controvercy
-
‘నేనేమైనా ఉర్ధు మాట్లాడుతున్నానా?’ విద్యార్థిపై కర్ణాటక మంత్రి ఆగ్రహం
బెంగళూరు: కర్ణాటక విద్యాశాఖమంత్రి మధు బంగారప్ప తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నారు. మంత్రికి కన్నడ రాదని ఓ విద్యార్ధి వ్యాఖ్యానించడంతో ఆయన సీరియస్ అయ్యారు. విద్యార్ధి మాటలను మూర్ఖత్వంగా పేర్కొంటూ.. అతడిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాడు.. అసలేం జరిగిందంటేకర్ణాటక కామన్ ఎంట్రన్స్ టెస్ట్, జేఈఈ, నీట్ వంటి ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతున్న ఔత్సాహిక విద్యార్ధులకు ఉచిత ఆన్లైన్ కోచింగ్ అందించే ప్రభుత్వ కార్యక్రమాన్ని మంత్రి బుధవారం ప్రారంభించారు. ఇందులో సుమారు 25,000 మంది విద్యార్థులకు ఈ ఉచిత ఆన్లైన్ కోచింగ్ అందించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి మధు.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విద్యార్ధులతో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ క్రమంలో ఓ విద్యార్థి మాట్లాడుతూ.. విద్యామంత్రికి కన్నడ రాదు అని అన్నారు. దీనిపై మంత్రి వెంటనే స్పందిస్తూ.. ‘ఏంటి నేను ఏమైనా ఉర్ధూలో మాట్లాడుతున్నానా? టీవీ ఆన్ చేసి చూడు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం సదరు విద్యార్థిపై చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.Hadn't Madhu Bangarappa publicly admitted that he doesn't know Kannada?? Why is the @INCKarnataka punishing the student who reminded him of this?? What are they trying to achieve here ?? What else can be expected of hopeless Congress??ತನಗೆ ಕನ್ನಡ ಸರಿಯಾಗಿ ಬರುವುದಿಲ್ಲ ಎಂದು ಈ ಹಿಂದೆ… pic.twitter.com/FPXnFGExqy— Pralhad Joshi (@JoshiPralhad) November 21, 2024 ఇక మంత్రి ప్రవర్తనపై ప్రతిపక్ష బీజేపీ నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు కర్నాటక బీజేపీ అధికారిక ఎక్స్లో మంత్రిని ఓ విద్యార్థి ప్రశ్న అడిగే కార్టూన్ను పోస్ట్ చేసింది. మంత్రి విద్యార్థులను బోల్డ్ ప్రశ్నలు అడగమని చెబుతున్న ఫోటోకు ‘ప్రశ్నించేవారిని తెలివితక్కువవాడిగా పిలుస్తుంది మీరే’ అని సూచించే క్యాప్షన్ను పేర్కొంది. ಅವಿದ್ಯಾಮಂತ್ರಿ @Madhu_Bangarapp ಅವರೆ, ಜ್ಞಾನ ದೇಗುಲವಿದು ಧೈರ್ಯವಾಗಿ ಪ್ರಶ್ನಿಸು ಅಂತ ಹೇಳೋರು ನೀವೇ..!! ಪ್ರಶ್ನಿಸಿದವರನ್ನು ಸ್ಟುಪಿಡ್ ಅಂತ ಕರೆಯುವವರು ನೀವೇ..!!#DictatorCongress #UneducatedMinister pic.twitter.com/3ZY5kp3QB2— BJP Karnataka (@BJP4Karnataka) November 21, 2024 కర్నాటకకు చెందిన కేంద్ర మంత్రి, ఎంపీ ప్రహ్లాద్ జోషి ఎక్స్లో స్పందిస్తూ.. మధు బంగారప్ప తనకు కన్నడ రాదని బహిరంగంగా ఒప్పుకోలేదా? ఈ విషయాన్ని గుర్తు చేసిన విద్యార్థిని కర్ణాటక కాంగ్రెస్ ఎందుకు శిక్షిస్తోంది? వారు ఇక్కడ ఏం సాధించాలని ప్రయత్నిస్తున్నారు ? ఆశలేని కాంగ్రెస్ నుంచి ఇంకా ఏమి ఆశించవచ్చని ప్రశ్నించారు. -
నయన్- ధనుశ్ వివాదం.. ఆ విషయం తెలిసి షాకయ్యా: రాధిక శరత్ కుమార్
ధనుశ్- నయనతార వ్యవహారం కోలీవుడ్ను కుదిపేస్తోంది. ఇటీవల విడుదలైన నయనతార నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ బియాండ్ ది ఫెయిరీ టేల్ ఈ వివాదానికి కారణమైంది. ఆ డాక్యుమెంటరీ నానుమ్ రౌడీ ధాన్ మూవీలోని మూడు సెకన్ల వీడియోను ఈ డాక్యుమెంటరీలో ఉపయోగించారు. అయితే తన అనుమతి లేకుండా ఇలా చేయడం సరికాదని ధనుష్ రూ. 10 కోట్ల నష్ట పరిహారం కోరుతూ లీగల్ నోటీసు పంపించారు. దీంతో ఈ వివాదం కాస్తా కోలీవుడ్లో మరింత చర్చకు దారితీసింది.అయితే తాజాగా ఈ వ్యవహారంపై సీనియర్ నటి రాధిక శరత్కుమార్ స్పందించారు. నానుమ్ రౌడీ ధాన్లో కీలక పాత్ర పోషించిన రాధిక ధనుశ్ ప్రవర్తనపై మాట్లాడారు. ఈ మూవీ సెట్స్లో నయనతార, విఘ్నేష్ శివన్ల ప్రేమ వ్యవహారం గురించి తనతో చెప్పాడని తెలిపింది. ఆ మూవీ షూటింగ్ టైమ్లో ధనుశ్ నాకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పాడని వివరించింది. ధనుశ్ ఫోన్లో మాట్లాడుతూ అక్కా.. నీకు సిగ్గు లేదా? అని అడిగాడు. అతను ఏమి చెబుతున్నాడో నాకు అర్థం కాలేదు. 'ఏం జరుగుతుందో నీకు తెలియదా?, 'విక్కీ, నయన్లు డేటింగ్ చేస్తున్నారని ధనుశ్ నాతో అన్నాడని తాజాగా విడుదలైన డాక్యుమెంటరీలో రాధిక వివరించింది. ఆ తర్వాత వెంటనే 'ఏం మాట్లాడుతున్నావ్.. నాకేమీ తెలీదు' అని షాకింగ్కు గురైనట్లు డాక్యుమెంటరీలో చెప్పుకొచ్చింది.కాగా.. నయనతార డాక్యుమెంటరీలో నాగార్జున, రానా దగ్గుబాటి, తమన్నా భాటియా, ఉపేంద్ర, విజయ్ సేతుపతి, అట్లీ, పార్వతి తిరువోతు లాంటి స్టార్స్ కూడా కనిపించారు. కేవలం మూడు సెకన్ల ఫుటేజీని ఉపయోగించినందుకు ధనుశ్ లీగల్ నోటీసులు పంపడంతో ఈ వివాదం మరింత ముదిరింది. -
డియోర్ బ్యాగ్పై క్లారిటీ.. ఎవరీ జయ కిషోరి
ఢిల్లీ: ఆధ్యాత్మిక వక్త జయ కిషోరి సుమారు రూ.2 లక్షల విలువైన డియోర్ బ్యాగ్తో ఇటీవల ఎయిర్పోర్టులో కనిపించారు. దీంతో నిరాడంబర జీవితం గడపాలని బోధనలు చేసే.. ఆమె ఇలా ఖరీదైన బ్యాగ్తో కనిపించిన ఫొటో సోషల్మీడియాలో వైరల్గా మారింది. దీంతో ఆమె ఖరీదై బ్యాగ్ వాడటంపై ఫాలోవర్లు, నెటిజన్లు విమర్శలు గుప్పించారు. అయితే ఈ విమర్శలపై 29 ఏళ్ల జయ కిషోరీ తాజాగా స్పందించారు.‘‘నేను కూడా సాధారణ అమ్మాయినే. సాధారణమైన ఇంట్లోనే ఉంటున్నా. కుటుంబంతో కలిసి జీవిస్తున్నా. యువత కష్టపడాలి. కష్టపడి డబ్బులు సంపాదించాలి. మంచి జీవితం కోసం ఖర్చు పెట్టుకోవాలి. కుటుంబానికి ఇవ్వాలి. మీ కలలను నెరవేర్చుకోవడానికి ఉపయోగించుకోవాలని చెప్పాను. ఈ బ్యాగ్ కస్టమైజ్డ్. అందులో లెదర్ ఉపయోగించలేదు. కస్టమైజ్డ్ అంటే మన ఇష్ట ప్రకారం తయారు చేసుకోవచ్చు. దానిపై నా పేరు కూడా రాసి ఉంది. ...నేనెప్పుడూ లెదర్ వాడలేదు, వాడను కూడా. నేను దేనినీ వదులుకోలేదు. కాబట్టి నేను అలా చేయమని మీకు ఎలా చెప్పగలను?. నేను సన్యాసిని, సాధువు లేదా సాధ్విని కాదని మొదటి రోజు నుంచే స్పష్టంగా చెబుతున్నా’’ అని ఆమె వివరించారు. జయ కిషోరికి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతాను 12.3 మిలియన్లకు ఫాలో అవుతున్నారు.Jaya Kishori ji Said I'm not BABa or SANT, I'm just ordinary girl !!Waah kya Acting hai phle Dharm k naam pr paisa chapo or fir ye gyaan do . waah DIDI waah 🫡 pic.twitter.com/bCQjD4zedE— Yogesh (@yogesh_xrma) October 29, 2024ఎవరీ జయ కిషోరి..యువ ఆధ్యాత్మిక వక్తగా జయ కిషోరి తన ప్రేరణాత్మక సందేశాల ద్వారా వార్తల్లో నిలిచారు. ఆమె ఆధ్యాత్మిక కథలు చెప్పటంతో దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందారు. ఆమె వక్తనే కాకుండా సంగీత కళాకారిణీ, కథకురాలు కూడా. జయ కిషోరి 13 జూలై, 1996న కోల్కతాలో జన్మించారు. కోల్కతాలోని మహాదేవి బిర్లా వరల్డ్ అకాడమీ స్కూల్లో పాఠశాల విద్యను అభ్యసించారు. ఓపెన్ స్కూల్ ద్వారా బి.కామ్ పూర్తి చేశారు. ఆమె ఫాలోవర్స్ ద్వారా 'ది మీరా ఆఫ్ మోడర్న్ వరల్డ్', 'కిషోరి జీ'గా ప్రసిద్ధి చెందారు. జయ కేవలం ఏడేళ్ల వయస్సులోనే బహిరంగంగా ఉపన్యాసం ఇవ్వటం ప్రారంభించారు. ఆమె తన 7 రోజుల నిడివి గల మానసిక కథ 'శ్రీమద్ భగవత్ గీత', 3 రోజుల నిడివి గల 'కథా నాని బాయి రో మేరో'తో గుర్తింపు పొందారు. మరోవైపు.. ఆమె శ్రీకృష్ణుడిని పూజిస్తారు. ఆమె భజనలు యూట్యూబ్లో కూడా చాలా ప్రసిద్ధి చెందాయి. ఆమె జూలై 24, 2021న ‘జయ కిషోరి ప్రేరణ’ అనే కొత్త యూట్యూబ్ ఛానెల్ని ప్రారంభించారు. ఆమె ఛానెల్కు దాదాపు 9 లక్షల మంది ఫాలో అవుతున్నారు. ఆమె ప్రసిద్ధ పాటల్లో ‘శివ్ స్తోత్ర’, ‘మేరే కన్హా’, ‘సాజన్ మేరో గిర్ధారి’ వంటివి ఉన్నాయి.చదవండి: టికెట్ నిరాకరణ, సిట్టింగ్ ఎమ్మెల్యే అదృశ్యం.. ‘తగిన శాస్తి జరిగిందంటూ’... -
నీట్ వివాదం.. ధర్మేంద్ర ప్రదాన్ కీలక కామెంట్స్
భువనేశ్వర్: ‘నీట్’పేపర్ లీక్ వ్యవహారంలో ఒకవేళ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) అధికారులది తప్పని తేలితే వదిలేది లేదని కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ స్పష్టం చేశారు. ఆదివారం(జూన్16) ఒడిశాలోని సంబల్పూర్లో ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడారు. ‘పేపర్లీక్కు సంబంధించి రెండు చోట్ల అక్రమాలు వెలుగుచూశాయి. ఈ విషయంలో ప్రభుత్వం సీరియస్గా ఉందని పేరెంట్స్, తల్లిదండ్రులకు హామీ ఇస్తున్నా. ఇందులో ఎంత పెద్దస్థాయి అధికారులున్నప్పటికీ వదిలేది లేదు. ఎన్టీఏలో చాలా మార్పులు చేయాల్సి ఉంది. బిహార్ ఆర్థిక నేరాల విభాగం తొమ్మిది మంది నీట్ అభ్యర్థులకు పేపర్లీక్ కేసులో నోటీసులిచ్చింది. వారిని విచారణకోసం పిలిచాం’అని ప్రదాన్ తెలిపారు. -
మరో వివాదంలో కేంద్ర మంత్రి సురేష్గోపీ
తిరువనంతపురం: ఇటీవలే కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కేరళ బీజేపీ ఎంపీ, సినీ నటుడు సురేష్గోపీ మరో వివాదానికి తెర తీశారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీని ‘మదర్ ఆఫ్ ది నేషన్’గా అభివర్ణించి సంచలనం రేపారు.శనివారం(జూన్ 15) కేరళ త్రిసూర్లోని కాంగ్రెస్ నేత కరుణాకరణ్ సమాధి ‘మురళి మందిర్’ను సందర్శించి నివాళులర్పించిన సందర్భంగా సురేష్గోపీ ఈ వ్యాఖ్యలు చేశారు.అంతేగాక కరుణాకరన్తో పాటు మాజీ సీఎం ఈకే నయనార్ తనకు రాజకీయ గురువులని తెలిపారు. కేరళ కాంగ్రెస్కు కరుణాకరణ్ తండ్రి అని చెప్పారు. అయితే తన ఈ వ్యాఖ్యలకు ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు ఆపాదించవద్దని మీడియాను కోరారు. ఇటీవల తాను కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆ పదవికి రాజీనామా చేస్తున్నట్లు కొన్ని మీడియా ఛానళ్లు తప్పుడు ప్రచారం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కాగా, ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో కేరళలో తొలిసారిగా బీజేపీ ఖాతా తెరిచింది. త్రిసూర్ నుంచి సురేశ్గోపీ 70 వేల ఓట్ల మెజారిటీతో గెలిచి రాష్ట్రం నుంచి గెలిచిన తొలి బీజేపీ ఎంపీగా రికార్డు క్రియేట్ చేశారు. దీంతో కేంద్రంలోని మోదీ3.0 మంత్రి వర్గంలో సురేశ్గోపీకి చోటు దక్కింది. -
కొవిషీల్డ్ వివాదం.. బీజేపీపై అఖిలేశ్ యాదవ్ ఫైర్
లక్నో: కొవిషీల్డ్ వ్యాక్సిన్ వివాదంపై సమాజ్వాదీపార్టీ(ఎస్పీ) చీఫ్ అఖిలేశ్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొవిషీల్డ్ వ్యాక్సిన్తో ప్రజలకు గుండె సంబంధిత సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని సైంటిస్టులు తేల్చితే దీనికి బాధ్యులెవరని అఖిలేశ్ ప్రశ్నించారు. సామాన్య ప్రజల జీవితాలను కేంద్ర ప్రభుత్వం ప్రమాదంలో పడేసిందని మండిపడ్డారు. ఈ విషయమై బుధవారం(మే1) అఖిలేశ్ ఇటావాలో మాట్లాడారు. వ్యాక్సిన్ల విషయంలో బీజేపీ పెద్ద నేరం చేసిందన్నారు. ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘించడం కంటే పెద్ద నేరమన్నారు. ‘‘ఏక్ మే ఔర్ బీజేపీ గయ్’’ అని ఎద్దేవా చేశారు.మరోవైపు ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ కూడా కొవిషీల్డ్ వివాదంపై స్పందించారు. ఒకపక్క కొవిషీల్డ్తో ప్రమాదం ఉందని తెలిసిన తర్వాత కూడా కేంద్రం ఇంకా వ్యాక్సిన్ వేసుకోవాలని చెప్పడమేంటన్నారు. యువత గుండె జబ్బులతో కుప్పకూలడానికి వ్యాక్సిన్కు లింక్ ఉందన్న ప్రచారం జరుగుతోందని చెప్పారు. కాగా, కొవిషీల్డ్ వ్యాక్సిన్తో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న మాట వాస్తవమేనని వ్యాక్సిన్ను ఉత్పత్తి చేసిన యూకే కంపెనీ ఆస్ట్రాజెనెకా ఒప్పుకోవడంతో వివాదం రేగింది. భారత్లో కరోనా వ్యాక్సిన్ వేసుకున్న వారిలో 90 శాతం మంది కొవిషీల్డ్ వ్యాక్సిన్నే తీసుకోడం గమనార్హం. — ANI (@ANI) May 1, 2024 -
భారత్-మాల్దీవుల వివాదం.. దుష్టబుద్ధిని బయటపెట్టిన చైనా
బీజింగ్: మాల్దీవులు-భారత్ మధ్య వివాదాస్పద వాతావరణం నెలకొన్న వేళ చైనా తన దుష్టబుద్ధిని బయటపెట్టింది. మాల్దీవుల అంశంలో భారత్పై మరోసారి విమర్శలు గుప్పించింది. ఆసియా దేశాల మధ్య దౌత్య సంబంధాల్లో భారత్ మరింత ఓపెన్ మైండెడ్(విశాల దృక్పథం)తో ఆలోచించాలని విమర్శలు చేసింది. మాల్దీవుల-భారత్ మధ్య వివాదం నడుస్తున్న వేళ మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు చైనాలో పర్యటిస్తున్నారు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఆహ్వానం మేరకు ముయిజ్జు తన సతీమణితో కలిసి బీజింగ్ వెళ్లారు. ఈ క్రమంలోనే చైనా అధికారిక గ్లోబల్ టైమ్స్ సంపాదకీయంలో భారత్పై చైనా అక్కసు వెళ్లగక్కింది. 'మాల్దీవులను మేము సమాన భాగస్వామిగా పరిగణిస్తాం. భారత్, చైనా ఘర్షణల నేపథ్యంలో భారత్కు దూరంగా ఉండాలని మాల్దీవులకు మేము ఎన్నడు చెప్పలేదు. భారత్ నుంచి మాల్దీవులకు వచ్చే సహకారాన్ని ముప్పుగా భావించలేదు. సంబంధాల్లో భారత్ మరింత విశాల దృక్పథంతో నిర్ణయాలు తీసుకోవాలి' అని గ్లోబల్ టైమ్స్ కథనం ప్రచురించింది. మాల్దీవుల్లో గత సెప్టెంబర్లో జరిగిన ఎన్నికల్లో మహమ్మద్ ముయిజ్జు అధికారంలోకి వచ్చారు. అప్పటి నుంచి భారత్-మాల్దీవుల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈయనకు ముందు వరకు మాల్దీవులు భారత్తో సన్నిహిత సంబంధాలు ఏర్పర్చుకున్నాయి. కానీ ముయిజ్జు అధికారంలోకి వచ్చాక మాల్దీవులకు చైనాతో సాన్నిహిత్యం ఎక్కువైంది. ఆ దేశంలో చైనా పెట్టుబడులు పెట్టి తన ప్రభావాన్ని విస్తరిస్తోంది. అధ్యక్షునిగా పదవి చేపట్టిన వెంటనే ఆయన మొదట చైనాకే పర్యటించారు. ప్రధాని మోదీ ఇటీవల లక్షద్వీప్లో పర్యటించిన విషయం తెలిసిందే. లక్షద్వీప్ను పర్యాటక ధామంగా మార్చాలంటూ ఆ సందర్భంగా ఆయన వీడియో, ఫొటోలు షేర్ చేశారు. అవి ఆన్లైన్లో వైరల్గా మారాయి. పలువురు నెటిజన్లు లక్షద్వీప్ను మాల్దీవులతో పోల్చారు కూడా! దీనిపై మాల్దీవుల మంత్రి షియునా వ్యంగ్యంగా స్పందించారు. మోదీని జోకర్గా, తోలుబొమ్మగా పేర్కొంటూ ట్వీట్లు చేశారు. మంత్రులు మజీద్, మల్షా కూడా ఇవే రకమైన వ్యాఖ్యలు చేశారు. ఇది ఇరుదేశాల మధ్య వివాదాస్పద వాతావరణం ఏర్పడటానికి కారణమైంది. ఇదీ చదవండి: భారత హైకమిషనర్కు మాల్దీవులు సమన్లు -
భారత్ అంటే "911 కాల్".. మాల్దీవుల మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు
మాలే: మాల్దీవులు-భారత్ మధ్య కొనసాగుతున్న వివాదంపై ఆ దేశ మాజీ రక్షణ మంత్రి మారియా అహ్మద్ దీదీ స్పందించారు. ప్రధాని మోదీపై అవమానకరమైన వ్యాఖ్యలు చేయడం మాల్దీవుల ప్రభుత్వానికే చిన్నచూపు అని ఆమె అన్నారు. రక్షణతో సహా వివిధ రంగాలలో సహాయం చేస్తూ భారతదేశం నమ్మకమైన మిత్రదేశంగా ఉందని చెప్పారు. భారత్తో మాల్దీవులకు ఉన్న చిరకాల బంధాన్ని దెబ్బతీసే ప్రయత్నాలను ఆమె విమర్శించారు. మాల్దీవుల మంత్రుల అవమానకరమైన వ్యాఖ్యలపై మారియా అహ్మద్ నిరాశను వ్యక్తం చేశారు. మాల్దీవుల పట్ల భారతదేశాన్ని "911 కాల్"(అమెరికాలో అత్యవసర సేవల నెంబర్)గా అభివర్ణించారు. ఎప్పుడూ కాల్ చేసినా మాల్దీవులను రక్షించడానికి సిద్ధంగా ఉంటారని పేర్కొన్నారు. ప్రధాని మోదీని అవమానించడం ప్రస్తుత ప్రభుత్వ చిన్న చూపు అని విమర్శించారు. 'మేము అధికారంలో ఉన్నప్పుడు అందరితో స్నేహంగా ఉన్నాం. భారతదేశంతో భద్రతా సమస్యలను పంచుకున్నాం. భారత్ కూడా ఎల్లప్పుడూ మాకు సహాయం చేస్తుంది. రక్షణ రంగంలో సామర్థ్యం పెంపొందించడం మాల్దీవులను స్వయం సమృద్ధిగా మార్చడానికి ప్రయత్నించాం' అని మరియా అహ్మద్ దీదీ అన్నారు. #WATCH | Male: On the row over Maldives MP's post on Prime Minister Narendra Modi, Former Maldives Defence Minister Mariya Ahmed Didi says, "... India has been our 911 call, whenever we need it, we give a call and you all come to our rescue. That kind of a friend. When you see… pic.twitter.com/9X64vqwWwg — ANI (@ANI) January 8, 2024 ప్రధాని మోదీపై వివాదాస్పద వ్యాఖ్యల అంశంపై మాల్దీవుల విదేశాంగ మంత్రిని పార్లమెంట్లో ప్రశ్నించాలని ఆ దేశ పార్లమెంట్ సభ్యుడు మికేల్ నసీమ్ పిలుపునిచ్చారు. అవమానకర వ్యాఖ్యలు చేసిన సభ్యులు జవాబుదారీతనంగా ఉండాలని కోరారు. భారత్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆ దేశ ప్రతిపక్ష నేతలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.ి ప్రధాని మోదీ ఇటీవల లక్షద్వీప్లో పర్యటించిన విషయం తెలిసిందే. లక్షద్వీప్ను పర్యాటక ధామంగా మార్చాలంటూ ఆ సందర్భంగా ఆయన వీడియో, ఫొటోలు షేర్ చేశారు. అవి ఆన్లైన్లో వైరల్గా మారాయి. పలువురు నెటిజన్లు లక్షద్వీప్ను మాల్దీవులతో పోల్చారు కూడా! దీనిపై మాల్దీవుల మంత్రి షియునా వ్యంగ్యంగా స్పందించారు. మోదీని జోకర్గా, తోలుబొమ్మగా పేర్కొంటూ ట్వీట్లు చేశారు. మంత్రులు మజీద్, మల్షా కూడా ఇవే రకమైన వ్యాఖ్యలు చేశారు. మంత్రుల వివాదాస్పద వ్యాఖ్యలతో ఇరుదేశాల మధ్య వివాదాస్పద వాతావరణం ఏర్పాటైంది. భారత్ గురించి హైళనగా మాట్లాడటంపై ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బైకాట్ మాల్దీవులు నినాదాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఆ తర్వాత ఇరుదేశాలు హైకమిషనర్లకు సమన్లు జారీ చేశాయి. ఇదీ చదవండిL: భారత హైకమిషనర్కు మాల్దీవులు సమన్లు -
భారత హైకమిషనర్కు మాల్దీవులు సమన్లు
మాలె: ప్రధాని నరేంద్ర మోదీపై మాల్దీవుల మంత్రుల అనుచిత వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. మాల్దీవుల హైకమిషనర్కు భారత్ సమన్లు జారీ చేసిన కొన్ని గంటలకే కీలక పరిణామం చోటుచేసుకుంది. మాల్దీవుల ప్రభుత్వం కూడా అక్కడ ఉన్న భారత హైకమిషనర్కు సమన్లు జారీ చేసింది. భేటీ కావాల్సిందిగా మాలేలోని భారత హైకమిషనర్ మును మహావార్కు ఉత్తర్వులు జారీ చేశారు. మాల్దీవుల హైకమిషనర్ ఇబ్రహీం షహీబ్కు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ నేడు నేడు సమన్లు జారీ చేసింది. ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సౌత్ బ్లాక్కు ఆయన వచ్చివెళ్లినట్లు సమాచారం. వివాదంపై రెండు దేశాలు సుదీర్ఘ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రులపై మాల్దీవుల ప్రభుత్వం వేటు వేసిన మరుసటి రోజే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రధాని మోదీ ఇటీవల లక్షద్వీప్లో పర్యటించిన విషయం తెలిసిందే. లక్షద్వీప్ను పర్యాటక ధామంగా మార్చాలంటూ ఆ సందర్భంగా ఆయన వీడియో, ఫొటోలు షేర్ చేశారు. అవి ఆన్లైన్లో వైరల్గా మారాయి. పలువురు నెటిజన్లు లక్షద్వీప్ను మాల్దీవులతో పోల్చారు కూడా! దీనిపై మాల్దీవుల మంత్రి షియునా వ్యంగ్యంగా స్పందించారు. మోదీని జోకర్గా, తోలుబొమ్మగా పేర్కొంటూ ట్వీట్లు చేశారు. మంత్రులు మజీద్, మల్షా కూడా ఇవే రకమైన వ్యాఖ్యలు చేశారు. ఇది ఇరుదేశాల మధ్య వివాదాస్పద వాతావరణం ఏర్పడటానికి కారణమైంది. ఇదీ చదవండి: Lakshadweep Islands History: లక్షద్వీప్పై పాక్ కన్ను.. భారత్ ఎత్తుగడతో చిత్తు! -
లక్షద్వీప్తో మాల్దీవులకు సమస్య ఏంటి?.. స్థానిక ఎంపీ ఫైర్
మాలె: ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేయడంపై లక్షద్వీప్ ఎంపీ మహమ్మద్ ఫైజల్ విరుచుకుపడ్డారు. లక్షద్వీప్ అభివృద్ధి చెందితే మాల్దీవులకు వచ్చిన సమస్య ఏంటీ..? అని ఎంపీ మహమ్మద్ ఫైజల్ ప్రశ్నించారు. 'భవిష్యత్తులో లక్షద్వీప్ కచ్చితంగా పర్యాటక ప్రాంతంగా మారుతుంది. ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందలేదు. ప్రధాని ఇక్కడికి వచ్చి ఒక రోజు గడిపారు. లక్షద్వీప్ ప్రజలు ఎల్లప్పుడూ పర్యాటక కోణంలో ఉండాలని కోరుకునే విషయాన్ని ఆయన చెప్పారు. ప్రభుత్వం టూరిజం కోసం ఒక విధానాన్ని కలిగి ఉండాలని మేము కోరుకున్నాను. దీంతో యువతకు ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది. దానితో మాల్దీవులకు వచ్చిన సమస్య ఏంటి?' అని ఆయన ప్రశ్నించారు. ఇదీ జరిగింది..! ప్రధాని మోదీ ఇటీవల లక్షద్వీప్లో పర్యటించిన విషయం తెలిసిందే. లక్షద్వీప్ను పర్యాటక ధామంగా మార్చాలంటూ ఆ సందర్భంగా ఆయన వీడియో, ఫొటోలు షేర్ చేశారు. అవి ఆన్లైన్లో వైరల్గా మారాయి. పలువురు నెటిజన్లు లక్షద్వీప్ను మాల్దీవులతో పోల్చారు కూడా! దీనిపై మాల్దీవుల మంత్రి షియునా వ్యంగ్యంగా స్పందించారు. మోదీని జోకర్గా, తోలుబొమ్మగా పేర్కొంటూ ట్వీట్లు చేశారు. మంత్రులు మజీద్, మల్షా కూడా ఇవే రకమైన వ్యాఖ్యలు చేశారు. పర్యాటకంలో మాల్దీవులతో లక్షద్వీప్ ఏ మాత్రమూ సరితూగదంటూ ఎద్దేవా చేశారు. ‘‘భారత్లో హోటల్ గదులు అసహ్యంగా ఉంటాయి. మా దేశంతో లక్షద్వీప్కు పోలికేమిటి?’’ అంటూ మాల్దీవుల ఎంపీ జహీద్ రమీజ్ కూడా నోరు పారేసుకున్నారు. ఈ వ్యాఖ్యలపై మాల్దీవుల్లోని భారత హైకమిషన్ కార్యాలయం అధికారులు నిరసన తెలిపారు. దుమారం నేపథ్యంలోవారి వ్యాఖ్యలను ‘ఎక్స్’ నుంచి తొలగించారు. ఈ వివాదంపై భారత్ కూడా ఘాటుగానే స్పందించింది. దీంతో మాల్దీవులు ఆ మంత్రులను పదవి నుంచి తప్పించింది. ఢిల్లీలో మాల్దీవుల హైకమిషనర్కు సమన్లు జారీ చేసింది. ఇదీ చదవండి: మోదీపై అనుచిత వ్యాఖ్యలు.. మాల్దీవుల హైకమిషనర్కు భారత్ సమన్లు -
మాల్దీవుల హైకమిషనర్కు భారత్ సమన్లు
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీపై మాల్దీవుల మంత్రుల అనుచిత వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ఈ క్రమంలో మాల్దీవుల హైకమిషనర్ ఇబ్రహీం షహీబ్కు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సమన్లు జారీ చేసింది. ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సౌత్ బ్లాక్కు ఆయన వచ్చివెళ్లినట్లు సమాచారం. వివాదంపై రెండు దేశాలు సుదీర్ఘ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రులపై మాల్దీవుల ప్రభుత్వం వేటు వేసిన మరుసటి రోజే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రధాని మోదీ ఇటీవల లక్షద్వీప్లో పర్యటించిన విషయం తెలిసిందే. లక్షద్వీప్ను పర్యాటక ధామంగా మార్చాలంటూ ఆ సందర్భంగా ఆయన వీడియో, ఫొటోలు షేర్ చేశారు. అవి ఆన్లైన్లో వైరల్గా మారాయి. పలువురు నెటిజన్లు లక్షద్వీప్ను మాల్దీవులతో పోల్చారు కూడా! దీనిపై మాల్దీవుల మంత్రి షియునా వ్యంగ్యంగా స్పందించారు. మోదీని జోకర్గా, తోలుబొమ్మగా పేర్కొంటూ ట్వీట్లు చేశారు. #WATCH | Ibrahim Shaheeb, Maldives Envoy exits the MEA in Delhi's South Block. He had reached the Ministry amid row over Maldives MP's post on PM Modi's visit to Lakshadweep. pic.twitter.com/Dxsj3nkNvw — ANI (@ANI) January 8, 2024 మంత్రులు మజీద్, మల్షా కూడా ఇవే రకమైన వ్యాఖ్యలు చేశారు. పర్యాటకంలో మాల్దీవులతో లక్షద్వీప్ ఏ మాత్రమూ సరితూగదంటూ ఎద్దేవా చేశారు. ‘‘భారత్లో హోటల్ గదులు అసహ్యంగా ఉంటాయి. మా దేశంతో లక్షద్వీప్కు పోలికేమిటి?’’ అంటూ మాల్దీవుల ఎంపీ జహీద్ రమీజ్ కూడా నోరు పారేసుకున్నారు. ఈ వ్యాఖ్యలపై మాల్దీవుల్లోని భారత హైకమిషన్ కార్యాలయం అధికారులు నిరసన తెలిపారు. దుమారం నేపథ్యంలోవారి వ్యాఖ్యలను ‘ఎక్స్’ నుంచి తొలగించారు. బైకాట్ మాల్దీవులు.. ఈ వివాదంపై నెటిజన్లు ఫైరయ్యారు. మాల్దీవుల పర్యాటకాన్ని రద్దు చేసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో ట్వీట్లు చేశారు. బైకాట్ మాల్దీవులు అంటూ నినదించారు. మాల్దీవుల మంత్రుల నోటి దురుసును సెలబ్రెటీలు క్రికెటర్ సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, జాన్ అబ్రహం, శ్రద్ధా కపూర్ తదితరులు తీవ్రంగా తప్పుబట్టారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. వారి విద్వేష వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగించాయని అక్షయ్ అన్నారు. దిద్దుబాటు చర్యలు ఈ వ్యాఖ్యలపై మాల్దీవుల ప్రభుత్వం కూడా స్పందించి దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. మంత్రులను పదవి నుంచి సస్పెండ్ చేసింది. మంత్రుల వ్యాఖ్యలు వ్యక్తిగతమైనవని స్పష్టం చేసింది. ఆ వ్యాఖ్యలతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. ఈ వివాదం ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలపై ఎలాంటి ప్రభావం ఉండబోదని ఆశాభావం వ్యక్తం చేసింది. ఇదీ చదవండి: మోదీపై అనుచిత పోస్టు.. మాల్దీవుల టూర్ను రద్దు చేస్తున్న నెటిజన్లు -
మోదీపై అనుచిత వ్యాఖ్యలు.. మాల్దీవులు మంత్రులపై వేటు!
భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాల్దీవులు మంత్రులపై ఆ దేశ ప్రభుత్వం వేటు వేసింది. ముగ్గురు మంత్రులను సస్పెండ్ చేసింది మాల్దీవులు ప్రభుత్వం. మంత్రులు మరియం షియునా, మల్షా షరీఫ్ , మహ్జూమ్ మజీద్ సస్పెన్షన్కు గురైనట్లు మాల్దీవులు స్థానిక మీడియా వెల్లడించింది. ఇప్పటికే మంతత్రి మరియం షియునా ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమైనవి అని మాల్దీవులు ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇలా ప్రకటించిన కొద్ది గంటల్లోనే వారిపై మాల్దీవులు ప్రభుత్వం సస్పెన్ వేటు వేయటం గమనార్హం. ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లక్ష్యదీప్ పర్యటనకు వెళ్లిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారిన విషయం తెలిసిందే. వాటిలో ఓ వీడియోపై మాల్దీవులు మంత్రి మరియం షియునా చేసిన అనుచిత వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. లక్ష్యదీప్ బీచ్లో మోదీ నడుస్తున్న ఓ వీడియోపై మరియం సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ప్రధాని మోదీ ఇజ్రాయెల్ దేశపు తోలు బోమ్మ అని అనుచిత కామెంట్ చేశారు. దీంతో ఒక్కసాగా ఆమె వ్యాఖ్యలు వివాదాస్పంగా మారాయి. ఆమె వ్యాఖ్యలను భారత్లోని పలువురు తీవ్రంగా ఖండించారు. మాల్దీవులు మంత్రి చేసిన అవమానపూరిత వ్యాఖ్యలపై బాలీవుడ్ నటులు సైతం తీవ్రంగా ఖండిచారు. ‘భారత్పై మాల్దీవులు దేశ మంత్రులు అలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా ఆశ్చర్యం కలిగించింది. పొరుగు దేశంతో తాము స్నేహంగానే ఉండాలనుకుంటాం. కానీ, వారి ద్వేషాన్ని సహించము. మాల్దీవులులో ఎన్నోసార్లు పర్యటించాను. అయితే ఇటువంటి సమయంలో భారత్లోని దీవులను పర్యటిస్తూ.. మన పర్యాటకానికి మద్దతు ఇద్దాం’ అని బాలీవుడ్ నటుడు ఆక్షయ్ కుమార్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ‘చాలా పరిశుభ్రమై లక్ష్య ద్వీప్ బీచ్ను ప్రధాని మోదీ పర్యటించడం ఎంతో బాగుంది. విశేషమేంటంటే అవి కూడా మన దేశంలో ఉండటం’ అని నటుడు సల్మాన్ ఖాన్ తెలిపారు. ఇక.. వీరితోపాటు చాలామంది ప్రముఖులు, సామాన్యులు కూడా మాల్దీవులు మంత్రి వ్యాఖ్యలను సోషల్మీడియాలో తీవ్రంగా ఖండిస్తున్నారు. తమ మాల్దీవులు పర్యటనను కూడా రద్దు చేసుకుంటున్నామని భారతీయ నెటిజన్లు సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తున్నారు. చదవండి: మోదీపై అనుచిత పోస్టు.. ఖండించిన మాల్దీవుల ప్రభుత్వం -
మోదీపై అనుచిత పోస్టు.. ఖండించిన మాల్దీవుల ప్రభుత్వం
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీని 'ఇజ్రాయెల్ తోలుబొమ్మ'తో పోల్చుతూ మాల్దీవుల మంత్రి మరియం షియునా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఆ దేశ ప్రభుత్వం ఖండించింది. ఈ వ్యాఖ్యలతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. అభిప్రాయాలు వ్యక్తిగతమైనవని పేర్కొంది. ప్రభుత్వ హోదాలో ఉండి ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇలాంటి ద్వేషపూరిత వ్యాఖ్యలు ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలకు ఎలాంటి ఆటంకం కలిగించదని స్పష్టం చేసింది. లక్షద్వీప్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించిన విషయం తెలిసిందే. ఈ పర్యటన సందర్భంగా మోదీ ఫొటోలు విస్తృతంగా వైరల్ అయ్యాయి. ఈ ఫొటోలను ఉద్దేశిస్తూ మాల్దీవుల యూత్ ఎంపవర్మెంట్ డిప్యూటీ మంత్రి మరియం షియునా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మోదీని ఇజ్రాయెల్ తోలుబొమ్మ అని పేర్కొంటూ ట్విట్టర్ వేదికగా పోస్టులు చేశారు. ఈ వ్యాఖ్యలపై భారత్ కూడా స్పందించింది. మంత్రి మరియం షియునా వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసింది. మంత్రి మరియం షియునా వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు రావడంతో ట్విట్టర్(ఎక్స్) నుంచి వాటిని తొలగించారు. మాల్దీవులను బైకాట్ చేయాలంటూ పలువురు విమర్శించారు. ఖండించిన మాజీ అధ్యక్షుడు.. ప్రధాని నరేంద్ర మోదీపై మాల్దీవుల మంత్రి మరియం షియునా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఆ దేశ మాజీ అధ్యక్షుడు మహ్మద్ నషీద్ కూడా తీవ్రంగా ఖండించారు. ఆమె ఉపయోగించిన భాష భయంకరమైనదని అన్నారు. మాల్దీవుల శ్రేయస్సు కోసం పనిచేయడంలో భారత్ మంచి మిత్రుడని అన్నారు. "ప్రధాని మోదీపై మంత్రి మరియం షియునా భయంకరమైన వ్యాఖ్యలు చేశారు. మొహమ్మద్ ముయిజ్జూ ప్రభుత్వం ఈ వ్యాఖ్యలకు దూరంగా ఉండాలి. ఆ వ్యాఖ్యలతో ప్రభుత్వానికి సంబంధం లేదని భారతదేశానికి స్పష్టమైన హామీ ఇవ్వాలి" అని మాల్దీవుల మాజీ అధ్యక్షుడు నషీద్ అన్నారు. ఇదీ చదవండి: ‘ఫొటో సెషన్కు సమయం ఉంది.. మణిపూర్ పరిస్థితి ఏంటి?’ -
హిందీపై డీఎంకే ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
చెన్నై: డీఎంకే ఎంపీ దయానిధి మారన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందీ భాష మాట్లాడే ఉత్తరప్రదేశ్, బిహార్కు చెందిన వ్యక్తులు తమిళనాడులో టాయిలెట్లు, రోడ్లు శుభ్రం చేస్తున్నారని అన్నారు. ఈ వీడియో క్లిప్ వైరల్ కావడంతో బీజేపీ జాతీయ ప్రతినిధి షెహబాద్ పూనావాలా స్పందించారు. దేశాన్ని ఉత్తర, దక్షిణ, భాష, కులం, మతం ఆధారంగా విభజించాలని ఇండియా కూటమి ప్రయత్నిస్తోందని షెహబాద్ పూనావాలా విమర్శించారు. డీఎంకే ఎంపీ దయానిధి మారన్ వాడిన భాష దురదృష్టకరమని అన్నారు. మారన్ వ్యాఖ్యలపై యూపీ, బిహార్ నేతలు మౌనం వహించడాన్ని ఆయన తప్పుబట్టారు. డీఎంకే ఎంపీ దయానిధి మారన్ ఓ సభలో మాట్లాడుతూ హిందీ ప్రముఖ్యతను తక్కువ చేసే ప్రయత్నం చేశారు. ఇంగ్లీష్, హిందీ, భాషలను పోల్చారు. ఇంగ్లీష్ నేర్చుకున్నవారు ఐటీ ఉద్యోగాల్లో చేరితే హిందీ నేర్చుకున్నవారు చిన్న కొలువుల్లో చేరుతున్నారని అన్నారు. ఈ క్రమంలోనే హిందీ మాట్లాడే యూపీ, బిహార్ ప్రజలు తమిళనాడులో నిర్మాణ రంగంలో, రోడ్లు, టాయిలెట్లు క్లీనింగ్ చేస్తున్నారని అన్నారు. ఇదీ చదవండి: దేశంలో కొవిడ్-19 కొత్త వేరియంట్ జేఎన్.1 విజృంభణ -
మధ్యప్రదేశ్లో కలకలం రేపుతున్న పోస్టల్ బ్యాలెట్ వివాదం!
మధ్యప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు ఇటీవలే ముగిసిన సంగతి తెలిసిందే. ఇక డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది కూడా. ఐతే ఈలోపు మధ్యప్రదేశ్లోని బాలాఘాట్ జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ని కొందరూ అధికారులు ఓపెన్ చేసినట్లు కలకలం రేగింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ బాలఘాట్లో పోస్టల్ బ్యాలెట్లు వ్యవహారంలో ట్యాపరింగ్కు పాల్పడే అవకాశం ఉందంటూ ఎన్నికాల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఇది చాల తీవ్రమైన విషయం అని, బాధ్యలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరింది. అలాగే తమ కాంగ్రెస్ కార్యకర్తలు ఈ విషయమై అప్రమత్తంగా ఉండాలని ఎటువంటి వివాదాలు జరగకుండా చూసుకోవాలని ట్విట్టర్లో పేర్కొంది కాంగ్రెస్. ఇక ఆ వీడియోలో కొందరూ అధికారులు స్ట్రాంగ్ రూమ్లో పోస్టల్ బ్యాలెట్లను తెరిచినట్లు కనిపించింది. దీంతో కాంగ్రెస్ ఆ జిల్లా కలెక్టరే స్ట్రాంగ్ రూంని ఓపెన్ చేశారని, ఇతర అధికారులు అభ్యర్థులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పోస్ట్ బ్యాలెట్లు ఓపెన్ చేశారని ఆరోపణలు చేసింది. ఇదిలా ఉండగా ఈ వివాదం చెలరేగిన కాసేపటికి కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు షఫ్ఖత్ ఖాన్ మాట్లాడుతూ..డ్యూటీలో ఉన్న సిబ్బంది ఈ విషయం గురించి మా పార్టీ ప్రతినిధికి సంతృప్తికరమైన రీతిలో సమాధానం ఇవ్వకపోవడం ఈ గందరగోళం ఏర్పడిందని తెలిపారు. అయితే సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ఈ కన్ఫ్యూజ్ని క్లియర్ చేసిందని వివరించారు. ఈ వివాదం విషయమై బాలాఘాట్లో పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారిని డివిజనల్ కమిషనర్ సస్పెండ్ చేసినట్లు అధికారిక వర్గాల సమాచారం. దీంతో వివాదం సద్దుమణిందింది. ఈ మేరకు స్థానిక మేజిస్ట్రేట్ గోపాల్ సోనీ విలేకరులతో మాట్లాడుతూ.."ఈటీపీబీఎస్ (ఎలక్ట్రానికల్ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్)ని ఉంచడం, వాటిని 50 బండిల్స్గా క్రమబద్ధీకరించడం అనేది సాధారణ ప్రక్రియ. ఈ ప్రక్రియ అంతా సీసీటీవీ కెమెరాల సమక్షంలోనే జరుగుతుందని, అలాగే బయట సెక్యూరిటీ సిబ్బంది కూడా ఉన్నారని తెలిపారు. వాస్తవానికి స్థానిక తహసీల్ కార్యాలయంలోని ఒక గది పోస్టల్ బ్యాలెట్ల కోసం స్ట్రాంగ్ రూమ్గా కేటాయించారు. ఇక్కడ బాలాఘాట్ అసెంబ్లీ స్థానాల పోస్టల్ బ్యాలెట్లు తోపాటుఇతర ఐదు అసెంబ్లీ సెగ్మెంట్ల పోస్టల్ బ్యాలెట్లను కూడా సీసీటీవీ నిఘాలోనే భద్రపరచడమే జరుగుతుంది. అందువల్ల ప్రతీరోజు అందుకు సంబంధించిన ఎలక్ట్రానిక్ పోస్టల్ బ్యాలెట్లు ఇక్కడకు రావడం జరుగతుంది. కాబట్టి తాము ఈ స్ట్రాంగ్ రూమ్ని ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలోనే తెరవడం జరుతుంది. తదనంతరం ఒక్కొక్క అసెంబ్లీ స్థానాల వారీగా పోస్టల్ బ్యాలెట్లను క్రమబద్ధీకరించడం జరుగుతుందని వివరించారు స్థానిక మెజిస్ట్రేట్. కాగా, నవంబర్ 17న ముగిసిన పోలింగ్లో మళ్లీ కాంగ్రెస్ అధికారం దక్కించుకోవాలని తీవ్రంగా యత్నిస్తుంది. 2018లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం దక్కించుకున్నప్పటికీ సీనియర్ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా 20 మందికి పైగా విధేయులైన ఎమ్మెల్యేలతో బీజేపీలోకి చేరడంతో ఒక్కసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయింది. దీంతో ఈ ఎన్నికల్లో గెలిచి ఎలాగైన తన ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది కాంగ్రెస్. కానీ బీజేపీ మాత్రం కాంగ్రెస్ని మట్టికరిపించేలా ప్రజలు తమనే గెలిపిస్తారని దీమా వ్యక్తం చేస్తుండడం గమనార్హం. निर्वाचन को कलंकित करते बालाघाट कलेक्टर मध्यप्रदेश के बालाघाट जिले के कलेक्टर डॉ. गिरीश मिश्रा ने आज 27 नवंबर को ही स्ट्रांग रूम खुलवाकर बिना अभ्यर्थियों को सूचना दिए डाक मतपत्रों की पेटियां खोल दी है। अंतिम साँसें गिनती शिवराज सरकार और सरकार की अंधभक्ति में लीन कलेक्टर… pic.twitter.com/I1UrKmHK5B — MP Congress (@INCMP) November 27, 2023 (చదవండి: వారిని ప్రజలు పట్టించుకోలేదు.. సీఎం గెహ్లాట్ ధీమా!) -
'సనాతన ధర్మంపై 'ఇండియా' ఉద్దేశం ఇదే..'
ఢిల్లీ: ప్రతిపక్ష కూటమి 'ఇండియా' అన్ని మతాలను, సిద్ధాంతాలను గౌరవిస్తుందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా చెప్పారు. సనాతన ధర్మాన్ని డీఎంకే ఎంపీ ఏ రాజా ఎయిడ్స్తో పోల్చుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తర్వాత కాంగ్రెస్ ఈ మేరకు స్పందించింది. ఎంపీ రాజా వ్యాఖ్యలను సమ్మతించబోమని చెప్పారు. డీఎంకే ఎంపీ ఏ రాజా వివాదాస్పద వ్యాఖ్యల తర్వాత స్పందించిన కాంగ్రెస్ తన సిద్ధాంతం సర్వధర్మ సమభావం అని పేర్కొంది. ప్రతి మతానికి, సిద్ధాంతానికి సమాన ఆధరణ ఉంటుందని స్పష్టం చేసింది. తాము ఏ మతానికి, విశ్వాసాలను కించపరచబోమని వెల్లడించింది. డీఎంకే వ్యాఖ్యలపై స్పందిస్తూ.. కూటమిలో ప్రతి ఒక్కరూ అన్ని మతాలను గౌరవిస్తారని అన్నారు. డీఎంకే ఎంపీ రాజా ఈ రోజు సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని ఎయిడ్స్, కుష్టు రోగంతో పోల్చారు. దీనిపై బీజేపీ మండిపడింది. దేశవ్యాప్తంగా ఈ వ్యాఖ్యలు విమర్శలకు కారణమయ్యాయి. అనంతరం కాంగ్రెస్ తన అభిప్రాయాన్ని మరోసారి స్పష్టం చేసింది. ఇదీ చదవండి: ‘సనాతన ధర్మం అంశంపై చర్చలకు ఎవరు రమ్మన్నా వస్తా’ -
'ది ఎలిఫెంట్ విస్పరర్స్' వివాదం.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బొమ్మన్ !
ఆర్ఆర్ఆర్తో పాటు ఆస్కార్ పొందిన డాక్యుమెంటరీ చిత్రం ది ఎలిఫెంట్ విస్పరర్స్. తమిళనాడులోని నీలగిరి కొండల్లో ఏనుగులను సంరక్షించే గిరిజన దంపతుల జీవనం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం ఆ దంపతులకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును తెచ్చిపెట్టింది. అయితే దీన్ని తెరకెక్కించిన కార్తికి గోంజాల్వెస్ తీరు పట్ల ఇటీవలే ఈ దంపతులు తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నటిస్తే ఇల్లు, వాహనం, బెల్లీ మనవరాలు చదువుకు కావాల్సిన సాయంతోపాటు కలెక్షన్స్లోనూ వాటా ఇస్తామని కార్తికి చెప్పిందని బొమ్మన్, బెల్లీ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో గిరిజన దంపతులు తమకు డబ్బులు ఇవ్వకుండా దర్శకురాలు మోసం చేసిందని వాపోయారు. అంతే కాకుండా తాము ఖర్చు పెట్టిన కూడా ఇవ్వలేదని చెబుతున్నారు. (ఇది చదవండి: ఉద్యోగులకు బంపరాఫర్..సెలవుతో పాటు ఏకంగా టికెట్స్ కూడా!) ఈ నేపథ్యంలో మరో ఆసక్తికర విషయం బయటకొచ్చింది. అయితే ఇప్పటికే గిరిజన దంపతులు దర్శకురాలికి రూ.2 కోట్ల చెల్లించాలంటూ లీగల్ నోటీస్ పంపినట్లు తెలిసింది. ఆస్కార్ వచ్చిన తర్వాత దేశ ప్రధాని, తమిళనాడు ముఖ్యమంత్రి నుంచి ఆమె పురస్కారాలు అందుకున్నారని.. తమకు మాత్రం మొండిచేయి చూపించారంటూ లీగల్ నోటీసులో పేర్కొన్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ఈ విషయంలో బొమ్మన్, బెల్లీ యూ టర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే రూ.2 కోట్ల లీగల్ నోటీసు గురించి తమకు తెలియదని బొమ్మన్ చెప్పినట్లు వెల్లడిస్తోంది. తాజా నివేదికల ప్రకారం.. బొమ్మన్ దంపతులు చేసిన ఆరోపణలపై పూర్తిగా యూ టర్న్ తీసుకున్నట్లు సమాచారం. ఓ మీడియా ప్రతినిధితో బొమ్మన్ మాట్లాడుతూ..' మా డిమాండ్లు నెరవేరితే కేసును వెనక్కి తీసుకుంటానని నేను చెప్పలేదు. అక్కడ ఏమి జరిగిందో నాకు ఏమి తెలియదు. లీగల్ నోటీసులు పంపినట్లు నా దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు. కార్తీకి నాతో బాగా మాట్లాడారు. అంతే కాకుండా సహాయం చేస్తానని కూడా చెప్పారు. కేసు విషయంలో నేనేం చేస్తా. ఆమె మాకు సాయం చేస్తానని హామీ ఇచ్చారు. నాకు ఉద్యోగం ఇప్పిస్తే చాలు." అని అన్నారు. ఇప్పటికే దీనిపై వివాదం తలెత్తగా.. బొమ్మన్ కామెంట్స్తో సీన్ కాస్తా రివర్స్ అయింది. (ఇది చదవండి: మమ్మల్ని నమ్మించి మోసం చేసింది.. దర్శకురాలిపై తీవ్ర ఆరోపణలు!) అసలు కథేంటంటే.. తమిళనాడులోని ముదుమలై రిజర్వ్ ఫారెస్ట్లో మావటిగా పనిచేస్తున్న బెల్లీ, బొమ్మన్ దంపతుల నిజజీవిత ఆధారంగా తెరకెక్కించిన షార్ట్ ఫిలిం ది ఎలిఫెంట్ విష్పరర్స్. రఘు, అమ్ము అనే రెండు అనాథ ఏనుగు పిల్లలు. వాటిని ఆదరించిన ఈ దంపతులనే ప్రధాన పాత్రలుగా కథ రూపొందించారు. నిర్మాత గునీత్ మోగ్న ఆధ్వర్యంలో.. దర్శకురాలు కార్తికి గోంజాల్వెస్ ఈ కథను తెరకెక్కించారు. -
మాజీ సీఎంపై ప్రముఖ కమెడియన్ వివాదాస్పద కామెంట్స్!
ఇటీవలే కేరళ మాజీ సీఎం ఉమెన్ చాందీ మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మృతికి రాజకీయ ప్రముఖులు, మలయాళ సినీతారలు సైతం సంతాపం వ్యక్తం చేశారు. కేరళ ప్రభుత్వం సైతం ఆ మృతికి రెండు రోజుల పాటు సంతాపదినాలు ప్రకటించింది. ఈ నేపథ్యంలో మలయాళ స్టార్ కమెడియన్ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇంతకీ ఆయన ఏం మాట్లాడారు? ఎందుకు వివాదంగా మారిందో తెలుసుకుందాం. మాలీవుడ్ నటుడు వినాయకన్ సోషల్ మీడియాలో లైవ్ పెట్టి మరీ మాజీ సీఎంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అయితే ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో కొద్ది నిమిషాలకే సోషల్ మీడియా నుంచి తొలగించాడు. (ఇది చదవండి: సినీ ఇండస్ట్రీని కుదిపేసిన ఘటన.. హీరోయిన్పై అత్యాచారయత్నం!) లైవ్ వీడియోలో వినాయకన్ మాట్లాడుతూ.. 'అసలు ఊమెన్ చాందీ ఎవరు?. మూడు రోజులుగా అతని మరణం గురించి మీడియాలో విస్తృతంగా కవరేజీ రావడం నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇలాంటి వార్తలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం మానుకోవాలని మీడియాను కోరారు. మరణం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో సాధారణంగా జరిగేదే. అందరిలాగే ఊమెన్ చాందీ కూడా చనిపోయారు. అంతే కాకుండా ఊమెన్ చాందీని మంచి వ్యక్తిగా చిత్రీకరించడం తప్పు..' అని విమర్శలు చేశారు. దీంతో కేరళలో పెద్దఎత్తున విమర్శలు రావడంతో వినాయకన్ ఆ లైవ్ వీడియోను తన సోషల్ మీడియా ఖాతా నుంచి డిలీట్ చేశాడు. కాగా.. వినాయకన్ తదుపరి ఆసిఫ్ అలీ నటిస్తోన్న 'కాసర్ గోల్డ్' చిత్రంలో నటిస్తున్నారు. (ఇది చదవండి: రెండోసారి తల్లి కాబోతున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్!) View this post on Instagram A post shared by Tk Vinayakan (@actorvinayakan) -
వివాదంలో మెగా హీరో.. అసలేం జరిగిందంటే?
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ వివాదంలో చిక్కుకున్నాడు. యాక్సిడెంట్ తర్వాత మొదటిసారిగా ఇటీవలే విరూపాక్షతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు. అయితే శ్రీకాళహస్తి ఆలయంలో సాయి ధరమ్ తేజ్ చేసిన పనికి వివాదం మొదలైంది. (ఇది చదవండి: స్టార్ హీరో కుమారుడు తెరంగేట్రం.. ఏకంగా స్టార్ హీరోయిన్ కూతురితోనే!) శ్రీకాళహస్తి ఆలయ దర్శనానికి వెళ్లిన సాయి ధరమ్ తేజ్.. అక్కడ సుబ్రమణ్యస్వామివారికి తానే స్వయంగా హారతి ఇచ్చారు. ఇదే హీరోకు తలనొప్పిగా మారింది. అయితే నియమాల ప్రకారం స్వామివారికి ఆలయ అర్చకులు మాత్రమే హారతి ఇవ్వాలని భక్తులు అంటున్నారు. సాయి ధరమ్ తేజ్ హారతి ఇవ్వడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. (ఇది చదవండి: తమన్నా మాస్ స్టెప్పులు.. అలా పోల్చిన విజయ్ వర్మ!) -
Adipurush controversy: అయోధ్యలో ‘ఆది పురుష్’ సెగలు.. శ్రీరామ సేన సారధ్యంలో..
హీరో ప్రభాస్ నటించిన ‘ఆది పురుష్’ సినిమా విడుదల కాగానే.. ఆ సినిమాపై విమర్శల దాడి మొదలయ్యింది. ఈ చిత్రంపై ఆధ్యాత్మిక ప్రాంతాలుగా పేరుగాంచిన వారణాసి మొదలుకొని హరిద్వార్ వరకూ కూడా ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపధ్యంలో శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్యలో ‘ఆది పురుష్’పై జనాగ్రహం వ్యక్తమవుతోంది. నగరంలోని శ్రీరామ సేన కార్యకర్తలు ‘ఆది పురుష్’ ప్రదర్శితమవుతున్న థియేటర్ల నుంచి ప్రేక్షకులను బయటకు పంపిస్తూ, ఆయా థియేటర్లను మూసివేయిస్తున్నారు. రూ. 500 కోట్ల బారీ బడ్జెట్తో నిర్మితమైన ‘ఆది పురుష్’పై మొదలైన ఆందోళనలు ఇప్పట్లో ఆగేలా లేవు. దేశవ్యాపంగా ఈ సినిమాపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పలుచోట్ల ఆందోళనలు కూడా జరుగుతున్నాయి.ఇదే కోవలో రామజన్మభూమి అయిన అయోధ్యలో ‘ఆది పురుష్’పై ఆందోళనలు మిన్నంటాయి. ఈ ప్రాంతానికి చెందిన హిందూ సంస్థలు ఈ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్లను మూసివేయిస్తున్నాయి. శ్రీరామ సేన కార్యకర్తలు ఈ సినిమా ఆడుతున్న థియేటర్ల ముందు ఆందోళనలు నిర్వహిస్తూ, ప్రదర్శనలను మధ్యలోనే నిలిపివేయిస్తున్నారు. థియేటర్లలోకి చొరబడిన శ్రీరామ సేన కార్యకర్తలు కాషాయ జండాలు ప్రదర్శిస్తూ, ‘జై శ్రీరామ్’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేస్తూ పోలీసుల సమక్షంలోనే సినిమా ప్రదర్శనను నిలిపివేయిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీరామ సేన రాష్ట్ర అధ్యక్షుడు దినే సింగ్ మాట్లాడుతూ ‘అసంబద్ధమైన సినిమా రూపొందించారు. మన సంస్కృతిని కించపరిచారు. దీనిని అయోధ్యలో ప్రదర్శించబోనీయం. ‘ఆది పురుష్’ సినిమాను అయోధ్యలో ఎట్టిపరిస్థితిలోనూ ఆడబోనీయం’ అని స్పష్టం చేశారు. వారణాసి మొదలు హరిద్వార్ వరకూ.. ‘ఆది పురుష్’ సినిమాపై వారణాసి మొదలు అయోధ్య వరకూ ఆందోళనల పర్వం కొనసాగుతోంది. అఖిల భారతీయ సంత్ సమితి ప్రతినిధి జితేంద్రానంద మాట్లాడుతూ ఈ సినిమాలోని డైలాగులు స్వామీజీలకే అర్థం కావడంలేదని, సనాతన ధర్మానికి సంబంధించిన సాక్ష్యాలను వక్రీకరించారన్నారు. హరిద్వార్లోనూ ‘ఆది పురుష్’ సినిమాపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడి హిందూ సంఘాలు ఈ సినిమాను చూడొద్దంటూ ప్రేక్షకులను కోరుతున్నాయి. ప్రభుత్వం ఈ సినిమాపై తాత్కాలికంగానైనా నిషేధం విధించాలని కోరుతున్నాయి. ఇది కూడా చదవండి: ‘ఆది పురుష్’పై అఖిల భారత హిందూ సభ విమర్శల బాణం! -
‘ఆది పురుష్’పై విమర్శల బాణం ఎక్కుపెట్టిన అఖిల భారత హిందూ మహాసభ!
‘ఆదిపురుష్’ సినిమా సనాతన ధర్మాన్ని అవమానించినట్లుగా ఉంది. శ్రీరాముడు, సీతామాత, హనుమంతుడు పాత్రలను తప్పుగా చిత్రీకరించారు. అసంబద్ధ డైలాగులతో పవిత్ర భావాలను వక్రీకరించారు. అందుకే ‘ఆది పురుష్’ను బ్యాన్ చేయాలి’ అంటూ అఖిల భారత హిందూ మహాసభ ఆందోళన వ్యక్తం చేసింది. నటుడు ప్రభాస్ నటించిన ‘ఆది పురుష్’ సినిమాను పలు వివాదాలు చుట్టుముడుతున్నాయి. తాజాగా ‘ఆది పురుష్’ సినిమా స్టార్కాస్ట్, డైలాగ్ రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్లపై అఖిల భారత హిందూ మహాసభ విమర్శల బాణం సంధించింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ సినిమాను బ్యాన్ చేయాలని డిమాండ్ చేసింది. అఖిల భారత హిందూ మహాసభ ‘ఆదిపురుష్’ సినిమా సనాతన ధర్మాన్ని ఘోరంగా అవమానించిందని ఆరోపించింది. రామాయణంలోని ఎంతో ఉన్నతమైన పాత్రలను ‘ఆదిపురుష్’ సినిమాలో దిగజార్చారని ఆరోపించింది. ఈ సినిమా కారణంగా రామాయణంపై అందరిలో తప్పుడు భావాలు ఏర్పడేందుకు అవకాశం ఉందని, ముఖ్యంగా పిల్లలపై చెడు ప్రభావం పడుతుందని ఆరోపించింది. అందుకే ఈ సినిమాను నిషేధించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు అఖిల భారత హిందూ మహాసభ యూపీలోని హజరత్గంజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆదిపురుష్ సినిమాను ఉత్తరప్రదేశ్లో బ్యాన్ చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు ఆర్జేడీ వినతిపత్రం సమర్పించింది. ఈ సినిమాలో వినియోగించిన భాష గౌరవప్రదంగా లేదని ఆర్జేడీ ఆరోపించింది. సనాతన ధర్మంపై మక్కువ గలవారి హృదయాలను ఈ సినిమా గాయపరిచిందని ఆ లేఖలో ఆర్జేడీ పేర్కొంది. ఇది కూడా చదవండి: ‘ఆది పురుష్’ను చీల్చిచెండాడిన ‘టీవీ రాముడు’ -
వివాదాల పురుష్... ఇప్పుడు మరో మరక
-
WPL 2023: క్రికెటర్పై వేటు.. ఆరంభంలోనే వివాదం
బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వుమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL 2023) ఆరంభ సీజన్ తొలిరోజునే వివాదం నెలకొంది. గుజరాత్ జెయింట్స్ జట్టు ఫిట్నెస్ లేదన్న కారణంగా విండీస్ ఆల్రౌండర్ డియాండ్రా డాటిన్పై వేటు వేసింది. ఈ విషయం పెద్ద వివాదంగా మారింది. ఫిట్నెస్ లేదని చెప్పి తనను అకారణంగా డబ్ల్యూపీఎల్ నుంచి తప్పించారంటూ విండీస్ మహిళా క్రికెటర్ డియాండ్రా డాటిన్ ఆరోపణలు చేసింది. తన ప్లేస్లో ఆస్ట్రేలియా ఆల్రౌండర్ కింబెర్లీ గార్త్ను తీసుకోవడం సరికాదని ఆమె తెలిపింది. ''తొందరగా కోలుకోవాలని నాకు మెసేజ్లు పంపిస్తున్నవాళ్లను అభినందిస్తున్నా. అయితే.. నిజం ఏంటంటే..? నేను ఎలాంటి గాయం నుంచి కోలుకోవడం లేదు. ధన్యవాదాలు'' అని సోషల్మీడియాలో పోస్ట్లో రాసుకొచ్చింది. చికిత్స తీసుకున్న డాటిన్ ఇంకా కోలుకోలేదని చెప్పి గుజరాత్ జెయింట్స్ డాటిన్ను తప్పించింది. డబ్ల్యూపీఎల్ వేలంలో రూ.50 లక్షల కనీస ధర ఉన్న డాటిన్ను గుజరాత్ జెయింట్స్ రూ. 60 లక్షలకు కొనుగోలు చేసింది. ఈ మధ్యే ముగిసిన వేలంలో కింబెర్లీ గార్త్ను ఏ జట్టు కొనేందుకు ఆసక్తి చూపించలేదు. దక్షిణాఫ్రికాలో ముగిసిన టి20 వరల్డ్ కప్ గెలిచిన ఆసీస్ జట్టులో గార్త్ సభ్యురాలు. అయితే.. ఈమె కేవలం రెండు మ్యాచ్లు మాత్రమే ఆడింది. వుమెన్స్ ప్రీమియర్ లీగ్ ఇవాళ(మార్చి 4న) ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ప్రారంభం కానుంది. ఆరంభ పోరులో బేత్ మూనీ సారథ్యంలోని గుజరాత్ జెయింట్స్, హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. I think we have the 1st #WPL controversy @GujaratGiants need to come up with some clarity No way to treat a legend#WPL2023 pic.twitter.com/qGyrN8l2gH — Mohit Shah (@mohit_shah17) March 4, 2023 చదవండి: WPL 2023: మ్యాచ్ 30 నిమిషాలు ఆలస్యంగా.. మహిళల ఐపీఎల్ 2023.. తొలి మ్యాచ్లో గెలుపెవరిది..? -
వివాదాస్పదంగా నీరా కేఫ్ వేదామృతం పేరు
-
సెన్సార్ బోర్డు ఏం చేస్తోంది.. ముకేశ్ కన్నా తీవ్ర ఆగ్రహం
పఠాన్ మూవీలోని పాటపై వివాదం మరింత ముదురుతోంది. ఈ సాంగ్లో దీపికా పదుకొణె ధరించిన డ్రెస్పై తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది. రోజు రోజుకు ఈ పాటను వ్యతిరేకించేవారి సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా బేషరమ్ రంగ్ పాటపై బాలీవుడ్ నటుడు, శక్తిమాన్ పాత్రధారి ముకేశ్ కన్నా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ పాటను అత్యంత అసభ్యకరంగా చిత్రీకరించారని ఆయన మండిపడ్డారు. ఇతరుల ఫీలింగ్స్ను రెచ్చగొట్టేలా ఉన్న ఇలాంటి పాటలను సెన్సార్ బోర్డు ఎలా అనుమతించిందని నిలదీశారు. ముకేశ్ కన్నా మాట్లాడుతూ.. 'ప్రస్తుతం సినీ పరిశ్రమ గాడి తప్పింది. సినిమాల్లో అశ్లీలత ఎక్కువైంది. ఇప్పుడు కురచ దుస్తుల్లో నటీనటుల్ని చూపించిన ఫిల్మ్మేకర్స్.. భవిష్యత్తులో నగ్నంగా చూపిస్తారేమో. ఇలాంటి వాటిని అంగీకరించడానికి మనమేమీ స్పెయిన్, స్వీడన్లో లేము. ఏ ఒక్కరి వ్యక్తిగత భావాలు, నమ్మకాలకు కించపరచకుండా సినిమాలు ఉండేలా చూసుకోవడం సెన్సార్ బోర్డు పని. యువతను తప్పుదోవ పట్టించే చిత్రాలకు అనుమతివ్వకూడదు. ఇతరుల ఉద్దేశాలను రెచ్చగొట్టే విధంగా ఉన్న ఇలాంటి వస్త్రధారణను ఎలా అంగీకరించారు.' అని ప్రశ్నించారు. షారుక్ ఖాన్, దీపికా పదుకొణె జంటగా నటించిన చిత్రం పఠాన్. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ఈ చిత్రంలోని బేషరమ్ రంగ్ సాంగ్ రిలీజ్ కాగా... దేశవ్యాప్తంగా పలువురు రాజకీయ నాయకులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సినిమా నుంచి ఈ పాటను తొలగించాలని లేదంటే రిలీజ్ను అడ్డుకుంటామని హెచ్చరించారు. -
వారసుడు సినిమా వివాదంపై స్పందించిన అల్లు అరవింద్
-
వివాదంలో మరో బాలీవుడ్ చిత్రం, ఎఫ్ఐఆర్ నమోదు
చాలా గ్యాప్ తర్వాత నటి అదా శర్మ నటిస్తున్న బాలీవుడ్ లేటెస్ట్ మూవీ ‘ది కేరళ స్టోరీ’. తాజాగా ఆ మూవీ చిక్కుల్లో పడింది. ఇటీవల విడుదలైన టీజర్లో అదా చెప్పిన ఓ డైలాగ్ కేరళనాట ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతోంది. కేరళ వాసుల ఈ మూవీపై తీవ్ర వ్యతీరేకత వస్తోంది. అసలు సంగతేంటంటే.. ఆదా శర్మ ప్రధాన పాత్రలో ది కేరళ స్టోరీ రూపొందుతుంది. నిజ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో అదా అపహరణ గురై బలవంతపు మత మార్పిడికి గురైన షాలిని ఉన్ని కృష్ణన్ అనే యువతి పాత్ర పోషించింది. ఈ నేపథ్యంలో రీసెంట్గా రిలీజైన ఈ మూవీ టీజర్లో అదా బుర్ఖ ధరించి కనిపించింది. చదవండి: తన స్థానంలోకి కొత్త యాంకర్ ఎంట్రీ.. స్పందించిన రష్మీ గౌతమ్ ఇందులో అదా మాట్లాడుతూ.. ‘ఆమె నర్సు కావాలని కలలు కనేది. కానీ కిడ్నాప్కి గురవుతుంది. ప్రస్తుతం ఆ అమ్మాయి ఆఫ్ఘనిస్తాన్లోని జైలులో ఉగ్రవాదిగా ఉంది’ అంటూ తన కథ చెబుతూ కన్నీటీ పర్యంతరం అవుతుంది. అంతేకాదు తను మాత్రమే కాదని తనలాంటి మరో 32 వేల మంది కేరళ అమ్మాయిలను ఇస్లాంలోకి మార్చి విదేశాలకు పంపించి ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారంటూ అదా చెప్పుకొచ్చింది. దీంతో టీజర్లో ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు కేరళనాట తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఈ అంశంపై కొందరు అభ్యంతరం తెలుపుతూ కేరళ సీఎం పినరయి విజయన్కు ఫిర్యాదు చేశారు. ఈ సినిమాను వెంటనే ఆపేయాలని, తప్పుడు లెక్కలతో కేరళ యువతుల పట్ల తప్పుడు ప్రచారం చేస్తున్న ఈ మూవీ టీంపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. చదవండి: ఆసక్తిగా గీతూ రాయల్ పారితోషికం.. 9 వారాలకు ఎంత ముట్టిందంటే! దీంతో ఆ రాష్ట్ర డీజీపీ అనిల్ కాంత్ ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణకు ఆదేశించారు. ఇదిలా ఉంటే కేరళ మాజీ సీఎం వీఎస్ అచ్యుతానంద గతంలో ఇచ్చిన ఓ ప్రసంగాన్ని తప్పుగా సబ్ టైటిల్స్ వేసి చూపిస్తున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ఈ సనిమా సుదీప్తో సేన్ దర్శకత్వం వహిస్తున్నారు ఈ సినిమాను పుల్ అమృత్లాల్ షా నిర్మిస్తున్నారు. కేరళలో అపహరణకు గురైన 32వేల మంది (యూనిట్ పేర్కొన్న లెక్క) మహిళల మత మార్పిడి, ఉగ్రవాదులుగా మార్చడం తదితర అంశాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీని వచ్చే ఏడాది విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే మూవీ టీం ప్రకటించింది. Fun fact: We also found another promo for #TheKeralaStory where Sen has misrepresented the words of another former CM VS Achuthanandan. The promo shows a 17-second clip of former CM VS Achuthanandan. Guess what? The eng subtitles had no similarities with what was being said. pic.twitter.com/neCBAri2N5 — Shinjinee Majumder (@shinjineemjmdr) November 8, 2022 -
కవల పిల్లల ఇష్యూ పై స్పందించిన విగ్నేష్ శివన్
-
వివాదంలో నాగచైతన్య మూవీ! చిత్ర బృందంపై గ్రామస్తుల దాడి?
అక్కినేని హీరో నాగ చైతన్య ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఎన్సీ 22 (#NC22)గా తెరకెక్కుతున్న ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ను శరవేగంగా జరుపుకుంటోంది. తాజాగా ఈ మూవీ వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. దేవాలయం ముందు బార్ సెట్ వేయడంతో గ్రామస్తులు మూవీ యూనిట్పై దాడి చేసినట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. వివరాలు.. నాగచైతన్య, కృతిశెట్టి హీరోహీరోయిన్లుగా వెంకట్ ప్రభు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. చదవండి: నయన్ను టార్గెట్ చేసిన నటి, నెట్టింట దూమారం రేపుతున్న ట్వీట్ ఇటీవలె సెట్పైకి వచ్చిన ఈ మూవీ కర్ణాటకలో మాండ్య జిల్లా మేల్కొటీ గ్రామంలో షూటింగ్ను జరుపుకుంటోంది. అదే గ్రామంలోని రాయగోపుర దేవాలయం సమీపంలో ఈ మూవీ షూటింగ్ సెట్ను ఏర్పాటు చేసి పలు కీలక సన్నివేశాలను చిత్రకరిస్తున్నారు. ఈ క్రమంలో దేవాలయం ముందు బార్ సెట్ వేసినట్లు తెలుస్తోంది. ఇక అది తెలిసి గ్రామస్తులు తీవ్ర మండిపాటుకు గురయ్యారట. దేవాలయం ముందే బార్ సెట్ వేయడంపై వారు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారని, నిత్యం పూజలు జరిగే పవిత్ర దేవాలయం ముందు బార్ సెటప్లు వేసి అపవిత్రం చేశారంటూ గ్రామస్తులు చిత్ర బృందపై దాడి చేసినట్లు సమాచారం. ఆ సమయంలో హీరో నాగచైతన్య కూడా సెట్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: మంచు మనోజ్ రెండో పెళ్లి వార్తలపై మంచు లక్ష్మి స్పందన అంతేకాదు ఈ మూవీ యూనిట్పై చర్యలు తీసుకోవాలని ఆ ఊరి ప్రజలు డిమాండ్ చేస్తున్నారట. ఈ ఘటనపై కర్ణాటక ప్రభుత్వం హీరో నాగచైతన్య, దర్శక-నిర్మాతలకు జరిమాన విధించినట్లు కూడా తెలుస్తోంది. కాగా ఈ మూవీ షూటింగ్ కోసం చిత్ర బృందం మాండ్య జిల్లా డీసీ అశ్విని అనుమతి కోరగా.. రెండు రోజుల షూటింగ్కు మాత్రమే పర్మిషన్ ఇచ్చారట. కానీ దానిని చిత్ర బృందం అతిక్రమించిందని, రెండు రోజులు దాటిన షూటింగ్ కొనసాగించారని తెలుస్తోంది. ఈ షూటింగ్లో బార్ సీన్ ఉన్నట్లు ముందుగా సమాచారం ఇవ్వలేదనే వాదన కూడా వినిపిస్తోంది. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే చిత్ర బృందం స్పందించే వరకు వేచి చూడాల్సిందే. -
వివాదాల ఆదిపురుష్..!
-
వివాదం లో ఆదిపురుష్ టీజర్
-
మ్యానిఫెస్టో తెచ్చిన తంటా... వివాదంలో శశి థరూర్
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఎన్నికలకు సంబంధించిన ఒక మ్యానిఫెస్టోని విడుదల చేశారు. ఇది ఇప్పుడు ఆయనకు లేనిపోని ఇబ్బందులోకి నెట్టింది. ఈ మేరకు ఆయన తన మ్యానిఫెస్టో బుక్లెట్లో 'థింక్ టుమారో, థింక్ థరూర్' అనే ట్యాగ్ లైన్తో భారతదేశం అంతటా ఉన్న కాంగ్రెస్ యూనిట్లు సూచించే చుక్కల నెట్వర్క్తో కూడిన మ్యాప్ను ఉపయోగించారు. ఐతే ఈ మ్యాప్ భారతదేశ అధికారిక మ్యాప్కి భిన్నంగా ఉంటుంది. అందులో జమ్ము కాశ్మీర్, లడఖ్ వంటి ప్రాంతాలు లేని భారత్ మ్యాప్గా రూపొందించారు. దీంతో ఈ మ్యానిఫెస్టో కాస్త సామాజిక మాధ్యమాల్లో పెద్ద వివాదాస్పదంగా మారింది. నెటిజన్లు ఇది వికేంద్రికరణ, విభజన అంటూ ఫైర్ అయ్యారు. గత మూడేళ్లలో ఆయన ఇలాంటి వివాదాస్పద వివాదంలో చిక్కుకోవడం ఇది రెండోసారి. డిసెంబర్ 2019లో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కి వ్యతిరేకంగా కేరళ కాంగ్రెస్ నిరసనను ప్రచారం చేస్తూ సోషల్ మీడియాలో ట్విట్ చేసి ఇలానే వివాదంలో చిక్కుకున్నారు. బీజేపీ నాయకుడు సంబిత్ వంటి నేతలు విమర్శలు లేవనెత్తడంతో వెంటనే ఆ ట్విట్ని తొలగించారు. I have just submitted my nomination papers as a candidate for the presidential election of @incindia. It is a privilege to serve the only party in India with an open democratic process to choose its leader. Greatly appreciate Soniaji’s guidance&vision.#ThinkTomorrowThinkTharoor pic.twitter.com/4HM4Xq3XIO — Shashi Tharoor (@ShashiTharoor) September 30, 2022 (చదవండి: కాంగ్రెస్ డీఎన్ఏలో గాంధీలు ఒక భాగం మాత్రమే.. కానీ’.. శశిథరూర్ సంచలన వ్యాఖ్యలు) -
ఇందులో తక్కువ కులం ఏది? ప్రశ్నాపత్రంపై తీవ్ర దుమారం
చెన్నై: తమిళనాడు పెరియార్ యూనివర్సిటీ పరీక్షల్లో ఓ ప్రశ్నాపత్రంలో కులానికి సంబంధించిన ప్రశ్న అడగటం తీవ్ర దుమారం రేపింది. ఎంఏ హిస్టరీ మొదటి ఏడాది రెండో సెమిస్టర్ పరీక్ష గురువారం జరిగింది. అయితే ప్రశ్నాపత్రంలో 'కింది వాటిలో తమిళనాడుకు చెందిన తక్కువ కులం ఏది?' అనే ప్రశ్న వచ్చింది. జవాబు ఎంచుకునేందుకు నాలుగు కులాల పేర్లను ఆప్షన్లుగా ఇచ్చారు. 'ఫ్రీడం మూవ్మెంట్ ఆఫ్ తమిళనాడు ఫ్రం 1800-1947' అనే సబ్జెక్టు పరీక్ష రాసిన విద్యార్థులకు ఈ ప్రశ్న ఎదురైంది. Tamil Nadu | 1st-year MA History students of Periyar University in Salem got asked in the exam, "Which one is the lower caste that belongs to Tamil Nadu?" with 4 options mentioning different castes pic.twitter.com/kdJxQrMo5R — ANI (@ANI) July 15, 2022 అయితే పరీక్షలో కులానికి సంబంధించిన ప్రశ్న అడగటం వివాదాస్పదమైంది. దీనిపై పెరియార్ యూనివర్సిటీ ఉప కులపతి జగన్నాథన్ స్పందించారు. సమాజంలో అసమానతలు రూపుమాపే దిశగా విద్యను అందించాల్సిన ప్రొఫెసర్లు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే, ప్రశ్నాపత్రం తాము తయారు చేయలేదని, వేరే యూనివర్సిటీ సిబ్బంది రూపొందించారని జగన్నాథన్ తెలిపారు. క్వశ్చన్ పేపర్ లీక్ కాకూడదనే ఇలా చేస్తున్నట్లు పేర్కొన్నారు. పరీక్ష జరిగే వరకు ప్రశ్నాపత్రాన్ని ఎవరూ చూడలేదని, అందులోని వివాదాస్పద ప్రశ్న గురించి తమకు ఎలాంటి సమాచారం అందలేదని చెప్పారు. ఈ విషయంపై కచ్చితంగా విచారణ జరుపుతామని స్పష్టం చేశారు. చదవండి: పిల్లాడు బూతులు మాట్లాడుతున్నాడు.. పొలిటికల్ లీడర్లు మాట్లాడుతుంటే టీవీ పెట్టారా..? -
ఆండ్రూ సైమండ్స్ గొప్ప ఆల్రౌండర్.. కానీ ఆ వివాదాల వల్లే..
క్రికెట్ ఫ్యాన్స్కి బిగ్ షాక్ తగిలింది. ఆసిస్ లెజెండరీ క్రికెటర్, ఆల్ రౌండర్ ఆండ్రూ సైమండ్స్ (46) రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. శనివారం రాత్రి టౌన్స్విల్లేలో జరిగిన కారు ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. సైమండ్స్ ఆస్ట్రేలియన్ క్రికెట్ జట్టులో కీలక ఆటగాడు మాత్రమే కాకుండా అత్యంత నైపుణ్యం కలిగిన ఆల్రౌండర్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. అయితే సైమండ్స్ తన ఆటతో పాటు పలు కాంట్రవర్శీలతో కూడా వార్తల్లో నిలిచాడు. ఇవి అతని క్రికెట్ కెరీర్ని కాస్త మసకబారేలా చేశాయి. అందులో ముఖ్యమైంది మంకీ గేట్ వివాదం. వివాదాలతో వార్తల్లో.. సైమండ్స్ క్రికెట్ చరిత్రలో ‘మంకీగేట్’ వివాదం ఓ కుదుపు కుదిపేసింది. అప్పుడు ఏం జరిగిందంటే.. 2008లో సిడ్నీలో జరిగిన టెస్టు మ్యాచ్లో హర్భజన్ సింగ్ తనను ‘మంకీ’ అన్నాడని ఆండ్రూ సైమండ్స్ ఆరోపించాడు. అయితే హర్భజన్ మాత్రం తాను అలా అనలేదని చెప్పాడు. హర్భజన్ సింగ్కి అవతలివైపు నాన్స్టైయికింగ్లో బ్యాటింగ్ చేస్తున్న సచిన్ టెండూల్కర్, ఈ విషయంలో హర్భజన్కు మద్దతుగా నిలిచాడు. భజ్జీ మంకీ అనలేదని, హిందీలో ఒక అసభ్య పదం ప్రయోగించాడని చెప్పాడు. ఆ పదం తాను స్వయంగా విన్నానని స్పష్టం చేశాడు. ఈ విషయం మీద దాదాపు కొన్ని రోజుల పాటు వివాదం, విచారణ సాగింది. చివరకు భజ్జీపై ఒక టెస్టు మ్యాచ్ నిషేదం, జరిమానా విధించారు. మైఖెల్ క్లార్క్ వైస్-కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన తర్వాత 2008లో డార్విన్లో బంగ్లాదేశ్తో జరిగిన వన్డే సిరీస్ నుంచి సైమండ్స్ ప్రవర్తన సరిగా లేదని ఇంటికి పంపింది క్రికెట్ ఆస్ట్రేలియా. ఎందుకంటే సైమండ్స్ యాజమాన్యం నిర్వహించే సమావేశాలు హాజరవడం కంటే చేపల వేటకు వెళ్లేందుకు ఇష్టపడేవాడు. 2005లో కార్డిఫ్లో బంగ్లాదేశ్తో ట్రై-సిరీస్ మ్యాచ్కు ముందు సైమండ్స్ ఆస్ట్రేలియన్ జట్టు నుంచి తొలగించారు. మ్యాచ్కు మునుపటి సాయంత్రం మద్యం సేవించడంతో యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. జూన్ 2009లో, ఆండ్రూ సైమండ్స్ ఆస్ట్రేలియన్ జట్టులో ఉన్నప్పుడు మూడవసారి క్రమశిక్షణను ఉల్లంఘించిన కారణంగా ట్వంటీ20 ప్రపంచ కప్ నుంచి తొలగించారు. సైమండ్స్ స్వభావం తన క్రికెట్ కెరీర్ను దెబ్బ తీసిందనే చెప్పాలి. సైమండ్స్ తన కెరీర్లో అనేక వివాదాలను ఎదుర్కొన్నప్పటికీ, అతను ప్రపంచ క్రికెట్ చరిత్రలో గొప్ప ఆల్ రౌండర్లలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. చదవండి: Andrew Symonds: క్రికెట్ ఫ్యాన్స్కు షాక్.. ఆసిస్ మాజీ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ మృతి -
చెయ్యి వేస్తే కత్తితో పొడుచుకుంటా.. హీరోయిన్ బెదిరింపులు
Court New Order On Meera Mithun Controversy Issue: ప్రముఖ నటి, బిగ్బాస్ ఫేం మీరా మీథున్ను మళ్లీ వార్తల్లో నిలిచింది. సోషల్ మీడియాలో ఏది అనిపిస్తే అది మాట్లాడి వివాదాల పాలవుతుంది ఈ అమ్మడు. ఈ భామపై అప్పట్లో అరెస్ట్ వారెంట్ జారీ అయింది. పలు తమిళ చిత్రాల్లో నటించిన మీరాకు అవకాశాలు రాకుండా కొంతమంది అడ్డుకుంటున్నారని, అందులో షెడ్యూల్ క్యాస్ట్ వాళ్లు కూడా ఉన్నారని ఆమె ఆరోపించింది. వారిని వెంటనే ఇండస్ట్రీ నుంచి తప్పించాలంటూ వారిని, వారి కులాన్ని కించపరుస్తూ గతంలో కాంట్రవర్సీ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ వీడియో వైరల్ కాగా ఆ సామాజిక వర్గం నుంచి ఆందోళనలు మొదలయ్యాయి. ఆమె మీద పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్సీ, ఎస్ట్రీ అట్రాసిటీ కేసుతోపాటు పలు కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మీరాను అరెస్ట్ చేయడానికి వెళ్లిన పోలీసులకు చుక్కలు చూపించింది ఈ అమ్మడు. అరెస్ట్ చేయడానికి వెళ్లిన పోలీసులతో 'ఇక్కడ ఆడవాళ్లకు రక్షణ లేదా? పోలీసులు టార్చర్ చేస్తున్నారు.. ప్రధాని మోదీ, తమిళనాడు సీఎం స్టాలిన్ స్పందించండి’ అంటూ అరుస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అంతేగాక ప్రతి ఒక్కరూ, పోలీసులు నన్ను టార్గెట్ చేస్తున్నారు. నన్ను టచ్ చేస్తే కత్తితో పొడుచుకుని ఆత్మహత్య చేసుకుంటాను అంటూ బెదిరించింది. ముఖ్యమంత్రి, ప్రధాని మోదీ.. ఇది తమిళనాడు పోలీసులు చేస్తున్న హింస అంటూ చెప్పుకొచ్చింది. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అయింది. ఇదంతా ఇలా ఉంటే చాలా రోజుల తర్వాత ఈ కేసుపై చెన్నై కోర్టు తీర్పు ఇచ్చింది. ఇప్పటివరకూ మీరా ఒక్క విచారణకు కూడా హాజరు కాకపోవడంతో ఆమెను అరెస్ట్ చేసి ఏప్రిల్ 4న కోర్టులో హాజరు పర్చాల్సిందిగా పోలీసులకు ఆదేశించింది. ఇప్పటిదాకా ఇంతలా రచ్చ చేసిన ఈ అమ్మడు ఈసారి ఏం చేస్తుందో చూడాలి. -
మాటలు జాగ్రత్త! తేడా వస్తే అంతే.. ఇలా వచ్చి అలా తలపై కోడిగుడ్డుతో...
France Presidential Candidate Sparked Raging Controversy: రాజకీయ నాయకులు లేదా ప్రముఖ సెలబ్రెటీలు ఏవైనా అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడూ ప్రజలు వాటిని ఖండించడం, నిరసనలు వ్యక్తం చేయడం మాములే. అంతేగానీ కోడిగుడ్లు, టమాటాతో దాడి వంటివి జరగవు. ఎప్పుడో ఏదైనా అనుహ్య పరిణామాల్లో తప్ప ఇలాంటి ఘటనలు ఎదురవ్వవు. కానీ అలాంటి పరాభవం ఫ్రాన్స్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ఒక రాజకీయ నాయకుడికి జరిగింది. పైగా ఎన్నికల ప్రచారంలో ఈ ఘటన ఎదురైంది. వివరాల్లోకెళ్తే...ఫ్రాన్స్కు చెందిన ఫార్ రైట్ ప్రెసిడెంట్ అభ్యర్థి ఎరిక్ జెమ్మూర్ ఎన్నికల ప్రచార నిమిత్తం మోయిసాక్ నగరానికి కారులో వస్తున్నాడు. ఇంతలో జెమ్ముర్ చేరుకోవాల్సిన నగరం రావడంతో కారు దిగేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇంతలో ఒక వ్యక్తి కోడి గుడ్డుతో దాడి చేసి పరారయ్యేందుకు ప్రయత్నించాడు. అయితే అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. నిజానికి రాజకీయ పరిజ్ఞానం లేని జెమ్మూరు గత నవంబర్లో ఎన్నికల్లో అధ్యక్షుడి పదవికీ పోటీ చేస్తున్నట్లు ప్రకటించాడు. అందులో భాగంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నప్పుడు దివ్యాంగ పిల్లలు సాధారణ ప్రభుత్వ పాఠశాలలకు బదులుగా ప్రత్యేక పాఠశాలలకు వెళ్లాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఉపాధ్యాయుల బృందాన్ని ఉద్దేశించి ఈ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. పైగా దివ్యాంగ పిల్లలు ఇతర పిల్లలచే ఇబ్బందులకు గురవుతారని, అందులోనూ పేద విద్యార్థులు మరింత ఇబ్బందులు ఎదుర్కుంటారు కాబట్టి వారికి ప్రత్యేక పాఠశాలలు ఉండాలని అన్నారు. జెమ్మూర్ వ్యాఖ్యలపై ఫ్రాన్స్ అధ్యక్షుడు కూడా ఆగ్రహాం వ్యక్తం చేశారు. ప్రజలు కూడా ఆయనపై కోపంగా ఉన్నారు. అయితే తాజాగా ఒక వ్యక్తి ఆయన చేసిన వ్యాఖ్యలకు కోపంతో జెమ్మూర్ ప్రయాణిస్తున్న కారుని వెంబడించి మరీ వచ్చి కోడి గుడ్లతో దాడి చేశాడు. దీంతో అక్కడ ఉన్నవారందరూ ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై అతన్ని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అయితే విచారణలో ఆ దాడి చేసిన వ్యక్తికి ఉన్న కొడుకు దివ్వాంగుడని తెలిసింది. ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల సమయంలో ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. ▶️Éric Zemmour a été visé par un œuf qu'un homme lui a claqué sur la tête à son arrivée à Moissac, où le candidat d'extrême droite battait campagne samedi matin pour la présidentielle pic.twitter.com/oChOUxVBcU — LN24 (@LesNews24) March 12, 2022 (చదవండి: అత్యంత వృద్ధ జంట...వాళ్లుకు ఇది ఎన్నో వివాహ వార్షికోత్సవమో తెలుసా!) -
పవన్కల్యాణ్ను మళ్లీ టార్గెట్ చేసిన ఆర్జీవీ.. ట్వీట్స్ వైరల్
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి పవన్ కల్యాణ్ టార్గెట్ చేస్తూ వరుస ట్వీట్లు చేశారు. ఆయన్ని పాన్ ఇండియా స్టార్గా చూడాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. పవన్-రానా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న భీమ్లానాయక్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని కోరారు. ఇటీవలె విడుదల పుష్ప హిందీలో భారీ వసూళ్లు రాబట్టి మంచి సక్సెస్ సాధించిందని, మరి భీమ్లానియక్ ఇంకెంత కలెక్ట్ చేయాలి అంటూ ప్రశ్నించారు. ఇటీవలె అల్లు అర్జున్ గురించి పెట్టిన ట్వీట్స్ అన్నీ వోడ్కా టైంలో పెట్టాను. కానీ నేను ఇప్పుడు పెట్టిన ఈ ట్వీట్స్ నా కాఫీ టైంలో పెడుతున్నా. దీన్ని బట్టి నా సీరియస్ నెస్ని అర్థం చేసుకోండి. ఎప్పుడో మీ తర్వాత వచ్చిన ఎన్టీఆర్, రామ్చరణ్లు పాన్ ఇండి స్టార్లుగా అయిపోతుంటే, మీరు ఇంకా తెలుగులోనే సినిమాలు చేయడం మాకు బాధగా ఉంది. దయచేసి భీమ్లానాయక్ని పాన్ ఇండియా మూవీగా విడుదల చేయండి అని వర్మ వరుస ట్వీట్లతో హీటెక్కించారు. ప్రస్తుతం పవన్పై వర్మ చేసిన ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఎప్పుడో మీ తర్వాత వచ్చిన పిల్లలు @tarak9999 , @AlwaysRamCharan కూడా పాన్ ఇండియా స్టార్స్ అయిపోతూ ఉంటే, మీరు ఇంకా ఒట్టి తెలుగు ని పట్టుకుని వేలాడటం మీ ఫ్యాన్స్ అయిన మాకు కన్నీటి ప్రాయంగా ఉంది.దయచేసి భీమ్లా నాయక్ ని పాన్ ఇండియా తీసుకెళ్ళి మీరే సబ్కా బాప్ అని ప్రూవ్ చెయ్యండి — Ram Gopal Varma (@RGVzoomin) January 31, 2022 … @allu_arjun గురించి నా ట్వీట్స్ అన్నీ నా వోడ్కా టైం లో పెట్టాను కానీ నేను ఇప్పుడు పెట్టిన ఈ ట్వీట్స్ నా కాఫీ టైం లో పెడుతున్నా. దీన్ని బట్టి నా సీరియస్ నెస్ ని అర్థం చేసుకోండి @PawanKalyan — Ram Gopal Varma (@RGVzoomin) January 31, 2022 పుష్ప యే అంత చేస్తే పవర్ స్టార్ @PawanKalyan అయిన మీరు నటించిన భీమ్లా నాయక్ ఇంకా ఎంత కలెక్ట్ చెయ్యాలి? ..పాన్ ఇండియా సినిమా లాగా రిలీజ్ చెయ్యకపోతే మీ ఫ్యాన్స్ అయిన మేమంతా బన్నీ ఫ్యాన్స్ కి ఆన్సర్ చెయ్యలేము — Ram Gopal Varma (@RGVzoomin) January 31, 2022 . @pawankalyan గారూ ,ఆ రోజు సర్దార్ గబ్బర్ సింగ్ని హిందీలో రిలీజ్ చెయ్యొద్దు వర్కవుట్ అవ్వదు, అని ఈ ట్రిట్టర్ సాక్షిగా ఎంత మొత్తుకున్నా మీరు వినలేదు.. ఫలితం చూసారు...ఇప్పుడు మళ్లీ చెప్తున్నా .. భీమ్లా నాయక్ ఏ మాత్రం తగ్గకుండా పాన్ ఇండియా రిలీజ్ చెయ్యండి..పవర్ ప్రూవ్ చెయ్యండి. — Ram Gopal Varma (@RGVzoomin) January 31, 2022 -
దేవుడిపై అనుచిత వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన నటి
Shweta Tiwari Apologies After Her Derogatory Comments On God: ప్రముఖ హిందీ సీరియల్ శ్వేతా తివారీ దేవుడిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్న సంగతి తెలిసిందే. దేవుడిపై ఆమె చేసిన కామెంట్స్ వివాదాస్పదం అవుతుండటంతో తప్పు తెలుసుకుంది. తాను ఉద్దేశపూర్వకంగా అలాంటి వ్యాఖ్యలు చేయలేదని, అంతేకాకుండా తన మాటలను వక్రీకరించారని పేర్కొంది. సహ నటుడు సౌరబ్ పాత్రను ఉద్దేశించి చేసిన కామెంట్స్ని దేవుడితో ముడిపెట్టారని ఆవేదన వ్యక్తం చేసింది. తాను దేవుడ్ని విశ్వసిస్తానని, తన వ్యాఖ్యలు ఎవరి మనోభావాలనైనా నొప్పించి ఉంటే క్షమాపణలు చెబుతున్నట్లు ప్రకటన విడుదల చేసింది. కాగా ఓ వెబ్సిరీస్ ప్రమోషన్స్లో భాగంగా శ్వేత భగవంతుడిపై జోక్ చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే భోపాల్లోని శ్యామల హిల్స్ పోలీస్ స్టేషన్లో ఆమెపై కేసు కూడా నమోదైంది. -
దాడి, వివాదంపై స్పందించిన సింగర్ సునీత భర్త రామ్ వీరపనేని
Singer Sunitha Husband Ram Veerapaneni Reacts On Controversy: సింగర్ సునీత భర్త, వ్యాపారవేత్త రామ్ వీరపనేని గత కొన్ని రోజులుగా ఓ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఆయన సొంతంగా 'మ్యాంగో మాస్ మీడియా' పేరుతో డిజిటల్ కంపెనీని నిర్వహిస్తున్నారు. ఇందులో కొన్ని సినిమాల డిజిటల్ రైట్స్ కొని వాటిని తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా రిలీజ్ చేస్తుంటారు. అయితే రీసెంట్గా అలా కొనుగోలు చేసి విడుదల చేసిన సినిమాలోని ఓ సన్నివేశంలో గౌడ కులానికి చెందిని మహిళలను కించపరిచే విధంగా, అభ్యంతరకర రీతిలో చూపించారంటూ ఆ కులానికి చెందిన కొందరు మ్యాంగో వీడియా ఆఫీస్కు వెళ్లి వాగ్వాదానికి దిగిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. తాజాగా ఆ దాడి, ఆ తర్వాత జరిగిన పరిణామాలపై మ్యాంగో మీడియా స్పందించింది. 'ఈనెల24న గౌడ కులానికి చెందిన వాళ్లమంటూ కొందరు వచ్చారు. ఒక సినిమాలోని వీడియో క్లిప్పింగ్పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఆ కంటెంట్ను యూట్యూబ్ నుంచి తొలగించాలని కోరారు. కానీ సదరు సినిమా అప్పటికే సెన్సార్ సర్టిఫికేట్ ద్వారా థియేటర్స్లో విడుదలై, ఆ తర్వాత యూట్యూబ్లోకి అందుబాటులోకి వచ్చింది. అయినప్పటికీ స్త్రీలను కించపరుస్తూ చూపించే ఉద్దేశం తమకు లేనందున వారు చెప్పిన రోజునే దాన్ని యూట్యూబ్ నుంచి తొలగించాం. అయితే ఆ వీడియో వల్ల ఎవరి మనోభావాలైనా పొరపాటున నొప్పించి ఉంటే భేషరతుగా క్షమాపణలు తెలియజేస్తున్నాము' అంటూ ప్రకటనలో పేర్కొన్నారు. -
చదువుపై అలా... మద్యంపై ఇలా..!!
-
ఆ వ్యాఖ్యలతో ఆ పార్టీ పరువు పోయింది!
-
సన్నీపై పూజారుల ఆగ్రహం.. మధు'బ్యాన్' చేయాలని డిమాండ్
Priest Protest Against On Sunny Leone Dance In Madhuban Song: సినిమాలు, సినిమాల్లోని కొన్ని పాటలు, సన్నివేశాలు ప్రేక్షకుల మనసులకు హత్తుకుపోతాయి. అలాంటి చిత్రాలను ఎంతగానో ఆదరించి సూపర్ హిట్ చేస్తారు ఆడియెన్స్. ఇలా హిట్టు ఇవ్వడమే కాకుండా వారి మనోభావాలను కించపరిస్తే అదే రేంజ్లో ఫట్మనిపిస్తారు కూడా. ఇలా కాంట్రవర్సీల మధ్య చిక్కుకుని ఫట్టయిన సాంగ్స్, సీన్స్, మూవీస్ ఎన్నో ఉన్నాయి. తమ సంస్కృతి మనోభావాలు, ప్రతిష్ట దెబ్బతీసేలా అసభ్యంగా ఉన్నాయని విరుచుకుపడిన వారూ ఉన్నారు. తాజాగా బాలీవుడ్ నటి, మోడల్ సన్నీ లియోన్ ఇలాంటి వివాదంలోనే చిక్కుకుంది. ఇటీవల సన్నీ లియోన్ నటించిన 'మధుబన్ మే రాధిక నాచే' వీడియో ఆల్బమ్ విడుదలైంది. ఇందులో సన్నీ హాట్ హాట్గా పర్ఫామెన్స్ ఇచ్చింది. ఇప్పుడు ఆ పర్ఫామెన్సే ఆమెపై వ్యతిరేకత తీసుకొచ్చింది. ఉత్తర ప్రదేశ్లోని ప్రవిత్ర స్థలాల్లో ఒకటైన 'మధుర'కు చెందిన పూజారులు ఆ పాటపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వీడియో ఆల్బమ్ను నిషేధించాలని మండిపడుతున్నారు. ఈ పాటలో సన్నీ లియోన్ చేసిన అశ్లీల నృత్యం తమ మతపరమైన మనోభావాలను కించపరిచేలా ఉందని ఆరోపించారు. సన్నీపై ప్రభుత్వం చర్యలు తీసుకుని, ఆల్బమ్ను నిషేధించకుంటే కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు బృందావన్కు చెందిన సంత్ నావల్ గిరి మహారాజు. అలా డ్యాన్స్ చేసినందుకు సన్నీ లియోన్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని, అలా చేయకుంటే భారత దేశంలో ఉండనివ్వకూడదన్నారు. అలాగే అఖిల భారతీయ తీర్థ పురోహిత్ మహాసభ జాతీయ అధ్యక్షుడు మహేష్ పాఠక్ కూడా 'మధుబన్ మే' సాంగ్లో సన్నీ డ్యాన్స్ను తప్పుబట్టారు. అలా అవమానకర రీతిలో నృత్యం చేయడం ద్వారా 'బ్రిజ్భూమి' ప్రతిష్టను దెబ్బతీసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనికా కపూర్, అరిందమ్ చక్రవర్తి పాడిన ఈ పార్టీ నంబర్ను సరేగమ మ్యూజిక్ 'మధుబన్' పేరుతో బుధవారం (డిసెంబర్ 22) విడుదల చేసింది. ఈ పాటలో కృష్ణుడు, రాధల మధ్య ఉన్న ప్రేమను తెలియజేసేలా ఉండగా.. సన్నీ లియోన్ బాడీ మూమెంట్స్ హిందూ మనోభావాలను కించపరిచేలా ఉందని నెటిజన్లు కూడా ఫైర్ అయ్యారు. 1960లో కోహినూర్ సినిమాలో మహమ్మద్ రఫీ ఆలపించిన ఈ పాటను రీమేక్ చేశారు. ఇదీ చదవండి: సన్నీ లియోన్ లుంగీ డ్యాన్స్ చూశారా?.. స్టెప్పులు అదిరాయిగా! -
తెలుగుదేశం పార్టీ పతనానికి పరాకాష్ట
అధికారానికి దూరంగా ఉన్నంత మాత్రాన... ఒక రాజకీయ పార్టీ ఇంతలా పతనమైపోవటమన్నది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేదు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో అధికార ప్రతినిధిని కూర్చోబెట్టి... గజ్జి సోకిన గ్రామ సింహంలా మొరిగించిన వైనంపై రాష్ట్రంలో తీవ్ర స్థాయి ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. అఖండ ప్రజాదరణతో సీఎం పీఠంపై కూర్చున్న నాయకుడిని ఉద్దేశించి ‘లం****’ (బోసిడీకే) అని పదేపదే బూతులు తిట్టించడంతో సీఎంను అభిమానించేవారు... వైఎస్సార్ సీపీ మద్దతుదారులు గట్టిగా ప్రతిస్పందించారు. ఎక్కడికక్కడ నిరసనలకు దిగారు. ఇంత జరిగినా... పశ్చాత్తాప పడని టీడీపీ అధ్యక్షుడు... దీన్ని రాజకీయంగా ఉపయోగించుకోవటానికి మరో ఎత్తుగడకు దిగారు. బుధవారం రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చారు. ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే... రీతిన ఆయనిచ్చిన పిలుపు ఒక బడ్డీ కొట్టును.. ఆఖరికి ఆయన హెరిటేజ్ దుకాణాల్ని కూడా మూయించలేకపోయింది. ఇప్పుడాయన 36 గంటల దీక్ష.. వరస లేఖలు.. కేంద్ర హోం మంత్రితో సమావేశమంటూ రకరకాల ఎత్తుగడలకు దిగుతున్నారు. పవిత్రమైన నిరాహారదీక్ష ఆయుధాన్ని పచ్చి బూతులకు మద్దతుగా ప్రయోగిస్తున్నారు. పరిధి దాటిన పట్టాభి సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉద్రిక్తతలు, అల్లర్లు సృష్టించేందుకు టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి అన్ని పరిధులు అతిక్రమించారని, ఆయన దుర్భాషల తరువాతే కొన్ని చోట్ల ఘర్షణలు తలెత్తాయని డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. ‘రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఉద్దేశించి పట్టాభి దారుణమైన భాషలో మాట్లాడారు. టీడీపీ కార్యాలయం నుంచే ఆయన ముఖ్యమంత్రిని దుర్భాషలాడారు. అదేదో ఆవేశంలో నోరుజారి మాట్లాడింది కూడా కాదు. ఉద్దేశపూర్వకంగానే పదేపదే దారుణంగా దూషించారు’ అని డీజీపీ స్పష్టం చేశారు. మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో డీజీపీ సవాంగ్ బుధవారం మీడియాతో మాట్లాడారు. ఈ కుట్ర చంద్రబాబుదే నెల రోజులుగా పథకం ప్రకారం.. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి లాంటి వారిని ఉద్దేశించి దుర్భాషలాడటం తీవ్రమైన నేరమని, ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ స్పష్టం చేశారు. రాజకీయాల్లో, ప్రజాజీవితంలో ఇంతటి దారుణమైన భాష ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదన్నారు. రాజకీయ పార్టీలు నైతిక విలువలకు కట్టుబడి హుందాగా వ్యవహరించాలని సూచించారు. ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాల్జేసేందుకు నెల రోజులుగా ఓ పథకం ప్రకారం మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న అసత్య ఆరోపణలు, దూషణలు అన్నింటినీ సమగ్రంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. పట్టాభి దుర్భాషలు, తదనంతర పరిణామాలపైనా దర్యాప్తు జరుపుతున్నామన్నారు. దుర్భాషలపై జనాగ్రహం దశాబ్దాల సమస్య రాష్ట్రంలో గంజాయి అక్రమ రవాణా దశాబ్దాలుగా ఉన్న సమస్య అని చెప్పారు. ఆంధ్ర–ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టుల ప్రాబల్యం ఉండటంతో దశాబ్దాలుగా గంజాయి సాగు సాగుతోందన్నారు. గత రెండేళ్లుగా అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని, ప్రత్యేకంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. గతంలో కంటే పోలీసులు విస్తృతంగా దాడులు నిర్వహిస్తూ పెద్ద ఎత్తున కేసులు నమోదు చేస్తున్నారని చెప్పారు. రెండేళ్ల క్రితం వరకు గంజాయి స్మగ్లింగ్పై కఠిన చర్యలు ఉండేవి కావన్నారు. గంజాయి అక్రమ రవాణాపై 2018లో రాష్ట్రంలో 579 కేసులు నమోదు చేసి 2,174 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోగా 2021లో ఇప్పటికే 1,456 కేసులు నమోదు చేసి 4,059 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. అక్రమ రవాణాపై ప్రభుత్వం, పోలీసు శాఖ కఠినంగా వ్యవహరిస్తోందనడానికి ఈ గణాంకాలే నిదర్శనమని చెప్పారు. టీడీపీ బంద్ను పట్టించుకోని ప్రజలు స్పందించలేదనడం సరికాదు.. ప్రతిపక్ష నేత చంద్రబాబు ఫోన్ చేస్తే తాను స్పందించలేదన్న ఆరోపణలను డీజీపీ ఖండించారు. మంగళవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో తాను పోలీస్ పరేడ్ పర్యవేక్షిస్తుండగా ఓ నంబర్ నుంచి వాట్సాప్ కాల్ వచ్చిందన్నారు. పరేడ్ జరుగుతుండటంతో ఎవరు మాట్లాడుతున్నారో సరిగా వినిపించలేదన్నారు. ఘర్షణ విషయంపై జిల్లా ఎస్పీతో మాట్లాడాలని సూచించినట్లు చెప్పారు. టీడీపీ నేతలు ఫోన్ చేస్తే గుంటూరు ఎస్పీ, మంగళగిరి రూరల్ పోలీసులు స్పందించి తగిన చర్యలు తీసుకున్నారని తెలిపారు. పోలీసులు స్పందించలేదని టీడీపీ నేతలు విమర్శలు చేయడం సహేతుకం కాదన్నారు. పట్టాభి చేసింది తప్పే.. -
వివాదంలో చిక్కుకున్న పంత్.. మందలించి వదిలిపెట్టిన అంపైర్లు
లీడ్స్: భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ రెండో రోజు ఆటలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ నిబంధనలు అతిక్రమించాడు. అలా జరగడం తొలిసారి కావడంతో అంపైర్లు అతన్ని మందలించి వదిలి పెట్టారు. వివరాల్లోకి వెళితే.. మెరిల్బోన్ క్రికెట్ క్లబ్(ఎంసీసీ) నిబంధనలకు విరుద్దంగా పంత్.. తన కీపింగ్ గ్లోవ్స్కు టేప్ చుట్టుకుని వివాదంలో చిక్కుకున్నాడు. ఇది గుర్తించిన థర్డ్ అంపైర్.. ఫీల్డ్ అంపైర్లకు సమాచారం ఇవ్వడంతో వారు పంత్ను మందలిస్తూ.. కెప్టెన్ కోహ్లి సమక్షంలో టేప్ను తొలగించారు. మూడో రోజు ఆట చివరి సెషన్ ప్రారంభానికి ముందు ఇది జరిగింది. ప్రస్తుతం ఈ అంశంపై సోషల్మీడియా వ్యాప్తంగా విపరీతమైన చర్చ నడుస్తోంది. పంత్ చీటింగ్కు పాల్పడ్డాడంటూ ఇంగ్లండ్ అభిమానులు దుమ్మెత్తిపోస్తున్నారు. చదవండి: ఇంకా రెండు మ్యాచ్లున్నాయ్! దిగులెందుకు.. కాగా, ఎంసీసీ 27.2.1 నిబంధన ప్రకారం వికెట్ కీపింగ్ గ్లోవ్స్కు టేప్ వేయకూడదు. ముఖ్యంగా చూపుడు వేలు, బొటన వేలు మినహాయించి ఇతర వేళ్ల మధ్య వెబ్బింగ్(టేప్ చుట్టడం) చేయకూడదు. అలా చేస్తే కీపర్కు అడ్వాంటేజ్గా ఉంటుంది. కానీ పంత్ తన గ్లోవ్స్కు టేప్ చుట్టుకోవడంతో అంపైర్ అలెక్స్ వార్ఫ్.. అతన్ని మందలించి నిబంధనలకు విరుద్దమని చెప్పాడు. ఇదిలా ఉంటే, పంత్ వెబ్బింగ్ ఘటన గుర్తించక ముందు( ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 94 ఓవర్లో) ఇంగ్లండ్ ఆటగాడు డేవిడ్ మలాన్(70) కీపర్ క్యాచ్గా ఔటయ్యాడు. దీంతో మలాన్ను నాటౌట్గా పరిగణించి వెనక్కి రప్పించాలని కామెంటేటర్ డేవిడ్ లాయడ్ డిమాండ్ చేశాడు. పంత్ నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించాడు కాబట్టి అంపైర్లు జోక్యం చేసుకుని మలాన్ను నాటౌట్గా ప్రకటించాలని కోరాడు. కాగా, 423/8 ఓవర్నైట్ స్కోర్తో మూడో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ మరో 9 పరుగులు మాత్రమే జత చేసి 432 పరగుల వద్ద ఆలౌటైంది. ఓవర్నైట్ బ్యాట్స్మెన్ ఒవర్టన్(32) తన ఓవర్నైట్ స్కోర్కు మరో 8 పరుగులు జోడించి షమీ బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోగా.. మరో ఓవర్నైట్ బ్యాట్స్మన్ ఓలీ రాబిన్సన్ను బుమ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో రూట్ సేనకు 354 పరుగుల ఆధిక్యం లభించింది. భారత బౌలర్లలో షమీ 4, జడేజా, సిరాజ్, బుమ్రా తలో 2 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. కపడటి వార్తలు అందేసరికి కేఎల్ రాహుల్(8) వికెట్ నష్టపోయి 35 పరుగులు చేసింది. చదవండి: మనతో ఆట అంటే మజాకా.. రికార్డులు బద్దలవ్వాల్సిందే..! -
రాజస్తాన్ క్రికెట్లో 'తాలిబన్' జట్టు కలకలం
జైపూర్: తాలిబన్.. ఇప్పుడు ఈ పేరు అఫ్గన్లో హడలెత్తిస్తుంది. అఫ్గనిస్తాన్లో దాదాపు రెండు దశాబ్దాల తర్వాత తాలిబన్ల అరాచక పాలన మొదలవడంతో అక్కడి ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. తాలిబన్ పాలన మొదలయినప్పటి నుంచి అఫ్గన్లో రోజుకో వార్త వెలుగుచూసింది. అలాంటి తాలిబన్ పదం రాజస్తాన్ క్రికెట్లో కలకలం రేపింది. విషయంలోకి వెళితే రాజస్తాన్లోని జైసల్మేర్ జిల్లాలోని బినియానా గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. చదవండి: ఇంగ్లండ్ గడ్డపై తొలి టెస్టు సిరీస్ విజయానికి 50 ఏళ్లు ఈ టోర్నమెంట్లో ఒక ఊరు 'తాలిబన్' పేరుతో పాల్గొంది. పోఖ్రాన్కు 36 కిమీ దూరంలో ఉన్న ఆ ఊరిలో ముస్లింలు ఎక్కువగా ఉన్నారు. కాగా టోర్నమెంట్లో ఒక జట్టు తాలిబన్ పేరు పెట్టుకోవడంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో అప్రమత్తమైన టోర్నీ నిర్వాహకులు తాలిబన్ జట్టును టోర్నీ నుంచి తొలగించి క్షమాపణలు చెప్పుకున్నారు. '' తొలుత తాలిబన్ పేరుతో జట్టు ఉన్నట్లు తాము గుర్తించలేకపోయామని.. మ్యాచ్లో భాగంగా స్కోర్ను ఎంటర్ చేసే క్రమంలో గమనించాం. వెంటనే సదరు జట్టును టోర్నీ నుంచి తొలగించామని.. దేశానికి క్షమాపణలు చెబుతూ.. లీగ్ తరపున ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటామని'' నిర్వాహకులు పేర్కొన్నారు. కాగా నిషేధం విధించిన తాలిబన్ జట్టు టోర్నమెంట్లో తొలి మ్యాచ్ ఆడడం విశేషం. చదవండి: Mark Boucher: 'నా ప్రవర్తనకు సిగ్గుపడుతున్నా.. క్షమించండి' -
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ముదురుతున్న వివాదం
-
పోస్టుల్లేకపోయినా పదోన్నతులు!
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యా మండలిలో పదోన్నతులు వివాదాస్పదమవుతున్నాయి. ప్రస్తుతం పని చేస్తున్న ఉద్యోగులకు పదోన్నతులు ఇచ్చేందుకు అవసరమైన పోస్టులు లేవని, వారు పని చేస్తున్న పోస్టులనే అప్గ్రేడ్ చేశారన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఉన్నత విద్యా మండలికి చెందిన పాలక మండలి ఆమోదం కానీ, అటు ప్రభుత్వ ఆమోదం తీసుకోకుండానే ఇష్టానుసారంగా పదోన్నతులు కల్పించారన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. 12 మందికి పదోన్నతులు మండలిలో జాయింట్ సెక్రటరీ పోస్టు లేకపోయినా ప్రస్తుతం పనిచేస్తున్న డిప్యూటీ సెక్రటరీకి జాయింట్ సెక్రటరీ స్థాయిలో పదోన్నతి కల్పించి, ఆయనకు ఫైనాన్స్ ఆఫీసర్ పోస్టు కట్టబెట్టారని, అది నిబంధనలకు విరుద్ధమనే వాదనలు విన్పిస్తున్నాయి. అలాగే మండలిలో ప్రస్తుతం ఒకటే అసిస్టెంట్ సెక్రటరీ పోస్టు ఉంది. దానికి తోడు మరొక పోస్టును అసిస్టెంట్ సెక్రటరీ పోస్టుగా అప్గ్రేడ్ చేసి ఆ పోస్టుల్లో ఇద్దరికి పదోన్నతులు కల్పించినట్లు తెలిసింది. అలాగే సూపరింటెండెంట్ పోస్టు ఒకటే ఉన్నప్పటికీ, మరో నాలుగు పోస్టులను అప్గ్రేడ్ చేసి మొత్తంగా ఐదుగురికి పదోన్నతులు కల్పించారు. అయితే అందులో ఇద్దరు ఆ పదోన్నతులను తిరస్కరించినట్లు తెలిసింది. ఇలా మొత్తంగా 12 మందికి పదోన్నతులు కల్పించారు. అయితే 1994 ఫిబ్రవరి 14వ తేదీన అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన ఉన్నత విద్యా మండలి పోస్టుల భర్తీ విధానానికి సంబంధించిన జీవో 51 లో ఫైనాన్స్ ఆఫీసర్ పోస్టు భర్తీ ప్రక్రియ ఉంది. ఆ పోస్టును డిప్యూటీ డైరెక్టర్ స్థాయి వారికి పదోన్నతి కల్పించి భర్తీ చేయవచ్చని ప్రభుత్వం పేర్కొంది. కానీ ఫైనాన్స్ ఆఫీసర్ పోస్టు మండలిలో లేదు. దీంతో ఆ పోస్టు జోలికి ఎవరూ వెళ్లలేదు. ఏ పోస్టునూ అప్గ్రేడ్ చేయలేదు: కార్యదర్శి ఈ వ్యవహారంపై ఉన్నత విద్యా మండలి కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసరావును వివరణ కోరగా.. ప్రభుత్వం అన్ని శాఖల్లో పదోన్నతులు కల్పించాలని చెప్పిందన్నారు. అందులో భాగంగానే తాము ఏడేళ్లుగా పనిచేస్తున్న తమ సిబ్బందికి పదోన్నతులు కల్పించామని తెలిపారు. ఏ పోస్టును కూడా ఆప్గ్రేడ్ చేయలేదని, వ్యక్తిగత పదోన్నతులు మాత్రమే ఇచ్చామని చెప్పారు. -
జొమాటో వివాదం : ఇదట సంగతి...ఫన్నీ వీడియో వైరల్
సాక్షి, బెంగళూరు: ఫుడ్ డెలివరీ ప్లాట్ఫాం జొమాటో గత కొన్ని రోజులుగా మరోసారి వార్తల్లో నిలిచింది. జొమాటో డెలివరీ ఎగ్జిక్యూటివ్, యువతిపై దాడి వివాదం సృష్టించిన సంచలనం ఇంతా అంతా కాదు. జొమాటో బాయ్ తనపై దాడి చేశాడంటూ బెంగళూరు యువతి రక్తమోడుతున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది మొదలు రోజుకొక కొత్త వెర్షన్ వెలుగులోకి వస్తోంది. దీంతో నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు. బాలీవుడ్ హీరోయిన్ సహా కొంతమంది హితేషా చంద్రాణీకి మద్దతిస్తోంటే.. మరికొందరు డెలివరీ బాయ్కు అండగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక దశలో చంద్రాణిపై భారీ ట్రోలింగే నడిచింది. అటు తనకే పాపం తెలియదని, తనకు హయ్యస్ట్ రేటింగ్ ఉందంటూ జొమాటో బాయ్ కామరాజ్ వాదిస్తున్నారు. కేసులు నమోదైనాయి. విచారణ జరుగుతోంది. ఈ వివాదం ఇలా నడుస్తుండగానే ప్రస్తుతం సోషల్ మీడియాలో మీమ్స్, ఫన్నీ వీడియోస్ హల్చల్ చేస్తున్నాయి. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. (యువతిపై జొమాటో బాయ్ పిడిగుద్దులు: వైరల్) -
'తాండవ్' వివాదం.. నాలుక కోస్తే రూ. కోటి రివార్డు
ముంబై : సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన ‘తాండవ్’ వెబ్ సరీస్పై నిరసనల సెగ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ వెబ్సిరీస్లో హిందూ దేవుళ్లను కించపర్చారని, ప్రజల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. తాజాగా మహారాష్ట్ర కర్ణి సేన చీఫ్ అజయ్ సెంగర్ తాండవ్ను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందూ దేవుళ్లను అవమానించిన వారి నాలుక కోసినవారికి కోటి రూపాయల రివార్డు వరిస్తుందని ప్రకటించారు. తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఇప్పటికే చిత్ర బృందం క్షమాపణలు కోరినా ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని అజయ్ సెంగర్ అన్నారు. (తాండవ్పై శివాలెత్తుతున్న నెటిజన్లు) ఇది వరకే తాండవ్ రూపకర్తలు, అమెజాన్ ఇండియా ఉన్నతాధికారిపై ఉత్తరప్రదేశ్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అమెజాన్ ఇండియా హెడ్ ఆఫ్ ఒరిజినల్ కంటెంట్ అపర్ణ పురోహిత్, వెబ్సిరీస్ దర్శకుడు అలీ అబ్బాస్, నిర్మాత హిమాన్షు కృష్ణ మెహ్రా, రచయిత గౌరవ్ సోలంకీ, మరో వ్యక్తిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అటు సోషల్ మీడియాలోనూ నెటిజన్లు తాండవ్ సిరీస్ మీద శివాలెత్తుతున్నారు. తమ దేవుళ్లను ఎగతాళి చేశారని మండిపడుతున్నారు. తాండవ్ను బహిష్కరించాలంటూ సోషల్ మీడియాలో ‘బాయ్కాట్ తాండవ్’, ‘బ్యాన్ తాండవ్’ హ్యాష్ట్యాగ్లను కూడా వైరల్ చేస్తున్నారు. జనవరి 15న అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదలైన తాండవ్ వెబ్ సిరీస్లో డింపుల్ కపాడియా, మహ్మద్ జీషన్ అయూబ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. డైరెక్టర్ అలీ అబ్బాస్ జాఫర్ సినిమాను తెరకెక్కించగా ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. (తాండవ్ వివాదం: కొత్త ఇంటికి మారనున్న సైఫ్!) -
హిందీ రాకుంటే దేశం విడిచి వెళ్లిపోవాలా?
బెంగుళూరు : హిందీ భాషపై తమిళనాడులో తీవ్ర వివాదం చెలరేగుతూనే ఉంది. తమిళ వైద్యులకు హిందీ తెలియదని ఆయుష్మాన్ భారత్ కార్యదర్శి రాజేష్ కోట్చే వ్యవహరించిన తీరు తమిళనాట ఆగ్రహాన్ని రేపింది. హిందీ రాకుంటే శిక్షణా కార్యక్రమం నుంచి బయటకు వెళ్లాలంటూ వ్యాఖ్యలు చేసిన రాజేష్ కొట్చేపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందీ రానంత మాత్రానా ఇతర భాషల వాళ్లు దేశం విడిచి వెళ్లిపోవాలా అంటూ ఫైర్ అయ్యారు. దేశ ఐక్యత సమాఖ్యవాదంపై ఆధారపడి ఉంటుందని, భారత్లో అన్ని భాషలు సమానమేనని అన్నారు. హిందీ అర్థం కాకుంటే వెళ్లిపోండి అనడం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని, ఇది రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగించేలా మాట్లాడిన ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కుమారస్వామి డిమాండ్ చేస్తూ వరుస ట్వీట్లు చేశారు. (ఇది హిందీ ప్రభుత్వం కాదు: కమల్) వివరాల్లోకి వెళ్తె, సెంటర్ ఫర్ డాక్టర్స్ నిర్వహించిన ఆన్లైన్ సమావేశంలో ఆయుష్ యూనియన్ కార్యదర్శి వైద్య రాజేష్ కోటేచా స్పందిస్తూ.. తాను ఇంగ్లీషులో మాట్లాడనని, తాను హిందీలోనే మాట్లాడతానని, హిందీ అర్థం కాని వారు సమావేశం నుంచి వెళ్లిపోవచ్చని తెలిపారు. కాగా ఈ సమావేశానికి తమిళనాడుకు చెందిన 37 మంది ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు పాల్గొన్నారు. యోగా మాస్టర్ ట్రైనర్స్ కోసం ఆయుష్ శాఖ, మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే చాలా సెషన్లు హిందీలో జరిగాయని కొందరు ఆరోపిస్తున్నారు. తమిళ డాక్టర్లను అవమానించేలా ఆయుష్మాన్ భారత్ కార్యదర్శి రాజేష్ కోట్చే వ్యవహరించిన తీరు పట్ల తమిళ పార్టీలు, సంఘాలు తీవ్రంగా ధ్వజమెత్తుతున్నాయి. (హిందీ దుమారం) -
హైదారాబాద్ బస్సు సర్వీసులపై అభ్యంతరం
నిజాంసాగర్(జుక్కల్): సంగారెడ్డి, పటాన్ చెరు మీదుగా హైద్రాబాద్ వెళ్తున్న బాన్సువాడ ఆర్టీసీ బస్సు సర్వీసులపై నారాయణఖేడ్ ఆర్టీసీ డిపో అధికారులు అభ్యంతరం తెలిపారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా నిజాంపేట బస్టాండ్ వద్ద బాన్సువాడ నుంచి హైద్రాబాద్ వెళ్తున్న బస్సులను నారాయణఖేడ్ డిపో అధికారులు అడ్డుకున్నారు. బిచ్కుంద, పిట్లం మీదుగా హైద్రాబాద్కు బాన్సువాడ డిపో నుంచి ఆరు అదనపు బస్సులు నడుపుతూ నారాయఖేడ్, సంగారెడ్డి, హైద్రాబాద్ ఆర్టీసీ డిపోల ఆదాయానికి గండి కొడుతున్నారు. బాన్సువాడ, ఎల్లారెడ్డి, మెదక్ మీదుగా వెళ్లాల్సిన బస్సు సర్వీసులను రద్దు చేసి, సంగారెడ్డి, పటాన్ చెరు మీదుగా బస్సు సర్వీసులను ప్రారంభించడంతో మెదక్, సంగారెడ్డి జిల్లాల ఆర్టీసీ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. బాన్సువాడ నుంచి బస్సు సర్వీసులను నడపడం వల్ల తమ బస్సులకు ఆదాయం తగ్గుతోందని, నష్టాలకు గురికావాల్సి వస్తుందని అధికారులు అంటున్నారు. దీంతో బాన్సువాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులను నిజాంపేటలో నిలిపి, ప్రయాణికులను ఇతర డిపోల బస్సుల్లో హైద్రాబాద్కు తరలించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న బస్సు సర్వీసులను రద్దు చేసుకొవాలని బాన్సువాడ ఆర్టీసీ అధికారులకు వారు సూచించారు. -
వివాదాస్పదులకు డాక్టరేటా?
ఆంధ్ర విశ్వవిద్యాలయం 85వ స్నాతకోత్సవం వివాదాస్పదమవుతోంది. ఈ నెల 31న జరిగే కాన్వొకేషన్ నిర్వహణకు అధికారులు తీసుకుంటున్న పలు నిర్ణయాలు అందరి ఆగ్రహానికి కారణమవుతున్నాయి. స్నాతకోత్సవానికి ముఖ్యఅతిథిని ఆహ్వానించడం, వేదిక మార్పు, కళాప్రపూర్ణల ఎంపిక ప్రక్రియ.. ఇలా ప్రతి అంశం వివాదానికి కేంద్రంగా నిలుస్తోందనడంలో సందేహం లేదు. విశాఖ సిటీ : ఆంధ్రవిశ్వవిద్యాలయానికి తొమ్మిది దశాబ్దాల ఘన చరిత్ర ఉంది. లక్షలాది మంది విద్యార్థులకు అక్షర భిక్ష పెట్టిందీ విద్యా సంస్థ. ఇంతటి విశిష్ట విశ్వవిద్యాలయంలో పాలకులు తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు వర్సిటీకి మచ్చ తెచ్చే విధంగా ఉన్నాయి. ప్రధానంగా స్నాతకోత్సవ ముఖ్య అతిథిగా ఆహ్వానించే వ్యక్తి ఎంతో ప్రముఖుడై ఉండటం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ కుమార్ను పాలకులు ఆహ్వానించారు. విభజన తరువాత ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని, ఇవ్వరాదని కేంద్రానికి చెప్పిన ఆ పెద్దమనిషికి ఏయూ ఎర్ర తివాచీ పరవడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఆయనకు వర్సిటీ గౌరవ డాక్టరేట్ను సైతం ప్రదానం చేయనుండడం అందరి మనో భావాలను దెబ్బ తీయడమే. సమైక్యాంధ్ర, ప్రత్యే క హోదా ఉద్యమాలకు ఊపిరిలూదినది ఏయూ నే. అటువంటి ఉద్యమ గడ్డపై హోదావాదాన్ని పక్కన పెట్టడానికి కారణమైన వ్యక్తికి ఉన్నతాసనం వేసి గౌరవించాలనే నిర్ణయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. బీజేపీతో తమ అనుబంధాన్ని బలోపేతం చేసుకోవడానికే ఏయూ పెద్దలు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ను స్నాతకోత్సవానికి ఆహ్వానిస్తున్నారనే గుసగుసలు వర్సిటీలో వినిపిస్తున్నాయి. దీనిని బహిరంగంగా వ్యతిరేకించడానికి పలు వర్గాలు సిద్ధమవుతున్నాయి. వేదిక మార్పు తగదు స్నాతకోత్సవ వేదిక మార్పు సైతం ఆక్షేపణలకు గురవుతోంది. దశాబ్దాల క్రితం నిర్మించి పదుల సంఖ్యలో స్నాతకోత్సవాలకు వేదికగా నిలచిన కట్టమంచి రామలింగారెడ్డి స్నాతకోత్సవ మంది రాన్ని కాదని.. బీచ్రోడ్డులో హంగు, ఆర్భాటానికి ప్రాధాన్యం ఇస్తూ నిర్మించిన కన్వెన్షన్ కేంద్రంలో కాన్వొకేషన్ నిర్వహించాలని వర్సిటీ అధికారులు తీసుకున్న నిర్ణయం అందరినీ బాధించింది. దీనిపై పాలకమండలి సభ్యులు సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసి, బాహాటంగానే వర్సిటీ అధికారుల నిర్ణయాన్ని తప్పుపట్టినట్టు సమాచారం. స్నాతకోత్సవంలో ముఖ్యఅతిథి, గవర్నర్, ఇతర అతిథులను తోడ్కొని వీసీ సభికుల మధ్య నుంచి వేదికను అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది. కన్వెన్షన్ కేంద్రంలో ఇటా జరగాలంటే మొదటి అంతస్థుకు ఎక్కాల్సిందే. మెట్ల మార్గం లో గవర్నర్ వంటి వ్యక్తిని ఎక్కి రావాలని కోరడం సమంజసం కాదు. దీనితో ఈ ప్రక్రియ నామమాత్రంగా ముగిసే అవకాశం ఉంది. వేదికకు అనుకుని ఉన్న వీవీఐపీ గది వైపు నుంచి మాత్రమే అతిథులు లోనికి ప్రవేశించే అవకాశం ఉంది. ప్రముఖుల విస్మరణ కళాప్రపూర్ణల ఎంపికలో వర్సిటీ అధికారులు ఇష్టారాజ్యంగా, హడావుడిగా నిర్ణయాలు తీసుకున్నారని పలువురు మేధావులు ఆరోపిస్తున్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రముఖులను, సాహితీవేత్తలను విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు సినీ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి, జానపదానికి చిరునామాగా నిలుస్తున్న వంగపండు ప్రసాదరావులకు కళాప్రపూర్ణకు పరిశీలించక పోవడం విచారకరమని పలువురు మేధావులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇంతవరకు కేంద్రం పద్మశ్రీ ఇవ్వకపోయినా కనీసం ఆంధ్రవిశ్వవిద్యాలయమైనా గౌరవించి సముచితంగా సత్కరించి ఉండాల్సిందని వీరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరాంధ్రలో జన్మించి తెలుగు రాష్ట్రాలలో జానపదానికి పెద్ద దిక్కుగా నిలచిన వంగపండు ప్రసాదరావు కళాప్రపూర్ణకు ఏవిధంగా అర్హులు కాదో తెలపాలని వీరు వర్సిటీ అధికారులను ప్రశ్నిస్తున్నారు. విశ్రాంత ఆచా ర్యులు నలుగురైదుగురితో ముందుగానే ప్రత్యే కం కమిటీ వేసి పేర్లు పరిశీలించాల్సిందని సూ చిస్తున్నారు. ఆదరాబాదరాగా ఆరు రోజుల ముందు పాలక మండలి సమావేశం నిర్వహిం చి నలుగురి పేర్లు గవర్నర్ ఆమోదానికి పం పడం సమంజసం కాదనే వాదన వినిపిస్తోంది. -
తెలుపు రంగు స్థానంలో గులాబీ రంగు
బోధన్ : పట్టణంలోని ఆర్టీసీ డిపో ఎదుట తెలంగాణ మజ్దూర్ యూనియన్ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వివాదాస్పదమైంది. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలో పొరపాటు చోటు చేసుకుంది. టీఎంయూ నేతలు ఫ్లెక్సీలో ముద్రించిన జాతీయ పతాకంలో తెలుపు రంగు స్థానంలో గులాబీ రంగు ఉండడం చూసిన వారు నోరెళ్లబెట్టారు. దీన్ని గుర్తించిన ఇతర కార్మిక సంఘం నేతలు జాతీయ పతాకాన్ని అవమానపరిచేలా ఫ్లెక్సీ ఏర్పాటు చేశారని అధికారులకు సమాచారమిచ్చారు. దీంతో డిపో అధికారులు డిపోలోంచి తెలుపు రంగు తీసుకొచ్చి గులాబీ రంగు స్థానంలో అద్దారు. జాతీయ పతాకాన్ని అవమానపరిచిన టీఎంయూ నేతలపై ఫిర్యాదు చేస్తామని ఇతర కార్మిక సంఘాల నేతలు తెలిపారు. -
అగ్ని.. ఆజ్యం.. ఆజాం
ఉత్తరప్రదేశ్ మంత్రివర్గ సభ్యుడు, సమాజ్వాదీ పార్టీ నాయకుడు ఆజాం ఖాన్ అంటే వివాదాల పుట్ట. ఆయన పెంచుకునే పశువులు ఒకసారి ఎటో వెళ్లిపోతే పోలీసు సిబ్బందిని నియమించి వెతికించాడు. అవి దొరికాక పోలీసు వారే స్వయంగా తమ వాహనాలలో ఎక్కించి తెచ్చి మరీ గౌరవ మంత్రిగారికి అప్పగించారు. ఇప్పుడు టిప్పు సుల్తాన్ గొడవతో కర్ణాటక మండిపోతోంది. టిప్పు ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా చేయడం బీజేపీ తదితర సంస్థలకు ఇష్టం లేదు. సరే, ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ ఇంగ్లండ్ పర్యటనలో ఉన్నారు. ఆజాంఖాన్ మోదీని ఓ కోరిక కోరారు. బ్రిటన్ మ్యూజియంలో టిప్పు ఉంగరం ఒకటి ఉందట. దానిని మోదీ వచ్చేటప్పుడు వెంటబెట్టుకు రావాలట. ఎందుకంటే, దాని మీద ‘రామ్’ అన్న అక్షరాలు చెక్కి ఉంటాయట. మోదీ దానిని తెచ్చి తన పార్టీ కార్యకర్తలకు చూపాలని ఆజాం విజ్ఞప్తి చేస్తున్నారు. ఇది గొడవ చల్లార్చడానికా; ఆజ్యం పోయడానికా? సరే, పనిలో పనిగా కోహినూరు వజ్రాన్ని కూడా వెంటబెట్టుకురమ్మని ఆజాం కోరారు.