Deputy Mayor
-
ప్రజాప్రతినిధులపై దాడులు జరుగుతుంటే పోలీసులేం చేస్తున్నారు?
సాక్షి, నూఢిల్లీ : తిరుపతి డిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక సందర్భంగా జరిగిన ఘటనలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) స్పందించింది. ప్రజాప్రతినిధులపై దాడి జరుగుతుంటే అక్కడున్న పోలీసులు ఏం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తంచేసింది. దాడికి పాల్పడ్డ వారి పేర్లు ఎఫ్ఐఆర్లో ఎందుకు చేర్చలేదని నిలదీసింది. ఈ ఘటనపై 4 వారాల్లో నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీకి శుక్రవారం నోటీసులిచ్చింది. తిరుపతి ఘటనపై వైఎస్సార్సీపీ తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి 18న ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. ‘ఫిబ్రవరి 3న తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో పాల్గొనేందుకు నేను, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం బస్సులో వెళ్తున్నాం. మాతో వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు కూడా ఉన్నారు. వేరే పార్టీకి చెందిన కొందరు మా బస్సును అడ్డగించారు. రాడ్లతో బస్సు అద్దాలు ధ్వంసం చేసి లోపలకు చొరబడ్డారు. నాపైన, ఎమ్మెల్సీ, కార్పొరేటర్లపైన భౌతిక దాడికి పాల్పడ్డారు. చొక్కాలు చించి మరీ భయభ్రాంతులకు గురి చేశారు. ఈ ఘటన అంతా పోలీసుల సాక్షిగానే జరిగింది. ఇది మానవ హక్కుల ఉల్లంఘనే’ అంటూ ఎంపీ గురుమూర్తి ఆ ఫిర్యాదులో తెలిపారు.ఎఫ్ఐఆర్లో ఎంపీ ఫిర్యాదు చేసిన వారి పేర్లేవి?ఈ ఫిర్యాదును పరిశీలించిన ఎన్హెచ్ఆర్సీ రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ఈ ఘటనకు సంబంధించిన వార్తలు కూడా న్యూస్ ఛాన్నెళ్లు, పత్రికల్లో కూడా వచ్చాయి. దాడికి పాల్పడ్డ వారి పేర్లను ప్రస్తావిస్తూ తిరుపతి ఎస్పీకి ఎంపీ లిఖిత పూర్వకంగా ఫిర్యాదు ఇచ్చారు. అయితే ఎస్వీయూ పోలీసు స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ నంబర్ 18/2025లో ఎంపీ ప్రస్తావించిన పేర్లు లేవు. ప్రజా ప్రతినిధులు వెళుతున్న బస్సుకు పోలీసు ఎస్కార్ట్ ఇవ్వాలని రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ను సైతం ఎస్పీకి ఇచ్చారు. అయినా వారికి పోలీసులు సరైన భద్రత ఎందుకు కల్పించలేదు?’ అంటూ ప్రభుత్వాన్ని నిలదీసింది. ఎఫ్ఐఆర్లో నిందితుల పేర్లు ఎందుకు చేర్చలేదో, ప్రస్తుతం ఆ ఎఫ్ఐఆర్పై జరిపిన విచారణ, పూర్తి సమాచారం, ఆధారాలతో సహా నివేదిక ఇవ్వాలంటూ సీఎస్, డీజీపీలకు ఎన్హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింది. -
ఏపీ ప్రభుత్వానికి NHRC కీలక ఆదేశాలు
ఢిల్లీ: తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల అక్రమాల అంశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో జరిగిన అక్రమాల విచారణ జరపాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీకి జాతీయ మానవ హక్కుల సంఘం ఆదేశాలు జారీ చేసింది.సీనియర్ ర్యాంక్ అధికారితో విచారణ జరిపి యాక్షన్ టేకెన్ రిపోర్టు నాలుగు వారాల్లో పంపాలని ఆదేశించింది. ఈ సందర్భంగా ఎన్హెఆర్సీ పలు ప్రశ్నలు సంధించింది. హైకోర్టు ఆదేశాలున్నప్పటికీ తగిన భద్రత ఎందుకు కల్పించలేదు? ఎఫ్ఐఆర్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి పేరు ఎందుకు చేర్చలేదు? అని డీజీపీని ప్రశ్నించింది. ఈ ఘటనకు సంబంధించిన దర్యాప్తు నివేదిక పరిస్థితిని అందించడంతో పాటు.. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో దాడులతో మానవ హక్కులకు భంగం వాటిల్లిన ఘటనపై స్పందించాలని డీజీపీకి సూచించింది.కాగా, తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో జరిగిన దాడులు, మానవ హక్కుల ఉల్లంఘనపై ఇటీవలే జాతీయ మానవ హక్కుల సంఘానికి తిరుపతి ఎంపీ గురుమూర్తి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుపై స్పందించిన జాతీయ మానవ హక్కుల సంఘం ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు డీజీపీ నుంచి వివరణ కోరింది. -
భూమనను పట్టుకొని ఏడ్చేసిన వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు
-
వైఎస్ఆర్ సీపీ కార్పొరేటర్లను బెదిరించే ప్రయత్నం చేసిన టీడీపీ గూండాలు
-
తిరుపతిలో ప్రజాస్వామ్యం ఖూనీ
సాక్షి, తిరుపతి: కూటమి సర్కార్.. తిరుపతిలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. అన్యాయంగా డిప్యూటీ మేయర్ పదవిని లాక్కుంది. దాడులు, దౌర్జన్యాలతో పదవి లాక్కున్న కూటమి ప్రభుత్వం బరి తెగించి.. కుతంత్రాలకు తెరతీసింది వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల కిడ్నాప్తో కూటమి విధ్వంసం సృష్టించింది. టీడీపీకి ఓటు వేయకుంటే ఇళ్లు కూలుస్తామంటూ బెదిరింపులకు దిగింది. మహిళా కార్పొరేటర్లపై కూడా దాడులు చేసిన కూటమి గూండాలు.. బెదిరింపులకు పాల్పడ్డారు.వైఎస్సార్సీపీ కార్పొరేటర్లను కిడ్నాప్చేసి కూటమి గెలిచింది. దాడులు, దౌర్జన్యాలతో మునికృష్ణను కూటమి గెలిపించుకుంది. నిబంధనలకు వ్యతిరేకంగా ఎన్నిక జరిగిదని.. ఈ గెలుపు ప్రజాస్వామ్య విరుద్ధం అని వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు మండిపడుతున్నారు.కూటమి మోసం చేసి గెలిచింది: భూమన కరుణాకర్రెడ్డిడిప్యూటీ మేయర్ ఎన్నికల్లో కూటమి మోసం చేసి గెలిచింది. కూటమి క్యాన్సర్ కన్నా ప్రమాదం. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు విరోచితంగా పోరాడారు. మా కార్పొరేటర్లను కిడ్నాప్ చేసి బెదిరించారు. ఎమ్మెల్సీనే ఓటింగ్కు రాకుండా చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిది. మేయర్ను దించాలని కూటమిప్రభుత్వం కుట్రలు చేస్తోంది.కాగా, మూడేళ్ల క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరుపతి కార్పొరేషన్లో మొత్తం 49 డివిజన్లకు గానూ 48 చోట్ల వైఎస్సార్సీపీ గెలుపొందింది. భూమన అభినయరెడ్డి సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడంతో తిరుపతి డిప్యూటీ మేయర్, కార్పొరేటర్ పదవులకు రాజీనామా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డిప్యూటీ మేయర్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడింది. కూటమికి ఒక్క కార్పొరేటరే ఉన్నా అధికార బలంతో దాన్ని దక్కించుకునేందుకు కుట్రలకు తెర తీశారు.గత ఐదు రోజులుగా వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల ఆస్తులను ధ్వంసం చేయడంతోపాటు రాత్రిపూట పోలీసులను వారి ఇళ్లకు పంపి కేసులు బనాయిస్తామంటూ బెదిరించారు. ఎస్వీ యూనివర్సిటీ సెనెట్ హాలులో సోమవారం డిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. ఉప ఎన్నికలో ఎలాగైనా గెలవాలనే కుయుక్తులతో కూటమి నేతలు వైఎస్సార్సీపీ కార్పొరేటర్లను కిడ్నాప్ చేసేందుకు సిద్ధమయ్యారు.వారంతా చిత్తూరులో ఉన్నారని తెలుసుకుని ఆదివారం అర్ధరాత్రి రిసార్ట్స్లో చొరబడ్డారు. మహిళా కార్పొరేటర్లు అని కూడా చూడకుండా తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కుమారుడు మదన్, పులిగోరు మురళి, జేబీ శ్రీనివాసులు, అనుచరులు గదుల తలుపులు బాదుతూ వీరంగం సృష్టించారు. -
బలం లేకపోయినా బరితెగింపు
సాక్షి ప్రతినిధి, తిరుపతి/తిరుపతి తుడా: తిరుపతి నగర పాలక సంస్థలో డిప్యూటీ మేయర్ పదవి కోసం కూటమి ప్రభుత్వం తిరుపతిలో అరాచకం సృష్టిస్తోంది. ఏడాది మాత్రమే ఉండే ఈ పదవిని బలం లేకపోయినా సరే దక్కించుకోవాలని వైఎస్సార్సీపీ అభ్యర్థి శేఖర్రెడ్డి, మరి కొందరు కార్పొరేటర్ల ఆస్తుల విధ్వంసానికి తెగబడింది. వైఎస్సార్సీపీ శ్రేణులను అరెస్టు చేయించింది. తిరుపతి డిప్యూటీ మేయర్గా ఉన్న భూమన అభినయ్రెడ్డి ఆ పదవికి రాజీనామా చేసి, సాధారణ ఎన్నికల్లో తిరుపతి అసెంబ్లీ అభ్యర్థిగా బరిలో దిగారు.కొత్త డిప్యూటీ మేయర్ ఎన్నికకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. ఈనెల 3న జరగనున్న ఎన్నిక కోసం వైఎస్సార్సీపీ తరఫున డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా 42వ డివిజన్ కార్పొరేటర్ శేఖర్రెడ్డిని పోటీలోకి దింపింది. కార్పొరేషన్ పరిధిలోని 50 డివిజన్లలో 48 చోట్ల వైఎస్సార్సీపీ అభ్యర్థులే ఉన్నారు. టీడీపీ కేవలం ఒక డివిజన్లో మాత్రమే గెలిపొందింది. మరో డివిజన్ ఎన్నికపై కోర్టు తీర్పు ఇవ్వాల్సి ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చాక.. 9 మంది కార్పొరేటర్లను భయపెట్టి, ప్రలోభాలకు గురిచేసి టీడీపీ, జనసేన వైపు తిప్పుకుంది. అయినా వైఎస్సార్సీపీకి 39 మంది కార్పొరేటర్ల బలం ఉంది. ఈ లెక్కన న్యాయంగా డిప్యూటీ మేయర్ పదవి వైఎస్సార్సీపీదే. బలం లేదని తెలిసినా బలవంతండిప్యూటీ మేయర్ పదవిని దక్కించుకునేందుకు అవసరమైన బలం లేకున్నా, అరాచకానికి పాల్పడి అయినా దక్కించుకునేందుకు కూటమి పార్టీల నేతలు అరాచకాలకు తెరలేపారు. 2 రోజుల క్రితం కార్పొరేçÙన్ అధికారులతో సమావేశం నిర్వహించారు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల ఆస్తుల వివరాలు, పాత కేసుల వివరాలు సేకరించాలని ఆదేశించారు. ఆ తర్వాత వైఎస్సార్సీపీ డిప్యూటీ మేయర్ అభ్యర్థి శేఖర్రెడ్డి పోటీ నుంచి తప్పుకోవాలని వారి కుటుంబీకులకు ఫోన్లు చేసి తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు చేశారు. మిగిలిన కార్పొరేటర్లకు ఫోన్లు చేసి ‘అంతు చూస్తాం.. ఆస్తులను ధ్వంసం చేస్తాం. కేసులు బనాయిస్తాం’ అంటూ బెదిరింపులకు దిగారు. మరో వైపు పోలీసులు వైఎస్సార్సీపీ కార్పొరేటర్లకు ఫోన్లు చేసి కుటుంబ సభ్యుల వివరాలు చెప్పండని అడిగారు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు అందరూ వారి డిమాండ్లకు ససేమిరా అనటంతో విధ్వంసానికి దిగారు. రెవిన్యూ, కార్పొరేషన్ అధికారులు శనివారం ఉదయం ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ఆక్రమణలు అంటూ శేఖర్రెడ్డి, మరికొందరు కార్పొరేటర్లకు చెందిన భవనాలు కూల్చేందుకు జేసీబీలను మోహరించారు.అలిపిరి పోలీస్టేషన్ సమీపంలోని శాంతినగర్లోని భవనం కూల్చేస్తామని పుకార్లకు తెరతీశారు. వందలాది మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో.. శ్రీనివాసం సముదాయం వెనుక డీబీఆర్ రోడ్డులో నిర్మాణంలో ఉన్న భవనంలో రెండు గదుల గోడలను కూల్చేశారు. వైఎస్సార్సీపీ శ్రేణులు అక్కడికి చేరుకుని కూల్చివేతలను అడ్డుకుని నిరసనకు దిగారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మరోవైపు శాంతినగర్లోని భవనం ప్రహరీ గోడను కూల్చివేశారు. నిర్బంధం.. ఆపై అరెస్ట్లు అక్రమ కూల్చివేతలను అడ్డుకునేందుకు నగర మేయర్ డాక్టర్ శిరీష, వైఎస్సార్సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్రెడ్డి, వందలాది మంది పార్టీ శ్రేణులతో కూల్చివేతలను అడ్డుకునే క్రమంలో పోలీసులు అమానవీయంగా వ్యవహరించారు. దౌర్జన్యానికి దిగి తిట్ల పురాణం అందుకున్నారు. ఇద్దరు కార్యకర్తలను గొంతు నులిమి దాష్టీకాన్ని ప్రదర్శించారు. మేయర్ను సైతం నెట్టుకుంటూ అరెస్ట్ చేశారు. భూమన అభినయ్రెడ్డిని నిర్భందించి భవనంలోనికి వెళ్లకుండా కట్టడి చేశారు. బయటకు లాగి పడేసి అరెస్ట్ చేశారు. పార్టీ కార్యకర్తలను బూతులు తిడుతూ చొక్కాలు పట్టుకుని లాక్కెళ్లారు. మహిళల పట్ల మగ పోలీసులు వ్యవహరించిన తీరుపై పార్టీ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో చివరి నిమిషంలో మహిళా పోలీసులను రప్పించి అరెస్ట్ చేయించారు. అరుపులు, కేకలు, పోలీసు వాహనాల సైరన్ మోతలు, డ్రోన్ల కదలికలు, పోలీసుల కవాతుతో ప్రజలు హడిలిపోయారు. పార్టీ శ్రేణులను కట్టడి చేసే క్రమంలో స్థానిక ద్విచక్రవాహన దారులపైనా పోలీసులు తమ ప్రతాపాన్ని చూపించారు. బలం లేకపోయినా డిప్యూటీ మేయర్ ఎన్నిక పర్యవేక్షణ కోసం నేరుగా జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ స్వయంగా రంగంలోకి దిగడం విస్తుగొలిపింది. ఈ నేపథ్యంలో విధ్వంసకాండతో తీవ్ర ఒత్తిడికి గురైన వైఎస్సార్సీపీ డిప్యూటీ మేయర్ అభ్యర్థి శేఖర్రెడ్డి.. మంత్రులు అనగాని సత్యప్రసాద్, ఆనం రాంనారాయణరెడ్డి సమక్షంలో రాత్రికి రాత్రి కూటమిలో చేరిపోయారు. దీంతో తమ డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా వైఎస్సార్సీపీ లడ్డూ భాస్కర్రెడ్డిని ప్రకటించింది.ప్రజాస్వామ్యం ఖూనీకి కూటమి సైసాక్షి, అమరావతి: మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడానికి అధికార టీడీపీ వెనకాడటం లేదు. టీడీపీ చేస్తున్న దౌర్జన్యకాండను అడ్డుకొని దీటుగా సమాధానం ఇవ్వడానికి వైఎస్సార్సీపీ సమాయాత్తమవుతోంది. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఖాళీ అయిన డిప్యూటీ మేయర్/డిప్యూటీ చైర్మన్ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి సంపూర్ణ మెజారిటీ ఉంది. అయినా అక్రమాలు, దౌర్జన్యాలకు పాల్పడి ఆ స్థానాలను దక్కించుకోవాలని అధికార టీడీపీ తీవ్ర ప్రయత్నం చేస్తోంది. తిరుపతి, నెల్లూరు, ఏలూరు కార్పొరేషన్లలో డిప్యూటీ మేయర్ స్థానాలతో పాటు మరో 7 మున్సిపాలిటీల్లో 3 చైర్మన్లు, 5 వైస్ చైర్మన్ స్థానాలు ఖాళీ కావడంతో వాటిని భర్తీ చేస్తున్న విషయం విదితమే. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమంగా ఆ స్థానాలను దక్కించుకోవడానికి టీడీపీ చేస్తున్న ప్రయత్నాలను ఎదిరించి ప్రజాస్వామ్యాన్ని బతికించడానికి వైఎస్సార్సీపీ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా విప్ జారీ చేయడంతో పాటు అవసరమైతే పోటీ క్యాంపులు నడపడానికీ సమాయాత్తమవుతోంది. టీడీపీ ప్రలోభాలకు లొంగి, గెలిచిన పార్టీని కాదని కూటమి పార్టీలకు ఓటేస్తే.. అనర్హత వేటు పడుతుందని వైఎస్సార్సీపీ చెబుతోంది. విప్ ధిక్కరించిన వారి మీద అనర్హత వేటు వేయించడానికి న్యాయ పోరాటం కూడా చేయాలని వైఎస్సార్సీపీ నిర్ణయించింది. -
గుంటూరు మున్సిపల్ కమిషనర్ తీరుపై డిప్యూటీ మేయర్ ఫైర్
-
గుంటూరులో టీడీపీ నేత దాష్టీకం
లక్ష్మీపురం: టీడీపీ దౌర్జన్యాలు మితిమీరుతున్నాయి. గుంటూరు డిప్యూటీ మేయర్, తాడికొండ నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి వనమాల వజ్రబాబు (డైమండ్ బాబు) సోదరి నివాసం ఉంటున్న ఇంటిని ఆక్రమించేందుకు యత్నించిన ఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. సాయిబాబారోడ్డు శాంతినగర్ 2వ లైన్లో డైమండ్ బాబు సోదరి పతకమూరి వజ్రకుమారి 2008 నుంచి నివాసం ఉంటున్నారు. ఆమె భర్త సీతారామయ్య 2012లో అనారోగ్యంతో మృతి చెందారు. వజ్రకుమారి పక్షవాతం బారినపడి చికిత్స పొందుతోంది. ఆమె ఉంటున్న ఇంటి స్థలానికి సంబంధించి పాములూరి రామయ్య, పత్రి ఆనంద్మోహన్ అనే వారిమధ్య కోర్టులో వివాదం నడుస్తోంది. కాగా.. యనమల విజయ్కిరణ్ అనే వ్యక్తి అధికార పార్టీ అండదండలతో పేరం వెంకటేశ్వర్లు అనే వ్యక్తి వద్ద ఆ స్థలాన్ని కొనుగోలు చేశానంటూ నకిలీ దస్తావేజులను సృష్టించి ఆదివారం మధ్యాహ్నం వజ్రకుమారి, కొడుకు కిరణ్కుమార్, కుమార్తె రాణి, కోడలు రమ్య భోజనం చేస్తున్న సమయంలో మాస్క్లు ధరించిన మహిళలు నాలుగు ఆటోల్లో వచ్చి ఆ ఇంట్లోకి చొరబడ్డారు. వజ్రకుమారి కుటుంబ సభ్యుల నుంచి తినే కంచాలను లాగేసుకుని అందరినీ ఇంటినుంచి లాక్కొచ్చి బయటకు గెంటేశారు. గృహోపకరణాలు సైతం బయట పడేసి దాడిచేసి గాయపరిచారు. దీంతో బాధితురాలు వజ్రమ్మ, కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. అనంతరం టీడీపీ నేత విజయ్కిరణ్ అనుచరులైన ఇద్దరు మహిళలు, ముగ్గురు యువకులు ఆ ఇంట్లోకి చొరబడి తలుపులు వేసుకున్నారు. ఈవిషయం తెలుసుకున్న నగర డిప్యూటీ మేయర్ డైమండ్బాబు పట్టాభిపురం సీఐ, వెస్ట్ డీఎస్పీ, జిల్లా ఎస్పీలకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే సరికి బాధితురాలు కుటుంబ సభ్యులు రోడ్డుపై కన్నీటి పర్యంతమై జరిగిన విషయాన్ని చెప్పారు. దీంతో పోలీసులు విజయ్కిరణ్ అనుచరులను అక్కడినుంచి పంపించేశారు. అనంతరం అక్కడకు చేరుకున్న డిప్యూటీ మేయర్ డైమండ్బాబును సీఐ వీరేంద్ర వెళ్లిపోవాలని బలవంతం చేశారు. దీంతో డైమండ్బాబు తన సోదరి ఇంటిని కబ్జా చేసిన వారికి పోలీసులు బందోబస్తు కల్పించడం సరికాదని, వారందరినీ బయటకు పంపించాలని సీఐ వీరేంద్రను కోరా>రు. తామే ఆ ఇంటిని ఖాళీ చేయించామని, మీరు ఇక్కడ ఉండటం కుదరదన్నారు. తన సోదరి కుటుంబాన్ని రోడ్డుపై కూర్చోబెట్టడం సరికాదని డైమండ్బాబు అనటంతో సీఐ వీరేంద్ర ఆయనను బలవంతంగా జీప్ ఎక్కించి స్టేషన్కు తరలించారు. సమాచారం తెలుసుకున్న మేయర్ కావటి మనోహర్నాయుడు, ఈస్ట్ ఇన్చార్జి నూరిఫాతిమా, పొన్నూరు నియోజకవర్గ ఇన్చార్జి అంబటి మురళీకృష్ణ, పలువురు కార్పొరేటర్లు పట్టాభిపురం స్టేషన్కు చేరుకున్నారు. జిల్లా ఎస్పీ సతీష్కుమార్ జోక్యంతో డైమండ్బాబును విడిచి పెట్టారు. కబ్జాదారుడికి పోలీసులు వత్తాసు పలకడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
సీనియర్ , డిప్యూటీ మేయర్ బీజేపీ కైవసం
చండీగఢ్: సర్వోన్నత న్యాయస్థానం జోక్యంతో చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో భంగపాటుకు గురైన బీజేపీ చివరకు సీనియర్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో విజయబావుటా ఎగరేసింది. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో ఆప్ అభ్యరి్ధకి పడిన 8 ఓట్లను చెల్లనివిగా ప్రకటించి బీజేపీ నేత మేయర్ అయ్యేలా చేసిన రిటరి్నంగ్ అధికారిపై సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిన దరిమిలా చండీగఢ్ సీనియర్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు సైతం అందరి దృష్టినీ ఆకర్షించాయి. సోమవారం జరిగిన ఎన్నికల్లో బీజేపీ రెండు విజయాలను నమోదుచేసుకుంది. ఫిబ్రవరి 19వ తేదీన ముగ్గురు ఆప్ కౌన్సిలర్లు బీజేపీలో చేరడంతో 35 సభ్యులుండే మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ బలం మరింత పెరిగింది. దీంతో సీనియర్ మేయర్ ఎన్నికల్లో ఆప్ మద్దతు పలికిన కాంగ్రెస్ అభ్యర్థి గుర్ప్రీత్ గబీపై బీజేపీ అభ్యర్థి కుల్జీత్ సంధూ విజయం సాధించారు. డెప్యూటీ మేయర్ ఎన్నికల్లోనూ ఆప్ మద్దతు పలికిన కాంగ్రెస్ అభ్యర్థి నిర్మలా దేవిపై బీజేపీ అభ్యర్ధి రాజీందర్ శర్మ గెలిచారు. -
ప్రజల మధ్యనే ఉంటూ.. తిరుపతి అభివృద్ధికి శ్రమిస్తూ..
తిరుపతి: టెంపుల్ సిటీగా తిరుపతికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. దేశ విదేశాల్లోనూ తిరుపతి వైపు అందరి చూపు ఉంటుంది. అలాంటి తిరుపతిలో డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ చేస్తున్న అభివృద్ధి అంతా ఇంతా కాదు. ప్రతిపక్షాలే ముక్కున వేలేసుకునే స్థాయిలో అభివృద్ధి జరుగుతోంది. ఇదంతా ఎవరో కాదు చెప్పేది, తిరుపతి స్థానికులే చెబుతున్నారు. బుధవారం అభినయ్ పుట్టినరోజు సందర్భంగా తిరుపతి నగరమంతా పలు వేడుకలు, అన్న దాన, రక్త దాన, సేవా కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్బంగా స్థానిక ప్రజలు మాట్లాడుతూ.. అభినయ్ ని మరెన్నో ఉన్నత పదవుల్లో చూడాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ, గడప గడపకు తిరుగుతూ వారి సమస్యలు పరిష్కరిస్తూ నిరంతర శ్రామికుడిగా పేరు తెచ్చుకుంటున్నారు అని భూమన అభినయ్ ని కొనియాడారు. 'మీ అందరి ఆశీర్వాదమే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. మీ ఇంటి బిడ్డగా కష్టాల్లో, సుఖాల్లో ఎప్పటికీ నేను తోడుంటా. ప్రాణం ఉన్నంత వరకు ఎక్కడా చెడ్డ పేరు రాకుండా మన తిరుపతి గౌరవాన్ని పెంచేలా పనిచేస్తానని హామీ ఇస్తున్నా. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే ముంఖ్యమంత్రి జగన్ గారి నాయకత్వంలోనే సాధ్యం. ఆయన అడుగు జాడల్లో నడుస్తాను, తిరుపతి ప్రజలారా.. మీకు అండగా ఉంటా.. తిరుపతి ఖ్యాతిని పెంచుదాం' అంటూ అభినయ్ పిలుపునిచ్చారు. ఇదీ చదవండి: జైపూర్ ఎక్స్ప్రెస్ ఘటన: చేతన్ షార్ట్ టెంపర్.. అందుకే ఈ ఘోరం! -
డిప్యూటీ మేయర్గా ముచ్చు లయయాదవ్
విజయనగరం: విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్–1గా వైఎస్సార్ సీపీకి చెందిన 1వ డివిజన్ కార్పొరేటర్ ముచ్చు లయయాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గురువారం ఉదయం 11 గంటలకు నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో సభ్యులంతా ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జేసీ మయూర్ అశోక్ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. కార్పొరేషన్ ఇన్చార్జి కమిషనర్ పీవీడీ ప్రసాదరావు ఎన్నిక ప్రక్రియను ప్రారంభించారు. ఇప్పటి వరకు డిప్యూటీ మేయర్గా వ్యవహరించిన ఇసరపు రేవతీదేవి రాజీనామా చేయడంతో ఎన్నిక ప్రక్రియ నిర్వహించినట్టు తెలిపారు. ముచ్చు లయయాదవ్ పేరును 13వ డివిజన్ కార్పొరేటర్ ఇసరపు రేవతీదేవి ప్రతిపాదించగా 40వ డివిజన్కు చెందిన బోనెల ధనలక్ష్మి బలపరిచారు. ఒక్కరి పేరునే ప్రతిపాదించడంతో ఏకగ్రీవంగా ఎన్నికై నట్టు జేసీ ప్రకటించారు. ఎన్నిక పత్రాన్ని అందజేశారు. మొత్తం ఎన్నిక ప్రక్రియ 16 నిమిషాల్లోనే ముగిసింది. ఎన్నిక ప్రక్రియలో 50 మంది కార్పొరేటర్లకు 44 మంది హాజరయ్యారు. అభినందనల వెల్లువ డిప్యూటీ మేయర్–1గా ఎన్నికై న లయయాదవ్కు అభినందనలు వెల్లువెత్తాయి. నగర డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి, ఫ్లోర్ లీడర్ ఎస్వీవీ రాజు, వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు ఆశపు వేణుతో పాటు తోటి కార్పొరేటర్లు ఆమెకు పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు. కోలగట్ల శ్రావణి మాట్లాడుతూ విజయనగరం కార్పొరేషన్గా రూపాంతరం చెందిన తరువాత జరిగిన మొదటి ఎన్నికలో డిప్యూటీ మేయర్–1గా ముచ్చు నాగలక్ష్మి ఎన్నికయ్యారని, ఆమె మరణంతో అదే సామాజిక వర్గానికి చెందిన 13వ డివిజన్ కార్పొరేటర్ ఇసరపు రేవతీదేవి ఎన్నికయ్యారన్నారు. ఆమె వ్యక్తిగత కారణాలవల్ల పదవికి రాజీనామా చేయడంతో లయ యాదవ్ను ఎన్నుకున్నామన్నారు. డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి ఆశీస్సులతో నూతన బాధ్యతలు స్వీకరించడం ఆనందంగా ఉందని లయ యాదవ్ పేర్కొన్నారు. నగర అభివృద్ధికి తన వంతు సహకరిస్తానన్నారు. -
తిరుపతిలో చారిత్రాత్మక, పురాతన కట్టడాల పరిరక్షణకు ముందడుగు
సాక్షి,తిరుపతి: తిరుపతి నగరంలోని చారిత్రాత్మకమైన, పురాతన కట్టడాలను పరిరక్షించుకోవడం కోసం, భవిష్యత్ తరాలకు వారసత్వ సంపదగా అందించడం కోసం యువనేత భూమన అభినయ్ రెడ్డి ముందడుగు వేశారు. తిరుపతి 39వ డివిజన్, చెన్నారెడ్డి కాలనీలో ఓ పురాతనమైన కొలను ఉంది. సుమారు 400 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణ దేవరాయలు శ్రీవారి దర్శనార్థం తిరుమలకు కాలినడకన వచ్చే భక్తులు సేద తీరడం కోసం, స్నానాలు చేయడం కోసం ఈ కొలను నిర్మించారు. ఈ కొలనుకు కృష్ణంనాయుడి గుంటగా వాడుకలోకి వచ్చింది. అయితే కాలక్రమేణా ఈ కొలను అన్యాక్రాంతం అవుతూ వచ్చింది. 2018 టీడీపీ హయాంలో వైఎస్సార్ కుటుంబం కార్యక్రమంలో భూమన కరుణాకర్ రెడ్డి చెన్నారెడ్డి కాలనీలో ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇందులో భాగంగా కృష్ణంనాయుడి గుంట కబ్జా కాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి చేస్తామని చెప్పిన విధంగా ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి, డిప్యూటీ మేయర్ అభినయ్రెడ్డి ఆ గుంటను అభివృద్ధి పరచడానికి కౌన్సిల్లో చర్చించారు. నిధులు మంజూరు చేసి మరమ్మతులు ప్రారంభించారు. తాజాగా మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణంతో పాటు పురాతన కట్టడాలను పరిరక్షించడం కోసం అడుగులు వేశామని భూమన అభినయ్ తెలిపారు. శ్రీకృష్ణంనాయుడి గుంట పరిరక్షణకు మొదటి విడతగా 57 లక్షలు మంజూరు చేసిన కౌన్సిల్, మలి విడతగా మరో 50 లక్షలను ఇవ్వడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారని పేర్కొన్నారు. కొలనులో పూడికతీతతో పాటు ప్రహరీగోడ, పచ్చదనం పెంపొందించేలా మొక్కలు నాటి, సుందరంగా తీర్చిదిద్దనున్నట్లు ఆయన చెప్పారు. -
ఎంసీడీ భేటీకి ఎల్జీ ఓకే
న్యూఢిల్లీ: రెండుసార్లు సమావేశమైనా మేయర్ను ఎన్నుకోకుండానే అర్ధాంతరంగా వాయిదాపడిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎంసీడీ) భేటీని ఈసారి 6వ తేదీన నిర్వహించేందుకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) వీకే సక్సేనా అనుమతి ఇచ్చారు. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు ఎల్జీ∙ఆమోదం తెలిపారని ఉన్నతాధికారులు బుధవారం చెప్పారు. ఇటీవలి ఎంసీడీ ఎన్నికల్లో 250 స్థానాలకుగాను ఆప్ 134 చోట్ల, బీజేపీ 104 స్థానాల్లో విజయం సాధించిన విషయం తెల్సిందే. అయితే, మేయర్, డిప్యూటీ మేయర్, స్టాండింగ్ కమిటీ సభ్యులను ఎన్నుకునేందుకు ఎంసీడీ జనవరి 6, 24వ తేదీల్లో సమావేశమైన సందర్భంగా కౌన్సిలర్ల మధ్య తీవ్ర వాగ్వాదంచోటుచేసుకున్న విషయం విదితమే. -
గయ డిప్యూటీ మేయర్గా పారిశుద్ధ్య కార్మికురాలు
పట్నా: పారిశుద్ధ్య కార్మికురాలిని డిప్యూటీ మేయర్ పదవికి ఎన్నుకోవడం ద్వారా బిహార్లోని గయ మున్సిపాలిటీ ప్రజలు చరిత్ర సృష్టించారు. చింతాదేవి గత 40 ఏళ్లుగా మున్సిపాలిటీలో స్కావెంజర్గా పనిచేస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఈమె 16వేల పైచిలుకు ఓట్లతో విజయం సాధించారు. 1996లో కూడా గయ ప్రజలు ముసాహిర్ వర్గానికి చెందిన రాళ్లు కొట్టుకునే భగవతీదేవి అనే సాధారణ మహిళను లోక్సభకు పంపారు. -
చరిత్ర సృష్టించిన చింతాదేవి.. డిప్యూటీ మేయర్గా..
ఒక సామాన్యురాలు అసామాన్య విజయం సాధిస్తే.. అది చరిత్ర సృష్టించినట్లే కదా!. పారిశుద్ధ్య కార్మికురాలు చింతాదేవి Chinta Devi ఆ జాబితాలోకి చేరిపోయారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో ఘన విజయం సాధించిన ఆమె.. ఇప్పుడు డిప్యూటీ మేయర్గా బాధ్యతలు స్వీకరించారు. బీహార్ గయలో తాజాగా ఈ పరిణామం చోటు చేసుకుంది. నలభై ఏళ్ల చరిత్ర ఉన్న గయ మున్సిపాలిటీలో చింతాదేవి విజయం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పబ్లిక్ టాయిలెట్లు తక్కువగా ఉండే ఆ ప్రాంతంలో ఒకప్పుడు బహిరంగ మలవిసర్జన అధికంగా ఉండేది. చింతాదేవి అదంతా ఊడ్చి శుభ్రం చేసి, ఎత్తి దూరంగా తీసుకెళ్లి పారబోసే పనిని చేశారు. ఆ తర్వాత రోడ్లు ఊడవడం, డ్రైనేజీలు, మ్యాన్హోల్స్కు శుభ్రం చేస్తూ వస్తున్నారు. అలాంటి చింతాదేవి ఎన్నికల్లో పోటీ చేసి.. ఘన విజయం సాధించారు. ప్రజలకు నిత్యం చేరువగా ఉండడంతోనే తనకు ఈ విజయం దక్కి ఉంటుందని ఆమె భావిస్తున్నారు. బహుశా ప్రపంచంలో ఇలాంటి విజయం ఎవరూ సాధించి ఉండబోరని, ఇది చారిత్రక ఘట్టమని గయ నూతన మేయర్ గణేష్ పాశ్వాన్ ఆమెను ఆశీర్వదించారు. అంతేకాదు.. మాజీ డిప్యూటీ మేయర్ మోహన్ శ్రీవాస్తవ సైతం ఆమె అభ్యర్థిత్వాన్ని బలపర్చడం గమనార్హం. పారిశుద్ధ్య కార్మికురాలిగానే కాదు.. మిగతా టైంలో ఆమె కూరగాయలు అమ్ముకుని జీవనం కొనసాగిస్తున్నారు. బుద్ధుడి జ్క్షానోదయ ప్రాంతంగా పేరున్న గయలో.. ఇలాంటి గెలుపు కొత్తేం కాదు. 1996 సార్వత్రిక ఎన్నికల్లో రాళ్లు కొట్టి జీవనం కొనసాగించే భగవతి దేవి ఏకంగా పార్లమెంట్కు ఎన్నికై చరిత్ర నెలకొల్పారు. అంటరాని కులంగా పేరున్న ముసహార్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి కావడం గమనార్హం. జేడీయూ పార్టీ తరపున పోటీ చేసి ఆమె నెగ్గారు. -
మౌలిక వసతులు, పారిశుధ్యానికి పెద్దపీట వేస్తున్నాం: మేయర్
-
తమిళనాడు: మేయర్లు, డిప్యూటీ మేయర్ల జాబితా
చెన్నై: తమిళనాడు కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార డీఎంకే పార్టీ సంపూర్ణ ఆధిపత్యం చెలాయించింది. రాష్ట్రంలోని 21 కార్పొరేషన్లను డీఎంకే కైవసం చేసుకుంది. అయితే కుంభకోణం నగర మేయర్ పదవిని కాంగ్రెస్కు కట్టబెట్టింది. దీంతో 20 నగరాల్లో డీఎంకే అభ్యర్థులు మేయర్లుగా ఎన్నికయ్యారు. ఆరు డిప్యూటీ మేయర్ల స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించింది. మేయర్లు, డిప్యూటీ మేయర్ల పూర్తి జాబితా మీ కోసం... నగరం మేయర్ డిప్యూటీ మేయర్ చెన్నై ప్రియా రాజన్ (డీఎంకే) మహేశ్ కుమార్ (డీఎంకే) కోయంబత్తూర్ కల్పన (డీఎంకే) వెట్రిసెల్వన్ (డీఎంకే) మదురై ఇంద్రాణి (డీఎంకే) నాగరాజన్ (సీపీఎం) తిరుచ్చి అన్బళగన్ (డీఎంకే) రాజు (డీఎంకే) సేలం రామచంద్రన్ (డీఎంకే) శారదా దేవి తిరుపూర్ దినేశ్ కుమార్ (డీఎంకే) బాలసుబ్రమణ్యం(సీపీఐ) ఈరోడ్ నాగరత్నం (డీఎంకే) సెల్వరాజ్(డీఎంకే) తూత్తుకుడి జగన్ (డీఎంకే) జెనిట్టా సెల్వరాజ్(డీఎంకే) ఆవడి ఉదయ్కుమార్(డీఎంకే) - తాంబరం వసంతకుమారి(డీఎంకే) కామరాజ్(డీఎంకే) కాంచీపురం మహాలక్ష్మి (డీఎంకే) కుమారగురునాథన్(కాంగ్రెస్) కడళూర్ సుందరి (డీఎంకే) తామరైసెల్వన్ (వీసీకే) తంజావూర్ రామనాథన్ (డీఎంకే) అంజుగమ్ (డీఎంకే) కరూర్ కవితా గణేశన్ (డీఎంకే) తరణి శరవణన్ (డీఎంకే) హోసూర్ ఎస్ఏ సత్య (డీఎంకే) ఆనందయ్య (డీఎంకే) దిందిగల్ ఐలమతి (డీఎంకే) రాజప్ప (డీఎంకే) శివకాశి సంగీత (డీఎంకే) విఘ్నేష్ ప్రియ (డీఎంకే) నాగర్ కోయిల్ మహేశ్ (డీఎంకే) మేరీ ప్రిన్సీ లత (డీఎంకే) వేలూరు సుజాత (డీఎంకే) సునీల్ కుమార్ (డీఎంకే) తిరునల్వేలి పీఎం శరవణన్(డీఎంకే) కె. రాజు (డీఎంకే) కుంభకోణం శరవణన్ (కాంగ్రెస్) తమిళగన్(డీఎంకే) -
సైకిల్ పైనే ఆఫీసుకు అనంతపురం డిప్యూటీ మేయర్
-
కాకినాడలో విజయం ‘కేక’.. భంగపడ్డ టీడీపీ
కాకినాడ: కాకినాడ నగరపాలక సంస్థ రెండో డిప్యూటీ మేయర్గా వైఎస్సార్సీపీ బలపరిచిన 17వ వార్డు కార్పొరేటర్ చోడిపల్లి సత్యప్రసాద్ (ప్రసాద్ మాస్టార్) అత్యధిక మెజారీ్టతో విజయకేతనం ఎగురవేశారు. నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో బుధవారం ఉదయం 11 గంటలకు ఎన్నికల అధికారి, జాయింట్ కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ ప్రత్యేక సమావేశంలో డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియ జరిగింది. కౌన్సిల్ ఎక్స్ అఫిషియో సభ్యులు మంత్రి కురసాల కన్నబాబు, సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డితోపాటు 35 మంది కార్పొరేటర్లు సమావేశానికి హాజరయ్యారు. చేతులెత్తే పద్ధతిలో ఓటింగ్ నిర్వహించగా వైఎస్సార్ సీపీ బలపరిచిన చోడిపల్లి సత్యప్రసాద్కు 25 మంది కార్పొరేటర్లు అనుకూలంగా ఓటు వేశారు. ఆయన అభ్యర్థిత్వాన్ని వాసిరెడ్డి రామచంద్రరావు ప్రతిపాదించగా ఎంజీకే కిషోర్ బలపరిచారు. టీడీపీ తరఫున పలివెల రవి అనంతకుమార్ను ఆ పార్టీ కార్పొరేటర్ ఒమ్మి బాలాజీ ప్రతిపాదించగా మేయర్ సుంకరపావని బలపరిచారు. పలివెల రవికి మద్దతుగా 10 మంది చేతులెత్తి ఓటింగ్లో పాల్గొన్నారు. దీంతో 25 ఓట్లు దక్కించుకున్న చోడిపల్లి ప్రసాద్ నగరపాలక సంస్థ రెండో డిప్యూటీ మేయర్గా ఎన్నికైనట్టు జేసీ లక్ష్మీశ ప్రకటించారు. ఫారమ్ ఏ, బీలలోనూ టీడీపీ వైఫల్యం టీడీపీలో అవగాహన రాహిత్యం మరోసారి బయటపడింది. 24 గంటల ముందు విప్జారీ చేయాల్సి ఉండగా చివరి నిమిషంలో లేఖను ఎన్నికల అధికారికి అందజేశారు. దీనిపై ఎన్నికల అధికారి స్పందిస్తూ నిబంధనల ప్రకారం 24 గంటల ముందుగా లేఖ ఇవ్వనందున విప్ చెల్లదని స్పష్టం చేశారు. పార్టీ అభ్యరి్థకి సంబంధించిన ఇతర వివరాలతో కూడిన లేఖ ఒరిజనల్ ఇవ్వకుండా నకలు ఇచ్చినందున తిరస్కరిస్తున్నట్టు స్పష్టం చేశారు. ఉదయాన్నే పోటీలో నిలవడం, పత్రాలన్నీ గందరగోళంగా ఉండడం, పార్టీ తీరుతో వ్యతిరేకించి మరో అభ్యరి్థకి మద్దతుగా నిలవడం వంటి సంఘటనలు టీడీపీ అనైక్యతను బయటపెట్టాయి. మేయర్ అవగాహనా రాహిత్యం డిప్యూటీమేయర్ ఎన్నికలో మేయర్ సుంకరపావని ఆవగాహన రాహిత్యం బయటపడింది. నాలుగేళ్లపాటు మేయర్గా ఉన్నా కౌన్సిల్ నిబంధనలు, ఎన్నికల ప్రక్రియపై ఆమెకు అవగాహన కొరవడిన తీరుచూసి కార్పొరేటర్లు ముక్కున వేలేసుకున్నారు. ఎన్నిక సందర్భంలో మేయర్గా తనకు ప్రత్యేక స్థానం కేటాయించాలని ఎన్నిక అధికారిని పట్టుబట్టారు. నిబంధనల ప్రకారం ఎన్నికల అధికారి అధ్యక్షత వహిస్తారని, మిగిలినవారంతా కింద వరుస క్రమంలో కూర్చోవాలని ఆయన నిబంధనలను వివరించాల్సి వచ్చింది. అలాగైతే తాను నిలబడే ఉంటానంటూ చేసిన వ్యాఖ్యానం కార్పొరేటర్లను, అధికారులను విస్మయపరిచింది. సమర్థతకు దక్కిన ‘డిప్యూటీ’ పీఠం కాకినాడ: ప్రజా సమస్యలపై, కార్పొరేషన్ చట్టాలపైన సంపూర్ణ అవగాహన కలిగిన సమర్థుడైన వ్యక్తికి ఉప మేయర్ పదవి దక్కడం జిల్లా ప్రగతికి శుభపరిణామమని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. కాకినాడలో డిప్యూటీ మేయర్ ఎన్నిక పూర్తయిన అనంతరం ఎమ్మెల్యే ద్వారంపూడితో కలిసి బుధవారం విలేకర్లతో మాట్లాడారు. రాజకీయాలకు అతీతంగా కార్పొరేటర్లంతా ఐక్యతతో ఉండి అభివృద్ధి కోసం ఒక అవగాహన కలిగిన ప్రసాద్మాస్టార్ వంటి వ్యక్తిని ఎన్నుకున్న తీరు భవిష్యత్కు శుభసూచికమని పేర్కొన్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ బీసీ వాడబలిజ వర్గానికి చెందిన వ్యక్తికి రాజకీయంగా మంచి ప్రాధాన్యత లభించిందని, ఇందుకు సహకరించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు చెప్పారు. 35 మంది కార్పొరేటర్లతో గతంలో అధికారంలో ఉన్న పార్టీ చోడిపల్లిని గుర్తించకపోయినా సీఎం గుర్తించి డిప్యూటీమేయర్గా చేశారన్నారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, మేయర్ సుంకర పావని తీరును వ్యతిరేకిస్తూ అంతా ఒక్కటై ఐక్యత కనబరిచారని ద్వారంపూడి పేర్కొన్నారు. ఉప మేయర్గా ఎన్నికైన చోడిపల్లి ప్రసాద్ మాట్లాడారు. ఉప మేయర్ జీవిత వివరాలు పేరు : చోడిపల్లి సత్యప్రసాద్ (ప్రసాద్ మాస్టారు) వయసు : 56 చదువు : బీఏ, బీఈడీ నేపథ్యం : 1995 నుంచి రెండుసార్లు కౌన్సిలర్గా, రెండుసార్లు కార్పొరేటర్గా నాలుగుసార్లు వరుస విజయాలు. తండ్రి చోడిపల్లి రామం 1982లో కౌన్సిలర్గా పోటీ చేసి స్వల్ప మెజార్టీతో ఓటమి. చిన్నాన్న హనుమంతరావు స్వాతంత్య్ర సమరయోధులు. నాలుగుసార్లు గెలిచినా వనమాడి అవకాశం దక్కనీయలేదు. వాడబలిజలకు దక్కిన అవకాశం డిప్యూటీ మేయర్ ఎన్నికలో వాడబలిజలకు సముచిత గౌరవం దక్కింది. కాకినాడ చరిత్రలో ఇదొక మంచి పరిణామమంటూ రాజకీయవర్గాల్లో చర్చ సాగుతోంది. దాదాపు 40వేల మంది మత్స్యకారులు ఉన్న కాకినాడలో 50శాతం వాడబలిజలు ఉన్నారు. ఇన్నాళ్ల రాజకీయ చరిత్రలో గతంలో ఎప్పుడూ ఈ వర్గానికి గుర్తింపు దక్కిన దాఖలా లేదు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కొద్దినెలల క్రితమే అగి్నకుల క్షత్రియ వర్గానికి చెందిన బంధన హరికి రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. ఇప్పుడు వాడబలిజలకు డిప్యూటీమేయర్ దక్కింది. మత్స్యకార వర్గం నుంచి ప్రాతినిథ్యం వహించిన టీడీపీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తన హయాంలో ఈ వర్గాలు రాజకీయంగా ఎదగకుండా అణగదొక్కే ప్రయతి్నంచారనే విమర్శలున్నాయి. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి చొరవతో వాడబలిజకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి డిప్యూటీమేయర్ కట్టబెట్టేందుకు గ్రీన్సిగ్నల్ ఇవ్వడం ద్వారా ఆ వర్గానికి వైఎస్సార్ సీపీ ఎలాంటి ప్రాధాన్యతనిస్తోందో చెప్పకనే చెప్పింది. బెడిసికొట్టిన చివరి క్షణ నిర్ణయం కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికకు దూరంగా ఉంటామని తొలుత ప్రకటించిన టీడీపీ చివరి నిముషంలో తన వైఖరిని మార్చుకుని పోటీలో నిలబడింది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుకు పార్టీ అధినేత నుంచి గట్టిగా మందలింపురావడతో పోటీ చేయాలని అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్నారు. వనమాడి వ్యవహారశైలి, నియంతృత్వ పోకడలపై అసంతృప్తిగా ఉన్న అనేక మంది టీడీపీ కార్పొరేటర్లు వ్యతిరేకంగా ఓటు చేయడంతోపాటు మరికొంత మంది సమావేశానికి హాజరుకాలేదు. -
ఓటమి భయంతో కాకినాడలో తోక ముడిచిన టీడీపీ
కాకినాడ: నగరపాలక సంస్థ రెండో డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఓటమి భయంతో టీడీపీ ముందే తోక ముడిచింది. ఈ ఎన్నికలో తమ పార్టీ పాల్గొనడం లేదంటూ ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మంగళవారం ప్రకటించారు. రెండో డిప్యుటీ మేయర్ ఎన్నికకు ప్రభుత్వం జీఓ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కాకినాడ కార్పొరేషన్లో రాజకీయం రసకందాయంలో పడింది. నాటి ఎన్నికల్లో టీడీపీకి 32 మంది కార్పొరేటర్లతో మేయర్ స్థానాన్ని దక్కించుకుంది. మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఒంటెద్దు పోకడలు, పార్టీ పట్ల అంకిత భావంతో పని చేసే వారిపై వ్యవహరిస్తున్న నిరంకుశ వైఖరితో చాలాకాలంగా టీడీపీ కార్పొరేటర్లు అసమ్మతితో రగిలిపోతున్నారు. ఆయన విధానాలు నచ్చక టీడీపీ మాజీ నగర అధ్యక్షుడు నున్న దొరబాబు ఇప్పటికే పార్టీకి దూరమయ్యారు. తాజాగా మెజార్టీ కార్పొరేటర్లు కూడా బయటకొచ్చేశారు. ప్రస్తుతం మేయర్తో కలిపి పది మందికి మించి కార్పొరేటర్లు కూడా ఆ పారీ్టలో లేరు. రాజకీయాలతో సంబంధం లేకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులమై తామంతా ఏకతాటిపై పని చేస్తామంటూ వైఎస్సార్ సీపీ, బీజేపీ, టీడీపీ కార్పొరేటర్లు ఏకాభిప్రాయానికి వచ్చారు. వారు తమ నిర్ణయాన్ని మీడియా ముందు ప్రకటించడంతో టీడీపీ కుడితిలో పడ్డ ఎలుక మాదిరిగా తయారైంది. దీంతో ఎన్నికలకు ముఖం చాటేయాలనే నిర్ణయానికి వచ్చింది. సంక్షేమానికి జై .. కాకినాడలోని 45 మంది కార్పొరేటర్లలో 35 మంది ఒక్కటిగా కలిసి ఉంటామంటూ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి సమక్షంలో మంగళవారం మీడియా ముందు ప్రకటించారు. 2017 ఎన్నికల్లో 48 డివిజన్లకు ఎన్నికలు జరగగా టీడీపీ 32, వైఎస్సార్ సీపీ 10, బీజేపీ 3, ఇండిపెండెంట్లు ముగ్గురు గెలిచారు. ముగ్గురు మృతి చెందగా ప్రస్తుతం 45 మంది ఉన్నారు. వీరిలో 35 మంది పార్టీ రహితంగా జగన్కు జై కొట్టారు. మేయర్ సుంకర పావని సహా 10 మంది మాత్రమే టీడీపీ పక్షాన నిలిచారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు నియంతృత్వ పోకడలతో విసుగెత్తిపోయమని.. సీఎం సంక్షేమ పథకాలకు ఆకర్షితులై తామంతా మద్దతుగా నిలిచామని ప్రకటించారు. వైఎస్సార్ సీపీకి జై కొట్టిన వీరందరూ బుధవారం రెండో డిప్యూటీ మేయర్ ఎన్నికలో ఏకతాటిపై ఉండాలని నిర్ణయించుకున్నారు. తామంతా ముఖ్యమంత్రి నాయకత్వంలో ద్వారంపూడికి మద్దతుగా పని చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. రెండో డిప్యూటీ మేయర్ ఎన్నిక బుధవారం ఉదయం 11 గంటలకు జరగనుంది. ఎన్నికల అధికారిగా జాయింట్ కలెక్టర్ వ్యవహరించనున్నారు. -
YSRCongress Party: చేతల్లో సామాజిక న్యాయం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వైఎస్సార్సీపీ సామాజిక న్యాయాన్ని మరోమారు చేతల్లో చూపించింది. సంక్షేమ పథకాలే కాదు.. పదవుల పంపకాల్లోనూ బడుగు, బలహీన వర్గాలకు అధిక ప్రాధాన్యమిస్తామని రుజువు చేసింది. నామినేటెడ్ పోస్టులు, నామినేషన్ పనుల్లోనూ వారికే ప్రాధాన్యమిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలోని నగరపాలక, పురపాలక సంస్థల పాలక వర్గాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు సముచిత స్థానం లభించింది. రాష్ట్ర వ్యాప్తంగా గత మార్చిలో ఎన్నికలు నిర్వహించిన 12 మునిసిపల్ కార్పొరేషన్లు, 74 మునిసిపాలిటీల్లో శుక్రవారం రెండో డిప్యూటీ మేయర్, రెండో వైస్ చైర్పర్సన్ ఎన్నిక నిర్వహించారు. వైఎస్సార్ జిల్లా మైదుకూరులో కోరం లేక రెండో మునిసిపల్ వైస్ చైర్పర్సన్ ఎన్నికను శనివారానికి వాయిదా వేశారు. నగరపాలక సంస్థల్లో రెండో డిప్యూటీ మేయర్, పురపాలక సంఘాల్లో రెండో వైస్ చైర్పర్సన్ పదవులకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. నగర, పట్టణ ప్రజలకు మరింతగా మెరుగైన సేవలందించేందుకు ఈ పదవులను సృష్టిస్తూ మునిసిపల్ చట్టాన్ని కూడా సవరించింది. ఆ మేరకు రెండో డిప్యూటీ మేయర్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక నిర్వహించేందుకు మునిసిపల్ పాలక మండళ్లు ప్రత్యేకంగా సమావేశమయ్యాయి. రాష్ట్రంలో 85 చోట్ల వైఎస్సార్సీపీ అభ్యర్థులు పదవులను దక్కించుకున్నారు. వీరిలో బీసీ, మైనార్టీలు 24 మంది, ఎస్సీలు 22 మంది, ఎస్టీలు ఇద్దరు ఉన్నారు. ఈ లెక్కన 56 శాతం మేర బడుగు, బలహీన వర్గాలకు చెందిన మొత్తం 48 మంది రెండో డిప్యూటీ మేయర్/వైస్ చైర్పర్సన్గా ప్రమాణ స్వీకారం చేయగా, 37 మంది ఓసీ కేటగిరి నుంచి ఆ స్థానాలు పొందారు. కాగా, అనంతపురం జిల్లా తాడిపత్రి మునిసిపాలిటీలో టీడీపీ మద్దతుదారుడు రెండో వైస్ చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. కేటాయింపునకు మించి.. వైఎస్సార్సీపీ గెలుపొందిన 12 మేయర్, 74 మునిసిపల్ చైర్పర్సన్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు 67 పదవులను కేటాయించిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుంది. నిజానికి చట్టప్రకారం 45 పదవులు కేటాయిస్తే సరిపోతుంది. కానీ జనరల్ కేటగిరిలోనూ బలహీన వర్గాలకు సీట్లు ఇచ్చి ప్రాధాన్యం కల్పించారు. 2019 ఎన్నికల్లో 60 శాతం సీట్లు ఇవ్వడమే కాకుండా మంత్రి వర్గంలోనూ 56 శాతం పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఇచ్చి దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించారు. అంతేకాకుండా 137 నామినేటెడ్ పదవుల్లో 58 శాతం మేర 79 పదవులు ఇచ్చారు. నామినేషన్ పనుల్లో 50 శాతం వారికి కేటాయించడంతో పాటు, వాటిలోనూ సగం మహిళలకే ఇవ్వాలని చట్టం చేసి సామాజిక న్యాయ సాధన దిశగా కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. ఐదుగురు ఉప ముఖ్యమంత్రుల్లో ఒక మహిళ సహా నలుగురు ఈ వర్గాలకు చెందిన వారే ఉన్నారు. 15 ఎమ్మెల్సీ పదవుల్లో బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలకే 11 కేటాయించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ 60 శాతం టికెట్లు, మున్సిపల్ మేయర్, చైర్ పర్సన్ పదవుల్లో 78 శాతం, వీటిలో 60.46 శాతం మహిళలకు ఇచ్చి రికార్డు సృష్టించారు. బీసీల కోసం ఇదివరకెన్నడూ లేని విధంగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. మాల, మాదిగ, రెల్లి కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు, ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక కమిషన్లు తీసుకువచ్చి సామాజిక న్యాయానికి అసలైన నిర్వచనాన్ని చేతల్లో చూపించారు. ఏలూరు మేయర్ ఎన్నిక ఏకగ్రీవం ఏలూరు టౌన్: ఏలూరు కార్పొరేషన్ నూతన మేయర్గా బీసీ మహిళ షేక్ నూర్జహాన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం నిర్వహించిన ఎన్నిక కార్యక్రమంలో మొదటి డిప్యూటీ మేయర్గా గుడిదేశి శ్రీనివాసరావు, రెండో డిప్యూటీ మేయర్గా నూకపెయ్యి సుధీర్బాబు, విప్గా పైడి భీమేశ్వరరావులను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఏలూరు కార్పొరేషన్ ప్రత్యేకాధికారి, జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా కొత్తగా కొలువుదీరిన పాలకవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. కాగా, నూర్జహాన్ మేయర్గా ఎన్నిక కావడం ఇది రెండోసారి. కోర్టు తీర్పు కారణంగా ఇక్కడ ఇటీవలే ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటించిన విషయం తెలిసిందే. -
నేడు రెండో డిప్యూటీ మేయర్/వైస్ చైర్పర్సన్ ఎన్నిక
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో మార్చిలో ఎన్నికలు నిర్వహించిన 12 మునిసిపల్ కార్పొరేషన్లు, 75 మునిసిపాలిటీల్లో నేడు (శుక్రవారం) రెండో డిప్యూటీ మేయర్/వైస్ చైర్పర్సన్ ఎన్నికను నిర్వహించనున్నారు. నగరపాలక సంస్థల్లో రెండో డిప్యూటీ మేయర్, పురపాలక సంఘాల్లో రెండో వైస్ చైర్పర్సన్ పదవులకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం కొన్ని నెలల కిందట నిర్ణయం తీసుకుంది. పట్టణ ప్రజలకు మరింత మెరుగైన సేవలందించేందుకు ఈ పదవులను సృష్టిస్తూ మునిసిపల్ చట్టాన్ని సవరించింది. ఆ మేరకు రెండో డిప్యూటీ మేయర్/వైస్ చైర్పర్సన్ ఎన్నిక నిర్వహించేందుకు శుక్రవారం మునిసిపల్ పాలకమండళ్లను ప్రత్యేకంగా సమావేశపరుస్తున్నారు. -
ఏపీలో శుక్రవారం కొలువుదీరనున్న రెండో డిప్యూటీ మేయర్లు. వైస్ చైర్మన్లు
-
ఈ నెల 30న ఏలూరు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక
సాక్షి, అమరావతి: ఈ నెల 30న ఏలూరు మేయర్, ఇద్దరు డిప్యూటీ మేయర్ల ఎన్నికలకి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. అదే రోజు రాష్ట్రంలోని 11 కార్పోరేషన్లు, 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో రెండవ డిప్యూటీ మేయర్, రెండవ వైస్ చైర్మన్ ఎంపికకి ఎస్ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది. పరోక్ష పద్దతిలో రెండవ డిప్యూటీ మేయర్, రెండవ వైస్ చైర్మన్ ఎంపిక ఉంటుందని ఎస్ఈసీ పేర్కొంది. 30వ తేదీ ప్రత్యేక సమావేశాలకి ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లు, కార్పోరేషన్ అధికారులను ఎస్ఈసీ ఆదేశించింది. ఎంపికైన కార్పోరేటర్లు, కౌన్సిలర్లు, ఎక్స్ అఫిషియో మెంబర్లకి ఈ నెల 26 లోపు సమాచారమివ్వాలని ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కార్పోరేషన్లు, మున్సిపాలిటీలలో ఇద్దరు డిప్యూటీ మేయర్లు, ఇద్దరు వైస్ చైర్మన్లను నియమించుకునేలా ఇప్పటికే ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. రెండవ డిప్యూటీ మేయర్, రెండవ వైస్ చైర్మన్ల ఎంపిక చేపట్టాలని ఎస్ఈసీని ప్రభుత్వం కోరడంతో ప్రత్యేక సమావేశం నిర్వహణకి నోటిఫికేషన్ జారీ చేసింది. -
వరంగల్ మేయర్గా గుండు సుధారాణి ఎన్నిక
-
వరంగల్, ఖమ్మం మేయర్లు వీరే..
సాక్షి, ఖమ్మం: గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ల మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక పూర్తయ్యింది. అనుకున్నట్లుగానే కమ్మ సామాజిక వర్గానికే ఖమ్మం మేయర్ పదవి దక్కింది. 26వ డివిజన్ నుంచి గెలిచిన పునుకొల్లు నీరజ ఖమ్మం మేయర్గా ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్ పదవి మైనార్టీ వర్గానికి దక్కగా.. ఖమ్మం 38వ డివిజన్ కార్పొరేటర్గా గెలిచిన ఫాతిమా పేరును అధిష్టానం ఖరారు చేసింది. వరంగల్ మహా నగరపాలక సంస్థ మేయర్ ఎన్నిక వరంగల్ మేయర్ పీఠానికి 29 వ డివిజన్ కార్పొరేటర్ గుండు సుధారాణి పేరును అధిష్టానం ఖరారు చేసింది. సుధారాణికి మేయర్ పీఠం ఖాయమన్న ప్రచారం ముందు నుంచి జరిగింది.. అధిష్టానం కూడా ఆమె పేరే ప్రకటించింది. డిప్యూటీ మేయర్ పదవికి రిజ్వాన షమీకి దక్కింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర సీనియర్ నేతలతో చర్చించి అధిష్టానం అభ్యర్థులను ఖరారు చేసింది. పార్టీ పట్ల విధేయత, అనుభవం, సామాజిక సమీకరణలను పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. డిప్యూటీ మేయర్ ఎంపిక ప్రక్రియ సజావుగా పూర్తయ్యేలా తెరాస ఎన్నికల పరిశీలకులు బాధ్యతలు నిర్వర్తించారు. మధ్యాహ్నం 3 గంటలకు కొత్త సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. మేయర్, చైర్పర్సన్ల కోసం పరోక్ష ఎన్నిక నిర్వహించారు. మేయర్ అభ్యర్థుల పేర్లతో కూడిన సీల్డ్ కవర్లను టీఆర్ఎస్ అధిష్ఠానం, పార్టీ పరిశీలకులకు అందించింది. వరంగల్కు మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, గంగుల కమలాకర్, పరిశీలకులుగా వ్యవహరించారు. కరోనా పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో 8 మంది కార్పొరేటర్లు గైర్హాజరు అయ్యారు. వీరితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి తద్వారా ఓటింగ్ ప్రక్రియ పూర్తిచేయడం జరిగింది. చదవండి: Municipal Polls: ఆ ఊపు లేదు.. హవా లేదు! -
విజయనగరం డిప్యూటీ మేయర్ కన్నుమూత
సాక్షి, విజయనగరం: విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ముచ్చు నాగలక్ష్మి(47) మంగళవారం రాత్రి కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె విజయనగరంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఒకటో డివిజన్ నుంచి కార్పొరేటర్గా గెలు పొందిన ఆమె మార్చి 18న డిప్యూటీ మేయర్గా బాధ్యతలు స్వీకరించారు. నాగలక్ష్మికి భర్త శ్రీనివాసరావు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా ఆమె మృతిపై కార్పొరేషన్ ఇన్చార్జి కమిషనర్ ప్రసాదరావు, ఇతర విభాగాల అధికారులు సంతాపం తెలుపుతూ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పదవి చేపట్టిన అనతికాలంలోనే మరణించడం చాలా బాధాకరమని పేర్కొన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. అసిస్టెంట్ సిటీ ప్లానర్ వెంకటేశ్వరరావు, ప్రజారోగ్య అధికారి డాక్టర్ సత్యనారాయణ, ఈఈ డాక్టర్ దిలీప్, కార్పొరేషన్ పాలకవర్గ సభ్యులు తమ సంతాపం తెలియజేశారు. చదవండి: మరి ఇలాగైతే కరోనా రాదా అండీ....? -
సీఎం వై ఎస్ జగన్ స్ఫూర్త్రితో ప్రజా సేవ చేస్తాం
-
మహిళా కార్పొరేటర్లతో జీవీఎంసీ కళకళ
-
డిప్యూటీ మేయర్లపై సీఎం జగన్ కీలక నిర్ణయం
తాడేపల్లి: డిప్యూటీ మేయర్లపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా ఇద్దరు డిప్యూటీ మేయర్లు, ఇద్దరు వైస్ ఛైర్మన్ల నియామకాన్ని చేపట్టనున్నారు. ఇందుకోసం మున్సిపల్ చట్టాన్ని సవరించనుంది. ఆర్డినెన్స్ తెచ్చిన తర్వాత ఈ నెల 18న యథాతథంగా మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు జరగనున్నాయి. ఇక పురపాలక ఎన్నికల్లో ఇదివరకెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో వైఎస్సార్సీపీ మొత్తం కార్పొరేషన్లను క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. 75 పురపాలక సంఘాలు, 11 కార్పోరేషన్లను గెలుచుకొని అఖండ విజయం సాధించింది.ఏపీ చరిత్రలో ఇంతవరకు ఒకే పార్టీకి ప్రజలు పట్టం కట్టడం ఇదే తొలిసారి. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ప్రజలు జై కొట్టడంతో.. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ.. ఇలా మూడు ప్రాంతాల్లోనూ వైఎస్సార్ సీపీ ఆధిక్యం కొనసాగడం విశేషం. దీంతో మూడు రాజధానులకు ప్రజలు మద్దతిచ్చినట్లు స్పష్టమవుతోంది. ఇక నగర పాలక సంస్థల్లో తుడిచి పెట్టుకుపోయిన టీడీపీ.. మున్సిపాలిటీలల్లోనూ బోర్లా పడింది. కనీసం ఒక్కటి కూడా గెలుచుకోలేకపోయింది. ఇక జనసేన, బీజేపీ, వామపక్ష పార్టీలు అసలు పత్తా లేకుండా పోయాయి. చదవండి : (మున్సిపల్ ఎన్నికల చరిత్రలో 'ఫ్యాన్' తుపాన్) (AP Municipal Elections Results: వైఎస్సార్ సీపీ సరికొత్త రికార్డు) -
మేయర్ పదవి ఆశించింది వాస్తవమే: మోతె శ్రీలతారెడ్డి
సాక్షి, బంజారాహిల్స్: గ్రేటర్ హైదరాబాద్లో త్వరలోనే బస్తీ యాత్ర చేపట్టి స్థానిక సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని నూతనంగా ఎన్నికైన జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలిపారు. గురువారం ఆమె ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. పేద, మధ్య తరగతి ప్రజలకు ఉచిత వైద్యం అందుబాటులో ఉండే విధంగా నగరంలోని ప్రతి బస్తీలో బస్తీ దవాఖానాలు, కమ్యూనిటీ హాళ్లు ఉండాలన్నదే తన లక్ష్యమని, ఇప్పుడున్న బస్తీ దవాఖానాలు మరింత పెంచేందుకు కృషి చేస్తానని చెప్పారు. డ్రెయినేజీ వ్యవస్థ అధ్వానంగా ఉందని మెరుగు పరిచేందుకు తగిన ప్రణాళికలు రూపొందిస్తామని తన తొలి ప్రాధాన్యత కూడా ఇదేనన్నారు. రోడ్లు చాలా చోట్ల దెబ్బతిన్న విషయాన్ని గుర్తించామని, వాటిని కూడా బాగు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అవినీతి రహిత జీహెచ్ఎంసీని రూపొందించడమే తన లక్ష్యమని వెల్లడించారు. కరప్షన్ ఫ్రీ అనేది తన లక్ష్యంగా పెట్టుకున్నానన్నారు. అవినీతిపై ఎందాకైనా వెళ్లి పోరాడతానని స్పష్టం చేశారు. నగర అభివృద్ధి కోసం పార్టీలకతీతంగా అందరి సలహాలు తీసుకుంటానని వెల్లడించారు. మహిళల భద్రతకు ప్రాధాన్యమిస్తానని మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు మహిళలకు ఇవ్వడంపై సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్లకు గ్రేటర్ మహిళల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు తెలిపారు. గతంలో మహిళా మేయర్లు ఉన్నా ఒకే సమయంలో మేయర్, డిప్యూటీ మేయర్ మహిళలకే ఇచ్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. హైదరాబాద్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు పాటుపడతానని, ఐటీ హబ్గా ఉన్న నగరాన్ని హెల్త్ హబ్గా, పరిశుభ్రమైన నగరంగా మార్చడమే తన లక్ష్యమన్నారు. హైదరాబాద్ను ఎంతో అభివృద్ధి చేశారు నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కొంత మందే మహిళలు ఉండేవారని, కార్పొరేటర్గా గెలిచిన తర్వాత ఒక్కొక్కరిగా వందల సంఖ్యలో మహిళలు రావడం తనకెంతో తృప్తి కలిగించిన అంశమన్నారు. ఈ ప్రభుత్వంలోనే మహిళలకు ఎన్నో అవకాశాలు దక్కాయని, ప్రతి రంగంలోనూ మహిళలు దూసుకుపోతున్నారని వెల్లడించారు. మహిళగా గర్వపడుతున్నానన్నారు. మహిళలే ముందుండి తనను నడిపించారని ప్రతి గెలుపులోనూ బంజారాహిల్స్ డివిజన్ మహిళల పాత్ర ఎంతో కీలకమన్నారు. తన వెన్నంటి నిలిచి ఉన్నతిని కోరుకున్నారని వారికి ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వంలో పని చేస్తున్నందుకు ప్రతిఒక్కరూ గర్విస్తున్నారని వెల్లడించారు. కేసీఆర్, కేటీఆర్ హైదరాబాద్ను ఎంతో అభివృద్ధి చేశారు. నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. నగర అభివృద్ధి విషయంలో అలుపెరుగని కృషి చేస్తా. జీహెచ్ఎంసీలో లోటు బడ్జెట్ ఉందన్న విషయాన్ని బాధ్యతలు స్వీకరించిన తర్వాత సమీక్షిస్తా. అందరితో కలిసి ప్రజలకు మెరుగైన సేవలందించే విధంగా ప్రణాళికలు రూపొందిస్తాం. విశ్వనగరం సాధిస్తాం. చదవండి: ‘మంచిగ ఉంటేనే బట్టకాల్చి మీదేసే రోజులివి’ ప్రమాణ స్వీకారంలో పదనిసలు నాన్న ఆశీర్వాదం.. బంజారాహిల్స్: జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల ప్రమాణ స్వీకార మహోత్సవం గురువారం నిర్వహించారు. ఉదయం టీఆర్ఎస్ కార్పొరేటర్లు తెలంగాణ భవన్కు వచ్చారు. బంజారాహిల్స్ కార్పొరేటర్ గద్వాల విజయలక్ష్మి పేరును మేయర్గా సీల్డ్ కవర్లో తీసుకెళ్లారు. సమావేశానికి హాజరయ్యే ముందు గద్వాల విజయలక్ష్మి తన నివాసంలో తండ్రి కేకే ఆశీస్సులు తీసుకున్నారు. పూజలు చేసి.. బంజారాహిల్స్: ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్లేముందు జీహెచ్ఎంసీ మేయర్గా ఎన్నికైన గద్వాల విజయలక్ష్మి ఎన్బీటీనగర్లోని శివాలయంలో, అయ్యప్ప స్వామికి, సాయిబాబాకు పూజలు నిర్వహించారు. దైవభక్తి అధికంగా ఉన్న ఆమె ప్రతిరోజూ ఈ ఆలయంలో పూజలు నిర్వహిస్తుంటారు. ఇక్కడ సాయిబాబా ఆలయాన్ని ఆమె సొంత నిధులతో కట్టించారు. బయోడేటా పేరు : గద్వాల విజయలక్ష్మి భర్త : బాబిరెడ్డి తల్లిదండ్రులు: కే.కేశవరావు, వసంత కుమారి పుట్టిన తేదీ: 28–01–1964 వయసు : 56 విద్యార్హత : బీఏ, ఎల్ఎల్బీ, జర్నలిజం నివాసం : బంజారాహిల్స్, ఎన్బీటీ నగర్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తా: డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతారెడ్డి సికింద్రాబాద్: తనకు లభించిన జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ పదవిని తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా లభించిన గౌరవంగా భావిస్తున్నానని మోతె శ్రీలతారెడ్డి చెప్పారు. సికింద్రాబాద్ నియోజకవర్గం తార్నాక డివిజన్ నుంచి కార్పొరేటర్గా గెలిచిన మోతె శ్రీలతారెడ్డి గురువారం జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. \ మొదటిసారి కార్పొరేటర్గా గెలిచి, డిప్యూటీ మేయర్గా ఎన్నిక కావడంతో ఎలా ఫీలవుతున్నారు? నన్ను డిప్యూటీ మేయర్ చేయడంతో ఉద్యమకారులకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందన్న భావనను మరోమారు బలపరిచింది. తెలంగాణ ఉద్యమం తొలిరోజు నుంచి నా భర్త శోభన్రెడ్డి ఉన్నారు. ఆయన ఉద్యమ పటిమకు ప్రతిఫలం అనుకుంటున్నాను. డిప్యూటీతో అసంతృప్తికి గురయ్యారా? ఉద్యమ సమయంలోనూ, రాష్ట్రం ఏర్పాటయ్యాక మొత్తంగా 21 సంవత్సరాలు టీఆర్ఎస్తోనే ప్రయాణించాం. మేయర్ పదవి ఆశించింది వాస్తవమే. డిప్యూటీతో అయినా గుర్తింపు లభించినందుకు సంతృప్తి లభించింది. నగర అభివృద్ధిలో మీ భాగస్వామ్యం ఎలా ఉంటుంది? మేయర్ గద్వాల విజయలక్ష్మికి నగర అభివృద్ధిలో సంపూర్ణ సహకారం అందిస్తా. టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నాటి నుంచి నగరం శరవేగంగా అభి వృద్ధి చెందుతోంది. సీఎం కేసీఆర్, మున్సిపల్ మంత్రి కేటీఆర్ చూపిన మార్గంలో అభివృద్ధి పనులు చేపడతాం. ఈ ప్రాంతం నుంచి గెలిచిన మీరు సికింద్రాబాద్ ప్రాంతానికి ఏం చేస్తారు? దశాబ్దాలుగా సికింద్రాబాద్ ప్రాంత సమస్యలు తెలుసు. ఇక్కడి నుంచి డిప్యూటీ స్పీకర్ టీ.పద్మారావుగౌడ్, పశుసంవర్ధక శాఖ మంత్రిగా తలసాని శ్రీనివాస్యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం నుంచి డిప్యూటీ మేయర్ కావడం గర్వంగా ఉంది. వారిద్దరి సహకారంతో సికింద్రాబాద్ను అన్ని విధాలా అభివృద్ధి చేసే దిశగా ప్రయత్నిస్తాను. బయోడేటా పేరు: మోతె శ్రీలతారెడ్డి భర్త: శోభన్రెడ్డి, తెలంగాణ ఉద్యమకారుడు. తల్లిదండ్రలు: బేతి యశోధ, రంగారెడ్డి. పుట్టిన తేదీ: 01–03–1971. వయసు: 49 సంవత్సరాలు. విద్యార్హత: బీఏ సంతానం: ఇద్దరు అమ్మాయిలు. రాజీవి, శ్రీతేజస్విని (అమెరికాలో ఉంటున్నారు). నివాసం: తార్నాక, సికింద్రాబాద్. -
ఆశావహులు నిరుత్సాహపడొద్దు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) మేయర్, డిప్యూటీ మేయర్గా అవకాశం దక్కని కార్పొరేటర్లు నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. పార్టీ కోసం పనిచేసే వారికి భవిష్యత్తులో అవకాశాలు వస్తాయని, పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తూ ఎన్నిక సజావుగా జరిగేందుకు సహకరించాలని ఆయన కోరారు. జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు టీఆర్ఎస్ తరఫున గెలిచిన కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్న మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు గురువారం ఉదయం 8.30 గంటలకు పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎక్స్ అఫీషియో సభ్యులు, కార్పొరేటర్లతో మంత్రి కేటీఆర్, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు సమావేశమయ్యారు. మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థుల పేర్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడిస్తారని కేటీఆర్ పేర్కొన్నారు. గ్రేటర్లో నెలకొన్న రాజకీయ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని విప్ జారీ చేసినట్లు వెల్లడించారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా అనుసరించాల్సిన పద్ధతిని మంత్రి వివరించారు. అనంతరం టీఆర్ఎస్ కార్పొరేటర్లు ఎక్స్ అఫీషియో సభ్యులతో కలసి బస్సుల్లో తెలంగాణ భవన్ నుంచి జీహెచ్ఎంసీ కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు. బస్సులో ఎమ్మెల్సీ గోరటి వెంకన్న తన ఆటా పాటలతో కార్పొరేటర్లను ఉత్సాహ పరిచారు. ఎన్నిక ప్రక్రియ ముగిసిన తర్వాత మంత్రులు మహమూద్ అలీ, తలసాని, విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ కవిత తదితరులతో కలసి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నూతన మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు అసెంబ్లీ ఎదురుగా ఉన్న తెలంగాణ అమర వీరుల స్తూపం వద్ద నివాళి అర్పించారు. -
‘మంచిగ ఉంటేనే బట్టకాల్చి మీదేసే రోజులివి’
సాక్షి, హైదరాబాద్: ‘కోట్లాది మందిలో కేవలం కొద్ది మందికి మాత్రమే సందర్భం కలిసి వచ్చి ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యే అవకాశం వస్తుంది. అది గొప్ప విషయం కాదు. ప్రజాప్రతినిధిగా ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజాజీవితంలో మంచి పేరు తెచ్చుకోవడం గొప్ప విషయం. మంచిగ ఉంటేనే బట్టకాల్చి మీదేసే రోజులివి. కొద్దిగా అవకాశం ఇస్తే చాలా చెడ్డపేరు వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి’ అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు కొత్తగా ఎంపికైన జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్, టీఆర్ఎస్ కార్పొరేటర్లకు హితువు పలికారు. విభిన్న ప్రాంతాలు, విభిన్న సంస్కృతులకు చెందిన ప్రజలు నివాసముంటున్న హైదరాబాద్ నగరం అసలుసిసలైన విశ్వనగరంగా, మినీ ఇండియాగా భాసిల్లుతోందన్నారు. ఈ నగర వైభవాన్ని మరింత పెంచే విధంగా మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు పాటుపడాలని పిలుపునిచ్చారు. మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతారెడ్డి, టీఆర్ఎస్ కార్పొరేటర్లు గురువారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారిని అభినందించి కర్తవ్య బోధ చేశారు. విజయలక్ష్మికి నియామక పత్రాన్ని అందజేస్తున్న సీఎం కేసీఆర్. చిత్రంలో డిప్యూటీ మేయర్ శ్రీలత ప్రతి ఒక్కరినీ ఆదరించాలి... ‘పదవిలో ఉన్న వారు ఎంతో సంయమనం, సహనంతో, సాదాసీదాగా ఉండాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ సహజత్వం కోల్పోవద్దు. వేష భాషల్లో మార్పులు రావద్దు. అసంబద్ధంగా, అవసరం లేని మాటలు మాట్లాడితే వచ్చే లాభమేమీ లేకపోగా కొన్ని సందర్భాల్లో వికటించే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాలి. మీ దగ్గరికి వచ్చే వాళ్ల కులం, మతం చూడవద్దు. ప్రతి ఒక్కరినీ ఆదరించాలి. అక్కున చేర్చుకోవాలి. సరైన గౌరవం ఇవ్వాలి. వారు చెప్పేది ఓపికగా వినాలి. చేతనైనంత సాయం చేయాలి. అబద్ధాలు చెప్పవద్దు. సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో ప్రయత్నించాలి’ అని ముఖ్యమంత్రి చెప్పారు. బస్తీ సమస్యలే ప్రధాన లక్ష్యం కావాలి.. ‘గల్లీ చిన్నది.. గరీబోళ్ల కథ పెద్దది అనే గోరటి వెంకన్న పాట వినండి. నేను వందసార్లు విన్నా. అందులో బస్తీల్లో ఉండే పేదల కష్టాలు, గోసలున్నాయి. వాటిని అర్థం చేసుకోవాలి. మేయర్, కార్పొరేటర్లు బస్తీల్లో పర్యటించాలి. వారి బాధలు అర్థం చేసుకోవాలి. బస్తీ సమస్యలు తీర్చాలి. అదే ప్రధాన లక్ష్యం కావాలి’అని సీఎం చెప్పారు. ‘హైదరాబాద్కి అనేక అనుకూలతలున్నాయి. మంచి భవిష్యత్తు ఉన్నది. నిజమైన విశ్వనగరమిది. బయటి రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన అనేక మంది ఉన్నారు. నగరంలో సింధ్ కాలనీ ఉంది. గుజరాతి గల్లీ ఉంది. పార్సీగుట్ట ఉంది. బెంగాలీలున్నారు. మలయాళీలున్నారు. మార్వాడీలున్నారు. విభిన్న ప్రాంతాలు, మతాలు, సంస్కృ తుల వారున్నారు. వారంతా హైదరాబాదీలుగా గర్విస్తున్నారు. హైదరాబాద్ ఓ మినీ ఇండియాలాగా ఉంటుంది. అందరినీ ఆదరించే ప్రేమగల నగరం. ఇంత గొప్ప నగరం భవిష్యత్తు కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లపై ఉన్నది. మీరు గొప్పగా పనిచేసి ఈ నగర వైభవాన్ని పెంచాలి. ప్రభుత్వం కూడా హైదరాబాద్ను అభివృద్ధి చేయడానికి అనేక కార్యక్రమాలు చేపడుతుంది. వాటికి సహకరించాలి’అని సీఎం పిలుపునిచ్చారు. అందరికీ మేయర్ పదవి ఇవ్వలేము... అర్థం చేసుకోండి.. ‘ఇంత మంది కార్పొరేటర్లున్నారు. కానీ ఒక్కరికే మేయర్గా అవకాశం దక్కుతుంది. మీలో మేయర్ కావాల్సిన అర్హతలున్న వారు చాలా మంది ఉన్నారు. కానీ అందరికీ ఇవ్వలేము. నా పరిస్థితుల్లో మీరున్నా అంతే చేయగలరు. అర్థం చేసుకుని, అందరూ కలసికట్టుగా ఈ నగరాన్ని ముందుకు తీసుకుపోవాలి’అని సీఎం కేసీఆర్ అన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె. కేశవరావు, రాజ్యసభ సభ్యులు సురేశ్రెడ్డి, సంతోశ్కుమార్, మంత్రు లు తలసాని, మహమూద్ అలీ, ఇంద్రకరణ్రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ పాల్గొన్నారు. -
క్యాంపులు నిర్వహించొద్దు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల నేపథ్యంలో ఏ రాజకీయ పార్టీ లేదా అభ్యర్థి, ఎన్నికైన ప్రతినిధులతో ప్రత్యక్షంగాగానీ, పరోక్షంగాగానీ ఎలాంటి క్యాంపులు(శిబిరాలు) నిర్వహించొద్దని రాష్ట్ర ఎన్నికల కమిషన్(ఎస్ఈసీ) స్పష్టం చేసింది. లంచం లేదా ప్రలోభాలకు గురిచేయొద్దని, రాజకీయ పార్టీలు, మేయర్ / డిప్యూటీ మేయర్ వంటి పదవులను ఆశిస్తున్న వారు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అక్రమపద్ధతులు పాటించడం, ప్రోత్సహించడం చేయొద్దని పేర్కొంది. జీహెచ్ఎంసీ చట్టం, భారత శిక్షాస్మృతి(ఐపీసీ)లలోని నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహణ ప్రారంభసమయానికి 48 గంటల ముందు నుంచి ఎలాంటి ప్రచారం లేదా ప్రచార కార్యకలాపాలు చేపట్టవద్దని, ఈ నిషేధం ఈ ఎన్నికలు పూర్తయ్యేవరకు కొనసాగుతుందని స్పష్టం చేసింది. శనివారం ఈ మేరకు ప్రత్యేక ప్రవర్తనా నియమావళిని ఎస్ఈసీ జారీ చేసింది. ప్రభావితం చేయొద్దు..: రాజకీయపార్టీలు జారీ చేసిన విప్లకు వ్యతిరేకంగా ఓటు చేసే విధంగా ఎన్నికైన సభ్యులను ప్రభావితం చేయవద్దని ఎస్ఈసీ తెలిపింది. రాజకీయ పార్టీలు, ఆ పార్టీల అభ్యర్థుల్లో ఎవరైనాగానీ పరోక్ష ఎన్నికల్లో ఓటర్లు వారి ఓటుహక్కులను వినియోగించే సందర్భంలో వారిని ప్రలోభపరచడానికి ప్రయత్నించొద్దని తెలిపింది. ఏదైనా రాజకీయపార్టీ, మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు పోటీ పడుతున్నవారు ఓటర్లు, వారి ఓటింగ్ హక్కులను వినియోగించుకునే సందర్భంలో పార్టీ విప్ను ధిక్కరించేందుకుగాను ప్రోత్సాహకంగా వారికి ఎలాంటి పదవిని ఇవ్వజూపొద్దని పేర్కొంది. అధికార పార్టీ లేదా ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు/అధికారులు సర్టిఫికెట్లు, లైసె న్సులు, కాంట్రాక్టు పనులు, పెండింగ్ కేసులను ఎత్తివేయడం, పెండింగ్ బిల్లులు చెల్లించడం, కాంట్రాక్టుల పునరుద్ధరణ, ఇతర ప్రోత్సాహకాలు, ఇతర పద్ధతుల్లో దుర్వినియోగానికి ప్రయత్నిం చొద్దని స్పష్టం చేసింది. ఎన్నికల సందర్భంగా ప్రత్యర్థులపై విచారణ సం స్థల ద్వారా కేసుల నమోదు లేదా చార్జి షీట్ల దాఖలు/రూపకల్పన, అరెస్టులు, నాన్ బెయిలబుల్ వారెంట్లు వంటి వాటి అమలులో పక్షపాతానికి పాల్పడవద్దని పేర్కొంది. -
ఫిబ్రవరి 11న జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నిక
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) మేయర్ ఎన్నిక ఫిబ్రవరి 11న జరగనుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం శుక్రవారం నోటిఫికేషన్ను జారీచేసింది. వచ్చేనెల 11వ తేదీన ఉదయం 11 గంటలకు కొత్తగా ఎన్నికైన జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో ప్రిసైడింగ్ అధికారి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అదే రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు నిర్వహించే ప్రత్యేక సమావేశంలో ముందుగా మేయర్ ఎన్నిక జరుగుతుంది. ఆ తర్వాత డిప్యూటీ మేయర్ను ఎన్నుకుంటారు. ఏవైనా అనివార్య కారణాల వల్ల 11న ఈ ఎన్నిక నిర్వహించలేని పక్షంలో మరుసటి రోజు 12న (ఒకవేళ సెలవు రోజు అయినప్పటికీ) ఈ ఎన్నిక నిర్వహిస్తారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ పరోక్ష ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్తో పాటు దీనికి సంబంధించిన విధానపరమైన సూచనలను విడుదల చేసినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారథి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొత్తగా ఎన్నికైన 150 మంది కార్పొరేటర్లతో పాటు గ్రేటర్లో ఎక్స్అఫీషియో సభ్యులుగా నమోదైన లోక్సభ, రాజ్యసభ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కూడా సమావేశానికి సంబంధించిన సమాచారాన్ని 6వ తేదీకల్లా తెలియజేస్తారు. గత ఏడాది డిసెంబరు ఒకటో తేదీన జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 56, బీజేపీ 48, ఎంఐఎం 44, కాంగ్రెస్ 2 స్థానాలు గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈసారి మేయర్ స్థానం జనరల్ మహిళకు రిజర్వు అయింది. -
డిప్యూటీ మేయర్ కుమారుల వీరంగం
అనంతపురం సెంట్రల్: నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ గంపన్న కుమారులు వీరంగం సృష్టించారు. కొంతమంది పోకిరీలను వెంట బెట్టుకుని తాగి గొడవ చేస్తుండడంతో అడ్డుకునేందుకు ప్రయత్నించిన ముగ్గురు యువకులపై ఇష్టానుసారంగా దాడి చేశారు. ఈ ఘటన బుధవారం రాత్రి విద్యుత్నగర్ సర్కిల్ సమీపంలో చోటు చేసుకుంది. బాధితుల కథనం మేరకు... డిప్యూటీ మేయర్ గంపన్న కుమారులు రఘు, ధను మరో పదిమంది యువకులను వెంట బెట్టుకొని విద్యుత్నగర్ సర్కిల్ ప్రాంతంలో హల్చల్ చేశారు. సమీపంలోని క్యాంటీన్ నిర్వాహకుడు రాజేష్ వారిని వారించాడు. తాగి గొడవ చేస్తుండటంతో వారిని ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించాడు. దీంతో డిప్యూటీ మేయర్ కుమారులు రెచ్చిపోయారు. మమ్మల్నే పొమ్మనే వాడివా అంటూ కట్టెలు, రాడ్లతో దాడికి తెగబడ్డారు. తొలుత రాజేష్పై దాడి చేస్తుండగా గమనించిన రాజేష్ సోదరులు ప్రకాష్, ముఖేష్లు అడ్డుకోబోయారు. దీంతో ప్రకాష్ తలపై బండతో దాడి చేయడంతో తీవ్రరక్తస్రావమైంది. ఈ ఘటనలో అన్నదమ్ములు ముగ్గురికీ తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ముగ్గురినీ కుటుంబ సభ్యులు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తాగి గొడవ చేస్తుండగా వారించినందుకు తమపై గంపన్న కుమారులు, మరికొంతమంది యువకులను వెంట బెట్టుకొని వచ్చి దాడికి పాల్పడ్డారని బాధితులు పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. క్యాంటీన్లోని ఫర్నీచర్, ఇతర వస్తువులను కూడా ధ్వంసం చేశారని తెలిపారు. టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఆఫీసులో రాజకీయాలు మాట్లాడొద్దు !
సాక్షి, చిత్తూరు అర్బన్: చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కొందరు టీడీపీ మహిళా కార్పొరేటర్ల భర్తలు రాజకీయాల గురించి విస్తృతంగా చర్చిస్తున్నారనే సమాచారం కమిషనర్ ఓబులేసుకు తెలిసింది. దీంతో కార్యాలయ సిబ్బంది, అధికారులను పిలిపించిన కమిషనర్ ‘ఆఫీస్లోపల రాజకీయాల గురించి ఏఒక్కరూ మాట్లాడొద్దు. చర్చలు పెట్టడానికి కూడా వీల్లేదు. రాజకీయ నాయకులు వస్తే వారి నుంచి దూరంగా ఉండండి. ఏదైనా ఉంటే నాతో మాట్లాడమని చెప్పండి’ అంటూ గట్టిగా మందలించారు. అలాగే కార్యాలయంలోని డెప్యూటీ మేయర్ చాంబర్లో ఆయనలేనప్పుడు కొందరు టీడీపీ కార్యకర్తలు కూర్చుని కబుర్లు చెప్పుకోవడం కూడా గమనించిన కమిషనర్ ఆ గదిని లాక్ చేయించి తాళాలు డెప్యూటీ మేయర్కు అప్పగించారు. బయటకు వెళ్లేటప్పుడు తాళాలు వేసుకుని వెళ్లాలని సూచించారు. ఇక కార్యాలయంలో హెచ్చరిక నోటీసులు అతికించి ఎవరైనా ఆఫీసులో రాజకీయాలు మాట్లాడితే కోడ్ ఉల్లంఘన కింద చర్యలు తీసుకుంటామని అందులో పేర్కొన్నారు. -
బెంగళూరు డిప్యూటీ మేయర్ హఠాన్మరణం
సాక్షి, బెంగళూరు : కొత్తగా ఎన్నికైన బెంగళూరు డిప్యూటీ మేయర్ రమీలా ఉమాశంకర్ (44) హఠాన్మరణం దిగ్ర్భాంతికి గురి చేసింది. కేవలం వారంరోజుల క్రితమే ఎన్నికైన నగర డిప్యూటీ మేయర్ శుక్రవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. కర్ణాటకలోని కావేరిపుర వార్డు నుండి 44 జేడీఎస్ కార్పొరేటర్ ఎన్నికైన ఆమె సెప్టెంబరు 28 న బృహత్ బెంగళూరు మహానగర పాలిక (బీబీఎంపీ) డిప్యూటీ మేయర్గా నియమితులయ్యారు. నగర చరిత్రలో రెండవసారి మేయర్ (గంగాంబిక మల్లికార్జున్)గా డిప్యూటీ మేయర్గా ఇద్దరు మహిళలు ఎంపికయ్యి రికార్డు సృష్టించారు. కానీ ఇంతలోనే ఈ విషాదం చోటు చేసుకోవడంతో రాష్ట్ర రాజకీయ నేతలు ఇతర నగరు ప్రముఖులు తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా డిప్యూటీ మేయర్ రమీలా ఆకస్మిక మరణంపై ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. అక్టోబర్ 4 న జరిగిన నమ్మ మెట్రో ఆవిష్కరణ కార్యక్రమంలో తనతోపాటు ఆమె పాల్గొన్నారని గుర్తు చేసుకున్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. చాలా చిన్న వయసునుంచే సామాజిక సేవలో చురుకుగా ఉంటూ, రమీలా ఉమాశంకర్ నగరానికి చాలా సేవ చేశారంటూ మాజీ ప్రధాని, జేడీఎస్ చీఫ్ హెచ్డీ దేవెగౌడ తన సంతాపాన్ని ప్రకటించారు. నిబద్ధత కల ఒక పార్టీ కార్యకర్త రమీలా ఇక లేరన్నవార్త తను షాక్కు గురి చేసిందన్నారు. -
అవిశ్వాసానికి కౌంట్డౌన్
సాక్షి,పెద్దపల్లి: రామగుండం బల్దియాలో అవిశ్వా సంపై కౌంట్డౌన్ మొదలైంది. మేయర్, డిప్యూటీ మేయర్పై ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై ఆగస్టు 2న ప్రత్యేక సమావేశం నిర్వహించనుండడంతో, రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అవిశ్వాసం తీర్మానం ఇచ్చి దాదాపు పదిహేను రోజులు గడుస్తున్నా.. ప్రత్యేక సమావేశం తేదీ ప్రకటించకపోవడంతో కాస్త అయోమయం నెలకొంది. ఎట్టకేలకు వచ్చే నెల 2న అవిశ్వాసం తీర్మాన ప్రక్రియ చేపట్టనుండడంతో ఇరువర్గాల్లో కదలికవచ్చింది. నోటీసులు జారీ అవిశ్వాసం ఆగస్టు 2న పెట్టనున్నట్లు అధికారికంగా వెల్లడి కావడంతో అధికారులు తమ ప్రక్రి యను మొదలు పెట్టారు. అవిశ్వాసం తీర్మానం పెట్టిన కార్పొరేటర్లకు బుధవారం నోటీసులు అందజేశారు. మేయర్ కొంకటి లక్ష్మినారాయణ, డిప్యూటి మేయర్ సాగంటి శంకర్పై పెట్టిన అవిశ్వాస తీర్మానంపై టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు చెందిన 39 మంది కార్పొరేటర్లు సంతకాలు చేశారు. అయితే ఇందులో ఇద్దరి సంతకాల్లో తేడా రావడంతో 37 మందికి అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే మరో ముగ్గురితో కలిపి మొత్తం 40 మంది కార్పొరేటర్లు అవిశ్వాసానికి మద్దతుగా ఉన్నారని ఎమ్మెల్యే వర్గం చెబుతోంది. కాంగ్రెస్పైనే మేయర్ ఆశలు! అవిశ్వాసం తేదీ ఖరారు కావడంతో అందరి దృష్టి మేయర్ కొంకటి లక్ష్మినారాయణపై పడింది. ఇప్పటికే దాదాపు 40 మంది కార్పొరేటర్లు అవిశ్వాసానికి అనుకూలంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుండడం, 37 మంది సంతకాలు చేసినట్లు ‘అధికారికంగా’ గుర్తించడంతో మేయర్ ఏం చేయబోతున్నారనే అంశంపై సర్వత్రా చర్చ సాగుతోంది. టీఆర్ఎస్ అధిష్టానం సానుకూలంగా స్పందించకపోవడంతో మేయర్ ప్రస్తుతం ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీపై ఆశలు పెంచుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీకి అధికారికంగా 20 మంది కార్పొరేటర్లు ఉండడంతో ఆ పార్టీ పాత్ర ఇప్పుడు కీలకంగా మారింది. ఇందు లో ఇప్పటికే 9 మంది టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. మిగిలిన 11 మందిలో తొమ్మిది మంది అ విశ్వాసానికి అనుకూలంగా సంతకాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ సహకారంతో పాటు తానంటే అభి మానం ఉన్న కార్పొరేటర్లు సహకరిస్తే ఎలాగోలా గట్టెక్కచ్చని మేయర్ భావిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్లో భిన్న వాదనలు అవిశ్వాసంపై కాంగ్రెస్ పార్టీలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. పార్టీ కార్పొరేటర్లు అవిశ్వాసానికి బలంగా మద్దతు పలుకుతుండగా, పార్టీ నేతలు మాత్రం భిన్నంగా ఆలోచిస్తున్నారు. అధికార పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలను కాంగ్రెస్కు అనుకూలంగా మార్చుకోవాలని పార్టీ నేతలు భావిస్తున్నట్లు సమాచారం. అందుకే అవిశ్వాసంపై బహిరంగంగా వ్యాఖ్యానించడం లేదు. అయితే మేయర్ను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ కార్పొరేటర్లు మాత్రం, అవిశ్వాసంపై పునరాలోచన లేదని స్పష్టం చేసినట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం. ‘అవిశ్వాసంలో మేయర్కు అనుకూలంగా వ్యవహరించి టీఆర్ఎస్ను దెబ్బతీస్తే ఎలా ఉంటుందనే ఓ ఆలోచనను మా నాయకులు చేశారు. కానీ అలాంటి ఆలోచన పెట్టుకోవద్దని, ప్రతిపక్ష పార్టీగా తామే అవిశ్వాసం పెట్టామని.. ఇప్పుడు వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని తేల్చిచెప్పాం’ అని ఓ కాంగ్రెస్ కార్పొరేటర్ ‘సాక్షి’కి వెల్లడించారు. ఏదేమైనా అవిశ్వాసం తేదీ ప్రకటించడంతో రామగుండంలో రాజకీయ పరిణామాలు వేగం పుంజుకొన్నాయి. -
అమెరికాలో డిప్యూటీ మేయర్గా చెన్నై మహిళ
టీ.నగర్: అమెరికాలో డిప్యూటీ మేయర్గా చెన్నైకు చెందిన మహిళ ఎన్నికయ్యారు. చెన్నైకు చెందిన మహిళ షెపాలి రంగనాథన్(38) ఈమె అమెరికాలో సీటిల్ నగర డిప్యూటీ మేయర్గా ఎన్నికయ్యారు. ఈమె ఒక స్వచ్ఛంద సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు. షెపాలి తండ్రిపేరు రంగనాథన్. తల్లి పేరు షెరిల్. వీరు చెన్నైలో ఉంటున్నారు. ఇలా ఉండగా షెపాలి తన విద్యాభ్యాసాన్ని చెన్నై నుంగంబాక్కంలో గల గుడ్షెప్పర్డ్ కాన్వెంట్లో పూర్తి చేశారు. స్టెల్లా మేరీస్ కళాశాలలో బీఎస్సీ జువాలజీ పట్టా పొందారు. అన్నావర్సిటీలో ఎన్విరాన్మెంటల్ సైన్స్లో ఉత్తీర్ణులై బంగారు పతకాన్ని పొందారు. 2001లో ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లారు. అంతేకాకుండా షెపాలి రంగనాథన్ చెన్నై బోట్క్లబ్లో నిర్వహించిన అనేక పడవ పోటీల్లో పాల్గొన్నారు. -
'మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల ఎక్స్గ్రేషియా'
హైదరాబాద్ : హైటెక్ సిటీ అయ్యప్ప సొసైటీలోని మ్యాన్హోల్లో పడి నలుగురు కార్మికులు మృతి చెందిన ఘటనపై నగర డిప్యూటీ మేయర్ ఫసీయుద్దీన్ ఆదివారం స్పందించారు. మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అలాగే వారి కుటుంబాలకు డబుల్ బెడ్ రూం ఇల్లు కేటాయిస్తామన్నారు. అంతకుముందు ఉస్మానియా యూనివర్శిటీ సమీపంలోని మాణికేశ్వర్ నగర్లో రహదారిపై మృతుల కుటుంబాలు ఆందోళనకు దిగాయి. ఈ నేపథ్యంలో డిప్యూటీ మేయర్ పై విధంగా స్పందించారు. హైటెక్ సిటీ అయ్యప్ప సొసైటీలో మ్యాన్హోల్లో పడి శనివారం నలుగురు కార్మికులు మృతి చెందారు. మెట్రో వాటర్ వర్స్క్ పనుల్లో భాగంగా మ్యాన్హోల్ శుభ్రం చేస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న మున్సిపల్ అధికారులు, డిప్యూటీ మేయర్ ఫసియుద్దీన్ కార్మికులను ఆస్పత్రికి తరలించేందుకు చర్యలు తీసుకున్న ఫలితం లేకుండా పోయింది. అప్పటికే కార్మికులు మృతి చెందారు. మ్యాన్హోల్లో చిక్కుకున్న వారిని కాపాడబోయి గంగాధర్ అనే వ్యక్తి మృతి చెందిన సంగతి తెలిసిందే. మృతులను ఓయూ మాణికేశ్వర్ నగర్కు చెందిన సత్యనారాయణ, నగేష్, చందు జీహెచ్ఎంసీ కాంట్రాక్టు ఉద్యోగులుగా గుర్తించారు. -
దటీజ్ ‘బాబా’..
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి రోడ్లపై నిలిచిన నీటి తొలగింపు చర్యల్లో డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ సెంట్రల్ ఎమర్జెన్సీ టీమ్తో కలిసి ఆయన అర్ధరాత్రి నుంచి తెల్లవారు జాము వరకు సిబ్బందితో కలిసి రోడ్లపై నీటిని తొలగించే వరకు పనుల్ని పర్యవేక్షించారు. -
లాటన్ డిప్యూటీ మేయర్గా భారతీయ జర్నలిస్టు
లండన్: విదేశాల్లో భారతీయుల హవా కొనసాగుతోంది. అమెరికాలో కీలక పదవుల్లో భారతీయులు నియమితులవుతుండగా అటు యూకేలోనూ కీలక పదవులను దక్కించుకుంటున్నారు. తాజాగా ఓ భారతీయ జర్నలిస్టు లాటన్ నగర డిప్యూటీ మేయర్గా ఎన్నికయ్యాడు. అదీ ఏకగ్రీవంగా. వివరాల్లోకెళ్తే.. జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభించిన భారతీయుడు ఫిలిప్ అబ్రహాం ఇప్పటికే లాటన్ నగరంలో కౌన్సిలర్గా కొనసాగుతున్నారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో బరిలోకి దిగడంతో ప్రత్యర్థులెవరూ పోటీకి నిలబడలేదు. దీంతో ఫిలిప్ డిప్యూటీ మేయర్ పదవికి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు నూతన మేయర్ కారల్ డేవిస్ ప్రకటించారు. ప్రస్తుతం డిప్యూటీ మేయర్గా ఎన్నికైనవారు వచ్చే ఏడాదికి మేయర్ పదోన్నతి పొందడం ఇక్కడి విధానం. అబ్రహం కేరళకు చెందిన జర్నలిస్టు. 2012లో జరిగిన లాటన్ ఎన్నికల్లో కౌన్సిలర్గా విజయం సాధించారు. -
ట్రాఫిక్ ఏఎస్సైపై డిప్యూటీ మేయర్ దాడి
నిజామాబాద్: విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ ఏఎస్సైపై నిజామాబాద్ నగర డిప్యూటీ మేయర్ దాడికి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు డిప్యూటీ మేయర్ ఫయిమ్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఒకటో టౌన్ ఎస్హెచ్వో నాగం రవీందర్ తెలిపిన వివరాలివీ.. నగర ట్రాఫిక్ పోలీసులు బస్టాండ్ ఎదుట శుక్రవారం మధ్యాహ్నం వాహనాలు తనిఖీ చేస్తుండగా నగర డిప్యూటీ మేయర్ ఫయీం కుమారుడు బషీర్ అదునన్, అతని స్నేహితుడు బైక్పై అటువైపు వచ్చారు. ట్రాఫిక్ ఏఎసై శ్యాంకుమార్ వారిని ఆపి బైక్ కాగితాలను చూపించాలని అడిగారు. దానికి వారు అది డిప్యూటీ మేయర్కు సంబంధించి బైక్ అని బదులిచ్చారు. అయినా సరే కాగితాలు చూపించాలని అనటంతో వారు గొడవకు దిగారు. ఆయన్ను దూషించారు. అక్కడే ఉన్న ట్రాఫిక్ ఎస్సైలు నరేష్, టాటాబాబు సముదాయించినా ఆగలేదు. బైక్కు నంబర్, టీఆర్ రిజిస్ట్రేషన్ లేక పోవటంతో దానిని స్వాధీనం చేసుకున్నారు. విషయం తెలిసి అక్కడికి చేరుకున్న డిప్యూటీ మేయర్ ఆగ్రహంతో ఏఎస్సై శ్యాంకుమార్తో వాగ్వాదానికి దిగాడు. ఏఎసై షర్ట్ పట్టుకుని పక్కకు నెట్టివేయటంతో బటన్ ఊడింది. ట్రాఫిక్ ఎస్సైలు డిప్యూటీ మేయర్ను సముదాయించగా వారిపైనా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ బైక్పై వచ్చిన వారిని తన వాహనంలో ఎక్కించుకుని వెళ్లిపోయాడు. అనంతరం ఏఎసై శ్యాంకుమార్ ఒకటో టౌన్ పోలీస్స్టేషన్కు వచ్చి ఎస్హెచ్వో రవీందర్కు ఫిర్యాదు చేశారు. డిప్యూటీ మేయర్పై సెక్షన్ 353, బైక్పై వచ్చిన వారిపై రెడ్విత్ 34 కింద కేసు నమోదు చేసినట్లు ఎస్హెచ్వో తెలిపారు. -
వరంగల్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక
హైదరాబాద్ : వరంగల్ మహానగరపాలక సంస్థ మేయర్గా నన్నపనేని నరేందర్, డిప్యూటీ మేయర్ గా సిరాజుద్దీన్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం 58 డివిజన్ల కార్పొరేటర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రెసిడింగ్ అధికారిగా జాయింట్ కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎంపీలు గుండు సుధారాణి, దయాకర్, ఎమ్మెల్యేలు కొండా సురేఖ, దాస్యం వినయ్భాస్కర్, ధర్మారెడ్డి, రమేశ్, తదితరులు పాల్గొన్నారు. మేయర్ ఎన్నిక సందర్భంగా తెరాస శ్రేణులు పెద్ద ఎత్తున బాణాసంచా పేలుస్తూ సంబరాలు చేసుకున్నారు. గ్రేటర్ వరంగల్లో 58 డివిజన్లకు గానూ 44 డివిజన్లలో టీఆర్ఎస్ గెలుపొందిన విషయం విదితమే. నరేందర్ 19వ డివిజన్ నుంచి పోటీ చేసి 881 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. సిరాజుద్దీన్ 41వ డివిజన్ నుంచి బరిలో నిలిచి గెలిచారు. -
ఖమ్మం మేయర్ గా పాపాలాల్ ఎన్నిక
హైదరాబాద్: ఖమ్మం కార్పొరేషన్ నూతన పాలకవర్గం మంగళవారం ఉదయం కొలువుదీరింది. మేయర్ గా డాక్టర్ పాపాలాల్, డిప్యూటీ మేయర్ గా బత్తుల మురళీ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉదయం 11 గంటలకు ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ లోకేష్కుమార్ కార్పొరేటర్లు, మేయర్, డిప్యూటీ మేయర్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఎన్నికైన మేయర్, డిప్యూటీ మేయర్లను రోడ్డు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అభినందించారు. అయితే మేయర్ ఎన్నికపై టీఆర్ఎస్ కార్పొరేటర్ రామ్మూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నిక జరిగే వరకు రామ్మూర్తిని టూటౌన్ పీఎస్ నిర్బంధించినట్టు తెలుస్తోంది. మేయర, డిప్యూటీ ఎన్నిక తర్వాతే కార్పొరేటర్ గా రామ్మూర్తి చేత ప్రమాణం స్వీకారం చేయించారు. కాగా సోమవారం రాత్రి వరకు కూడా మేయర్, డిప్యూటీ మేయర్ల విషయమై అధికారికంగా ఎటువంటి ప్రకటన వెలువడలేదు. సీల్డ్ కవర్లోనే మేయర్, డిప్యూటీ మేయర్ల పేర్లను ఉంచి ఎన్నిక సమయంలోనే అభ్యర్థలను ప్రకటించారు. డిప్యూటీ మేయర్ పదవికి విపరీతమైన పోటీ నెలకొంది. ఎక్కువ సంఖ్యలో ఆశావహులు ఈ పదవి కోసం పోటీ పడ్డారు. -
డిప్యూటీ మేయర్ను చేసిన ఉద్యమం
సొంతూరు పున్నేలు.. రాయపురలో నివాసం ఇదీ డిప్యూటీ మేయర్ ఖాజా సిరాజుద్దీన్ ప్రస్తానం హన్మకొండ చౌరస్తా : తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన మలిదశ ఉద్యమంలో ప్రదర్శించిన పోరాట పటిమ.. ఓ యువకుడికి కీలక పదవి తెచ్చిపెట్టింది. మైనార్టీ కావడంతో పాటు ఉద్యమంలో పాల్గొనడం ఆయనకు కలిసొచ్చాయి. కార్పోరేషన్ ఎన్నికల బరిలోకి అనూహ్యంగా వచ్చిన ఖాజా సిరాజుద్దీన్ను ఇప్పుడు డిప్యూటీ మేయర్ పదవి వరించడంపై మైనార్టీల్లో ఆనందాన్ని నింపింది. తండ్రి ప్రభుత్వ ఉద్యోగి.. వర్దన్నపేట మండలం పున్నేలు సిరాజొద్దీన్ సొంత ఊరు. ఆయన తండ్రి షంషుద్దీన్ జిల్లాలోని నల్లబెల్లి మండలం ఎంఆర్ఓ ఆఫీసులో సూపరింటెండెంట్గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. కొంతకాలం క్రితం ఆయన కన్నుమూశారు. ఈ మేరకు తల్లి ముర్షదీబేగం, భార్య మెహరాజ్, ఇద్దరు కుమార్తెలు నిఫ్రా, ముస్కాన్తో కలిసి హన్మకొండలోని పాత రాయపురలో సిరాజుద్దీన్ నివాసముంటున్నారు. కాగా తమకు సొంత ఊరు పున్నేలులో వ్యవసాయ భూమి ఉందని సిరాజుద్దీన్ సోదరుడు తాజుద్దీన్ తెలిపారు. తండ్రి ఉద్యోగం కోసం దశాబ్దాల క్రితం ఊరు నుంచి వచ్చినప్పటికీ సొంతూరు, అక్కడి ప్రజలతో ఇప్పటికీ సంబందాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. 2001 నుంచి టీఆర్ఎస్లో.. డిగ్రీ పూర్తి చేసిన సిరాజుద్దీన్ 2001 నుంచి టీఆర్ఎస్లో పనిచేస్తున్నారు. పార్టీలో అర్బన్, జిల్లా ప్రధాన కార్యదర్శి పదవులు చేపట్టారు. ఇటీవల గ్రేటర్ ఎన్నికల్లో 41వ డివిజన్ నుంచి పోటీ చేసిన ఆయన స్వతంత్య్ర అభ్యర్థి పుప్పాల ప్రభాకర్పై 733 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. సిరాజుద్దీన్ సంతానమైన నిఫ్రా ఎనిమిదో తరగతి, ముస్కాన్ నాలుగో తరగతి నయీంనగర్లోని తేజస్వి పాఠశాలలో చదువుతున్నారు. -
పీఠం కోసం..
♦ మేయర్ పదవి దక్కించుకునేందుకు ముమ్మర యత్నాలు ♦ రేసులో ముందున్న నన్నపనేని, గుండా ప్రకాశ్ ♦ డిప్యూటీ మేయర్ పరిశీలనలో జోరిక, బోడ డిన్న ♦ కీలక నేతల వద్దకు ఆశావహుల పరుగులు సాక్షి ప్రతినిధి, వరంగల్ : గ్రేటర్ వరంగల్ మేయర్ ఎన్నికకు సమయం దగ్గరపడుతోంది. మరో రెండు రోజుల్లో ఈ కీలక ప్రక్రియ పూర్తి కానుంది. వరంగల్ మహా నగరపాలక సంస్థ(జీడబ్ల్యూఎంసీ) ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి భారీ విజయం సాధించింది. కార్పొరేషన్లోని 58 డివిజన్లకు గాను టీఆర్ఎస్ 44 స్థానాల్లో విజయం సాధించింది. స్వతంత్రులుగా పోటీ చేసి గెలిచిన ఎనిమిది మంది కూడా అధికార పార్టీలోనే చేరే అవకాశం ఉంది. టీఆర్ఎస్కు తిరుగులేని మెజారిటీ ఉండడంతో మేయర్ పదవి ఎవరికి దక్కుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కార్పొరేటర్లుగా గెలిచిన పలువురు ముఖ్య నేతలు ఈ పదవి కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. హైదరాబాద్లో మకాం వేసి పార్టీ కీలక నేతలను కలిసి తమ కోరికను చెప్పుకుంటున్నారు. అధినేత కేసీఆర్ ఆశీస్సుల కోసం ప్రయత్నిస్తున్నారు. గులాబీ పార్టీ ముఖ్య నేతలు టి.హరీశ్రావు, కె.టి.రామారావు, కల్వకుంట్ల కవిత వద్దకు వెళ్లి మేయర్ పదవి వచ్చేలా తమకు సహకరించాలని కోరుతున్నారు. గ్రేటర్ వరంగల్ పరిధిలోని ఎమ్మెల్యేలు డి.వినయభాస్కర్, కొండా సురేఖ, అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, టి.రాజయ్యతోపాటు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని కలుస్తున్నారు. వివరాలు సేకరిస్తున్న అధిష్టానం.. మేయర్ పదవి ఎవరికి అప్పగించాలనే విషయంపై టీఆర్ఎస్ దృష్టి పెట్టింది. పదవిని ఆశిస్తున్న కీలక నేతల వివరాలను సేకరిస్తోంది. అధికార పార్టీ కావడంతో అన్ని రకాలుగా సమాచారం తీసుకుంటోంది. ఇంటెలిజెన్స్ నివేదికలను కూడా పరిశీలిస్తోంది. 19వ డివిజన్ కార్పొరేటర్గా గెలుపొందిన నన్నపునేని నరేందర్ పేరును మేయర్ పదవికి టీఆర్ఎస్ అధిష్టానం ప్రధానంగా పరిశీలిస్తోంది. గ్రేటర్ వరంగల్ టీఆర్ఎస్ అధ్యక్షుడిగా, ఆర్టీసీ టీఎంయూ వరంగల్ రీజియన్ గౌరవాధ్యక్షుడిగా కీలకంగా పని చేసిన నేపథ్యం ఆయనకు అనుకూలిస్తోంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గం టికెట్ చివరి నిమిషయంలో చేజారడం నరేందర్కు కలిసివచ్చే మరో అంశంగా ఉంది. కాగా, అధిష్టానం పరిశీలనలో 26వ డివిజన్ కార్పొరేటర్గా గెలిచిన గుండా ప్రకాశ్రావు కూడా ఉన్నారు. గ్రేటర్ వరంగల్ మేయర్ పదవి జనరల్ కేటగిరికి కేటాయించినందున గుండా ప్రకాశ్రావుకు అవకాశం ఇవ్వాలని ఆర్యవైశ్య మహాసభ కోరుతోంది. ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ నేతృత్వంలో పలువురు సంఘం ముఖ్యులు గుండా ప్రకాశ్కు మేయర్ పదవి కోసం టీఆర్ఎస్ అధిష్టానం వద్ద ప్రయత్నిస్తున్నారు. 37వ డివిజన్ కార్పొరేటర్ కోరబోయిన సాంబయ్య పేరును మేయర్ పదవి కోసం పరిశీలించాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్ అధిష్టానాన్ని కోరుతున్నారు. 27వ డివిజన్ కార్పొరేటర్ వద్దిరాజు గణేష్ సైతం మేయర్ పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. వద్దిరాజు గణేష్కు ఇప్పటికీ టీఆర్ఎస్ సభ్యత్వం లేకపోవడం పదవి విషయంలో అడ్డంకిగా మారుతోంది. ‘డిప్యూటీ’పై పలువురి కన్ను.. మేయర్ పదవి సీనియర్ నేతలకు దక్కనున్న నేపథ్యంలో డిప్యూటీ మేయర్ పదవి కోసం ఎక్కువ మంది నేతలు ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్ తరహాలో తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేసిన వారికి ఈ పదవి ఇవ్వవచ్చనే అభిప్రాయం టీఆర్ఎస్లో వ్యక్తమవుతోంది. తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీలకంగా పాల్గొన్న 30వ డివిజన్ కార్పొరేటర్ బోడ డిన్న, 34వ డివిజన్ కార్పొరేటర్ జోరిక రమేశ్, 41వ డివిజన్ కార్పొరేటర్ ఎండీ ఖాజా సిరాజొద్దిన్, 36వ డివిజన్ కార్పొరేటర్ అబూబక్కర్, 6వ డివిజన్ నుంచి గెలుపొందిన చింతల యాదగిరి పేర్లను టీఆర్ఎస్ అధిష్టానం డిప్యూటీ మేయర్ పదవి కోసం పరిశీలిస్తోంది. ఎన్నికల ముందు పార్టీలో చేరిన వారు, పార్టీలో క్రీయాశీలకంగా పని చేయని వారు సైతం ఈ పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నా టీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. -
'గ్రేటర్' మేయర్గా బొంతు రామ్మోహన్
హైదరాబాద్: జీహెచ్ఎంసీ మేయర్గా బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్గా బాబా ఫసియుద్దీన్ లకు పట్టం కట్టడం ఖాయమైంది. జీహెచ్ఎంసీలోని మొత్తం 150 డివిజన్లలో టీఆర్ఎస్ ఏకంగా 99 స్థానాలు గెలుచుకున్న నేపథ్యంలో... మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు రెండూ ఆ పార్టీకే దక్కాయి. చర్లపల్లి డివిజన్ నుంచి కార్పొరేటర్గా బొంతు రామ్మోహన్, బోరబండ కార్పొరేటర్ గా ఫసియుద్దీన్ గెలుపొందారు. కార్పొరేటర్లతో కేటీఆర్ ప్రత్యేక భేటీ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖల బాధ్యతలు కూడా తీసుకున్న మంత్రి కేటీఆర్... టీఆర్ఎస్ కార్పొరేటర్లతో గురువారం ఉదయం 8 గంటలకు తెలంగాణ భవన్లో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ ప్రచార బాధ్యతలను భుజాన వేసుకుని అన్నీ తానై వ్యవహరించిన కేటీఆరే మేయర్ ఎన్నికల బాధ్యతను కూడా చూసుకున్నారు. సీఎం కేసీఆర్ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు పేర్లను ఖరారు చేయగా కార్పొరేటర్ల సమావేశంలో కేటీఆర్ వారి పేర్లను ప్రకటించారు. గ్రేటర్ మేయర్గా రామ్మోహన్, డిప్యూటీ మేయర్గా బాబా ఫసియుద్దీన్ పేర్లను మంత్రి జగదీష్ రెడ్డి ప్రతిపాదించగా, కార్పొరేటర్లు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ' ౩ నెలల్లో స్టాండింగ్ కమిటీలు ఏర్పాటు చేస్తాం. వచ్చే 3 నెలల్లో జీహెచ్ఎంసీలో పదవులు అన్నీ భర్తీ చేస్తాం. ప్రజలు చారిత్రాత్మక తీర్పునిచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కార్పొరేటర్లు ముందుండాలి' అని అన్నారు. భేటీ తర్వాత కార్పొరేటర్లంతా జీహెచ్ఎంసీ కార్యాలయానికి చేరుకున్నారు. -
‘గ్రేటర్’ మేయర్ బొంతు రామ్మోహన్ ?
- డిప్యూటీ మేయర్గా బాబా ఫసియుద్దీన్! - టీఆర్ఎస్ కార్పొరేటర్లతో నేడు మంత్రి కేటీఆర్ ప్రత్యేక భేటీ - ఉదయం 11 గం.కు మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక - ఎక్స్అఫీషియో సహా మొత్తం ఓట్లు 217... - ఇందులో టీఆర్ఎస్కు ఉన్నవి 134 సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)పై గులాబీ జెండా గురువారం అధికారికంగా ఎగరనుంది. జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నికకు అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. జీహెచ్ఎంసీలోని మొత్తం 150 డివిజన్లలో టీఆర్ఎస్ ఏకంగా 99 స్థానాలు గెలుచుకున్న నేపథ్యంలో... మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు రెండూ ఆ పార్టీ చేతుల్లోనే ఉండనున్నాయి. ఈ పదవులు ఎవరిని వరించనున్నాయన్న దానిపై అధికారికంగా ఎలాంటి ప్రకటనా వె లువడలేదు. అయితే పార్టీ వర్గాల సమాచారం మేరకు... చర్లపల్లి డివిజన్ నుంచి కార్పొరేటర్గా గెలిచిన బొంతు రామ్మోహన్ను మేయర్ పదవికి, బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ను డిప్యూటీ మేయర్ పదవికి దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరి పేర్లను పార్టీ అధ్యక్షుడు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. గురువారం మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక జరుగనుంది. అంతకంటే ముందు కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఉదయం 11 గంటల నుంచి ఈ కార్యక్రమాలు ప్రారంభం కానున్నట్లు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా తెలిపారు. నేడు కార్పొరేటర్లతో కేటీఆర్ ప్రత్యేక భేటీ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖల బాధ్యతలు కూడా తీసుకున్న మంత్రి కేటీఆర్... టీఆర్ఎస్ కార్పొరేటర్లతో గురువారం ఉదయం 8 గంటలకు తెలంగాణ భవన్లో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ ప్రచార బాధ్యతలను భుజాన వేసుకుని అన్నీ తానై వ్యవహరించిన కేటీఆరే మేయర్ ఎన్నికల బాధ్యతను కూడా చూస్తున్నారు. మరోవైపు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఇప్పటికే మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు పేర్లను ఖరారు చేశారని చెబుతున్నారు. గురువారం ఉదయం జరిగే కార్పొరేటర్ల సమావేశంలో వారి పేర్లను ప్రకటించే అవకాశముంది. ఈ భేటీ తర్వాత కార్పొరేటర్లంతా జీహెచ్ఎంసీ కార్యాలయానికి చేరుకుంటారు. పదకొండు గంటలకు జరిగే మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో పాల్గొంటారు. ఈ ఎన్నికకు సంబంధించి కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లకు టీఆర్ఎస్ బుధవారం విప్ జారీ చేసింది. ఏకగ్రీవమే నూటా యాభై డివిజన్లు ఉన్న జీహెచ్ఎంసీలో సగానికిపైగా అంటే 76 డివిజ న్లను గెలుచుకున్న పార్టీ మేయర్ స్థానానికి సరిపడా మెజారిటీ సాధించినట్లు లెక్క. టీఆర్ఎస్ ఏకంగా 99 డివిజన్లలో గెలుపొందింది. టీడీపీ ఒక స్థానంలో, కాంగ్రెస్ రెండు, బీజేపీ నాలుగు, ఎంఐఎం 44 స్థా నాల్లో గెలుపొందాయి. అంటే టీఆర్ఎస్ మినహా ఏ ఇతర పార్టీ పోటీపడే అవకాశం లేకపోవడంతో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు ఏకగ్రీవమయ్యే అవకాశముంది. ఈ ఎన్నికలో జీహెచ్ఎంసీలో ఎక్స్అఫీషి యో సభ్యులుగా ఓట్లున్న ఎమ్మెల్యేలు, ఎం పీలు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీల ఓట్లు అవసరం ఉండడం లేదు కూడా. అయితే జీహెచ్ఎంసీ పరిధిలో 67 ఎక్స్అఫీషియో సభ్యుల ఓట్లున్నాయి. వారి ఓట్లనూ పరిగణనలోకి తీసుకుంటే మొత్తం 217 ఓట్లు అవుతున్నాయి. టీఆర్ఎస్కే అత్యధికంగా 35 మంది ఎక్స్అఫీషియో సభ్యులున్నారు. వీరినీ కలుపుకొంటే టీఆర్ ఎస్ ఏకంగా 134 ఓట్లతో ఇతర పార్టీలకు అందనంత దూరంలో ఉంది. దీంతో మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక లాంఛనప్రాయమే . -
కొత్త మేయర్ పై ఉత్కంఠ!
♦ అధికార టీఆర్ఎస్లో జోరుగా చర్చలు ♦ ప్రచారంలో బొంతు రామ్మోహన్, విజయలక్ష్మి పేర్లు ♦ మరో ఇద్దరు బీసీ నేతలూ రేసులో ఉన్నారంటున్న పార్టీవర్గాలు ♦ అధినేత మదిలో ఎవరున్నారో తెలియని పరిస్థితి ♦ 11న మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక.. అదే రోజున తొలి సమావేశం సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్ఎస్లో ప్రస్తుతం మేయర్ పదవిపై జోరుగా చర్చ సాగుతోంది. ఈ ఎన్నికల్లో 150 డివిజన్లకుగాను టీఆర్ఎస్ 99 డివిజన్లను సొంతం చేసుకుని సింగిల్ మెజారిటీ పార్టీగా అవతరించింది. దీంతో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు ఎవరిని వరిస్తాయనేది ఉత్కంఠగా మారింది. ఈసారి మేయర్ పీఠం బీసీ జనరల్కు రిజర్వు అయింది. పరోక్ష పద్ధతిలో కార్పొరేటర్లే మేయర్, డిప్యూటీ మేయర్లను ఎన్నుకుంటారు. అసలు మేయర్ ఎన్నికకు సంబంధించి ఇప్పటిదాకా తమ అభ్యర్థి ఎవరన్న విషయాన్ని టీఆర్ఎస్ బయటపెట్టలేదు. ఎందుకంటే సరిపడ మెజారిటీ రాకుంటే ఎంఐఎంతో పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితిని టీఆర్ఎస్ ఎదుర్కుని ఉండేది. కాబట్టే ముందుగా మేయర్ అభ్యర్థి విషయాన్ని పక్కన పెట్టిందనే అభిప్రాయముంది. కానీ ఎక్స్అఫీషియో ఓట్లు కూడా అవసరం లేకుండానే మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను కైవసం చేసుకునే స్థాయిలో టీఆర్ఎస్ మెజారిటీ సాధించింది. దీంతో కార్పొరేటర్లుగా గెలిచిన పలువురు నేతల్లో ఆశలు పెరిగిపోయాయి. ఎన్నికల ప్రచారం సమయంలోనే టీఆర్ఎస్ మేయర్ అభ్యర్థులుగా పార్టీ యువజన విభాగం నేత బొంతు రామ్మోహన్, పార్టీ సెక్రెటరీ జనరల్, ఎంపీ కె.కేశవరావు (కేకే) కుమార్తె విజయలక్ష్మిల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. వలస సంఖ్యే ఎక్కువ: ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఒకింత వింత పరిస్థితిని ఎదుర్కొంది. హైదరాబాద్లో పెద్దగా పట్టులేకపోవడం, క్షేత్రస్థాయిలో సరైన నాయకత్వం లేకపోవడంతో తొలుత డివిజన్లలో పోటీ పడగలిగిన అభ్యర్థుల కొరత వెంటాడింది. అయితే టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా చేపట్టిన ‘ఆపరేషన్ ఆకర్ష్ ’తో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలకు చెందిన పలువురు మాజీ కార్పొరేటర్లు గులాబీ గూటికి చేరారు. దాంతో ఆయా డివిజన్లలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ముందు నుంచీ పార్టీలో కొనసాగిన నేతలు, వారి కుటుంబ సభ్యులకు కార్పొరేటర్లుగా అందివచ్చిన అవకాశం కంటే... వివిధ పార్టీల నుంచి వలస వచ్చి టికెట్లు దక్కించుకుని విజయం సాధించిన వారి సంఖ్యే ఎక్కువగా ఉంది. గత జీహెచ్ఎంసీ పాలకవర్గంలో కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ ఫ్లోర్లీడర్లుగా వ్యవహరించిన వారు సైతం ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున బరిలోకి దిగి గెలిచారు. కానీ వారెవరూ ఇప్పటికిప్పుడు మేయర్ పీఠాన్ని ఆశించే పరిస్థితి లేదు. దీంతో ఒకవిధంగా టీఆర్ఎస్లో మేయర్ పదవి కోసం పెద్దగా పోటీ లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు అధినేత కేసీఆర్ మనసులో ఏముందో తెలుసుకోలేకపోతున్నామని పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రధానంగా బొంతు రామ్మోహన్, గద్వాల విజయలక్ష్మిల పేర్లు ప్రచారంలో ఉన్నాయని, మరో ఇద్దరు బీసీ నేతలూ ఆశిస్తున్నారని అంటున్నారు. టీఆర్ఎస్ కొత్త కార్పొరేటర్లంతా శనివారం సీఎం కేసీఆర్ను కలసినప్పుడూ మేయర్ అభ్యర్థిత్వం అంశం చర్చకు రాలేదని సమాచారం. ఎన్నిక జరగాల్సిన 11వ తేదీ దాకా మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థుల విషయంలో ఇదే గోప్యత కొనసాగవచ్చని చెబుతున్నారు. మరోవైపు కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లతో జీహెచ్ఎంసీ తొలి సర్వసభ్య సమావేశం కూడా 11వ తేదీనే జరగనుంది. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.జి.గోపాల్ శనివారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. -
11న మేయర్ ఎన్నిక
♦ జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్దన్రెడ్డి ♦ విజయవంతంగా ఎన్నికలు నిర్వహించాం ♦ పురానాపూల్ రీపోలింగ్లో 47.04 శాతం ఓటింగ్ సాక్షి, హైదరాబాద్: మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక ఈనెల 11వ తేదీన జరుగుతుందని జీహెచ్ఎంసీ కమిషనర్, ఎన్నికల అధికారి బి.జనార్దన్రెడ్డి తెలిపారు. ఈ ఎన్నికలకు సంబంధించిన నోటీసును శుక్రవారమే నూతన కార్పొరేటర్లకు అందజేసినట్లు చెప్పారు. హైదరాబాద్ కలెక్టర్ ఈ ఎన్నికకు ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరిస్తారన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల అనంతరం జనార్దన్రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో గెలిచిన కార్పొరేటర్లందరికీ వెంటనే గెలుపు ధ్రువపత్రాలు అందజేశామని చెప్పారు. పురానాపూల్లో రీపోలింగ్ సందర్భంగా 47.04 శాతం పోలింగ్ నమోదైందన్నారు. ఒక్క జాంబాగ్ కేంద్రంలో మాత్రం రీకౌంటింగ్ జరిగిందని తెలిపారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఈసారి గతంలో కంటే అతి తక్కువగా ఫిర్యాదులు అందాయని... ఈవీఎంలలో కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని చెప్పారు. ఎంతో సవాల్తో కూడుకున్న ఎన్నికల నిర్వహణను అందరి సహకారంతో విజయవంతంగా పూర్తిచేశామన్నారు. పోలింగ్లో, కౌంటింగ్లో ఎలాంటి సమస్యలు తలెత్తలేదని... సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వినియోగించుకున్నామని జనార్దన్రెడ్డి పేర్కొన్నారు. మేయర్ ఎన్నిక విధానమిదీ.. 11వ తేదీన జరుగనున్న ఎన్నికలో కార్పొరేటర్లలో ఒకరిని మేయర్గా ఎన్నుకుంటారు. ఇందులో కార్పొరేటర్లతో పాటు జీహెచ్ఎంసీలో ఎక్స్అఫీషియో సభ్యులుగా ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకూ ఓటు హక్కు ఉంటుంది. మేయర్ ఎన్నికకు దాదాపు మూడు రోజుల ముందు ఎక్స్అఫీషియో సభ్యులకు ఆహ్వానాలు పంపుతారు. ఈ ఎక్స్అఫీషియో సభ్యులెవరూ ఇతర ఏ కార్పొరేషన్లోనైనా ఎక్స్అఫీషియో హోదాలో ఓటు వేసి ఉండకూడదు. ఈ మేరకు డిక్లరేషన్పై వారు సంతకం చేయాల్సి ఉంటుంది. ఇక కార్పొరేటర్లు, ఎక్స్అఫీషియో సభ్యులందరినీ సభా మందిరంలో పార్టీల వారీగా కూర్చోబెడతారు. చేతులెత్తే పద్ధతి ద్వారా మేయర్ పదవికి ఓటింగ్ నిర్వహిస్తారు. గుర్తింపుపొందిన రాజకీయ పార్టీలు విప్ జారీ చేస్తాయి. ఎవరైనా విప్ను ఉల్లంఘించినా... వారు వేసిన ఓటు చెల్లుబాటవుతుంది. కానీ వారిని ఆయా పదవి నుంచి అనర్హులను చేసే అవకాశం ఉంటుంది. మేయర్ ఎన్నిక కు మొత్తం ఓటర్ల (కార్పొరేటర్లు, ఎక్స్అఫీషియో సభ్యులు)లో కనీసం సగం మంది హాజరైతేనే కోరం ఉన్నట్లు లెక్క. కోరం లేని పక్షంలో గంటసేపు వేచి చూస్తారు. అప్పటికీ సరిపోయినంత మంది సభ్యులు రాకుంటే ఎన్నికను మరుసటి రోజుకు వాయిదా వేస్తారు. తర్వాతిరోజు కూడా కోరం లేకపోతే తిరిగి నిరవధికంగా వాయిదా వేసి ఎన్నికల సంఘానికి నివేదిస్తారు. ఎన్నికల సంఘం నిర్ణయం ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయి. మేయర్ ఎన్నిక పూర్తయిన వెంటనే డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహిస్తారు. -
ఫిబ్రవరి 11న మేయర్ ఎన్నిక
సాక్షి,సిటీబ్యూరో: ఫిబ్రవరి 11న మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహించనున్నట్టు జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారి, కమిషనర్ డాక్టర్ బి.జనార్దన్ రెడ్డి తెలిపారు. 5న కౌంటింగ్ పూర్తవనుండగా, మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి విజయం సాధించిన కార్పొరేటర్లకు 6న ప్రత్యేక నోటీస్ జారీ చేయనున్నట్లు చెప్పారు. గురువారం రాత్రి ఆయన మీడియా సమావేశంలో ఎన్నికలకు సంబంధించి పలు విషయాలు వెల్లడించారు. మేయర్ ఎన్నికల్లో 150 డివిజన్ల కార్పొరేటర్లతో పాటు జీహెచ్ఎంసీలో ఎక్స్అఫిషియో సభ్యులుగా ఉన్న వారు ఓటర్లుగా ఉంటారు. ఈ ఎన్నికకు రంగారెడ్డి లేదా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ను రిటర్నింగ్ అధికారిగా నియమించనున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు అందించేందుకు జీహెచ్ఎంసీలో ప్రత్యేకంగా మీడియా సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ సెంటర్లో ఎన్నికల సమాచారాన్ని చార్టుల రూపంలో ప్రదర్శించడంతోపాటు ఫిర్యాదుల్ని స్వీకరించేందుకు మూడు టెలిఫోన్ నెంబర్లు అందుబాటులో ఉంటాయన్నారు. ఫోన్ నెంబర్లు: 040- 2326 1330, 2322 2018, 2322 1978. అదనంగా 35 పోలింగ్ కేంద్రాలు ఇప్పటికే ఉన్న 7757 పోలింగ్ కేంద్రాలకు అదనంగా మరో 35 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు కమిషనర్ పేర్కొన్నారు. కొత్తగా నమోదైన ఓటర్లు పెరిగినందునఅదనపు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తునట్లు తెలిపారు. దీంతో మొత్తం పోలింగ్ కేంద్రాలు 7792 కానున్నాయి. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు ఈనెల 27లోగా పోస్టల్ బ్యాలెట్లు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. వీటిని ఫిబ్రవరి 4లోగా సంబంధిత రిటర్నింగ్ అధికారులకు పంపించాల్సి ఉంటుందన్నారు. ఓటర్లందరూ తప్పనిసరిగా పోలింగ్లో పాల్గొనేలా విద్యార్థుల ద్వారా సంకల్ప పత్రాలు పంపిణీ చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 8.92 లక్షల ఓటర్ స్లిప్లు పంపిణీ చేశామన్నారు. వీటితోపాటు ఎన్నికల సంఘం వెబ్సైట్, ప్రత్యేక యాప్ల ద్వారా 3.83 లక్షల మంది ఓటర్ స్లిప్లు డౌన్లోడ్ చేసుకున్నారని చెప్పారు. -
రికార్డింగ్ డ్యాన్స్లో డిప్యూటీ మేయర్ చిందులు
సాక్షి, ఏలూరు: ఖమ్మం జిల్లాకు చెందిన ఓ యువకుడిని అక్రమంగా నిర్బంధించి దాడికి పాల్పడ్డారన్న కేసులో పదిహేను నెలల క్రితం అరెస్టయిన ఏలూరు డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం మరో వివాదంలో ఇరుక్కున్నారు. ఇటీవల ఏలూరులో మేయర్ షేక్ నూర్జహాన్ ఇంటి ఎదుట జరిగిన ఓ పార్టీలో డిప్యూటీ మేయర్తోపాటు పలువురు కార్పొరేటర్లు పాల్గొని హల్చల్ చేయడం వివాదాస్పదమవుతోంది. రికార్డింగ్ డ్యాన్స్ మాదిరి జరిగిన సినీ విభావరిలో వెంకటరత్నం ఓ యువతితో కలిసి చిందులు వేయడం చర్చనీయాంశమైంది. ఇటీవల చోటుచేసుకున్న ఆ డ్యాన్సుల తాలూకు వీడియోలను పలువురు ఫేస్బుక్, వాట్సాప్లో షేర్ చేసుకున్నారు. -
‘నవీముంబై’లో కాంగ్రెస్తో పొత్తు
- కూటమిగా కొనసాగాలని నిర్ణయం - స్వతంత్ర అభ్యర్థుల మద్దతు కూడగట్టిన పార్టీలు సాక్షి, ముంబై: నవీముంబై కార్పొరేషన్లో కూటమిగా కొనసాగాలని ఎన్సీపీ, కాంగ్రెస్ నాయకులు సోమవారం నిర్ణయం తీసుకున్నారు. దీంతో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు ఎంపిక చేసేందుకు మార్గం సుగమమైంది. నవీముంబై మున్సిపల్ కార్పొరేషన్కు ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజే పీ, శివసేన కలసి పోటీ చేయగా కాంగ్రెస్, ఎన్సీపీ ఒంటరిగా పోటీకి దిగాయి. కాని ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ఇతరులపై ఆధారపడాల్సి వచ్చింది. కార్పొరేషన్లో మొత్తం 111 స్థానాలుండగా మ్యాజిక్ ఫిగర్కు 56 స్థానాలు కావాలి. ఇందులో ఎన్సీపీకి 52 స్థానాలు రావడంతో అధికారం చేజిక్కించుకునేందుకు ఈ పార్టీకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. తమకు ఐదుగురు ఇండిపెండెంట్ల మద్దతు ఉందని, పది స్థానాలు దక్కించుకున్న కాంగ్రెస్తో జతకట్టాల్సిన అవసరం లేదని ఫలితాల తరువాత ఎన్సీపీ స్పష్టం చేసింది. దీంతో ఇండిపెండెంట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. సోమవారం జరిగిన చర్చల్లో కాంగ్రెస్ ప్రదేశ్ అధ్యక్షుడు అశోక్ చవాన్, ఎన్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ తట్కరే కూటమిగా కొనసాగాలనే ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేశారు. దీంతో ఎన్సీపీ 52, కాంగ్రెస్ 10 స్థానాలతో మొత్తం సంఖ్య 62కు చేరింది. ఐదుగురు ఇండిపెండెంట్లు కూడా కూటమితో కొసాగడంవల్ల ఈ సంఖ్య 67కు చేరనుంది. ఇండిపెండెంట్ల సాయంతో అధికారం ఏర్పాటుకు బీజేపీ, శివసేన కూడా ప్రయత్నించాయి. అయితే కాంగ్రెస్ ఎన్సీపీతో జతకట్టడం వల్ల కాషాయ కూటమి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇరు పార్టీల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఎన్సీపీ అభ్యర్థి ఐదేళ్లు మేయర్గా పనిచేస్తారు. కాంగ్రెస్కు చెందిన 10 మంది కార్పొరేటర్లలో ఇద్దరు రెండున్నర ఏళ్ల చొప్పున డిప్యూటీ మేయర్ పద విలో కొనసాగుతారు. మిగిలిన ఎనిమిది మంది వివిధ కమిటీ పదవుల్లో కొనసాగుతారు. -
మేయర్ పీఠం ఎవరిదో..
- కాషాయ కూటమికి ఖరారైన ఏఎంసీ పీఠం - 29న కార్పొరేటర్లతో సమావేశం - నవీముంబై రేసులో ముందున్న ఎన్సీపీ - సంఖ్యాబలం కోసం జోరుగా ప్రయత్నాల సాక్షి, ముంబై: కార్పొరేషన్ల ఎన్నికలు, ఫలితాల తంతు పూర్తి కావడంతో మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల పై పార్టీలు దృష్టి సారించాయి. ఔరంగాబాద్లో అత్యధికంగా 52 స్థానాలు కైవసం చేసుకున్న శివసేన, బీజేపీ అధికారంలో కూర్చోవడం ఖాయమని తేలిపోయింది. 113 స్థానాల్లో శివసేనకు 29, బీజేపీకి 23 మొత్తం 52 స్థానాలు కైవసం చేసుకుని కాషాయ కూటమి పెద్ద పార్టీగా అవతరించింది. మేజిక్ ఫిగర్కు ఇంకా ఐదుగురు కార్పొరేటర్ల మద్దతు కావాలి. దీంతో గెలిచిన కొందరు స్వతంత్ర అభ్యర్థుల కోసం ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. దీనికి సంబంధించి శనివారం ఉదయం బీజేపీ, శివసేన నాయకుల మధ్య ప్రాథమిక చర్చలు జరిగాయి. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఎక్కువ స్థానాలు వచ్చిన పార్టీకి మేయర్, తక్కువ వచ్చిన పార్టీకి డిప్యూటీ మేయర్ పదవులు దక్కనున్నాయి. ఎవరు, ఎంత కాలం ఏ పదవుల్లో కొనసాగాలనే విషయంపై తుది సమావేశం త్వరలో జరగనుంది. అంతకు ముందుగానే మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల ఎన్నిక విషయంపై చర్చించేందుకు ఈ నెల 29న కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించనున్నారు. ‘నవీముంబై’ ఎన్సీపీదే..? నవీముంబై కార్పొరేషన్లో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు ఎస్సీలకు రిజర్వు కావడంతో వాటిని ఎవరికి కేటాయిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) మొత్తం 111 స్థానాల్లో 52 గెలుచుకుని పెద్ద పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. ఇక్కడ మేజిక్ ఫిగర్ కావాలంటే 56 స్థానాలు తప్పనిసరి. దీంతో నలుగురు ఇండిపెండెంట్ల సాయంతో అధికార పీఠాన్ని దక్కించుకోవాలని ఎన్సీపీ ప్రయత్నిస్తోంది. 44 స్థానాలు దక్కించుకున్న శివసేన, బీజేపీ కూటమి కూడా అధికార పీఠాన్ని దక్కించుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం గెలిచిన ఇద్దరు స్వతంత్రులు, 10 స్థానాలు దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీతో మంతనాలు జరపాలని యోచిస్తున్నట్లు సమాచారం. అది సాధ్యం కాకపోయినా అధికారం కోసం ఇండిపెండెంట్లను లాక్కునేందుకు ఇరు పార్టీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. మొత్తం అధికారం ఎన్సీపీకే దక్కడం దాదాపు ఖాయమైనప్పటికీ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు ఎవరిని వరిస్తాయనే విషయం త్వరలో తేలనుంది. మేయర్ పదవులకు మే తొమ్మిదో తేదీన ఎన్నికలు జరగనున్నాయి. -
బీఎన్ఎంసీ డిప్యూటీ మేయర్ బాధ్యతల స్వీకరణ
భివండీ, న్యూస్లైన్: భివండీ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్గా అహ్మద్ సిద్ధికి శనివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు పది రోజుల కిందటే ఎన్నికలు జరిగాయి. ఇదిలా ఉండగా, ఇంతవరకు శివసేనకు చెందిన మేయర్ తుషార్ చౌదరి పదవీ బాధ్యతలు చేపట్టలేదు. ఆయన పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే రాక కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. భివండీ కార్పొరేషన్లో మొదటిసారి శివసేనకు చెందిన తుషార్ చౌదరి మేయర్గా ఎన్నికయ్యారు. దీంతో ఉద్ధవ్ నుంచి అపాయింట్మెంట్ దొరగ్గానే ముహూర్తం ఖరారు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. కాగా, భివండీ మున్సిపల్ కార్పొరేషన్లో శివసేన, కాంగ్రెస్ కూటమి ఉంది. అయినప్పటికి కోనార్క్ వికాస్ ఆగాడికి పోటీ ఇవ్వలేక పోయింది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో శివసేన, బీజేపీల కూటమి ఉన్నందున స్థానిక శివసేన ఎమ్మెల్యే రూపేష్ మాత్రే బీజేపీ, శివసేన సీనియర్ నాయకుల నుంచి విప్ తెచ్చారు. దీంతో శివసేన పార్టీకి ఆఖరు నిమిషంలో బీజేపీ కార్పొరేటర్లు మద్దతు తెలుపడంతో శివసేనను మేయర్ పీఠం వరించింది. దీంతో భివండీ కార్పొరేషన్లో మొదటిసారి మేయర్ పదవి శివసేన దక్కించుకున్నట్లయ్యింది. -
నేడు భివండీ మేయర్ ఎన్నిక
భివండీ, న్యూస్లైన్: భివండీ నిజాంపూర్ శహర్ మహానగర్ పాలిక (బీఎన్ఎంసీ) మేయర్ , డిప్యూటి మేయర్ పదవుల కోసం గురువారం ఎన్నికలు జరుగనున్నాయి. మేయర్ బరిలో ఇద్దరు అభ్యర్థులు, డిప్యూటి మేయర్ బరిలో ఎనిమిది మంది అభ్యర్థులు ఉన్నారు. ప్రస్తుతం బీఎన్ఎంసీలో కోనార్క్ వికాస్ అగాడి అధికారంలో ఉంది. కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో శివసేన-బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన దరిమిలా శివసేన కార్పొరేటర్ తుషార్ చౌదరి మేయర్ పదవి కోసం పోటీపడుతున్నారు. అధికార పక్షంలో నుంచి కోనార్క్ వికాస్ అగాడి ఘట్నేత విలాస్ పాటిల్తో అమీతుమీ తేల్చుకోనున్నారు. ఇదిలా ఉండగా, డిప్యూటీ మేయర్ పదవి కోసం సమాజ్ వాది పార్టీ తరఫున దిల్షత్ ఖాన్, కాంగ్రెస్ నుంచి ఖాన్ ముక్తార్ మహ్మద్ అలీ, సిద్ధికి అహ్మద్హుస్సేన్, అన్సారీ మహ్మద్ హలీమ్, ఖాన్ దిన్ మహ్మద్ షా, మహ్మద్ ఫరేజ్, అన్సారీ సాజిమ్ హుస్సేన్, ఇమ్రాన్ మహ్మద్ ఖాన్ బరిలో ఉన్నారు. కాగా, భివండీ కార్పొరేషన్లో 90 మంది కార్పొరేటర్లు ఉన్నారు. అధికార పక్షంలో వికాస్ ఆగాడి-10, బీజేపీ-10, రాష్ట్రవాది కాంగ్రెస్-9, సమాజ్వాది-16 పార్టీల (మొత్తం 45 మంది) కార్పోరేటర్లు ఉండగా, ప్రతిపక్షంలోని శివసేనకు 18, కాంగ్రెస్కు 27 మంది (మొత్తం 45 మంది) కార్పొరేటర్లు ఉన్నారు. గత మేయర్ ఎన్నికల సమయంలో ఇద్దరు కాంగ్రెస్ కార్పొరేటర్లు గైరాజర్ కావడంతో వికాస్ ఆగాడికి చెందిన ప్రతిభా పాటిల్ విజయం సాధించింది. ప్రస్తుతం గురువారం జరుగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, సమాజ్వాది పార్టీల్లో చీలకలు ఏర్పడే సూచనలు కనబడుతుండటంతో ఎవరు గెలుపొందుతారో వేచిచూడాల్సిందే. -
వేటు వేయాల్సిందే!
పార్టీ ఫిరాయించిన మేయర్పై అనర్హత వేటుకు డిమాండ్ కలెక్టర్కు మెమొరాండం ఇచ్చిన ఎమ్మెల్యేలు 18న ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు అవసరమైతే కోర్టును ఆశ్రయిస్తాం సాక్షి ప్రతినిధి, నెల్లూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొంది మేయర్ పీఠాన్ని అధిరోహించిన అబ్దుల్ అజీజ్ పార్టీ ఫిరాయించడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మేయర్పై వెంటనే అనర్హత వేటు వేయాలని కోరుతూ గురువారం నగర, రూరల్ ఎమ్మెల్యేలు జిల్లా కలెక్టరుకు మెమొరాండం అందజేశారు. ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి అయిన కలెక్టరు శ్రీకాంత్కు ఎమ్మెల్యేలు అనిల్కుమార్యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిలతో పాటు పార్టీ జిల్లా అధ్యక్షుడు మేరిగ మురళీధర్, డిప్యూటీ మేయరు ముక్కాల ద్వారకనాథ్లు మెమొరాండం అందజేశారు. ఫ్యాన్ గుర్తుపై గెలిచిన అబ్దుల్ అజీజ్తో పాటు మరో 12 మంది కార్పొరేటర్లు ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన విషయాన్ని తెలిపారు. దీంతో వీరిపై పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. దీనికి కలెక్టరు సానుకూలంగా స్పందించారు. కలెక్టరేట్ వెలుపల నగర ఎమ్మెల్యే అనిల్కుమార్యాదవ్ మాట్లాడుతూ మేయరుతో పాటు 12 మంది కార్పొరేటర్లపై యాంటీ డిఫెక్షన్ లాను బనాయించి అనర్హత వేటు వేయాలని, తదుపరి ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటూ కార్పొరేటర్లు, జెడ్పీటీసీలను తమ వైపునకు తిప్పుకునే ప్రయత్నాలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. పార్టీ ఫిరాయించిన కావలి మున్సిపల్ చైర్పర్సన్పై అనర్హత వేటుపడినట్లు తెలిపారు. ఎన్నికల కమిషన్ను కలిసి ఫిర్యాదు చేస్తామని, 20 రోజుల్లో తగిన చర్యలు తీసుకోకపోతే కోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. మోసంతో కైవసం చేసుకున్న మున్సిపాలిటీలు తిరిగి వైఎస్ఆర్సీపీకి దక్కుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి మాట్లాడుతూ పార్టీ ఫిరాయింపునకు పాల్పడిన కార్పొరేటర్లు తాము ఎంత పెద్ద తప్పుచేశామో అని ఆవేదన చెందాల్సిన పరిస్థితి తలెత్తుతుందని అన్నారు. ఇప్పటికైనా వారు వైఎస్ఆర్సీపీ కండువాలు కప్పుకోవాలని సూచించారు. ఎవరో ఏదో చెప్పారని, అమాయకంగా పార్టీ ఫిరాయించిన వారు తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందన్నారు. కావలి చైర్పర్సన్పై అనర్హత వేటు వేయడాన్ని ప్రస్తావిస్తూ, నెల్లూరులో కూడా ఆ సంఘటన పునరావృతం కాకుండా ఉండాలంటే, వెళ్లిన వారు తిరిగిరావాలని సూచించారు. సోమవారం ఎన్నికల కమిషన్ను కలుసుకుని, ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు మేరిగ మురళీధర్ మాట్లాడుతూ ప్రిసైడింగ్ అధికారి తగిన చర్యలు తీసుకోవాలని కోరామని తెలిపారు. త్వరలో పార్టీ ఫిరాయించిన జెడ్పీటీసీలపైన కూడా ఫిర్యాదు చేస్తామని అన్నారు. కార్పొరేటర్లలో నిబద్ధత ఉండాలని సూచించారు. దీనిపై కోర్టుకు వెళ్లడానికి కూడా సిద్ధంగా ఉన్నామన్నారు. డిప్యూటీ మేయరు ముక్కాల ద్వారకనాథ్ మాట్లాడుతూ అన్ని మునిసిపల్ స్థానాలు కూడా దక్కించుకుంటామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు రూప్కుమార్ యాదవ్, బొబ్బల శ్రీనివాసులు, ప్రశాంత్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. -
పుర పాలకుల ఎన్నిక నేడే
సాక్షి, ప్రతినిధి, నెల్లూరు : ఎన్నికల ఫలితాలు వెలువడిన సుమారు యాభై రోజుల తర్వాత పురపాలకులను ఎన్నుకునేందుకు రంగం సిద్ధమైంది. నెల్లూరు మేయర్, డిప్యూటీ మేయర్తో పాటు ఆరు మున్సిపాలిటీల చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక గురువారం జరగనుంది. ఏర్పాట్లను ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్న కలెక్టర్ నాగులాపల్లి శ్రీకాంత్ పర్యవేక్షిస్తున్నారు. ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. నెల్లూరు కార్పొరేషన్లో 54 డివిజన్లుండగా 32ని వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది, టీడీపీ 18 డివిజన్లకు ప రిమితమైంది. కాంగ్రెస్ 1, సీపీఎం 2, బీజేపీ 2 డివిజన్లను దక్కించుకున్నాయి. ఎక్స్అఫిషి యో సభ్యులుగా ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు తాము ఎంచుకున్న చోట ఓటు వేయవచ్చు. వైఎస్సార్సీపీ తమ పార్టీ కార్పొరేటర్లకు బుధవారం విప్ జారీ చేసింది. విప్ ఫారాలను ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు మేరిగ మురళీధర్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. పార్టీ సీజీసీ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి విప్ జారీ చేశారు. ఆరు మునిసిపాలిటీల్లోని వైఎఎస్సార్సీపీ కౌన్సిలర్లుకు కూడా విప్ జారీ అయింది. నెల్లూరు మేయర్గా వైఎస్సార్సీపీ అభ్యర్థిగా అబ్దుల్ అజీజ్, టీడీపీ అభ్యర్థిగా జెడ్.శివప్రసాద్ పోటీలో ఉన్నారు. కార్పొరేటర్లు చేతులెత్తి తమ అభ్యర్థికి మద్దతు తెలుపుతారు. ఆరు ము నిసిపాలిటీలోనూ చైర్మన్ల ఎన్నిక ఇదే పద్ధతిలో జరుగుతుంది. వైఎస్సార్సీపీ చైర్మన్(చైర్పర్స న్) అభ్యర్థులుగా ఎల్లసిరి గోపాల్రెడ్డి(గూడూ రు), కేతిరెడ్డి శ్రీలత(కావలి), ముత్తుకూరు లక్ష్మమ్మ(సూళ్లూరుపేట), గంధళ్ల లక్ష్మమ్మ(ఆత్మకూ రు) పోటీ చేస్తున్నారు. ఈ నాలుగు మున్సిపాలి టీలు వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉన్నాయి. విప్ ధిక్కరిస్తే వేటే ఏ పార్టీ సభ్యుడైనా విప్ను ధిక్కరించినా, ఉద్దేశపూర్వకంగా ఎన్నికకు గైర్హాజరైనా వేటు తప్పదని ఎన్నికల స్పష్టం చేసింది. మూడింట ఒక వంతు లేదా రెండు వంతుల సభ్యులు పార్టీ ఫిరాయించినా వేటుపడుతుందని ఇప్పటికే తేల్చిచెప్పింది. వైఎస్సార్సీపీ తరపున కార్పొరేషన్ కమిషనర్కు ఆ పార్టీ నాయకులు శ్రీనివాస్యాదవ్, తాటి వెంకటేశ్వర్లు బుధవారం విప్జారీ పత్రాన్ని అందజేశారు. మరోవైపు మేయర్ పదవిని దక్కించుకోవాలని టీడీపీ వృథాప్రయాస పడుతోంది. వైఎస్సార్సీపీ సభ్యులను తమ వైపు తిప్పుకునేందుకు అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అందులో భాగంగానే విప్ జారీపై కార్పొరేటర్లలో గందరగోళ పరిస్థితిని నెలకొనేలా చేశారని అంటున్నారు. ఈ ఎన్నికల కోసం టీడీపీ నాయకులు పి.నారాయణ, ఆదాల ప్రభాకర్రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి నెల్లూరులో మకాం వేసి, కార్పొరేటర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు కంభంపాటి రామ్మోహన్రావు, మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కూడా వీరితో మంతనాలు జరిపి వెళ్లారు. అయితే వైఎస్సార్సీపీ నాయకులు మేయరుతో పాటు నాలుగు మునిసిపాలిటీలో తమవేనన్న ధీమాతో ఉన్నారు. -
ఇన్నాళ్లకు..
అనంతపురం కార్పొరేషన్ : మూడున్నరేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో పాలక వర్గం కొలువుదీరనుంది. కొద్ది గంటల్లో స్థానిక సంస్థల సారథుల ఎన్నిక జరగనుంది. అనంతపురం కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్తో పాటు కదిరి, ధర్మవరం, హిందూపురం, గుంతకల్లు, రాయదుర్గం, కళ్యాణదుర్గం, తాడిపత్రి, మడకశిర మున్సిపాలిటీలు, గుత్తి, పుట్టపర్తి, పామిడి నగర పంచాయతీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ను కార్పొరేటర్లు/కౌన్సిలర్లు నేడు (గురువారం) ఎన్నుకోనున్నారు. మండలాల్లో ఎంపీపీల ఎన్నిక శుక్రవారం జరగనుంది. కోరం తప్పనిసరి.. కార్పొరేషన్, మున్సిపాలిటీల సారథుల ఎన్నికకు సంబంధించి ఎన్నికల అధికారి, కమిషనర్ ఆధ్వర్యంలో ఉదయం సమావేశం ప్రారంభమవుతుంది. తొలుత కార్పొరేటర్లు, కౌన్సిలర్లుగా ఎన్నికైన వారు తెలుగులో ప్రమాణ స్వీకారం చేస్తారు. మేయర్,డిప్యూటీ మేయర్/చైర్మన్, వైస్ చైర్మన్ను ఎన్నుకునేందుకు అర్హులైన వారిలో సగం మంది సమావేశం ప్రారంభమైన గంటలోగా హాజరైతే కోరం ఉన్నట్లు. అలా లేకపోతే మరుసటి రోజు సమావేశం నిర్వహిస్తారు. మేయర్/చైర్మన్ పదవికి పోటీచేసే వారి పేరును ఓ సభ్యుడు సూచిస్తే.. మరో సభ్యుడు బలపరచాలి. ఒకరి కంటే ఎక్కువ మంది పో టీలో ఉంటే వారికి మద్ధతు ఇచ్చేవారు వేర్వేరుగా చేతులు పైకి ఎత్తి ఓటు వేయాల్సి ఉంటుంది. ఈ తతంగాన్ని ప్రిసైడింగ్ అధికారి రికార్డ్ చేస్తారు. ఎవరికి ఎక్కువ మంది మద్దతు తెలిపితే వారు ఎన్నికైనట్లు ప్రకటిస్తారు. సమానంగా ఓట్లు వస్తే డ్రా (లాటరీ) పద్ధతిలో ఎంపిక చేస్తారు. ఎంపీలకు ఒక చోటే అవకాశం.. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి.. ఎన్నికల్లో గెలిచిన కౌన్సిలర్లు, ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే, ఎంపీ ఓటు వేసేందుకు అర్హులు. ఎంపీ తాను ప్రాతినిధ్యం వహించే లోక్సభ స్థానం పరిధిలో ఏదో ఒక మున్సిపాలిటీలో మాత్రమే ప్రత్యేక ఆహ్వానిత సభ్యుడిగా ఉండాలి. జిల్లా, మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల సారథుల ఎన్నికల ప్రక్రియకు ఎమ్మెల్యే, ఎంపీలకు ఆహ్వానం ఉన్నా ఓటు హక్కు ఉండదు. మేయర్ అభ్యర్థిగా స్వరూప అనంతపురం నగరపాలక సంస్థ మేయర్ అభ్యర్థిగా 20వ డివిజన్ కార్పోరేటర్ మదమంచి స్వరూపను పార్టీ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు బుధవారం సాయంత్రం హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్లో టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ప్రకటించారు. ఉప మేయర్గా 33వ డివిజన్ కార్పొరేటర్ సాకే గంపన్న పేరును పార్టీ అధిష్టానం ఖరారు చేసినట్లు సీఎం రమేష్ స్పష్టం చేశారు. -
పురపాలకులు కొలువుతీరేది నేడే
సాక్షి, రాజమండ్రి : పురపాలకులు గురువారం కొలువుదీరనున్నారు. మున్సిపాలిటీల కొత్త కౌన్సిళ్ల తొలి సమావేశాలు నేటి ఉదయం జరగనున్నాయి. ఏప్రిల్ 30న రాజమండ్రి నగర పాలక సంస్థతో పాటు ఏడు మున్సిపాలిటీలు, మూడు నగర పంచాయతీల ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. రాజమండ్రిలో కార్పొరేటర్లుగా గెలిచిన వారు మేయర్, డిప్యూటీ మేయర్లను, తక్కిన చోట్ల గెలిచిన కౌన్సిలర్లు చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకోనున్నారు. పలు చోట్ల చైర్మన్ ఎన్నిక లాంఛనప్రాయమే అయినా ‘వైస్’ల ఎన్నికే జటిలం కానుంది. జిల్లాలో అన్ని పట్టణాల్లో చైర్మన్ పీఠాలు దక్కించుకునేందుకు ఉత్సాహంతో ఉన్న టీడీపీకి వైస్ చైర్మన్ల ఎంపిక సమస్య కానుంది. ఇప్పటికే కులాలు, వర్గాల వారీ పార్టీలో గ్రూపులుగా ఏర్పడి వైస్ చైర్మన్ పదవులను దక్కించుకునేందుకు పోటీ పడుతున్నారు. సమావేశాల్లో ఉదయం 11 గంటలకు కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రమాణం చేయిస్తారు. అనంతరం మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్చైర్మన్ల ఎన్నికలు జరుగుతాయి. వాసిరెడ్డికి డిప్యూటీ మేయర్! రాజమండ్రిలోని 50 డివిజన్లలో 34 మంది టీడీపీ కార్పొరేటర్లు కాగా, 8 మంది వైఎస్సార్ కాంగ్రెస్, ఐదుగురు ఇండిపెండెంట్లు, బీజేపీ, బీఎస్పీ, కాంగ్రెస్లకు ఒక్కో కార్పొరేటర్ ఉన్నారు. మేయర్ అభ్యర్థిగా పంతం రజనీ శేషసాయిని ఎన్నికల ముందే ప్రకటించిన టీడీపీ డిప్యూటీ మేయర్గా ఆ పార్టీ నగరాధ్యక్షుడు, 10వ డివిజన్ కార్పొరేటర్ వాసిరెడ్డి రాంబాబు ఎన్నికయ్యే అవకాశం ఉంది. మండపేటలో రెడ్డి,బీసీల మధ్య పోటీ మండపేటలోని 29 వార్డుల్లో టీడీపీకి 18 మంది, వైఎస్సార్ కాంగ్రెస్కు 11 మంది సభ్యుల బలం ఉంది. చైర్మన్గా చుండ్రు శ్రీ వరప్రకాష్ పేరును ఖరారు చేయగా వైస్ చైర్మన్ కోసం టీడీపీలోని రెడ్డి, బీసీ సామాజిక వర్గాల మధ్య పోటీ గట్టిగా ఉంది. దీంతో ఇప్పటికీ ఎవరి పేరునూ తెరపైకి తేలేదు. అమలాపురం వైస్ చైర్మన్గా విజయలక్ష్మి! అమలాపురంలోని మొత్తం 30 వార్డుల్లో టీడీపీ 22 గెలుచుకోగా వైఎస్సార్ సీపీ ఏడు స్థానాల్లో, ఒకచోట ఇండిపెండెంట్ విజయం సాధించారు. చైర్మన్గా యాళ్ల మల్లేశ్వరరావు పేరును ముందే నిర్ణయించారు. వైస్ చైర్మన్ పదవిని పి.విజయలక్ష్మికి ఇవ్వనున్నారు. రామచంద్రపురంలో ఎంపిక ‘తోట’దే.. ఇక్కడ 27 వార్డులకు టీడీపీ 17, వైఎస్సార్ సీపీ 9 చోట్ల విజయం సాధించాయి. ఒక స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. టీడీపీ చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేసిన ఎస్.ఆర్.కె గోపాల్బాబు ఓటమి పాలవడంతో 19వ వార్డు నుంచి గెలిచిన సీతామహాలక్ష్మి, 20వ వార్డు నుంచి గెలిచిన సూర్యప్రకాశరావు, 21వ వార్డు నుంచి విజయం సాధించిన మాడా ఎల్లయ్య శంకర్లు ఆ పదవికి పోటీ పడుతున్నారు. ఎంపికను ఎమ్మెల్యే తోట త్రిమూర్తులుకు పార్టీ నేతలు వదిలి పెట్టారు. వైస్ చైర్మన్ పదవి బీసీ వర్గానికి చెందిన ఆరో వార్డు కౌన్సిలర్ మేడిశెట్టి సూర్యనారాయణకు దక్కే అవకాశాలు ఉన్నాయి. సామర్లకోట వైస్ చైర్మన్పైబడుగు ఆశ ఇక్కడి 30 వార్డుల్లో టీడీపీ 24 గెలుచుకోగా వైఎస్సార్ సీపీ ఆరు స్థానాల్లో విజయం సాధించింది. చైర్మన్గా మన్నెం చంద్రరావు పేరు ఇప్పటికే ఖరారవగా వైస్ చైర్మన్ పదవిని30వ వార్డు నుంచి గెలిచిన బీసీ వర్గానికి చెందిన బడుగు శ్రీకాంత్ ఆశిస్తున్నారు. పెద్దాపురంలో ముగ్గురుఆశావహులు ఇక్కడి 28 వార్డుల్లో టీడీపీకి 21, వైఎస్సార్ సీపీకి 4, సీపీఎంకు ఒకటి దక్కగా ఇద్దరు ఇండిపెండెంట్లు గెలిచారు. చైర్మన్గా రాజా సూరిబాబురాజును ఎన్నికల ముందే ఖరారు చేశారు. వైస్ చైర్మన్ కోసం వెలమ సామాజిక వర్గం నుంచి రాయవరపు వరలక్ష్మి, కురుపూరి రాజా, దేవాంగ వర్గం నుంచి యర్రా లక్ష్మి, కమ్మ సామాజిక వర్గానికి చెందిన కె.సత్యభాస్కర్ పోటీ పడుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే వర్మ వీరిలో ఎవరికి అవకాశం ఇచ్చేదీ నిర్ణయిస్తారంటున్నారు. పిఠాపురంలో వర్మదే నిర్ణయం ఇక్కడి 30 వార్డుల్లో 23 టీడీపీకి, ఆరు వైఎస్సార్ సీపీకి దక్కగా ఒకరు ఇండిపెండెంట్గా గెలిచారు. చైర్మన్ అభ్యర్థిగా కరణం చిన్నారావు పేరు పార్టీ ఖరారు చేసింది. వైస్ చైర్మన్ గిరీకి ఇద్దరు పోటీ పడుతుండగా ఎవరికి ఇవ్వాలనే దానిపై నేతలు కసరత్తు చేస్తున్నారు. గురువారం ఉదయానికల్లా ఒకరిని ఎమ్మెల్యే వర్మ ఖరారు చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
కుర్చీ రెడీ
సాక్షి, ఏలూరు:పురపాలక ఎన్నికల్లో విజయం వరించినా.. పదవి చేపట్టే ముహూర్తం కోసం ఎదురుచూస్తున్న వారి ఆశలు గురువారం నెరవేరనున్నాయి. ‘పుర’ పాలకవర్గాల ప్రమాణ స్వీకారాన్ని వైభవంగా నిర్వహించేందుకు గెలుపొందిన అభ్యర్థులు ఏర్పాట్లు చేసుకున్నారు. జిల్లాలోని ఏలూరు నగరపాలక సంస్థ, భీమవరం, తాడేపల్లిగూడెం, నరసాపురం, పాలకొల్లు, నిడదవోలు, తణుకు, కొవ్వూరు పురపాలక సంఘాలు, జంగారెడ్డిగూడెం నగర పంచాయతీల్లో నూతన పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. 291 మంది ప్రమాణ స్వీకారం పుర, నగరపాలక సంఘాల్లో 291 వార్డు/కార్పొరేటర్ స్థానాలు ఉన్నాయి. వాటిలో 217 మంది టీడీపీ అభ్యర్థులు, 56 మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, ఐదుగురు బీజేపీ, 12 మంది స్వతంత్రులు, ఒక సీపీఎం అభ్యర్థి గెలుపొందారు. వీరంతా గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం మేయర్, చైర్మన్ ఎంపిక జరుగుతుంది. ఆ వెంటనే డెప్యూటీ మేయర్, వైస్ చైర్మన్లను ఎన్నుకుంటారు. ఈ పదవుల కోసం టీడీపీ నేతలు క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఆ పార్టీ తరఫున గెలుపొందిన వారిని పొరుగు జిల్లాలకు తరలించి సకల సదుపాయాలు కల్పించారు. వారందరినీ నేరుగా పురపాలక, నగరపాలక కార్యాలయూలకు తీసుకువచ్చి తమకు అనుకూలమైన వ్యక్తిని ఎన్నుకునేలా ఏర్పాట్లు చేశారు. పీఠాలు వీరికే! నగర మేయర్, మునిసిపల్ చైర్మన్ అభ్యర్థులను టీడీపీ దాదాపుగా ఖరారు చేసింది. వారికే ఓటు వేయాలని విప్ జారీ చేసింది. ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ పదవి ఈసారి బీసీ మహిళను వరిస్తోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారి షేక్ ముజుబూర్ రెహమాన్ భార్య షేక్ నూర్జహాన్ను మేయర్ అభ్యర్థిగా ప్రకటించారు. తాడేపల్లిగూడెంలో బొలిశెట్టి శ్రీనివాస్ను చైర్మన్ అభ్యర్థిగా నిర్ణయించారు. భీమవరంలో కొటికలపూడి గోవిందరావు(చినబాబు)ను ఎంపిక చేశారు. పాలకొల్లులో వల్లభు నారాయణమూర్తి, జంగారెడ్డిగూడెం నగర పంచాయతీకి బంగారు శివలక్ష్మి, నిడదవోలుకు బొబ్బా కృష్ణమూర్తిని ఎంపిక చేశారు. నరసాపురంలో ఎమ్మెల్యే, ఎంపీలు కూడా ఓటు వేయనున్నారు. ఇక్కడ పసుపులేటి రత్నమాల చైర్మన్ కావాలనుకుంటున్నారు. కొవ్వూరులో సూరపనేని సూర్యభాస్కర రామ్మోహన్ (చిన్ని), జొన్నలగడ్డ రాధారాణిలకు చైర్మన్ పదవిని రెండున్నరేళ్ల చొప్పున పంచుతున్నారు. తణుకులోనూ ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ దొమ్మేటివెంకట సుధాకర్, పరిమి వెంకన్నబాబు చెరో రెండున్నరేళ్లు పీఠంపై కూర్చోనున్నారు. నరసాపురంలో పసుపులేటి రత్నమాల చైర్మన్ పదవికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రమాణ స్వీకారం చేయనున్న సభ్యుల సంఖ్య .. పార్టీల వారీగా ఏలూరు (50 వార్డులు ) టీడీపీ 41, వైఎస్సార్ సీపీ 8, ఇండిపెండెంట్ 1 తాడేపల్లిగూడెం (35 వార్డులు) టీడీపీ 24, వైఎస్సార్ సీపీ 7, బీజేపీ 1, సీపీఐ 1, ఇండిపెండెంట్లు 2 పాలకొల్లు (31 వార్డు) టీడీపీ 25, వైఎస్సార్ సీపీ 5, ఇండిపెండెంట్ 1 నరసాపురం (31 వార్డులు) టీడీపీ 14, వైఎస్సార్ సీపీ 14, ఇండిపెండెంట్లు 3 నిడదవోలు (28 వార్డులు) టీడీపీ 18, వైఎస్సార్ సీపీ 9, బీజేపీ 1 కొవ్వూరు (23 వార్డులు) టీడీపీ 21, ఇండిపెండెంట్లు 2 తణుకు (34 వార్డులు) టీడీపీ 32, బీజేపీ 1, ఇండిపెండెంట్ 1 భీమవరం (39 వార్డులు) టీడీపీ 26, వైఎస్సార్ సీపీ 11, బీజేపీ 2 జంగారెడ్డిగూడెం (20 వార్డులు) టీడీపీ 16, వైఎస్సార్ సీపీ 2, ఇండిపెండెంట్లు 2