consumption
-
పట్టణ వినియోగ పెంపునకు బ్లూప్రింట్
పట్టణ వినియోగం ఆర్థిక వృద్ధికి కీలకం. అయితే కొన్ని కారణాల వల్ల పట్టణ వస్తువినియోగం గతంతో పోలిస్తే తగ్గుతుంది. దీన్ని పెంచితేనే దేశ ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతుంది. ఇందుకోసం బడ్జెట్లో వ్యూహాత్మక విధానాన్ని పాటిస్తూ, కొన్ని అంశాలపై దృష్టి సారించాలని నిపుణులు చెబుతున్నారు. పట్టణ వినియోగాన్ని పెంచడానికి కొన్ని సూచనలు చేస్తున్నారు.మౌలిక సదుపాయాల అభివృద్ధిపట్టణ వినియోగం పెరగాలంటే ఆధునిక మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెట్టడం చాలా అవసరం. రవాణా నెట్వర్క్ను మెరుగుపరచడం, డిజిటల్ కనెక్టివిటీని విస్తరించడం, యుటిలిటీలను అప్గ్రేడ్ చేయడం వంటివాటిపై దృష్టి పెట్టాలి. సమర్థవంతమైన ప్రజా రవాణా వ్యవస్థ పట్టణ జీవనాన్ని మరింత సౌకర్యవంతంగా, ఆకర్షణీయంగా మారుస్తుంది. ఇది అధికంగా ఖర్చు చేసేందుకు ప్రోత్సహిస్తుంది.రిటైల్ వ్యవస్థపట్టణ వినియోగాన్ని పెంచడానికి శక్తివంతమైన రిటైల్ వ్యవస్థను, వాణిజ్య ప్రదేశాలను ఏర్పాటు చేయడం చాలా ముఖ్యం. నివాస, వాణిజ్య, వినోద ప్రాంతాలను మిళితం చేసేలా సదుపాయాలు సిద్ధం చేయాలి. స్థానిక వ్యాపారాలు, స్టార్టప్లను ప్రోత్సహించడం వల్ల సమ్మిళిత ఆర్థిక వాతావరణాన్ని పెంపొందించవచ్చు.చౌకగా గృహాలుడిస్పోజబుల్ ఆదాయం(ఖర్చులు పోను మిగిలే ఆదాయం) వస్తువుల వినియోగాన్ని పెంచడానికి, సరసమైన గృహాలను కొనుగోలు చేయడానికి తోడ్పడుతుంది. తక్కువ ధరకు లభించే గృహాలను ఏర్పాటు చేసే ప్రాజెక్టులు జీవన వ్యయాలను తగ్గిస్తాయి. వస్తువులు, సేవలపై ఎక్కువ ఖర్చు చేసేలా దోహదం చేస్తాయి. ఇది స్థానిక వ్యాపారాలకు ఊతమిస్తుంది.పర్యాటకాన్ని ప్రోత్సహించడంపట్టణ వినియోగానికి పర్యాటక రంగం గణనీయంగా దోహదం చేస్తుంది. పర్యాటక ఆకర్షణ స్థలాలను అభివృద్ధి చేయడం, ఆతిథ్య సేవలను మెరుగుపరచడం, సాంస్కృతిక, వారసత్వ ప్రదేశాలను కాపాడడం వల్ల సందర్శకులను ఆకర్షించవచ్చు. ఖర్చును పెంచవచ్చు. సమర్థవంతమైన మార్కెటింగ్ ప్రచారాలు, ట్రావెల్ ఏజెన్సీలతో భాగస్వామ్యాలు పట్టణ పర్యాటకానికి సహాయపడతాయి.ప్రజా సేవలను మెరుగుపరచడంఅభివృద్ధి చెందుతున్న పట్టణ వాతావరణానికి ఆరోగ్య సంరక్షణ, విద్య, భద్రత వంటి నాణ్యమైన ప్రజా సేవలు చాలా అవసరం. ఈ విభాగాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల నివాసితుల జీవన నాణ్యత మెరుగుపడుతుంది. ఇది స్థానికులకు, పెట్టుబడిదారులకు నగరాన్ని మరింత ఆకర్షణీయంగా మారుస్తుంది.సుస్థిర పద్ధతులుసుస్థిర పద్ధతులను అవలంబించడం వల్ల దీర్ఘకాలిక పర్యావరణ వ్యవస్థను పెంచవచ్చు. గ్రీన్ బిల్డింగ్స్, రెన్యూవబుల్ ఎనర్జీ, వేస్ట్ మేనేజ్ మెంట్ వంటి కార్యక్రమాలు మరింత సుస్థిరాభివృద్ధికి తోడ్పాటును అందిస్తాయి.ఇదీ చదవండి: సామాన్యుడు కేంద్ర బడ్జెట్ గురించి ఎందుకు తెలుసుకోవాలి..?అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యంపట్టణ ప్రజల అవసరాలు, ప్రాధాన్యతలను అర్థం చేసుకోవాలి. ప్రజా సంప్రదింపులు, ఫీడ్ బ్యాక్ యంత్రాంగాలు, భాగస్వామ్య ప్రణాళికలతో మెరుగైన సేవలందించవచ్చు. అభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యం చేస్తే నిజంగా అవసరమయ్యే ప్రాజెక్టుల రూపకల్పన జరుగుతుంది. ఇది అధిక వినియోగానికి దారితీస్తుంది.ఆర్థిక ప్రోత్సాహకాలుపన్ను రాయితీలు, సబ్సిడీలు, గ్రాంట్లు వంటి ఆర్థిక ప్రోత్సాహకాలను అందించడం వల్ల పట్టణ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టడానికి వ్యాపారాలను ప్రోత్సహించవచ్చు. ఈ ప్రోత్సాహకాలు ఆర్థిక కార్యకలాపాలను పెంచుతాయి. ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తాయి.సాంకేతిక పరిజ్ఞానంసాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం ద్వారా లావాదేవీలను మరింత సౌకర్యవంతంగా, సమర్థవంతంగా జరుపవచ్చు. డిజిటల్ చెల్లింపు వ్యవస్థలు, ఇ-కామర్స్ ప్లాట్ఫామ్లు, స్మార్ట్ సిటీ పరిష్కారాలు వినియోగ ప్రక్రియలను క్రమబద్ధీకరిస్తాయి. -
వినియోగ సంక్షోభానికి కారణాలు.. బడ్జెట్పై ఆశలు
ఆర్థిక వృద్ధికి వెన్నెముకగా భావించే మధ్యతరగతి ప్రజలు ప్రస్తుతం గణనీయమైన వినియోగ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. త్వరలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్(Budget 2025-26)లో మధ్యతరగతి ప్రజలు ఎదుర్కొంటున్న కొన్ని సవాళ్లకు పరిష్కారం లభించేలా నిర్ణయాలు ఉంటాయని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేటగిరీ ప్రజలు ఇబ్బంది పడుతున్న వినియోగ సంక్షోబానికి గల కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు.నిలకడగా వేతనాలుజీవన వ్యయాలు పెరుగుతున్నప్పటికీ, అందుకు అనుగుణంగా మధ్యతరగతి కార్మికుల వేతనాలు పెరగడం లేదు. స్థిరంగా ఉన్న వేతనాల వల్ల వారి కుటుంబాలు అత్యవసరం కాని వస్తువులపై ఖర్చు చేసేందుకు సరిపడా డిస్పోజబుల్ ఆదాయం(నిత్యావసర ఖర్చులు, వడ్డీలు, ఈఎంఐలు.. పోను చివరకు మిగిలే డబ్బు) ఉండడంలేదు. ఇది వినియోగం తగ్గడానికి దారితీస్తుంది.పెరుగుతున్న ద్రవ్యోల్బణంద్రవ్యోల్బణం పెరుగుతోంది. ఆహార ద్రవ్యోల్బణం ముఖ్యంగా అధిక స్థాయిలను తాకుతోంది. దానివల్ల నిత్యావసరాల ఖర్చు పెరిగి మధ్యతరగతి కుటుంబాలు సాధారణ కొనుగోళ్ల కంటే నిత్యావసర ఖర్చులకే ప్రాధాన్యమివ్వాల్సి వస్తోంది.రుణ భారంమధ్యతరగతి కుటుంబాలు తనఖాలు, కారు రుణాలు, క్రెడిట్ కార్డు రుణాలతో సహా అధిక స్థాయి అప్పుల భారంతో కాలం వెల్లదీస్తున్నాయి. ఈ రుణం ఈఎంఐలు ఇతర వస్తువులు, సేవలపై ఖర్చులను తగ్గిస్తున్నాయి. దీనికితోడు మార్కెట్లో ఆన్లైన్ వేదికగా చాలా ప్లాట్ఫామ్లు అడ్డగోలుగా అప్పులు ఇస్తున్నాయి. మధ్యతరగతి దీనికి ఆకర్షింపబడుతుంది. కానీ అప్పులు తీర్చే సమయానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఆర్థిక మాంద్యంఆర్థిక మాంద్యం భయాలు పెరుగుతున్నాయి. దాంతో ప్రైవేట్ రంగంలో చాలామంది కొలువులు కోల్పోతున్నారు. కార్పొరేట్ సంస్థల ఆదాయాలు తగ్గుతున్నాయి. టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో శ్రామికశక్తిపై ప్రభావం పడుతుంది. ఫలితంగా మెటా, గూగుల్.. వంటి టాప్ కంపెనీలు కూడా లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. ఇది మధ్యతరగతి ఆదాయాలపై ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆయా కుటుంబాలు వారి మునుపటి వినియోగ స్థాయిలను కొనసాగించడం కష్టమవుతుంది.ఇదీ చదవండి: ప్రపంచంలోని టాప్ 10 ధనవంతుల విద్యార్హతలుబడ్జెట్ సహాయపడుతుందా?రాబోయే కేంద్ర బడ్జెట్ 2025-26 ఈ సవాళ్లలో కొన్నింటిని పరిష్కరించి మధ్యతరగతికి ఉపశమనం కలిగించే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నాయి. అందుకు ప్రభుత్వం కొన్ని చర్యలపై దృష్టి సారిస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.పన్ను ఉపశమనం: వ్యక్తిగత ఆదాయపు పన్ను రేట్లను తగ్గించడం లేదా ప్రామాణిక తగ్గింపును పెంచడం వల్ల మధ్యతరగతి కుటుంబాల చేతిలో ఎక్కువ డబ్బు ఉంటుంది.సబ్సిడీలు: ఆహారం, గృహనిర్మాణం, ఆరోగ్య సంరక్షణ వంటి నిత్యావసర వస్తువులకు సబ్సిడీలను ప్రవేశపెట్టడం లేదా వాటిని విస్తరించడం మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.ఉద్యోగాల కల్పన: మౌలిక సదుపాయాలు, ఇతర ప్రభుత్వ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల ఉద్యోగాల కల్పనతో పాటు మధ్యతరగతి కార్మికులకు ఆదాయం పెరుగుతుంది.రుణ ఉపశమన కార్యక్రమాలు: గృహ రుణాన్ని నిర్వహించడానికి, దాన్ని భారాన్ని తగ్గించడానికి సహాయపడే కార్యక్రమాలను అమలు చేయడం వినియోగానికి ఎక్కువ ఆదాయాన్ని సమకూరుస్తుంది.ద్రవ్యోల్బణ నియంత్రణ: ద్రవ్య విధాన సర్దుబాట్లు వంటి ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే చర్యలు ధరలను స్థిరీకరించడానికి ఉపయోగపడుతాయి. కొనుగోలు శక్తిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. -
పెట్రోల్ అప్.. డీజిల్ డౌన్!
దేశంలో సెప్టెంబర్ నెలలో ఇంధనాల వాడకం మిశ్రమంగా ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గత నెలలో పెట్రోల్ అమ్మకాలు అంతకుముందు నెలతో పోలిస్తే 2.8% పెరిగాయి. డీజిల్ విక్రయాలు 2% తగ్గాయి. ఈమేరకు చమురు మంత్రిత్వ శాఖ నివేదిక విడుదల చేసింది.మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం..దేశీయంగా లిక్విడ్ పెట్రోలియం గ్యాస్(ఎల్పీజీ) అమ్మకాలు సెప్టెంబర్లో అంతకుముందు నెలతో పోలిస్తే 1% పెరిగాయి. పెట్రోల్ అమ్మకాలు 2.8% పెరిగాయి. డీజిల్ విక్రయాలు 2% తగ్గాయి. 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల సగటుతో పోలిస్తే సెప్టెంబర్లో ఇంధనాల వినిమయ వృద్ధి రేటు తక్కువగా ఉంది. అయితే విదేశాలకు వెళ్లేవారి సంఖ్య పెరుగుతుండడంతో జెట్ ఇంధన విక్రయాలు మాత్రం గణనీయంగా 9.5% పెరిగాయి.ఇదీ చదవండి: రోజూ 50 కోట్ల లావాదేవీలు..!దేశీయంగా చమురు వినియోగం తగ్గేందుకు ప్రధాన కారణం..చమురుకు బదులుగా వినియోగదారులు పునరుత్పాదక ఇంధనాలు వంటి ఇతర ప్రత్యామ్నాయ మార్గాలవైపు దృష్టి సారించడమని నిపుణులు చెబుతున్నారు. 2019 నుంచి జెట్ ఇంధనం ధర సమ్మిళిక వార్షిక వృద్ధి రేటు(సీఏజీఆర్) 2% ఉంది. డీజిల్ 1.7%, ఎల్పీజీ 4.5%, పెట్రోల్ ధరలు 5.8% సీఏజీఆర్ చొప్పున వృద్ధి చెందాయి. ఇదిలాఉండగా, అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గుతున్నా దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు(ఓఎంసీ) మాత్రం అందుకు అనుగుణంగా ఇంధన ధరలు తగ్గించడంలేదనే వాదనలున్నాయి. ఓఎంసీలు ఫ్యుయెల్ ధరలు తగ్గించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు. -
Deloitte: గృహ వినియోగ మార్కెట్ 19.67 లక్షల కోట్లు
ముంబై: భారత్లో ఇళ్లు, గృహ వినియోగ మార్కెట్ (హోమ్, హౌస్హోల్డ్) 2030 నాటికి 237 బిలియన్ డాలర్లకు (రూ.19.67 లక్షల కోట్లు) చేరుకుంటుందని డెలాయిట్ అంచనా వేసింది. ఏటా 10 శాతం కాంపౌండెడ్ వృద్ధి రేటు కొనసాగుతుందంటూ.. ఖర్చు చేసే ఆదాయం పెరుగుతుండడం, వినియోగదారుల ప్రాధాన్యతల్లో మార్పులు, వివిధ ఉత్పత్తుల పరంగా సౌకర్యం, సౌలభ్యానికి ప్రాధాన్యం ఇస్తుండడాన్ని సానుకూలతలుగా తన నివేదికలో ప్రస్తావించింది. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలు వృద్ధి కేంద్రాలుగా అవతరిస్తున్నట్టు తెలిపింది. ఓమ్నిచానల్ రిటైల్, ఈ కామర్స్ సంస్థలు వినియోగదారులతో అనుసంధానానికి సాయపడుతున్నాయని, పట్టణాలకు వెలుపలి ప్రాంతాలకు ఇవి చేరుకుంటున్నాయని పేర్కొంది. గృహస్థుల ఖర్చు చేసే ఆదాయం పెరుగుతుండడం, అదే సమయంలో డిజిటల్ ప్లాట్ఫామ్లు అందుబాటులోకి వస్తుండడం, సులభంగా రుణాలు లభిస్తుండడం, యువ కస్టమర్లు ఆధునిక డిజైన్లు, గృహ నవీకరణ, వ్యక్తిగత అభిరుచులకు ప్రాధాన్యం ఇస్తుండడం ఈ మార్కెట్ వృద్ధికి చోదకాలుగా తెలిపింది. హౌస్హోల్డ్ (ఇంట్లో వినియోగించే ఉపకరణాలు) మార్కెట్ శరవేగంగా వృద్ధి చెందుతోందని డెలాయిట్ నివేదిక తెలిపింది. విక్రయానంతర సేవలు, వారంటీపై వ్యాపార సంస్థలు దృష్టి పెట్టాల్సి ఉంటుందని పేర్కొంది. ప్రీమియం ఉత్పత్తులకు ఆదరణ వినియోగదారులు ప్రీమియం, బ్రాండెడ్ ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు, కంపెనీలు ఈ–చానళ్ల రూపంలో కస్టమర్లకు ముందుగా చేరువ అవుతున్నట్టు డెలాయిట్ నివేదిక తెలిపింది. వినియోగదారులకు మెరుగైన అనుభవం, డిజైన్ ఆధారిత ఉత్పత్తుల ఆవిష్కరణపై కంపెనీలు ఎక్కువగా దృష్టి సారించినట్టు డెలాయిట్ ఇండియా పార్ట్నర్ ఆనంద్ రామనాథన్ చెప్పారు. సోషల్ మీడియా, అత్యాధునిక సాంకేతికతల సాయంతో కంపెనీలు తమ కస్టమర్లను లక్ష్యంగా చేసుకోగలుగుతున్నట్టు డెలాయిట్ నివేదిక వివరించింది. ఇంధన ఆదా గృహోపకరణాలకు, పర్యావరణ అనుకూల కిచెన్ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుండడంతో కంపెనీలు నీటిని ఆదా చేసే బాత్రూమ్ ఫిట్టింగ్లు, ఇంధన ఆధా టెక్నాలజీలపై పెట్టుబడులు పెంచుతున్నాయని వెల్లడించింది. పీఎల్ఐ పథకం, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, ఉజాల, ఎస్ఎంసీ, పీఎం మిత్ర పథకాల మద్దతుతో డిమాండ్ పెరుగుతుండడం, హౌస్హోల్డ్ రంగంలో పెట్టుబడులను ఆకర్షిస్తున్నట్టు వివరించింది. -
ఎఫ్ఎంసీజీ అమ్మకాల్లో రూరల్.. రూలర్!
సాక్షి, హైదరాబాద్: భారత్లో వేగంగా అమ్ముడయ్యే వినిమయ వస్తువుల (ఎఫ్ఎంసీజీ) అమ్మకాల్లో అర్బన్ మార్కెట్ను రూరల్ మార్కెట్ అధిగమిస్తోంది. ఈ వస్తువుల అమ్మకాల్లో పట్టణ ప్రాంతాలను గ్రామీణ ప్రాంతాలు వెనక్కి నెడుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్–జూన్ మధ్యలో అర్బన్ మార్కెట్ కంటే రూరల్ మార్కెట్ మెరుగైన స్థితిలోకి చేరుకుంది. ఆర్థికమాంధ్య పరిస్థితుల్లోనూ ఎఫ్ఎంసీజీల అమ్మకాల్లో రూరల్ ఇండియా టాప్లో నిలిచింది.ప్రస్తుత పరిస్థితుల్లో నగరాల్లో ఈ వస్తువుల అమ్మకాలు కొంత ఇబ్బందుల్లోనే కొనసాగవచ్చునని, గ్రామీణ మార్కెట్ మాత్రం ఇప్పుడున్న స్థితిని మరింత బలోపేతం చేసుకునే అవకాశాలున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. కోవిడ్–19 తో తలెత్తిన విపత్కర పరిస్థితులతో రూరల్ మార్కెట్ తిరోగమనంతో ఒత్తిళ్లకు గురికాగా, క్రమంగా పుంజుకున్నట్టు కన్సల్టింగ్ సంస్థ ‘కాంటార్’తాజా నివేదికలో వెల్లడైంది.నివేదికలో ఏం చెప్పారంటే..⇒ 2024 ప్రారంభం నుంచే గ్రామీణ మార్కెట్ అంచనాలకు మించి పుంజుకుంటోంది. ⇒2023 సంవత్సరంలో మెరుగైన స్థితిలో ఉన్న అర్బన్ మార్కెట్ క్రమంగా దిగజారుతూ వస్తోంది. ⇒ నగరాలు, పట్టణ ప్రాంతాల్లో కేంద్రీకృతమైన మార్కెట్గా ఉన్న న్యూడుల్స్, సాల్టీస్నాక్స్ వంటి కేటగిరి వస్తువుల అమ్మకాల తగ్గుదలతో కూడా ఈ పరిస్థితి ఎదురైంది. ⇒ సెంట్రల్ ఇండియాలో అధిక వర్షపాతం తదితర కారణాలతో రూరల్ మార్కెట్ పుంజుకునేందుకు అవకాశం ఏర్పడింది. ⇒ప్రస్తుతమున్న పరిస్థితుల్లో గ్రామీణ మార్కెట్ వృద్ధి చెందేందుకు మరిన్ని అవకాశాలున్నాయని, ఈ ఏడాది రాబోయే రోజుల్లో కూడా ఈ మార్కెట్ పురోగతిలోనే ముందుకు సాగుతుంది. ఇదీ ఎఫ్ఎంసీజీ పల్స్ రిపోర్ట్ కూల్డ్రింక్స్ (బాటిల్డ్ సాఫ్ట్ డ్రింక్స్)తాగే సగటు భారతీయ కుటుంబాల సంఖ్య గణనీయంగా పెరిగింది. గత రెండేళ్లతో పోల్చితే గత మార్చితో ముగిసిన 2023–24లో ఇది 50 శాతానికి పెరిగినట్టుగా ‘కాంటార్ ఎఫ్ఎంసీజీ పల్స్రిపోర్ట్’వెల్లడించింది. గత రెండేళ్లలో సగటు కుటుంబాల్లో 250 మిల్లీలీటర్ల సాఫ్ట్డ్రింక్స్ వినియోగంతో పెరుగుదల నమోదైంది. ⇒ ప్రీమియం ల్యాండ్రీ ఐటమ్గా పరిగణిస్తున్న ఫాబ్రిక్ సాఫ్ట్నర్లను మాత్రం నాలుగు కుటుంబాల్లో ఒకటి మాత్రమే ఉపయోగిస్తోంది. మిగతా వస్తువుల విషయానికొస్తే..⇒ ప్రీమియం ల్యాండ్రీ ఉత్పత్తిగా పరిగణిస్తున్న వాషింగ్ లిక్విడ్లు 2023–24 ఆర్థిక సంవత్సరంలో లక్ష టన్నుల మార్క్ను దాటి రికార్డ్ బ్రేక్ చేశాయి. ⇒ మార్చి 2023తో పోలి్చతే మార్చి 2024లో బాటిల్డ్ సాఫ్ట్డ్రింక్ కేటగిరి అనేది 41 శాతం వృద్ధి (మూవింగ్ యాన్యువల్ టోటల్)గా నమోదైంది. ⇒ ఆన్లైన్, ఆఫ్లైన్ చానళ్లలో వినియోగదారులు ఏడాదికి 156 సార్లు ఎఫ్ఎంసీజీ వస్తువులు (ప్రతీ 56 గంటలకు ఒకసారి) కొనుగోలు చేస్తున్నారు. -
పెరిగే కార్ల అమ్మకాలతో ఆయిల్కు డిమాండ్
న్యూఢిల్లీ: చమురు దిగుమతులు, వినియోగంలో భారత్ ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉంది. ఎకానమీ వేగంగా వృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఆయిల్ డిమాండ్ గణనీయంగా పెరుగుతోందని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ) ఒక నివేదికలో పేర్కొంది. ఐఈఏ నివేదిక ప్రకారం, 2024లోనూ ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఎకానమీగా భారత్ నిలుస్తుందన్న అంచనాలు నెలకొన్నాయి. దేశీయంగా వినియోగ మార్కెట్ భారీగా పెరుగుతున్న నేపథ్యంలో తయారీ, పారిశ్రామిక కార్యకలాపాలు పుంజుకుంటున్నాయి. రహదారి రవాణాకు భారత్లో డీజిల్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. 2023–2030 మధ్య కాలంలో ఆయిల్ వినియోగ వృద్ధిలో రహదారి రవాణా విభాగం వాటా 5,20,000 బీపీడీగా (మొత్తం వినియోగంలో 38 శాతం) ఉండగలదు. అలాగే కార్ల కొనుగోళ్లు పెరిగే కొద్దీ పెట్రోల్ వినియోగం 2,70,000 బీపీడీ మేర (మొత్తంలో 20 శాతం) వృద్ధి చెందవచ్చు. మిగతా ప్రపంచ దేశాలతో పోలిస్తే ఈ డిమాండ్ అత్యధికం. 2000తో పోలిస్తే 2023లో భారత్లో కార్ల సంఖ్య ఎనిమిది రెట్లు పెరిగింది. దేశీయంగా కార్ల సంఖ్య 2030 నాటికి 40 శాతం మేర పెరగొచ్చు. ఇక మొత్తం వాహనాల సంఖ్యలో మూడొంతుల వాటా ఉండే ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు కూడా కీలకంగా ఉండగలదు. నివేదికలో మరిన్ని అంశాలు.. ⇢ పెట్రోకెమికల్స్ ఉత్పత్తిలో ఎల్పీజీ, ఈథేన్ వినియోగం 40,000 బీపీడీ స్థాయిలో పెరగొచ్చు. ⇢ 2023లో 58 లక్షల బీపీడీగా ఉన్న భారత్ రిఫైనింగ్ సామర్థ్యం 2030 నాటికి 68 లక్షల బీపీడీకి చేరవచ్చు. ⇢ భారత్ దిగుమతి అవసరాలు దాదాపు 10 లక్షల బీపీడీ స్థాయిలో 46 లక్షల బీపీడీ నుంచి 56 లక్షల బీపీడీకి చేరవచ్చు. రిఫైనరీలను వేగవంతంగా విస్తరిస్తుండటంతో క్రూడ్ ప్రాసెసింగ్ సామర్థ్యాలు 10 లక్షల బీపీడీ స్థాయిలో పెరగవచ్చు. ⇢ ఈ దశాబ్దం ద్వితీయార్థంలో అంతర్జాతీయంగా ముడిచమురు డిమాండ్కు భారత్ చోదకంగా ఉండగలదు. ⇢ 2023–2030 మధ్య కాలంలో భారత్లో చమురు వినియోగం చైనాను మినహాయించి మిగతా అన్ని దేశాలకన్నా అధికంగా ఉంటుంది. ఇది ఏకంగా రోజుకు 13 లక్షల బ్యారెళ్ల (బీపీడీ) మేర పెరిగే అవకాశం ఉంది. ⇢ 2023లో రోజుకు 54 లక్షల బ్యారెళ్లుగా (బీపీడీ) ఉన్న చమురు డిమాండ్ 2030 నాటికి 3.2 శాతం పెరిగి (రోజుకు 13 లక్షల బ్యారెళ్లు) 67 లక్షల బీపీడీకి చేరగలదని అంచనా. ⇢ 2025–2030 మధ్య కాలంలో భారత్లో చమురుకు డిమాండ్ 9,00,000 బీపీడీ మేర పెరగనుండగా, చైనాలో ఇది 5,70,000 బీపీడీగా ఉండనుంది. అంతర్జాతీయంగా చూస్తే 2029 నాటికి ఆయిల్ డిమాండ్ తారస్థాయికి చేరుకోగలదు. అయితే అటు తర్వాత తగ్గే అవకాశం ఉంది. -
భారత్లో చేపలు తినేవాళ్ల సంఖ్య పెరిగింది!: అధ్యయనంలో వెల్లడి!
భారత్లో చేపల వినియోగం పెరిగిందని అధ్యయనంలో వెల్లడయ్యింది. ముఖ్యంగా జమ్ము కాశ్మీర్లో అనూహ్యంగా అత్యధిక పెరుగుదల కనిపించిందని పేర్కొంది. ఈ మేరకు భారతదేశంలో చేపల వినయోగం, సంబంధిత ఆహార పొకడలపై అధ్యయనం నిర్వహించగా..సరికొత్త నివేదికలును అందించింది. ఆ ఫలితాల్లో ఇటీవల కాలంలో చేపల వినియోగంలో గణనీయమైన పెరుగుదల ఉన్నట్లు వెల్లడించింది. భారత దేశంలో చేపల వినియోగం: ప్యాటర్న్, ట్రేండ్ అనే వాటిని బేస్ చేసుకుని స్టడీ చేయగా గణనీయమైన వృద్ధి కనిపించింది. ఈ స్టడీని ఇండియన కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్(ఐసీఏఆర్), మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్, భారత ప్రభుత్వం అండ్ వరల్డ్ ఫిష్ ఇండియా కలిసి నిర్వహించాయి. కాల పరిమిత 2005-2006 నుంచి 2019-2020 వరకు చేపల వినియోగం ఎలా ఉందనే దానిపై అధ్యయనం చేయగా, చేపల వినియోగంలో భారతేశంలో గణనీయమైన వృద్ధి కనిపించిందని తేలింది. అందుకు జనాభ పెరుగుదల, పెరిగిన సంపద, మారుతున్న పరిస్థితులు కారణం అని పేర్కొన్నారు అధికారులు. ఇక భారతదేశంలో చేపల తినే జనభా 73.6 మిలియన్ల(66%) నుంచి 966.9 మిలియన్లకు(71.1%)కు చేరింది. ఇది సుమారు 32% పెరుగుదలను సూచిస్తోంది. అలాగే 2019-2020లో 5.95% మంది ప్రజలు ప్రతిరోజూ చేపలను తీసుకోగా, 34.8% మంది కనీసం వారానికి ఒకసారి మిగలిన 31.35% అప్పుడప్పుడు మాత్రమే తీసుకుంటారని అధ్యయనంలో తేలింది. కాగా, త్రిపురలో అత్యధికంగా (99.35%), హర్యానాలో అత్యల్పంగా (20.55%) చేపలను వినయోగిస్తున్నారు. తూర్పు ఈశాన్య రాష్ట్రాలు, తమిళనాడు, కేరళ, గోవాలలో అత్యధికంగా చేపలు తినే వాళ్ల సంఖ్య (90% కంటే ఎక్కువ) ఉంది. దీనికి విరుద్ధంగా, పంజాబ్, హర్యానా రాజస్థాన్ వంటి ఉత్తరాది రాష్ట్రాలు అత్యల్పంగా ఉన్నాయి (30% కంటే తక్కువ). అయితే, దేశంలోని ఉత్తరాన ఉన్న రాష్ట్రం జమ్మూ కాశ్మీర్లో చేపలు తినేవారి సంఖ్య అత్యధికంగా పెరగడం గమనార్హం. అలాగే కేరళ, గోవాలలో కూడా రోజువారీ చేపల వినియోగదారుల శాతం అత్యధికంగా ఉందని స్టడీ పేర్కొంది. అంతేగాక పురుషుల కంటే స్త్రీలు చేపల తక్కువుగా తింటున్నారని అధ్యయనం పేర్కొంది. (చదవండి: ఇదేం వ్యాధి.. తినకూడనివన్నీ లాగించేస్తోంది..) -
పేదరికం కనుమరుగవుతోంది
న్యూఢిల్లీ: దేశంలో పేదరికం మటుమాయం అవుతోందని ప్రధాని మోదీ చెప్పారు. గత పదేళ్లలో తలసరి గృహ వినియోగ వ్యయం రెండున్నర రెట్లు పెరగడమే ఇందుకు తార్కాణమన్నారు. ఆదివారం న్యూస్9 గ్లోబల్ సదస్సులో ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ‘‘తలసరి వినియోగ పెరుగుదల పట్టణాల కంటే గ్రామాల్లోనే ఎక్కువగా ఉన్నట్టు కూడా సర్వేలో తేలింది. ప్రజలకు ఖర్చు చేసే సామర్థ్యం పెరుగుతోందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గ్రామాలు, పేదలు, రైతుల సంక్షేమంపై మేమిచ్చిన ప్రాధాన్యమే ఇందుకు కారణం. గ్రామీణ భారతాన్ని దృష్టి పెట్టుకుని పలు మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేశాం. మహిళల సాధికారత సాధించాం. అపారమైన ఉపాధి అవకాశాలు కలి్పంచాం. ప్రజల ఆత్మవిశ్వాసాన్ని అద్భుతంగా పెంచాం. పాలనతో పాటు దృక్కోణం తదితరాలన్నింట్లోనూ అపారమైన మార్పు తీసుకొచ్చాం’’ అని వివరించారు. గత ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ప్రజలను కావాలనే కరువు పరిస్థితుల్లో మగ్గేలా చేశాయంటూ కాంగ్రెస్పై మోదీ విమర్శలు గుప్పించారు. ‘‘ఈ కరువు, సంతుïÙ్టకరణ రాజకీయాలపై మాకు నమ్మకం లేదు. సంతృప్త పాలనే మా ధ్యేయం. అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కరికీ అందేలా చూస్తున్నాం’’ అని వివరించారు. గత పదేళ్లలో ప్రపంచ వేదికపై భారత్ విశ్వసనీయత ఎంతగానో పెరిగిందన్నారు. సమున్నత శిఖరాలకు సామర్థ్యం: కొన్నేళ్లుగా తమ ప్రభుత్వ పనితీరుకు ఆరి్టకల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు, మహిళా రిజర్వేషన్ల బిల్లు, అయోధ్యలో రామ మందిర నిర్మాణం వంటివి గీటురాయిగా నిలిచాయని మోదీ చెప్పారు. ‘‘గత పాలకులకు భారతీయుల సామర్థ్యంపై కనీస నమ్మకం కూడా లేదు. వారిని తక్కువగా అంచనా వేశారు’’ అంటూ కాంగ్రెస్ పాలనపై విమర్శలు గుప్పించారు. అప్పుడెప్పుడో 1960లు, 80ల్లో వారు మొదలు పెట్టిన పలు పథకాలను 2014లో తాము అధికారంలోకి వచ్చాక పూర్తి చేయాల్సి వచి్చందన్నారు. ‘‘మా పాలనలో దేశవ్యాప్తంగా సగటున రోజుకు రెండు కొత్త కాలేజీలు, వారానికో కొత్త యూనివర్సిటీ వచ్చాయి. అసాధ్యమంటూ ఏదీ లేదన్న విశ్వాసం ఇప్పుడు దేశ ప్రజల్లో తొణికిసలాడుతోంది’’ అని మోదీ అన్నారు. చెప్పారు. మూడో టర్ము పాలనలో దేశ సామర్థ్యాన్ని సమున్నత శిఖరాలకు చేర్చడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. -
గడచిన పదేళ్లలో... గృహ వినియోగం రెండింతలు
న్యూఢిల్లీ: భారత్లో నెలవారీ తలసరి గృహ వినియోగం గడిచిన దశాబ్ద కాలంలో రెండింతలకు పైగా పెరిగినట్టు జాతీయ శాంపిల్ సర్వే కార్యాలయం అధ్యయనంలో వెల్లడైంది. 2011–12 నాటికి తలసరి వినియోగం రూ.2,630గా ఉంటే, 2022–23 నాటికి ఇది పట్టణ ప్రాంతాల్లో రూ.6,459కి పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇదే కాలంలో తలసరి వినియోగం రూ.1,430 నుంచి రూ.3,773కు చేరింది. గృహ వినియోగ వ్యయంపై ఎన్ఎస్ఎస్వో 2022 ఆగస్ట్–2023 జూలై మధ్య జరిపిన సర్వే వివరాలను విడుదల చేసింది. ప్రతి వ్యక్తి సగటున చేసే గృహ వినియోగ ఖర్చును తెలుసుకునేందుకు ఈ సర్వే చేపట్టింది. 2021–12 నాటి ధరల ప్రకారం చూస్తే.. సగటు ఎంపీసీఈ పట్టణ ప్రాంతాల్లో రూ.2,630గా ఉంటే, 2022–23 నాటికి రూ.3,510కి చేరింది. గ్రామీణ ప్రాంతాల్లో తలసరి ఎంపీసీఈ రూ.1,430 నుంచి రూ.2,008కి పెరిగింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలో పట్టణ ప్రాంతాల నుంచి 1,55,014 గృహాలు, గ్రామీణ ప్రాంతాల్లో 1,06,732 గృహాల సగటు శాంపిళ్లను ఈ అధ్యయనంలో భాగంగా ఎన్ఎస్ఎస్వో సేకరించింది. -
Berlin: గంజాయి సాగు.. జర్మనీ పార్లమెంట్ కీలక నిర్ణయం
బెర్లిన్: ప్రతిపక్షపార్టీలు, వైద్య సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినప్పటికీ గంజాయి నియంత్రిత సాగు, పరిమిత వ్యక్తిగత వినియోగానికి జర్మనీ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. వ్యక్తిగత వినియోగం కోసం గంజాయి పరిమితంగా కలిగి ఉండటాన్ని, నియంత్రిత సాగును చట్టబద్ధం చేస్తూ జర్మనీ పార్లమెంట్ తాజాగా బిల్లు పాస్ చేసింది. ఈ చట్టం ప్రకారం నియంత్రిత విధానంలో గంజాయి సాగు చేసే వారి వద్ద నుంచి రోజుకు 25 గ్రాముల వ్యక్తిగత వినియోగం ప్రాతిపదికన గంజాయి కొనుగోలు చేయవచ్చు. ఇంతే కాకుండా ప్రతి ఇంట్లో మూడు గంజాయి మొక్కలను కూడా పెంచుకోవచ్చు. ఈ చట్టాన్ని పార్లమెంట్లో ప్రవేశపెడుతూ జర్మనీ ఆరోగ్యశాఖ మంత్రి కార్ల్ లాటర్బాక్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్రస్తుతం దేశం ఉన్న స్థితిలో ఈ చట్టానికి ఆమోదం తెలపడం మనందరికీ ఎంతైనా అవసరం. దేశంలో పెద్ద సంఖ్యలో యువత బ్లాక్మార్కెట్లో కొని గంజాయిని సేవిస్తోంది’అని పేర్కొన్నారు. ఈ చట్టానికి ఆమోదం తెలపడంతో ఇప్పటికే గంజాయి వినియోగంపై స్వేచ్ఛాయుత విధానాలు అవలంబిస్తున్న యూరప్ దేశాల సరసన జర్మనీ చేరినట్లయింది. ఇదీ చదవండి.. కిమ్కు పుతిన్ గిఫ్ట్.. కారు కంపెనీపై అమెరికా కొరడా -
పాడి రైతుకు సంపూర్ణ రక్షణ
సాక్షి, అమరావతి: పాల సేకరణ, విక్రయాల్లో మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు దేశంలో మరెక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పాల సేకరణ (రైతు రక్షణ), నాణ్యమైన పాల వినియోగ చట్టం–2023 అమలుకు రంగం సిద్ధమైంది. చట్టం అమలుకు అవసరమైన ఎస్ఓపీ (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్) రూపకల్పన చేసింది. నియమ, నిబంధనలతో ఇటీవలే అధికారిక గెజిట్లో ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రంలో ప్రతిరోజు 4.12 కోట్ల లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతోంది. స్థానికంగా 1.42 కోట్ల లీటర్ల పాలు వినియోగమవుతుండగా, ఆర్గనైజ్డ్ డెయిరీలు 21.6 లక్షల లీటర్లు, ప్రైవేటు డెయిరీలు 47.6 లక్షల లీటర్లు సేకరిస్తున్నాయి. మిగిలిన పాలు వివిధ రూపాల్లో మార్కెట్కి వస్తుంటాయి. పాల సేకరణలో జరిగే మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు తూనికలు–కొలతల చట్టం ప్రకారం తనిఖీ చేసే అధికారాలను స్థానిక పశు వైద్యులకు అప్పగించారు. అయితే మోసాలకు పాల్పడినట్టు నిర్ధారణ జరిగినప్పుడు మిల్క్ ఎనలైజర్స్, ఇతర పరికరాలను సీజ్ చేయడం, బాధ్యులైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునే అధికారం లేకపోవడంతో క్షేత్ర స్థాయిలో ఇబ్బందులు తలెత్తేవి. ఈ పరిస్థితికి చెక్ పెడుతూ దేశంలోనే తొలిసారి పటిష్టమైన పాలసేకరణ, నాణ్యమైన పాల వినియోగ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. చట్టం అమలు బాధ్యత వీరిదే.. చట్టం అమలు, పర్యవేక్షణ కోసం రాష్ట్ర స్థాయిలో మిల్క్ కమిషనర్గా, కార్యనిర్వాహక అధికారిగా పశుసంవర్ధక శాఖ సంచాలకులు వ్యవహరించనుండగా, జిల్లా స్థాయిలో ఆథరైజ్డ్ ఆఫీసర్స్గా జిల్లా పశుసంవర్ధక శాఖాధికారులు, మిల్క్ ఇన్స్పెక్టర్లుగా వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్స్, ఏవీహెచ్ అసిస్టెంట్ డైరెక్టర్లు వ్యవహరించనున్నారు. వీరు చట్టప్రకారం మిల్క్ ఎనలైజర్స్తో పాటు పాల సేకరణ కేంద్రాలు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు, ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్లు పనిచేసేలా పర్యవేక్షిస్తారు. పాలనాణ్యత పాటించకపోతే ఫుడ్ సేఫ్టీ, నాణ్యత ప్రమాణాల యాక్టు 2006 ప్రకారం చర్యలు తీసుకుంటారు. పాలల్లో ఫ్యాట్, ఎస్ఎన్ఎఫ్ శాతాన్ని బట్టి నిర్దేశించిన రేటు చార్ట్ ప్రకారం పాడి రైతుకు మద్దతు ధర దక్కేలా పర్యవేక్షిస్తారు. ఇందుకోసం సాఫ్ట్వేర్ అప్లికేషన్ను అభివృద్ధి చేస్తున్నారు. చట్టం అమలుపై రాష్ట్ర స్థాయిలో ఎంపిక చేసిన రిసోర్స్ పర్సన్స్కు ఇటీవలే శిక్షణ కూడా పూర్తి చేశారు. వీరి ద్వారా మండల స్థాయిలో మిల్క్ ఇన్స్పెక్టర్లుగా వ్యవహరించనున్న అధికారులకు శిక్షణ ఇవ్వనున్నారు. మిల్క్ ఎనలైజర్స్కు లైసెన్సింగ్ తప్పనిసరి మిల్క్ ఎనలైజర్స్ కలిగి ఉన్న వారు రూ.1,000 చెల్లించి సంబంధిత ఆథరైజ్డ్ అధికారి నుంచి లైసెన్సు పొందాలి. ఆ తర్వాత ఏటా లైసెన్స్ రెన్యువల్ చేయించుకోవాలి. అదే తయారీ దారులు, డీలర్లు ప్రతీ 2 ఏళ్లకోసారి రూ. 2 లక్షలు చెల్లించి మిల్క్ కమిషనర్ ద్వారా లైసెన్సు పొందాల్సి ఉంటుంది. లైసెన్స్ పొందిన తర్వాత మిల్క్ ఎనలైజర్స్ను 30 రోజులలోపు వారి పరిధిలోని మిల్క్ ఇన్స్పెక్టర్ వద్ద రూ. 500 చెల్లించి కనీసం ఏడాది పాటు చెల్లుబాటు అయ్యేలా వెరిఫికేషన్ సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది. మిల్క్ ఎనలైజర్ లైసెన్స్, వెరిఫికేషన్ సర్టిఫికెట్ను పాలసేకరణ కేంద్రంలో ప్రదర్శించాలి. రికార్డులు, రిజిష్టర్లు విధిగా నిర్వహించాలి. క్రమం తప్పకుండా తనిఖీలు.. చట్టం ప్రకారం మిల్క్ ఇన్స్పెక్టర్లు.. పాల సేకరణ కేంద్రాలు, డెయిరీల్లో క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహిస్తారు. తేడా ఉన్నట్టుగా గుర్తిస్తే జరిమానా, లైసెన్సు రద్దు, కేసుల నమోదు వంటి చర్యలు తీసుకుంటారు. కల్తీ జరిగినట్టు గుర్తిస్తే తగిన చర్యల కోసం ఆహార భద్రత అధికారికి సమాచారమిస్తారు. మిల్క్ యూనియన్, డెయిరీ నిర్ధారించిన రేట్ చార్జి ప్రకారం పాలుపోసే వారికి పాలసేకరణ ధర చెల్లిస్తున్నదీ లేనిదీ కూడా పరిశీలిస్తారు. జిల్లా స్థాయిలో ఆథరైజ్డ్ అధికారిగా వ్యవహరించే అధికారులు ఈ మిల్క్ ఇన్స్పెక్టర్ల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. మోసాలు, కల్తీలు జరిగినట్టుగా గుర్తిస్తే సంబంధిత రికార్డులు సహా ఆయా యూనిట్లను సీజ్ చేస్తారు. శిక్షార్హమైన నేరాలకు చట్టం ప్రకారం జరిమానాలు, కారాగార శిక్షలు విధిస్తారు. -
శనగపిండి మంచిదేనా?..వాటితో చేసే పిండి వంటకాలు తినొచ్చా!
చెరుపు చేస్తుందా?గోధుమలతో పోలిస్తే శనగపిండిలో క్యాలరీలు తక్కువ... ప్రోటీన్లు ఎక్కువ. అదేవిధంగా శనగపిండిలో ఫోలేట్, విటమిన్ బి6, ఐరన్, మెగ్నీషియమ్, పొటాషియమ్, ఫైబర్ కూడా సమృద్ధిగా లభిస్తుంది. శనగపిండితో ఆరోగ్య ప్రయోజనాలు... శనగపిండిలో గ్లూటెన్ ఉండదు కాబట్టి చాలారకాల అలర్జీలను కలిగించదు. శనగల గ్లైసిమిక్ విలువ తక్కువ. కాబట్టి శనగపిండి వల్ల అంత త్వరగా బరువు పెరగదు. స్థూలకాయం కూడా త్వరగా రాదు. శనగపిండిలో తక్కువ గ్లైసీమిక్ విలువ కారణంగా డయాబెటిస్ రోగులకు ఇదెంతో మంచిది. అందుకే డయాబెటిస్ ఉన్నవారు గోధుమల కంటే దీనితో చేసిన పరోఠాలూ, రోటీలు తీసుకోవడం మేలు. శనగల్లో నీటిలో కరిగే పీచు ఉండటం వల్ల శనగపిండి వాడేవారి గుండె ఆరోగ్యం దీర్ఘకాలం పాటు బాగుంటుంది. శనగపిండి రక్తపోటును కూడా అదుపులో ఉంచుతుంది. రక్తహీనతను నివారిస్తుంది. డెర్మటైటిస్ హెర్పిటోఫార్మిస్, కొన్ని రకాల ఆటోఇమ్యూన్ వ్యాధులు, స్కి›్లరోసిస్, ఆటిజమ్, ఏడీహెచ్డీ వంటివాటిని నివారిస్తుంది. ∙శనగపిండిలో గ్రోత్ హార్మోన్స్ ఎక్కువ. అందుకే ఎదిగే పిల్లలకు దీనితో తయారు చేసిన పదార్థాలు పెట్టడం మంచిది. ఇందులోని ఫాస్ఫరస్ వల్ల ఎదిగే పిల్లల ఎముకలు బాగా గట్టి పడతాయి. ∙ఇందులో ఫోలేట్ ఎక్కువగా ఉండటం వల్ల కాబోయే తల్లులు, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న మహిళలూ దీన్ని వాడటం మేలు. ఇది ఎర్రరక్తకణాలనూ పెంపొందిస్తుంది. ఈ జాగ్రత్త పాటించాలి మరి... శనగపిండి కాస్త కడుపు ఉబ్బరం కలిగిస్తుంది అందుకే మల్టీగ్రెయిన్స్ ఆటాతో కలిపి తీసుకుంటే ఈ పొట్ట ఉబ్బరం వంటివి తగ్గుతాయి. శనగపిండిలో ఉండే ఈ ఒక్క ప్రతికూల అంశం కారణంగా దానితో కలిగే అనేక ప్రయోజనాలను వదులుకోవడం సరికాదు. (చదవండి: యమ్మీ యమ్మీ.. "కుల్ఫీ"ని ఇష్టపడని వారుండరు..ఎలా చేస్తారంటే..!) -
2023–24లో 6.4 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ప్రస్తుత 2023–24 ఆర్థిక సంవత్సరంలో 6.4 శాతంగా కొనసాగుతుందన్న తన అంచనాలను ఆసియన్ అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) పునరుద్ఘాటించింది. దేశీయ డిమాండ్ ఆర్థిక క్రియాశీలతకు దోహదపడే ప్రధాన అంశంగా పేర్కొంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వినియోగ రికవరీ బాగుందని పేర్కొన్న ఏడీబీ, అంతర్జాతీయ అనిశి్చతుల దేశీయ ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు తన ఆసియన్ డెవలప్మెంట్ అవుట్లుక్ (ఏడీఓ) విశ్లేíÙంచింది. ఇక 2023–24లో 5 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాలను తాజాగా 4.9 శాతానికి ఏడీబీ తగ్గించింది. క్రూడ్ ఆయిల్ ధరల్లో కొంత తగ్గుదల దీనికి కారణంగా పేర్కొంది. సాధరణ వర్షపాతం, ఇతర వాతావరణ అంశాలను పరిగణనలోకి తీసుకుని (తదుపరి అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు ఏవీ ఉండబోవన్న అంచనా ప్రాతిపదికన) 2023–24లో 6.4 శాతం, 2024–25లో 6.7 శాతం వృద్ధి నమోదవుతుందని భావిస్తున్నట్లు అవుట్లుక్ పేర్కొంది. కాగా, ఆసియా, పసిఫిక్లో అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు సగటున 4.8 శాతం వృద్ధిని నమోదుచేసుకుంటాయని ఏడీబీ అవుట్లుక్ అంచనా వేసింది. చై నా ఎకానమీ వృద్ధి రేటును 5 శాతంగా అంచనావే సింది. 2025లో ఈ రేటును 4.5 శాతంగా పేర్కొంది. -
మద్యం కూడా మంచిదే బాసూ.. కానీ దానికీ ఓ లెక్కుంది
మద్యపానం ఆరోగ్యానికి హానీకరం అన్న విషయం తెలిసిందే. ఆల్కహాల్ తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, కాబట్టి దీనికి దూరంగా ఉండటమే బెటర్ అని ఇప్పటివరకు చాలాసార్లు వింటూ వచ్చాం. అయితే మద్యాపానంతో ఆరోగ్యమే అంటున్నారు నిపుణులు. కాస్త విడ్డూరంగా ఉన్నా ఇది నిజమే. మితంగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఆయుష్షు పెరుగుతుందని, గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందని గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ స్టడీ జరిపిన అధ్యయనంలో తేలింది. అంతేకాకుండా ఙ్ఞాపకశక్తి కూడా పెరుగుతుందట. మితంగా మద్యపానం తీసుకోవడం కలిగే కలిగే లాభాలు ఏంటి? శరీరానికి ఆల్కహాల్ ఏ విధంగా మేలు చేస్తుందన్నది ఇప్పుడు చూద్దాం.. ►మితిమించనిది ఏదైనా మంచిదే. ఆల్కహాల్ను ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరానికి ఎంత నష్టమో ప్రత్యేకంగా చెప్పనరక్కర్లేదు. కాలేయం దెబ్బతినడంతో పాటు అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ మద్యం మితంగా తీసుకుంటే మంచిదే అని మీకు తెలుసా? సరైన పద్దతుల్లో మద్యం తీసుకుంటే శరీరానికి మంచే చేస్తుందట. ► మితంగా మద్యపానం తీసుకోవడం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి మంచిది. ► తక్కువ మొత్తంలో మద్యపానం తీసుకోవడం వల్ల ఆయుష్షు పెరుగుతుందట. 25% మరణాల రేటును ఇది తగ్గిస్తుంది. ► రెడ్ వైన్లో యాంటీ ఏజినింగ్ గుణాలు ఉంటాయి. చాలా తక్కువ మొత్తంలో ఇది తీసుకోవడం వల్ల చర్మం గ్లో పెరిగి యవ్వనంగా కనిపిస్తారు. ► వైన్ ద్రాక్ష తొక్కలో ఉండే రెస్వెరాట్రాల్ జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కాబట్టి కొద్దిగా వైన్ తీసుకోవడం మంచిదే అంటున్నారు నిపుణులు. ► బీర్, వైన్స్లో అధికమొత్తంలో సిలికాన్ ఉంటుంది. ఇది బలమైన, ఆరోగ్యకరమైన ఎముకలకు సహాయపడుతుంది. ► మితమైన మద్యపానం తీసుకోవడం వల్ల కొన్ని మానసిక ప్రయోజనాలు ఉన్నాయి. ► తక్కువ మొత్తంలో మద్యం తాగేవారికి కిడ్నీలో రాళ్లు వచ్చే ప్రమాదం తక్కువట. అదే అధికంగా తీసుకుంటే డీహైడ్రేషన్కు గురై కిడ్నీల్లో రాళ్లు వచ్చే అవకాశం ఉంది. గమనిక: మద్యపానం ఆరోగ్యానికి హానికరం. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అతి తక్కువ మొత్తంలో ఆల్కహాల్ను తీసుకుంటేనే ప్రయోజనకరం అన్నది ఈ ఆర్టికల్ సారాంశం. మద్యం సేవించడాన్ని ప్రోత్సహించడం మా ఉద్దేశం కాదు. గమనించగలరు. Disclaimer: The information provided in this article is based on general information. Please contact the relevant expert before taking alcohol consumption. -
తాగితే మా ఆయన చాలా క్రూరంగా బిహేవ్ చేస్తాడు.. ఏం చేయాలి?
వ్యసనాల బారిన పడిన వ్యక్తిని ఆ కుటుంబంలోని వారు మొదట్లో గుర్తించరు. తమ వాళ్లు మంచివాళ్లని, చెడు అలవాట్లకు బానిసలు కారని నమ్ముతారు. ఏదైనా సంఘటన జరిగినప్పుడు స్నేహితుల ప్రభావమో, మరొకటో అనుకుంటారు తప్ప సమస్యను పెద్దగా పట్టించుకోరు. ఈ సమస్యను ఫ్యామిలీ డినైల్ అంటున్నారు నిపుణులు. అడిక్షన్స్ గురించి అసలు మన కుటుంబాలు ఎంతవరకు అర్ధం చేసుకుంటున్నాయి..? ఎలాంటి నిర్ణయాలు అమలు చేస్తున్నాయి? ఈ అంశం పై ‘మనం మాట్లాడుకోవాల్సిందే!’ ► అపార్ట్మెంట్లో దాదాపు అన్ని ఫ్లాట్స్ ఒకేలా ఉంటాయి. ఒకబ్బాయి రాత్రి టైమ్లో బాగా తాగేసి తమ ఇల్లు అనుకొని, వేరేవాళ్ల ఇంటి బెడ్రూమ్కి వెళ్లి పడుకున్నాడు. ఆ ఇంట్లో వాళ్లు పెద్ద గొడవ చేశారు. ఆ అబ్బాయి వాళ్ల తల్లితండ్రులు తమ పిల్లవాడిని తిట్టకుండా ఏదో పొరపాటున జరిగి ఉంటుందంటూ ఆ కుటుంబంతో గొడవ పడ్డారు. ► ఫ్యామిలీ ఫంక్షన్కి భర్త రాలేదు. ‘ఏమైంది..’అని ఎవరైనా అడిగితే ఆరోగ్యం బాగోలేదు అంటారు. ఆ సదరు వ్యక్తి ఇంట్లో ఉండి తాగుతుంటాడు. ► మల్టిపుల్ అడిక్షన్స్కు అలవాటుపడిన ఓ అబ్బాయి వచ్చి కౌన్సెలింగ్ తీసుకుంటానంటే, తల్లి ఒప్పుకోలేదు. ‘నీకేమైంది, బాగానే ఉన్నావ్ కదా! పై చదువుల కోసం అమెరికా వెళుతున్నావ్. బాధ్యత తెలిస్తే సెట్ అవుతావులే’ అంటుంది. ► ఒక భార్య ‘మా ఆయన తాగినప్పుడు చాలా క్రూరంగా బిహేవ్ చేస్తాడు. మిగతా సమయాల్లో చాలా చాలా బాగుంటాడు’ అని సరిపెట్టుకుంటుంది. ► ‘మా వాడు చాలా మంచోడు సార్, చాలా జాగ్రత్తగా ఉంటాడు. మొన్ననే తాగి డ్రైవ్ చేయడం వల్ల యాక్సిడెంట్ అయ్యింది’ అంటాడు తండ్రి. ► కజిన్స్ రిలేటివ్ ఫంక్షన్లో ఒకబ్బాయి ఓవర్గా తాగాడు. మనవాడు కదా అని మరుసటి రోజు తల్లికి ఫోన్ చేసి ‘అక్కా, మీ అబ్బాయి పార్టీలో ఓవర్గా తాగాడు’ అని చెబితే ‘మా అబ్బాయి అలాంటోడు కాదు, ఫ్రెండ్స్, కజిన్స్ బలవంతం చేసుంటారు’ అని వెనకేసుకొచ్చింది. విషయం చెప్పిన వ్యక్తితో మాట్లాడటమే మానేసింది. బంధుమిత్రులు ఎవరైనా ‘మీ అబ్బాయి తాగుతుండగా ఫలానా చోట చూశాం’ అని చెబితే వాళ్లతోనూ మాట్లాడటం మానేసింది. ఒకసారి కాలేజీలో గంజాయి తీసుకుంటూ పట్టుబడ్డాడు. తల్లిదండ్రులని పిలిస్తే ‘మా అబ్బాయిని కావాలనే బ్లేమ్ చేస్తున్నారు. మీదే అసలు సమస్య అనేసింది.’ ఇలాంటి సమర్థింపులు ఎన్నో .. ఎన్నెన్నో మీకూ తెలిసే ఉంటాయి. వెరీ డేంజర్!! చాలామంది పేరెంట్స్ తమ పిల్లలు వ్యసనాల బారినపడ్డారనే విషయం తెలిసినా వారు ఒప్పుకోరు. వ్యసనపరులకు కుటుంబాల నుంచి ఇలాంటి రక్షణ దొరికితే ఎప్పటికీ మార్పు రాదు సరికదా సర్దుకుపోవడం, కొట్టిపారేయడం చేస్తుంటే మీ కుటుంబం బీటలు వారడానికి సిద్ధంగా ఉందని గ్రహించాల్సిందే! అడిక్షన్ వెరీ వెరీ డేంజర్ డిసీజ్. ఈ సందర్భంలో కుటుంబంలో ఎవరిలోనైనా అడిక్షన్స్కు సంబంధించిన లక్షణాలు కనిపిస్తే వెంటనే చికిత్స చేయించడం మేలు. ధైర్యమే ఆయుధం వ్యసనాల బారిన పడ్డవారు నమ్మబలికే మాటలు చెబుతారు. సంఘటన తర్వాత ‘సారీ..’ అనేస్తారు. చిన్న చిన్న కానుకలు ఇచ్చి, తమ లోపాన్ని కప్పిపుచ్చుకునేవారుంటారు. దీంతో అమ్మ/భార్య/అక్క/ మన వాళ్లే కదా, మన పిల్లలే కదా.. మరోసారి ఇలా చేయరులే అనుకుంటారు. ఇదే విధమైన ప్రవర్తన కొన్నాళ్లకు ముదిరి ఇంట్లో భయోత్పాతాలను సృష్టిస్తుంటారు. కుటుంబం ప్రవర్తన మారాల్సిందే! కొడుకు/కూతురు/హజ్బెండ్/ఫాదర్ కి అడిక్షన్ పట్ల సపోర్ట్ ఇవ్వకూడదు. ఇంట్లో డబ్బులివ్వకపోతే బయట అప్పులు చేస్తారు. పదివేలు, ఇరవైవేలు అప్పు చేసినప్పుడు ఎవరైనా ఇంటి మీదకు వస్తే కుటుంబంలో ఉన్నవారిని బెదిరియ్యకుండా ఆ అప్పు తీర్చేస్తారు. సదరు వ్యక్తికి ఇబ్బంది కలగనీయకుండా అడ్డుగా నిలబడతారు. ఆ సమస్యను ఫేస్ చేయనీయకుండా వెనకేసుకొస్తారు. కాలేజీలో సమస్య వచ్చినా, మరోచోట సమస్య వచ్చినా తల్లిదండ్రులు కొడుకును కాపాడటానికి ట్రై చేస్తారు. దీనివల్ల పిల్లవాడు మరిన్ని తప్పులు చేసేలా ఆ కుటుంబంలోని వారు ప్రోత్సహిస్తున్నట్లే. మందలించాల్సిందే! ముందు తప్పించుకోవడం, సర్దుబాటు చేసుకోవడం నుంచి కుటుంబాల్లో ఉన్నవారు బయటకు రావాలి. కౌన్సెలింగ్ సమయంలో ముఖ్యంగా ఆడవాళ్లకు బలంగా ఉండాలని చెబుతాం. గట్టిగా మందలించమని చెబుతాం. ‘ఇది మా వ్యక్తిత్వం కాదు కదా’ అంటారు. కానీ, మంచితనాన్ని అలుసుగా తీసుకుంటున్నారు అని గుర్తించరు. సమస్యను భరిస్తూ ఉంటే ఏదో ఒక రోజున మిమ్మల్ని వ్యసనపరులు నిస్సహాయ స్థితికి తీసుకెళతారు. కుటుంబం బలంగా ఉండాలంటే మేజర్ రోల్ భార్య/తల్లిదే. ఆమె గట్టిగా ఉండాల్సిందే. కుటుంబం బాగుండాలంటే మంచిగవ్వాల్సిందే! అని చెప్పాలి. ఒకతను ఆల్కహాల్/ డ్రగ్స్ వాడుతున్నాడంటే అతని మైండ్ నిలకడగా లేదని అర్ధం చేసుకోవాలి. ఫ్రెండ్స్, రిలేటివ్స్, శ్రేయోభిలాషుల సాయంతోనైనా సమస్యను చక్కదిద్దాలి. ‘థెరపీ అవసరం లేదు, సదరువ్యక్తికి తెలియకుండా మందులు ఇప్పిద్దాం’ అనుకుంటారు. కానీ, యాంటీ క్రేవింగ్ మెడిసిన్స్ వాడటం వల్ల బ్రెయిన్కి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల కొత్త సమస్యలు పుట్టుకు రావచ్చు. అవగాహన, బిహేవియరల్ థెరపీ ద్వారానే పరిష్కరించాల్సి ఉంటుంది. ముందుగా కుటుంబాల వాళ్లు... 1. ఇదొక వ్యసనం అని అంగీకరించాలి. 2. పూర్తి చికిత్స ప్రాముఖ్యాన్ని అర్ధం చేసుకోవాలి. 3. చికిత్సకు కావాల్సినంత టైమ్ ఇవ్వాలి. నలుగురిలో తెలిస్తే పరువు పోతుందని భయపడుతుంటారు. ఏదైనా అనారోగ్యం చేస్తే హాస్పిటల్కు ఎలా వెళతామో సైకలాజికల్ సమస్య వస్తే అందుకు సంబంధించిన డాక్టర్ని కలవడానికి ఇబ్బంది పడకూడదు. – డాక్టర్ గిడియన్, డి–అడిక్షన్ థెరపిస్ట్ -
ఎఫ్ఎంసీజీకి ఈ ఏడాది సానుకూలం
ముంబై: గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం కాస్త పుంజుకోవడం ఎఫ్ఎంసీజీ పరిశ్రమకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సానుకూలించనుందని క్రిసిల్ రేటింగ్స్ ఓ నివేదిక రూపంలో వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2023–24) పరిశ్రమ ఆదాయం 7–9 శాతం వృద్ధిని నమోదు చేయవచ్చని అంచనా వేసింది. ఎఫ్ఎంసీజీ వినియోగంలో 65 శాతం వాటా కలిగిన పట్టణాల్లో వినియోగం స్థిరంగా ఉండొచ్చని పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో అమ్మకాలు పెరగొచ్చని తెలిపింది. ముడి సరుకుల ధరలు తగ్గడంతో ఎఫ్ఎంసీజీ కంపెనీల నిర్వహణ మార్జిన్లు 0.5–1 శాతం మేర పెరిగి, కరోనా ముందున్న 20–21 శాతానికి చేరుకుంటాయని పేర్కొంది. ప్రధానంగా ఎడిబుల్ ఆయిల్, కెమికల్స్, ముడి చమురు ఉత్పత్తుల ధరలు తగ్గడం కంపెనీల అధిక మార్కెటింగ్ వ్యయాలకు సర్దుబాటుగా ఉంటుందని తెలిపింది. రూ.5.2 లక్షల కోట్ల ఎఫ్ఎంసీజీ మార్కెట్లో 35 శాతం వాటా కలిగిన 76 ఎఫ్ఎంసీజీ సంస్థల పనితీరు ఆధారంగా ఈ నివేదికను క్రిసిల్ రేటింగ్స్ రూపొందించింది. అమ్మకాల పరంగా గడిచిన రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఎఫ్ఎంసీజీ పరిశ్రమ 1–3 శాతం వృద్ధినే చూడగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 4–6 శాతం మధ్య ఉండొచ్చని క్రిసిల్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ అనుజ్ సేథి తెలిపారు. ఎల్నినో ప్రభావం వర్షాలపై తీవ్రంగా ఉండకపోవచ్చన్న అంచనాల ఆధారంగానే ఈ విశ్లేషణకు వచి్చనట్టు చెప్పారు. సానుకూలం.. వరుసగా ఆరు త్రైమాసికాల పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఎఫ్ఎంసీజీ అమ్మకాలు క్షీణతను చూడగా, 2022–23 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం (2023 జనవరి–మార్చి)లోనే సానుకూల వృద్ధి నమోదైంది. ద్రవ్యోల్బణం దిగిరావడంతో వినియోగ డిమాండ్ స్థిరంగా ఉంటుందని క్రిసిల్ అంచనా వేసింది. కీలక పంటలకు కనీస మద్దతు ధర పెంచడాన్ని కూడా ప్రస్తావించింది. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో పట్టణ వినియోగం రెండంకెల వృద్ధిని చూడగా, ఖర్చు చేసే ఆదాయం పెరుగుతుండడం వల్ల ఈ వృద్ధి ఇక ముందూ కొనసాగొచ్చని అంచనా వేసింది. స్థిరమైన డిమాండ్: మారికో ఎఫ్ఎంసీజీ పరిశ్రమలో డిమండ్ ధోరణులు స్థిరంగా ఉన్నట్టు మారికో సైతం ప్రకటించింది. అయితే జూన్ త్రైమాసికంలో గ్రామీణ మార్కెట్లో డిమాండ్ అనుకున్నంతగా లేదని పేర్కొంది. ద్రవ్యోల్బణం శాంతించినందున ఈ ఏడాది మిగిలిన కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం పెరుగుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. జూన్ త్రైమాసికానికి సంబంధించి పనితీరుపై ప్రకటన విడుదల చేసింది. గడిచిన త్రైమాసికంలో పట్టణ ప్రాంతాల్లో డిమాండ్ స్థిరంగా ఉన్నట్టు తెలిపింది. సాధారణ వర్షపాత అంచనాలు, పంటలకు కనీస మద్దతు ధరలు పెంచడం, ద్రవ్యోల్బణం దిగిరావడం గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ను క్రమంగా పెంచుతుందన్న ఆశలు కలి్పస్తున్నట్టు వివరించింది. జూన్ త్రైమాసికంలో దేశీయ అమ్మకాల్లో సింగిల్ డిజిట్ వృద్ధి కనిపించినట్టు ప్రకటించింది. సఫోలా వంట నూనెల నిల్వలను గణనీయంగా తగ్గించుకోవడం ఇందుకు కారణమని పేర్కొంది. పోర్ట్ఫోలియో పరంగా చానల్ ఇన్వెంటరీలో మార్పులు కూడా చేసినట్టు తెలిపింది. వచ్చే త్రైమాసికంలో అమ్మకాలు పెరుగుతాయనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నట్టు వివరించింది. జూన్ త్రైమాసికంలో అంతర్జాతీయ వ్యాపారం గరిష్టంగా ఒక అంకె స్థాయిలో (7–8 శాతం) పెరిగినట్టు తెలిపింది. బ్రాండ్ల బలోపేతం, నూతన ఉత్పత్తులపై ప్రచారం కోసం అధికంగా ఖర్చు చేయనున్నట్టు ప్రకటించింది. -
పగటిపూట 20% తక్కువ.. రాత్రిపూట 20% ఎక్కువ
న్యూఢిల్లీ: దేశంలో త్వరలో కొత్త విద్యుత్ టారిఫ్ అమల్లోకి రానుంది. పగటిపూట వినియోగం తక్కువగా ఉండే సమయంలో విద్యుత్ వాడుకుంటే చార్జీలు 20 శాతం వరకు తగ్గుతాయి. రాత్రిపూట వినియోగం అధికంగా ఉండే సమయంలో విద్యుత్ ఉపయోగించుకుంటే చార్జీలను 20 శాతం మేర పెంచుతారు. ఈ మేరకు టైమ్ ఆఫ్ ద డే(టీఓడీ) టారిఫ్ పేరిట కొత్త విద్యుత్ నియమాలను కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రకటించింది. దేశవ్యాప్తంగా పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కొత్త టారిఫ్ను అమలు చేయడం వల్ల పీక్ సమయాల్లో గ్రిడ్పై భారంతోపాటు విద్యుత్ డిమాండ్ తగ్గుతుందని తెలియజేసింది. ఈ నూతన విధానం 2024 ఏప్రిల్ 1వ తేదీ నుంచి మొదట వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులకు అమల్లోకి వస్తుందని ప్రకటించింది. సంవత్సరం తర్వాత.. అంటే 2025 ఏప్రిల్ 1 నుంచి వ్యవసాయ రంగం మినహా మిగతా అన్ని రంగాల విద్యుత్ వినియోగదారులకు ఈ నిబంధనలను వర్తింపజేయనున్నట్లు స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా, నూతన టారిఫ్ విధానంతో వినియోగదారులకు లబ్ధి చేకూరుతుందని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ అభిప్రాయపడ్డారు. లైట్లు, ఫ్యాన్లు, ఏసీల వినియోగం రాత్రిపూటే ఎక్కువ కాబట్టి వినియోగదారులపై భారం పడుతుందని విద్యుత్ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. -
వినియోగానికి రూ.2,000 నోట్ ఉపసంహరణ బూస్ట్
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రూ. 2,000 నోట్ల ఉపసంహరణ నిర్ణయం దేశంలో వినియోగం పెరుగుదలకు, తద్వారా వృద్ధి స్పీడ్ ఊపందుకోడానికి దోహదపడుతుందని బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఎకనమిస్టులు తమ తాజా నోట్లో పేర్కొన్నారు. ఏప్రిల్తో ప్రారంభమైన ప్రస్తుత ఆరి్థక సంవత్సరం (2023–24)లో వృద్ధిరేటు 6.5 శాతం ఉంటుందన్న ఆర్బీఐ అంచనాలకు మించి ఎకానమీ స్పీడ్ ఉంటుందని కూడా వీరి నోట్ అభిప్రాయపడింది. క్యూ1లో 8.1 శాతం వృద్ధి ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో వృద్ధి రేటు 8 శాతం ఉంటుందని ఆర్బీఐ ద్వైమాసిక పాలసీ సమీక్ష అంచనావేయగా, 8.1 శాతంగా ఈ రేటు నమోదవుతుందని ఎస్బీఐ ఎకనమిస్టులు అంచనా వేశారు. రూ.2000 నోట్ల రద్దు వల్ల వినియోగ వ్యయం రూ.55,000 కోట్లు పెరుగుతుందన్నది ఎకనమిస్టుల అంచనా. నోట్ ప్రకారం బంగారం, ఆభరణాలు, ఎయిర్ కండీషనర్లు, మొబైల్ ఫోన్లు, రియల్ ఎస్టేట్ వంటి హై–ఎండ్ కన్సూ్యమర్ డ్యూరబుల్స్ వంటి విభాగాల్లో వినియోగ వ్యయాలు పెరుగుతాయి. రూ.2,000 వ్యయాల్లో 30 శాతం ఇందనం కొనుగోళ్లు, ఆన్లైన్ ఫుడ్ అగ్రిగేటర్లకు క్యాష్ ఆన్ డెలివరీలకు వెచ్చిస్తున్నట్లు కూడా నోట్ లెక్కగట్టింది. దేవాలయాలు, ఇతర మతపరమైన సంస్థలకు కూడా విరాళాలు పెరుగుతాయని అంచనా. ఇప్పటికే క్లోజ్ యూజర్ గ్రూప్లో పరీక్షిస్తున్న ఆర్బీఐ రిటైల్ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) కూడా రూ. 2,000 నోట్లను ఉపసంహరణ వల్ల ప్రయోజనం పొందుతుందని అభిప్రాయపడింది. ఈ–రూపీ వినియోగం స్పీడ్ అధిక డినామినేషన్ నోటు లేకపోవడం వలన చిన్న స్థాయి లావాదేవీలకు తక్కువ విలువకలిగిన ఫిజికల్ కరెన్సీ నోట్లు, వ్యాపార లావాదేవీల కోసం ఈ–రూపీ వినియోగం వేగంగా పెరిగే అవకాశం ఉందని తెలిపింది. 2016 నవంబర్లో అప్పటి పెద్ద నోట్ల రూ.500, రూ.1,000 నోట్లను రద్దుచేసి కొత్త రూ.500, రూ.2,000 నోట్లను తీసుకువచి్చన ఆర్బీఐ, గత నెల 19వ తేదీన రూ.2000 నోట్లను కూడా సెప్టెంబర్ 30 నాటికి పూర్తిగా వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. నిజానికి 2018–19లోనే ఆర్బీఐ రూ. 2,000 నోట్ల ముద్రణను నిలిపివేసింది. 2018 మార్చి 31వ తేదీ నాటికి రూ.2,000 నోట్ల గరిష్ట చెలామణీ విలువ రూ.6.73 లక్షల కోట్లుగా ఉంది. చెలామణీలో ఉన్న మొత్తం రూ.2000 నోట్లలో ఈ విలువ 37.3 శాతానికి సమానం. 2023 మార్చి 31వ తేదీ నాటికి రూ.2000 నోట్ల చెలామణీ విలువ రూ.3.62 లక్షల కోట్లు. చెలామణీలో ఉన్న మొత్తం నోట్లలో ఈ విలువ 10.8 శాతం మాత్రమే. కాగా, వ్యవస్థలో ఉన్న 2000 నోట్లలో ఇప్పటికి రూ.1.80 లక్షల కోట్లు వెనక్కు వచ్చేశాయని, వీటిలో 85 శాతం డిపాజిట్ల ద్వారానే వెనక్కు వచ్చాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ఇటీవలి పాలసీ సమీక్షలో ప్రకటించారు. వ్యవస్థలో 2,000 నోట్ల వినియోగం ఇంధనం, బంగారు ఆభరణాలు, కిరాణా కొనుగోళ్లకు అధికంగా వినియోగిస్తున్నట్లు ఇప్పటికే పలు సర్వేలు వెల్లడించాయి. -
అన్నీ అనర్థాలే.. 3.4 కోట్ల ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం!
భూగోళం మండిపోతోంది.. ఎండ ప్రచండంగా మారుతోంది.. వాతావరణంలో మార్పులతో రుతువులు గతి తప్పుతున్నాయి. పెట్రోల్, డీజిల్, ఇతర శిలాజ ఇంధనాల మితిమీరిపోయిన వాడకంతో కర్బన ఉద్గారాలు అడ్డూఅదుçపూ లేకుండా పెరిగిపోతున్నాయి. ఉష్ణోగ్రతల పెరుగుదలతో భూతాపం మళ్లీ చర్చనీయాంశంగా మారింది. ఉష్ణోగ్రతల పెరుగుదల ఇలాగే ఉంటే ముందు ముందు మరిన్ని అనర్థాలు ఎదుర్కోబోతున్నాం. 2030కి భారత్ ఎన్నో ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటుందని ఆర్బీఐ నివేదిక హెచ్చరిస్తోంది. మండే ఎండలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. శ్రామిక శక్తి నిర్వీర్యమైపోతోంది. సూర్యుడు నిప్పులు కురిపిస్తూ ఉంటే శ్రామికులు సత్తువ కోల్పోతున్నారు. పని గంటలు తగ్గిపోతున్నాయి. ఫలితంగా వాతావరణ మార్పులతో మన దేశం ఆర్థికంగా కుదేలయ్యే దుస్థితి రాబోతోందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజా నివేదిక హెచ్చరించింది. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 8 కోట్ల ఉద్యోగాలు ఊడిపోతే అందులో దాదాపుగా సగం 3.4 కోట్లు భారత్లోనేనని ఆర్బీఐ నివేదిక అంచనా వేసింది. ఇక స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 4.5 శాతం వరకు కోల్పోయే ముప్పు ఉందని హెచ్చరించింది....! వచ్చే ఐదేళ్లలో భగభగలే..! వచ్చే అయిదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రతల్లో భారీగా పెరిగిపోనున్నాయి. గ్రీన్హౌస్ గ్యాస్లు, çపసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే ఎల్నినో ప్రభావంతో ఎండ ప్రచండంగా మారుతుందని ప్రపంచ వాతావరణ సంస్థ వెల్లడించింది. 2023–2027 మధ్యలో సగటు ఉష్ణోగతల్లో పెరుగుదల 1.5 డిగ్రీల సెల్సియస్గా ఉంటుందని అంచనా. వచ్చే అయిదేళ్లలో ఏదో ఒక ఏడాది రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవడానికి 98% అవకాశం ఉంది. 2015 నుంచి ఉష్ణోగ్రతల్లో సగటు పెరుగుదల 1.5 డిగ్రీల సెల్సియస్గా ఉంటూ వస్తోంది. ఆర్కిటిక్ కరిగి మంచు కరిగిపోయే పరిస్థితులు ఎదురవుతాయి. వందేళ్లలో ఒక్కసారి ఇలా జరుగుతూ ఉంటుంది. వ్యవసాయం: భారత్ వ్యవసాయ ఆధారిత దేశం. అత్యధికులు ఇప్పటికీ వ్యవసాయ రంగం మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. వాతావరణ మార్పుల వల్ల వ్యవసాయ సీజన్లే మారిపోతాయి. దీని వల్ల పంట దిగుబడులు తగ్గిపోతాయి. ఫలితంగా గ్రామీణ ఆర్థిక రంగం కుదేలైపోతుంది. దాని ప్రభావంతో పట్టణాల్లో ధరాభారం పెరిగిపోతుంది. పరిశ్రమలు: పారిశ్రామిక రంగంలో నిర్వహణ వ్యయాలు తడిసిమోపెడయిపోతాయి. లాభా లు తగ్గుతాయి. పర్యావరణ పరిరక్షణ కోసం కొత్త నియంత్రణలు పాటించాల్సి రావడంతో పెట్టుబడులు పెరుగుతాయి. సేవలు : ఆర్థిక సేవలపై ఒత్తిడి పెరిగిపోతుంది. అనారోగ్యాల బారిన పడేవారి సంఖ్య పెరిగి బీమా క్లెయిమ్లు పెరుగుతాయి. ప్రయాణాలు తగ్గి ఆతిథ్య రంగం కుదేలవుతుంది. శ్రామిక మార్కెట్: పర్యావరణ మార్పులతో ఉత్పాదకత తగ్గి వలసలు పెరుగుతాయి. ఎండలకు శ్రామికుల పని గంటలు తగ్గుతాయి. రుణాలు, మార్కెట్, లిక్విడిటీ, బ్యాంకులు, ఆర్థిక సంస్థలపైనా ప్రభావం పడనుంది. -
ప్రపంచంలో ఎక్కువ మందు బాబులు ఉండేది ఈ దేశాల్లోనే!
-
గ్రామీణంలో పుంజుకున్న ఎఫ్ఎంసీజీ వినియోగం
న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంతాల్లో ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల వినియోగం తిరిగి గాడిన పడింది. ఆరు త్రైమాసికాల క్షీణత తర్వాత మార్చి క్వార్టర్లో వృద్ధి నమోదైంది. డేటా విశ్లేషణ సంస్థ ‘ఎన్ఐక్యూ’ ఈ వివరాలను విడుదల చేసింది. ఎఫ్ఎంసీజీ విక్రయాల్లో గ్రామీణ ప్రాంతాల వాటా 35%గా ఉంటుందని పేర్కొంది. అయితే ఆరు త్రైమాసికాల తర్వాత అమ్మకాల్లో భారీ వృద్ధి నమోదు కాలేదు. అతి స్వల్పంగా 0.3 శాతమే పెరిగాయి. కాకపోతే దీన్ని సానుకూలంగా ఐక్యూ నివేదిక పేర్కొంది. పట్టణ ప్రాంతాల్లో మార్చి త్రైమాసికంలో ఎఫ్ఎంసీజీ అమ్మకాలు 5.3%పెరిగినట్టు వెల్లడించింది. దీనికంటే ముందు గ్రామీణ మార్కెట్ చివరిగా 2021 ఏప్రిల్–డిసెంబర్ కాలంలో వృద్ధిని చూడడా న్ని ఈ నివేదిక ప్రస్తావించింది. మొత్తం మీద మార్చి త్రైమాసికంలో ఎఫ్ఎంసీజీ పరిశ్రమలో అమ్మకాల పరంగా 3.1%, విలువ పరంగా 10.1% వృద్ధి నమోదైంది. గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం పుంజుకోవడానికి తోడు, సంప్రదాయ అమ్మకాలు పెరగడం సానుకూల వృద్ధికి దోహదపడింది. ఆహారోత్పత్తులకే ఆదరణ.. ఆహారోత్పత్తుల అమ్మకాలు 4.3 శాతం వృద్ధి చెందాయి. ఆహారేతర వినియోగం కేవలం 0.2 శాతం పెరిగింది. ఆహారం కాకుండా, గృహ సంరక్షణ ఉత్పత్తుల కొనుగోళ్లలో వినియోగదారులు ఆచితూచి ఖర్చు చేస్తున్నారు. సంప్రదాయ కిరాణా దుకా ణాల్లో అమ్మకాలు కేవలం 1.9 శాతమే పెరగ్గా, ఆధునిక అంగళ్లు అయిన హైపర్ మార్కెట్లు, షాపింగ్ మాల్స్లో ఎఫ్ఎంసీజీ అమ్మకాలు 14.6 శాతం వృద్ధిని చూశాయి. వీధి చివర్లో ఉండే కిరాణా దుకాణాల్లో ఎలాంటి డిస్కౌంట్లు ఉండకపోగా, పెద్ద షాపింగ్ మాల్స్ మంచి ఆఫర్లతో తక్కువ మార్జిన్తో విక్రయిస్తుండడం ఈ పరిణామాలకు నిదర్శనం. ఎఫ్ఎంసీజీలో చిన్న కంపెనీఈలు అమ్మకాల పరంగా 7.2 శాతం వృద్ధిని చూస్తే, పెద్ద కంపెనీలకు ఇది 3.2 శాతంగానే ఉంది. ఇక్కడ కూడా అంతే, చిన్న ఎఫ్ఎంసీజీ కంపెనీలు తక్కువ మార్జిన్లతో తక్కువ ధరలకు విక్రయిస్తుండడం వినియోగదారులను ఆకర్షిస్తోంది. -
ఊపందుకున్న పెట్రోల్, డీజిల్ విక్రయాలు
న్యూఢిల్లీ: వ్యవసాయ పనులు, పరిశ్రమల అవసరాలు, ట్రక్కుల ద్వారా రవాణా పెరగడంతో ఏప్రిల్ ప్రథమార్ధంలో డీజిల్కు భారీ డిమాండ్ ఏర్పడింది. గతేడాది ఏప్రిల్ ప్రథమార్ధంతో పోలిస్తే ఈసారి డీజిల్ విక్రయాలు 15 శాతం పెరిగి 3.45 మిలియన్ టన్నులుగా నమోదయ్యాయి. నెలలవారీగా చూసినప్పుడు మార్చి ప్రథమార్ధంలో నమోదైన 3.19 మిలియన్ టన్నులతో పోలిస్తే 8.4 శాతం పెరిగాయి. ఇక పెట్రోల్ విషయానికొస్తే ఏప్రిల్ 1–15 మధ్య కాలంలో అమ్మకాలు 2 శాతం పెరిగి 1.14 మిలియన్ టన్నులకు చేరాయి. నెలవారీగా చూస్తే మాత్రం 6.6 శాతం మేర తగ్గాయి. కోవిడ్ పూర్వంతో (2020) పోలిస్తే ఏప్రిల్ ప్రథమార్ధంలో పెట్రోల్ అమ్మకాలు 128 శాతం, డీజిల్ అమ్మకాలు 127 శాతం పెరిగాయి. వార్షికంగా వంట గ్యాస్ విక్రయాలు 5.7 శాతం పెరిగి 1.1 మిలియన్ టన్నులకు చేరాయి. మరోవైపు, ఏవియేషన్ కార్యకలాపాలు తిరిగి యథాప్రకారం ప్రారంభమైన నేపథ్యంలో గతేడాది ఏప్రిల్ ప్రథమార్ధంతో పోలిస్తే తాజాగా విమాన ఇంధనం (ఏటీఎఫ్) అమ్మకాలు 14 శాతం పెరిగి 2,84,600 టన్నులకు చేరాయి. నెలలవారీగా చూస్తే 3.8% తగ్గినప్పటికీ.. 2020తో పోల్చినప్పుడు 468 శాతం పెరిగాయి. పారిశ్రామిక కార్యకలాపాలు గణనీయంగా పుంజుకోవడం దేశీయంగా ఆయిల్ డిమాండ్కు ఊతమిస్తోందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇటు సర్వీసులు, అటు పరిశ్రమల నుంచి మద్దతుతో భారత్ స్థిరమైన వృద్ధి సాధించగలుగుతోందని పేర్కొన్నాయి. -
మొబైల్ డేటా వినియోగంలో భారీగా పెరుగుదల
-
సర్వేలో బయటపడ్డ షాకింగ్ విషయాలు.. తెలంగాణలో మరీ ఇంత ఘోరమా?
(శ్రీగిరి విజయ్కుమార్రెడ్డి) ఉద్వేగాల నేల తెలంగాణ.. సంతోషం, సంబురం, వినోదం, విషాదం.. ఏదైనా సామూహిక విందు ఇక్కడి కలివిడి జీవితాలకు సంకేతం. నలుగురు కలిసిన సమయంలో విందు, విలాసాల్లో సరదాగా మొదలవుతున్న మద్యం వినియోగం.. తర్వాత అలవాటుగా మారి జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు దొరుకుతున్న మద్యంతో వినియోగం విపరీతంగా పెరుగుతోంది. దేశంలో అరుణాచల్ప్రదేశ్ 15 లక్షలు జనాభాలో సుమారు 7.60 లక్షల మందికి మద్యం తాగే అలవాటుతో టాప్లో ఉంది. ఆ తర్వాతి స్థానంలో తెలంగాణ ఉంది. ఇక్కడ నాలుగు కోట్లకుపైగా జనాభా ఉండగా.. వీరిలో 15– 49 ఏళ్ల మధ్య వయసువారిలో యాభై ఐదు శాతం మంది మద్యం తాగుతున్నట్టు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (2019–21) ఇటీవలే వెల్లడించింది. కొత్తగా మద్యం అలవాటు అవుతున్న వారి సంఖ్య జాతీయ సగటు కంటే వేగంగా పెరుగుతోందని పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో మరింతగా.. తెలంగాణలో మద్యం అలవాటు గ్రామీణ ప్రాంతాల్లో మరింత ఎక్కువగా 62 శాతం (15–49 ఏళ్ల మధ్య వయసువారిలో) మేర ఉంది. ఇందులో 7శాతం మహిళలు కూడా ఉండటం గమనార్హం. ఇందులో 54శాతం మంది వారంలో ఒకసారి మద్యం తాగుతుంటే.. 28శాతం మంది నాలుగు రోజులకోసారి, మరో 19 శాతం మంది ప్రతిరోజు తాగుతున్నారు. ఇక మద్యం అలవాటు/వ్యసనంగా మారిన కుటుంబాల్లో 28 శాతం మంది మహిళలు భర్తల నుంచి హింసకు గురవుతున్నారు. 16 శాతం మంది మహిళలు తీవ్రగాయాల పాలవుతున్నట్టు జాతీయ కుటుంబ సర్వే పేర్కొంది. నిషాలో ప్రమాదాలతో.. దేశంలో ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న పది రాష్ట్రాల్లో తెలంగాణ 8వ స్థానంలో ఉంది. డ్రంకెన్ డ్రైవ్ వల్ల ప్రమాదాలు, మరణాలు కూడా ఎక్కువగానే ఉంటున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో బాధితులు 18– 35 ఏళ్లలోపు వారే ఎక్కువగా ఉంటున్నారు. ఇక పదిలక్షల జనాభా దాటిన యాభై నగరాల్లో రోడ్డు ప్రమాదాలకు సంబంధించి.. హైదరాబాద్ 7వ స్థానంలో ఉందని ట్రాన్స్పోర్ట్ రీసెర్చ్ వింగ్ 2020 నివేదిక పేర్కొంది. అమ్మకాలు.. ఆదాయం.. చీర్స్ మద్యం వినియోగం అధికంగా ఉండే రాష్ట్రాలతో పోలిస్తే తలసరి వినియోగంలో తెలంగాణ టాప్లో ఉంది. రాష్ట్రంలో 2017–2020 మధ్య మద్యం వినియోగం 18 శాతం పెరిగి రాష్ట్ర ఖజానాకు కాసులు కురిపించింది. అత్యధికంగా మద్యం విక్రయించిన వైన్స్ల వివరాలు చూస్తే తాజా ఎక్సైజ్ ఏడాదిలో.. హన్మకొండ హంటర్ రోడ్డులోని ఓ వైన్స్ రూ.38 కోట్ల విలువైన మద్యాన్ని విక్రయిస్తే, అశ్వారావుపేటలో రూ.31 కోట్లు, కరీంనగర్లో రూ.29 కోట్లు, కల్వకుర్తిలో ఒక వైన్స్ రూ.20.50 కోట్లు, నిజామాబాద్లో ఒక వైన్స్ రూ.19.50 కోట్లు, తొర్రూరులో ఒకవైన్స్ రూ.14.33 కోట్లు విలువైన మద్యాన్ని బాటిలింగ్ యూనిట్ల నుంచి కొనుగోలు చేసి జనానికి విక్రయించాయి. డ్రంకెన్ డ్రైవ్.. ప్రాణాలు తీసింది.. అది 2021 డిసెంబర్ 18. తెల్లవారుజామున రెండుగంటలు.. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతున్న కారు సెంట్రల్ యూనివర్సిటీ సమీపంలో చెట్టును ఢీకొట్టి రెండు ముక్కలైంది. డ్రైవర్ సీట్లో ఉన్న రహీం అనే యువకుడితోపాటు ఎం.మానస, ఎన్.మానస ఇద్దరు అక్కడిక్కడే మరణించారు. సిద్ధు అనే యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. రహీం మద్యం మత్తులో వేగంగా నడపడమే ప్రమాదానికి కారణమని పోలీసులు తేల్చారు. ఈ ఘటనపై జడ్చర్లకు చెందిన మానస తండ్రి రవీందర్ను పలకరిస్తే.. ‘‘ఆరేళ్ల క్రితమే తల్లిని పోగొట్టుకున్న మానసను గారాబంగా పెంచాను. ఆమెకు ఇష్టమైన టీవీ, సినిమా రంగంలోకి వెళ్తానంటే సంతోషపడ్డాను. కుటుంబానికి పెద్దదిక్కుగా ఉంటుందని భావించాను. కానీ డ్రంకెన్ డ్రైవ్ నా బిడ్డను నాకు కాకుండా చేసింది. ఇలాంటి శిక్ష ఏ తండ్రికి పడొద్దు..’’అని కన్నీళ్లు పెట్టారు. పెంచిన చేతులతోనే.. అతడి పేరు కిరణ్ (28).. బీరుతో సరదాగా మొదలైన వ్యసనం విస్కీతో విస్తరించింది. ఆపై గంజాయికీ చేరింది. మత్తు లేనిదే ఉండలేక డబ్బుల కోసం తల్లిదండ్రులను వేధించడం, దాడులు చేయడం దాకా ఉన్మాదం చేరింది. కిరణ్ భార్య వేధింపులు భరించలేక పుట్టింటికి వెళ్లిపోయింది. అక్టోబర్ 10న మత్తులో ఇంటికి వచ్చిన కిరణ్ డబ్బులు కావాలంటూ తల్లి మీద దాడి చేశాడు. అడ్డుకోబోయిన తండ్రినీ గాయపరిచాడు. ఏమీ దిక్కుతోచని ఆ వృద్ధ దంపతులు కిరణ్ మెడకు తాడు బిగించి చంపేశారు. ఇది సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో జరిగిన విషాద ఘటన. జీవిత చరమాంకంలో ప్రశాంతంగా గడపాలనుకున్న తల్లిదండ్రులు యాదగిరి, వెంకటమ్మ మద్యం పెట్టిన చిచ్చుతో జైలు జీవితం గడుపుతున్నారు. తల్లి కోసం తండ్రిని.. ఇష్టపడి పెళ్లి చేసుకున్న ఆ ఇద్దరూ ఉన్నంతలో బాగానే కాలం గడిపారు. భర్త భాస్కర్ (45) ఆటో నడుపుతూ భార్య కరుణారాణి, ఇద్దరు కుమారులు బాలతేజ, తరుణ్ తేజలను పోషించుకుంటూ వచ్చాడు. కానీ భాస్కర్ సరదాగా మొదలుపెట్టిన మద్యం తాగుడు.. తర్వాత అలవాటుగా, వ్యసనంగా మారింది. కొన్నేళ్ల క్రితం మద్యం మత్తులో భాస్కర్ దాడి చేయడంతో భార్య చేయి విరిగింది. తర్వాతా మద్యానికి డబ్బుల కోసం వేధించడం పెరిగింది. ఈ నెల 20న ఆలేరు మండలం తూర్పుగూడెంలో చర్చి పండగతో ఊరంతా సందడిగా ఉంటే.. భాస్కర్ మాత్రం తనకు తాగేందుకు డబ్బులివ్వాలంటూ భార్యపై దాడికి దిగాడు. అడ్డుకోబోయిన కొడుకులను గాయపర్చాడు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇద్దరు కొడుకులు కత్తితో దాడి చేయగా.. భాస్కర్ చనిపోయాడు. ఆ ఇద్దరు జైలుకు వెళ్లారు. కరుణారాణిపైనా కేసు నమోదైంది. కష్టం చేస్తేగానీ పూటగడవని కుటుంబానికి మద్యం అలవాటు చేసిన గాయం ఎలా మానుతుందంటూ తూర్పుగూడెం గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ప్రేమపెళ్లి.. నడిరోడ్డులో ఆలిని నరికేసి.. మహబూబాబాద్ జిల్లా కేంద్రం భవానినగర్ తండాలో ఉండే జాటోత్ భాస్కర్ 15 ఏళ్ల కింద కల్పన అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. భాస్కర్ ఒకచోట గుమాస్తాగా, కల్పన ఇళ్లలో పనిచేస్తూ ముగ్గురి ఆడపిల్లల్ని పోషించుకుంటూ వచ్చారు. కానీ, కొంతకాలంగా మద్యానికి బానిసైన భాస్కర్ తాగి వచ్చి డబ్బుల కోసం కల్పనను కొట్టేవాడు. వేధింపులు భరించలేక కల్పన ఈ ఏడాది సెప్టెంబర్ 17న పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. దీనిపై ఆగ్రహించిన భాస్కర్ సెప్టెంబర్ 22న ఉదయం పనికోసం వెళ్తున్న కల్పనను నడిరోడ్డులో కత్తితో పొడిచి చంపాడు. తల్లి హత్యకు గురై తండ్రి జైలుకు వెళ్లడంతో చిన్నారులు అమ్మమ్మ ఇంట్లో భారంగా బతుకు వెళ్లదీస్తున్నారు. భారీగా మద్యం ఆదాయం 2020–21లో తెలంగాణలో గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో సుమారు పదివేల కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. మిగతా జిల్లాల్లో బాట్లింగ్ యూనిట్ల ద్వారా ప్రభుత్వానికి నేరుగా వచ్చిన ఆదాయం ఇదీ .. సులువైన ఆదాయం మద్యం నుంచే.. అది పేరుకే ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ. కానీ ప్రొహిబిషన్ (నిషేధం) బదులు విస్తరణ శాఖగా మార్చేశారు. మద్యం ఆదాయం ప్రధాన వనరుగా మారింది. ప్రభుత్వాలకు సులువుగా వచ్చే ఆదాయం ఇదే. కానీ మద్యం వినియోగంతో పాటు క్రైం రేటు భారీగా పెరుగుతోంది. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలను మర్చిపోయామనిపిస్తోంది. – ఎంవీ చంద్రవదన్, ఎక్సైజ్ మాజీ కమిషనర్ డేంజర్ జోన్కు చేరువలో ఉన్నాం తెలంగాణ ఇప్పుడు డేంజర్ జోన్కు చేరువలో ఉంది. మా అంచనా మేరకు 90శాతం మంది (15 ఏళ్లు పైబడిన వారిలో) పలు రకాల మద్యం తాగుతున్నారు. మొదట తొలుత కల్లు, బీరు, విస్కీ.. అనంతరం గంజాయి, డ్రగ్స్కు అలవాటు పడుతున్నారు. పంజాబ్ ఇప్పటికే మద్యం వినియోగం నుంచి డ్రగ్స్ వైపు వెళ్లింది. తెలంగాణలో పరిమితికి మించి మద్య వినియోగం జరుగుతుంది. కొన్నాళ్లకు ఈ మత్తు చాలక గంజాయి, డ్రగ్స్ వైపు వెళ్లటం సహజం. తక్షణం మద్య నియంత్రణ కార్యాచరణ ప్రకటించకపోతే తెలంగాణ మరో పంజాబ్ కావడానికి ఎంతో సమయం పట్టదు. – ఎం పద్మనాభరెడ్డి, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ మద్యం విచక్షణను దూరం చేస్తుంది సరదా కోసం తీసుకునే మద్యం అలవాటుగా మారి మనిషిలో విచక్షణను దూరం చేస్తోంది. మెదడు నుంచి కాలిబొటన వేలి వరకు ప్రభావం చూపుతుంది. ఆహారంలా అవసరంగా మారి.. మద్యం తీసుకోకపోతే మనిషిని ఉన్మాదిగా మారుస్తుంది. – డాక్టర్ ఎ.లక్ష్మీలావణ్య, హైదరాబాద్ -
తగ్గుతున్న ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల వినియోగం
న్యూఢిల్లీ: ధరలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల వినియోగం మందగిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో అమ్మకాల పరిమాణం మరింతగా పడిపోతోంది. డేటా అనలిటిక్స్ సంస్థ నీల్సన్ఐక్యూ విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం జూన్ త్రైమాసికంతో పోలిస్తే సెప్టెంబర్ త్రైమాసికంలో ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల (ప్యాకేజ్డ్ ఆహార, ఆహారయేతర ఉత్పత్తులు మొదలైనవి) విక్రయ పరిమాణం 0.9 శాతం తగ్గింది. ఇలా అమ్మకాల పరిమణం వృద్ధి మందగించడం ఇది వరుసగా నాలుగో త్రైమాసికం. వరుసగా గత ఆరు త్రైమాసికాల్లో రేట్లు రెండంకెల స్థాయిలో పెరగడం దీనికి దారి తీసిందని నివేదిక వివరించింది. గ్రామీణ మార్కెట్లలో అమ్మకాల పరిమాణం జూన్ త్రైమాసికంలో 2.4 శాతం క్షీణించగా, సెప్టెంబర్ త్రైమాసికంలో 3.6 శాతం తగ్గింది. అయితే, ఇదే వ్యవధిలో పట్టణ ప్రాంత మార్కెట్లలో విక్రయాల పరిమాణం 1.2 శాతం పెరిగింది. ఆహార ఉత్పత్తుల అమ్మకాలు 3.2 శాతం పెరిగాయి. రేట్ల పెంపు నేపథ్యంలో విలువపరంగా చూస్తే .. జూన్ త్రైమాసికంతో పోల్చినప్పుడు సెప్టెంబర్ త్రైమాసికంలో దేశీ ఎఫ్ఎంసీజీ పరిశ్రమ ఆదాయం 8.9 శాతం మేర వృద్ధి చెందినట్లు నివేదిక వివరించింది. ఇక పరిమాణం, విలువపరంగా చూసినా అమ్మకాలు కోవిడ్ పూర్వ స్థాయికి (2020 మార్చి త్రైమాసికం) మించి నమోదయ్యాయి. మహమ్మారి ప్రభావం తగ్గాక మార్కెట్లు పూర్తిగా తెరుచుకోవడం ఇందుకు దోహదపడినట్లు నివేదిక పేర్కొంది. నివేదికలోని మరిన్ని అంశాలు .. రేట్ల పెరుగుదల నేపథ్యంలో వినియోగదార్లు ఎక్కువగా చిన్న ప్యాక్లవైపు మొగ్గు చూపడం కొనసాగుతోంది. కంపెనీలు చాలా మటుకు ఉత్పత్తులను కొత్తగా చిన్న ప్యాక్ల్లో ప్రవేశపెడుతున్నాయి. ముడి వస్తువుల ధరలు ఇంకా అధిక స్థాయిలో కొనసాగుతుండటమే కారణం. హైపర్మార్కెట్లు, సూపర్మార్కెట్లు, మాల్స్ మొదలైనవి .. విలువపరంగా (22 శాతం అధికం), పరిమాణంపరంగా (11 శాతం వృద్ధి) మెరుగ్గా రాణిస్తున్నాయి. చిన్న తయారీ సంస్థలు, టాప్ 400 ఎఫ్ఎంసీజీ సంస్థలు .. వినియోగ చోదకాలుగా ఉంటున్నాయి. గత 2–3 త్రైమాసికాలుగా విలువ, పరిమాణంలో వాటి వాటా పెరుగుతోంది. చదవండి: అమలులోకి కొత్త రూల్.. ఆ సమయంలో ఎస్ఎంఎస్ సేవలు బంద్! -
‘నా బిడ్డల మీద ఒట్టు.. అవి నా బ్రాండ్స్ కావు’
భువనేశ్వర్: అధికారం ఆయన చేతుల్లో ఉంది. ఇంకేం.. ఆఫీస్ను తన ఇష్టారాజ్యంగా మార్చేసుకున్నాడు. ఉద్యోగులపై వేధింపులకు పాల్పడడం చాలదన్నట్లు.. ఆఫీస్ వేళలో అదీ తన క్యాబిన్లోనే ఎంచక్కా చుక్కేశాడు. అంతటితో ఆగకుండా ఆ మైకంలో పచ్చిబూతులు మాట్లాడుతూ.. ఆ వీడియో, ఫొటోల ద్వారా వైరల్ అయిపోయాడు. ఒడిశా గాంజామ్ జిల్లా ఆరోగ్య విభాగంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నేషనల్ హెల్త్ మిషన్ పరిధిలో.. రాష్ట్రీయ బాల్ సురక్ష కార్యక్రమ(ఆర్బీఎస్కే), రాష్ట్రీయ కిషోర్ స్వస్థ్య కార్యక్రమ(ఆర్కేఎస్కే) ప్రొగ్రామ్ల కింద అసిస్టెంట్ మేనేజర్గా పని చేస్తున్నాడు సందీప్ మిశ్రా. ఈయన వ్యవహార శైలిపై గతంలోనే ఎన్నో ఆరోపణలు వచ్చాయి. అయితే.. ఈసారి పక్కా ఆధారాలతో ఆయన్ని పట్టించారు కొందరు ఉద్యోగులు. ఆఫీస్ వేళలో తన కుర్చీలో తాగుతూ ఆయన మాట్లాడిన మాటలు, ఫొటోలు స్థానిక వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అయ్యాయి. ఇదిలా ఉంటే.. వైరల్ వీడియో, ఫొటోలపై సందీప్ మిశ్రా స్పందించారు. ఇదంతా కుట్ర అని, అవి ఎడిటింగ్ చేసిన ఫొటోలనీ, తనను బద్నాం చేసేందుకు జరిగిన కుట్ర అని చెప్తున్నారాయన. ‘‘ఆఫీస్లో ఏనాడూ నేను మందు తాగలేదు. అసలు అందులో కనిపించిన బ్రాండ్లు నేనెప్పుడూ రుచి చూడలేదు. నా బిడ్డల మీద ఒట్టు.. అది మార్ఫింగ్ చేసినవి అయి ఉండొచ్చు’’ అని సందీప్ చెప్తున్నాడు. తాగిన మత్తులో ఉద్యోగులతో అసభ్యంగా మాట్లాడతాడని, మహిళా ఉద్యోగులతో అనుచితంగా ప్రవర్తిస్తాడని ఓ ఉద్యోగిణి వెల్లడించారు. ఈ విషయంపై గాంజామ్ జిల్లా చీఫ్ డిస్ట్రిక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఉమాశంకర్ మిశ్రా స్పందించారు. వీడియో తమ దృష్టికి రావడంతో సందీప్ మిశ్రాకు షోకాజ్ నోటీసులు పంపినట్లు తెలిపారు. నివేదిక రాగానే చర్యలపై నిర్ణయిస్తామని పేర్కొన్నారు. ఇదీ చదవండి: ఉద్యోగం కోసం ఇలా కూడా చేస్తారా? -
అంతంతమాత్రం వేతన పెంపు తీవ్ర ఆందోళనకరం!
ముంబై: ఆర్థిక పునరుద్ధరణ ఊపందుకున్నప్పటికీ, వేతన పెంపు క్షీణించడం తీవ్ర ఆందోళనకరమైన అంశమని ఇండియా రేటింగ్స్ నివేదిక ఒకటి పేర్కొంది. వ్యవస్థలో డిమాండ్ తగ్గుదలకు ఇది దారితీస్తుందని, దీనివల్ల పరశ్రమలో సామర్థ్యం వినియోగం తగ్గుతుందని పేర్కొంది. వస్తు ఉత్పత్తి– వినియోగం అంతరాన్ని ఈ పరిస్థితి మరింత పెంచుతుందని విశ్లేషించింది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... ► 2012–16 ఆర్థిక సంవత్సరం మధ్య ఉద్యోగుల వేతన వృద్ధి సగటున 8.2 శాతంగా నమోదయితే, 2017–21 మధ్య ఇది 5.7 శాతానికి క్షీణించింది. ► వేతన పెంపు భారీగా లేకపోవడం వల్లే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (20 22–23 ఏప్రిల్–జూన్) అంచనాలకన్నా తక్కువగా 13.5 శాతం వృద్ధి రేటు నమోదయ్యింది. ► పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో గృహ కొనుగోలు శక్తి బలహీనంగా నమోదవుతోంది. ► జూన్ 2022ను తీసుకుంటే సంవత్సరం ప్రాతిపదికన పట్టణాల్లో వేతన పెంపు సగటు 2.8 శాతం ఉంటే, గ్రామీణ ప్రాంతాల్లో 5.5 శాతంగా ఉంది. అయితే ద్రవ్యోల్బణాన్ని సర్దుబాటుచేస్తే, వేతనంలో వృద్ధిలేకపోగా ఈ రేట్లు వరుసగా 3.7 శాతం, 1.6 శాతం మేర క్షీణించాయి. ► ఆగస్టులో రిటైల్ ద్రవ్యోల్బణం 6.8 శాతంగా నమోదయ్యే వీలుంది. తృణధాన్యాలు, సేవల రంగాల్లో ధరల తీవ్రత దీనికి కారణం. ► ద్రవ్యోల్బణం కట్టడి లక్ష్యంగా 2022–23లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను (మే నుంచి 1.4 శాతం మేర పెంపుతో ప్రస్తుతం 5.4 శాతం) 25 నుంచి 50 బేసిస్ పాయింట్లమేర పెంచే వీలుంది. -
తగ్గిన పెట్రోల్, డీజిల్ వాడకం..కారణం అదేనా!
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్కు డిమాండ్ తగ్గింది. ఈ నెల మొదటి 15 రోజుల్లో వర్షాలు ఎక్కువగా ఉండడం ఇంధన వినియోగంపై ప్రభావం చూపించింది. డీజిల్ వినియోగం 13.7 శాతం తగ్గి 3.16 మిలియన్ టన్నులుగా ఉంది. జూన్లో మొదటి 15 రోజుల్లో డీజిల్ వినియోగం 3.67 మిలియన్ టన్నులు ఉండడం గమనించాలి. సాధారణంగా ఏప్రిల్–జూన్ కాలంలోని వినియోగంతో పోలిస్తే.. జూలై–సెప్టెంబర్ కాలంలో డీజిల్, పెట్రోల్ డిమాండ్ సహజంగానే తక్కువగా ఉంటుంది. ఎందుకంటే వర్షాలతో రవాణా తగ్గుతుంది. సాగు రంగం నుంచి కూడా డిమాండ్ తక్కువగా ఉంటుంది. 2021 జూలై మొదటి 15 రోజుల వినియోగంతో పోలిస్తే మాత్రం.. ఈ ఏడాది ఇదే కాలంలో 27 శాతం వృద్ధి నమోదైంది. ఇక 2020 ఇదే కాలంతో చూస్తే 43 శాతం పెరిగింది. పెట్రోల్ వినియోగం సైతం ఈ నెల మొదటి 15 రోజుల్లో 8 శాతం తగ్గి 1.27 మిలియన్ టన్నులుగా నమోదైంది. జూన్ మొదటి 15 రోజుల్లో పెట్రోల్ వినియోగం 1.38 మిలియన్ టన్నులుగా ఉంది. 2021 జూలై మొదటి 15 రోజులతో పోలిస్తే 23 శాతం, 2020 జూలై మొదటి 15 రోజులతో పోలిస్తే 46 శాతం అధికం. ఇక 2019 జూలై 15 రోజులతో పోల్చి చూసినా పెట్రోల్ వినియోగం 28 శాతం ఎక్కువగా ఉంది. -
ప్లీజ్.. ఛాయ్ తాగడం తగ్గించండి: పాక్ మంత్రి
Pak import tea on loan: పాకిస్తాన్లోని ఆర్థిక వ్యవస్థ సంక్షోభం దిశగా వెళ్తున్న సంగతి తెలిసిందే. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి సమస్యలతో సతమతమవుతున్న పౌరులకు...పాక్ స్థానిక మంత్రి ఒకరు తాజాగా ఒక సలహ ఇచ్చారు. టీ వినియోగాన్ని తగ్గించాలని పాక్ మంత్రి ప్రజలను కోరారు. టీని కూడా అప్పుగా దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో ఆయన ప్రజలను టీ తాగడం తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. పాక్లో విదేశీ మారక నిల్వలు తగ్గడంతో.. దిగుమతుల బిల్లును తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. నగదు కొరతతో సతమతమవుతున్న టీ వినియోగాన్ని తగ్గించుకోవాలని ప్రజలను కోరాడు ఆయన. అదీగాక 2021-22 ఆర్థిక సంవత్సరంలో పాక్ సుమారు రూ.2 వేల కోట్ల టీని వినియోగించిందని తేలడంతో పాక్ మంత్రి అహ్సాన్ ఇక్బాల్ ఈ విధంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రపంచంలో టీని అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశాల్లో ఒకటైన పాక్ టీని దిగుమతి చేసుకోవడానికి కూడా అప్పులు చేయాల్సి వస్తుందని చెప్పారు. గతేడాది కంటే రూ. 4 వందల కోట్ల టీని పాక్ అధికంగా దిగుమతి చేసుకుందని తెలిపారు. ఐతే పాక్ మంత్రి చేసిన విజ్ఞప్తి సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ...నెటిజన్లు పాక్ ప్రభుత్వ తీరుని, ఆయన్ను విమర్శిస్తూ తమదైన శైలిలో చురకలు అట్టించారు. అంతేకాదు ఆయన గతంలో ఇంధనాన్ని ఆదా చేసేందుకు రాత్రి 8.30 గంటలకు మార్కెట్లను మూసివేయాలని వ్యాపారులను కోరినట్లు ప్రణాళిక మంత్రి తెలిపారు. పైగా ఇది పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతి బిల్లును తగ్గించడానికి సహాయపడుతుందని ఇక్బాల్ అన్నారు. ఇటీవలే ఆర్థిక మంత్రి మిఫ్తా ఇస్మాయిల్ కూడా ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోకపోతే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ శ్రీలంక ఆర్థిక వ్యవస్థలా మారిపోతుందంటూ హెచ్చరించారు. (చదవండి: వీడియో: దిగజారిపోతున్న పుతిన్ ఆరోగ్యం? వణికిపోతూ.. నిలబడలేక!) -
భారీగా పెరిగిన గ్యాస్ ధరలు..తగ్గనున్న వినియోగం..!
న్యూఢిల్లీ: అధిక ధరల నేపథ్యంలో భారత్ గ్యాస్ వినియోగంలో వృద్ధి తగ్గనుందని రేటింగ్ దిగ్గజం– ఫిచ్ రేటింగ్స్ తన తాజా నివేదికలో పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) గ్యాస్ వినియోగ వృద్ధి 5 శాతానికి పరిమితం అవుతుందని వివరించింది. ఇంతక్రితం ఈ అంచనా 7 శాతం. దేశీయ గ్యాస్ ధరలలో ఇటీవలి పెరుగుదల అధిక ఎన్ఎన్జీ రేట్ల వంటి అంశాలు వినియోగదారుల ధోరణిలో మార్పును తీసుకువస్తాయని, పర్యావరణ అనుకూల ఇంధనం వైపునకు వారు దృష్టి సారించేలా చేస్తాయని నివేదిక అభిప్రాయపడింది. దేశీయంగా ఉత్పత్తి చేసే సహజ వాయువు ధరను రెట్టింపు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవలే నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1 నుంచి ఆరు నెలల పాటు కొత్త రేట్లు అమల్లో ఉంటాయి. వీటి ప్రకారం .. ప్రభుత్వ రంగ ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియాకు కేటాయించిన క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే గ్యాస్ రేటు రికార్డు స్థాయిలో యూనిట్కు (మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్) 6.10 డాలర్ల స్థాయికి పెరిగింది. ఏప్రిల్కు ముందు ఇది 2.90 డాలర్లుగా ఉండేది. ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి సంస్థలు సంక్లిష్టమైన క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే గ్యాస్ ధర (యూనిట్కు) 6.13 డాలర్ల నుంచి 9.92 డాలర్లకు చేరింది. అంతర్జాతీయంగా ఇంధన రేట్లు ఎగిసిన నేపథ్యంలో ఈ మేరకు ధరలను సవరిస్తూ కేంద్ర నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఫిచ్ రేటింగ్స్ తాజా నివేదిక ఇచ్చింది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. దేశీయ గ్యాస్ ధరలు, అధిక ఎల్ఎన్జీ ధరల పెరుగుదల కారణంగా భారతదేశంలో సహజ వాయువు వినియోగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5 శాతం వృద్ధికి పరిమితమవుతుందని మేము భావిస్తున్నాము (2021–22లో ఈ వినియోగ అంచనా 6.5 శాతం). ఇది క్రితం అంచనా 7 శాతంకన్నా తక్కువ. దేశీయ గ్యాస్ ఉత్పత్తి ప్రస్తుత వినియోగంలో దాదాపు సగం ఉంది. మిగిలినది ద్రవీకృత సహజ వాయువు (ఎల్ఎన్జీ) రూపంలో దిగుమతి అవుతోంది. ప్రభుత్వ రంగ గ్యాస్ యుటిలిటీ గెయిల్ (ఇండియా)కు తన సహజ వాయువు మార్కెటింగ్ సెగ్మెంట్ నుండి వచ్చే ఆదాయాలు పెరిగే అవకాశం ఉంది. ఇటీవలి కాలంలో స్పాట్ ఎల్ఎన్జీ ధరలు (అమెరికా నుండి దీర్ఘకాలిక ఒప్పందం కుదుర్చుకున్న ఎల్ఎన్జీ ధర కంటే అధికంగా) భారీగా పెరగడం దీనికి కారణం. అయితే అధిక ఎల్ఎన్జీ ధరలు భారతదేశంలో గ్యాస్ వినియోగ వృద్ధి స్పీడ్ను తగ్గిస్తాయి. 2021–22, 2022–23లో బలమైన లాభదాయకత గెయిల్ వాటాదారుల రాబడుల పెరుగుదలకు దారితీసే అవకాశం ఉంది. అయితే గెయిల్ ఆర్థిక క్రెడిట్ ప్రొఫైల్ ’బీబీబీ’కి అనుగుణంగా ఉంటుందని భావిస్తున్నాం. ఏడాది ఏప్రిల్లో రూ. 1,080 కోట్ల షేర్లను తిరిగి కొనుగోలు చేయాలని యోచిస్తున్నట్లు గెయిల్ ఇటీవలే పేర్కొన్న సంగతి తెలిసిందే. పెట్రోల్, డీజిల్ నష్టాలు భర్తీ... కాగా, ప్రభుత్వ రంగ ఇంధన రిటైలర్లు ఐఓసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్లు గడచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో (2022 జనవరి–మార్చి) పెట్రోలు, డీజిల్ ధరల్లో పెరుగుదల ఉన్నప్పటికీ మార్కెటింగ్ నష్టాలను చవిచూడవచ్చని ఫిచ్ అభిప్రాయపడింది. అయితే బలమైన రిఫైనింగ్ మార్జిన్లు, భారీ ఇన్వెంటరీ లాభాలు ఈ నష్టాలను భర్తీ చేస్తాయని ఫిచ్ అంచనావేసింది. ముడి చమురు ధరలు బ్యారెల్కు దాదాపు 27 డాలర్లు (లీటరకు రూ.13) పెరిగినప్పటికీ, సంబంధిత మూడు ఇంధన రిటైలర్లు నవంబర్ 2021 నుంచి మార్చి 2022 మధ్య రికార్డు స్థాయిలో 137 రోజుల పాటు పెట్రోల్, డీజిల్ ధరలను మార్చకుండా యథాతథంగా కొనసాగించిన విషయాన్ని ఫిచ్ తాజా నివేదిక ప్రస్తావించింది. మూడు కంపెనీలు మార్చి 22 నుండి 16 రోజుల పాటు లీటరుకు రూ. 10 చొప్పున పెంచాయి. దేశీయ మార్జిన్లు ఒత్తిడికి లోనవుతున్న సమయంలో ప్రైవేట్ ఇంధన రిటైలర్లు ఎగుమతులను మెరుగైన మార్జిన్లతో పెంచుకుంటారని భావిస్తున్నట్లు రేటింగ్ ఏజెన్సీ తెలిపింది. భారతదేశం డీజిల్ ఎగుమతి ఈ ఏడాది జనవరి–ఫిబ్రవరిలో 2021 ఇదే కాలంతో పోల్చితే 12 శాతం పెరిగింది. చదవండి: అసలే భారంగా ధరలు..ఇప్పుడు మరింత పైపైకి..! -
భారీ డిమాండ్... పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ వినియోగం..!
న్యూఢిల్లీ: ఎకానమీ పుంజుకుంటున్న నేపథ్యంలో దేశీయంగా పెట్రోల్, డీజిల్ వినియోగం తిరిగి గణనీయంగా పెరుగుతోంది. కరోనా పూర్వ స్థాయికి మించి నమోదవుతోంది. మార్చి నెలలో ఇంధనాలకు డిమాండ్ మూడేళ్ల గరిష్టానికి చేరింది. 4.2 శాతం పెరిగి 19.41 మిలియన్ టన్నులుగా నమోదైంది. 2019 మార్చితో పోలిస్తే ఇది గరిష్ట స్థాయి. చమురు శాఖలో భాగమైన పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ (పీపీఏసీ) సోమవారం విడుదల చేసిన గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. కోవిడ్–19 మహమ్మారి థర్డ్ వేవ్ తీవ్ర ప్రభావాల నుంచి ఆర్థిక వ్యవస్థ కోలుకునే క్రమంలో మార్చిలో ఇంధనాలకు డిమాండ్ కూడా మెరుగుపడింది. పెట్రోలియం ఉత్పత్తులు అన్నింటిలోకెల్లా అత్యధికంగా వినియోగించే (దాదాపు 40 శాతం) డీజిల్కు డిమాండ్ 6.7 శాతం పెరిగి 7.7 మిలియన్ టన్నులకు చేరింది. పెట్రోల్ అమ్మకాలు కొద్ది నెలల క్రితమే కోవిడ్ పూర్వ స్థాయిని దాటాయి. వీటి విక్రయాలు మార్చిలో 6.1 శాతం పెరిగి 2.91 మిలియన్ టన్నులకు చేరాయి. వ్యవసాయంతో డీజిల్కు డిమాండ్.. వ్యవసాయ రంగంలోడిమాండ్ నెలకొనడంతో పాటు ధరలు పెంచుతారన్న అంచనాలతో వినియోగదారులు, పెట్రోల్ బంకులు కూడా నిల్వ చేసుకోవడంతో డీజిల్ అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. ఇక, వంట గ్యాస్కు డిమాండ్ 9.8 శాతం పెరిగి 2.48 మిలియన్ టన్నులకు చేరింది. వార్షికంగా చూస్తే గత ఆర్థిక సంవత్సరంలో ఇంధనాలకు డిమాండ్ 4.3 శాతం పెరిగి 202.71 మిలియన్ టన్నులుగా నమోదైంది. 2020 ఆర్థిక సంవత్సరం తర్వాత ఇంధనాలకు ఈ స్థాయి డిమాండ్ నమోదు కావడం ఇదే ప్రథమం. ఆటోమొబైల్, వంట గ్యాస్ వినియోగం పెరిగినప్పటికీ పారిశ్రామికంగా డిమాండ్ క్షీణించింది. 2021–22లో పెట్రోల్ వినియోగం 10.3 శాతం పెరిగి 30.85 మిలియన్ టన్నులకు, డీజిల్ అమ్మకాలు 5.4 శాతం పెరిగి 76.7 మిలియన్ టన్నులకు చేరాయి. ద్రవీకృత వంట గ్యాస్ వినియోగం 3 శాతం పెరిగి 28.33 మిలియన్ టన్నులుగా నమోదైంది. విమాన ఇంధనానికి (ఏటీఎఫ్) డిమాండ్ 35 శాతం పెరిగి 5 మిలియన్ టన్నులకు చేరింది. అయినప్పటికీ కరోనా పూర్వ స్థాయి 8 మిలియన్ టన్నులతో పోలిస్తే ఇది తక్కువే కావడం గమనార్హం. -
మెదడు ఆరోగ్యానికి మేలుచేసే చేపలు! స్ట్రోక్ సమస్యకు కూడా..
Regularly Consuming Fish May Protect Brain Health: సెరెబ్రోవాస్కులర్ లేదా వాస్కులర్ బ్రెయిన్ డిసీజ్ గురించే ఇప్పుడు అంతటా చర్చజరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మరణాలకు కారణమవుతున్న వ్యాధుల్లో సెరెబ్రోవాస్కులర్ రెండో స్థానంలో ఉంది. ప్రతి ఏట అమెరికాలోని ప్రతి లక్ష మందిలో 37.6 మరణాలు ఈ వ్యాధివల్లనే సంభవిస్తున్నాయి. మెదడులోని రక్త నాళాలు, రక్త ప్రసరణను ప్రభావితం చేసే స్ట్రోక్ వంటి సమస్యలకు ఈ వ్యాధి కారణమవుతుందట. ఏమిటీ సెరెబ్రోవాస్కులర్ డిసీజ్? సెరెబ్రోవాస్కులర్ అనేది రక్త ప్రవాహాన్ని, మెదడులోని రక్త నాళాలను ప్రభావితం చేసే ఓ వ్యాధి. ఈ వ్యాధి వల్ల రక్త నాళాలు కుంచించుకుపోవడం, గడ్డకట్టడం, రక్త నాళాల్లో అడ్డంకులు ఏర్పడటం.. వంటి సమస్యలు తలెత్తి ప్రాణాంతకంగా మారుతుంది. మెదడు సమస్యలతో ప్రారంభమై.. ప్రారంభ దశలో ఈ వ్యాధి తాలూకు ప్రాథమిక లక్షణాలు స్పష్టంగా బయటపడకముందే బ్రెయిన్ అబ్నార్మాలిటీస్ కనిపిస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. ఇవి ముదిరితే డిమెన్షియాకు దారితీస్తుంది. చదవండి: 88 యేళ్లనాటి కేకు.. ఇప్పటికీ తాజాగానే ఉంది!! చేపలకు - ఈ వ్యాధికి మధ్య సంబంధం ఏమిటి? జీవనశైలిలో కొద్దిపాటి మార్పులు, శారీరక వ్యాయామం, ఆరోగ్య ఆహారపు అలవాట్లు, ధూమపానానికి దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలతో సెరెబ్రోవాస్కులర్ వ్యాధి తాలూకు ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. ముఖ్యంగా స్ట్రోక్ ప్రమాదానికి, అధికంగా చేపలను తినడానికి మధ్య సంబంధం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉంటాయనే విషయం అందరికీ తెలిసిందే! ఇది మెదడుకు, సెరెబ్రోవాస్కులర్ వ్యాధికి మధ్య వారధిగా పనిచేస్తుందట. ఏదిఏమైనప్పటికీ అధికంగా చేపలు తినడం వల్ల మెదడు దెబ్బతినడం తగ్గుముఖం పడుతుందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అధ్యయన నివేదికల ఫలితాలు ఇలా.. క్రాస్ సెక్షనల్ అధ్యయనాల తాజా నివేదిక ప్రకారం ఆరోగ్యంగా ఉన్న వృద్ధులపై చేసిన పరిశోధనల్లో చేపల వినియోగం, మెదడు దెబ్బతినడం మధ్య సంబంధాన్ని పరిశోధించింది. వారానికి రెండు లేదా మూడు సార్లు చేపలు తినేవారిలో సెరెబ్రోవాస్కులర్ వ్యాధికి కారణమయ్యే మెదడు సంబంధిత సమస్యలు తక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. ఫ్రాన్స్లోని బోడో యూనివర్సిటీకి చెందిన సీనియర్ రీసెర్చర్ డా. సిసిలియా సమీరి ఏంచెబుతున్నారంటే.. ప్రతి వారం రెండు లేదా అంతకంటే ఎక్కువ సార్లు చేపలు తినడం వల్ల మెదడు గాయాలు తగ్గుముఖం పట్టడం పరిశోధనల్లో కనుగొన్నాము. ఐతే 75 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్నవారిలో చేపలు తినడం వల్ల కలిగే ఈ రక్షణా ప్రభావం అంతగా కనిపంచలేదని పేర్కొన్నారు. అంటే చిన్నతనం నుంచే క్రమంతప్పకుండా చేపలు తినడం అలవాటు చేసుకోవాలి. చేపలు అధికంగా తినేవారితో పోల్చితే తక్కువగా తినేవారికి ఈ వ్యాధి ముప్పు అధికమని డా. సిసిలియా సమీరి సూచించారు. చదవండి: దుస్తులకు లింగ భేదం ఏంటీ..! స్కూల్కి స్కర్టులతోనే వస్తాం!! -
బొగ్గు వినియోగం తగ్గించాలని బ్రిటన్ ప్రధాని బోరిస్ పిలుపు
-
గరమ్ గరమ్ చాయ్..! ఎన్ని రకాలో తెలుసా?
సాక్షి, హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్నేహితులు కలిస్తే చాయ్ తాగాల్సిందే. ఇంటికి వచ్చిన అతిథులకు టీ ఆఫర్ చేయాల్సిందే. అంతలా దైనందిన జీవితంలో తేనీరు మమేకమైంది. టీ విషయంలో వినియోగదార్ల అభిరుచుల్లో మార్పు వచ్చింది. యువతరం కొత్తదనం కోరుకుంటున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని కొత్తగా రంగ ప్రవేశం చేస్తున్న కంపెనీలు వినూత్న ప్రయోగాలతో విభిన్న రుచుల్లో టీ పొడులను తీసుకొస్తున్నాయి. మిల్క్ బబుల్ టీ, గ్రేప్ ఐస్ టీ, లెమన్ ఐస్ టీ, కశ్మీరీ కావా, గ్రీన్ మ్యాంగో.. ఇలా చెప్పుకుంటూపోతే వేలాది రుచులు కస్టమర్లను ఊరిస్తున్నాయి. వీటిని ఆఫర్ చేసేందుకు ఇప్పుడు భారత్లో ఔట్లెట్లూ విస్తరిస్తున్నాయి. టీ వినియోగంలో ప్రపంచంలో భారత్ తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. ఉత్పత్తి పరంగా అంతర్జాతీయంగా రెండవ స్థానంలో, ఎగుమతుల్లో నాల్గవ స్థానంలో ఉంది. దేశీయ టీ పొడుల మార్కెట్ సుమారు రూ.20,000 కోట్లుంది. ఇదీ భారత టీ మార్కెట్.. దేశంలో 2019లో 139 కోట్ల కిలోల టీ ఉత్పత్తి అయింది. అస్సాంలో వర్షాల కారణంగా పంట దెబ్బతినడంతో గతేడాది ఇది 125 కోట్ల కిలోలకు పరిమితమైంది. మొత్తం ఉత్పత్తిలో దేశీయంగా వినియోగం ఏకంగా 80 శాతముందంటే భారతీయులకు టీ పట్ల ఉన్న అభిరుచి ఇట్టే అర్థం అవుతోంది. ప్యాక్డ్ విభాగం విక్రయాల్లో 10-12 పెద్ద బ్రాండ్లదే 80 శాతం వాటా. 400 వరకు లోకల్ బ్రాండ్స్ పోటీపడుతున్నాయి. టాటా చా, చాయ్ పాయింట్, ద టీ ప్లానెట్, చా బార్ వంటి 200 దాకా చైన్లు జాతీయ, రాష్ట్ర స్థాయిలో వేలాది టీ కేఫ్లతో విస్తరిస్తున్నాయి. విలువ చేకూర్చి వం దలాది విభిన్న టీ రుచులను తయారు చేస్తున్న కంపెనీలు రానున్న రోజుల్లో కీలక పాత్ర పోషిస్తాయని ద టీ ప్లానెట్ ఫౌండర్ మాధురి గనదిన్ని సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. కన్సల్టెన్సీల రాకతో వ్యవస్థీకృతంగా ఫ్రాంచైజీ విధానంలో టీ కేఫ్ల ఏర్పాటు సులభతరం అయిందన్నారు. 90 శాతం గృహాల్లో.. భారత్లో సుమారు 90 శాతం గృహాల్లో టీని ఆస్వాదిస్తున్నారు. అల్పాహారం ముందుగానీ, అల్పాహారంతోగానీ 80 శాతం మంది టీ తీసుకుంటున్నారు. తూర్పు ప్రాంతం వారు ఎనీ టైం ఆస్వాదిస్తారట. పాలతో చేసిన చాయ్కి 80 శాతంపైగా గృహాల్లో ప్రాధాన్యతనిస్తున్నారు. ఇటీవలి కాలంలో చక్కెర లేని గ్రీన్ టీ, హెర్బల్ టీ, లెమన్ టీ వంటివి పాపులర్ అవుతున్నాయి. ఉత్తర, మధ్య, తూర్పు ప్రాంతాలతో పోలిస్తే కేఫ్లు, హోటళ్లు, క్యాంటీన్లలో టీ తాగే వారి సంఖ్య పశ్చిమ, దక్షిణాదిన ఎక్కువ. పట్టణీకరణ, పారిశ్రామికీకరణ, వాణిజ్య కార్యకలాపాలు ఇందుకు కారణమని టీ బోర్డ్ ఆఫ్ ఇండియా అంటోంది. ఇక టీ కేఫ్లలో వేడివేడి చాయ్తోపాటు చల్లని టీ రకాలూ ఉవ్విళ్లూరిస్తున్నాయి. పండ్లు, పూలు, క్రీమర్స్, మసాలాలు, ఫ్లేవర్స్, మొక్కలను జోడించి టీ పొడులను తయారు చేస్తున్నారు. కిలోకు రూ.20,000 వరకు ధర పలికే గోల్డెన్ టిప్స్ వంటి వెరైటీలూ ఉన్నాయి. మహమ్మారిలోనూ ఎగుమతులు.. దేశం నుంచి గతేడాది రూ.5,159 కోట్ల విలువైన 20.7 కోట్ల కిలోల టీ పొడులు ఎగుమతి అయ్యాయి. అంత క్రితం ఏడాది రూ.5,737 కోట్ల విలువైన 25.2 కోట్ల కిలోల టీ విదేశాలకు సరఫరా అయింది. సీఐఎస్ దేశాలు, ఇరాన్, యూఏఈ, యూఎస్ఏ, చైనా, యూకే ప్రధాన మార్కెట్లు. శ్రీలంక, నేపాల్, చైనా, కెన్యా నుంచి ఖరీదైన టీ రకాలను భారత్ దిగుమతి చేసుకుంటోంది. వియత్నాం, ఇండోనేసియా, అర్జెంటీనా నుంచి చవక రకాలను కొనుగోలు చేస్తున్నారు. 2019లో రూ.239 కోట్ల విలువైన 1.58 కోట్ల కిలోల టీ పొడులు విదేశాల నుంచి భారత్కు దిగుమతయ్యాయి. గతేడాది ఏకంగా రూ.403 కోట్లతో 2.3 కోట్ల కిలోల పొడులు వచ్చి చేరాయి. -
గంజాయి గుప్పు... ఎక్స్ట్రా ముప్పు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గంజాయి వినియోగం పెరుగుతోంది. ఈసారి వర్షాలు విస్తారంగా పడటంతో పెద్దెత్తున గంజాయి సాగు చేశారు. తెలంగాణ–ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాలు, ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాలు, ఏపీలో గోదావరి ఏజెన్సీ ప్రాంతాలు, విశాఖ, శ్రీకాకుళం ఏజెన్సీలో గంజాయి సాగు విస్తీర్ణం పెరిగినట్లు ఎక్సైజ్, డీఆర్ఐ (డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్), ఎన్సీబీ (నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో) అనుమానిస్తోంది. వీటిని ఉత్తర భారతంలోని మహారాష్ట్ర, గుజరాత్లకు ఎగుమతి చేసే క్రమంలో హైదరాబాద్లో దొరికిపోతున్నారు. కొంతకాలంగా హైదరాబాద్లో గంజాయి దొరికిన ప్రతీసారి క్వింటాళ్ల కొద్దీ లభిస్తుండటమే ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. మొత్తానికి కరోనా వైరస్తో విధించిన లాక్డౌన్ను స్మగ్లర్లు తమకు అనుకూలంగా మలుచుకున్నారు. పోలీసుల నిఘా అంతగా లేకపోవడంతో గంజాయి భారీగా సాగు చేశారు. ఇంతకాలం హైదరాబాద్ దాని పరిసరాలకే పరిమితమైన గంజాయి సరఫరా ఇప్పుడు మెల్లగా ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాలకూ పాకుతోంది. లాక్డౌన్ కారణంగా గ్రామాల్లో పెద్దగా పనులు లేకపోవడం, కాలేజీలు లేకపోవడంతో కొందరు యువత మత్తు కోసం గంజాయికి అలవాటు పడుతున్నారు. కోల్బెల్ట్ ప్రాంతాలైన కొత్తగూడెం, మందమర్రి, మంచిర్యాల, బెల్లంపల్లి, ఖమ్మం, భూపాలపల్లి తదితర ప్రాంతాల్లో గంజాయి వినియోగం పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా రామగుండం కమిషనరేట్ పరిధిలోని ఎన్టీపీసీ, గోదావరి ఖని, రామగుండం తదితర ప్రాంతాల్లో యువత గంజాయి మత్తులో చిత్తవుతున్నారు. ఈ మత్తులోనే వాళ్లల్లో వాళ్లే తగవులు పెట్టుకోవడం లేదా ఇతరులపై దాడులకు దిగడం చేస్తున్నారు. ఇటీవల రాజధానిలోని అంబర్పేట, ఖమ్మం జిల్లాలో యువత గంజాయి మత్తులో దారిన వెళ్లేవారిపై దాడులకు దిగడం కలకలం రేపింది. ఈ విషయంలో జిల్లాల ఎస్పీలు, కమిషనర్లు తీవ్రంగా వ్యవహరిస్తున్నారు. గంజాయి అక్రమ రవాణాను అరికడుతూనే సరఫరా చేస్తున్న వారిపై పీడీ కేసులు నమోదు చేస్తున్నారు. ఎన్సీబీ, డీఆర్ఐ వద్ద క్వింటాళ్లకొద్దీ.. ఈసారి రెండు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా విస్తారంగా గంజాయి సాగు చేసినట్లు ఎన్సీబీ, డీఆర్ఐ, ఎక్సైజ్శాఖ అధికారులు అనుమానిస్తున్నారు. ఆగస్టులో హయత్నగర్ వద్ద 995 కేజీల గంజాయిని ఎన్సీబీ అధికారులు పట్టుకున్న సంగతి తెలిసిందే. అదే నెలలో డీఆర్ఐ అధికారులు పంతంగి టోల్ గేట్ వద్ద దాదాపు రూ.3.6 కోట్ల విలువైన 1,500 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. లాక్డౌన్ తర్వాత వివిధ సందర్భాల్లో దాదాపు 4వేల కిలోల గంజాయిని ఒక్క ఎన్సీబీ అధికారులే పట్టుకోవడం గంజాయి అక్రమ రవాణా ఎలా సాగుతోందనడానికి నిదర్శనం. ఎక్స్ట్రా కేబిన్ ఏర్పాటు చేసి.. భద్రాచలం, ములుగు, తూర్పు గోదావరి ఏజెన్సీ నుంచి భద్రాచలం పట్టణానికి గంజాయి తరలిస్తారు. ఆపై సరుకును కొత్త గూడెం, మహబూబాబాద్, నర్సంపేటల మీదుగా వరంగల్ నుంచి హైదరాబాద్ శివార్లకు తీసుకొస్తారు. అక్కడ నుంచి నగర పరిసర జిల్లాలకు రవాణా చేస్తున్నారు. సాధారణంగా పాలు, కూరగాయలు, ఊక లారీల అడుగున గంజాయి రాజధానికి చేర్చేవారు. ఇప్పుడు స్మగ్లర్లు రూటుమార్చారు. భద్రాచలం, ములుగు ఏజెన్సీ ఏరియాలకు వస్తున్న లారీల్లో ఎక్స్ట్రా రహస్య కేబిన్ ఏర్పాటు చేసి అందులో గంజాయిని తరలిస్తున్నారు. ఈ లారీలను తనిఖీ చేసినా ఖాళీగా ఉంటుంది కాబట్టి.. పోలీసులకు కూడా అనుమానం రాదు. సమాచారం ఉంటే తప్ప వాటిని గుర్తించడం కష్టం. గట్టి నిఘా ఏర్పాటు.. ‘రాష్ట్రంలో ఈసారి భద్రాచలం, ములుగు ఏజెన్సీ ప్రాంతాల్లో అధికంగా గంజాయి సాగు చేసినట్లు మా వద్ద సమాచారం ఉంది. గంజాయి రవాణాపై కూడా దృష్టిసారించాం. ఈ క్రమంలోనే తాజా తనిఖీల్లో పెద్దెత్తున సరుకు పట్టుబడింది. గంజాయి రవాణా ఏ మార్గంలో జరిగినా.. పట్టుకునేలా గట్టి నిఘా ఏర్పాటు చేశాం. ఆ మేరకు అన్ని రకాల చర్యలు తీసుకున్నాం’అని ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. -
ఏపీ: భారీగా పడిపోయిన మద్యం అమ్మకాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మద్య నియంత్రణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలతో వినియోగం గణనీయంగా పడిపోయింది. ప్రభుత్వ ఆదాయం కూడా భారీగానే తగ్గిపోయింది. ప్రభుత్వం మద్యాన్ని ఆదాయ వనరుగా చూడటం లేదని దీన్ని బట్టి అర్థమవుతోంది. తాజాగా ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. మద్య వినియోగంలో 65 శాతం తగ్గుదల ఉండగా, బీరు వినియోగంలో అయితే ఏకంగా 91.76 శాతం తగ్గుదల నమోదైంది. ప్రభుత్వ ఆదాయం 28.411 శాతం తగ్గింది. గత ఆరి్థక ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు అమ్మకాల్ని ఈ ఏడాదితో పోలిస్తే భారీ వ్యత్యాసం ఉంది. అమ్మకాల విలువలో 32.48 శాతం తగ్గుదల చోటు చేసుకుంది. గతేడాది ఏప్రిల్–ఆగస్టు అమ్మకాలను, వినియోగాన్ని పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలోనే మద్యం అమ్మకాలు భారీగా పడిపోయాయి. తెలంగాణలో గతేడాది ఐదు నెలలతో (ఏప్రిల్–ఆగస్టు) ఈ ఏడాది పోల్చి చూస్తే కేవలం 0.31 శాతం మాత్రమే మద్యం వినియోగం తగ్గింది. కానీ.. ప్రభుత్వ ఆదాయంలో మాత్రం 2.93 శాతం వృద్ధి నమోదు కావడం గమనార్హం. అమ్మకాల విలువలో 4.66 శాతంవృద్ధి నమోదైంది. (చదవండి: మద్యం ధరలను తగ్గించిన ఏపీ ప్రభుత్వం) ఐదు నెలల్లో రూ.2,170 కోట్లు ఆదాయాన్ని కోల్పోయిన ఏపీ ►గతేడాది ఏప్రిల్–ఆగస్టు మధ్య కాలంలో మద్యం ద్వారా రూ.7,638.24 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచి్చంది. ఈ ఏడాది ఇదే కాలంలో రూ.5,468.17 కోట్ల ఆదాయం మాత్రమే లభించింది. అంటే గతేడాది కంటే రూ.2,170.07 కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోయింది. ►మద్యం, బీరు అమ్మకాల విలువ పరిశీలిస్తే ఐదు నెలల (ఏప్రిల్ – ఆగస్టు) వ్యవధిలో గతేడాది రూ.8,884.69 కోట్లు కాగా, ఈ ఏడాది రూ.5,998.87 కోట్లు మాత్రమే. అమ్మకాల విలువ గతం కంటే రూ.2,885.82 కోట్లు తక్కువగా నమోదైంది. ►దక్షిణాదిలో అతి చిన్న రాష్ట్రం కేరళలో కంటే మద్యం వినియోగం ఏపీలో తక్కువగా ఉండటం గమనార్హం. (చదవండి: మద్యం మత్తులో యువతుల హల్చల్) -
ఆరోగ్యానికి ఏ బియ్యం మంచివో తెలుసా..
న్యూఢిల్లీ: తిండి కలిగితే కండ కలదని, కండ కలిగిన వాడే మనిషనే సామెత మనకు తెలిసిందే. కానీ ప్రస్తుత సాంకేతిక సమాజంలో కేవలం రుచి కోసం అత్యధిక ప్రజలు మొగ్గు చూపుతున్నారు. కాగా దేశంలో సంపూర్ణ ఆహారంగా భావించే బియ్యం వినియోగానికి వస్తే.. ముఖ్యంగా ఎక్కువ శాతం ప్రజలు తెల్ల బియ్యానే (పాలిష్ పట్టిన బియ్యం) వినియోగిస్తున్నారు. తెల్ల బియ్యం రుచికరంగా ఉండడంతో అధికంగా ప్రజలు వీటినే వినియోగిస్తున్నారు. ముడి బియ్యం(దంపుడు బియ్యం లేదా పాలిష్ పట్టని బియ్యం). ఈ మధ్య కాలంలో ప్రకృతి వైద్య నిపుణులు వినియోగంపై ఈ బియ్యంపై ఎక్కువ అవగాహన కల్పిస్తున్నారు. ముడి బియ్యంలో పోషకాలు పుష్కలంగా ఉంటాయని చెబుతున్నారు. ఇందులో ఏ మేరకు నిజముందో తెలుసుకుందాం. ఉదాహరణకు 100 గ్రాముల ముడి య్యం తీసుకుంటే 1.8గ్రాముల ఫైబర్ లభిస్తుంది. అదేవిధంగా తెల్ల బియ్యాన్ని పాలిష్ చేయడం వల్ల కేవలం 0.4గ్రాముల ఫైబర్ మాత్రమే లభిస్తుంది. తెల్ల బియ్యం నిరంతరం తీసుకుంతే శరీరానికి అందాల్సిన పోషకాలు అందక పోషకాహార లోపాలు ఏర్పడే అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. ఇక ముడి బియ్యంలో అధిక శాతం యాంటి న్యూట్రియెంట్స్, ఫైటిక్ యాసిడ్, ఆర్సెనిక్లు (విష రసాయనం) ఉంటాయి. ఎక్కువ శాతం ముడి బియ్యాన్ని తీసుకోవడంతో యాంటీ న్యూట్రియెంట్స్ వల్ల శరీరంలో పోషకాలను గ్రహించే సామర్థ్యం తగ్గుతుంది. శరీర నిర్మాణానికి ఉపయోగపడే ఖనిజ లవణాలకు ఇబ్బందులు కలిగిస్తాయి. అధికంగా ముడి బియ్యం తీసుకోవడం వల్ల ఆర్సెనిక్ విషరసాయనం ముప్పు ఉంటుంది. మన శరీరంలో అధికంగా ఆర్సెనిక్ చేరడం వల్ల క్యాన్సర్, టైప్ 2 డయాబెటిస్ తదితర జబ్బులు వస్తాయి. మితంగా తినడమే శ్రేయస్కరమని డాక్టర్లు చెబుతున్నారు. మితంగా ముడిబియ్యం తినడం వల్ల బోలెడన్ని లాభాలు ఉంటాయి. ముడిబియ్యం వల్ల హెచ్డీఎల్(మంచి కొలెస్ట్రాల్) పెరిగి శరీరంలో పేరుకున్న చెడు కొలెస్ట్రాల్(కొవ్వు)ను తగ్గిస్తుంది. మరోవైపు మితంగా తీసుకోవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. కాగా బరువు తగ్గాలనుకునే వారు తెల్ల బియ్యం కంటే ముడి బియ్యమే బెటర్. బీఎమ్ఐ(ఎత్తుకు కావాల్సిన బరువు) పాటించాలనుకునే వారికి ముడి బియ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం ఎంతో అవసరం. -
కుక్క,పిల్లి మాంసంపై శాశ్వత నిషేధం
బీజింగ్ : ఎట్టకేలకు చైనాలోని ఒక నగరం కీలక నిర్ణయం తీసుకుంది. కరాళనృత్యం చేస్తున్న కరోనా వైరస్ మహమ్మారి భవిష్యత్తులో వ్యాప్తి చెందకుండా నిరోధించే ప్రయత్నంలో చైనా లోని షెన్జైన్ నగరంలో కుక్కలు, పిల్లులు, బల్లులు, పాములు, సహా ఇతర అడవి జంతువుల మాంసం తినడాన్ని నిషేధం విధించింది. అంతేకాదు ప్రస్తుత వైరస్ వ్యాప్తి ప్రారంభంలో చైనా ప్రభుత్వం జారీ చేసిన తాత్కాలిక నిషేధానికి మించి అడవి జంతువుల వ్యాపారం, వినియోగాన్ని శాశ్వతంగా నిషేధించింది. కుక్క, పిల్లి మాంస విక్రయాలకు ప్రత్యేకతగా చెప్పుకునే షెన్జెన్ నగరంలో కుక్క, పిల్లి , పాములు, బల్లుల మాంసం వినియోగాన్ని నిషేధించింది. మే 1 నుండి ఈ నిషేధం అమల్లోకి వచ్చేలా నిబంధనలను ప్రవేశపెట్టింది. 'ఆధునిక సమాజానికి సార్వత్రిక నాగరికత అవసరం' అని గుర్తించామని అధికారులు ప్రకటించారు. పిల్లి, కుక్క మాంసం వ్యాపారం, వినియోగాన్ని శాశ్వతంగా నిషేధించిన చైనా మొట్టమొదటి నగరంగా షెన్జెన్ అవతరించింది. ఈ నిషేధాన్ని ఉల్లఘింస్తే జరిమానా భారీగానే వుంటుంది. స్వాధీనం చేసుకున్న జంతువుల విలువను బట్టి గణనీయంగా పెరుగుతుంది. ఇలాంటి సంచలన నిర్ణయం తీసుకున్న నగరంగా షెన్జెన్ రికార్డుల కెక్కింది. మరోవైపు ఇది చారిత్రాత్మక నిర్ణయంమంటూ హ్యూమన్ సొసైటీ ఇంటర్నేషనల్ కు చెందిన ప్రముఖుడు డాక్టర్ పీటర్ లి ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. ఈ మహమ్మారి నుండి నేర్చుకున్న పాఠాలను తీవ్రంగా పరిగణించి, మరొక మహమ్మారిని నివారించడానికి అవసరమైన మార్పులు చేసిన మొట్టమొదటి నగరం షెన్జెన్ అని హ్యూమన్ సొసైటీ ఇంటర్నేషనల్ వన్యప్రాణి విభాగం ఉపాధ్యక్షుడు తెరెసా ఎం.టెలికీ అన్నారు. క్రూరమైన వాణిజ్యాన్ని అంతం చేసే ప్రయత్నాలలో షెన్జెన్ విధించిన నిషేధం అభినంద నీయమని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం చైనాలో 10 మిలియన్ కుక్కలు , 4 మిలియన్ పిల్లుల మాంసాన్ని విక్రయిస్తారని అంచనా వేశారు. కాగా సెంట్రల్ చైనా నగరమైన వుహాన్లో గత ఏడాది డిసెంబరులో మొట్టమొదట కరోనా వైరస్ ను గుర్తించారు. వూహాన్ నగరంలో జంతు వధశాల కేంద్రంగా ఈ వైరస్ వ్యాపించిందనే వాదనలు తెరపైకి వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా కుక్క మాంసం వ్యాపారం జరిగే చైనాలోని నగరాల్లో షెన్జెన్ ఐదవ అతిపెద్ద నగరం. 12.5 మిలియన్ల జనాభా ఇక్కడ నివసిస్తారు. తైవాన్, హాంకాంగ్ దేశాల్లోనూ వీటి మాంసం విక్రయాలను నిషేధించిన సంగతి తెలిసిందే. -
మందుబాబుల వీరంగం... పోలీసుల పై దాడి
సాక్షి, కాజీపేట అర్బన్: మద్యం మత్తులో పోలీసులపై మందు బాబులు తిరగబడి, దాడికి పాల్పడిన సంఘటన శనివారం ఉర్సు గుట్ట ప్రాంతంలో చోటు చేసుకుంది. మిల్స్కాలనీ ఎస్సై భీమేష్ కథనం ప్రకారం.. కరీమాబాద్కు చెందిన ఇద్దరు యువకులు ఉర్సుగుట్ట ప్రాంతంలో బహిరంగంగా మద్యం సేవిస్తుండగా విధులు నిర్వహిస్తున్న బ్లూకోడ్స్ సిబ్బంది మద్యం సేవిస్తున్న యువకులను బహిరంగ మద్యం సేవించకూడదని వారించారు. దీంతో మద్యం మత్తులో ఉన్న యువకులు వారిపై దాడికి పాల్పడ్డారు. కాగా, ఘటన స్థలానికి ఇంటర్సెప్టర్ వాహనంలో పోలీసులు చేరుకుని యువకులను అదుపులోకి తీసుకుని మిల్స్కాలనీ పోలీస్స్టేషన్కు తరలించారు. యువకులపై బహిరంగ మద్యం సేవిస్తున్న కేసు, విధుల్లో ఉన్న పోలీసుల అధికారుల విధులకు బంగం కలిగించిన కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
ఆర్థిక వ్యవస్థకు ఊరటనిచ్చే సర్వే..!
న్యూఢిల్లీ: దేశంలో వినియోగదారుల డిమాండ్ ఏమాత్రం తగ్గలేదని ఐహెచ్డీఎస్ సర్వే తెలిపింది. ఇటీవల కాలంలో భారత్లో వినియోగదారల డిమాండ్ క్షీణించిందని జాతీయ నమూనా సర్వే (ఎన్ఎస్ఎస్) వివరాల ఆధారంగా పలు సర్వేలు వెల్లడించినప్పటికీ.. తాజా సర్వే ఆర్థిక వ్యవస్థకు ఊరటనిచ్చే అంశమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఐహెచ్డీఎస్ నేతృత్వంలోని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లయిడ్ ఎకనామిక్ రీసెర్చ్ (ఎన్సిఎఇఆర్), మేరీల్యాండ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు వినియోగదారుల డిమాండ్పై అధ్యయనం చేశారు. రాజస్థాన్లో 2,706 , బీహార్లో 1,643, ఉత్తరాఖండ్ 479 కుటుంబాల జీవన ప్రమాణాలను అధ్యయనం చేశామని ఐహెచ్డీఎస్ సర్వే తెలిపింది. ఎన్ఎస్ఎస్ సర్వేకు భిన్నంగా 2011-17 మధ్య కాలంలో ప్రజల వినియోగం పెరిగిందని సర్వే అభిప్రాయపడింది. మరోవైపు తలసరి ఆదాయంలో వృద్ధి 2004-05, 2011-12 మధ్యకాలంలో గణనీయంగా తగ్గిందని తెలిపింది. 2011-17 మధ్య కాలంలో తలసరి ఆదాయం, తలసరి వినియోగం వరుసగా 3.5, 2.7 శాతం పెరిగిందని సర్వే పేర్కొంది. 2004-05, 2011-12 సంవత్సరాలలో కుటుంబాలకు చెందిన తలసరి ఆదాయ వృద్ధి 7.2 శాతంగా ఉండగా, తలసరి వినియోగ వృద్ధి 4 శాతంగా నమోదైనట్టు సర్వే తెలిపింది. 2004-05, 2011-12 మధ్య కాలంలో వాహనాల కొనుగోళ్లు ఆశించిన స్థాయిలో జరిగాయని, కార్లు, మోటారు వాహనాల కొనుగోళ్లు 22 శాతానికి పెరిగాయని, 2017 నాటికి మరో పది పాయింట్లు పెరిగినట్లు సర్వే ప్రకటించింది. ఆర్థిక విధానాల రూపకల్పనలో వినియోగ డిమాండ్ కీలక పాత్ర పోషిస్తుందని ఎన్ఎస్ఎస్ పేర్కొన్న విషయం తెలిసిందే. స్పష్టమైన డాటా లేకపోవడం వల్లే ఆర్ధిక విధానాలను రూపకల్పన చేయడంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. -
రాష్ట్రాలు కీలక పాత్ర పోషించాలి: ఆర్బీఐ గవర్నర్
ముంబై: వృద్ధి రేటును పెంచే విధంగా సంస్కరణలను అమలు చేయాలని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. వారం రోజుల్లో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న తరుణంలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ఢిల్లీలోని ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..వినియోగ డిమాండ్, వృద్ధి రేటును పెంచే విధంగా సంస్కరణలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. వృద్ది తదితర లక్ష్యాలను సాధించడానికి ద్రవ్య పాలసీకి పరిమితులు ఉన్నాయని అన్నారు. ఏ రంగంలో సంస్కరణలు చేపట్టాల్లో విశ్లేషిస్తున్నామని..అన్ని రంగాలు అభివృద్ధి చెందే విధంగా బడ్జెట్ ఉంటుందని అభిప్రాయపడ్డారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ కీలక పాత్ర పోషించాలంటే ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమలు, పర్యాటక రంగం, ఇ-కామర్స్, స్టార్టప్లకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి రాష్ట్రాలు కీలక పాత్ర పోషించాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం మౌళిక సదుపాయాలకు ప్రాధాన్యత ఇస్తే వేగవంతమైన అభివృద్ధి సాధ్యమన్నారు. ద్రవ్యోల్భణానికి కారణమయ్యే అంశాలను నిరంతరం సమీక్షించి పరిష్కార మార్గాలను కనుగొనాలని అన్నారు. పాలసీల రూపకల్పనలో సర్వే, డాటాను విశ్లేషిస్తామని, అన్ని అంశాలను పరిశీలించి పాలసీల రూపకల్పన చేస్తామని అన్నారు. చదవండి: ద్రవ్యోల్బణానికి, టెలికాం షాక్ -
వారంలో రెండుసార్లు ఓకే..
లండన్ : నిత్యం మందు జోలికి పోకుండా వారాంతంలోనే మద్యం అధిక మోతాదులో తీసుకోవడం కంటే వారంలో ఎక్కువ సార్లు మద్యం సేవించడమే ప్రమాదకరమని పరిశోధకులు స్పష్టం చేశారు. గతంలో నిత్యం మితంగా మద్యం సేవించడం మేలని పలు అథ్యయనాలు వెల్లడైన సంగతి తెలిసిందే. గత సర్వేలకు భిన్నంగా వారంలో ఒకసారి పూటుగా తాగడంతో పోలిస్తే వారంలో పలుసార్లు మద్యం సేవించేవారిలో స్ర్టోక్కు దారితీసే గుండె కొట్టుకునే వేగం అసాధారణంగా ఉండే ముప్పు అధికమని తాజా పరిశోధన తేల్చింది. వారానికి రెండు సార్లు మద్యం సేవించే వారితో పోలిస్తే ప్రతి రోజూ తాగే వారికి ఈ ముప్పు 40 శాతం అధికమని దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు చేపట్టిన అథ్యయనం వెల్లడించింది. మొత్తంగా ఒకేసారి ఎక్కువ మోతాదులో మద్యం సేవించడంతో పోలిస్తే తరచూ ఎక్కువ సార్లు మద్యం సేవించడం అసాధారణంగా గుండె కొట్టుకునే పరిస్థితికి దారితీస్తుందని తమ అథ్యయంలో తేలిందని కొరియా యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ జోంగ్ చి చెప్పారు. 2009 నుంచి దాదాపు కోటి మందిపై ఈ అథ్యయనాన్ని చేపట్టగా వారంలో ఎక్కువసార్లు మద్యం సేవించడం గుండె కొట్టుకునే వేగం అసాధారణంగా ఉండే రిస్క్ను పెంచిందని వెల్లడైంది. ఒక్కో సెషన్లో అధిక మోతాదులో మద్యం సేవించడానికి ఈ రిస్క్తో ఎలాంటి లింక్ లేదని పరిశోధకులు తేల్చారు. వారంలో రెండు సార్లు మద్యం సేవించేవారిలో ఈ ముప్పు తక్కువగా ఉన్నట్టు వెల్లడైంది. అసలు తాగనివారు, వారంలో ఒకసారి మద్యం సేవించేవారితో పోల్చినా రెండుసార్లు తాగేవారిలో ఈ ముప్పు స్వల్పంగా ఉండటం గమనార్హం. వారానికి ఆరు సార్లు మద్యం సేవించే వారిలో ఈ ముప్పు 30 శాతం, రోజూ తాగేవారిలో 40 శాతం అధిక ముప్పు నమోదైంది. -
గంజాయి సిగరెట్ @ రూ.100
సాక్షి, నిజామాబాద్: ఇప్పటి వరకు జిల్లాలో గంజాయి స్మగ్లింగ్ మాత్రమే జరిగేది. తాజాగా వినియోగం కూడా పెరిగిందన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఏకంగా గంజాయి సిగరెట్లనే విక్రయిస్తున్నారు. ఒక్కో గంజాయి సిగరెట్ను రూ.వంద చొప్పున విక్రయిస్తున్నట్లు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం అధికారుల విచారణలో తేలింది. గంజాయి సిగరెట్లకు యువత, విద్యార్థులు కూడా బానిసలుగా మారడం ఆందోళనకు గురిచేస్తోంది. వీటికి అలవాటు పడుతున్న వారు.. వాటి విక్రయాలు జరుగుతున్న ప్రదేశాలకు వెళ్లి మరీ కొనుగోలు చేస్తున్నారు. గంజాయి స్మగ్లింగ్ కేంద్రంగా పేరున్న నిజామాబాద్ ఇప్పుడు దాని వినియోగానికి కూడా అడ్డాగా మారింది. ముంబయి, పుణె, హైదరాబాద్ వంటి మెట్రోపాలిటన్ సిటీల్లో వినియోగమయ్యే ఈ గంజాయి ఇప్పుడు జిల్లాలోనూ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. నిజామాబాద్ నగరంలోనే కాదు., గ్రామీణ ప్రాంతాలకు కూడా ఈ గంజాయి ఘాటు పాకింది. జిల్లాలో ఏకంగా గంజాయి సిగరెట్లనే విక్రయిస్తున్నారంటే దీని వినియోగం ఏ స్థాయికి పెరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. గంజాయి సిగరెట్లను విక్రయిస్తున్న ఓ వ్యక్తిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం అధికారులు సోమవారం పట్టుకున్నారు. ఒక్కో గంజాయి సిగరెట్ను రూ. వంద చొప్పున విక్రయిస్తున్నట్లు అధికారుల విచారణలో తేలింది. ఘాటు మరింత ఎక్కువ ఉండాలంటే గంజాయిని మరింత దట్టించిన సిగరెట్ను తయారు చేసి ఇస్తున్నారు. సాధారణ సిగరెట్లో పొగాకును తొలగించి, ఈ ఎండు గంజాయిని నింపుతున్నారు. సాధారణ సిగరెట్ మాదిరిగా కనిపించే వీటిని పీల్చుతూ మత్తులో తేలియాడుతున్నారు. ప్రత్యేక వేఫర్లు.. ఎండు గంజాయిని నింపుకుని పీల్చుకునేందుకు ప్రత్యేకంగా వేఫర్లు కూడా విక్రయిస్తున్నట్లు ఎక్సైజ్పోలీసుల దృష్టికి వచ్చింది. ఈ వేఫర్లలో తమకు కావాల్సినంత ఎండు గంజాయిని నింపుకుని తాగవచ్చు. విద్యార్థులు, యువత బానిస.. గంజాయి సిగరెట్లకు ఇప్పుడు యువత, విద్యార్థులు కూడా బానిసలుగా మారడం ఆందోళనకు గురిచేస్తోంది. వీటికి అలవాటు పడుతున్న వారు.. వాటి విక్రయాలు జరుగుతున్న ప్రదేశాలకు వెళ్లి మరీ కొనుగోలు చేస్తున్నారు. పేద వర్గాలకు చెందిన వారు కూడా ఈ గంజాయి ఘాటుకు అలవాటు పడి ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నారు. ముఖ్యంగా కూలీలు ఈ మత్తుకు బానిసలుగా మారుతున్నారు. గతంలో గంజాయి చాక్లెట్లు.. నిజామాబాద్ నగరంలో గతంలో గంజాయి చాక్లెట్లు కూడా వెలుగుచూసిన విషయం విధితమే. సుమారు రెండేళ్ల క్రితం ఎక్సైజ్ అధికారులు నగరంలో జరిపిన దాడుల్లో ఈ గంజాయి చాక్లెట్లు పట్టుబడ్డాయి. నగరంలో పెద్ద ఎత్తున వీటి విక్రయాలు జరుగుతున్నట్లు గుర్తించారు. చిన్నారులు తినే చాక్లెట్ల మాదిరిగానే ఉండే వీటిని నోట్లో వేసుకుంటే మత్తులో తేలిపోవచ్చని అధికారులు చెబుతున్నారు. కౌన్సెలింగ్ ఇస్తున్నాం గంజాయి సిగరెట్లు తాగుతూ పట్టుబడిన యువత, విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇస్తున్నాము. తల్లిదండ్రులు సరిగ్గా పట్టించుకోకపోవడంతోనే కొంత మంది విద్యార్థులు, యువత ఇలాంటి మత్తు పదార్థాల వినియోగానికి అలవాటు పడుతున్నారు. విక్రయదారులపై పలుమార్లు కేసులు నమోదు చేస్తున్నాము. ద్వారకానగర్లో వీటిని విక్రయిస్తున్న మహిళపై పలు కేసులు కూడా పెట్టాము. - దీపికా, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ -
ఇవి తీసుకుంటే ఉద్యోగం వచ్చినట్టే..
లండన్ : రోజూ తీసుకునే ఆహారానికి అదనంగా పండ్లు, కూరగాయలను జోడిస్తే మానసికంగా ఉల్లాసంగా ఉండటంతో పాటు నిరుద్యోగం నుంచి కొత్త ఉద్యోగంలోకి అడుగుపెట్టిన తీరున ఉత్సాహంతో ఉరకలు వేయవచ్చని తాజా అథ్యయనంలో తేలింది.తాజా పండ్లు, కూరగాయలు అధికంగా తీసుకుంటే గుండెకు మంచిదని వైద్యులు సూచిస్తుంటే వీటిని ఆహారంలో అధికంగా తీసుకుంటే మానసికంగానూ ధృడంగా ఉంటారని ఈ అథ్యయనం వెల్లడించింది. యాపిల్స్, క్యారెట్, అరటిపండ్లు మానసిక ఆరోగ్యాన్ని పరిపుష్టం చేస్తాయని ఈ అథ్యయనం పేర్కొంది. రోజూ తీసుకునే ఆహారంలో మీరు తాజా పండ్లు, కూరగాయలను తొలగిస్తే మీ మానసిక స్థితి జీవిత భాగస్వామిని కోల్పోయిన వారి పరిస్థితిలా తయారవుతుందని శాస్త్రవేత్తలు పేర్కొనడం గమనార్హం. పండ్లు, కూరగాయలను అధికంగా తీసుకునే వారి మానసిక ఆరోగ్యం స్వల్పకాలంలోనే ఉత్సాహంగా మారుతుందని తమ అథ్యయనంలో వెల్లడైందని అథ్యయనానికి నేతృత్వం వహించిన యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్ రీసెర్చి ఫెలో నీల్ ఓషన్ చెప్పుకొచ్చారు. దాదాపు 50,000 మందిపై తాము జరిపిన పరిశోధనలో ఈ వివరాలు వెల్లడయ్యాయని నీల్ తెలిపారు. -
గుప్పెడు నట్స్తో..
లండన్ : తరచూ తక్కువ మోతాదులో బాదం, జీడిపప్పు వంటి నట్స్ తీసుకునేవారిలో అసాధారణంగా గుండె కొట్టుకునే రిస్క్ గణనీయంగా తగ్గుతుందని తాజా అథ్యయనం వెల్లడించింది. వారానికి మూడు సార్లు నట్స్ తింటే స్ర్టోక్కు దారితీసే అసాధారణ హార్ట్ బీట్ ముప్పును 18 శాతం మేర తగ్గిస్తుందని పరిశోధనలో తేలింది. అయితే ఎక్కువగా నట్స్ను తీసుకోరాదని, పరిమితంగా వీటిని తీసుకోవాలని పరిశోధకులు సూచించారు. స్వీడన్కు చెందిన కరోలిన్స్కా ఇనిస్టిట్యూట్కు చెందిన పరిశోధకులు 60,000 మందిని 17 ఏళ్ల పాటు పరిశీలించి నట్స్ వినియోగం, వారి గుండె ఆరోగ్యాన్ని గమనించారు. నట్స్ వినియోగంతో గుండె పోటు, స్ర్టోక్ ముప్పు గణనీయంగా తగ్గుతుందని ప్రాథమికంగా నిర్థారించారు. నట్స్ వినియోగం పెరిగిన కొద్దీ అసాధారణంగా గుండె కొట్టుకోవడం, గుండె వైఫల్యం వంటి రుగ్మతల రిస్క్ తగ్గినట్టు వెల్లడైందని పరిశోధకులు తెలిపారు. అథ్యయన వివరాలు జర్నల్ హార్ట్లో ప్రచురితమయ్యాయి. -
తమ్ముడూ.. లెట్స్ డూ కుమ్ముడూ!
ముక్కతోనే.. ముద్ద దిగుతోంది ► నాన్వెజ్ వినియోగంలో దేశంలో నగరమే నంబర్వన్ ► మటన్, చికెన్, బీఫ్, చేపలు, ► రొయ్యలు అన్నింటికీ యమ డిమాండ్ ► రోజూ 8.66 లక్షల కిలోల మాంసం అమ్మకాలు ► నెలకు సగటున తలసరి 2.6 కిలోల మాంసం లాగించేస్తున్న నగర వాసులు ► పౌల్ట్రీ ఫెడరేషన్, బ్రీడర్స్ అసోసియేషన్ల సర్వేలో వెల్లడి సాక్షి, హైదరాబాద్: తమకే ప్రత్యేకమైన బిర్యా నీతో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన హైదరాబాద్.. మాంసాహారం వినియోగంలో మన దేశంలోనే తొలిస్థానంలో నిలిచింది. మొఘ లాయి, దక్కన్, ఇరానీ, పర్షియన్ వంటకాలకు నెలవుగా మారిన నగరంలో మటన్, చికెన్, బీఫ్, చేపలు, రొయ్యలు వంటి మాంసాహార వినియోగం బాగా పెరుగుతున్నట్లు వెల్లడైంది. దేశవ్యాప్తంగా సగటున ఒక్కొక్కరు ఏడాదికి 5 కిలోల మాంసం వినియోగిస్తుండగా.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏకంగా 31 కిలోలు వినియోగిస్తున్నట్లు తేలింది. పౌల్ట్రీ ఫెడరేషన్, బ్రీడర్స్ అసోసియేషన్లు తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ప్రధానంగా బిర్యానీతో.. కుతుబ్షాహీలతో హైదరాబాద్ గడప తొక్కిన బిర్యానీ ఇప్పుడు ప్రపంచంలోని 80శాతం దేశాల్లో నాన్వెజ్ కేటగిరీల్లో ప్రధాన వంటకంగా మారింది. హైదరాబాద్ లో బిర్యానీ కోసమే వెలిసిన హోటళ్లు, రెస్టా రెంట్లు ఎన్నో ఉన్నాయి. మటన్, చికెన్, బీఫ్ల తో పాటు ఫిష్ బిర్యానీ కూడా బాగా అమ్ముడ వుతోంది. దీనికితోడు ఇళ్లలో చికెన్ వినియోగం బాగా పెరగడంతో... నిత్యం మాంసాహార వినియోగం లక్షల కిలోలకు చేరుకుంది. కోటి జనాభా.. నెలకు సగటున 2.6 కిలోల మాంసం రాజధాని గ్రేటర్ నగరం జనాభా సుమారు కోటికి చేరువైంది. నగరంలో రోజువారీగా చికెన్ వినియోగం 6.66 లక్షల కిలోలుగా ఉంది. మటన్, బీఫ్ అమ్మకాలు కలిపి సుమారు లక్ష కిలోల మేర, చేపల విక్రయాలు మరో లక్ష కిలోల మేర ఉంటాయి. అంటే మొత్తంగా రోజుకు 8.66 లక్షల కిలోల మేర మాంసం అమ్మకాలు జరుగుతున్నాయి. ఈ లెక్కన నెలకు 2,59,80,000 కిలోల మాంసం వినియోగమవుతోంది. అంటే సగటున ఒక్కొక్కరి మాంసం వినియోగం నెలకు 2.6 కిలోలుగా, ఏడాదికి 31 కిలోలుగా తేలింది. అదే దేశవ్యాప్తంగా సగటు మాంసం వినియోగం ఏడాదికి 5 కిలోలే కావడం గమనార్హం. అంటే దేశవ్యాప్త సగటు కంటే సుమారు 6 రెట్లు మాంసం వినియోగం అధికమన్న మాట. చికెన్.. అదిరెన్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధి లో నెలకు నాలుగు కోట్ల కిలోల మేర కోడి మాంసం ఉత్ప త్తవుతుండగా.. అందులో రెండు కోట్ల కిలోల మేర గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే వినియోగమవుతున్నట్లు పౌల్ట్రీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లెక్కలు చెబుతున్నాయి. దేశంలో చికెన్ విని యోగంలో హైదరాబాద్ తర్వాత ముంబై రెండో స్థానంలో నిలిచినట్లు తేలింది. చేపా.. చేపా.. నిన్నొదలా! చేపలు, రొయ్యలు వంటి ఉత్పత్తులనూ గ్రేటర్ వాసులు విస్తృతంగా వినియోగిస్తున్నారు. కొవ్వుశాతం తక్కువగా ఉండడం, శరీరానికి అవసరమైన పోషకాలు అధికంగా ఉంటాయన్న వైద్యుల సూచనల మేరకు చేపల విని యోగం పెరుగుతోంది. వీటితోపాటు రొయ్యలు, పీతలు, ఇతర సముద్ర ఉత్పత్తులకూ డిమాండ్ పెరుగుతోంది. మొత్తంగా నగరం పరిధిలో రోజూ సుమారు లక్ష కిలోల మేర చేపలు, ఇతర సముద్ర ఉత్పత్తుల విక్రయాలు జరుగుతుంటాయని మత్స్యశాఖ అంచనా వేసింది. మటన్కూ ఫుల్ గిరాకీ హైదరాబాద్లో ఇటీవల చికెన్ వినియోగం బాగా పెరిగినా.. మటన్కు మాత్రం డిమాండ్ తగ్గలేదు. ఇళ్లలో వినియోగానికితోడు హోటళ్లు, రెస్టారెంట్లలో మటన్ కబాబ్లు, పత్తర్కా ఘోష్, బోటి, పాయా, లివర్ఫ్రై, బిర్యానీ తదితర వంటకాలు విస్తృతంగా విక్రయమవుతున్నాయి. పాత నగరం సహా పలు ప్రాంతాల్లో బీఫ్ వినియోగం కూడా అధికంగా ఉంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోజూ సగటున సుమారు లక్ష కిలోల మేర మటన్, బీఫ్ అమ్మకాలు సాగుతున్నట్లు మార్కెట్ వర్గాల అంచనా. అవగాహన పెరగడమే కారణం ‘‘ప్రొటీన్స్ అధికంగా ఉండడం, పోషకాహార లేమిని చికెన్ దూరం చేస్తుందన్న అవగాహన పెరగడంతో చికెన్, గుడ్ల వినియోగం ఎక్కువైంది. చికెన్, గుడ్లలో ప్రొటీన్స్ అధికంగా ఉంటాయి, కొవ్వు శాతం తక్కువే. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో చికెన్, గుడ్ల ధరలు తగ్గుముఖం పట్టడం పౌల్ట్రీ రైతులకు భారంగా పరిణమించింది..’’ – రంజిత్రెడ్డి, పౌల్ట్రీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బిర్యానీతో పెరుగుతున్న డిమాండ్ ‘‘వందల ఏళ్ల కిందటి నుంచే మాంసాహార వంటకాల్లో అనేక వెరైటీలు రుచి చూసిన చరిత్ర హైదరాబాదీలది. ఆ సంస్కృతిని కొనసాగిస్తూ మొఘలాయి, దక్కనీ మటన్, చికెన్ బిర్యానీ, పాయ, పత్తర్కా ఘోష్ వంటి అరుదైన వంటకాలను ప్రత్యేకంగా వండి వడ్డిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా బిర్యానీకి రోజురోజుకు డిమాండ్ పెరుగుతోంది కూడా..’’ – ఎండీ రబ్బానీ, షాగౌస్ బిర్యానీ -
అధికంగా మద్యం సేవించిన యువకుడి మృతి
భువనగిరి అర్బన్ : మద్యం అధికంగా సేవించడంతో యువకుడు మృతి చెందిన సంఘటన భువనగిరిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని ఇందిర నగర్కు చెందిన బుచ్చాల శంకరయ్య, రాజమ్మ దంపతుల రెండో కుమారుడు చిరంజీవి(27) కూలి పని చేస్తున్నాడు. రోజులాగే శనివారం ఉదయం కూడా పని వెళ్లాడు. సాయంత్రం పని ముగించుకొని వస్తూ పట్టణంలోని వినాయక చౌరస్తాలో ఉన్న ఓ బార్లోకి వెళ్లి అధికంగా మద్యం సేవించాడు. దీంతో ఇంటికి వెళ్లలేని స్థితిలో ఉన్న చిరంజీవి ఆ బారు ముందు ఉన్న మెట్లపై పడిపోయాడు. ఈ క్రమంలో అర్ధరాత్రి సమయంలో దప్పిక వేసి మృతి చెందినట్లు తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున మున్సిపల్ సిబ్బంది గమనించి చూడగా మృతిచెంది ఉన్నాడు. దీంతో వారు పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు, కుటుంబ సభ్యులు అక్కడి చేరుకున్నారు. మృతి చెందిన తీరును పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి సోదరుడు కిరణ్కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తునట్లు పట్టణ ఎస్ఐ మంజునాథ్రెడ్డి తెలిపారు. -
ఆల్కహాల్ తాగొద్దన్నారనీ..
- ఎనగుర్తిలో ఘటన - హత్య చేశారంటూ మృతుడి సోదరుడి ఆరోపణ దుబ్బాక: కుటుంబ కలహాలతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన దుబ్బాక మండలం ఎనగుర్తి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం... ఎనగుర్తికి చెందిన చెప్యాల బాలయ్య(23) అదే గ్రామానికి చెందిన ఇస్తారి లక్ష్మీనారాయణ ఇంటికి రెండేళ్ల క్రితం ఇల్లరికం వెళ్లాడు. బాలయ్య కూలీనాలీ చేస్తూ ఏడాదిన్నర వరకు కుటుంబాన్ని పోషించాడు. ఇటీవల బాలయ్య తాగుడుకు బానిస కావడంతో కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి. బుధవారం రాత్రి బాలయ్య తాగి ఇంటికొచ్చాడు. ఎందుకు తాగావని కుటుంబ సభ్యులు అడగడంతో మనస్తాపానికి గురైన బాలయ్య ఇంట్లో ఉన్న విషపు గుళికలు మింగాడు. దీంతో కుటుంబ సభ్యులు బాలయ్యను హుటాహుటిన దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో సిద్దిపేట ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించాడు. బాలయ్యకు భార్య కవిత, కూతురు ప్రణీత ఉన్నారు. బాలయ్యది ఆత్మహత్య కాదని విషం పెట్టి హత్య చేశారని బాలయ్య అన్న చెప్యాల కనకయ్య ఆరోపించారు. ఈ మేరకు భూంపల్లి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని దుబ్బాక ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.