను మళ్లించేశారు. వారు వెళ్లిన తర్వాత రంగంలోకి దిగిన పోలీసులు, అక్కడ ఏమీ లేదంటూ చేతులు దులుపుకుని వెనుదిరగడం కొసమెరుపు. -
కబ్జాల పర్వం పరాకాష్టకు.. శ్మశానాన్నీ వదల్లేదు
సాక్షి,తిరుపతి: అమరరాజా ఫ్యాక్టరీల నుంచి వచ్చే విషవాయువులు, జల కాలుష్యంపై సదరు యాజమాన్యం నిర్లక్ష్యం పరాకాష్టకు చేరుతోంది. దీనిపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం హైకోర్టే ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అమరరాజా ఫ్యాక్టరీలో లెడ్ శాతం, ఇతర కాలుష్యం ప్రమాదకరంగా ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి తోపాటు హైదరాబాద్లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఈపీటీఆర్ఐ) నివేదిక స్పష్టం చేసిన విషయాన్ని హైకోర్టు ప్రస్తావిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇలా స్వయంగా ప్రభుత్వంతో పాటు హైకోర్టు కూడా కంపెనీ తీరుపై తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేసినప్పటికీ జిల్లాకు చెందిన కొంతమంది అధికారులు మాత్రం నిబంధనల మేరకు ఆయా ఫ్యాక్టరీల జోలికి వెళ్లేందుకు కూడా సాహసించడం లేదు. ఫ్యాక్టరీలకు వెళ్లడం మాట అటుంచి.. కనీసం సదరు ఫ్యాక్టరీల గురించి మాట్లాడేందుకు కూడా ముందుకు రాకపోవడం గమనార్హం. అధికారుల మూగనోము దాదాపు ఎనిమిది ఎకరాల అటవీశాఖ భూములను కైంకర్యం చేసి ఫ్యాక్టరీ ప్రాంగణంలోకి కలిపేసుకుని ప్రహరీ గోడ కట్టుకున్న వైనంపై ఫారెస్ట్ అధికారులు బహిరంగంగా మాట్లాడేందుకు నిరాకరించారు. ఓ అధికారిని అడిగితే పై అధికారిని అడగమని.. ఆయన్ని అడిగితే ఈయన్ని అడగమని ఇలా కనీస సమాచారం చెప్పేందుకు కూడా ప్రయాసపడ్డారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (పీసీబీ) అధికారులు కూడా అదేమాదిరిగానే వ్యవహరిస్తున్నారు. ఫ్యాక్టరీ కాలుష్యంపై ఉన్నతాధికారులు ఏకంగా హైకోర్టును ఆశ్రయించగా.. ఇక్కడ కొంతమంది అధికారులు మాత్రం చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. ఎన్విరాన్మెంటల్ ఆడిటింగ్తో కాలుష్యపు శాతం ఎంత ఉందో విచారించేందుకు ప్రభుత్వం తరఫున ఈ నెల 3వ తేదీన వచ్చిన చెన్నై ఐఐటీ నిపుణులతో పాటు పీసీబీ అధికారులను కంపెనీ యాజమాన్యం లోపలికి రానీయకుండా అడ్డుకుంటే... కేసు పెట్టేందుకు 16వ తేదీ వరకు పోలీసులను ఆశ్రయించడానికి ఆలోచించారంటేనే అసలు విషయం అర్థం చేసుకోవచ్చు. ఇక పోలీసులూ తక్కువేం కాదు.. ప్రభుత్వ అధికారులను అడ్డుకుని విధులకు ఆటంకం కలిగిస్తే.. చాలా సీరియస్గా స్పందించి బలమైన కేసులు పెడతారు. కానీ సదరు ఫ్యాక్టరీ అధికారిపై మాత్రం కేవలం స్టేషన్ బెయిల్ వచ్చే కేసు పెట్టారంటేనే ఖాకీల సీరియస్నెస్ అర్థమవుతోంది. రెవెన్యూ అధికారులు కూడా ఇదే గాటన ఉన్నారనే చెప్పాలి. అక్కడి భూముల స్థితి, చెరువుల పరిస్థితి గురించి ఇన్నాళ్లూ కనీసం ఆరా తీయలేదంటేనే .. అటువైపు కన్నెత్తి చూడని నిర్వాకం బయటపడుతోంది. శ్మశానాన్నీ వదల్లేదు అమరరాజా ఫ్యాక్టరీ చుట్టుపక్కల చెరువులు, అటవీభూములు, స్థలాలు.. పొలాలు మింగేసిన అమరరాజా ఫ్యాక్టరీల యాజమాన్యం చివరికి శ్మశానాన్ని కూడా వదల్లేదు.. ఫ్యాక్టరీ గేటు ఎదురుగా ఉన్న రెండున్నర ఎకరాల శ్మశాన వాటిక భూములను కూడా కబ్జా చేసింది. కంపెనీ లారీల పార్కింగ్కు వాడుకుంటోంది. అమరరాజా కబ్జాల పర్వం పరాకాష్టకు ఇంతకు మించి చెప్పేదేముంది..? గళం విప్పుతున్న స్థానికులు అధికారులే సదరు కంపెనీ అన్యాయా లు, అక్రమాలపై చూసీచూడనట్టు వ్యవహరిస్తుంటే.. ఇక అక్కడి సామాన్య ప్రజలు, ఆయా కంపెనీల్లో పనిచేసే కా ర్మికుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ‘అంత పెద్దపెద్ద వాళ్లే ఏమీ మాట్లాడడం లేదు.. మనకెందుకొచ్చిన గొడవ’ అని చాలామంది ఫ్యాక్టరీ ప్రస్తావనే ఎత్తడం లేదు. ప్రాణాల మీదకు వస్తున్నా సరే.. ఉన్నంతకాలంగా అలానే ఉందాం.. అని రాజీపడే ధోరణే చాలామందిలో కనిపిస్తోంది. అయితే కొంతమంది గ్రామస్తులు మాత్రం ఇప్పుడిప్పుడే తమ వాదనలను బలంగా వినిపిస్తున్నారు. తారకరామానగర్కు చెందిన కార్పెంట ర్ ప్రసాద్, పదో తరగతి చదువుతున్న పూజ, గతంలో కంపెనీలో పనిచేసి మానివేసిన కేఈ చలపతి, అక్కడే 13 ఏళ్లుగా నివసిస్తున్న మహిళ లోకేశ్వరీరెడ్డి .. ఇలా చాలామంది కంపెనీ వెదజల్లుతున్న కాలుష్యంపై కొద్దిరోజులుగా గళం విప్పుతున్నారు. భూగర్భజలాల కాలుష్యం, విషవాయువులతో అంతుచిక్కని రోగాలపాలవుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
విషం పీల్చుతూ.. తాగుతూ..
సాక్షి ప్రతినిధి, తిరుపతి: రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీలో ఉన్న అమరరాజా పవర్ సిస్టం లిమిటెడ్, అమరరాజా బ్యాటరీస్ ఇండస్ట్రీస్, మంగళ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్లు అక్కడి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. ఆయా కర్మాగారాల నుంచి వెలువడుతున్న కాలుష్యం ధాటికి చుట్టుపక్కల గ్రామాలు బలిపీఠంపై ఉన్నాయి. వాస్తవానికి ఆ ఫ్యాక్టరీలు శుద్ధి చేసిన నీటిని వాడాలి. కానీ అమరరాజా ఫ్యాక్టరీస్ శుద్ధి చేసిన నీటిని కాకుండా పలుమార్లు ప్రాసెస్ చేసిన నీటిని అక్కడే మొక్కలకు వదిలేస్తున్నారు. వాస్తవానికి ఆ నీటిని దూరంగా సముద్రంలోకి తీసుకువెళ్లి వదిలేయాలి. కానీ అక్కడే వదిలేయడంతో అవి ఇంకిపోయి మొత్తం భూగర్భజలాలన్నీ పాడవుతున్నాయి. ఇక ఆయా ఫ్యాక్టరీల నుంచి వచ్చే సీసం గాఢత తీవ్రంగా ఉంది. ఏ స్థాయిలో ఉందంటే కార్మికులు వేసుకునే దుస్తులపైనే కాదు.. కార్మికుల రక్తంలోనూ ఉంది. 20 శాతం ఉద్యోగుల రక్తంలో సీసం శాతం ఆందోళనకర స్థాయిలో ఉందని పరీక్షల్లో తేలింది. నిబంధనల ప్రకారం ఆయా ఫ్యాక్టరీల్లో పనికి వెళ్లే కార్మికులు ప్రత్యేక యూనిఫాం ధరించాలి. విధులు ముగించుకుని ఫ్యాక్టరీ నుంచి బయటకు వచ్చే ముందు ఆ యూనిఫాం తీసివేసి,.. వేరే దుస్తులు వేసుకోవాలి. కానీ సదరు ఫ్యాక్టరీల యాజమాన్యం ఎక్కడా ఇలాంటి ఏర్పాటు చేయలేదు... ఫలితంగా కార్మికుల ప్రాణాలకు అక్కడ భద్రత లేకుండా ఉంది.’’ అని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) అధికారులు ఆందోళన వక్తం చేస్తున్నారు.. ‘అమరరాజా లెడ్తో అంతులేని వ్యధ’ శీర్షికన శుక్రవారం ‘సాక్షి’లో వచ్చిన కథనంపై పీసీబీ అధికారులు స్పందిస్తూ... నిజంగానే అక్కడి పరిస్థితి అదుపుతప్పుతోంది.. కానీ యాజమాన్యానికి చీమ కుట్టినట్టు కూడా లేదు.. అని వ్యాఖ్యానించారు. ఫ్యాక్టరీల నుంచి వచ్చే సీసం గాఢతకు చుట్టుపక్కల ఉన్న నాలుగు చెరువులూ కాలుష్యకాసారంలా మారాయని చెప్పుకొచ్చారు. టీడీపీ హయాంలో పీసీబీ తనిఖీలే లేవట గత టీడీపీ ఐదేళ్ల హయాంలో గానీ, అంతకుముందు నాలుగేళ్లలో గానీ మొత్తంగా తొమ్మిదేళ్ల కాలంలో అమరరాజా ఫ్యాక్టరీస్లో ఏనాడూ పీసీబీ తనిఖీలు చేసిన దాఖలాలే లేవని స్వయంగా సదరు అధికారులే చెప్పుకొస్తున్నారు. అప్పట్లో ఎప్పుడైనా మొక్కుబడిగా పీసీబీ అధికారులు వెళ్లి రావడం తప్పించి తనిఖీలు, దాడులు, విచారణల ప్రసక్తే లేదని గుర్తు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ రెండేళ్లలోనే కాలుష్య నియంత్రణ మండలి అధికారులు పలుమార్లు తనిఖీలు చేయడం వల్లనే వాస్తవాలు బయటికొచ్చాయని చెప్పుకొచ్చారు. అక్కడ కాలుష్య నివారణ ప్రమాణాలు కనీసంగా పాటించడం లేదని తేలిందన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చే వరకూ అక్కడ రోడ్లు కూడా లేవు వాస్తవానికి ఎక్కడ ఫ్యాక్టరీలు నెలకొల్పినా.. ఆయా చుట్టుపక్కల ప్రాంతాల అభివృద్ధికి సదరు ఫ్యాక్టరీల యాజమాన్యాలు కృషి చేస్తుంటాయి. ఇక ఫ్యాక్టరీల కాలుష్యపు దుష్ప్రభావంతో కునారిల్లే గ్రామాలకు ఇంకెంత ఖర్చు చేస్తారో చెప్పనక్కర లేదు. కానీ ఇక్కడ అమరరాజా ఫ్యాక్టరీ .. గేటు పక్కనే ఉన్న తారకరామానగర్ గ్రామం గురించే కనీసంగా పట్టించుకోలేదు. పైగా ఓ దశలో ఆ ఊరి ప్రజలను తమ ఫ్యాక్టరీ మీదుగా నడవొద్దని హుకుం జారీచేశారు. దీన్ని నిరసిస్తూ గ్రామస్తులు ఆందోళన చేపట్టడంతో ఎట్టకేలకు దారి ఇచ్చారు. ఆ ఊరిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే వరకు సిమెంట్ రోడ్డు లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వైఎస్సార్సీపీ పాలన వచ్చిన తర్వాతే మా గ్రామంలోకి సిమెంట్ రోడ్లు వచ్చాయని స్థానికంగా నివసిస్తున్న ఫొటోగ్రాఫర్ శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. రెండు వారాల్లో ఏం చేస్తారో చూడాలి ‘అమరరాజా ఫ్యాక్టరీల కాలుష్యం, అందులోని లెడ్ శాతంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.. కాలుష్య నివారణ చర్యలకు ఉన్నత న్యాయస్థానం రెండు వారాల గడువిచ్చింది. ఈ లోగా సదరు యాజమాన్యం ఏం చేస్తుందో చూడాలి...’ అని పీసీబీ జాయింట్ చీఫ్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ కె.వెంకటేశ్వరరావు శుక్రవారం సాక్షి ప్రతినిధితో మాట్లాడుతూ చెప్పారు. ఈ లోగా తమ పీసీబీ తరఫున ఓ కమిటీ అక్కడ పరిస్థితులపై మరోసారి క్షుణ్ణంగా పరిశీలన చేస్తుందన్నారు. – పీసీబీ జేసీఈఈ వెంకటేశ్వరరావు -
అమరరాజా లెడ్తో.. అంతులేని వ్యథ
సాక్షి ప్రతినిధి, తిరుపతి: సరిగ్గా తిరుపతి పట్టణానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న కరకంబాడి పంచాయతీలో 1985లో తొలిసారిగా అమరరాజా పవర్ సిస్టం లిమిటెడ్ను నెలకొల్పిన యాజమాన్యం.. తర్వాతి కాలంలో అమరరాజా బ్యాటరీస్ ఇండస్ట్రీస్, మంగళ్ ఇండ్రస్టీస్ లిమిటెడ్ను నెలకొల్పి వ్యాపార సామ్రాజ్యాన్ని భారీగా విస్తరించుకుంది. ఇదంతా బాగానే ఉన్నా.. సదరు ఫ్యాక్టరీల నుంచి వచ్చే విషవాయువులు, జల కాలుష్యం గురించి కనీస మాత్రంగా కూడా పట్టని యాజమాన్య నిర్లక్ష్య ధోరణే ఇప్పుడు తీవ్ర వివాదాస్పదమవుతోంది. స్వయంగా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం హైకోర్టే తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఫ్యాక్టరీలో లెడ్, ఇతర కాలుష్యం ప్రమాదకర స్థాయిలో ఉన్నందున దానిని మూసి వేయాలన్న రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాలపై దాఖలైన పిటిషన్ను హైకోర్టు ఈమధ్యనే విచారించింది. అమరరాజా ఫ్యాక్టరీలో లెడ్ శాతం ప్రమాదకరంగా ఉందని కాలుష్య నియంత్రణ మండలితోపాటు హైదరాబాద్లోని కేంద్రప్రభుత్వ సంస్థ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఈపీటీఆర్ఐ) నివేదిక స్పష్టం చేసిన విషయాన్ని హైకోర్టు ప్రముఖంగా ప్రస్తావించింది. ఇకనైనా కాలుష్యశాతం తగ్గించకుంటే ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని హైకోర్టు యాజమాన్యాన్ని హెచ్చరించింది. హైకోర్టుతో సహా ఎన్ని సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేసినా.. అమరరాజా ఫ్యాక్టరీస్ యాజమాన్యానికి చీమకుట్టినట్టు కూడా లేదని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారంటే వాస్తవ పరిస్థితి అవగతమవుతోంది.ఆ ఫ్యాక్టరీల నుంచి వెలువడే వ్యర్ధాలను దూరప్రాంతాలకు తీసుకువెళ్లి విడిచిపెట్టకుండా చుట్టుపక్కల ఊళ్లలోకి వదిలేయడంతోనే అనర్థాలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. యాసిడ్, కెమికల్స్ను అక్కడే భూగర్భంలో వదిలేయడంతో భూగర్భజలాలు మొత్తం కలుషి తమైపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలుష్య రక్కసి ఫలితంగా గ్రామస్తుల్లో చాలామందికి ఒళ్లంతా దురదలు, చర్మవ్యాధులు.. గుళ్లలు, బొబ్బలు, ఆయింట్మెంట్ వాడినా పోని మచ్చలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు. ఇదే విషయమై తారకరామానగర్కే చెందిన శ్రీనివాసాచారి ‘సాక్షి’తో మాట్లాడుతూ ఫ్యాక్టరీ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వేలాదిమంది గ్రామస్తుల ప్రాణాలంటే యాజమాన్యానికి లెక్కేలేదని వ్యాఖ్యానించారు. ఆర్థిక దన్నుతో వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ ఇన్నాళ్లూ కాలుష్య శాతం కూడా ఎవరికీ తెలియనివ్వకుండా దాచేశారని ఆరోపించారు. ఇదే ప్రాంతానికి చెందిన మహిళ నాగరత్నమ్మ మాట్లాడుతూ బోరు నీళ్లలో చిలుము వాసన వస్తుందని చెప్పుకొచ్చారు. నీళ్లను వేడి చేస్తే పాత్ర కింద తెల్లగా మడ్డి పేరుకుపోతోందని వాపోయారు. రెండు చెరువులు మాయం ఫ్యాక్టరీ నుంచి వెలువడే కాలుష్యపు భూతంతో గ్రామస్తులు అల్లాడిపోతుంటే... మరోవైపు ఊళ్లలో ఉన్న చెరువులను సైతం మింగేసిన అమరరాజా యాజమాన్యం దందాలతో అక్కడి ప్రజలకు నీటిసౌకర్యం కూడా కరువైంది. తారకరామానగర్లోని 137 సర్వే నెంబర్లోని 28 ఎకరాల చెరువును చెరబట్టేసిన అమరరాజా ఫ్యాక్టరీ.. మరో నాలుగు ఎకరాల చెరువును పూర్తిగా ధ్వంసం చేసేసింది. చెరువు రూపు రేఖలు మార్చేసి రోడ్లు వేసేసింది. మంచినీటి కోసం బోరింగ్ వద్ద వృథాప్రయాస పడుతున్న ఈమె పేరు కల్పన.. గృహిణి, తారకరామానగర్ వాసి.. ఊరిలో ఇలాంటి బోర్లు చాలానే ఉన్నా ఎక్కడా మంచినీరు రాదు.. ఊరి చివర సుందరయ్యనగర్ సమీపాన ఉన్న ఈ బోరు నీరు చూస్తే పొరబాటున కూడా అవి తాగాలని అనిపించవు. ఎరుపు రంగుతో కూడిన కాలుష్యపు ధార అది. -
ఢీకొట్టి పారిపోయిన డ్రైవర్ : పట్టించిన పెన్ క్యాప్
సాక్షి,చిత్తూరు(ఎర్రావారిపాళెం): ట్రాక్టర్ను బైక్ ఢీకొన్న ఘటనతో భయపడి పరారైన ట్రాక్టర్ డ్రైవర్ను పెన్క్యాప్ పట్టించింది. కేసును ఎస్ఐ వెంకటమోహన్ గంటలో ఛేదించారు. వివరాలు.. మండలంలోని ఆవులయ్యగారిపల్లెకు చెందిన గురవయ్య దామలచెరువులో ట్రాక్టర్ మామిడికాయలు దించి ఇంటికి తిరుగు పయనమయ్యాడు. నెరబైలు గ్రామం పులిబోనుపల్లె సమీపంలో సిద్దలవాండ్లపల్లెకు చెందిన కంచన ఈశ్వరయ్య, రెడ్డెప్ప బోడేవాండ్లపల్లె నుంచి బైక్పై ఎదురుగా వస్తూ ట్రాక్టర్ను ఢీ కొన్నారు. ఈ సంఘటనలో ఈశ్వరయ్యకు తీవ్రగాయాలు కాగా, రెడ్డెప్ప స్వల్పగాయాలతో బయటపడ్డాడు. కేసు తనమీదకు వస్తుందని ట్రాక్టర్తో సహా డ్రైవర్ గురవయ్య పరారయ్యాడు. అప్పటికే సమాచారం అందుకున్న ఎస్ఐ వెంకటమోహన్ స్థానిక యువకులను అప్రమత్తం చేశారు. గురవయ్య ట్రాక్టర్ను గుర్తించి విచారణ చేశారు. ఎంతకీ తన ట్రాక్టర్ ప్రమాదానికి గురైందని అతను అంగీకరించలేదు. అయితే ఈశ్వరయ్య పెన్ క్యాప్ ట్రాక్టర్ ట్రాలీకి తగులుకుని ఉండటాన్ని గుర్తించి ట్రాక్టర్, గురవయ్యను అదుపులోకి తీసుకున్నారు. అతడిపై కేసు నమోదు చేశారు. -
అక్కా! అమ్మా,నాన్నను బాగా చూసుకో
సాక్షి,చిత్తూరు (కురబలకోట): అక్కా! అమ్మా..నాన్నను బాగా చూసుకో..–ఇదీ ఆత్మహత్యకు ముందు ఓ వ్యక్తి తన సోదరికి పంపిన సందేశం. రైల్వే పోలీసుల కథనం..మదనపల్లెలోని బయ్యారెడ్డి కాలనీకి చెందిన చిన్న వెంకట్రమణ కుమారుడు ఆర్.సుభాష్(27) డెహ్రాడూన్లోని సోలార్ ప్లాంట్లో ఎలక్ట్రికల్ ఇంజినీరుగా పని చేస్తున్నాడు. క్యాన్సర్తో బాధపడుతున్న అతని తల్లి లక్ష్మీదేవి (53) బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. వ్యాధి ముదిరిందని అక్కడి డాక్టర్లు చెప్పారు. బుధవారం మళ్లీ బెంగళూరుకు తల్లిని తీసుకెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలో డెహ్రాడూన్ నుంచి సుభాష్ విమానంలో సోమవారం రాత్రి బెంగళూరు చేరారు. మదనపల్లె బస్టాండు చేరుకుని రాత్రి కడప బస్సు ఎక్కాడు. గుర్రంకొండకు టికెట్ తీసుకుని మార్గమధ్యంలోని కురబలకోట రైల్వేగేటు వద్ద దిగేశాడు. మంగళవారం వేకువజామున మూడు గంటల ప్రాంతంలో తన అక్క శాంభవికి ఫోన్ చేశాడు. తాను కురబలకోట రైల్వేస్టేషన్ వద్ద ఉన్నానని అమ్మా..నాన్నను బాగా చూసుకోమని చెప్పాడు. ఆ తర్వాత ఉదయం చూస్తే రైల్వే గేటుకు సమీపంలో రైలు పట్టాలపై శవమై కన్పించాడు. తొలుత గుర్తు తెలియని శవంగా భావించారు. సంఘటన స్థలంలో లభించిన సెల్ఫోన్ ఆధారంగా మృతుడిని గుర్తించారు.రైలు ఇతనిపై వెళ్లడంతో తల మొండెం వేరైంది. ఇంట్లో ఎలాంటి సమస్యలు లేవని, తల్లికి కాన్సర్ నయం కాదన్న మనోవేదనతో ఇలా ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని మృతుని కుటుంబీకులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా డెహ్రాడూన్లో ప్రేమ వ్యవహారం ఏమైనా ఉందా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం మృత దేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. -
బాబు హయాంలో ఆంధ్రజ్యోతికి బహుమానం
సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి చెందిన ఆమోద పబ్లికేషన్స్ లిమిటెడ్కు గత తెలుగుదేశం ప్రభుత్వం విలువైన భూమిని కారుచౌకగా కేటాయించింది. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన దరిమిలా తమ పత్రిక ప్రచురణ కేంద్రానికి స్థలం కేటాయించాలని ఆమోద పబ్లికేషన్స్ యాజమాన్యం ప్రభుత్వాన్ని కోరింది. అంతే.. అడిగిందే తడవుగా ఆగమేఘాల మీద కేబినెట్ సమావేశం పెట్టి భూమి ఇవ్వాలని తీర్మానించింది. ఆ మేరకు 2015 నవంబర్ 13న ప్రత్యేకంగా జీఓ 433ని విడుదల చేసింది. రేణిగుంట మండలం తూకివాకం రెవెన్యూ గ్రామ పరిధిలో సర్వే నెంబర్ 717బి–5లో ఎకరా ధర రూ.80లక్షలు చొప్పున ఎకరన్నర కేటాయించింది. సరిగ్గా ఇక్కడే వివాదం రాజుకుంది. జాతీయ రహదారికి పక్కనే ఉన్న విలువైన ప్రభుత్వ భూమిని అతి తక్కువ ధరకు కట్టబెట్టడంపై అప్పుడే గ్రామంలోని యువత వ్యతిరేకించింది. అప్పట్లోనే మార్కెట్ ధర ఎకరా రూ.7కోట్లు ఉండగా.. మొత్తం రూ.10కోట్ల విలువైన భూమిని కేవలం కోటి 20లక్షలకే ధారాదత్తం చేయడంపై నిరసన వ్యక్తమైంది. గ్రామస్తులు రోడ్డెక్కి ఆందోళనలు చేయగా పోలీసులను రంగంలోకి దించారు. భయభ్రాంతులకు గురిచేసి హుటాహుటిన భవన నిర్మాణాలు పూర్తి చేసేశారు. కానీ ఇప్పుడు మళ్ళీ గ్రామస్తులు నాటి అడ్డగోలు భూ సంతర్పణపై ప్రస్తుత అధికారులు దృష్టిసారించాలని డిమాండ్ చేస్తున్నారు. విశాఖలో వెనక్కి తీసుకున్నట్టు.. ఆమోదా పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్కు విశాఖçపట్నంలోనూ నాటి టీడీపీ హయాంలో భూ పందేరం జరిగింది. విశాఖ నగర శివారు పరదేశి పాళెంంలో దాదాపు రూ.15కోట్ల విలువైన భూమిని కేవలం రూ.50లక్షలకే ధారాదత్తం చేస్తూ 2017 జూన్లో నాటి ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఎంతో విలువైన భూమిని అంత తక్కువ ధరకు అప్పగించడంపై వివాదం రేగింది. ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 అక్టోబర్లో జరిగిన కేబినెట్ సమావేశంలో నాటి కేటాయింపులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ భూములను అర్హులైన పేదలకు కేటాయించాలని తీర్మానించారు. సరిగ్గా ఇక్కడ కూడా ఇప్పుడు అదే డిమాండ్ తెరపైకి వస్తోంది. ఆ ఒక్క సంస్థకే ఎలా ఇచ్చారు? ప్రభుత్వం భూములు కేటాయించాల్సి వస్తే ఆయా వర్గాలను బట్టి పారిశ్రామికవాడలను, నివాసిత ప్రాంతాలను పరిశీలిస్తుంది. కానీ నాటి టీడీపీ ప్రభుత్వం ఆంధ్రజ్యోతికి ఇచ్చిన స్థలం పూర్తిగా రైతులకు సంబంధించినది. హైవేకి ఆనుకుని ఉన్న విలువైన స్థలం. పైగా ఆ ఒక్క సంస్థకే కట్టబెట్టింది. – సీహెచ్ హరిశ్చంద్ర, పంచాయతీ తీర్మానం లేకుండానే భూకేటాయింపు తూకివాకం పంచాయతీ తీర్మానం లేకుండానే భూ కేటాయింపులు జరిపారు. వాస్తవానికి ఆంధ్రజ్యోతికి ఇచ్చిన ఆ భూమిని గతంలో పన్నీర్కాలువ గ్రామ బీసీలకు కేటాయించారు. ఇళ్ల పట్టాలు కూడా ఇచ్చారు. తూకివాకం రైతులకు, పన్నీర్కాలువ రైతులకు మధ్య వివాదం రేగడంతో సమస్య కోర్టు వరకు వెళ్లింది. ఈ కేసు కోర్టులో పెండింగ్లో ఉండగానే నాటి టీడీపీ ప్రభుత్వం అడ్డగోలుగా ఆంధ్రజ్యోతికి కట్టబెట్టేసింది. ఆ తర్వాత కోర్టు పన్నీర్కాలువ రైతులకు ఆ భూమిని అప్పగించాలని, లేదంటే ప్రత్యామ్నాయం చూపించాలని ఆదేశించింది. ఇవేమీ పట్టించుకోకుండానే ఆమోద పబ్లికేషన్స్ భవన నిర్మాణాలు చేపట్టేసింది. నేటికీ ఆ నిర్మాణాలకు సంబంధించి పంచాయతీ తీర్మానం లేదు. – భాస్కర్ యాదవ్, మాజీ సర్పంచ్, తూకివాకం ఆ భూమి వెనక్కి తీసుకోవాలి నాటి టీడీపీ ప్రభుత్వం అతితక్కువ ధరకు ఆమోద పబ్లికేషన్స్కు కట్టబెట్టిన రూ.కోట్ల విలువైన భూమిని అధికార యంత్రాంగం వెనక్కి తీసుకోవాలి. ఆ మేరకు వాస్తవాలను సర్కారుకు నివేదించాలి. విశాఖలో కట్టబెట్టిన భూములను వెనక్కి తీసుకుని పేదలకు పంచినట్టే ఇక్కడ కూడా ఆంధ్రజ్యోతికిచ్చిన భూములపై నిర్ణయం తీసుకోవాలి. లేనిపక్షంలో తూకివాకం, పన్నీర్కాలువ గ్రామాల రైతులతో కలిసి ఆందోళనలు చేస్తాం. – నాగ సుబ్రహ్మణ్యరెడ్డి, మాజీ ఎంపీటీసీ, తూకివాకం -
గుట్టకాయ స్వాహా..
అధికారంలో ఉన్నన్నాళ్లూ కబ్జాలు, సెటిల్మెంట్లతో యథేచ్ఛగా దోపిడీకి పాల్పడిన తెలుగుదేశం నాయకులు ప్రభుత్వం మారినా తమ తీరును మాత్రం మార్చుకోవడం లేదు. ఎక్కడికక్కడ భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారు. వీటిపై యంత్రాంగం దృష్టి సారించడంతో.. వారికన్ను గుట్టలు, కుంటలపై పడింది. వాటిని ఇష్టానుసారం తవ్వేస్తూ జేబులు నింపుకుంటున్నారు. తాజాగా చంద్రగిరిలోని పత్తి గుట్ట వీరి దెబ్బకు రూపురేఖలు కోల్పోతోంది. సాక్షి,చిత్తూరు(చంద్రగిరి): గత ప్రభుత్వంలో నీరు–మట్టి పథకం టీడీపీ నాయకులకు కల్పతరువుగా ఉండేది. ఈ పేరుతో వారు చెరువులను, కుంటలను కబ్జా చేయడంతో పాటు అక్కడి మట్టిని తరలించి సొమ్ము చేసుకున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వారి దోపిడీకి అడ్డుకట్ట పడింది. అయితే కొన్నిచోట్ల అక్రమాలకు అలవాటు పడిన నాయకులు తమ నీచబుద్ధిని మాత్రం ఇంకా వదులుకోలేదు. గుట్ట గుటుక్కు చంద్రగిరి లెక్కదాఖల సర్వే నంబరు 1479లో సుమారు 530 ఎకరాల విస్తీర్ణంలో పత్తిగుట్ట ఉంది. ఈ గుట్టలో నాణ్యమైన ఎర్రమట్టి ఉండడంతో తెలుగుదేశం నాయకుల కన్ను దీనిపై పడింది. అంతే.. గత పది రోజులుగా రాత్రి, పగలు అన్న తేడా లేకుండా జేసీబీల సాయంతో ట్రాక్టర్ల ద్వారా నిర్విరామంగా మట్టిని తరలించేస్తూ లక్షలు దండుకుంటున్నారు. లోడ్ రూ.800 పత్తిగుట్టలోని మట్టిని ట్రాక్టర్ లోడ్ రూ.800 చొప్పున విక్రయిస్తున్నారు. ముఖ్యంగా చంద్రగిరి పాతపేటకు చెందిన టీడీపీ కార్యకర్తలు మట్టి మాఫియాగా మారి గుట్టను తవ్వేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. భారతీనగర్, ఎంజీ బ్రదర్స్ ప్లాట్లు, రెడ్డివీధితో పాటు ఇతర ప్రాంతాల్లో నూతనంగా ఇళ్ల నిర్మాణం చేపడుతున్న వారికి ఈ మట్టిని విక్రయిస్తున్నారు. అంతేకాకుండా ఇటుక బట్టీల నిర్వాహకులతో ఒప్పందాలు కుదుర్చుకుని మరీ మట్టిని తరలించేస్తున్నారు. పట్టపగలే మట్టి అక్రమ రవాణా సాగుతున్నప్పటికీ రెవెన్యూ అధికారులు ఆలస్యంగా స్పందించడం విమర్శలకు తావిస్తోంది. సాధారణ పౌరుడు గజం భూమి ఆక్రమిస్తే ఆగమేఘాలపై చర్యలు తీసుకునే రెవెన్యూ సిబ్బంది, సుమారు ఎకరా విస్తీర్ణంలో గుట్టను పది రోజులుగా స్వాహా చేస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం సర్వే నంబరు 1479లోని పత్తిగుట్టలో అక్రమంగా ఎకరాకు పైగా మట్టిని తరలించినట్లు తెలియడంతో ఆదివారం తహసీల్దార్ చిన్న వెంకటేశ్వర్లు సిబ్బందితో కలసి గుట్టను పరిశీలించారు. మట్టి అక్రమ రవాణాకు పాల్పడిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఎవరైనా ప్రభుత్వ భూముల్లో అక్రమంగా ప్రవేశిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఆయన వెంట ఆర్ఐ మోహన్రెడ్డి, వీఆర్ఓలు నాగరాజు, అశోక్ కుమార్ ఉన్నారు. సబ్సిడీ ట్రాక్టర్ల ద్వారా.. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సబ్సిడీ ద్వారా అందించే ట్రాక్టర్లను మట్టి తరలింపునకు ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ఆ ట్రాక్టర్లను వ్యవసాయ పనులకు మాత్రమే వినియోగించాలి. ఇలాంటి అక్రమ వ్యాపారాలకు ట్రాక్టర్లను వినియోగించడమంటే ప్రభుత్వాన్ని మోసం చేయడమే అవుతుంది. సుమారు 10 ట్రాక్టర్లకు పైగా వైట్బోర్డు(సబ్సిడీ ట్రాక్టర్లు) వాహనాలను ఇందుకు వినియోగిస్తున్నట్లు సమాచారం. ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు చంద్రగిరి సమీపంలోని పత్తిగుంట నుంచి అక్రమంగా మట్టిని తరలిస్తున్నారని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. రెవెన్యూ వారికి సమాచారం ఇచ్చిన వెంటనే జేసీబీతో పాటు ట్రాక్టర్లు అక్కడ నుంచి వెళ్లిపోయాయి. అధికారులు వచ్చే సమయానికి ఎవ రూ లేకపోవడంతో వెనుదిరిగి పోతున్నారు. ఫిర్యాదు చేసిన ప్రతిసారీ ఇదే సీన్ రిపీట్ అవుతోంది. – అరుణ్, చంద్రగిరి, భారతీనగర్ ప్రశ్నిస్తే దౌర్జన్యానికి పాల్పడుతున్నారు ప్రభుత్వ భూమిలో అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే ట్రాక్టర్ డ్రైవర్లు దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. మీకు దిక్కున్నచోట చెప్పుకోమంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. అధికారులు స్పందించాలి. అక్రమంగా మట్టి తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. లేకుంటే స్థానికులందరం కలసి ధర్నాకు దిగుతాం. – భాస్కర్రెడ్డి, చంద్రగిరి -
ప్రాణం తీసిన కునుకు..
సాక్షి,చిత్తూరు (పలమనేరు): పెళ్లి చూపుల కోసం కుటుంబం మొత్తం కారులో బెంగళూరుకు బయలుదేరింది. పలమనేరు సమీపంలోని నాగమంగళం వద్ద చెన్నై– బెంగళూరు జాతీయ రహదారిలో వెళ్తుండగా కారు డ్రైవర్ కునుకు తీశాడు. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి ఫ్లైఓవర్ నుంచి పల్టీలు కొడుతూ పక్కనే ఉన్న మరో రోడ్డుపై పడింది. ఘటనలో డ్రైవర్ మృతిచెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు.. ఒంగోలు సమీపంలోని కందుకూరుకు చెందిన వెంకటేశ్వర్లు కుమారుడు సాయిరామ్ బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. అతని పెళ్లి చూపుల కోసం కుటుంబ సభ్యులు శనివారం రాత్రి కందుకూరు నుంచి కారులో బెంగళూరు బయలుదేరారు. ఆదివారం ఉదయం నాగమంగళం వద్దకు రాగానే డ్రైవర్ నిద్ర మత్తులోకి జారుకున్నాడు. కారులోని వారు నిద్రలో ఉన్నారు. దీంతో అదుపు తప్పిన కారు బెంగళూరు రోడ్డుపై డివైడర్ను ఢీకొట్టి పక్కనే ఉన్న చిత్తూరు రోడ్డుపై పడింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ రామభరత్(30) తలకు గాయమై అక్కడిక్కడే మృతిచెందాడు. సాయిరామ్(30), అతని తల్లిదండ్రులు వెంకటేశ్వర్లు(64), వెంకటరమణమ్మ(58), సోదరి కుసుమకుమారి(36) గాయపడ్డారు. 108 సిబ్బంది బాధితులను పలమనేరు ఆస్పత్రికి తరలించారు. పలమనేరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చిత్తూరు కుర్రోడు హీరోగా ‘ప్రేమకథ’
సాక్షి,చిత్తూరు(పలమనేరు): పలమనేరు కుర్రోడు హీరోగా నటించిన కాశీ వర్సెస్ లవ్ (చిత్తూరోడి ప్రేమకథ)చిత్రం ఘన విజయం సాధిస్తుందని ఆ చిత్ర దర్శకులు అశ్విని కామరాజ్ శనివారం మీడియాకు తెలిపారు. పలమనేరు మండలం పకీరుపల్లికి చెందిన అశ్విని కామరాజ్ దర్శకులుగా జరావారిపల్లికి చెందిన చిన్నా హీరోగా, బెంగళూరుకు చెందిన సంధ్య హీరోయిన్గా, పదిమంది స్థానికులు ఇందులో నటించినట్లు తెలిపారు. నంది ఆర్ట్స్ పతాకంపై హైదరాబాద్కు చెందిన నంది కె.రెడ్డి నిర్మాతగా కాశీ వర్సెస్ లవ్ చిత్రాన్ని ఇటీవలే పూర్తి చేశామన్నారు. చిత్రానికి సంబంధించిన పాటలను లహరి ఆడియో ద్వారా విడుదల చేసినట్లు తెలిపారు. పలమనేరు పరిసర ప్రాంతాలతోపాటు జిల్లాలో మేజర్ పార్ట్, హైదరాబాద్, గుంటూరులో చిత్ర షూటింగ్ పూర్తి చేసినట్లు వివరించారు. ఈ చిత్రాన్ని నెలఖారులో ఓటీటీ ప్లాట్ఫామ్పై విడుదల చేయన్నునట్టు పేర్కొన్నారు. చిత్ర పోస్టర్లు పట్టణంలో హల్చల్ చేస్తున్నాయి. -
తెలుగుగడ్డపై సెంచరీ దాటిన డీజిల్
హైదరాబాద్ : పెట్రోలు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయంటూ మరోసారి ధరలు పెంచాయి చమురు కంపెనీలు. ఈసారి లీటరు పెట్రోలుపై రూ. 43 పైసలు, లీటరు డీజిల్పై రూ. 34 పైసుల వంతున ఛార్జీలు పెంచాయి. ఇలా వరుసగా పెరుగుతున్న ధరలతో తెలుగు గడ్డపై లీటరు డీజిల్ ధర సెంచరీ దాటింది. ఏపిలో చిత్తూరు జిల్లాలో లీటరు డీజిల్ ధర రూ. 100.25కి చేరుకుంది. ఇక్కడ పెట్రోలు ధర 107.82గా ఉంది. మిగిలిన జిల్లాలలో సెంచరీకి చేరువగా వచ్చింది. హైదరాబాద్లో లీటరు పెట్రోలు రూ. 104.93, లీటరు డీజిల్ 98.02గా ఉంది. ఇదే అత్యధికం జులైలో నెలలో ఇప్పటి వరకు ఆరు సార్లు పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగాయి. గరిష్టంగా లీటరు పెట్రోలుపై 36 పైసలు అత్యధికంగా ధర పెరిగింది. కానీ శనివారం పెరిగిన ధరల్లో లీటరు పెట్రోలుపై 43 పైసల వంతున ధర పెంచారు. ఇంకా పెరగొచ్చు ఒపెక్ దేశాల వైఖరితో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. దీనికి తగ్గట్టే రాబోయే రోజుల్లో దేశీయంగా పెట్రోలు, డీజిల్ ధరలు పెరగడం ఖాయంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏమైనా చర్యలు తీసుకుంటే తప్ప పెట్రోలు, డీజిల్ ధరలు ఇప్పట్లో తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. -
కుప్పంను వీడుతున్న ‘చంద్ర’ గ్రహణం
సాక్షి, చిత్తూరు: కులం చూడం.. మతం చూడం.. వర్గాలు చూడం.. పార్టీలు చూడం.. రాజకీయాలు చూడం.. అందరికీ సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందిస్తాం.’’ వైఎస్ జగన్మోహన్రెడ్డి గత ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ఈ హామీలను ముఖ్యమంత్రి కాగానే అక్షరాలా నిజం చేసి చూపించారు. కులాలు, మతాలు, వర్గాలే కాదు.. రాజకీయలకు అతీతంగా కూడా అభివృద్ధి ఫలాల్లో అందరికీ సమ ప్రాధాన్యం కల్పిస్తున్నారు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గమే. ఈ నియోజకవర్గ ప్రజలను చంద్రబాబు కేవలం ఓటు బ్యాంకుగానే పరిగణించినా.. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇక్కడి ప్రజలకు పెద్ద దిక్కుగా అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. 14,653 మందికి ఇళ్లపట్టాలు కుప్పం నియోజకవర్గంలో ఈ రెండేళ్లలోనే 14,653 మంది లబ్ధిదారులకు ఇళ్లపట్టాలు అందజేశారు. గత టీడీపీ హయాంలో 5,158 మందికి ఇళ్లపట్టాలకు అనుమతి ఇచ్చి 4,150 మందికి మాత్రమే పంపిణీ చేశారు. హౌసింగ్ ఫర్ ఆల్ పథకం కింద గతంలో ఐదేళ్లలో 4,691 మంది లబ్ధిపొందగా.. ఈ రెండేళ్లలోనే 3,712 మందికి లబ్ధిచేకూరింది. అర్హులందరికీ పింఛన్లు గత ప్రభుత్వ హయాంలో జన్మభూమి కమిటీల ఆమోదం ఉంటేనే పథకాలు లభించేవి. ప్రస్తుతం అలా కాకుండా గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అర్హులైన ప్రజలందరికీ నేరుగా సంక్షేమ పథకాలను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అందిస్తోంది. కుప్పం నియోజకవర్గంలో 2014–19 మధ్య 30,970 మందికి పింఛన్లను పంపిణీ చేశారు. ఇందుకు కేటాయించిన నిధులు రూ. 653.41 లక్షలు. ప్రస్తుతం అదే నియోజకవర్గంలో గతంకన్నా ఎక్కువగా 34,956 మందికి రూ.844.83 లక్షల మేర పింఛన్లు అందిస్తున్నారు. గతంలో 44 భవనాలు.. ప్రస్తుతం 83 గత ఐదు సంవత్సరాల పాలనలో చంద్రబాబునాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో 44 పక్కా ప్రభుత్వ కార్యాలయాలను నిర్మించారు. ప్రస్తుతం రెండేళ్లలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 83 గ్రామ సచివాలయ, పంచాయతీ భవనాలను నిర్మించారు. గతంలో 44 భవనాలకు రూ.592 లక్షలు ఖర్చు చేయగా, ప్రస్తుతం 83 భవనాలకు రూ.2480 లక్షలను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. గతం కన్నా నాలుగింతలు ఎక్కువ నిధులతో నాణ్యమైన, అధునాతన హంగులతో భవనాలను నిర్మిస్తున్నారు. 13,486 మందికి ఆరోగ్య‘సిరి’ 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కుప్పం నియోజకవర్గంలో 13,468 మందికి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా చికిత్స చేయించారు. ఈ పథకం ద్వారా వారికి రూ.23కోట్ల ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించింది. గత పాలనలో 9,348 మందికి మాత్రమే ఆరోగ్యశ్రీ సేవలను అందించారు. అదేవిధంగా ప్రస్తుతం వైఎస్ఆర్ కంటి వెలుగు పథకం ద్వారా 750 మందికి చికిత్సలు చేయించారు. 53,187 మంది తల్లుల ఖాతాల్లో అమ్మఒడి నగదు కుప్పం నియోజకవర్గంలోని సర్కారు, ఇతర యాజమాన్యాల బడుల్లో చదువుతున్న విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి పథకం ద్వారా ఆదుకుంది. 53,187 మంది తల్లుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం రూ.7978.05 లక్షలను జమచేసింది. గత పాలనలో పిల్లల చదువులకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయని పరిస్థితి. ప్రస్తుతం ఆ నియోజకవర్గంలో పిల్లల చదువులకు అమ్మఒడి పథకంలో ఏడాదికి రూ.15 వేలు చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నారు. సర్కారు బడుల అభివృద్ధికి రూ.1853.84 లక్షలు కుప్పం నియోజకవర్గంలోని సర్కారు బడుల బలోపేతానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. 2019–20 సంవత్సరాల్లో 46 సర్కారు బడుల నూతన భవనాలను రూ.715.84 లక్షలను ఖర్చు చేసి నిర్మిస్తున్నారు. అలాగే 43 సర్కారు బడులను నాడు–నేడు పథకం ద్వారా రూ.1138 లక్షలతో మౌలిక వసతులు కల్పించి కార్పొరేట్ బడులకు దీటుగా తీర్చిదిద్దుతున్నారు. గత సర్కారు 85 పాఠశాలల్లో అదనపు తరగతి గదులు నిర్మించి చేతులు దులుపుకుంది. ఉన్నత కోర్సులకు చేయూత ఇంటర్మీడియట్ తర్వాత పై చదువులు చదువుతున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకం ద్వారా ఆర్థిక సహాయం అందిస్తోంది. ఆ నియోజకవర్గంలో చదువుతున్న 14,646 మంది విద్యార్థులకు రూ.14.31కోట్లతో జగనన్న విద్యాదీవెన, 15,498 మందికి రూ.10.57 కోట్లతో జగనన్న వసతి దీవెన పథకాన్ని అమలు చేశారు. ఏళ్ల నాటి సమస్యలకు పరిష్కారం ►కుప్పం నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి ఉపాధి కోసం ప్రజలు బెంగళూరుకు వెళ్లాల్సిన దుస్థితి. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దాదాపు లక్ష మందికి ఉపాధి కల్పించేలా గ్రానైట్ సర్వే స్టోన్ కటింగ్, పాలిషింగ్ యూనిట్ను నెలకొల్పేందుకు రంగం సిద్ధం చేసింది. కుప్పం పరిధిలోని దళవాయి కొత్తపల్లి సమీపంలో పల్లార్లపల్లి వద్ద 4 ఎకరాల స్థలంలో యూనిట్ ఏర్పాటవుతోంది. ►కుప్పం నడిబొడ్డున ఉన్న గంగమ్మ దేవాలయాన్ని పునర్నిర్మించాలన్నది స్థానికుల కల. ఏటా నిర్వహించే జాతరకు సమీపంలోని కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ రెడ్డెప్ప దేవాలయ పునర్నిర్మాణానికి రూ.3.5 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేయించారు. గుడి ముందు 70 సెంట్ల డీకేటీ స్థలాన్ని అగ్నిగుండంకు కేటాయించనుండటం విశేషం. ►కుప్పంకు సమీపంలోని డీకేపల్లి, కుప్పం నగరంలోని రైల్వేబ్రిడ్జిల సమస్య 2004వ సంవత్సరం నుంచి అపరిష్కృతంగానే ఉంది. ఈ సమస్య వల్ల సమీపంలోని 60 గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్య పరిష్కారానికి చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప చొరవ చూపి అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే రెండు నూతన రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జిలను నిర్మించి ప్రారంభించారు. -
మెర్సీ కిల్లింగ్ : దరఖాస్తు చేసిన గంటకే
చిత్తూరు : దీర్ఘకాలంగా వేధిస్తున్న అనారోగ్య సమస్య... వైద్య చికిత్సల కోసం ఎన్ని ఆస్పత్రులు చుట్టూ తిరిగినా కారణాని ఫలితం.... మరోవైపు తలకు మించిన భారంగా మారిన అప్పులు.... ఇక ఆరోగ్యం ఎంతకీ మెరుగుపడదని తేల్చి చెప్పిన వైద్యులు. ఈ నేపథ్యంలో తమ కుమారుడి మెర్సీ కిల్లింగ్కి అనుమతి ఇవ్వాలని కోరుతూ న్యాయస్థానంలో దరఖాస్తు చేశారు కుటుంబ సభ్యులు. దరఖాస్తు చేసిన గంట వ్యవధిలోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడా బాలుడు. హృదయాన్ని కలిచి వేసే ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. ఐదేళ్లుగా చిత్తూరు జిల్లాకు చౌడేపల్లి మండలం బీర్నేపల్లికి చెందిన హర్షవర్థన్ (9) ఐదేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. వైద్య చికిత్స కోసం అతని తల్లిదండ్రులు తిరగని ఆస్పత్రికి లేదు. ఐదేళ్లుగా ప్రయత్నిస్తున్నా హర్షవర్థన్ ఆరోగ్యం మెరుగుపడలేదు. మరోవైపు అతని వైద్య చికిత్స కోసం అందినకాడల్లా అప్పులు చేశారు తల్లిదండ్రులు. ఐదేళ్లలో మొత్తం రూ. 4 లక్షలకు పైగానే అప్పు అయ్యింది. గంటలోపే ఏళ్లు గడుస్తున్నా.. అప్పులు పెరుగుతున్నా ఎంతకీ హర్షవర్థన్ ఆరోగ్యం మెరుగుపడలేదు. మరోవైపు హర్షవర్థన్ ఆరోగ్యంపై డాక్టర్లు కూడా చేతులెత్తేశారు. వైద్యం కోసం అప్పులు చేయలేక, కుమారుడు పడుతున్న యాతన చూడలేక మెర్సీ కిల్లింగ్కు వెళ్లాలని ఆ తల్లిదండ్రులు నిర్ణయించుకున్నారు. దీంతో ఈ రోజు పుంగనూరు కోర్టులో మెర్సి కిల్లింగ్ కోసం హర్షవర్థన్ తల్లిదండ్రులు దరఖాస్తు చేశారు. వారు దరఖాస్తు చేసిన తర్వాత గంట వ్యవధిలోనే అనారోగ్యంతో ఆ బాలుడు మరణించాడు. ఊహించని ఈ మరణంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. -
కిరాతకుడు రఫీకి ఉరి
సాక్షి, అమరావతి: అభం, శుభం తెలియని ఐదేళ్ల చిన్నారిపై అత్యంత హేయంగా లైంగిక దాడికి పాల్పడి, కిరాతకంగా హత్య చేసిన మహమ్మద్ రఫీకి(25) ఉరిశిక్ష విధిస్తూ చిత్తూరు నగరంలోని పోక్సో న్యాయస్థానం సంచలనాత్మక తీర్పు వెలువరించింది. పసి పిల్లలపై లైంగిక దాడులు, బాలికలపై అత్యాచారాలు, ప్రేమను అంగీకరించని వారిపై దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో కిరాతకుడైన రఫీని ఉరి తీయాలంటూ పోక్సో న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అభినందనీయమని అన్ని వర్గాల నుంచి ప్రశంసల జల్లు కురుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో పోక్సో చట్టం కింద ఉరిశిక్ష పడటం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఆడుకుంటున్న చిన్నారిపై... చిత్తూరు జిల్లా బి.కొత్తకోటకు చెందిన ఐదేళ్ల చిన్నారి గతేడాది నవంబర్ 7వ తేదీ రాత్రి కురబలకోట మండలం అంగళ్లు పంచాయతీలో జరిగిన ఓ వివాహానికి తల్లిదండ్రులతో కలసి వెళ్లింది. భోజనాలు చేసిన తర్వాత ఆడుకుంటూ ఒంటరిగా కన్పించిన బాలికకు మదనపల్లెకి చెందిన లారీ డ్రైవర్ మహ్మద్ రఫీ(25) ఐస్క్రీమ్ ఇప్పిస్తానని ఆశ చూపించి కల్యాణ మండపంలో ఉన్న బాత్రూమ్కు తీసుకెళ్లాడు. అరవకుండా నోరు నొక్కాడు. పాశవికంగా లైంగిక దాడి చేశాడు. తర్వాత బాలిక గొంతు నులిమి చంపేసి, శవాన్ని కల్యాణ మండపం పక్కన గుంతలో పడేసి పారిపోయాడు. పోలీసులు బాలిక మృతదేహాన్ని గుర్తించారు. పట్టించిన సీసీ కెమెరా... కల్యాణ మంటపంలోని సీసీ కెమెరాల్లో ఉన్న ఫుటేజీల ఆధారంగా పోలీసులు విచారించగా రఫీ చేసిన దారుణం బట్టబయలైంది. రఫీని 2019 నవంబర్ 16న అరెస్టు చేశారు. మదనపల్లె జూనియర్ మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. రఫీ తన 15వ ఏటే ఓ బాలికపై అత్యాచారయత్నం చేసినందుకు కొన్నాళ్లు జువెనైల్ హోమ్లో ఉన్నట్లు విచారణలో తేలింది. నేర ప్రవృత్తి మానకుండా అమానుషానికి పాల్పడిన రఫీకి న్యాయమూర్తి ఉరిశిక్ష విధించారు. జగన్ సర్కారు చొరవతో... తెలంగాణలో దిశ కేసు వెలుగుచూసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఈ చిన్నారి హత్యకేసు విచారణను చిత్తూరులోని పోక్సో కోర్టులో నిర్వహించాలని ఆదేశాలు జారీచేసింది. ఇందుకోసం ప్రత్యేకంగా అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా లోకనాథరెడ్డిని నియమించింది. గతేడాది డిసెంబర్ 12న విచారణ ఆరంభించిన పోక్సో కోర్టు నిందితుడు రఫీ అరెస్టయిన వంద రోజుల్లోనే విచారణ పూర్తిచేసి ఉరిశిక్ష విధించింది. నిందితుడు రఫీ భార్య సైతం ఈ తీర్పును సమర్థించడం గమనార్హం. ఇలాంటి తీర్పులు వస్తే తప్పు చేయడానికి ఎవరైనా భయపడతారని, దీనివల్ల అఘాయిత్యాలు తగ్గుతాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. -
వైఎస్సార్సీపీలోకి బీగాల కుటుంబం
తిరుపతి రూరల్: చంద్రగిరి నియోజకవర్గం టీడీపీలో కొత్తగా ప్రవేశించిన చిత్తూరు రౌడీ రాజకీయంపై ఆగ్రహం వెల్లువెత్తుతోంది. మాజీ మంత్రి గల్లా అరుణకుమారి ఇన్చార్జ్గా ఉన్నప్పుడు నియోజకవర్గం ప్రశాంతంగా ఉందని, కొత్త నేత దిగుమతి అయ్యాక రౌడియిజం, గ్రూపు రాజకీయాలు, భూకబ్జాలను పెంచి పోషిస్తూన్నారనే విమర్శలు ఎక్కువయ్యాయి. ఏళ్ల తరబడి పార్టీనే నమ్ముకున్న నాయకులు తాజాగా జరుగుతున్న పరిణామాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ రౌడీ రాజకీయాలను భరించలేక పార్టీని వీడుతున్నారు. ఓటేరు అభివృద్ధిలో బీగాల మార్కు.. వేదాంతపురం పంచాయతీ ఓటేరు గ్రామ అభివృద్ధిలో బీగాల కుటుంబం పాత్ర కీలకం. బీగాల చంద్రమౌళి తల్లి బీగాల నాగమణి కాంగ్రెస్ మహిళా విభాగం తిరుపతి నగర అధ్యక్షురాలిగా పనిచేశారు. 1992లో కల్యాణిడ్యామ్ గేట్లు తెగి స్వర్ణముఖి వరదలు వచ్చినప్పుడు నిర్వాసితులను తీసుకువచ్చి ఓటేరు గ్రామంలో పట్టాలు ఇప్పించి ఇళ్లు నిర్మించటంలో ఆమె కీలకపాత్ర పోషించారు. అంధకారంలో ఉన్న గ్రామంలో చంద్రమౌళి నాయకత్వంలో 24 గంటల పాటు కరెంట్ అందించటమే కాకుండా, తాగునీటి సమస్య పరిష్కారానికి ఓవర్ హెడ్ ట్యాంక్ను నిర్మించి దాహార్తిని తీర్చారు. అవిలాల, అగ్రహారం, పద్మావతీపురం, తిరుచానూరు పంచాయతీలకు కిలోమీటర్ల దూరం వెళ్లి రేషన్ సరుకులు తెచ్చుకోవాల్సిన దుస్థితిని తప్పించి, ఓటేరులోనే ప్రత్యేకంగా రేషన్ షాపును ఏర్పాటు చేయించారు. ప్రజలకు అందించిన సేవలకు గుర్తింపుగా గత ఎంపీటీసీ ఎన్నికల్లో చంద్రమౌళి వదిన శారద స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొందారు. వైఎస్సార్సీపీలోకి ‘బీగాల’ కుటుంబం.... ఓటేరుకు చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు బీగాల చంద్రమౌళి ఈ రౌడీ రాజకీయం, గ్రూపు తగాదాలు, భూకబ్జాలపై ధ్వజమెత్తారు. కొత్తగా దిగుమతి అయిన నాయకులు టీడీపీని నాశనం చేస్తున్నారని పరోక్షంగా పులివర్తి నానిపై విమర్శల వర్షం కురిపించారు. నాని నాయకత్వంలో పనిచేయలేమని, పార్టీ సభ్యత్వంను సైతం వదులుకున్నానని ప్రెస్మీట్ పెట్టి మరీ ప్రకటించారు. అనుచరులతో సుదీర్ఘ మంతనాలు చేశారు. అందరూ వైఎస్సార్సీపీలో చేరాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. ఆదివారం ఉదయం 9గంటలకు ఓటేరులో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి నాయకత్వంలో మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి సమక్షంలో జరిగే సభలో బీగాల చంద్రమౌళితో పాటు కుటుంబ సభ్యులు, అనుచరులతో వైఎస్సార్సీపీలో చేరనున్నారు. జగనన్న నాయకత్వంపై నమ్మకంతోనే..... నిత్యం ప్రజల కోసం వేలాది కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తూ శ్రమిస్తున్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంపై నమ్మకం, కార్యకర్తల కోసం ప్రాణాలు ఇచ్చే ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి పోరాటతత్వానికి ఆకర్షితులమై పార్టీలో చేరుతున్నట్లు బీగాల చంద్రమౌళి తెలిపారు. శనివారం ఓటేరులో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చెవిరెడ్డి నాయకత్వంలో జగన్మోహన్రెడ్డి కోసం సైనికుల్లా పార్టీ పటిష్టతకు కృషి చేస్తామన్నారు. -
చంద్రబాబు తగిన గుణపాఠం చెప్పారు: భూమన
సాక్షి, చిత్తూరు: చంద్రబాబు నాయుడు ఏపీలో అక్రమంగా సంపాదించిన కొట్ల రూపాయలు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో ఖర్చు పెట్టారని, వైఎస్సార్సీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు. గురువారం తిరుపతిలో గాలి వీధిలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అయన మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు తెలంగాణలో అడ్డదారిలో అధికారంలోకి రావాలని చూసారు. కానీ తెలంగాణా ప్రజలు చంద్రబాబుకు తగిన గుణపాఠం చెప్పారన్నారు. వచ్చే 2019లో ఎన్నికల్లో ఏపీ ప్రజలు కూడా బాబుకు తగిన బుద్ధి చెపుతారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని ఈ సందర్భంగా భూమన అన్నారు. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. -
వివాహేతర సంబంధం.. ప్రియురాలు దారణ హత్య
చంద్రగిరి: తనతో కాకుండా మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ప్రియుడు ప్రియురాలిని హత్య చేశాడు. ఈ విషయం ఆలస్యంగా ఆదివారం వెలుగులోకి వచ్చింది. నిందితుడు వీఆర్వో ఎందుట లొంగిపోయాడు. స్థానికుల కథనం మేరకు..మండలంలోని మల్లయ్యపల్లికి చెందిన చెంచు మునికి మండపంపల్లికి చెందిన గిరిజ(33)తో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. గిరిజ అదే గ్రామానికి చెందిన మునస్వామి కుమారుడు గిరి(38)తో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. గిరిజ అదే గ్రామానికి చెందిన మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందని గిరి అనుమానించాడు. ఈ విషయంపై గిరిజతో తరచూ గొడవ పడేవాడు. ఈ క్రమంలో ఈ నెల 13వ తేదీన గిరిజ, గిరి వ్యవసాయ బావి వద్ద కలుసుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తీవ్ర ఆగ్రహానికి లోనైన గిరి పక్కనే ఉన్న కర్రతో ఆమె తలపై మోదాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో గిరిజ అక్కడికక్కడే మృతిచెందింది. గిరి తన ఇంటి నుంచి సంచులు తీసుకెళ్లి మృతదేహాన్ని మూటకట్టి బావిలో పడేసి వెళ్లిపోయాడు. భర్త ఫిర్యాదుతో సంఘటన వెలుగులోకి.. 10 రోజులుగా తన భార్య కనిపించడంలేదని గిరిజ భర్త చెంచు ముని శుక్రవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అదే గ్రామానికి చెందిన గిరిపై తనకు అనుమానం ఉందని పేర్కొన్నాడు. తన భార్య సెల్ఫోన్ కూడా అతని వద్దే ఉన్నట్టు తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున నిందితుడు గిరి చంద్రగిరి వీఆర్వో మునస్వామి ఎదుట లొంగిపోయాడు. గిరిజను తానే హత్య చేసి బావిలో పడేసినట్లు అంగీకరించాడు. అతన్ని వీఆర్వో పోలీసులకు అప్పగించారు. నిందితుడు చెప్పిన వివరాల మేరకు పోలీసులు మల్లయ్యపల్లి బావి వద్దకు వెళ్లి గిరిజ మృతదేహాన్ని వెలికి తీశారు. శరీరం కుళ్లిపోయి ఎముకలు మాత్రమే ఉండడంతో పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి మెడికల్ కళాశాలకు తరలించారు. సీఐ ఈశ్వరయ్య ఆదేశాల మేరకు ఎస్ఐ చిరంజీవి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
నేడు తీరం దాటనున్న ‘గజ’
-
నేడు తీరం దాటనున్న ‘గజ’
సాక్షి, చెన్నై: తమిళనాడు వైపు దూసుకొస్తున్న గజ తుఫాన్ చెన్నైకి 300 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. గురువారం సాయంత్రం కడలూరు, పంబన్ మధ్య తీరం దాటుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో తమిళనాడు ప్రభుత్వం ఎనిమిది జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించింది. రాష్ట్రంలోని కడలూరు, నాగపట్నం, పుదక్కోట, తంజావూరు, తిరువారూరు, కారైకాల్, రామనాథపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో.. ఎనిమిది జిల్లాల్లోని విద్యా సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అంతేకాకుండా మధురై, రామేశ్వరం వైపు వెళ్లే పలు రైళ్లును రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. తుపాన్ తీరం దాటే సమయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. దక్షిణ కోస్తాపై గజ తుఫాన్ ప్రభావం గజ తూఫాన్ కారణంగా బంగాళాఖాతంలో అలల ఉధృతి పెరగడంతో నెల్లూరు జిల్లాలోని మైపాడు, కోడూరుపాడు, తుమ్మలపెంలోకి సముద్ర అలలు చొచ్చుకొచ్చాయి. జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. మరో వైపు చిత్తూరు జిల్లాలోని 30మండలాల్లో కూడా గజ తుపాన్ కారణంగా వర్షాలు కురుస్తున్నాయి. -
ఆ లెక్కే వేరబ్బా..!
‘‘తిరుపతి రవాణా శాఖ కార్యాలయంలో పనిచేసే ఓ హోంగార్డుపై అవినీతి ఆరోపణలు రావడంతో అతన్ని మాతృశాఖకు పంపుతూ ఉప రవాణా కమిషనర్ (డీటీసీ) నెల రోజుల క్రితం ఆదేశాలు జారీ చేశారు. కానీ నెలగా ఆయన రవాణా శాఖ చెక్పోస్టులో విధులు నిర్వహిస్తున్నాడు. ఇటీవల వేతనాలు చెల్లించే బిల్లులో హోంగార్డు చిత్తూరులో పనిచేస్తుండడాన్ని గుర్తించిన కమిషనర్ షాక్కు గురయ్యారు.’’ ‘‘నిత్యం ఖద్దరు దుస్తుల్లో కనిపించే గంగాధరనెల్లూరుకు చెందిన ఓ టీడీపీ నేత ఇటీవల ఎంపికైన ఓ హోంగార్డుకు చిత్తూరు రవాణా శాఖ కార్యాలయంలో పోస్టింగ్ వేయిం చాడు. వాహన తనిఖీ అధికారి(ఎంవీఐ)తో పాటు ఉండే ఆ హోంగార్డు అధికారులు లేని సమయంలో ఎంవీఐ వాహనం తీసుకెళ్లి జాతీయ రహదారుల్లో వాహనాలు ఆపుతూ దోపిడీకి పాల్పడుతున్నాడు. టీడీపీ నేత రెకమెండేషన్ కావడంతో అధికారులు ఏమీ చేయలేని పరిస్థితి’’ చిత్తూరు అర్బన్: రోడ్లపై నిలబడి ట్రాఫిక్ చూడడం, అధికారులకు టీ కాఫీలు తెచ్చివ్వడం, రాత్రి గస్తీలకు వెళ్లడం ఇష్టపడని కొందరు హోంగార్డులు వారి పలుకుబడి ఉపయోగించి జిల్లా రవాణా శాఖలోనే పనిచేయడానికే ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం సామ, భేద, దండోపాయాలను ఉపయోగిస్తున్నారు. అవసరమైన చోట డబ్బు ఇవ్వడం.. డబ్బులు పనిచేయని చోట అధికార పార్టీ నేతల ద్వారా పోస్టింగులు వేయించుకోవడం చేస్తున్నారు. ఇంతగా రవాణా శాఖలో పోస్టింగులు వేయించుకోవడానికి కారణాలు ఏమిటి..? అసలు రవాణా శాఖే కావాలని ఎందుకు పట్టుపడుతున్నారు..? ఇక్కడ హోంగార్డులు చేసే పనులేమిటి..? ఏంచేస్తున్నారో.. మీరే చదవండి. ఇవీ విధులు.. పోలీసు శాఖలాగే హోంగార్డులకు సైతం పనిగంటల్లో పరిమితి ఉండదు. అయితే శాంతి భద్రతలు, ట్రాఫిక్, ఇతర విభాగాల్లో పనిచేసే హోంగార్డులకు షిప్టు పద్ధతిలో అధికారులు విధులు కేటాయిస్తుం టారు. పోలీసు శాఖలోని హోంగార్డులకు రవాణా శాఖలో విధులు కేటాయించే బాధ్యత చిత్తూరు, తిరుపతిలోని హోంగార్డు విభాగ అధికారులు చూస్తుంటారు. రవాణా శాఖకు అటాచ్మెంట్ చేసిన హోంగార్డులు డీటీసీ, ఆర్టీఓ, ఎంవీఐ, ఏఎంవీఐ అధికారుల వద్ద పనిచేయాలి. అధికారులు తనిఖీలకు వెళ్లినప్పుడు రాత్రయినా సరే వెళ్లాల్సిందే. నెలమొత్తం పనిచేసిన హోంగార్డు ఎవరి వద్ద పనిచేశారో తెలిపే డ్యూటీ సర్టిఫికెట్ను చిత్తూరులోని డీటీసీ కార్యాలయంలో అందజేయాలి. చేస్తున్న పనులు ఇలా.. జిల్లాలో చిత్తూరు, తిరుపతి రవాణా శాఖ కార్యాలయంతో పాటు ఐదు చోట్ల యూనిట్, ఎంవీఐ కార్యాలయాలు, మూడు చెక్పోస్టులున్నాయి. ఇద్దరు ఆర్టీఓలతో పాటు 32 మంది ఎంవీఐల వద్ద 32 మంది హోంగార్డులుగా పనిచేస్తున్నారు. వీరికి ప్రతినెలా డ్యూటీ సర్టిఫికెట్ చూసి ఒక్కొక్కరికి నెలకు రూ.18 వేల జీతాన్ని రవాణా శాఖ చెల్లిస్తోంది. రవాణా శాఖలో పనిచేయడానికి చాలామంది హోంగార్డులు డబ్బులిచ్చి పోస్టింగులు వేయించుకుంటున్నారనే విమర్శలున్నాయి. కొందరు ఎంవీఐలు తనిఖీల సమయంలో అవినీతి కార్యకలాపాలకు పాల్పడడాన్ని హోంగార్డులు ప్రత్యక్షంగా చూస్తూ అక్రమ మార్గాల్లో సంపాదనపై దృష్టి పెడుతున్నారు. చిత్తూరులోని ఓ ఎంవీఐ వద్ద పనిచేసే హోంగార్డు ఎంవీఐ వాహనం తీసుకెళ్లి గ్రానైట్ రాళ్లు తీసుకెళ్లే లారీల వద్ద డబ్బు వసూలు చేస్తూ దొరికిపోయినా దీన్ని బయటకు పొక్కనీయకుండా అధికారులు మందలించి సర్దుబాటు చేసేశారు. ఇక కూడళ్లు ఉన్న రోడ్లు, జాతీయ రహదారులు, చెక్పోస్టుల్లో ఓవైపు ఎంవీఐలు దందాలు చేస్తుంటే, పక్కనే మరోవైపు హోంగార్డులు మామూళ్లు వసూలు చేస్తుంటారు. ఎన్ఆర్ పేట, పలమనేరు, రేణిగుంట చెక్పోస్టుల్లో ఈ చిత్రాలు నిత్యం కనిపిస్తూనే ఉంటాయి. కొందరు హోంగార్డుల్లో రోజుకు రూ.10 వేలు సంపాదించే వాళ్లు కూడా ఉన్నారని బహిరంగ ఆరోపణలున్నాయి. ఇంత ఆదాయం వస్తున్న రవాణా శాఖలో పోస్టింగ్ కోసం తొలుత రూ.30 వేల నుంచి రూ.50 వేలను ఇవ్వడానికి ఏమాత్రమూ వెనుకాడడం లేదు. హోంగార్డు విభాగంలో పనిచేసే ఒకరిద్దరు అధికారుల నుంచి పర్యవేక్షణ చూసే సిబ్బంది వరకు మామూళ్లు ఇస్తూ ఏళ్ల తరబడిగా రవాణా శాఖలో పాతుకుపోయారు. కొందరు ఎంవీఐలు హోంగార్డులను సొంత పనులకు ఉపయోగించుకుంటుండటంతో అధికా రుల బలహీనతను హోంగార్డులు పసిగట్టేసి సొంతంగా తనిఖీలకు సైతం వెళ్లే స్థాయికి చేరుకున్నారనే ఆరోపణలున్నాయి. మార్చమని చెబుతున్నాం.. తిరుపతిలో ఓ హోంగార్డును వద్దని ఆపేస్తే అతను మా చెక్పోస్టులోనే పనిచేస్తున్నట్లు గుర్తించాం. జీతం ఆపేసి, అతన్ని వెనక్కు పంపాం. ఆర్నెల్లపాటు హోంగార్డు మా వద్ద పనిచేస్తే బ్యాచ్ల వారీగా రొటేట్ చేయమని పోలీసులకు రాస్తున్నాం. మా ఎంవీఐలు ఎక్కడైనా హోంగార్డులను మిస్యూస్ చేస్తుంటే ఫిర్యాదు చేయండి. యాక్షన్ తీసుకుంటాం. – సీహెచ్.ప్రతాప్, ఉప రవాణా కమిషనర్ -
మరీ ఇంత అధ్వానమా..?
తిరుపతి అర్బన్: మీ ఇళ్లలోనూ పారిశుధ్యం ఇలాగే ఉంటుందా.. అంటూ తిరుపతిలోని రుయా వైద్యాధికారులపై జిల్లా కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న కన్నెర్ర చేశారు. శుక్రవారం సాయంత్రం ఆయన రుయాలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముందుగా అత్యవసర వైద్య విభాగంలో తనిఖీలు చేపట్టిన కలెక్టర్, అక్కడ బెడ్కవర్లు అపరిశుభ్రంగా ఉండడాన్ని గమనించి సూపరింటెండెంట్ డాక్టర్ సిద్ధానాయక్, సీఎంఓలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విభాగంలో మెడికల్ వేస్ట్ నిర్వహణ కూడా సరిగా లేకపోవడంతో అధికారులు, సిబ్బందిపై మండిపడ్డారు. అదేవిధంగా రోగులతోపాటు వారికి సహాయంగా వచ్చేవారు కూర్చునేందుకు తక్షణం సౌకర్యాలు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అర్బన్ గ్రీన్ కార్పొరేషన్తో పచ్చదనం రుయాకు రోజూ వచ్చే రోగులకు మరింత ఆహ్లాద, ఆరోగ్యకర వాతావరణం ఏర్పడేలా అర్బన్ గ్రీన్ కార్పొరేషన్ ద్వారా పరిసరాల్లో పచ్చదనం కల్పించాలన్నారు. ఆస్పత్రి అభివృద్ధి కమిటీ(హెచ్డీసీ) సమావేశాలను ప్రతినెలా క్రమం తప్పకుండా నిర్వహించా లన్నారు. గత సమావేశంలో నిర్ణయించి పెండింగ్లో ఉన్న అన్ని పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. భద్రతకు ప్రాధాన్యం.. రుయా, మెటర్నిటీ, చిన్నపిల్లల ఆస్పత్రుల వద్ద భద్రతకు అత్యధిక ప్రా«ధాన్యత ఇస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. అందులో భాగంగా 40 అధునాతన సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలి పారు. రుయాలో సహాయకుల విశ్రాంతి భవనాన్ని ప్రసూతి ఆస్పత్రి రోగుల కోసం విని యోగించాలన్నారు. అన్ని ప్రభుత్వాస్పత్రులకు కలిపి సెంట్రలైజ్డ్ ఆక్సిజన్ సరఫరాకు చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం రుయా పరిపాలనా భవనంలో హెచ్డీసీ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ రవిప్రభు, ప్రసూతి ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ భారతి, హెచ్డీసీ సభ్యులు డాక్టర్ సుధారాణి, చినబాబు, ఆర్ఎంఓ డాక్టర్ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. -
బూత్ కమిటీలతోనే పార్టీ పటిష్టం
నగరి (నిండ్ర) : పార్టీ పటిష్టతకు బూత్ కమిటీలు చురుగ్గా వ్యవహరించాలని ఎమ్మెల్యే ఆర్కే రోజూ దిశానిర్దేశం చేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో గురువారం నగరి రూరల్ మండల బూత్ కమిటీ నేతలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. నియెజకవర్గంలోని అన్ని మండలాల్లో పార్టీ పటిష్టతకు కమిటీలు సమన్వయంతో వ్యవహరించడం వల్ల పట్టు సాధించామని, రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, మరింత చురుగ్గా వ్యవహరించాల్సిన అవసరాన్ని ఆమె ప్రధానంగా ప్రస్తావించారు. గ్రామాల్లో వైఎస్సార్సీపీ మద్దతుదార్ల పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తున్నారని, ఆ విషయాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. కొత్తగా ఓటర్లను నమోదు చేయించడానికి కూడా మరింత చురుగ్గా వ్యవహరించాలని, దీనివల్ల పార్టీకి బలం చేకూరుతుందన్నారు. ఈ బాధ్యతలు తీసుకోవడంలో బూత్కమిటీలు శ్రద్ధ తీసుకోవాలన్నారు. అమలుకాని వాగ్దానాలతో మోసం చేసిన ప్రభుత్వ పెద్దల తీరుపై ప్రజలను మరింత చైతన్యం చేయడంతో పాటు, అధికారంలోకి రాగానే వైఎస్సార్సీపీ అమలు చేయనున్న నవరత్న పథకాలపై విస్తృతంగా ప్రచారం చేసి, ప్రజల అభిమానం చూరగొనాలన్నారు. ఆ ప్రచారం నమ్మవద్దు.. నగరి వైఎస్సార్ సీపీ అభ్యర్ధిగా తనకు టికెట్ లేదని కొందరు సాగిస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దని ఎమ్మెల్యే రోజా పార్టీ శ్రేణులను కోరారు. నేను పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నా. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, శ్రేణులు పార్టీని మరింత పటిష్టం చేయాలనే తపనతోనే ఉన్నారు. తనపై తప్పుడు ప్రచారం చేయడం సరికాదని ఆమె హితవు పలికారు. రాష్ట్రంలో అధికార పార్టీని సూటిగా నిలదీసే వారిలో నేను కూడా ఒకరినని రోజా తెలిపారు. దీంతో తనపై అనవసరంగా తప్పుడు ప్రచారం సాగిస్తున్నారని అన్నారు. నా జీవితం పార్టీకే అంకితం. జగన్ అన్నకు తోడుగా ఉంటానని స్పష్టం చేశారు. పార్టీ అధికారంలోకి రాగానే వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో నగరి నియోజకవర్గంలో అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చూపిస్తానని అన్నారు. గెలుపే ధ్యేయం కావాలి.. నగరి నియోజగవర్గంలో పార్టీ నాయకులు కలిసికట్టుగా పనిచేయాలని వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ నాయకుడు కేజే.కుమార్ కోరారు. నగరి బూత్ కమిటీ సభ్యుల సమావేశంలో అయన మాట్లాడారు. గ్రామ స్థాయి నుంచి నాయకులు, కమిటీ సభ్యులు పార్టీ విజయానికి మరింత పట్టుదలతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో నగరిలో రోజాను మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపించుకుని, రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాలన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిని సీఎం చేసుకోవాల్సిన చారిత్రాత్మక అవసరం ఉందన్నారు. టీడీపీ నాయకుల అరాచకాలను ప్రజలకు వివరించి మరింత చైతన్యం చేయాలన్నారు. నగరిలో ఇసుక మాఫియా, ఎర్రచందనం అక్రమ రవాణాతో పాటు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న తీరుపై ప్రజలకు వివరించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు బుజ్జిరెడ్డి, చంద్రారెడ్డి, హరిహరన్, సుధాకర్రెడ్డి, తిరుమలరెడ్డి, నాగయ్యనాయుడు, కృష్ణమూర్తి, పరుశురామ్, ప్రతీప్లు పాల్గొన్నారు. -
తొందరపడ్డావు తల్లీ..!
ఇద్దరు ఆడబిడ్డలు పుట్టగా.. మగబిడ్డకోసం భర్త, అత్తమామలు వేధించారు.. మళ్లీ ఆడబిడ్డ పుడితే.. అన్న ఆలోచనతో ఆడబిడ్డలతో సహా బలవన్మరణానికి పాల్పడింది. ఇప్పుడు పోస్టుమార్టం రిపోర్టులో ఆమె కడుపులో ఉన్నది మగశిశువని తేలింది. తొందరపడ్డావేమో తల్లీ అంటూ బంధువులు దుఃఖిస్తున్నారు. చిత్తూరు రూరల్ : చిత్తూరు రూరల్ మండలం పేయనకండ్రిగకు చెందిన గర్భిణి సరళ (25) తన ఇద్దరు కుమార్తెలు జాహ్నవి (5), దేవిశ్రీ (2)లతో సహా బుధవారం బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. మగబిడ్డ లేద న్న కారణంతో భర్త, అత్త, మామ ఆమె ను కొంతకాలంగా వేధిస్తూ వచ్చారు. ఈ క్రమంలో మంగళవారం వారు ఆమెను కొట్టడం, దుర్భాషలాడడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది. ఇరుగుపొరుగుతోనూ తన బాధను చెప్పుకోలేక జీవితం పై విరక్తి చెంది గ్రామ సమీపంలోని బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. తాను లేకపోతే తన ఇద్దరు కుమార్తెలు ఏమైపోతారో.. వాళ్ల ఆలనాపాలన ఎవ రు చూసుకుంటారో.. తనకు పట్టిన గతి వాళ్లకూ పడుతుందేమోనని వ్యథచెంది తనతో పాటు వారినీ మృత్యు ఒడిలోకి చేర్చింది. కడుపులో మగబిడ్డే.. బుధవారం ఇద్దరు బిడ్డలతో సహా గర్భిణి సరళ ఆత్మహత్య చేసుకోవడంతో పోలీసులు మృతదేహాలను శవపరీక్షల నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించా రు. గురువారం మధ్యాహ్నం సరళ మృతదేహాన్ని పోలీసులు, వైద్యాధికారులు, రెవెన్యూ అధికారులు, కుటుంబ సభ్యుల సమక్షంలో పోస్టుమార్టం పూర్తి చేశారు. పోస్టుమార్టంలో సరళ కడుపులో ఉన్నది మగబిడ్డ అని తేలింది. సాయంత్రం డీఎస్పీ సుబ్బారావు మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. విషయం తెలు సుకున్న తండ్రి, బంధువులు ‘తొందర పడ్డావు తల్లీ’ అంటూ రోదిస్తున్నారు. ఆత్మహత్య కారణమైన కుటుంబీకుల అరెస్ట్ ఇద్దరు ఆడబిడ్డలతో సహా గర్భిణి సరళ ఆత్మహత్యకు కారణమైన కుటుంబీల ను గురువారం తాలూకా పోలీసులు అ రెస్టు చేశారు. భర్త గురునాథం (35), అత్త చిన్నమ్మ (45), మామ రాజేంద్ర (55)లను పోలీసులు డీఎస్పీ సుబ్బారావు ఎదుట హాజరుపరచి రిమాండ్కు తరలించారు. ఈ కేసులో భర్త, అత్తమామలతో పాటు ఆడపడుచు బేబి ప్రమేయం కూడా ఉందని విచారణలో తేలినట్లు డీఎస్పీ తెలిపారు. రెండు రోజుల్లో ఆమెను కూడా అరెస్టు చేస్తామని చెప్పారు. కుటుంబంలో కలహాలు ఏర్పడితే మహిళలు సమీపంలోని పోలీసుస్టేషన్ను ఆశ్రయించాలని సూచించారు. సమావేశంలో ఎస్ఐలు సోమశేఖర్రెడ్డి, రామ్లక్ష్మీరెడ్డి, రాజశేఖర్ తదితరులు ఉన్నారు. -
కోనప్పరెడ్డిగారిపల్లిలోనూ అదే మోసం..!
చంద్రగిరి : జాతీయ రహదారి విస్తరణలో ఇళ్లు, పొలాలు కోల్పోతున్న రైతుల వద్ద ఖాళీ పత్రాలపై సంతకాలు చేయించుకున్న ఘటన పాకాల మండలం కోనప్పరెడ్డిగారిపల్లి, చంద్రగిరి మండలం అగరాల గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ‘సాక్షి’ దినపత్రికలో ప్రభుత్వ అధికారుల మోసంపై బుధవారం వచ్చిన కథనంతో బాధితుల్లో చైతన్యం వచ్చింది. కోనప్పరెడ్డిగారిపల్లిలోని సుమారు 80 కుటుంబాల వద్ద అధికారులు ఖాళీ పత్రాలపై సంతకాలు చేయించుకుని మోసం చేసినట్లు గ్రహించిన బాధితులు అందోళనకు సన్నద్ధమయ్యారు. తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారి ఆరులైన్ల రోడ్డు నిర్మాణంలో భాగంగా నిరుపేదలు, నిరక్షరాస్యులైన తమను నట్టేటముంచి, ప్రభుత్వ పెద్దలకు పట్టం కట్టేందుకు అధికారులు తమ పొట్ట కొడుతున్నారన్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ అ«ధికారులు తమను బెదిరించి, మోసం చేసి అక్రమంగా సంతకాలు చేయించుకున్నారని తెలిపారు. రెవెన్యూ అధికారులు తమ దగ్గర నుంచి సంతకాలు తీసుకున్న పత్రాలు తిరిగి ఇచ్చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే గురువారం పాకాల తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. బాధితులకు ఎమ్మెల్యే చెవిరెడ్డి అండ.. అగరాల, కోనప్పరెడ్డిగారిపల్లిలో రెవెన్యూ అధికారుల మోసాన్ని తెలుసుకున్న చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి బుధవారం సాయంత్రం బాధితులతో మాట్లాడారు. కూలికెళ్తే గాని పూటగడవని పేదలను ఇలా మోసం చేయడం సమంజసం కాదన్నారు. విస్తరణ బాధితులకు న్యాయం చేసేందుకు కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు. బాధితులను మోసం చేసి సంతకాలు తీసుకున్న ఖాళీ పత్రాలను వెంటనే తిరిగిచ్చేయాలని ఆయన కోరారు. అనంతరం పాకాలవారిపల్లి, కోనంగివారిపల్లిలోని బాధితులతో ఆయన సమావేశం నిర్వహించారు. -
ఆ కుటుంబాన్ని విధి చిదిమేసింది..!
మదనపల్లె క్రైం : కురబలకోట మండలం కంటేవారిపల్లె దగ్గరున్న కనిగలబావి ఈ నెల 6న వద్ద లారీ కారును ఢీకొన్న ప్రమాద విషయం తెలిసిందే. కదిరి వైపు నుంచి మదనపల్లెకు వస్తున్న లారీ ములకలచెరువు వైపు వెళుతున్న కారును ఢీకొనడంతో కారును నడుపుతున్న యజమాని అక్కడికక్కడే దుర్మరణం చెందడం, కారులో ఉన్న అతని భార్య, కుమార్తె తీవ్రంగా గాయపడటం విదితమే. వారిని చికిత్స ని మిత్తం మదనపల్లె, బెంగళూరులకు తరలించగా మంగళవారం రాత్రి ఒక రు చనిపోయారు. తీవ్రంగా గాయపడిన మరొకరు మృత్యువుతో పోరాడుతున్నారు. వివరాలిలా.. మదనపల్లె పట్టణం సీటీఎం రోడ్డు బాపూజి పార్కు ఎదురుగా ఉన్న గొల్లపల్లెకు చెందిన ఎస్.మోహన్(47)కు భార్య రెడ్డిరాణి(41), పావని(18) ఉన్నారు. మోహ న్ స్థానికంగా చిన్నచిన్న వ్యాపారాలు చేస్తుండగా, ఇతని భార్య ములకలచెరువులోని ఓ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తోంది. భార్య జ్ఞానధార కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉండగా, మోహన్ ఆమెను తన కారులో తీసుకెళుతూ, ఇంట్లో ఒంటరిగా ఉంటుం దని కుమార్తెను కూడా వెంట తీసుకెళ్లాడు. ముగ్గురూ సంతోషంగా కారులో వెళుతుంటే దేవుడికి కన్నుకుట్టిందేమో..! క్షణాల్లో ఎదురుగా వచ్చిన లారీ మృత్యువై కారును ఢీకొంది. ఈ సంఘటనలో మోహన్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఆయన భార్య రెడ్డిరాణి, పావని తీవ్రంగా గాయపడ్డారు. 108 సిబ్బంది వారిని చికిత్స నిమిత్తం మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు రెడ్డిరాణిని తిరుపతికి, పావనిని బెంగళూరుకు రెఫర్ చేశారు. బెంగుళూరులో చికి త్స పొందుతూ పావని మంగళవారం రా త్రి మృతి చెందింది. వెన్నుపూస దెబ్బతినడంతో మాటలు కోల్పోవడమే కాకుండా, స్పర్శను కోల్పోయిన రెడ్డిరాణి మృత్యువుతో పోరాడుతోంది. అతివేగం తెచ్చిన అనర్థానికి ఓ కుటుంబం మొత్తం బలైంది. ఇంట్లో ఇద్దరు ఒకరి తరువాత ఒకరు చనిపోవడాన్ని స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంటికి వచ్చిన మృతదేహాలను చూడటానికి వచ్చిన బంధువుల కన్నీటిని తుడవడం ఎవరితరం కాలేదు. ఆత్మహత్యకు యత్నించిన మహిళ మృతి శాంతిపురం : నమ్ముకున్నవాడు మోసం చేయడాన్ని జీర్ణించుకోలేక ఆత్మహత్యకు యత్నించిన మహిళ మృత్యువుతో పోరాడుతూ బుధవారం మృతిచెందింది. మండలంలోని కడపల్లి పంచాయతీ శ్యామరాజపురానికి చెందిన మృతురాలి తల్లి పార్వతి ఫిర్యాదు మేరకు.. శ్యామరాజపురానికి చెందిన సుగుణ బంధువులతో పాటు బెంగళూరులో కూలి పనులకు వెళ్లేది. అదే గ్రామానికి చెందిన దేవేంద్ర ఆమెను ఇష్టపడి అక్కడే పెళ్లి చేసుకున్నాడు. ఈ నెల 8న స్వగ్రామానికి బయలుదేరిన వీరు మార్గంమధ్యలోని కుప్పంలో గొడవపడ్డారు. సుగుణను వదిలి దేవేంద్ర వెళ్లిపోయాడు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె అదేరోజు కుప్పం పార్కులో విషం తాగి ఆత్మహత్యకు యత్నించింది. బంధువులు అపస్మారక స్థితిలోని ఆమెను స్థానిక ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. ఆరు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన సుగుణ బుధవారం మృతిచెందింది. పోస్టుమార్టం అనంతరం శ్యామరాజపురం వద్ద అంత్యక్రియలు నిర్వహించారు. కుప్పం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
సీఎం సారు పింఛన్ అందేలా చూడండి : మాజీ ఎమ్మెల్యే
పలమనేరు : రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా మాజీ ఎమ్మెల్యేలకు అందించే పింఛన్ మూడు నెలలుగా తనకు అందలేదని, దాన్నే నమ్ముకుని బతికే తనకు జీవనం కష్టంగా ఉందని పలమనేరు మాజీ ఎమ్మెల్యే టీసీ రాజన్ ఆవేదన వ్యక్తం చేశారు. తన స్వగృహంలో గురువారం ఆయన సాక్షితో మాట్లాడుతూ తమకు ప్రభుత్వం ప్రతినెలా రూ.30 వేలు పింఛన్గా ఇచ్చేదన్నారు. తాను అప్పట్లో ఎమ్మెల్యేగా ఉండి ఏమీ సంపాదించుకోలేదని, ప్రస్తుతం ఉండేందుకు ఇల్లు కూడా లేక అద్దె ఇంట్లో ఉంటున్నానని తెలిపారు. కనీసం ఆస్పత్రి ఖర్చులు, దైనందిన జీవనానికి కూడా ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదని బాధపడ్డారు. ఆర్థికంగా బాగున్న మాజీ ఎమ్మెల్యేలకు పింఛన్ పెద్ద విషయం కాదని, తనలాంటి వారి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. పింఛన్ విషయంగా ఏదేని సమాచారం కావాలంటే అమరావతిలోని ఎమ్మెల్యేల పింఛన్ కార్యాలయం నంబర్కు ఫోన్ చేస్తే ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. తన హయాంలో ఇలాంటి చెత్త పాలనను ఎన్నడూ చూడలేదని దుయ్యబట్టారు. కనీసం జిల్లాకు విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయినా తనకు మూడు నెలల పింఛన్ అందేలా చూడాలని కోరారు. -
ఆయన చావుకి కారణం నువ్వే?
పుత్తూరు : ‘ చంద్రబాబు నాయుడు నీతిమాలిన రాజకీయాలతో ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తోంది... వెన్నుపోటు పొడిచి ఆ మహానుభావుడి మరణానికి కారణమైన ఆయనే ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని కోరడాన్ని అభిమానులు, నిజమైన టీడీపీ వాదులు జీర్ణించుకోలేకున్నారు.. అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే కళత్తూరు నారాయణస్వామి ధ్వజమెత్తారు. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ఎన్టీఆర్కు భారతరత్న అంశాన్ని తెరపైకి తీసుకొస్తారని విమర్శించారు. గురువారం పట్టణంలోని ఎస్బీఐ కాలనీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు స్వార్థానికి ఇప్పటికీ ఎన్టీఆర్ పేరును ఉపయోగించుకుంటూనే ఉన్నారని తెలిపారు. ఎన్టీఆర్ బొమ్మతో గెలిచిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి వాళ్లతోనే ఆయనపై వైస్రాయ్ హోటల్ ఎదుట దాడి చేయించారని, అసెంబ్లీలో మైక్ కూడా ఇవ్వకుండా ఘోరంగా అవమానించారని పేర్కొన్నారు. ఎన్టీఆర్ ఎంతో సదుద్ధేశంతో అమలు చేసిన మద్యపాన నిషేధాన్ని తుంగలో తొక్కారని. ఎన్టీఆర్ మానసిక పుత్రికైన రెండు రూపాయల కిలో బియ్యాన్ని ఐదు రూపాయలు చేశారని తెలిపారు. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున తాము కూడా మనస్ఫూర్తిగా కోరుకుం టున్నామని, ఈ అంశాన్ని ప్రస్తావించే అర్హత మాత్రం చంద్రబాబునాయుడుకు లేదని తేల్చి చెప్పారు. -
వెలవెలబోయిన నవనిర్మాణ దీక్షలు
నగరి : నవనిర్మాణ దీక్ష పేరిట ప్రభుత్వం నిర్వహించిన శిబిరాలు వెలవెలబోయాయి. నగరి మున్సిపల్ పరిధిలోని 1, 25, 26, 27 వార్డులకు కొండచుట్టు మండపం వద్ద, 3, 4, 5, 6, 22, 23, 24 వార్డులకు పీసీఎన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నవనిర్మాణ దీక్షా శిబిరాలు ఏర్పాటు చేశారు. వీటి నిర్వహణకు సూపర్వైజర్లుగా మేనేజర్ రవికుమార్, ఆర్ఓ ఇమ్రాన్ ఖాన్ను నియమించారు. ఉదయాన్నే వీరు షామియానాలు, చైర్లు వేసి దీక్షా శిబిరాన్ని సిద్ధం చేశారు. కానీ 11 గంటల వరకు కూడా జనం శిబిరాల వద్ద ఎక్కడా కనిపించలేదు. కౌన్సిలర్లు కూడా రాలేదు.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవనిర్మాణ దీక్షల్లో అధికారులతో పాటు ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. పలువురు కౌన్సిలర్లు కూడా హాజరుకాలేదు. దీంతో అధికారులు ఉన్న జనంతో మమ అంటూ నవనిర్మాణ దీక్షా శిబిరాలను ముగించేశారు. నేలపై కూర్చుని టీడీపీ నాయకుల నిరసన కొండచుట్టు మండపం వద్ద ఏర్పాటు చేసిన నవనిర్మాణ దీక్షా శిబిరంలో కమిషనర్, తహసీల్దార్ గైర్హాజరయ్యారంటూ 1వ వార్డుకు చెందిన కౌన్సిలర్ లత, టీడీపీ నాయకులు చలపతి ఆగ్రహానికి గురయ్యారు. ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ శిబిరాలకు అధికారులే రాకుంటే ఎలా అని ప్రశ్నించారు. ప్రజలు ఎదుర్కొనే సమస్యలకు ఎవరు సమాధానం చెబుతారన్నారు. 1వ వార్డులో ప్రజలకు పట్టాలు ఇవ్వలేదని, తాగునీరు, పారిశుద్ధ్యం సమస్య ఉందని అధికారులు రాకుంటే వీటిని ఎవరికి చెప్పుకోవాలన్నారు. వేదికపై వారికి ఏర్పాటు చేసిన సీట్లను వదిలి నేలపై కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. నవనిర్మాణ దీక్షకు సందన కరువు విజయపురం : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా చేపట్టిన నవనిర్మాణ దీక్షకు ప్రజలను నుంచి స్పందన పూర్తిగా కరువైంది. ఎంపీడీఓ బాలగణేష్ ఆధ్వర్యంలో శనివారం పన్నూరు, సూరికాపురంలో నవనిర్మాణ దీక్షలు జరిగాయి. కానీ ఎక్కడా జనం పాల్గొనకపోవడంతో సభలు వెలవెలబోయాయి. అందరికీ అండగా ఉంటాం... పుత్తూరు: అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించి అండగా ఉంటామని ఎమ్మెల్సీ గాలి సరస్వతమ్మ పేర్కొన్నారు. శనివారం పుత్తూరు మున్సిపల్ కార్యాలయం ఎదుట నవనిర్మాణదీక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు తాను, తన కుమారుడు గాలి జగదీష్ అండగా ఉంటామని వ్యాఖ్యానించారు. దీంతో స్థానిక టీడీపీ వర్గాల్లో అలజడి నెలకొంది. పెద్ద కుమారుడు గాలి భానుప్రకాష్ పేరును ప్రస్తావించకపోవడంపై ఆయన వర్గీయులు కంగుతిన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ చంద్రన్న బీమా, పింఛన్ల పథకాలు ప్రజల మన్ననలు పొందాయన్నారు. నవనిర్మాణదీక్షలో భాగంగా అందరి చేత మున్సిపల్ కమిషనర్ శ్రీహరిబాబు ప్రతిజ్ఞ చేయించారు. డీఎస్పీ భవానీహర్ష, వైఎస్ చైర్మన్ ఆనంగి ఆనంద్, మాజీ చైర్మన్ కరుణాకరన్, మాజీ వైస్ చైర్మన్ ప్రతాప్రాజు, భాస్కర్, గణేష్, నాయకులు జయప్రకాష్ పాల్గొన్నారు. -
కేసు పెట్టి.. పరువు తీసిందని..
మదనపల్లె క్రైం : వేర్వేరుగా ఉండడంతోపాటు తప్పుడు కేసులు పెట్టి బంధువుల్లో తలవంపులు తెస్తోందని కట్టుకున్న భార్యను కడతేర్చాలని భర్త పథకం వేశాడు. కిరాయి హంతకులతో హత్య చేయించాడు. గత నెల 30న మదనపల్లె పట్టణం ఎస్బీఐ కాలనీలో జరిగిన మహిళా న్యాయవాది నాగజ్యోతి(40) హత్య కేసును మూడు రోజుల్లోనే పోలీసులు ఛేదించారు. సూత్రధారి అయిన భర్త జితేంద్ర(45)ని అరెస్టు చేశారు. ఈ మేరకు డీఎస్పీ ఎం.చిదానందరెడ్డి శనివారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. మదనపల్లె పట్టణం ఎస్బీఐ కాలనీలో ఉంటున్న ప్రముఖ న్యాయవాది జితేంద్రకు నాగజ్యోతితో 23 ఏళ్ల క్రితం వివాహమైంది. కొంత కాలానికి వీరి మధ్య కుటుంబ కలహాలు ఏర్పడ్డాయి. ఆ గొడవలు తారాస్థాయికి చేరాయి. దీంతో రెండేళ్ల క్రితం విడిపోయి ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. కేసు పెట్టి.. పరువు తీసిందని.. ఎనిమిది నెలల క్రితం నాగజ్యోతి స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్లో భర్త జితేంద్రపై తప్పుడు కేసు పెట్టింది. అంతేకాకుండా ఆమె కూడా న్యాయవాది కావడంతో నిత్యం అదే కోర్టులో భర్తకు ఎదురుపడుతూ దూషించేది. బంధువుల్లో తలవంపులు తీసుకువస్తుండడంతో జితేంద్ర తట్టుకోలేకపోయాడు. ఎలాగైనా భార్యను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. గతంలో ఒక కేసులో న్యాయం పొందడానికి తనను ఆశ్రయించిన నిందితుల్లో కొందరిని ప్రలోభ పెట్టాడు. వారితోపాటు మరికొంత మంది సాయంతో భార్యను హత్యచేసేందుకు పథకం వేశాడు. ఈ క్రమంలోనే ఆమె కదలికలను పసిగట్టిన కిరాయి హంతకులు గత నెల 30వ తేదీన మదనపల్లె పట్టణం ఎస్బీఐ కాలనీలో కోమటివానిచెరువు కల్వర్టు వద్ద ద్విచక్ర వాహనంలో వెళుతున్న నాగజ్యోతిని హత్య చేయించాడు. సీరియస్గా తీసుకున్న డీఎస్పీ పట్టపగలు మహిళా న్యాయవాది హత్యకు గురికావడాన్ని సీరియస్గా తీసుకున్న డీఎస్పీ చిదానందరెడ్డి నాలుగు బృందాలను ఏర్పాటుచేసి దర్యాప్తు చేపట్టారు. భర్త తీరుపై అనుమానంతో అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతను నేరాన్ని అంగీకరించాడు. న్యాయవాది జితేంద్రపై సెక్షన్ 302 రెడ్విత్ 34 కింద కేసు నమోదుచేసి అరెస్టు చేసినట్టు డీఎస్పీ తెలిపారు. ఇంకా కొంతమందిపై కేసు విచారణలో ఉందని, త్వరలో వారిని కూడా అరెస్టు చేస్తామన్నారు. మహిళా న్యాయవాది హత్య కేసును మూడు రోజుల్లోనే ఛేదించిన పోలీసులకు నగదు అవార్డులు, రివార్డులు ఇస్తున్నట్లు జిల్లా ఎస్పీ రాజశేఖర్బాబు తెలిపారని డీఎస్పీ చెప్పారు. కార్యక్రమంలో సీఐలు సురేష్కుమార్, నిరంజన్కుమార్, ఎస్ఐలు క్రిష్ణయ్య, నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
ప్రేమ పెళ్లి చేసుకున్న పదిరోజులకే...
వారు ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించుకుని పది రోజుల క్రితం పెళ్లి చేసుకున్నారు. సంతోషంగా కాపురం చేసుకుంటున్నారు. ఆదివారం కావడంతో సినిమా చూసేందుకు కొత్తగా కొనుగోలు చేసిన బైక్లో బయలుదేరారు. వారి అన్యోన్యతను చూసి విధికి కన్నుకుట్టింది. ట్రాక్టర్ రూపంలో వచ్చిన మృత్యువు భార్యను కబళించింది. భర్త పరిస్థితి విషమంగా ఉంది. పెళ్లయిన పది రోజుల కే కుమార్తె మృతిచెందడంతో ఆ తల్లిదం డ్రులు చేస్తున్న రోదనలు అన్నీ ఇన్నీ కావు. ఎర్రావారిపాళెం: స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద ఆదివారం రాత్రి ట్రాక్టరును బైక్ ఢీకొంది. దీంతో భార్య మృతిచెందింది. భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు.. స్థానిక పంచాయతీ మేదరపల్లెకు చెం దిన సోమశేఖర్(25), అతని భార్య నందిని(19), అదే గ్రామానికి చెందిన శివ(19) ద్విచక్ర వాహనంలో రొంపిచర్లలో సినిమా చూసేందుకు బయలుదేరారు. అదే సమయంలో ట్రాక్టర్ రాతి కూశాలతో రొంపిచెర్ల మీదుగా ఎర్రావారిపాళెం వస్తోంది. ట్రాక్టర్ సింగిల్ లైటుతో వస్తోంది. దీన్ని గమనించని ద్విచక్ర వాహనదారులు ట్రాక్టర్ను ఢీకొన్నారు. దీంతో భార్యాభర్తలు సోమశేఖర్, నందినికి తీవ్రంగా గాయపడ్డారు. శివకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గుర్తించిన స్థాని కులు 108కు సమాచారం అందించారు. 108 సిబ్బంది అక్కడికి చేరుకుని సోమశేఖర్, నందినిని తిరుపతి రుయాకు తరలించారు. మార్గమధ్యంలో నందిని మృతి చెందింది. సోమశేఖర్ పరిస్థితి విషమంగా ఉంది. శివకు స్థానికంగా చికిత్సలు అందించారు. నందిని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ గోపి తెలిపారు. ట్రాక్టర్ డ్రైవర్ సింగిల్ లైట్ వేసుకుని వస్తుం డడంతో ద్విచక్ర వాహనంగా భావించి సోమ శేఖర్ ద్విచక్ర వాహనం ఢీకొన్నట్టు ఎస్ఐ తెలిపారు. సోమశేఖర్ తిరుపతిలోని సాయిసుధ ఆస్పత్రిలో పనిచేస్తున్నట్టు తెలిసింది. -
రోడ్డు ప్రమాదంలో తండ్రీకూతురు మృతి
కూలీపనుల కోసం మోటార్ సైకిల్పై వెళుతోన్నతండ్రీకుతురు రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరులో మంగళవారం మంగళవారం ఈ ఘటన జరిగింది. సర్విరెడ్డి పల్లె గ్రామానికి చెందిన రఘునాథ్రెడ్డి(45), అతని కూతురు అరుణ(20)లు చిత్తూరుకు కూలీ పని కోసం బైక్పై బయలుదేరారు. కొద్దిసేపటికే ఎదురుగావస్తోన్న లారీ ఢీకొట్టింది. దీంతో రఘునాథ్రెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా, అరుణ.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. అరుణకు సొంతగ్రామానికే చెందిన చెంచురెడ్డితో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. రఘునాథ్రెడ్డికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు. పోస్టమార్టం కోసం మృతదేహాల్ని తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తుచేస్తున్నట్లు తెలిపారు. -
మున్సిపాలిటీ 'పరువు' హత్య!
పన్నుల వసూళ్ల కోసం చెత్త పద్ధతులు ఫాలో కావద్దని న్యాయస్థానాలు ఓ వైపు చీవాట్లు పెడుతూనే ఉన్నా పురపాలక అధికారుల చిత్తంలో మాత్రం మార్పు రావట్లేదు. చిత్తూరు జిల్లా పుంగనూరులో బకాయి వసూళ్ల కోసం మున్సిపల్ అధికారులు చేసిన నిర్వాకం ఓ నిండు ప్రాణాల్ని బలితీసుకుంది. సకాలంలో పన్నులు చెల్లించలేదంటూ పుంగనూరుకు చెందిన ఆదినారాయణ ఇంటి ముందు చెత్త ట్రాక్టర్ను నిలిపారు. మున్సిపల్ అధికారుల చర్యను ఘోర అవమానంగా భావించిన ఆదినారాయణ సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు ఆదినారాయణ వైఎస్సీర్ సీపీ రైతు విభాగం పుంగనురు అధ్యక్షుడు కూడా. మున్సిపల్ అధికారులే ఆదినారాయణను పొట్టనబెట్టుకున్నారంటూ ఆయన భార్యా, పిల్లలు పెద్దపెట్టున రోదించడం పలువురిని కంటతడి పెట్టించింది. అధికారులపై హత్య కేసు నమోదుచేయాలని కుటుంబసభ్యులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు. పుంగునూరు, పలమనేరు ఎమ్మెల్యేలు ఘటనా స్థలాన్ని సందర్శించారు. -
నారాయణ...నారాయణ !
సాక్షి ప్రతినిధి, తిరుపతి: జై తెలంగాణ అంటూ టీఆర్ఎస్ నేతలకంటే గట్టిగా డప్పుకొట్టి నినదించిన సీపీఐ నారాయణ సొంత జిల్లాకు దూరమైపోయారు. రాష్ట్ర విభజనపై వ్యతిరేకత ప్రారంభమైనప్పటి నుంచి ఆయన సొంత జిల్లా చిత్తూరుకు రావడమే మానేశారు. అంతకుముందు వారానికి రెండు సార్లు జిల్లాలో వాలిపోయే సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ తన దుందుడుకు ప్రకటనలతో తిరుపతికి వచ్చే సాహసమే చేయడం లేదు. చిత్తూరు జిల్లా నగరి మండలం అయినంబాకం గ్రామానికి చెందిన నారాయణ సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత పలు సంచలనాలకు కేంద్రబిందువయ్యారు. అయితే, నారాయణ నేతృత్వంలోని సీపీఐ ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకొన్న తరువాత ఆ పార్టీ సీమాంధ్రలో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోంది. చిత్తూరులో నారాయణతోపాటే ఆ పార్టీ నేతలు రోడ్ల మీదకు వచ్చే పరిస్థితి లేదు. మరో పక్క రాష్ట్రంలో ప్ర స్తుత పరిస్థితులపై సీపీఎం సమీక్ష పేరిట సీమాంధ్ర జిల్లాల్లో సమావేశాలు ఏర్పాటు చేస్తోంది. సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నామని గట్టిగా ప్రకటిస్తుండడంతో ఇప్పుడు సీపీఐ క్యాడర్పై ఒత్తిడి పెరుగుతోంది. దీంతో, గతంలో తమ పార్టీ కూడా సమైక్యాంధ్రకు అనుకూలంగా ఉద్యమాలు చేసిందని, ఈ సారి మాత్రమే తెలంగాణకు మద్దతిచ్చామని నారాయణ వివరణ ఇచ్చుకొంటున్నారు. వీటి సంగతెలా ఉన్నా తరచూ తిరుపతికి వచ్చి హల్చల్ చేసే నారాయణ ఇప్పుడు కనిపించడం లేదు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో నారాయణ సొంత గ్రామంలో ఆ పార్టీ ఏమాత్రం ప్రభావాన్ని చూపలేకపోయింది. ఇప్పుడు జిల్లాలో సీపీఐ పరిస్థితి దయనీయంగా మారింది. ఏదో సాకుతో రోడ్లమీదకు వచ్చి ఆందోళనలు చేద్దామంటే సమైక్యవాదుల నుంచి ప్రతిఘటన ఎదురవుతుందని ఆ పార్టీ నేతలు భయపడుతున్నారు. ప్రత్యేక తెలంగాణకు మద్దతిస్తున్న బీజేపీ నేతల కంటే ఇబ్బందికరమైన పరిస్థితులను సీపీఐ నేతలు జిల్లాలో ఎదుర్కొంటున్నారు. అందుకు కారణం నారాయణ వివాదస్పద వ్యాఖ్యలు, ైవె ఖరే అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సమైక్యాంధ్ర ఉద్యమం చిత్తూరు జిల్లాలో ఉవ్వెత్తున సాగినంతకాలం సీపీఐకి ఇక్కడ పనిలేనట్లే. -
ఉద్యోగుల గర్జన
సాక్షి, తిరుపతి: ఉద్యమం మహోద్యమంగా మారుతోంది. రోజుకో కార్యక్రమంతో సమైక్యవాదులు వినూత్న తరహాలో నిరసన తెలియజేస్తున్నారు. చిత్తూరులో మంగళవారం విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయులు సుమారు 5వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించి మానవహారం చేపట్టారు. న్యాయశాఖ ఉద్యోగుల మానవహారం నిర్వహించారు. తిరుపతిలో వెటర్నరీ కళాశాలలో ముగ్గులువేసి నిరసన తెలిపారు. టీటీడీ ఉద్యోగుల రిలేదీక్షలు కొనసాగాయి. తిరుపతి కార్పొరేషన్ కార్యాలయం ముందు శాప్స్ ఆధ్వర్యంలో రోడ్డుపై మాక్ స్కూల్ నిర్వహించారు. పుత్తూరులో ప్రభుత్వ వైద్యులు రోగులకు రోడ్డుపైనే వైద్యసేవలందిస్తూ నిరసన తెలిపారు. ఏపీ ఎన్జీవో, ఆర్టీసీ, అంగన్వాడీ, ఏఎన్ఎం, ఉపాధ్యాయ ఉద్యోగులు రిలేదీక్షలు కొనసాగించారు. వీరికి పలువురు మద్దతు పలికారు. విద్యుత్ శాఖ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో మౌనప్రదర్శన నిర్వహించారు. పుత్తూరు బాలికల, ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాలల విద్యార్థినులు నిరసన ప్రదర్శన చేశారు. మున్సిపల్ ఉద్యోగులు రాత్రి ఆంధ్రప్రదేశ్ చిత్రపటంలా కాగడాల ప్రదర్శన నిర్వహించారు. పలమనేరులో వైద్య, ఆరోగ్యశాఖ ఉద్యోగుల ర్యాలీ నిర్వహించి రిలేదీక్ష చేపట్టారు. ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ర్యాలీ నిర్వహించి మానవహారం నిర్వహించి మాక్డ్రిల్ చేశారు. న్యాయవాదులు చెవిలో పువ్వులు పెట్టుకుని ర్యాలీ చేశారు. బెరైడ్డిపల్లెలో టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ, మానవహారం, వంటావార్పు చేపట్టారు. గంగవర ం మండలం పొనబాకులపల్లె వద్ద డ్వాక్రా మహిళలు రిలేదీక్షలు, వంటావార్పు నిర్వహించి రోడ్డుపై బైఠాయించారు. కుప్పంలో జేఏసీ ఆధ్వర్యంలో నాయీబ్రాహ్మణులు, ఎద్దులబండి సంఘం, ప్రైవేటు విద్యాసంస్థల ఆధ్వర్యంలో ర్యాలీ, వంటావార్పు నిర్వహించారు. ఉద్యోగ సంఘాలు తహశీల్దార్ కార్యాలయం వద్ద దీక్షలు కొనసాగించారు. రామకుప్పం, గుడిపల్లె, శాంతిపురంలో జేఏసీ ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగించారు. జాతీయ పతాకంతో నిరసన బి.కొత్తకోటలో మోకాళ్లపై నిరసన తెలిపారు. ములకలచెరువులో 200 మీటర్లు, పుంగనూరులో 100 మీటర్ల జాతీయ పతాకంతో ర్యాలీ నిర్వహించారు. శ్రీకాళహస్తిలో అఖిలపక్షం ఆధ్వర్యంలో విద్యార్థులు నిర్వహించిన భారీ ర్యాలీలో మండలి బుద్దప్రసాద్ పాల్గొన్నారు. పౌరాణిక వేషధారణలో ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. తెలుగుతల్లి వేషధారణలో విద్యార్థులు, వివిధ సంఘాల ఉద్యోగులు సమైక్య ఉద్యమంలో పాల్గొన్నారు. మదనపల్లెలో కాలనీ అసోసియేషన్ల ఆధ్వర్యంలో సుమారు 4వేల మందితో ర్యాలీ నిర్వహించారు. గ్రానైట్ వారి ఆధ్వర్యంలో ర్యాలీ, సబ్కలెక్టర్ కార్యాలయం వద్ద రెవెన్యూ ఉద్యోగులు నిరవధిక దీక్ష, బీటీ కళాశాల వద్ద అధ్యాపకులు, సిబ్బంది రిలేదీక్షలు చేస్తున్నారు. యాదవ, కురవ సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి వంటావార్పు చేశారు. ట్రాన్స్కో ఉద్యోగులు చేపట్టిన రిలేదీక్షలు కొనసాగాయి. క్రైస్తవ ఐక్యసంఘం ఆధ్వర్యంలో రిలేదీక్షలకు కూర్చున్నారు. పీలేరులో టీటీడీ బోర్డు సభ్యుడు జీవీ శ్రీనాథరెడ్డి 48 గంటల నిరాహారదీక్షకు కూర్చున్నారు. ఎంజేఆర్ ఇంజనీరింగ్, వివిధ ప్రైవేటు కళాశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించి మానవహారం చేపట్టారు. జేఏసీ ఆధ్వర్యంలో సాయంత్రం దాకా వీధినాటకం, రాత్రి ఆర్కేస్ట్రా నిర్వహించి నిరసన తెలిపారు. సత్యవేడులో ఉపాధ్యాయులు భారీ మోటార్బైక్ ర్యాలీ నిర్వహించారు. చంద్రగిరిలో ఆటో డ్రైవర్లు రోడ్డుపై కబడ్డీ ఆడి రిలేదీక్షలు చేశారు. పెరుమాళ్లపల్లె బాలాజీ చిల్డ్రన్స్ అకాడమి విద్యార్థులు శ్రీకృష్ణుని వేషధారణలో ‘జె సమైక్యాంధ్ర’ ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. పుంగనూరులో వీరసేవ లింగాయతుల ఆధర్యంలో భారీ ర్యాలీ, రుద్రహోమం చేపట్టారు. జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ, రిలే దీక్షలు చేశారు. -
ఘాట్ రోడ్డులో రాకపోకలు బంద్
చింతూరు (ఖమ్మం), న్యూస్లైన్ : మరమ్మతులు చేసేందుకు చింతూరు - మారేడుమిల్లి ఘాట్రోడ్లో మంగళవారం నుంచి రాకపోకలు నిలిపివేశారు. సోమవారం ఘాట్రోడ్లో పలుచోట్ల అధికారులు హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. భధ్రాచలం ఆర్అండ్బీ పరిధిలో గల ఈ ఘాట్ రోడ్డులో ఇటీవల కురిసిన వర్షాలకు ఓ ప్రాంతంలో రిటైనింగ్వాల్ (రక్షణ గోడ) కూలిపోగా పలుచోట్ల కొండ చెరియలు విరిగిపడ్డాయి. వాటిని దృష్టిలో ఉంచుకుని అధికారులు రాకపోకలను నిలిపివేసి మరమ్మతులు చేపట్టాలని భావించారు. నెల రోజుల పాటు ఈ మరమ్మతులు కొనసాగనున్నట్టు సమాచారం. కొన్ని రోజుల క్రితం ఆర్అండ్బీ ఎస్సీ ఘాట్రోడ్ను పరిశీలించి మరమ్మతులు చేపట్టాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఈ రహదారిలో అన్నిరకాల వాహనాల రాకపోకలను నిలిపివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ఈ రహదారిలో ప్రయాణించే ఆర్టీసీ బస్సులకు సంబంధించిన డిపోలతో పాటు, పోలీసు అధికారులకు, రెవెన్యూ, ఐటీడీఏ అధికారులకు లేఖలు రాశారు. ఘాట్రోడ్లో మరమ్మతుల నిమిత్తం వాహనాల రాకపోకలు నిలిపివేయాల్సిందిగా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినట్టు ఆర్అండ్బీ ఈఈ వెంకటి తెలిపారు.15 రోజుల్లో మరమ్మతు పనులు పూర్తవుతాయని ఆయన పేర్కొన్నారు. ప్రయాణం ఇక దూరాభారమే ఓ వైపు ఇప్పటికే సీమాంధ్రలో బంద్ వాతావరణంతో బస్సులు సరిగా నడవక ఇబ్బందులు పడుతున్న భద్రాచలం డివిజన్ ప్రజలపై ఘాట్రోడ్ బంద్ తీవ్ర ప్రభావం చూపనుంది. భద్రాచలం, చింతూరు, కూనవరం, వీఆర్పురం, మండలాలకు చెందిన ప్రజలు, వ్యాపారులతో పాటు పొరుగునే వున్న ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలనుంచి నిత్యం అనేకమంది వివిధ పనుల నిమిత్తం రాజమండ్రి వెళుతుంటారు. దీంతోపాటు ఆంధ్రా, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి ప్రతిరోజు వందలాది సరుకు రవాణా లారీలు ఈ ఘాట్రోడ్లోనే ప్రయాణిస్తుంటాయి. మరోవైపు కాకినాడ, రాజమండ్రి, గోకవరం, జగ్దల్పూర్ డిపోలకు చెందిన బస్సులు నిత్యం ఈ ఘాట్రోడ్ ద్వారానే భద్రాచలం, జగ్దల్పూర్ ప్రయాణిస్తుంటాయి. రహదారి మూసివేయడంతో ప్రయాణికులతో పాటు లారీ యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోనున్నారు. ఇరుకుగా ఉండే ఘాట్రోడ్కు ఎక్కడా డైవర్షన్కు అవకాశం లేకపోవడంతో ఈ రహదారిలో వాహనాలు తిరిగే పరిస్థితి లేదు. ఘాట్రోడ్ బంద్తో రాజమండ్రి వైపు నుంచి చింతూరు, కూనవరం, వీఆర్పురం, మోతుగూడెం, డొంకరాయి, సీలేరు, భద్రాచలం, ఛత్తీస్గఢ్, ఒడిశాల వైపునకు వెళ్లే రవాణా లారీలతో పాటు బస్సులు రాజమండ్రి నుంచి వయా కుక్కునూరు మీదుగా భద్రాచలం వచ్చి అక్కడి నుంచి ఆయా ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఇక ఈ ప్రాంతాల నుంచి రాజమండ్రి వెళ్లాలన్నా వయా భద్రాచలం, కుక్కునూరు మీదుగానే ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. ఉదాహరణకు చింతూరు నుంచి రాజమండ్రికి 130 కి.మీ దూరంకాగా 4 గంటల ప్రయాణం, రూ 105 బస్సు చార్జీ. ప్రస్తుతం ఘాట్రోడ్ బంద్తో చింతూరు నుంచి భద్రాచలం 65 కిలోమీటర్లు అక్కడి నుంచి రాజమండ్రి సుమారుగా 200 కి.మీ. మొత్తం కలిపి 265 కి.మీల దూరం కాగా 135 కి.మీ అధికంగా, 5 గంటలు అదనంగా ప్రయాణించాల్సి ఉంటుంది. బస్సు చార్జీ సైతం రెట్టింపుకంటే అధికమవుతోంది. అటు సీమాంధ్ర.. ఇటు ఘాట్రోడ్డు బంద్ మరోవైపు సీమాంధ్రలో సమైక్య ఉద్యమం నేపథ్యంలో సోమవారం అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ బస్సులు నిలిచిపోనుండగా ఇదే తరుణంలో ఘాట్రోడ్డులో అన్ని వాహనాల రాకపోకలు నిలిచిపోనుండడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడనున్నారు. ఘాట్రోడ్లో కార్లు, ఆటోలకు కూడా అనుమతి లేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణం తప్పనిసరైన వారి గతేంటనేది ప్రశ్నార్ధకంగా మారింది. కార్లు, ఆటోలలో భద్రాచలం మీదుగా వెళ్లాలనుకున్నా మన జిల్లాలోని అశ్వారావుపేట దాటగానే పశ్చిమగోదావరి జిల్లా సరిహద్లుల్లో సమైక్యవాదులు వాహనాలను నిలిపివేసే ఆస్కారముండడంతో ఇటునుంచి వెళ్లే ప్రయాణికులు మరిన్ని కష్టాలు ఎదుర్కోనున్నారు.