Duddilla Sridhar Babu
-
తెలంగాణకు పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి
మాదాపూర్: వాణిజ్యం, వ్యాపారం లేకుండా ప్రభుత్వాలు, వ్యవస్థలు నడవలేవని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. మాదాపూర్లోని హెచ్ఐసీసీలో గురువారం హైబిజ్ టీవీ బిజినెస్ ఎక్స్లెన్స్ అవార్డ్స్ 2వ ఎడిషన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కీలక రంగాలలో అమూల్యమైన సేవలు అందించిన వారికి అవార్డులను అందజేసినందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఏడాదికాలంలో ప్రభుత్వం వ్యాపారరంగ అభివృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించిందని తెలిపారు. 2023లో తెలంగాణ అభివృద్ధి 2ఎక్స్గా ఉందని, రాబోయే నాలుగు సంవత్సరాలలో దాన్ని 10ఎక్స్కు చేరుస్తామన్నారు. తెలంగాణకు పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని, దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో రూ.1.7 లక్షల కోట్ల పెట్టుబడులను రాష్ట్రం సాధించడమే అందుకు నిదర్శనమని చెప్పారు. పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు రాష్ట్రానికి ఆదాయాన్ని సమకూర్చడంలో కీలకపాత్ర పోషిస్తున్నారని తెలిపారు. అలాంటి వారిని గుర్తించి ప్రోత్సహిస్తున్నందుకు హర్షం వ్యక్తంచేశారు. పారిశ్రామిక రంగానికి ప్రభుత్వ సహకారం ఎప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా 11 మందికి లెజెండ్ పురస్కారాలను అందజేశారు. సీఎస్ఆర్ కేటగిరీలలో ఉత్తమ గ్రూప్గా ఐటీసీకి అవార్డు దక్కింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, టీజీఐఐసీ చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి, సుచిరిండియా సీఈఓ డాక్టర్ లయన్ వై.కిరణ్, భారతీ సిమెంట్ మార్కెటింగ్ డైరెక్టర్ రవీందర్రెడ్డి, హైబిజ్ టీవీ మేనేజింగ్ డైరెక్టర్ ఎం.రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
93 లక్షల గృహాలకు డిజిటల్ కనెక్టివిటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 93 లక్షల గృహాలను డిజిటల్ కనెక్టివిటీ పరిధిలోకి తీసుకువస్తున్నట్లు ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Duddilla Sridhar Babu) వెల్లడించారు. టీ ఫైబర్ ద్వారా ప్రతి ఇంటికి ఇంటర్నెట్ సౌకర్యం కల్పించే కార్యక్రమాన్ని రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా ప్రారంభించామన్నారు. ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు(World Bank representatives) బుధవారం సచివాలయంలో మంత్రి శ్రీధర్బాబుతో భేటీ అయ్యారు. డిజిటల్ కనెక్టివిటీలో భాగంగా పైలట్ ప్రాజెక్టును చేపట్టిన నాలుగు గ్రామాల్లో ఇటీవల ప్రపంచ బ్యాంకు బృందం పర్యటించింది. ఈ భేటీలో తమ క్షేత్రస్థాయి పర్యటన అనుభవాలను మంత్రితో పంచుకుంది. హాజిపల్లి (రంగారెడ్డి జిల్లా), మద్దూర్ (నారాయణ్పేట), సంగుపేట (సంగారెడ్డి), అడవి శ్రీరాంపూర్ (పెద్దపల్లి) గ్రామాల్లో ఇంటర్నెట్ కనెక్టివిటీతో స్థానికులకు కలిగిన ప్రయోజనాలను ప్రత్యక్షంగా తెలుసుకున్నట్టు బృందం సభ్యులు వైజయంతీ దేశాయ్, కింబర్లీ జాన్స్.. మంత్రికి వివరించారు.వచ్చే మూడేళ్లలో రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు డిజిటల్ కనెక్టివిటీ విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు శ్రీధర్బాబు వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటికే 32 వేల కి.మీ. పొడవున ఫైబర్ ఆప్టిక్ కేబుల్ను ఏర్పాటు చేశామన్నారు. సమావేశంలో ఐటీ శాఖ డిప్యూటీ సెక్రటరీ భవేశ్ మిశ్రా, టీ ఫైబర్ ఎండీ వేణు ప్రసాద్, ప్రపంచబ్యాంకు ప్రతినిధులు ఇషిరా మెహతా, అరుణ్ శర్మ, స్యూ సంజ్ ఎంగ్ పాల్గొన్నారు. -
ఫిబ్రవరి 7న కీలక ప్రకటన: మంత్రి శ్రీధర్బాబు
సాక్షి,హైదరాబాద్ : ఫిబ్రవరి 7న ఉద్యోగాల అంశంలో కీలక ప్రకటన ఉండబోతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు (Sridhar Babu) అన్నారు. దావోస్ పర్యటన విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో ఆయన మీడియాతో చిట్చాట్ నిర్వహించారు.ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో వచ్చిన పెట్టుబడులు ఈ ఏడాది వచ్చాయి. ఈ పెట్టుబడులను గ్రౌండ్ చేయడానికి ఇప్పటికే వర్క్ మొదలు పెట్టాం. రాబోయే ఏడాదిపై మా ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. భవిషత్ అంతా ఏఐ, సైబర్ సెక్యూరిటీ పైనే .. దానిపై మేము ఫోకస్ పెట్టాం.గత బీఆర్ఎస్ ఐటీ పాలసీని.. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా కొత్త ఐటీ పాలసీ తెస్తాం. ట్రిపుల్ ఆర్ చుట్టూ ఐటీ విస్తరించాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. హైదరాబాద్ చుట్టూ ఐటీ అభివృద్ధి చేయబోతున్నాం. ఔట్ లుక్స్ మాల్స్ తరహాలో హైదరాబాద్ చుట్టూ మాల్స్ తెచ్చే యోచనలో సర్కార్ ఉంది.ఫిబ్రవరి 7వ ఉద్యోగాల అంశంలో కీలక ప్రకటన ఉండబోతోంది. ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంచే ఆలోచన సర్కార్కు లేదు. మంత్రులు ఎవరూ అలక.. అసంతృప్తిలో లేరు. ఆర్థిక పరిస్థితి పై అందరికీ అవగాహన ఉంది. అవినీతి ఆరోపణలు కరెక్ట్ కాదు. ఖండిస్తున్నాం. గచ్చిబౌలి అవతార్ టవర్స్ తరహాలో హకింపేట్లో రాబోతున్నాయి. గత ప్రభుత్వం లెక్క భవనాలు చూపించి అభివృద్ధి అనం...అసలైన అభివృద్ధి ఏంటో రాబోయే ఐదేళ్లలో చూపిస్తాం. -
అమెరికా ఎన్ఆర్ఐ కుటుంబానికి భారీ పరిహారం
హైదరాబాద్: విదేశాల్లో ఉన్న భారత విద్యార్థుల హక్కులను పరిరక్షించడంలో కోర్ ట్రాకర్ సంస్థ చేస్తున్న కృషి అభినందనీయమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. అమెరికాలోని కాన్సాస్ రాష్ట్రంలోని లివ్ అపార్ట్మెంట్స్ స్విమ్మింగ్ పూల్ వద్ద జరిగిన ఘటనలో మృతి చెందిన ఎన్ఆర్ఐ విద్యార్థి కొల్లి మణిదీప్ కుటుంబానికి ఆ సంస్థ స్ఫూర్తిదాయకమైన సేవలను అందించిందంటూ సంస్థ చైర్మన్ విక్రంసాగర్ పసాలను అభినందించారు.శనివారం మాదాపూర్ టీ హబ్లో జరిగిన కార్యక్రమంలో మణిదీప్ కుటుంబానికి భారీ నష్టపరిహారం (5.4 కోట్ల రూపాయలు) చెక్కును మంత్రి ఆందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ ఐటీ టెక్నాలజీ సంస్థ కోర్ ట్రాకర్ కృషి ఫలితంగా బాధిత కుటుంబానికి నష్టపరిహారం అందిందని పేర్కొన్నారు. అమెరికాలో ప్రముఖ న్యాయవాది, హైదరాబాద్కు చెందిన అబ్దుల్ క్యూ ఆరిఫ్ బలమైన ఆధారాలు సేకరించి అపార్ట్మెంట్ నిర్వాహకుల నిర్లక్ష్యమే ఈ దుర్ఘటనకు కారణమని వాదనను సమర్థవంతంగా వినిపించారని కొనియాడారు.చదవండి: కెనడా నుంచి అమెరికాలోకి.. చొరబాటుదారుల్లో ఇండియన్సే ఎక్కువ -
రఘువంశీ ఏరోస్పేస్ విస్తరణతో 1200 కొత్త ఉద్యోగాలు: మంత్రి శ్రీధర్ బాబు
విమాన ఇంజన్ల కీలక విడిభాగాలు, రక్షణరంగ ఉత్పత్తుల తయారీలో గణనీయ వృద్ధిని సాధించిన రఘువంశీ ఏరోస్పేస్ భారీ విస్తరణపనులకు శ్రీకారం చుట్టింది. గురువారం నాడు శంషాబాద్ ఏరోస్పేస్ పార్క్లో ఈ సంస్థ కొత్త కర్మాగారం నిర్మాణానికి ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శంకుస్థాపన చేసారు. రూ.300 కోట్ల వ్యయంతో 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమయ్యే ఈ పరిశ్రమ రానున్న మూడేళ్లలో 1200 మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తుందని ఈ సందర్భంగా శ్రీధర్ బాబు వెల్లడించారు.రఘువంశీ ఏరోస్పేస్ చేతిలో ఉన్న రూ.2 వేల కోట్ల ఆర్డర్లకు సంబంధించిన పరికరాలు ఈ నూతన సదుపాయంలో ఉత్పత్తి అవుతాయని ఆయన తెలిపారు. ఎయిర్ బస్ ఏ320, బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల ఇంజన్లకు, జిఇ ఏరోస్పేస్, రోల్స్ రాయిస్, ప్రాట్ అండ్ విట్నీ, సఫ్రన్, హానీవెల్ విమాన ఇంజన్లను తయారు చేసే సంస్థలకు రఘువంశీ కీలకమైన విడిభాగాలను సరఫరా చేస్తుందని శ్రీధర్ బాబు వెల్లడించారు.2002లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమగా ప్రారంభమైన రఘువంశీ ప్రస్థానం ప్రపంచ ప్రఖ్యాత విమాన తయారీ సంస్థలకు ఫ్యూయల్ పంపులు, ల్యాండింగ్ గేర్ల లాంటి ముఖ్య పరికరాలను ఉత్పత్తి చేసే స్థాయికి చేరి ఏరోస్పేస్ రంగంలో రాష్ట్ర ప్రతిష్టను ఇనుమడింప చేసిందని శ్రీధర్ బాబు ప్రసంసించారు. డిఆర్ డిఓ, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ , భారత్ డైనమిక్స్ లిమిటెడ్ లాంటి ప్రభుత్వరంగ సంస్థలకు పరికరాలు, విడిభాగాలను అందజేస్తోందని ఆయన వివరించారు.ముడి చమురు, సహజవాయువును వెలికితీసే పరిశ్రమలకు, ఆరోగ్య రంగంలో వినియోగించే పరికరాలను తయారు చేస్తోందని వెల్లడించారు. హైదరాబాద్ ఏరోస్పేస్ ఎస్ ఇ జెడ్ లో టాటా, భారత్ ఫోర్జ్, ఆదానీ లాంటి ప్రఖ్యాత కంపెనీలు కూడీ వైమానిక, రక్షణ, అంతరిక్ష వాహనాల ఉత్పత్తులను తయారు చేస్తున్నాయని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఈ ఏరోస్పేస్ సంస్థలకు రకరకాల విడిభాగాలను అందించే 1500 సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాయని ఆయన చెప్పారు.రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ఎంఎస్ ఎమ్ఇ పాలసీ ప్రకారం ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో ఏర్పాటు చేసే పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందిస్తామని శ్రీధర్ బాబు వెల్లడించారు. కార్యక్రమంలో రఘువంశీ ఏరోస్పేస్ డైరెక్టర్ వంశీ వికాస్, డిఆర్ డిఓ క్షిపణి, వ్యూహాత్మక వ్యవస్థల డైరెక్టర్ రాజబాబు, సిఐఐ ఛైర్మన్ డా.సాయి ప్రసాద్, టిజిఐఐసి ఎండీ డా. ఇ. విష్ణువర్ధన్ రెడ్డి, రాష్ట్ర ఏరోస్సేస్, డిఫెన్స్ విభాగం డైరెక్టర్ పిఏ ప్రవీణ్, టిజిఐఐసి సిఒఓ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. -
చారిత్రక వైభవానికి ఇబ్బంది రావద్దు
సాక్షి, హైదరాబాద్: అసఫ్జాహీల నిర్మాణ కౌశలం కొనసా గాలని, పాత అసెంబ్లీ భవన చారిత్రక వైభవానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా పునరుద్ధరించాలని రాష్ట్ర ఆర్ అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆగాఖాన్ నిర్మాణ సంస్థ ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. పాత అసెంబ్లీ భవన పునరుద్ధరణ పనులపై శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుతో కలిసి మంగళవారం అసెంబ్లీ స్పీకర్ చాంబర్లో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, వైస్ చైర్మన్ బండా ప్రకాశ్, అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు, ఆర్అండ్బీ అధికారులు, ఆగాఖాన్ ట్రస్టు ప్రతినిధులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ రాబోయే మూడు నెలల్లో ఈ భవనాన్ని అందుబాటులోకి తీసుకురావాలని, చారిత్రక వైభవానికి ఎక్కడా ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని సూచించారు. ఆగాఖాన్ ట్రస్ట్ కు రూ.2 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయన్న విషయం తెలియడంతో వెంటనే స్పందించిన మంత్రి.. సమావేశం నుంచే ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కతో మాట్లాడి నిధులు విడుదల చేయించారు.బిల్లుల కోసం ప్రజోపయోగ పనులను ఆపవద్దని అధికారులకు సూచించారు. ఏవైనా బిల్లులు పెండింగ్లో ఉన్నా, ఇతర సమస్యలేమి ఉన్నా తనకు లేదా మంత్రి శ్రీధర్బాబుకు చెప్పాలని కోరారు. ఈ భవనం అందుబాటులోకి వస్తే కౌన్సిల్హాల్ను అసెంబ్లీ భవనంలోకి మార్చవచ్చన్నారు. శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు మాట్లాడుతూ పాత అసెంబ్లీ భవన పునరుద్ధరణ పనుల పర్యవేక్షణ కోసం ఎస్ఈ స్థాయి అధికారిని నియమించాలని ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు.అదో పెద్ద జోక్: మంత్రి కోమటిరెడ్డిఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, విద్యుత్ చార్జీల అంశంపై కేటీఆర్ ఈఆర్సీ దగ్గరకు వెళ్లడం పెద్ద జోక్ అని అన్నారు. ఆయనో జోకర్ అని, పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క సీటు రాకుండా ప్రజలు ఓడించినా వారికి బుద్ధి రాలేదన్నారు. 200 యూనిట్ల వరకు పేదలకు తమ ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ అందజేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్రెడ్డిలు రాష్ట్రాభివృద్ధికి కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. -
బీఆర్ఎస్ హయాంలోనే మూసీకి సరిహద్దులు: మంత్రి శ్రీధర్ బాబు
సాక్షి, హైదరాబాద్: పేదలు, మధ్యతరగతి ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. మూసీ ప్రక్షాళనపై విపక్షాలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ తెచ్చిందే బీఆర్ఎస్ ప్రభుత్వమని తెలిపారు. మూసీలో అక్రమ కట్టడాలు గుర్తించాలని గతంలో కేసీఆర్ ఆదేశించలేదా అని ప్రశ్నించారు. మూసీని కాలుష్య రహితంగా చేయాలని కేసీఆర్ చెప్పలేదా అని మండిపడ్డారు. గతంలో బీఆర్ఎస్ నేతలు చేసిన పనులు మర్చిపోయినట్లున్నారని సెటైర్లు వేశారు.ఈ మేరకు మంత్రి మంగళవారం హైదరాబాద్లో మాట్లాడుతూ.. 2021లో మూసీపై కేసీఆర్ ప్రభుత్వం సమావేశాలు పెట్టిందని తెలిపారు. మూసీకి 50 మీటర్ల దూరంలో బఫర్ జోన్ను నిర్ణయించారన్నారు. మాస్టర్ ప్లాన్ పూర్తి చేయాలని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారని ప్రస్తావించారు. బీఆర్ఎస్ హయాంలోనే మూసీకి సరిహద్దులను ఫిక్స్ చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు మూసీ ప్రక్షాళన ఎందుకని బీఆర్ఎస్ వాళ్లు ప్రశ్నిస్తున్నారని అన్నారు. -
అమెరికా వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, సాక్షి: రాష్ట్రానికి కొత్త పెట్టుబడులను ఆకర్షించడం కోసం ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి విదేశీ పర్యటనకు బయల్దేరారు. ఈ ఉదయం శంషాబాద్ నుంచి ఆయన అమెరికా వెళ్లారు. ఆయన వెంట మంత్రి డి.శ్రీధర్బాబు, సీఎస్ శాంతికుమారి కూడా ఉన్నారు. న్యూజెర్సీ, వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్, శాన్ఫ్రాన్సిస్కోతో పాటు దక్షిణ కొరియా సియోల్ నగరంలోనూ రేవంత్ బృందం పర్యటించనుంది.తన పర్యటనలో భాగంగా.. తొలుత ఈనెల 4న న్యూజెర్సీలో జరిగే ప్రవాస తెలంగాణీయులతో జరిగే సమావేశంలో ఈ బృందం పాల్గొంటుంది. 5, 6 తేదీల్లో న్యూయార్క్లో వ్యాపార, వాణిజ్య సంస్థల ప్రతినిధులతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలపై చర్చిస్తారు. 6న పెప్సికో, హెచ్సీఏ కంప్యూటర్స్ ప్రతినిధులతో భేటీ అవుతారు. మధ్యాహ్నం వాషింగ్టన్ డీసీకి చేరుకుని అక్కడ ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో సమావేశం కానున్నారు. 7న డల్లాస్లో వ్యాపార సంస్థల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించనున్నారు. అదే రోజు అక్కడ గాంధీ స్మృతి కేంద్రాన్ని సందర్శిస్తారు.8న శాన్ఫ్రాన్సిస్కోలో యాపిల్ ఉత్పాదక బృందం, ట్రైనెట్ సీఈఓ, ఇతర వ్యాపార సంస్థల ప్రతినిధులతో భేటీ అయి చర్చించనున్నారు. 9న గూగుల్, అమెజాన్ తదితర సంస్థల ప్రతినిధులతో సమావేశం అవుతారు. శాన్ఫ్రాన్సిస్కోలో సాయంత్రం జరిగే ప్రవాస తెలంగాణీయుల భేటీలో పాల్గొంటారు. అటు నుంచే సియోల్కు..10న శాన్ఫ్రాన్సిస్కో నుంచి బయల్దేరి 11న దక్షిణ కొరియా రాజధాని సియోల్కు చేరుకుంటారు. 12, 13 తేదీల్లో ఎల్జీ, శామ్సంగ్తో పాటు .. ఇతర వ్యాపార సంస్థల ప్రతినిధులతో భేటీ అయి పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించనున్నారు. 13న రాత్రి 11.50 గంటలకు సియోల్ నుంచి బయల్దేరి 14న ఉదయం 10.50 గంటలకు హైదరాబాద్కు చేరుకుంటారు. -
తెలంగాణ బడ్జెట్ ముఖ్యాంశాలు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో నేడు బడ్జెట్ను ప్రవేశపెట్టారు. శాసన సభలో బడ్జెట్పై ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క, మండలిలో మంత్రి శ్రీధర్ బాబు ప్రసంగించారు. ఇక, 2024-25 గాను తెలంగాణ బడ్జెట్: రెండు లక్షల 91వేల 191 కోట్లు కాగా, రెవెన్యూ వ్యయం రూ.2.20,945 కోట్లు. మూలధన వ్యయం రూ.33,487 కోట్లుగా ఉంది. బడ్జెట్ కేటాయింపులు ఇలా..సాగునీటి పారుదల శాఖకు రూ.26వేల కోట్లు.విద్యాశాఖకు రూ.21,292 కోట్లు.ప్రజాపంపిణీకి రూ.3836 కోట్లుఆరోగ్యశ్రీని రూ.10లక్షలకు పెంచాం.సంక్షేమానికి రూ.40వేల కోట్లు.రోడ్లు, భవనాలకు రూ.5790 కోట్లు.ఐటీ శాఖకు రూ.774 కోట్లు.హార్టీకల్చర్కు రూ.737 కోట్లు.పరిశ్రమల శాఖకు రూ.2762 కోట్లు.ట్రాన్స్కో, డిస్కంలకు రూ.16,410 కోట్లు.గృహజ్యోతికి రూ.2418 కోట్లు.500 రూపాయల గ్యాస్ సిలిండర్కు రూ.723 కోట్లు.అడవులు, పర్యావరణ శాఖకు రూ.1064 కోట్లు.ఎస్టీ సంక్షేమానికి రూ.17056 కోట్లు.ట్రిపుల్ ఆర్ఆర్ఆర్కు రూ.1525 కోట్లు.ఎస్సీ సంక్షేమానికి రూ.33.124 కోట్లుట్రాన్స్కో, డిస్కంలకు రూ.16,410 కోట్లు.వైదారోగ్య శాఖకు రూ.11468 కోట్లు.ఓఆర్ఆర్కు రూ.200 కోట్లు.ఎయిర్పోర్టు వరకు మెట్రో విస్తరణకు రూ.100 కోట్లు.హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్కు రూ.500 కోట్లు.హెచ్ఎండీఏ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు రూ.500 కోట్లు.హోంశాఖకు రూ.9564 కోట్లు.పంచాయతీరాజ్ శాఖకు రూ.29,816 కోట్లు.బీసీ సంక్షేమానికి రూ.9200 కోట్లు.మైనార్టీ శాఖకు రూ.3003 కోట్లు.మెట్రోవాటర్ వర్క్స్ కోసం రూ.3385 కోట్లు.కొత్త ఏర్పాటు చేసిన హైడ్రాకు రూ.200 కోట్లు.మొత్తం హైదరాబాద్ అభివృద్ధికి రూ.10వేల కోట్లు. పశుసంవర్థక శాఖకు రూ.1980 కోట్లు.విద్యాశాఖకు రూ.21,292 కోట్లు.స్త్రీ శిశు సంక్షేమశాఖకు రూ.2736 కోట్లు.ఓల్డ్ సిటీ మెట్రో విస్తరణకు రూ.500 కోట్లు.అడవులు, పర్యావరణ శాఖకు రూ.1064 కోట్లు.విద్యుత్ శాఖకు రూ.16,410 కోట్లు.రూ.2లక్షల రుణమాఫీ కోసం రూ.31వేల కోట్లు.ఇందిరా మహిళా శక్తి పథకానికి రూ.50.41 కోట్లు. మహాలక్ష్మి ఉచిత రవాణాకు రూ.723కోట్లు.మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్కు రూ.1500 కోట్లు.ఎస్సీ, ఎస్టీ గృహ లబ్ధిదారులకు రూ.6 లక్షల సాయం. మల్టీ మోడల్ సబర్బన్ రైలు ట్రాన్స్పోర్టు సిస్టంకు రూ.50 కోట్లు. మంత్రి భట్టి విక్రమార్క ప్రసంగిస్తూ.. పదేళ్ల అస్తవ్యస్త పాలనకు తెలంగాణ ప్రజలు చరమగీతం పాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పుడు పది రేట్లు పెరిగాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ ఉద్యోగాలు, నీళ్లు దక్కలేదు. బంగారు తెలంగాణ చేస్తామని ఉత్తరకుమార ప్రగల్బాలు పలికారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అప్పులపాలైంది. వామనావతారం లెక్క అప్పలు పెరిగాయి. గత ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్నారు. కొత్త ఉద్యోగాలు..గత ప్రభుత్వం మాదిరిగా దుబారా ఖర్చు ఆపేసి ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నాం. ఒంటెద్దు పోకడలతో ఆర్ధిక వ్యవస్థను నిర్వీర్యం చేశారు. అప్పులు పెరగడంతో పాటుగా బిల్లులు బకాయిలు భారీగా పెరిగిపోయాయి. కొత్త ఉద్యోగాలు సృష్టించడం కాదు.. ఉన్న ఉద్యోగాలే ఇవ్వలేదు. దశాబ్ద కాలంలో తెలంగాణ పురోగమించలేదు. జీతాలు, పెన్షన్లు చెల్లింపులు కూడా చేయలేని పరిస్థితి. రాష్ట్రంలో ఏర్పడిన పదేళ్ల తర్వాత వాస్తవిక బడ్జెట్ ప్రవేశపెట్టాం. నా తెలంగాణ కోటి రతనాల వీణ. ఎన్నో ఏళ్లు ప్రజలు ఉద్యమం చేశారు.రైతులకు మేలు..ఆయిల్ పామ్ సాగుకు రైతులకు అవసరమైన సాయం అందిస్తాం. రాష్ట్రంలో లక్ష ఎకరాల ఆయిల్ పామ్ సాగును లక్ష్యంగా పెట్టుకున్నాం. ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ వరకు, పాతబస్తీ మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు మెట్రోను విస్తరిస్తాం. మియాపూర్ నుంచి పటాన్చెరు వరకు మెట్రోను విస్తరిస్తాం. ఉచిత బస్సులు పథకం రాష్ట్ర అభివృద్ధి సాయపడుతోంది. అప్పులకు వడ్డీల కోసం రూ.17,729 కోట్లు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నా అభివృద్ధిని ఆపలేదు. ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజన పథకంలో చేరాలని నిర్ణయం తీసుకున్నాం. ఈ ఏడాది నుంచి కేంద్ర ప్రభుత్వంతో కలిసి ప్రీమియం అంతా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. రైతులకు ఇది ఎంతోగానో ఉపయోగపడుతుంది. రైతులు చెల్లించాల్సిన ప్రీమియంను ప్రభుత్వమే చెల్లిస్తుంది.ఇందిరమ్మ ఇళ్లు..త్వరలో భూమిలేని రైతు కూలీలకు ఏటా రూ.12వేలు అందిస్తాం. ఏదో గెలవాలని మేం ఎన్నికల హామీలు ఇవ్వలేదు. ఈ ఏడాది మార్చి వరకు 2,26,740 ధరణి అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి. కొత్తగా మరో 1,22,774 ధరణి దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటి వరకు 1,79,143 దరఖాస్తులను పరిష్కరించాం. రూ.2లక్షల వరకు రుణం ఉన్న రైతులకు త్వరలో రుణమాఫీ. రైతు భరోసా పథకం కింద ఎకరాకి రూ.15వేలు ఇవ్వాలన్నది మా సంకల్పం. ఇందిరమ్మ ఇళ్ల ద్వారా పేదలకు రూ.5లక్షల సాయం. ఎస్సీ, ఎస్టీ గృహ లబ్దిదారులకు రూ.6 లక్షల సాయం. ప్రతీ నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు. రాష్ట్రంలో మొత్తం నాలుగు లక్షల 50వేల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు.డ్వాక్రా మహిళలకు జీవిత బీమాస్వయం సహాయక సంఘాల్లోని 63.86 కోట్ల మంది మహిళా సభ్యులకు జీవిత బీమా. వీరికి రూ.10 లక్షల జీవిత బీమా. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి సకాలంలో చెల్లింపులు. గత ఆరు నెల్లలో బకాయిపడిన కస్టమ్ మిల్లర్స్ నుంచి రూ.450 కోట్లు వసూలు చేశాం.గత ప్రభుత్వం రైతుబంధుకు రూ.80వేల కోట్లు ఖర్చు చేసింది. రైతుబంధు ద్వారా అనర్హులకే అధికారంగా లబ్ధి చేకూరింది.తలసరి ఆదాయం ఇలా..తెలంగాణ తలసరి ఆదాయం రూ.3,47,299. జాతీయ తలసరి ఆదాయంలో పోల్చితే లక్షా 64వేలు అధికం. అత్యధికంగా రంగారెడ్డి తలసరి ఆదాయం రూ.9,46,862. అత్యల్పంగా వికారాబాద్ తలసరి ఆదాయం రూ.1,80,241. తెలంగాణ జీఎస్డీపీ రూ.14,63,963 కోట్లు. గతేదాడితో పోల్చితే 11.9 శాతం జీఎస్డీపీ వృద్ధిరేటు. 2023-24 తెలంగాణ వృద్ధిరేటు 7.4 శాతం. ఇదే సమయంలో జాతీయ వృద్ధి రేటు 7.6 శాతం. హైదరాబాద్పై స్పెషల్ ఫోకస్..ఓఆర్ఆర్ పరిధిలో కొత్త వ్యవస్థ ఏర్పాటు. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్(TCUR) ఏర్పాటు. టీసీయూఆర్ పరిధిలో జీహెచ్ఎంసీతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలు ఉంటాయి. హైదరాబాద్లో విపత్తుల నివారణ, ఆస్తుల పరిరక్షణకు హైడ్రా. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్కు అధిక ప్రాధాన్యత. మూసీ చుట్టూ రిక్రియేషన్ జోన్లు, పీపుల్స్ ప్లాజాలు, చిల్డ్రన్ పార్కులు, ఎంటర్టైన్మెంట్ జోన్లు. మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతాం. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను మారుస్తాం. డ్రగ్స్ నిర్మూలనకు అవగాహన సదస్సులు. హైదరాబాద్ చుట్టూ శాటిలైట్ టౌన్షిప్లు. టౌన్షిప్లు అన్ని సౌకర్యాలు ఉండేలా ప్రణాళికలు. వారికి వేల్ఫేర్ బోర్డులు..ఈ సంవత్సరం రంజాన్ పండుగ కోసం రూ.33కోట్లు కేటాయింపు. కల్లు గీత కార్మికులు ప్రమాదాలకు గురికాకుండా కొత్త పరికరాల పంపిణీ. కొత్తగా ముదిరాజ్, యాదవ్, కురుమ, మున్నూరు కాపు, పద్మశాలి, లింగాయత్, గంగపుత్రుల కార్పొరేషన్లు ఏర్పాటు. ఆర్థికంగా వెనుకబడిన కులాల సంక్షేమం కోసం వేల్ఫేర్ బోర్డు ఏర్పాటు. ఆరోగ్యశ్రీ పథకంలో కొత్తగా 163 రకాల వ్యాధులను చేర్చాం. నాణ్యమైన విద్యుత్ను నిరంతరాయంగా అందించాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం. తీవ్ర వేసవిలో కూడా నిరంతరాయంగా విద్యుత్ను అందించాం. అడవులు, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. అర్హులైన వారికి రైతుభరోసా ఇస్తాం. అసెంబ్లీలో రైతుభరోసా విధి విధానాలపై చర్చిస్తాం అని అన్నారు. మరోవైపు.. అసెంబ్లీలో భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగంపై బీఆర్ఎస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. భట్టి ప్రసంగానికి సభలో నిరసన నినాదాలు. బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని పార్టీ నేతలు భట్టి వ్యాఖ్యలను ఖండించారు. -
ఏఐ.. పార్కింగ్ ఎక్కడోయ్
షాపింగ్ కోసం కోఠి వెళ్లారు. అదసలే బిజీ ఏరియా.. ఫుల్ ట్రాఫిక్.. కారు పార్క్ చేయడానికి స్థలం లేదు. దగ్గరలో ఎక్కడ పార్కింగ్ ఉందో తెలియదు. రోడ్డు పక్కనే పార్క్ చేస్తే.. ట్రాఫిక్కు అంతరాయం. పోలీసుల కంట్లో పడితే ఫైన్ కట్టక తప్పదు. అదే ఓ యాప్ ఉండి, దగ్గరలో పార్కింగ్ ఎక్కడుందో తెలిస్తే..? అదీ పార్కింగ్ స్లాట్ బుక్ చేసుకుని, నేరుగా వెళ్లి పార్క్ చేసేసుకోగలిగితే..? ఈ తిప్పలన్నీ తప్పుతాయి కదా.బిజీ ప్రాంతాల్లో పార్కింగ్ స్థలాల ఏర్పాటుతోపాటు ఇలాంటి వెసులుబాట్లు తెస్తే.. వాహనదారులకు ప్రయోజనం కలుగుతుంది. ట్రాఫిక్ చిక్కులకు చెక్ పడుతుందని నిపుణులు చెప్తున్నారు. ఈ తరహా ఏర్పాట్లపై ‘ఈజీపార్క్ ఏఐ’ అనే సంస్థ ఇటీవల ఐటీ మంత్రి శ్రీధర్బాబుకు ప్రజెంటేషన్ కూడా ఇచి్చంది. ఐటీ, కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో పార్కింగ్ సమస్యను పరిష్కరించవచ్చని ప్రతిపాదన చేసింది.సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ నగరం ఇప్పటికే వాహనాలతో కిక్కిరిసిపోయింది. ఏటా పెద్ద సంఖ్యలో వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి. అవన్నీ రోడ్లపై తిరగడం సంగతి పక్కనపెడితే.. ఎక్కడో ఓ చోట పార్క్ చేయక తప్పదు. షాపింగ్ కోసం వెళ్లినా, ఏదైనా పని మీద వెళ్లినా.. పార్కింగ్ కోసం తిప్పలే. కార్లే కాదు బైకులు పెట్టడానికీ ఎక్కడా స్థలం లేని దుస్థితి. దీనితో షాపుల ముందు, రోడ్ల పక్కన, గల్లీల్లో వాహనాలను పార్క్ చేస్తున్నారు. దీనితో ట్రాఫిక్కు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ట్రాఫిక్ పోలీసులు, ప్రభుత్వం ఎంతగా ప్రయత్నించినా ట్రాఫిక్ను క్రమబద్ధీకరించడం సమస్యగా మారుతోంది. ఉదయం, సాయంత్రం సమయాల్లో ఈ ఇబ్బంది మరింత ఎక్కువగా ఉంటోంది. పర్యాటక ప్రదేశాలు, ఆలయాలు, సాయంత్రాలు ఆహ్లాదంగా గడపడానికి వెళ్లే చోట్ల పార్కింగ్ పెద్ద ప్రహసనంగా మారింది.ఎలా పనిచేస్తుంది..కృత్రిమ మేధ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) సాయంతో పార్కింగ్ సమస్యను పరిష్కరించే విధానాన్ని ఈజీపార్క్ ఏఐ సంస్థ రూపొందించింది. ఆ వివరాల మేరకు.. పార్కింగ్ స్థలం నిర్వహించే వారికి ఒక డాష్ బోర్డు ఏర్పాటు చేస్తారు. వాహనాలు ఎన్ని వస్తున్నాయి? ఆక్యుపెన్సీ ఎంత ఉంది? ఎంతసేపు వాహనాలు పార్క్ చేస్తారన్న డేటాను దాని ద్వారా అందిస్తుంది. అలా అన్ని పార్కింగ్ స్థలాల వివరాలను ఒకచోట క్రోడీకరిస్తుంది.ఈ వివరాలను ఓ యాప్ సాయంతో వాహనదారులకు అందుబాటులో ఉంచుతుంది. ఈ యాప్ ద్వారా ఎక్కడెక్కడ పార్కింగ్ స్థలాలు అందుబాటులో ఉన్నాయనేది తెలుస్తుంది. ముందుగానే పార్కింగ్ స్లాట్లను బుక్ చేసుకుని, నేరుగా వెళ్లి పార్క్ చేసుకోవచ్చు. పార్కింగ్ ఫీజును కూడా ఆన్లైన్ ద్వారానే చెల్లించేయొచ్చు. ఒకవేళ ఆ ప్రాంతానికి వెళ్లకపోతే.. స్లాట్ను క్యాన్సిల్ చేసుకోవచ్చు. పార్కింగ్ ప్రదేశాల్లో ఇంటర్నెట్ ఆధారిత కెమెరాలతో నిఘా ఉంటుంది. వాహనానికి సంబంధించిన అలర్ట్స్ వస్తాయి. దొంగతనం, మరేదైనా జరిగితే వెంటనే అప్రమత్తం చేసే ఏర్పాట్లు ఉంటాయి. వాహనాలు వెళ్లిపోయి పార్కింగ్ స్లాట్లు ఖాళీ అయితే.. వెంటనే యాప్లో అప్డేట్ అయి ఖాళీగా చూపిస్తుంది. కావాల్సిన వారు బుక్ చేసుకోవచ్చు. పార్కింగ్ స్థలం వద్ద వాహనాలు బయటికి వెళ్లడం, లోపలికి రావడం ప్రత్యేక పరికరాలతో నమోదవుతూ ఉంటుంది. ఆటోమేటిగ్గా వాటి నంబర్లను గుర్తించి అప్డేట్ చేసే వ్యవస్థ ఉంటుంది.మల్టీలెవల్ పార్కింగ్తో.. అలాగే హైదరాబాద్లో భూముల విలువలు విపరీతంగా పెరిగిపోయాయి. దీనికితోడు ప్రధాన ప్రాంతాల్లో స్థలాలకు కొరత ఉండటంతో.. మలీ్టలెవల్ పార్కింగ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇలా ఏర్పాటు చేసినా.. అవి ఎక్కడున్నాయో అందరికీ తెలిసే అవకాశం తక్కువ. తెలిసినా పార్కింగ్ ఖాళీగా ఉందో లేదో తెలియదు. అక్కడిదాకా వెళ్లి ఖాళీ లేకుంటే.. మళ్లీ మరోచోటికి వెళ్లాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే పార్కింగ్ ఖాళీగా ఉందో, లేదో తెలిసి.. ముందే స్లాట్ బుక్ చేసుకునే అవకాశం ఉంటే బాగుంటుందన్న ఆలోచనతో ‘ఈజీపార్క్ ఏఐ’ అనే సంస్థ ముందుకొచి్చంది. ఇటీవల దీనిపై రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుకు ప్రజెంటేషన్ కూడా ఇచ్చింది.భవనాల్లో పార్కింగ్ సరిగా లేక.. హైదరాబాద్లో 80 లక్షలకుపైగా వాహనాలు ఉన్నాయి. కార్లు, టూ వీలర్లతోపాటు విద్యాసంస్థల వాహనాలు, ఆటోలు వంటివీ భారీగా ఉన్నాయి. ఇందులో కార్లు, టూవీలర్ల పార్కింగ్ కోసం ఇబ్బంది వస్తోంది. ట్రాఫిక్లో ఎలాగోలా గమ్యస్థానానికి చేరుకున్న వాహనదారులకు పార్కింగ్ విషయంలో తిప్పలు తప్పట్లేదు. పార్కింగ్కు అనుగుణంగా భవన నిర్మాణాలు చేపట్టకపోవడం ఈ సమస్యకు ప్రధాన కారణమని నిపుణులు చెప్తున్నారు.పార్కింగ్ సమస్యపై జనం ఏమంటున్నారు?సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్లో పార్కింగ్ సమస్యను పరిష్కరించడంపై ఫోకస్ చేస్తామని సీఎం రేవంత్రెడ్డి గతంలో ఓ సమీక్ష సందర్భంగా ప్రకటించారు. ‘ఈజీపార్క్ఏఐ’ సంస్థ ప్రజెంటేషన్ సందర్భంగా ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. పార్కింగ్ సమస్య పరిష్కారానికి ఐటీని వినియోగించాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఐటీ, కృత్రిమ మేధ (ఏఐ)ను ఉపయోగించి వాహనాల పార్కింగ్ సమస్యను పరిష్కరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఐటీ శాఖ ఇంజనీర్లను ఆదేశించారు కూడా. ఎక్కడికెళ్లినా పార్కింగ్కు ఇబ్బందే.. హైదరాబాద్లో, ముఖ్యంగా బిజీ ఏరియాల్లో పార్కింగ్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటోంది. చాలాసేపు వెతికితే కానీ బండి పెట్టుకోవడానికి ప్లేస్ కనబడటం లేదు. చాలా షాపింగ్ కాంప్లెక్స్లలో పార్కింగ్ ఉండట్లేదు. అంతా రోడ్లపైనే పార్కింగ్ చేస్తున్నారు. అది ట్రాఫిక్కు ఇబ్బందిగా మారుతోంది. – నరేశ్గౌడ్ లోడి, అంబర్పేటప్రభుత్వం చొరవ తీసుకోవాలి హైదరాబాద్లో పార్కింగ్ పెద్ద సమస్యగా మారింది. పార్కింగ్ విషయంలో ప్రభుత్వం సరైన పాలసీ రూపొందించాలి. షాపింగ్ కాంప్లెక్స్లు, దుకాణాలకు, వాహనదారులకు అవగాహన కలి్పంచాలి. అప్పుడే నగరవాసులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. – కల్యాణ్, దిల్సుఖ్నగర్ -
లబ్ధికోసమే బీఆర్ఎస్ నీటి రాజకీయం : దుద్దిళ్ల శ్రీధర్బాబు
పెద్దపల్లి: అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల చేతిలో భంగపడ్డ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మరోసారి తెలంగాణ ప్రజలు, రైతులను మోసగించి పార్లమెంట్ ఎన్నికల్లో రాజకీయలబ్ధి పొందేందుకే ‘నీళ్ల’ రాజకీయం చేస్తున్నారని రాష్ట్రమంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు మండిపడ్డారు. జిల్లా కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యేలు విజయరమణారావు, ఠాకూర్ మక్కాన్సింగ్తో కలిసి మాట్లాడారు. అధికారంలో ఉన్న పదేళ్లలో రైతులను ఏనాడూ పట్టించుకోని కేసీఆర్కు ఇప్పుడు వారి కష్టాలు గుర్తుకొచ్చాయని మొసలికన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. అయినా రైతులు ఆయనను నమ్మడం లేదన్నారు. కాంగ్రెస్ అఽధికారంలోకి రాగానే బీఆర్ఎస్ పాలనలో చేసిన మోసాలు, పాపాలు బయటకు వస్తున్నాయని, వాటినుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు యత్నిస్తున్నారని దుయ్యబట్టారు. పత్తిపాక రిజర్వాయర్ నిర్మిస్తాం.. వ్యవసాయ రంగంలో సాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేలా పత్తిపాక రిజర్వాయర్ నిర్మిస్తామని, అలాగే పాలకుర్తి మండలంలో ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేస్తామని మంత్రి శ్రీధర్బాబు ప్రకటించారు. తమ ప్రభుత్వం అన్నివర్గాల సంక్షేమం కోసం పాటుపడుతోందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన గ్యారంటీలన్నీ పక్కాగా అమలు చేస్తామని అన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఇప్పటికే 35కోట్ల మంది అక్కాచెల్లెళ్లు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సాగించారని అన్నారు. 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ అర్హులందరికీ అందిస్తామని తెలిపారు. సాంకేతిక కారణాలతో పొరపాట్లు దొర్లినా ఇబ్బంది పడొద్దని, వారి నుంచి విద్యుత్ అధికారులు బిల్లులు వసూలు చేయరాదని సూచించారు. జిల్లా ప్రజలకు ఆరోగ్యశ్రీ ద్వారా రూ.15కోట్ల విలువైన వైద్యసేవలు అందించామన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అతలాకుతలం చేసిన బీఆర్ఎస్ పాలకుల తప్పిదాలను గాడిన పెట్టేందుకే సమయం పడుతోందని తెలిపారు. సమావేశంలో నాయకులు శంకర్, రమేశ్గౌడ్, సారయ్య, ప్రకాశ్రావు, మహేందర్, సంపత్, మల్లయ్య, శ్రీనివాస్, మస్రత్, కుమార్, ఈర్ల స్వరూప, కుమారస్వామి, అక్బర్అలీ పాల్గొన్నారు. ఇవి చదవండి: దానం నాగేందర్ను గెలిపించడమే మా బాధ్యత: కోమటిరెడ్డి -
నిజాం షుగర్స్ పునఃప్రారంభానికి కట్టుబడి ఉన్నాం
బోధన్: నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని పునఃప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి, నిజాం షుగర్స్ పునరుద్ధరణ కమిటీ చైర్మన్ దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నా రు. సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో జరిగిన సమావేశంలో ఫ్యాక్టరీలను తెరిపించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇందుకోసం క్షేత్రస్థాయిలో పరిస్థితులను అధ్యయనం చేయడానికి ఫ్యాక్టరీ సందర్శనకు వచ్చామని పేర్కొన్నారు. శనివారం బోధన్లోని ఫ్యాక్టరీని కమిటీ సభ్యులు సందర్శించారు. స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి అధ్యక్షతన ఫ్యాక్టరీ ఆవరణలో చెరుకు రైతులతో సమావేశమై వారి అభిప్రాయాలను సేకరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రైతులు, కార్మికుల శ్రేయస్సు కోసం ఫ్యాక్టరీని తెరిపించి లాభాల బాటలో నడిపేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని చెప్పారు. రైతులకు మేలు చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇప్పటికే వ్యవసాయ, పారిశ్రామికరంగ నిపుణులతో చర్చిస్తున్నామని వివరించారు. రైతులకు సబ్సిడీ విత్తనాలు, పెట్టుబడి సాయం, వడ్డీ లేని రుణాలు వర్తింపజేసేలా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఫ్యాక్టరీలను ప్రభుత్వమా లేక సహకార విధానంలోనా లేక ప్రైవేటు రంగంలోనా ఎలా నడపాలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. నిపుణులతో చర్చించి తుది నిర్ణయం తీసుకొనేందుకు ఆలోచించకపోతే నిజాం షుగర్స్ కూడా కాళేశ్వరం ప్రాజెక్టులా అవుతుందని వ్యాఖ్యానించారు. మార్పు చేసి చూపుతాం.. ప్రజలు ఆకాంక్షించిన మార్పును చేసి చూపుతామని శ్రీధర్బాబు తెలిపారు. ఈ నెల 27న రూ. 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలను ఏఐసీసీ నాయకురాలు ప్రియాంకా గాంధీ ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. హైదరాబాద్ శివారులో జిల్లాలు, ముఖ్య పట్టణాలను కలుపుతూ రీజినల్ రింగ్రోడ్డు (ఆర్ఆర్ఆర్) నిర్మించేందుకు ముందుకు వెళ్తున్నామన్నారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్, రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, నిజాం షుగర్స్ ఎండీ డాక్టర్ మక్సూద్, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి పాల్గొన్నారు. -
317 జీవోపై కేబినెట్ సబ్ కమిటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కొత్త జోన్లు, కొత్త జిల్లాలకు అనుగుణంగా ఉద్యోగుల సర్దుబాటు కోసం ఉద్దేశించిన జీవో నంబర్ 317పై ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల అభ్యంతరాల దృష్ట్యా మంత్రి దామోదర రాజనర్సింహ అధ్యక్షతన ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్గా మంత్రి దామోదర, సభ్యులుగా మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్ ఉంటారు. 2021లో ఇచ్చిన జీవో 317, జీవో 46పై వివాదాలు, ఉద్యోగుల అభ్యంతరాలపై ఈ కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి సిఫార్సులు చేయనుంది. పీఆర్టీయూటీఎస్ హర్షం గత ప్రభుత్వం జారీ చేసిన జీవో 317పై ఉద్యోగుల అభ్యంతరాలను అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేబ్నెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయడం పట్ల పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పింగిలి శ్రీపాల్రెడ్డి, బీరెల్లి కమలాకర్రావు హర్షం వ్యక్తం చేశారు. 317 జీవోతో ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోయారు: టీఎస్యూటీఎఫ్ ఉద్యోగుల శాశ్వత కేటాయింపు కోసం గత ప్రభు త్వం జీవో 317 ద్వారా ఏకపక్షంగా విడుదల చేసిన మార్గదర్శకాల కారణంగా పలువురు ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోయారని టీఎస్యూటీఎఫ్ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శులు కె జంగయ్య, చావ రవి పేర్కొన్నారు. ఇప్పుడు ఆ సమస్యలను అధ్యయనం చేసి పరిష్కారాలను సిఫారసు చేయటం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. జీవో 46పై సబ్ కమిటీతో నిరుద్యోగులకు న్యాయం: బల్మూరి వెంకట్ జీవో నంబర్ 46పై కేబినెట్ సబ్ కమిటీ వేయడాన్ని ఎంఎల్సి బల్మూరి వెంకట్ స్వాగతించారు. జీవో 46 వల్ల గ్రామీణ ప్రాంతాల నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉందని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి తాము సూచనలు, సల హాలు చేసినా పట్టించుకోలేదని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు ప్రజా ప్రభుత్వం సబ్ కమిటీ వేసిందని వెంకట్ హర్షం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో నిరుద్యోగులకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారికి ఉద్యోగ అవకాశాల్లో ఎలాంటి అన్యా యం జరగకుండా సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పీఆర్ కమిషనర్కు టీపీఎస్ఏ వినతిపత్రం ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు అంశాలు, బదిలీలపై గత సర్కార్ ఇచ్చిన జీవో 317తో ముడిపడిన సమస్యల పరిశీలనకు సీఎం రేవంత్రెడ్డి కేబినెట్ సబ్కమిటీని నియమించడం పట్ల తెలంగాణ పంచాయతీ సెక్రటరీస్ అసోసియేషన్ (టీపీఎస్ఏ) హర్షం ప్రకటించింది. ఈ జీవో కారణంగా పంచాయతీ కార్యదర్శులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ అనితా రామచంద్రన్కు టీఎస్పీఏ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు శనివారం పీఆర్ కమిషనరేట్లో కమిషనర్కు టీఎస్పీఏ ప్రతినిధులు మధుసూదన్రెడ్డి, .శ్రీనివాస్, పండరీనాథ్ వినతిపత్రం సమర్పించారు. ఈ జీవో వల్ల కొందరు కార్యదర్శులు స్థానికతను కోల్పోయి కుటుంబాలకు దూరంగా ఇబ్బందులుపడుతున్నారని కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. -
పారిశ్రామిక భూముల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పారిశ్రామిక భూముల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో పరిశ్రమల విస్తరణ, అభివృద్ధి నేపథ్యంలో టీఎస్ఐఐసీ విభాగపు అధికారులతో మంత్రి శ్రీధర్బాబు బషీర్బాగ్లోని సంస్థ కార్యాలయంలో శనివారం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశంలో సంస్థ కార్యకలాపాలు, విభాగాల పనితీరు, ల్యాండ్ బ్యాంకు, భూ కేటాయింపులు, వాటి వినియోగం తదితర అంశాలపై పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, సంస్థ ఎండీ విష్ణువర్ధన్రెడ్డి, అధికారులతో కలిసి సమీక్షించారు. రాష్ట్ర విభజనకు ముందు, తర్వాత జరిగిన కేటాయింపులపై మంత్రి దృష్టిసారించారు. 2014 తర్వాత జరిగిన భూ కేటాయింపులు, ఏయే కంపెనీలు ఎంత మేర, ఏ అవసరాల కోసం భూమి పొందిందీ.. ప్రస్తుత వినియోగం ఎంత, నిరుపయోగంగా ఉన్న భూముల వ్యవహారాలపై మంత్రి ఆరా తీశారు. ఏళ్లు గడిచినా సంబంధిత కంపెనీలు భూములు వినియోగించుకోకపోవడం.. భూములు పొందిన సంస్థలు వారి ప్రయోజనాలకు కాకుండా థర్డ్ పారీ్టలకు లీజుకు ఇచ్చిన అంశాలపై అధికారుల ద్వారా ఆరా తీశారు, అలా థర్డ్ పారీ్టలకు జరిగిన లీజు అగ్రిమెంట్లు, పొందుతున్న ఆదాయం అంశాలపై నివేదిక సమర్పించాలని సంస్థ ఉన్నతాధికారులను ఆదేశించారు. గతంలో భూములు పొంది, ఈడీ , సీబీఐ లాంటి సంస్థలు జప్తు చేసిన భూములపై హక్కు తిరిగి పొందేలా న్యాయస్థానాల్లో పోరాటం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని మంత్రి అధికారులకు సూచించారు. జాయింట్ వెంచర్లో భాగంగా పలు సంస్థలు, కంపెనీలు డివిడెండ్, షేర్ హోల్డ్ అమౌంట్ చెల్లించని అంశాలపై నివేదిక అందించాలని ఆదేశించారు. రాష్ట్ర అభివృద్ధిలో పరిశ్రమల శాఖ అధికారుల కృషి చాలా ఉందని, మరింతగా సంస్థ అభివృద్ధి కోసం సూచనలు, సలహాలతో పాటు సమస్యలు కూడా లిఖిత పూర్వకంగా ఇవ్వాలని ఉద్యోగులకు మంత్రి చెప్పారు. ప్రతి అధికారి ఫీల్డ్ విజిట్ చేసి సంబంధిత కంపెనీలకు సంబంధించిన భూములపై అన్ని వివరాలతో త్వరితగతిన నివేదిక అందించాలని సంస్థ ఎండీని మంత్రి ఆదేశించారు. -
ఫిబ్రవరి నుంచి 200 యూనిట్ల ఉచిత కరెంట్ హామీ అమలు: మంత్రి కోమటిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ సర్కార్ నిర్వాకం వల్ల తెలంగాణ అప్పులపాలైందన్నారు రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అందువల్లే ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో జాప్యం జరుగుతోందన్నారు. ఫిబ్రవరి నెల నుంచి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు హామీ అమలు చేస్తామని చెప్పారు. నిరుద్యోగ భృతి మొదలుకొని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వరకు అన్ని హామీలను గత ప్రభుత్వం విస్మరించిందని మండిపడ్డారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా రాదన్న మంత్రి.. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు అన్ని అక్రమాలపై విచారణ కొనసాగుతుందని తెలిపారు. కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ భేటీ మంగళవారం గాంధీభవన్లో కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ సమావేశమైంది. మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఏఐసీసీ ఇంచార్జ్ దీపదాస్ మున్శి , ఏఐసీసీ ప్రొఫెషనల్ కాంగ్రెస్ కమిటీ చైర్మన్ ప్రవీణ్ చక్రవర్తి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు పాల్గొన్నారు. ఏఐసీసీ మ్యానిఫెస్టోలో తెలంగాణ నుంచి చేర్చాల్సిన అంశాలపై చర్చించారు. అన్ని రాష్ట్రాల్లో తిరిగి అభిప్రాయాలను సేకరిస్తున్న కేంద్ర మేనిఫెస్టో కమిటీ.. తెలంగాణ మేనిఫెస్టో కమిటీ నుంచి కూడా అభిప్రాయాలను సేకరించింది. నాలుగైదు కామన్ స్కీములతో పాటు.. రాష్ట్రాల కోసం ప్రత్యేక అంశాలను మేనిఫెస్టోలో పెట్టాలని కాంగ్రెస్ నిర్ణయం నిర్ణయించింది. చదవండి: కేటీఆర్, హరీశ్రావుపై బీజేపీ నేత రఘునందన్ రావు ఫైర్ ప్రతిపక్షాలవి తొందరపాటు విమర్శలు మేనిఫెస్టోతోనే తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలించిందని అన్నారు పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు. అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతామని చెప్పారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీపై ఎంతో విశ్వసాన్ని చూపారని అన్నారు. ప్రతిపక్ష పార్టీ చేస్తున్న విమర్శలు చాలా తొందరపాటుగా ఉన్నాయని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఏఐసీసీ మ్యానిఫెస్టోకు టీ కాంగ్రెస్ సాయం తీసుకుంటాం మేనిఫెస్టో అంటే ప్రజలకు దగ్గరగా, అమలుకు నోచుకునే విదంగా ఉండాలని ఏఐసీసీ ప్రొఫెషనల్ కాంగ్రెస్ చైర్మన్ ప్రవీణ్ చక్రవర్తి తెలిపారు. తెలంగాణలో మంచి మేనిఫెస్టో అందించారని.. అందుకే రాష్ట్ర ప్రజలు విశ్వసించారని పేర్కొన్నారు. ఏఐసీసీ మేనిఫెస్టో కేంద్ర మాజీ మంత్రి చిదంబరం నేతృత్వంలో రూపొందుతుందని చెప్పారు. మ్యానిఫెస్టో పబ్లిక్ ఫ్రెండ్లీగా, క్రోని కాపిటల్కు దూరంగా ప్రజావసరాలకు దగ్గరకు ఉండాలన్నారు. ఏఐసీసీ మ్యానిఫెస్టోకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సహకారం తీసుకుంటామన్నారు. -
WEF: దావోస్ బయల్దేరిన సీఎం రేవంత్రెడ్డి
ఢిల్లీ, సాక్షి: తెలంగాణకు భారీ పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దావోస్(స్విట్జర్లాండ్) పర్యటనకు బయల్దేరారు. సోమవారం ఉదయం ఢిల్లీ నుంచి నేరుగా ఆయన దావోస్కు వెళ్తున్నారు. నేటి నుంచి 19వ తేదీ వరకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) 54వ సమావేశంలో సీఎం రేవంత్ నేతృత్వంలోని అధికారిక బృందం పాల్గొననుంది. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు, బలాబలాలు, ప్రాధాన్యతలను ఈ వేదిక ద్వారా చాటి చెప్పాలని రాష్ట్ర బృందం నిర్ణయించింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రపంచ ఆర్థిక ఫోరం సమావేశానికి వెళ్తున్న రాష్ట్ర అధికారిక బృందానికి ముఖ్యమంత్రి నేతృత్వం వహించడం ఇది తొలిసారి. ఈ బృందంలో ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుతోపాటు ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రెటరీ కూడా ఉన్నారు. రాష్ట్ర బృందం ఎకనామిక్ ఫోరం సమావేశాల్లో భాగంగా దేశ, విదేశ పారిశ్రామికవేత్తలను కలసి కొత్త ప్రభుత్వ విజన్, ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించనుంది. ఐటీ రంగంలో అగ్రగామిగా, లైఫ్ సైన్సెస్ రంగానికి హబ్గా ఉన్న తెలంగాణ బలాలను ప్రపంచానికి చాటి చెప్పి పెట్టుబడులను ఆకర్షించాలని భావిస్తోంది. మూడు రోజుల దావోస్ పర్యటనలో 70మందికిపైగా పారిశ్రామికవేత్తలతో రాష్ట్ర బృందం భేటీ కానుంది. -
T Congress: సీతక్కకు సవాల్.. ఆయనకేమో సులువు?
సాక్షి, ఆదిలాబాద్: వచ్చే ఏడాది జరిగే లోక్సభ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ గురి పెట్టింది. జనవరిలో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పార్లమెంటు పరిధిలో పార్టీని పటిష్టం చేయడంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్చార్జీలను నియమించింది. ఆదిలాబాద్కు రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కను, పెద్దపల్లికి ఐటీ, అసెంబ్లీ వ్యవహా రాల శాఖ మంత్రి శ్రీధర్బాబును నియమించారు. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగింటిలో బీజేపీ గెలిచింది. రెండుచోట్ల బీఆర్ఎస్, ఒకచోట కాంగ్రెస్ విజయం సాధించాయి. ఇక పెద్దపల్లి లోక్సభ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా అన్నీ కాంగ్రెస్ కై వసం చేసుకుంది. దీంతో లోక్సభ ఎన్నికల్లో పార్టీని గెలిపించడం శ్రీధర్బాబు పెద్దకష్టం కాదని ప్రచారం సాగుతోంది. శ్రీధర్బాబుకు సులువేనా.. ఇక పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జీగా నియమితులైన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఇదే నియోజకవర్గ పరిధిలోని మంథని శాసనసభ్యుడు. గతంలో కాంగ్రెస్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. స్థానిక నేతలపై పట్టు ఉంది. అయితే గత పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ బీఆర్ఎస్ హవాతో అభ్యర్థి బొర్లకుంట వెంకటేశ్నేత ఎంపీగా గెలిచారు. ఇక ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను కాంగ్రెస్ క్లీన్స్వీప్ చేసింది. చెన్నూర్, మంచిర్యాల, మంథని, రామగుండం, పెద్దపల్లి, ధర్మపురిలో హస్తం పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ఇక ఆరు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ రెండో స్థానంలో, మంచిర్యాల నియోజకవర్గంలో మూడో స్థానంలో నిలవడం గమనార్హం. దీంతో రాబోయే పార్లమెంట్ ఎన్నికలు ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ ఉత్సాహం చూపుతుండగా, బీఆర్ఎస్ 2019 ఫలితాలను పునరావృతం చేయాలని చూస్తోంది. అయితే ఇక్కడ పార్టీని గెలిపించడం శ్రీధర్బాబుకు సులువే అన్న చర్చ సాగుతోంది. ఈ బాధ్యత ఇన్చార్జీలదే.. ఈ రెండు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలు బాధ్యతలను కూడా ఇన్చార్జీలే తీసుకోనున్నారు. అయితే ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఆరుచోట్ల ఎమ్మెల్యేలు లేకపోవడంతో అక్కడ ఆ పథకాల అమలు పరంగా ఆ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన వారిని పరిగణలోకి తీసుకుని ముందుకెళ్తారా.. లేక ఇతర ముఖ్య నాయకుల కు ప్రాధాన్యతనిస్తారనేది చూడాలి. ఇక పెద్దపల్లిలో అందరూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండడంతో సంక్షే మ పథకాల అమలులో ఆ పార్టీకి పెద్దగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం లేదు. డిసెంబర్ 28 నుంచి గ్రామసభలు నిర్వహించి పథకాల అమలు, లబ్ధిదారుల ఎంపిక చేయనున్నారు. ఈ క్రమంలో ఇన్చార్జీలు కీలకం కానున్నారు. సీతక్కకు సవాలే.. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జీగా నియమితులైన సీతక్కకు ఇక్కడ సవాళ్లు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ విజయఢంకా మోగించింది. ఎంపీగా సోయం బా పూరావు విజయం సాధించారు. గడిచిన శాస న సభ ఎన్నికల్లో ఈ లోక్సభ పరిధిలోని ఆది లాబాద్, నిర్మల్, ముథోల్, సిర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గాలు కమలం ఖాతాలో చేరా యి. బోథ్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో బీ ఆర్ఎస్ పార్టీ తమ ప్రాబల్యం నిలుపుకుంది. కేవలం ఖానాపూర్ నియోజకవర్గంలో మాత్ర మే కాంగ్రెస్ గెలిచింది. ఇదిలా ఉంటే గతంలో సీతక్క ఈ పార్లమెంట్ నియోజకవర్గ పరి ధిలో పలుమార్లు పర్యటించారు. నాయకులు, పార్టీ స్థితిగతులపై అవగాహన ఉంది. అ యితే ప్రతికూల పరిస్థితుల నుంచి విజయాన్ని అందుకోవాల్సిన పరిస్థితుల నేపథ్యంలో లోక్సభ సీటును గెలిపించడం సీతక్కకు సవాలే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇవి చదవండి: కొలిక్కిరాని మేడిగడ్డ పునరుద్ధరణ! -
సర్కారు ఖజానాలో పైసల్లేవ్.. క్రమశిక్షణతో ఆదాయం పెంచుతాం!
జగిత్యాల/పెద్దపల్లి: ప్రస్తుతం సర్కారు ఖజానాలో పైసల్లేవని, క్రమశిక్షణతో ఆదాయం పెంచుకుంటామని ఐటీ, పరిశ్రమలు, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం పది రోజుల్లో మరో రెండు గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. మంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన శ్రీధర్బాబు ఆదివారం జిల్లాలో పర్యటించారు. తొలుత సుల్తానాబాద్ మండలానికి చేరుకున్న ఆయన.. పెద్దపల్లి, కమాన్పూర్, సెంటినరీకాలనీ మీదుగా మంథని చేరుకున్నారు. అడుగడగునా ఆయనకు కాంగ్రెస్ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్, రామగుండం ఎమ్మెల్యే ఠాకూర్ మక్కాన్సింగ్ మంత్రి వెంట ఉన్నారు. యువతకు ఉద్యోగాలు ఇస్తాం! జిల్లా కేంద్రంగా మారిన పెద్దపల్లి రూపురేఖలు మార్చుతామని, అభివృద్ధిలో ముందు వరుసలో నిలుపుదామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. జిల్లాలో పరిశ్రమలు ఉన్న రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకుంటామన్నారు. అవసరం మేరకు మరిన్ని పరిశ్రమలు స్థాపిస్తామని హామీ ఇచ్చారు. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు మాట్లాడుతూ, నియోజకవర్గానికి మంత్రి శ్రీధర్బాబు అండదండలు ఉండాలన్నారు. గతంలోనూ తనకెంతో సహకారం అందించారని గుర్తుచేశారు. స్పందించిన మంత్రి శ్రీధర్బాబు.. సీఎం రేవంత్రెడి ఎమ్మెల్యే విజ్జన్నకు అత్యంత సన్నిహితులన్నారు. తామంతా కలిసే జిల్లా అభివృద్ధికి పాటుపడతామని తెలిపారు. జిల్లాతో తనకెంతో అనుబంధం ఉందని ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. మంత్రి ఆదేశాలు అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ అన్నారు. ఆరు గ్యాంరెటీలు అమలు చేస్తాం! ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చిన ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తామని మంత్రి శ్రీధర్బాబు అన్నారు. ఇప్పటికే రెండు గ్యారెంటీలు అమలు చేస్తున్నామని, మరో 15 రోజుల్లో ఇంకో రెండు అమలు చేస్తామన్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ , పెద్దపల్లికి బైపాస్ రోడ్డు, బస్ డిపో, జిల్లా కోర్టు, 50 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి మంజూరు చేయిస్తామన్నారు. కాగా, సుల్తానాబాద్ ర్యాలీలో పలువురు దొంగలు చేతివాటం ప్రదర్శిస్తూ నాయకులు, ప్రజాప్రతినిధుల పర్సులు చోరీచేశారు. ప్రజలు శాంతి కోరుకున్నారు.. కమాన్పూర్ మండలం గొల్లపల్లె వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంత్రికి ఘనస్వాగతం పలికారు. కమాన్పూర్ ఎక్స్ రోడ్డు మంత్రి మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో మంథని నియోజకవర్గంలో రౌడీయిజం రాజ్యామేలిందన్నారు. ప్రజలు శాంతియుత వాతావరణం కోరుకుని కాంగ్రెస్కు ఓట్లేసి గెలిపించారని అన్నారు. నాయకులు వైనాల రాజు, ఇనగంటి భాస్కర్రావు, కోలేటి మారుతి, తొట్ల తిరుపతియాదవ్, ఆకుల ఓదెలు, కట్కం రవీందర్, తొగరి అన్నపూర్ణ పాల్గొన్నారు. ఇవి చదవండి: అడవిబిడ్డకు అపూర్వ స్వాగతం.. మల్లంపల్లిలో మాట్లాడుతున్న సీతక్క! -
పాలనలో మార్పు చూపిస్తాం! : దుద్దిళ్ల శ్రీధర్బాబు
కరీంనగర్: ప్రజలు మార్పు కోరుకొని, కాంగ్రెస్కు అధికారం కట్టబెట్టారని, తాము పాలనలో మార్పు చూపిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. కష్టకాలంలో పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను గుర్తుంచుకుంటామని తెలిపారు. రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆదివారం తొలిసారి మంథనికి వెళ్తూ మార్గమధ్యలో కరీంనగర్కు చేరుకున్న ఆయనకు పార్టీ నగర అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్రెడ్డి ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఏ లక్ష్యాలు, ఏ ఆశయాల కోసం తెలంగాణ సాధించుకున్నామో వాటిని బీఆర్ఎస్ విస్మరించిందని ఆరోపించారు. అందుకే ప్రజలు ఆ పార్టీని గద్దెదించారన్నారు. పీసీసీ నాయకుడు వైద్యుల అంజన్కుమార్, ఎండీ.తాజ్, సమద్ నవాబ్, కమ్రొద్దీన్, వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఇవి చదవండి: ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా చేస్తా! : మేయర్ వై.సునీల్రావు -
హైదరాబాద్లో ‘గింబల్స్’ తయారీ పరిశ్రమ
సాక్షి, హైదరాబాద్: భారత రక్షణ దళాలకు అవసరమయ్యే ఆధునిక ‘గింబల్స్’తయారీ పరిశ్రమను హైదరాబాద్లో ఏర్పాటు చేయాల్సిందిగా ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు కోరారు. హైదరాబాద్కు చెందిన హెచ్సీ రోబోటిక్స్ ఫ్రెంచ్ కంపెనీ మేరియోతో కలిసి ఆధునిక గింబల్స్ తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఫ్రెంచ్ కంపెనీ మేరియోకు చెందిన అత్యున్నతస్థాయి ప్రతినిధి బృందం సంస్థ సీఈవో రెమీప్లెనెట్ నేతృత్వంలో శుక్రవారం మంత్రిని కలిసి హైదరాబాద్లో తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు ఆసక్తిని తెలియజేసింది. హైదరాబాద్లో మేరియో కార్యకలాపాలకు ప్రభుత్వపరంగా మద్దతును ఇస్తామని మంత్రి హామీనిచ్చారు. మేరియో ప్రతినిధి బృందం భారత పర్యటనలో భాగంగా కేంద్ర రక్షణ శాఖ అధికారులతోపాటు ఇతర రక్షణ రంగ ఉత్పత్తుల తయారీ సంస్థలతో సమావేశమైంది. శ్రీధర్బాబును కలిసిన ప్రతినిధి బృందంలో హెచ్సీ రోబోటిక్స్ సీఈవో వెంకట్ చుండి, డైరెక్టర్ డాక్టర్ రాధాకిషోర్ ఉన్నారు. -
జిల్లాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల బారులు
-
24 గంటల ఉచిత విద్యుత్ కాంగ్రెస్ తోనే సాధ్యం
-
పుట్టకే టికెట్.. మంథనిలో ఉత్కంఠ పోరు!
మంథని నియోజకవర్గంలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొంది ప్రధానమంత్రి అయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు మూడుసార్లు మంథని నియోజక వర్గ ఎమ్మెల్యేగా గెలుపొంది స్పీకర్గా సేవలందించారు. అనంతరం దుద్దిల్ల శ్రీధర్ బాబు నాలుగు సార్లు గెలుపొంది వివిధ శాఖలకు మంత్రిగా, ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ► నియోజకవర్గం గురించి ఏవైనా ఆసక్తికర అంశాలు: మధుకర్ హత్య, న్యాయవాదులైన గట్టు వామన్ రావు - నాగమణి దంపతుల హత్య. ► ఈ నియోజకవర్గంలో ఎన్నికలను ప్రభావితం చేసే అత్యంత కీలకమైన అంశం కాళేశ్వరం ప్రాజెక్ట్ మంథని ఎమ్మెల్యేగా ఉన్న దుద్ధిళ్ల శ్రీధర్ బాబు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కావడం, అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన పుట్ట మధు ప్రస్తుతం పెద్దపల్లి జడ్పీ చైర్మన్గా ఉన్నాడు. బీజెపి నుంచి మాజీ ఎమ్మెల్యే రాంరెడ్డి తనయుడు చంద్రుపట్ల సునీల్ రెడ్డి పార్టీ బలోపేతం చేస్తూ ఎన్నికల్లో పోటీ చేయడానికి రెడీ అవుతున్నాడు. కాంగ్రెస్ నుంచి శ్రీధర్ బాబు, బీజెపి పార్టీ నుంచి సునీల్ రెడ్డికి పోటీ ఎవరూ లేకపోవడం పార్టీ టికెట్ కన్ఫాం కావడంతో గెలుపు కోసం ఎవరి ప్రచారాలు వారు చేసుకుంటూ రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. అధికార బీఆర్ఎస్ పార్టీలో మాత్రం ఆశావాహుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది... ప్రస్తుత పెద్దపెల్లి జెడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ మంథని నియోజకవర్గ ఇన్చార్జీగా ఉన్న పుట్ట మధుపై హైకోర్టు న్యాయవాద గట్టు వామన్ రావు - నాగమణి దంపతులు హత్య అనంతరం వచ్చిన ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఆ సమయంలో పుట్టమధు పది రోజులు కనిపించకుండపోవడం నియోజకవర్గ వ్యాప్తంగా చర్చకు దారితీసాయి. తన రాజకీయ అస్తిత్వం కాపాడుకోవడానికి పుట్టమధు బహుజనవాదం, బీసీ వాదాన్ని భుజానికెత్తుకున్నారు. కాటారం సింగిల్ విండో చైర్మన్గా ఉన్న చల్ల నారాయణరెడ్డి ఇటీవల రాజకీయంగా యాక్టివ్ అయ్యారు. అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఆయా శుభకార్యాలకు నియోజకవర్గ వ్యాప్తంగా తిరుగుతున్నాడు. పార్టీ అధిష్టానంతో నిత్యం టచ్లో ఉంటూ, బీఆర్ఎస్ అసంతృప్త నేతలను చేరదీస్తూ పార్టీ టికెట్ ఇస్తే పోటీ చేస్తానంటున్నాడు... రెండు రోజుల క్రితం పెద్దపెల్లి మాజీ ఎంపీ చేలిమల సుగుణ కుమారి మంథని, పెద్దపల్లిలో పర్యటించారు. చాలా సంవత్సరాలుగా విదేశాల్లో ఉంటున్న మాజీ ఎంపీ సుగుణకుమారి ఒక్కసారిగా ప్రత్యక్షం కావడంతో పొలిటికల్ సర్కిల్లో ఆమె రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని ఆమె మద్దతుదారులు అంటున్నారు. అయితే సుగుణ కుమారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా? ఎంపీగా పోటీ చేస్తారా?.. పెద్దపెల్లి పార్లమెంటు పరిధిలోని ఏ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు.. ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు.. ఇలా వివిధ రకాల గాసిప్స్ స్టార్ట్ అయ్యాయి. రాజకీయ పార్టీల వారీగా ఎవరెవరు ప్రధాన పార్టీల టికెట్ల కోసం పోటీ పడుతున్నారు? దుదిల్ల శ్రీధర్ బాబు (కాంగ్రెస్ పార్టీ). చంద్రుడు పట్ల సునీల్ రెడ్డి (బిజెపి పార్టీ). పుట్ట మధుకర్ (బీఆర్ఎస్ పార్టీ) మంథని నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలు: మంథని నియోజవర్గంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాపకంగా నిర్వహించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ కారణంగా పంట పొలాలు నీట మునుగుతుండటం. అన్నారం బ్యారేజీ బ్యాక్ వాటర్తో గోదావరి నదిని ఆనుకొని ఉన్న గ్రామాలైన ఖాన్ సాయిపేట, ఆరెంద, మల్లారం, ఖానాపూర్, ఉప్పట్ల, విలోచవరం, పోతారం తదితర గ్రామాల్లో గత నాలుగు సంవత్సరాలుగా పంటలు పండలేని పరిస్థితి. గోదావరినదిని ఆనుకొని కరకట్ట నిర్మించాలని లేని పక్షంలో భూసేకరణ చేయాలని కోరుతున్న రైతులు. ఇసుక క్వారీలతో వందలాది లారీలు నిత్యం రాకపోకలతో కాటారం- మంథని ప్రధాన రహదారులు పూర్తిగా ధ్వంసం అయ్యాయి, దీంతో ప్రజలు ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి వస్తున్నాయి. అంతేకాదు తరచూ లారీల రాకపోకల కారణంగా అక్కడ రోడ్డు ప్రమాదాలు జరగడంతో ఇంటి పెద్దలను కొల్పోయి ఎన్నో కుటుంబాలు ఆసరా కోల్పోతున్నాయి. మేజర్ గ్రామపంచాయతీగా ఉన్న మంథని, మున్సిపాలిటీగా మారడంతో పనులు లేక ఉపాధి కోల్పోయిన పేద మధ్యతరగతి కుటుంబాలు. పేరు గొప్ప ఊరు దిబ్బగా మారిన మంథని మున్సిపాలిటీ పరిధిలో చూస్తే మాత్రం ఎక్కడ చూసినా విగ్రహాలే ఎక్కడికక్కడే పేరుకపోయిన సమస్యలు. పట్టణం లోని మాతాశిశు హాస్పిటల్ ముందున్న డంపింగ్ యార్డ్ లో కాల్చిన చెత్త వలన వచ్చే పొగతో అనారోగ్య బారినపడుతున్న ప్రజలు. రామగిరి మండలంలో ప్రధానంగా సింగరేణి భూ నిర్వాసితుల సమస్యలు, భూ నిర్వాసితులకు ఇటు సింగరేణి పరంగా అటు ప్రభుత్వ పరంగా రావలసిన బెనిఫిట్స్ రాకపోవడం రెంటికి చెడ్డ రేవడిలా మారింది... మంథని నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్రం వచ్చాక పెద్దగా అభివృద్ధి పనులు ఏమీ జరగలేదని, మిషన్ భగీరథ పేరుతో ఉన్న రోడ్లను ధ్వంసం చేశారని, సహజ వనలను దోచుకుపోతున్నారనేది మాత్రం వాస్తవం... ముఖ్యంగా రైతుబంధు, రైతు భీమా లాంటి పథకాలు రావడంలేదని ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు: వృత్తిపరంగా రైతులు, ఉద్యోగులు, వ్యాపారులు ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా సింగరేణి బోగ్గు కార్మికులు ఎక్కువ. నదులు: గోదావరి, ప్రాణహిత ఆలయాలు: ప్రముఖ పుణ్యక్షేత్రం కాలేశ్వరంలోని కాలేశ్వర ముక్తేశ్వర దేవాలయం, మంథనిలో పురాతన ఆలయాలు. పర్యాటకం: కాలేశ్వరం ప్రాజెక్ట్, రామగిరి ఖిల్లా, కాటారం మండలంలోని ప్రతాపగిరి కొండ -
Karimnagar: ఉగాది వేళ.. జాతకాల్లో అదృష్టం వెతుక్కుంటున్న నేతలు
సాక్షి, కరీంనగర్: తెలుగువారి కొత్త సంవత్సరాది ఉగాది. శోభకృత్ నామ సంవత్సరం సందర్భంగా ప్రతీ ఒక్కరూ తమ జాతకాన్ని కొత్త పంచాంగంలో వెతుక్కుంటున్నారు. ఈ ఉగాది సాధారణ ప్రజల కంటే.. రాజకీయ నాయకులకు ఎంతో కీలకమైంది. అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు, ప్రతిపక్షంలో ఉన్న ప్రత్యర్థులు, ఈసారి ఎన్నికల బరిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుందామనుకునే ఆశావహులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో అధికార–ప్రతిపక్ష నేతలంతా నూతన పంచాంగంలో తమ జాతకాలలో ఆదాయ వ్యయాల మాట ఎలా ఉన్నా.. రాజ్యపూజ్యంపైనే కన్నేశారు. అవమానాల మాట పక్కనబెట్టి.. రాజ్యపూజ్యం దక్కుతుందా? లేదా అన్న అంశంపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తున్నారు. అన్ని నియోజకవర్గాల్లో రాజకీయ పరిస్థితిని ఒకసారి పరిశీలిస్తే.. కరీంనగర్: బీఆర్ఎస్ మంత్రి గంగుల కమలాకర్ తీగల వంతెన, ఎమ్మారెఫ్, స్మార్ట్ సిటీ పనులతో కరీంనగర్పై ఫోకస్ పెట్టారు. హిందుత్వం, మార్పు అన్న ఎజెండాతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నుంచి పోటీ ఎదరవనుంది. బీజేపీ నుంచి కొత్త జయపాల్రెడ్డి కూడా ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి ఎమ్మెస్సార్ మనవడు రోహిత్, నగరాధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. వైస్సార్టీపీ నుంచి డాక్టర్ నగేశ్ బరిలో నిలవనున్నారు. చొప్పదండి: ప్రస్తుతం ఎమ్మెల్యే రవిశంకర్ (బీఆర్ఎస్)కు ఇంటిపోరు తప్పేలా లేదు. అదేపార్టీ నుంచి గజ్జెల కాంతం, కత్తెరపాక కొండయ్య, కార్పొరేటర్ కంసాల శ్రీనివాస్ టికెట్ రేసులో ఉన్నారు. ఈసారి మేడిపల్లి సత్యం (కాంగ్రెస్) నుంచి గట్టి పోటీ ఇవ్వనున్నారు. బీజేపీ నుంచి బొడిగె శోభ, సుద్దాల దేవయ్యల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. వైఎస్సార్టీపీ నుంచి అక్కెనపల్లి కుమార్ బరిలో నిలవనున్నారు. మానకొండూరు: ఇక్కడ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రసమయి బాలకిషన్కు ఈసారి ఇంటి పోరు తీవ్రంగానే ఉంది. మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, ఇక్కడే నుంచే పోటీ చేసిన ఓరుగంటి ఆనంద్ కూడా టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి కవ్వంపల్లి సత్యనారాయణ, బీజేపీ గడ్డం నాగరాజు, దరువు ఎల్లన్న బరిలో నిలవనున్నారు. హుజూరాబాద్: గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఈటల రాజేందర్ ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. బీఆర్ఎస్ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి ఈసారి బరిలో దిగనున్నారు. కాంగ్రెస్ నుంచి ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. సిరిసిల్ల: ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కేటీఆర్కు ప్రత్యర్థులు పెద్దగా లేరు. కాంగ్రెస్ నుంచి కె.కె.మహేందర్రెడ్డి మినహా ఇక్కడ ఆయనకు గట్టి వైరిపక్షం కానరావడం లేదు. ఈసారి బీజేపీ మాత్రం సెలబ్రెటీని రంగంలోకి దించుతారన్న ప్రచారం సాగుతోంది. రామగుండం: ప్రస్తుతం ఎమ్మెల్యే కోరుకంటి చందర్కు, ఈసారి కాంగ్రెస్ నేత ఠాకూర్ మక్కాన్ సింగ్ (కాంగ్రెస్) గట్టి పోటీ ఎదురవనుంది. వీరితోపాటు సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ (బీజేపీ) కూడా బరిలో ఉండటంతో పోరు రసవత్తరంగా మారనుంది. వేములవాడ: ప్రస్తుత ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ (బీఆర్ఎస్)కు చిరకాల ప్రత్యర్థి ఈసారి కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ నుంచి చెన్నమనేని విద్యాసాగర్ రావు కుమారుడు వికాస్ పేరు వినిపిస్తుండగా.. తాను స్వతంత్రంగానైనా పోటీచేస్తానని అదే పార్టీ నేత తుల ఉమ ఇప్పటికే ప్రకటించారు. ఎన్నారైలు గోలి మోహన్ (ఇప్పటికే నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు), మరో ఎన్నారై తోట రాంకుమార్ కూడా బరిలో నిలిచేందుకు ఆసక్తిగా ఉన్నారు. జగిత్యాల: డాక్టర్ సంజయ్ ఇప్పటికే వరుసగా గ్రామాల్లో పర్యటిస్తూ.. పల్లె నిద్ర పేరుతో ప్రజలకు చేరవవుతున్నారు. ఇక మాజీ మంత్రి, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి (కాంగ్రెస్) కూడా పోటాపోటీగా పర్యటనలు చేస్తున్నారు. ఇటీవల భోగశ్రావణి బీజేపీ నుంచి బరిలోకి దిగేందుకు ఆసక్తిగా ఉన్నారు. కోరుట్ల: ప్రస్తుత ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు(బీఆర్ఎస్) వరుసగా అభివృద్ధి పనులు, శంకుస్థాపనలు అంటూ పర్యటిస్తున్నారు. ఈసారి జువ్వాడి నర్సింగరావు (కాంగ్రెస్) గట్టి పోటీ ఇచ్చేందుకు సంసిద్ధంగా ఉన్నారు. మార్పులు జరిగితే వీరిద్దరు కుమారులను బరిలో దింపుతారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ధర్మపురి: ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కొప్పుల ఈశ్వర్ (బీఆర్ఎస్)కు ఈసారి గట్టి పోటీ ఉంది. ఇక్కడ నుంచి అడ్లూరి లక్ష్మణ్ (కాంగ్రెస్), మాజీ ఎంపీ గడ్డం వివేక్ (బీజేపీ) కూడా బరిలోకి దిగుతారని ప్రచారం సాగుతోంది. పెద్దపల్లి: ప్రస్తుత ఎమ్మెల్యే మనోహర్రెడ్డి (బీఆర్ఎస్)కి సొంత పార్టీ నుంచే తీవ్ర పోటీ ఉంది. ఎమ్మెల్యే టికెట్ కోసం.. సొంత పార్టీకే చెందిన ఎన్నారై నల్ల మనోహర్రెడ్డి, జెడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ నేత విజయరమణారావు నుంచి వీరికి గట్టి పోటీ ఎదురవనుంది. బీజేపీ నుంచి గుజ్జుల రామక్రిష్ణారెడ్డి, దుగ్యాల ప్రదీప్రావు, గొట్టిముక్కల సురేశ్రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. బీఎస్పీ నుంచి దాసరి ఉష బరిలో ఉన్నారు. మంథని: ప్రస్తుత ఎమ్మెల్యే శ్రీధర్బాబు (కాంగ్రెస్)కు, పుట్ట మధు (బీఆర్ఎస్)కు ఈసారి హోరాహోరీ పోరు నడవనుంది. ఇక్కడ వీరిద్దరు మినహా మూడో పార్టీ అభ్యర్థులెవరూ ఇంతవరకూ ఆసక్తి చూపలేదు. -
అసత్యాలను వినసొంపుగా చెప్పారు
సాక్షి, హైదరాబాద్: మంత్రి కేటీఆర్ అసత్యాలను వినసొంపుగా చెప్పారని కాంగ్రెస్ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్బాబు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాష్ట్రంలో తాజాగా చోటుచేసుకుంటున్న పరిణామాలను గమనిస్తే బీజేపీకి బీఆర్ఎస్, రాష్ట్ర ప్రభుత్వం మద్దతు తెలుపుతున్నట్టు కనిపిస్తోందన్నారు. తమ పార్టీ నేత భారత్ జోడో ప్రస్తావనను సభలో తేవడంతో పాటు దానిపై కేటీఆర్ ఇష్టంవచ్చినట్టు వ్యాఖ్యలు చేయడం దీనికి బలం చేకూరుస్తోందని, గతంలో రాష్ట్ర సర్కార్ను విమర్శించిన గవర్నర్ సైతం ప్రశంసల్లో ముంచెత్తడాన్ని బట్టి ఈ విషయం స్పష్టమవుతోందని పేర్కొన్నారు. శనివారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శ్రీధర్బాబు మాట్లాడుతూ, ప్రతిపక్ష సభ్యులుగా తమకు ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ఉందని, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీపై మంత్రి కేటీఆర్ ఇష్టారీతిన కామెంట్స్ చేయడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రగతి గురించి గొప్పగా చెబుతూ రాష్ట్రానికి రూ.5 లక్షల కోట్లకుపైగా అప్పులు, కన్సూమర్ ప్రైస్ ఇండెక్స్లో అత్యధిక ధరలున్న రాష్ట్రంగా నిలవడం, నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉండడం, వ్యవసాయరంగ సమస్యలు, కరెంట్కోతలు వంటి వాటిని పూర్తిగా విస్మరించారని విమర్శించారు. తనతోపాటు వస్తే భూపాలపల్లి, పెద్దపల్లిలలో కరెంట్ కోతలున్న విషయాన్ని నిరూపిస్తామని, అసెంబ్లీలో ఆన్ రికార్డ్ ఈ అంశం చెబుతున్నామన్నారు. కాళేశ్వరంను అతిపెద్ద ప్రాజెక్ట్గా ప్రచారం చేస్తున్నారని, దానివల్ల ఎంతమందికి ప్రయోజనం కలిగింది, అదనంగా ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. బడ్జెట్లో ఈ లిఫ్ట్స్కీంలకు, విద్య, వైద్యం తదితర కీలకరంగాలకు కేటాయింపులు చేయాలని డిమాండ్ చేశారు. పత్రికల్లో వచ్చిన వార్తలను బట్టి గతేడాది 107 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు. గత ఎన్నికల సందర్భంగా నిరుద్యోగులకు రూ.3,016 భృతి ఇస్తామన్న హామీ అమలు ఏమైందని ప్రశ్నించారు. టీఎస్పీఎస్సీలో నమోదు చేసుకున్న నిరుద్యోగులే 26 లక్షల మంది ఉంటారన్నారు. -
కాళేశ్వరం ఫొటోలు గూగుల్లో పెట్టండి: శ్రీధర్బాబు
కాళేశ్వరం: ‘కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచ దేశాల్లో గొప్ప కట్టడమని గూగుల్లో చూడాలని కేటీఆర్ ఎక్కడికెళ్లినా చెబుతున్నారు. ఇప్పుడు నీట మునిగిన కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీ పంప్హౌస్, అన్నారంలోని సరస్వతీ పంప్హౌస్, గ్రావిటీ కాల్వల ప్రస్తుత ఫొటోలను గూగుల్లో పెట్టండి’ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్బాబు మంత్రి కేటీఆర్కు సూచించారు. మంగళవారం ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం పరిధిలోని లక్ష్మీ పంప్హౌస్లోకి తన కార్యకర్తలతో వెళ్లేందుకు రాగా కాళేశ్వరం ఎస్సైలు లక్ష్మణ్రావు, నరేశ్ అడ్డుకున్నారు. కొంత సమయం తర్వాత డీఈఈ సూర్యప్రకాశ్.. ఎమ్మెల్యే వద్దకు చేరుకుని అనుమతి లేదని, ఉన్నతాధికారుల ఆదేశాలున్నాయని, పంప్హౌస్ బాగానే ఉందని చెప్పి వెళ్లారు. ఈ సందర్భంగా శ్రీధర్బాబు మాట్లాడుతూ ఇంజనీరింగ్ వైఫల్యంతో నీట మునిగిందని, మరమ్మతులు చేస్తున్నట్లు ఇంజనీర్లు చెబుతున్నారని, కానీ నిర్వహణా లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందన్నారు. ప్రజాధనాన్ని వృథా చేసి, నాసిరకం పనులు చేయడంతో అవినీతి జరిగిందని మండిపడ్డారు. క్లౌడ్ బరస్ట్పైన సీఎం కేసీఆర్కు ఏమైనా సమాచారం ఉంటే కేంద్ర నిఘా బృందాలకు అందించాలన్నారు. -
ఏఐసీసీ కార్యదర్శిగా దుద్దిళ్ల శ్రీధర్బాబు
సాక్షి, న్యూఢిల్లీ: ఏఐసీసీ కార్యదర్శిగా ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్బాబును కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నియమించారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. శ్రీధర్బాబుతో పాటు మరో నలుగురు ఏఐసీసీ కార్యాదర్శులకు కర్ణాటక బాధ్యతలు అప్పగించారు. -
తెలంగాణ కాంగ్రెస్లో మరో తుపాన్..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్లో మరో తుపాన్ మొదలైంది. నేతల అసమ్మతి మరోమారు బయటపడింది. టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఎ.రేవంత్రెడ్డి వ్యవహారశైలిపై చర్చించేందుకు పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు సోమవారం హైదరాబాద్లో సమావేశమయ్యారు. మాజీ మంత్రి మర్రి శశిధర్రెడ్డి నివాసంలో కాంగ్రెస్ విధేయుల ఫోరం పేరుతో జరిగిన ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు శ్రీధర్బాబు, జగ్గారెడ్డి, మాజీ ఎంపీ వి. హనుమంతరావు, మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, గీతారెడ్డిలతోపాటు సీనియర్ కాంగ్రెస్ నాయకులు కోదండరెడ్డి, గోపిశెట్టి నిరంజన్, కమలాకర్రావు, శ్యాంమోహన్ తదితరులు హాజరయ్యారు. దాదాపు 3 గంటలకుపైగా జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర పార్టీలో జరుగుతున్న పరిణామాలు, రేవంత్రెడ్డి వ్యవహారశైలి, ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు గురించి వారు చర్చించినట్టు తెలిసింది. ముఖ్యంగా టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్రెడ్డి పనితీరు పార్టీ ఐక్యతను దెబ్బతీసేలా ఉందని నేతలు అభిప్రాయపడినట్టు సమాచారం. రేవంత్ ఏకపక్ష నిర్ణయాలు, ప్రకటనలతో పార్టీలోని సీనియర్లతోపాటు ముఖ్యనేతలందరినీ అవమానపరిచే తరహాలో వ్యవహరిస్తున్నారని పలువురు నేతలు ఈ సమావేశంలో పేర్కొన్నట్టు తెలిసింది. ఈ క్రమంలోనే రేవంత్ వన్మ్యాన్ షోను కట్టడి చేయాలని కోరుతూ ‘కాంగ్రెస్ పార్టీని కాపాడుకుందాం’ పేరిట.. త్వరలోనే నేతలందరూ ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించినట్టు సమాచారం. రేవంత్ను కట్టడి చేయాలని అధిష్టానం పెద్దలను కోరాలని భావిస్తున్నట్టు తెలిసింది. పార్టీ బలోపేతం కోసమే..: శ్రీధర్బాబు మర్రి శశిధర్రెడ్డి నివాసం నుంచి నేతలు బయటికి వచ్చిన సమయంలో ఎమ్మెల్యే శ్రీధర్బాబు మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఒకసారి తన నివాసానికి వచ్చి వెళ్లాలని సీనియర్ నేత మర్రి శశిధర్రెడ్డి ఆహ్వానించారని చెప్పారు. తమ భేటీలో ప్రత్యేకత ఏమీ లేదని, ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై చర్చించామని చెప్పారు. అయితే తమ సమావేశంలో పార్టీ బలోపేతం కోసం చర్చ జరిగిందని శ్రీధర్బాబు పేర్కొనడం గమనార్హం. కాగా పార్టీలో పరిణామాలు, సీనియర్ల విషయంలో జరుగుతున్న అవమానాలపై చర్చించామని మాజీ ఎంపీ వీహెచ్ తెలిపారు. అన్ని విషయాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామన్నారు. పార్టీకి పూర్వవైభవం రావాలి: మర్రి శశిధర్రెడ్డి కాంగ్రెస్లో సంస్థాగత మార్పులు జరగాలని పార్టీ వర్కింగ్ కమిటీ సోనియా గాంధీని కోరిందని.. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పార్టీ ఏవిధంగా ప్రజల విశ్వాసం పొందుతుందనే దానిపై నిర్ణయాలు ఉండాలని సూచించిందని మాజీ మంత్రి మర్రి శశిధర్రెడ్డి చెప్పారు. రాష్ట్రంలోనూ పార్టీకి పూర్వ వైభవం రావాలన్నారు. పార్టీ వ్యవహారాలు చూస్తున్నవారు పార్టీకి అనుబంధంగా ఉన్నారా లేదా అనేది చూడాలని.. దీనిపై తాము చర్చించామని వెల్లడించారు. అన్నీ మీడియాకు చెప్పలేం: జగ్గారెడ్డి ఆదివారం ఢిల్లీలో సోనియా గాంధీ సమావేశం ఏర్పాటు చేసిన అంశంపై చర్చించామని.. బయట జరుగుతున్న ఊహాగానాలు సరికాదని ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెప్పారు. పార్టీతో కొన్ని సంవత్సరాలుగా అనుబంధం కొనసాగుతున్న నేతలం కలిసి మాట్లాడుకున్నామని.. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నాయకత్వం ఉండాలని కోరుకున్నామని తెలిపారు. వీహెచ్ చెప్పిన అంశాలు చర్చకు వచ్చాయని, కానీ అవన్నీ మీడియాకు చెప్పలేనని పేర్కొన్నారు. కాంగ్రెస్కు రెట్టింపు బలం కోసం ఏ విధంగా పనిచేయాలనే దానిపై చర్చించామన్నారు. రేవంత్ ‘పాదయాత్ర’ ప్రకటనతో మళ్లీ దుమారం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఆదివారం కొల్లాపూర్లో జరిగిన సభలో.. తాను రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలు, 33 జిల్లాల్లో తిరుగుతానని, పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను తెలుసుకుంటానని ప్రకటించడం రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో దుమారం రేపుతోంది. రాష్ట్రంలోని పార్టీ ముఖ్య నాయకులతో చర్చించకుండా, అటు టీపీసీసీ కార్యవర్గంలోగానీ, రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలోగానీ మాట్లాడకుండా, అధిష్టానానికి చెప్పి అనుమతి తీసుకోకుండా రేవంత్ ఈ ప్రకటన చేశారని.. ఇది ఇతర నేతలను అవమానించడమేనని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సోమవారం కాంగ్రెస్ సీనియర్ నేతల భేటీకి కూడా ఈ ప్రకటనే కారణమని అంటున్నారు. భట్టి కూడా చేస్తున్నా.. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పేరుతో మధిర నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు. ఆయన కూడా పార్టీలో ఎలాంటి చర్చ లేకుండా పాదయాత్ర చేపట్టారని.. అయితే ఎమ్మెల్యే హోదాలో తన నియోజకవర్గానికి మాత్రమే పరిమితమై యాత్రలు చేయడంలో ఎలాంటి తప్పు లేదని కొందరు నేతలు పేర్కొంటున్నారు. మరోవైపు భట్టి పాదయాత్ర చేస్తుంటే లేనిది రేవంత్ చేస్తే తప్పేంటని మరికొందరు వాదిస్తున్నారు. ‘పాదయాత్ర’లకు పోటీ వాస్తవానికి రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేయాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీలో ఎప్పట్నుంచో ఉంది. అదే సమయంలో యాత్రకు నాయకత్వం వహించేందుకు పోటీ పడుతున్న నేతల జాబితా కూడా చాంతాడంత ఉంది. ఈ నేపథ్యంలోనే పార్టీ అధిష్టానంతో చర్చించి పాదయాత్ర చేసే నేతల పేర్లను ప్రకటించాకే రాష్ట్రవ్యాప్త యాత్ర చేపట్టాలనే అభిప్రాయం పార్టీవర్గాల్లో ఉంది. అందులో భాగంగానే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముందు జరిగిన సీఎల్పీ సమావేశంలో పాదయాత్ర అంశంపై చర్చించారు. పార్టీ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గాల ఇన్చార్జుల అభిప్రాయం సేకరించాలని భావించినా.. సమయాభావం వల్ల సాధ్యం కాలేదని తెలిసింది. ఇలాంటి సమయంలోనే రాష్ట్రంలో కాంగ్రెస్ ‘సర్వోదయ పాదయాత్ర’ప్రారంభం కావడం, తెలంగాణలో 26 రోజుల పాటు జరిగే ఈ యాత్రలో ఏదో ఒక రోజు రాహుల్గాంధీ పాల్గొంటారన్న అంశం కీలకంగా మారింది. ఈ సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వంతో రాహుల్ సమావేశమై.. పాదయాత్ర చేసేవారిని ఫైనల్ చేస్తారనే ప్రచారం జరిగింది. కానీ ఇవేమీ జరగకుండానే రేవంత్రెడ్డి కొల్లాపూర్ సభలో పాదయాత్ర ప్రకటన చేయడం కాంగ్రెస్ వర్గాల్లో హాట్టాపిక్గా మారింది. ఈ వ్యవహారం ఎంత దూరం వెళ్తుందో తెలియడం లేదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. -
మంథని లిఫ్ట్ పనుల్లో అలసత్వం ఎందుకు?
సాక్షి, హైదరాబాద్: మంథని లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ద్వారా సాగునీరు అందిస్తామని ప్రభుత్వం పదేపదే చెప్తున్నా పనులు ఎందుకు ముందుకు సాగడం లేదని మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్బాబు ప్రశ్నించారు. సోమవారం అసెంబ్లీ కమిటీ హాల్లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అక్బరుద్దీన్ ఒవైసీ అధ్యక్షతన కమిటీ సమావేశం జరిగింది. కమిటీ సభ్యులు రవీంద్రనాయక్, విఠల్రెడ్డి, అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో సాగునీటి గురిం చిన చర్చ జరిగింది. జీవో 111కు సంబంధించి హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్ జలాశయాల పరీవాహక ప్రాంతంపై కమిటీ అక్బరుద్దీన్ వివరాలు కోరారు. దీంతోపాటు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చెరువుల పరిస్థితి, మిషన్ కాకతీయలో అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేసేందుకు తీసుకున్న చర్యల గురించి పీఏసీ చర్చించింది. సాగునీటి ప్రాజెక్టుల గేట్ల నిర్వహణ సరిగా లేదంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో కడెం, నాగార్జునసాగర్, సరళాసాగర్, మూసీ ప్రాజె క్టు మరమ్మతు, నిర్వహణ వివరాలను కమిటీ చైర్మన్ కోరారు. కాగా కాళేళ్వరం ప్రాజెక్టు లాగా ఇతర ప్రాజెక్టుల పనులు త్వరితగతిన ఎందుకు పూర్తి చేయడం లేదని శ్రీధర్బాబు ప్రశ్నించారు. ఏఐబీపీ కింద ఎస్ఆర్ఎస్పీ రెండో దశ, దేవాదుల వరద కాలువ పనుల్లో ఆలస్యం, రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ప్రభుత్వ నిర్లక్ష్యంపై ప్రశ్నిం చారు. కాగా, హుజూరాబాద్ ఉపఎన్నికలో పార్టీ అభ్యర్థిగా టీపీసీసీ ఎవరిని నిర్ణయించినా వారి గెలుపు కోసం కృషి చేస్తానని శ్రీధర్బాబు అన్నారు. -
ఈ ఎమ్మెల్యే ఎవరో.. ఇవేంటో చెప్పగలరా?
సాక్షి, మహాముత్తారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మారుమూల ప్రాంతమైన సింగంపల్లి, కనుకునూర్ గ్రామాల్లో కరోనా బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడానికి వెళ్తున్న ఓ వాహనం మంగళవారం వాగులో దిగబడిపోయింది. ఆ సమయంలో అదే దారిలో మరో వాహనంలో వెళ్తున్న మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్బాబు ఆ దృశ్యాన్ని చూసి ఆగిపోయారు. తన కార్యకర్తలతో కలసి ఆయన వాగులోకి దిగి వాహనం బయటకొచ్చేలా సహకరించారు. ఈ ఫొటో చూడగానే వరి కోశాక మిగిలిన కొయ్య కాళ్ల మాదిరి కనిపిస్తున్నాయి కదూ..! కానీ, ఇవి గడ్డి మొక్కలకు సంబంధించి బెండు కర్రలు. పాడి పశువులకు పోషకాలను మెండుగా అందించే సూపర్ నేపియర్ గడ్డి పెంపకంపై రైతులు ఇటీవల ఆసక్తి చూపుతున్నారు. మొదట ఏపీకే పరిమితమైన ఈ రకం గడ్డి పెంపకం కరీంనగర్, సిద్ధిపేట జిల్లాలకు విస్తరించగా.. ప్రస్తుతం జనగామ జిల్లా చిల్పూరు మండలం కృష్ణాజీగూడెం గ్రామానికి చెందిన రైతు సాదం రమేష్ కూడా నాటాడు. ఇది విత్తనంగా కాకుండా రూ.1కి ఒకటి చొప్పున జానెడు పొడవుతో దొరికే బెండుకర్రలు నాటాల్సి ఉంటుందని ఆయన తెలిపాడు. పోషకాలు ఎక్కువగా ఉండే ఈ గడ్డి.. పాడి పశువులకు వేయడం వల్ల మొక్కజొన్న చొప్పలా మెత్తగా ఉండటంతో ఇష్టంగా తింటాయని, పాల ఉత్పత్తి కూడా పెరుగుతోందని వెల్లడించారు. – చిల్పూరు (జనగామ) -
కలకలం రేపుతున్న ఆడియో టేపు
-
న్యాయవాదుల హత్య కేసు: వామన్రావు ఆడియో వైరల్
సాక్షి, హైదరాబాద్: పెద్దపల్లి జిల్లాలో దారుణ హత్యకు గురైన న్యాయవాది గట్టు వామన్ రావు ఆడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం కలకలం సృష్టిస్తుంది. మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు పై గట్టు వామన్ రావు మరో వ్యక్తితో ఫోన్ లో మాట్లాడుతు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. శ్రీధర్ బాబు తనను అవమానపర్చాడని, నీతిలేని వ్యక్తి అని వేరే వ్యక్తితో వామన్ రావు చెప్పుకొచ్చాడు. 20 ఏళ్ళుగా దుద్దిళ్ల శ్రీపాద రావు కుటుంబానికి దూరంగా ఉన్నానని, నేనంటే ఏమిటో చూపిస్తానని తెలిపారు. నీవు పోటీ చేస్తే నాకు ఇబ్బంది అవుతుందని శ్రీధర్ బాబు శరణు కోరాడని, ఆయన అనుభవిస్తున్న పదవి తాను పెట్టిన బిక్షే అంటూ వామన్ రావు కామెంట్ చేశారు. పుట్ట మధు, శ్రీధర్ బాబు బాధితులు ఎందరో ఉన్నారని వారంతా మీకు అండగా నిలుస్తారని మరో వ్యక్తి వామన్ రావుతో చెప్పారు. చాలా రోజుల క్రితం రికార్డు అయిన ఆడియో ఇప్పుడు బయటికి రావడం అందరినీ ఆశ్చర్యానికి ఆందోళనకు గురిచేస్తోంది. చదవండి: న్యాయవాదుల హత్య: పోలీసులపై విమర్శలు సంచలన విషయాలు వెల్లడించిన బిట్టు శ్రీను! -
ఈ ముఖ్యమంత్రికి సోయి లేదు: భట్టి
సాక్షి, సత్తుపల్లి : ముఖ్యమంత్రి కేసీఆర్ కు సోయి, జ్ఞానం లేవని, ఎవరు చెప్పినా వినే రకం కాదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలు విమర్శలు చేశారు. నోటికి వచ్చినట్లు బూతులు మాట్లాడే ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరేనని భట్టి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎవరినైనా కొనగలనన్న నమ్మకం, మూర్ఖత్వం ఉన్న కేసీఆర్ కు రైతులు, ప్రజలు కర్రుకాల్చి బుద్ధ వచ్చేలా వాతలు పెట్టాలన్నారు.రైతులతో ముఖాముఖీలో భాగంగా సత్తుపల్లి నియోజకవర్గం తల్లాడలో రైతులతో భట్టి సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భట్టి విక్రమార్కతో పాటు మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, మాజీ ఎంపీ వీ హనుమంతరావు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు పుచ్చకాల వీరభద్రం, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు మొక్కా శేఖర్ గౌడ్, తదితర స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. దేశమంతా వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉందన్నారు. రైతాంగ సమస్యలు వదిలిస్తే.. దేశవ్యయసాయ రంగం అగమ్యగోచరంలా తయారవుతందన్నారు. ఈ పరిస్థితులను ముందుగానే గమినించి ఉత్తర భారత రైతులు వారి ప్రాణాలు ఫణంగా పెట్టి.. 55 మంది చనిపోయినా.. పోరాటం చేస్తున్నారని భట్టి వివరించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తెచ్చిన మూడు నల్ల చట్టాలు దేశానికి అత్యంత ప్రమాదకరమని భట్టి రైతులకు చెప్పారు. దేశాన్ని కాపాడేది జవాన్.. దేశ ప్రజలకు అన్నం పెట్టేది కిసాన్.. అని కాంగ్రెస్ పార్టీ.. ఈ ఒక్క నినాదంతోనే తమ విధానం స్పష్టం చేసిందని అన్నారు. మోదీ విధానాలతో రైతుల పరిస్థితి, భవిష్యత్ ఆందోళణకరంగా మారుతుందని అన్నారు. దేశంలో 95 శాతం మంది రైతులు 5 ఎకరాల లోపు వారేనని.. వారు తమ పంటను ఎక్కడైనా అమ్ముకోవచ్చంటే.. ఎక్కడ అమ్ము కుంటారని భట్టి ప్రశ్నించారు. ఇక్కడ స్థానికంగా పండించే మిర్చి, పత్తి, పసుపు పంటను మండల కేంద్రానికి తీసుకెళ్లి అమ్ముకవడానికి ఇబ్బందులు పడుతుచాన్న సమయంలో.. కల్లాల్లోనే అమ్ముకుంటున్నారని చెప్పారు. ఈ పరిస్థితుల్లో ఏ మహారాష్ట్రకో, గుజరాత్ కో పంటను తీసుకెళ్లి రైతు అమ్ముకునే పరిస్థితులు ఉన్నాయా? అని ప్రశ్నించారు. ఏ నినాదం వెనుక.. ఎవరి ప్రయోజనాలు ఉన్నాయన్న సంగతిని కాస్త లోతుగా ఆలోచిస్తే.. ఈ చట్టాలు రైతుల కోసం కాదు.. కేవలం బహుళజాతి సంస్థల కోసమో అన్న వాస్తవం తెలుస్తుందన్నారు. దేశ వ్యవసాయ రంగం మొత్తం కార్పరేట్ ల చేతుల్లో పెట్టడం కోసమే ఈ చట్టాలు తీసుకువచ్చారన్నది స్పష్టమైన అంశమని చెప్పారు. ఇది నిజంగా రైతుల కోసమే తెచ్చిన చట్టాలు అయితే.. వారు వద్దని ఢిల్లీ సరిహద్దులో ప్రాణాలను లెక్కచేయకుండా దీక్ష చేస్తుంటే.. వెంటనే వాటిని వెనక్కు తీసుకునేవారినన్నారు. కాంట్రాక్టు ఫార్మింగ్ తో భూములను, పంటలను కార్పొరేట్ చేతుల్లో పెట్టేందుకు కుట్ర చేస్తున్నారని అన్నారు. అంబానీ, అదానీ వంటి వారితో సామాన్య రైతులు పోరాటం చేయలేరని... అన్నారు. ఆహర ధాన్యాలు అందరికీ అందుబాటులో ఉంచాలని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎసెన్షియల్ కమెడిటీస్ చట్టం తీసుకువచ్చిందని.. దానివల్ల ధరల నియంత్రణ ఉంటుందని అన్నారు. కానీ దానిని ఎత్తేయడం వల్ల ఎవరైనీ ఎంతైన ఆహార పదార్థాలను, పంటలను గోడౌన్ల్లో దాచేస్తే.. అవి అందక.. ధరలు ఆకాశంలోకి వెళ్లే ప్రమాదం ఉంది. దీని వల్ల ఇటు వినియోగదారుడు.. అటు.. రైతులు తీవ్రంగా నష్టపోతారని భట్టి ప్రజలకు వివరించారు. ఇప్పటికే దేశవ్యాప్తగా అనే ఎఫ్.సీ.ఐ గోడౌన్లను అదానీ సంస్థకు కేంద్రం లీజుకు ఇచ్చిందని చెప్పారు. ఈ మూడు చట్టాలవల్ల దేశ రైతులకు అత్యంత ప్రమాదకరమని చెప్పారు. దేశ స్వాతంతరం వచ్చిన తరువాత గణతంత్ర దినోత్సవం నాడు.. కేవలం సైనికుల కవాతు మాత్రమే ఉండేది.. కానీ మొదటిసారు.. రైతులు బటయకు వచ్చి కవాతు చేశారుని చెప్పారు. ఈ పరిస్థితుల్లో రాజకీయాలకు అతీతంగా రైతులంతా పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని భట్టి ఇది దుస్తితి.. మనమం విక్రమార్క చెప్పారు. అప్పుడే పాలకులు దిగివస్తారని చెప్పారు. మోడీ, కేసఆర్ లు కేవలం బహుళజాతి సంస్థల కోసం మాత్రమే పని చేస్తున్నారు.. బీజేపీ స్వాతంత్ర పోరాటంలో పాల్గొనలేదు.. ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన.. వారికి లేదని చెప్పారు. మోడీ, కేసీఆర్ లకు ప్రజల సంక్షేమం అవసరం లేదని.. కేవలం కార్పొరేట్ల కోసమో పనిచేస్తున్నారని ఆగ్రహంగా చెప్పారు. వారిద్దరికీ అధికారం తప్ప మరేమీ అవసరం లేదని చెప్పారు. అదే సమయంలో ఈ మధ్య మద్దతు ధర ఉన్న సమయంలో.. మొక్కలు క్వింటాలకు రూ.1800 ధర పలికింది.. అదే మద్దతు ధర లేకపోతే.. వెంటనే రూ.900 కి పడిపోయింది. దీంతో రైతులకు క్వింటాలుకు రూ. 1000 నష్టపోయిన పరిస్థితి అని చెప్పారు. మద్దతు ధర లేకపోతే ఒక్క పంటకే ఇలా ఉంటే.. మొత్తంగా అసలు మద్దతు ధర లేకపోతే.. రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహకే అందడం లేదని భట్టి విక్రమార్క చెప్పారు. ఢిలీ సరిహద్దుల్లో 85 రోజలుగా జరగుతున్న రైతు ఉద్యమం గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. కొనుగోలు కేంద్రాలు ఎత్తేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. వ్యవసాయాన్ని పూర్తిస్థాయిలో కార్పొరేట్ చేసేలా కేంద్రం ప్రయత్నిస్తోంది. మార్కెట్ యార్డులను ఎత్తేసేలా కుట్రలు చేస్తున్నారు. దేశంలో 60 శాతం ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు.. వారికి మద్దతు ధర లేకపోతే.. ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గిట్టుబాటు, మద్దతు ధర కల్పించింది. - దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మంథని ఢిల్లీలో రైతులు మూడు నెలల నుంచి నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. ఇప్పటికీ దాదాపు 53 మంది చనిపోయినా.. రైతులు పోరాటం ఆపడం లేదు. రైతులకు కనీస మద్దతు ధర లేకపోతే.. రైతులు తీవ్రంగా నష్టపోతారు. కేసీఆర్ కూడా మోదట చట్టాలను వ్యతిరేకించినా.. తరువాత యూటర్న్ తీసుకున్నాడు. ఈ బిల్లు వల్ల కార్పొరేట్లకు తప్ప.. రైతులకు ఎటువంటి ప్రయోజనం ఉండదు. - వి.హనుమంతరావు, మాజీ ఎంపీ భట్టి విక్రమార్క మల్లు నేత్రుత్వంలో చేస్తున్న రైతు వ్యతిరేక చట్టాలపై సీఎల్పీ బ్రుందం చేస్తున్న పోరాటం చాలా గొప్పది. ఈ పోరాటంలో భట్టి గారికి మేము అండగా ఉంటాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేశాయి. కేసీఆర్.. చెప్పేవన్నీ అబద్దాలే. పేదలకు సేవచేసింది కాంగ్రెస్ మాత్రమే. మాట తప్పిన వాళ్లను ఏమి చేయాలో ప్రజలే నిర్ణయిస్తారు. సంభాని చంద్రశేఖర్, మాజీ మంత్రి -
'అప్పులు చేయడానికి అవసరమైన బిల్లుల కోసమే అసెంబ్లీ'
సాక్షి, హైదరాబాద్: అప్పులు చేయటానికి అవసరమైన బిల్లులు పాస్ చేయటానికే కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలను ఉపయోగించుకున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. 'శాసనసభలో ప్రభుత్వం సమస్యలపై మాట్లాడలేకే పారిపోయింది. బీఏసీలో 28వ తేదీ తర్వాత కూడా అసెంబ్లీని జరపుతామన్నారు. అయితే కాంగ్రెస్కు సమాధానం చెప్పలేక పారిపోయారు. ఏపీ ప్రభుత్వం రోజుకు 12 టీఎంసీలు శ్రీశైలం నుండి వాడుకుంటోంది. దీనివల్ల తెలంగాణలో భారీ నీటికొరత ఏర్పడింది. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తోంది. ప్రతిపక్షం లేకుండా చేయాలనే ఉద్దేశంతో పనిచేస్తోంది. నిరుద్యోగ సమస్యపై మాట్లాడనివ్వలేదు. వర్షాలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ప్రయివేట్ టీచర్లు, చేనేత కార్మికులు, పేదల సమస్యలు, అనారోగ్య సమస్యలు ఎన్నో ఉన్నాయి. రాష్ట్రంపై 6లక్షల కోట్ల అప్పులు మోపడానికే కేసీఆర్ సభను ఉపయోగించుకున్నారు. 100 మంది ఉన్న టీఆర్ఎస్ సభ్యులను ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలం ఎదుర్కొన్నాం. హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా అభివృద్ధి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే. బీహెచ్ఈఎల్, రింగ్ రోడ్డు, హాస్పిటళ్లు, ఎయిర్ పోర్టు అన్నీ కాంగ్రెస్ నిర్మించినవే. దళితులకు మూడెకరాల భూమిని పంచినపుడే అంబేద్కర్కి అసలైన నివాళి' అని అన్నారు. (ట్రాఫిక్ జరిమానాలు ఆపేయాలి: జగ్గారెడ్డి) ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారు- ఎమ్మెల్యే సీతక్క అసెంబ్లీకి ముందు కేసీఆర్ ఆర్భాటపు ప్రకటనలు చేస్తున్నారు. కాంగ్రెస్ సభ్యుల్ని అవమానకరంగా మాట్లాడారు. కరోనా టెస్టులు చాలా తక్కువ చేశారు. జీహెచ్ఎంసీలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి చెప్పనివ్వలేదు. పబ్బులు, డ్రగ్స్ విషయంలో హైదరాబాద్ పేరు ముందు ఉంటుంది. డ్రగ్స్ విషయంలో ప్రభుత్వం అంబాసిడర్గా పెట్టుకున్న రకుల్ పేరు వినిపిస్తోంది. మంచినీళ్లు ఇవ్వలేని పరుస్థితిలో ప్రభుత్వం ఉన్నది. ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారు' అని సీతక్క పేర్కొంది. (శివ బాలాజీ ఫిర్యాదుపై హెచ్ఆర్సీ స్పందన) ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు- దుద్దిళ్ల శ్రీధర్ బాబు 8రోజుల్లోని 31గంటల్లో 24 గంటలు సీఎం, మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడారు. వారి మిత్రపక్షం ఎంఐఎంకు 3 గంటలు మాట్లాడించారు. కాంగ్రెస్కు ఇచ్చిన 3 గంటల్లో అనేకసార్లు అడ్డు తగిలారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. రేపటి నుంచి వర్చువల్ అసెంబ్లీ సెషన్ పెట్టాలి. ప్రతిపక్షం అడిగే ప్రశ్నలకు ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. -
కొత్త సచివాలయం అవసరమా?
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా వైరస్ తో జనం అల్లాడుతుంటే ఆఘమేఘాల మీద పాత సచివాలయం కూల్చివేయాల్సిన అవసరం ఏమొచ్చిందని తెలంగాణ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. ముఖ్యమంత్రి కేసీఆర్కి ప్రజల బాధలకంటే తన మొండి పట్టుదలే ప్రాధాన్యతగా ఉందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు మంగళవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో విమర్శించారు. కరోనా సంక్షోభంతో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి ఉద్యోగులకు జీతాలు సక్రమంగా ఇవ్వడం లేదని, రైతులకు రుణమాఫీ డబ్బులు లేవని.. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త సచివాలయం అవసరమా అని ప్రశ్నించారు. (తెలంగాణ సచివాలయం కూల్చివేత ప్రారంభం) తెలంగాణలో ఇంతటి దుర్భర పరిస్థితులుంటే ముఖ్యమంత్రి కనీసం వైద్యం పైన సమీక్ష కూడా చేయకుండా ఎక్కడో చీకటిలో ఉన్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారో ప్రజలు గమనించి ప్రశ్నించాలని కోరారు. పాత సచివాలయంలో కోవిడ్ ఆసుపత్రి ఏర్పాటు చేయమని తాము కోరామని, 10 వేల మంది రోగులకు అక్కడ వైద్య సౌకర్యాలు కల్పించే అవకాశం ఉండేదని పేర్కొన్నారు. సీఎం తన మొండి వైఖరితో జనం ప్రాణాలు తీస్తున్నారని, మొదటి నుంచి కరోనా విషయంలో తప్పుడు విధానాలనే ఆయన అవలంభిస్తున్నారని మండిపడ్డారు. సీఎం మొండివైఖరి కారణంగానే రాష్ట్రం దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటోందని విమర్శించారు. ఇప్పటికైనా కేసీఆర్ ప్రజా సంక్షేమం పైన దృష్టి సారించాలని హితవు పలికారు. కూల్చివేత దారుణం: జీవన్ రెడ్డి సచివాలయాన్ని కేసీఆర్ ఫాంహౌస్ దగ్గర ఔటర్ రింగ్ రోడ్డు మీద కట్టుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి అన్నారు. ఊరి వాడికి వారి ఆపద వస్తే... ఊసు గళ్ళ వాడికి దోమల ఆపద అన్నట్టుగా తెలంగాణ ప్రభుత్వ తీరు ఉందని ఎద్దేవా చేశారు. వెయ్యి కోట్ల రూపాయల విలువ చేసే సచివాలయ భవనాలు కూల్చివేయడం దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. -
అన్నం లేకుంట చేసిండ్రు..
సింగరేణి మాకు అన్నం లేకుంట చేసింది. సింగరేణికి మా భూములు ఇచ్చి ఎంతోమందికి అన్నంపెట్టేతట్టు చేసినం. మా భూములు తీసుకున్న సింగరేణి ఇప్పుడు మాకే ఏం చేస్తలేదు. మా పంటకు నీళ్లు అందుతలెవ్వు.. తినేందుకు అన్నం లేదు.. మూడు కుటుంబాలు బతుకాలి.. ఉపాసం ఉంటున్నం’ అంటూ ప్రజాభిప్రాయ సేకరణలో జాయింట్ కలెక్టర్ ముందు తన గోడు వెల్లబోసుకుంది సింగరేణి ప్రభావిత గ్రామం జనగామకు చెందిన 80 ఏళ్ల వృద్ధురాలు పురుకూటి రాధమ్మ. ఆవేదన ఆమె మాటల్లో.. ‘1964లో సుబ్బారావు అనే సింగరేణి ఏజెంట్ మా ఊరికి వచ్చిండు. నాడే పొలాలకు నీళ్ల గురించి అడిగిన.. నీళ్లు రాకపోతె ఎట్ల బతకాలంటే పట్టించుకోలే.. తర్వాత ఎంతోమందికి మా కష్టం చెప్పుకున్న ఎవరూ లెక్క చేయలేదు. జీఎం ఆఫీస్ వద్దకు మూడుసార్లు వెళ్లినా పట్టించుకోవడం లేదు. ఇయాల్ల కలెక్టరమ్మతో బాధ చెప్పుకుందామని వచ్చిన. మా 40 ఎకరాలు సింగరేణి తీసుకున్నది. ఓసారి రూ.7 వేలు, మరోసారి రూ.13 వేలు ఇచ్చింది. సింగరేణి కడుపు సల్లగుండ.. మరో 300 ఏళ్లు బతకాలి. మాకు ఇంకో పదెకరాల పొలం ఉంది. అమ్మా నాకు గవర్నమెంట్ పెన్షన్ ఇస్తుంది. మాకు ఇళ్లు వద్దు, భూమి వద్దు, జాగవద్దు. నీళ్లు లేక భూమి బీడుంటంది. తిండికి కష్టమైతంది. మా ఊరి కుంటకు నీళ్లు వస్తే రెండు పంటలు పండుతయ్. నీళ్లు వచ్చేలా చేయండి చాలు’ అని వేడుకుంది. స్పందించిన జేసీ సమస్యను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గోదావరిఖని(రామగుండం): సింగరేణి పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ గురువారం ముగిసింది. రామగుండం రీజియన్ పరిధిలోని జీడీకే–1, 2, 2ఏ, 3, 5వ గని ప్రభావిత గ్రామాలైన జనగామ, సుందిళ్ల, ముస్త్యాల, సింగరెడ్డిపల్లె, చందనాపూర్లో పర్యావరణంపై వీటీసీ సమీపంలోని మైదానంలో అభిప్రాయసేకరణ కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఐదు గ్రామాల నుంచి సుమారు రెండు వేల మంది ఈ సభకు హాజరయ్యారు. జేసీ వనజాదేవి, పొల్యుషన్ కంట్రోల్ బోర్డు అధికారి రవిదాస్ అధ్యక్షతన నిర్వహించిన సదస్సుకు మంథని ఎమ్మెల్యే డి.శ్రీధర్బాబు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కాసిపేట లింగయ్య, కాంగ్రెస్ రామగుండం నియోజకవర్గ ఇన్చార్జి రాజ్ఠాకూర్ మక్కాన్సింగ్, పలువురు ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన సభ 3 గంటల వరకు జరిగింది. ఈ సందర్భంగా ప్రజలు, నాయకులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. సింగరేణితో పడుతున్న ఇబ్బందులు, జీవన విధానంపై బొగ్గు గ నుల ప్రభావం, యాజమాన్యం వ్యవహరిస్తున్న తీరును సభాముఖంగా ఏకరువు పెట్టారు. మంథని ఎమ్మెల్యే శ్రీధర్బాబు మాట్లాడుతూ సింగరేణి సామాజిక బాధ్యతను పూర్తిగా విస్మరిస్తోందన్నారు. ప్రజలతో అవసరం ఉన్నప్పుడే రోడ్లు వేయడం, వైద్య శిబిరాలు నిర్వహించడం, స్వయం ఉపాధి కోర్సులు గ్రామాల్లో చేపట్టడం చేస్తోందని, మిగతా సమయాల్లో కనీసం ఆ గ్రామాలవైపు కన్నెత్తి కూడా చూడడం లేదని విమర్శించారు. గాలి, నీరు, శబ్ద కాలుష్యంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. సిం గరేణి సమర్పించిన నివేదికలే పర్యావరణ తీరు కు అద్దంపడుతున్నాయని తెలిపారు. అయినా పర్యావరణ పరిరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ప్రభావిత గ్రామాల అభివృద్ధికి యాజమాన్యం కట్టుబడి ఉండాలని సూచించారు. అలాగే వ్యర్థాలన్నీ నీటిలో కలవడంతో నదీ జలాలు కలుషితమవుతున్నాయని తెలిపారు. ప్రజలతో కమిటి వేసి కాలుష్య నియంత్రణపై సమీక్షించాలని సూచించారు. పాత పద్ధతిలో కాకుండా ప్రజల అవసరాలకు అనుగుణంగా పనులు చేపట్టాలన్నారు. కలుషిత నీరు శుద్ధి చేసేందుకు ప్లాంటు నిర్మించడంతోపాటు ప్రజలకు సురక్షితమైన నీటిని అందించాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉందని స్పష్టం చేశారు. అనంతరం బీజేపీ, కాంగ్రెస్, వామపక్ష పార్టీల నాయకులు, ప్రభావిత గ్రామాల ప్రజలు తాము పడుతున్న ఇబ్బందులను వేదికపై వెల్లడించారు. అనంతరం జేసీ వనజాదేవి మాట్లాడారు. పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణలో వెల్లడించి అభిప్రాయాలు, విజ్ఞప్తులను కేంద్ర కాలుష్య నియంత్రణ మండలికి నివేదిస్తామని తెలిపారు. జనగామ, సుందిళ్ల, ముస్త్యాల, సింగరెడ్డిపల్లె, చందనాపూర్ గ్రామాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో సభకు రావడంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా గోదావరిఖని ఏసీపీ ఉమేందర్ ఆధ్వర్యంలో వన్టౌన్, టూటౌన్ సీఐలు రమేశ్, వెంకటేశ్వర్లు, పలువురు ఎస్సైలు బందోబస్తును పర్యవేక్షించారు. కార్యక్రమం ప్రశాంతంగా ముగియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విస్తరణ కోసం ప్రజాభిప్రాయ సేకరణ.. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా బొగ్గు ఉత్పత్తిచేయాల్సిన అవసరం యాజమన్యంపై ఉంది. ఈ క్రమంలో రామగుండం రీజియన్లోని ఆర్జీ–1 ఏరియాలో ఉన్న జీడీకే–1, 3, జీడీకే 2, 2ఎ, జీడీకే–5వ గనిలో ఉత్పత్తి లక్ష్యాలను పెంచాలని యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రజాభిప్రాయ సేకరణ తప్పనిసరి అయింది. ప్రభావిత గ్రామాల అభివృద్ధికి సింగరేణి కట్టుబడి ఉంది. – విజయపాల్రెడ్డి, ఆర్జీ–1 జీఎం కాలుష్యం పెరిగింది.. సింగరేణి తీరుతో చుట్టు పక్కల గ్రామాలలో కాలుష్యం పెరిగింది. రోగాలబారిన పడి ఆస్పత్రుల పాలవుతున్నాం. బొగ్గు ఉత్పత్తి కోసం గ్రామాలకు చెందిన భూములను కొనుగోలు చేస్తున్న యాజమాన్యం నిర్వాసిత గ్రామాలను పట్టించుకోవడం లేదు. – పుష్పలత, రామగిరి జెడ్పీటీసీ డేంజర్ జోన్లో కాలుష్యం.. గాలిలో సల్ఫర్ డయాక్సైడ్ ఎక్కువై ప్రజలు ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్నారు. అత్యంత ప్రమాదకరస్థాయికి కాలుష్యం చేరడం ఆందోళన కలిగిస్తోంది. కాలుష్యాన్ని తగ్గించేందుకు పరిశ్రమల నుంచి వెలువడే ఉద్ఘారాలను శుద్ధి చేయాల్సిన బాధ్యత యాజమన్యంపై ఉంది. ఖాళీ స్థలాలలో మొక్కలను పెంచేందకు చర్యలు తీసుకోవాలి. – గీట్ల దామోదర్రెడ్డి, పర్యావరణ వేత్త -
‘ప్రజాస్వామ్య స్ఫూర్తి కేసీఆర్ చేతిలో నలిగి పోతుంది’
సాక్షి, హైదరాబాద్ : వ్యవస్థలను, ఉద్యోగులను సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. కేసీఆర్లా దేశంలో ఉన్న ఏ ముఖ్యమంత్రి ప్రవర్తించడం లేదని ఆయన విమర్శించారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులు సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జీలతో కమిటీ వేయాలని కోరగా.. కమిటీ వేసినా ప్రభుత్వం ఇసుక రేణువంత కూడా పట్టించుకోదని హైకోర్టు వాఖ్యానించిందని ప్రస్తావించారు. జ్యూడీషియల్ వ్యవస్థ చెప్పినా ఈ ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రజాస్వామ్య స్ఫూర్తి కేసీఆర్ చేతిలో నలిగి పోతుందని విమర్శలు గుప్పించారు. ఇప్పటికైనా కేసీఆర్ ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని, లేకపోతే రాజ్యాంగ సంక్షోభానికి దారి తీస్తుందని హెచ్చరించారు. కేసీఆర్ చర్చలకు పిలవకపోతే రాజ్యాంగ సంక్షోభం గురించి గవర్నర్కు రాష్ట్రపతికి విన్నపిస్తామని పేర్కొన్నారు. వెంటనే జీతాలు చెల్లించాలి ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రతిపక్షాలు కుట్ర చేశాయని హైకోర్టుకు ఆఫిడవిట్ దాఖలు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. వీటికి ఏమైనా ఆధారాలు ఉంటే బయట పెట్టాలని, లేకపోతే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. సెల్ఫ్ డిస్మిస్ అని కేసీఆర్ చెప్పడం వల్లే ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు, గుండె పోటుతో చనిపోయారని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక కేసీఆర్ ప్రతిపక్షాలపైన నెపం నెట్టుతున్నాడని కాంగ్రెస్ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్బాబు దుయ్యబట్టారు. ఆర్టీసీ కార్మికులకు రెండు నెలల నుంచి ఎందుకు వేతనాలు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. జీతాలు రాకపోవడంతో ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని, వెంటనే ఆర్టీసీ కార్మికులకు వేతనాలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. -
స్పీకర్కు ప్రివిలేజ్మోషన్ ఇస్తా: శ్రీధర్బాబు
సాక్షి, హైదరాబాద్ : సింగరేణి యాజమాన్య సమావేశానికి తనను పిలవకపోవడంలో ఆంతర్యమేమిటని మంథని ఎమ్మెల్యే శ్రీధర్బాబు ప్రశ్నించారు. మంత్రి కొప్పుల ఈశ్వర్, సింగరేణి సీఎండీ తన హక్కులను కాలరాశారని, దీనిపై తాను స్పీకర్కు ప్రివిలేజ్మోషన్ ఇస్తానని తెలిపారు. బుధవారం సీఎల్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తాను మంత్రిగా ఉన్నప్పుడు సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యేలందరితో మాట్లాడేవాళ్లమని, ఇప్పుడు అదే సింగరేణి ఎమ్మెల్యేనైనా తనను ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. అండర్గ్రౌండ్ మైనింగ్ ఓపెన్కాస్ట్ చేసేందుకు కుట్ర జరుగుతోందని, సింగరేణి యాజమాన్యం ఒక పార్టీకి తొత్తులుగా పని చేస్తోందని ఆరోపించారు. -
మంత్రి కొప్పుల ఈశ్వర్పై శ్రీధర్ బాబు ధ్వజం
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్పై కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తన నియోజకవర్గంలో జరిగే సమీక్షలకు కూడా పిలవడం లేదంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీధర్ బాబు బుధవారం సీఎల్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ...‘వ్యక్తిగతంగా ప్రభుత్వానికి నా పై కోపం ఉండొచ్చు. మంత్రి కొప్పుల ఈశ్వర్ ...లియోనియా రిసార్ట్స్లో సింగరేణి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. సింగరేణి ప్రభావిత ప్రాంతంలో నా నియోజకవర్గం కూడా ఉంది. సమీక్ష నిర్వహించాలంటే సింగరేణి భవన్ పెద్దగా ఉంది. అది కాదంటే మంత్రిగారి ఛాంబర్ ఉంది. మరి రిసార్ట్స్లో సమీక్ష ఎందుకు పెట్టారు. మేము అడిగే ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం లేదా?. ఆ సమావేశానికి ఎందుకు పిలవలేదు?. ఆ సమావేశానికి మమ్మల్ని పిలిస్తే వారసత్వ ఉద్యోగాలపై అడిగే అవకాశం ఉండేది. ఓపెన్ కాస్ట్ మైనింగ్ చేయాలనే ఆలోచన చేస్తున్నారు. దాన్ని విరమించుకోవాలని మేము సమావేశంలో చెప్పేవాళ్లం. ప్రభుత్వం తాను చేసే పనులు గోప్యంగా ఉంచుతోంది. ఓ వైపు ఆర్టీసీ సమ్మె కొనసాగుతుంటే... మరోవైపు సింగరేణిపై రిసార్ట్స్లో రివ్యూ చేశారు. మంత్రులు, అధికారులు ఎందుకు భయపడుతున్నారు. శాసన సభ్యుల హక్కులను కాలరాస్తున్నారు. స్పీకర్కు ప్రివిలేజ్ మోషన్ ఇస్తాం. అధికారులు కూడా ఒక పార్టీకి తొత్తులుగా పని చేస్తున్నారు. సీఎండీ, సింగరేణి అధికారులకు నోటీసులు ఇస్తా’ అని తెలిపారు. -
కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ‘ఐటీఐఆర్’ని సాధించాలి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఐటీఐఆర్ ప్రాజెక్టు కోసం ఇప్పటి వరకూ అడగలేదని కేంద్రమంత్రి రవిప్రసాద్ పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావించిన విషయాన్ని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గుర్తు చేశారు. శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద భట్టి విక్రమార్కతో పాటు మంథని ఎమ్మెల్యే డి.శ్రీధర్బాబు, ములుగు ఎమ్మెల్యే సీతక్క మాట్లాడారు. ఐటీఐఆర్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని భట్టి విక్రమార్క ఆరోపించారు. ప్రాజెక్టుపై వాస్తవాలను ప్రజలకు తెలియకుండా రాష్ట్ర ప్రభుత్వం పక్కదోవ పట్టిస్తుందని, ఈ ప్రాజెక్టుతో 70 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందని ఆయన తెలిపారు. ఐటీఐఆర్ ప్రాజెక్టు తెలంగాణ హక్కు అని, కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ప్రాజెక్టును ఎలాగైనా సాధించాలని సూచించారు. అంతేకాక తెలంగాణ ప్రభుత్వ వెబ్సైట్లో ఐటీఐఆర్ ప్రాజెక్టుతో 68 లక్షల మందికి లాభం చేకూరతుందని స్పష్టంగా ఉందని అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఐటీఐఆర్ ప్రాజెక్టు సాధించడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. స్పీకర్ కూడా అసెంబ్లీలో ఐటీఐఆర్ ప్రాజెక్ట్ విషయాన్ని చర్చించడానికి సమయం ఇవ్వలేదని, ప్రభుత్వ ఆలోచన విధానం బాధాకరమని ఆయన పేర్కొన్నారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తే.. ప్రభుత్వాన్నీ గట్టిగా నిలదీస్తామని ఎమ్మెల్యే ఈ మేరకు హెచ్చరించారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. గత ప్రభుత్వాల వల్లే హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందిందని అన్నారు. గత ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న మంత్రులు ఇప్పుడు మాట మార్చి గతంలో ఏ అభివృద్ధి జరగలేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉన్నదని అభిప్రాయపడ్డారు. -
‘రాష్ట్రం జ్వరాలమయంగా మారింది’
సాక్షి, ములుగు: రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు విషజ్వరాల బారిన పడి ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వం పట్టించుకోవడంలేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు ఆరోపించారు. మంగళవారం ఆయన ములుగు జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ములుగు ఏరియా ఆస్పత్రిని జిల్లా కేంద్ర ఆస్పత్రిగా ప్రభుత్వం ప్రకటించిందని కానీ, అందుకు తగిన విధంగా సౌకర్యాలు కల్పించలేదని భట్టి విక్రమార్క మండిపడ్డారు. జిల్లా కేంద్ర ఆస్పత్రి అంటే 250 పడకలు ఉండాలి. అయితే ఇక్కడ కేవలం వంద పడకలు మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారు. అంతేకాక మందులు సరఫరా చేసే సెంట్రల్ డ్రగ్ స్టోర్లో మాత్రం ములుగు ఆస్పత్రి 50 పడకల ఆస్పత్రి మాత్రమే అని, ఆ మేరకే మందులు సరఫరా చేస్తున్నారని ఈ సందర్బంగా సీఎల్పీ నేత భట్టి మీడియాకు వివరించారు. వైద్య ఆరోగ్యశాఖకు, డ్రగ్ కంట్రోల్ శాఖకు మధ్య సమన్వయం లేదనడానికి ఇదే నిదర్శనమని అన్నారు.రాష్ట్రం జ్వరాలమయంగా మారిందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పరిపాలన లేదు అని చెప్పడానికి ఇంతకంటే మించి ఇంకేమి కావాలి అన్నారు. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కట్టించిన ఈ ఆస్పత్రికి రాష్ట్రం ఏర్పాటు తరువాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన వెంట స్థానిక ఎమ్మెల్యే సీతక్క, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, భద్రాచలం ఎమ్మెల్యే పొడెం వీరయ్య, మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్, మాజీ ఎమ్మెల్యేలు ఈరవత్రి అనిల్, కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి ఇతర కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. వసతులు ఎక్కడ? అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ముందుచూపుతో ఇక్కడ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఏర్పాటు చేస్తే.. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆరేళ్లలో ఇప్పటివరకు కూడా కనీసం ఎక్విప్మెంట్లు సమకూర్చలేదని ఎద్దేవా చేశారు. ఎంఆర్ఐ, ఈసీజీలతో పాటు బ్లడ్ సేపరేటర్, డయాలసిస్ సెంటర్ సౌకర్యం కూడా లేదని మండిపడ్డారు. డాక్టర్లు ఎక్కడ? ములుగు ప్రభుత్వ ఆసుపత్రిలో పదిమంది సివిల్ సర్జన్లు ఉండాల్సి ఉండగా ఒక్కరు కూడా లేరని ప్రశ్నించారు. అలాగే ఏడుగురు డిప్యూటీ సివిల్ సర్జన్లు ఉండాల్సి ఉండగా.. ఒకరు కూడా లేరన్నారు. అంతేకాక సివిల్ అసిస్టెంట్ సర్జన్లు 27 మంది ఉండాల్సి ఉండగా.. 11 పోస్టులు ఖాళీ ఉన్నాయని ఈ సందర్బంగా భట్టీ పేర్కొన్నారు. నర్సింగ్ విభాగానికి వస్తే.. గ్రేడ్ 2 నర్సింగ్ సూపరింటెండెంట్ పోస్టులు రెండు ఉండగా.. రెండూ ఖాళీగానే ఉన్నట్లు తెలిపారు. స్టాఫ్ నర్సు పోస్టులు 25 ఉండగా, అందులో 20 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు భట్టి మీడియాకు వివరించారు. -
‘మాయమాటల టీఆర్ఎస్ సర్కారు’
సాక్షి, భూపాలపల్లి : రాష్ట్రంలో మాయమాటల సర్కారు కొనసాగుతుందని, విద్య, వైద్యరంగాన్ని పూర్తిగా భ్రష్టుపట్టించి ప్రజలను భయానక పరిస్థితుల్లోకి నెట్టిందని కాంగ్రెస్ శాసన సభాపక్ష నేత మల్లు భట్టివిక్రమార్క అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆదివారం భట్టివిక్రమార్క, టీపీసీసీ ఉపాధ్యక్షుడు దుద్దిళ్ల శ్రీధర్బాబు, ములుగు ఎమ్మెల్యే సీతక్క పరిశీలించారు. తొలుత హాస్టల్లోకి వెళ్లి వంటగది, డైనింగ్ హాల్ను పరిశీలించి విద్యార్థులకు వడ్డిస్తున్న కిచిడీని చూశారు. అనంతరం పీహెచ్సీని పరిశీలించి అక్కడే విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. భూపాలపల్లి పట్టణం జిల్లా కేంద్రంగా ఏర్పడి మూడేళ్లు కావస్తున్నా ఇప్పటి వరకు ఆరు పడకల పీహెచ్సీతోనే కాలం వెల్లదీస్తున్నారన్నారు. ఆపరేషన్ థియేటర్ను స్టోర్ రూంగా మార్చారని, ఒకే ఒక డాక్టర్ అందుబాటులో ఉన్నారని, స్పెషలిస్ట్లు ఎవరూ లేరన్నారు. ఓపీలో ఒకే ఒక మహిళ ఉందంటే ప్రభుత్వ ఆస్పత్రి మీద ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. వెంటనే వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఇక్కడికి వచ్చి ప్రైవేట్ ఆస్పత్రుల్లో పేషెంట్లు ఎందుకు ఉన్నారు.. ప్రభుత్వ ఆస్పత్రిలో ఎందుకు లేరో తెలుసుకోవాలన్నారు. ఆస్పత్రులో కుక్కలు, కోతులు కరిచినప్పుడు వేసే ఇంజక్షన్కు సంబంధించిన సిరంజీలు కూడా అందుబాటులో లేవన్నారు. మంచినీటి సౌకర్యం లేదని, మందులు సరిపడా లేవన్నారు. ఆరేళ్లలో ఒక్క డాక్టర్ను కూడా రిక్రూట్ చేయని ప్రభుత్వంగా టీఆర్ఎస్ చరిత్రలో నిలుస్తుందన్నారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలో భోజనం అధ్వానంగా ఉందన్నారు. 280 మందికి 30 కేజీల బియ్యంలో అరకిలో పప్పు వేసి ఉడికించారన్నారు. ఇదీ కిచిడీనా అని ప్రశ్నించారు. వంద గ్రాముల నూనె, పావుకిలో ఉల్లిగడ్డ, అరకిలో చింతపండుతో చారు చేశారని వంట మనుషులే చెబుతున్నారన్నారు. సీఎం కేసీఆర్ మనువడు కూడా ఇలాగే తింటున్నాడా అని ప్రశ్నించారు. పిల్లల పేరు చెప్పి దోపిడీ చేసే ఈ ప్రభుత్వానికి పాపం తగులుతదన్నారు. సింగరేణి కార్మికులకు రూ.10 లక్షల రుణం, వారసత్వ ఉద్యోగాలు, పదివేల క్వార్టర్ల నిర్మాణం ఏమైందని ప్రశ్నించారు. అనంతరం టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్బాబు మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఏదో ఒక పేరుతో కాలయాపన చేస్తున్నారన్నారు. మొన్నటి వరకు కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి అంటున్నారన్నారు. చిట్యాలలో గైనకాలజిస్ట్ లేక బాలింత, బిడ్డ మృతి చెందినప్పటికీ ఈ ప్రభుత్వానికి పట్టింపు లేదా అన్నారు. రాష్ట్రంలో గడిన 9 నెలల్లో కోటి 20 లక్షల మందికి విష జ్వరాలు సోకినా తగు చర్యలు తీసుకోలేదన్నారు. అనంతరం ములుగు ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. పెరిగిన జనాభాకు అనుగుణంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలు ఉండడం లేదన్నారు. కేసీఆర్ కిట్కు కొంత మేరకు ఆదరణ లభిస్తే దాన్నే సాకుగా చూపిస్తూ ప్రభుత్వ ఆస్పత్రులకు ఆదరణ పెరిగిందనడంలో అర్థం లేదన్నారు. పథకాల పేరుతో ప్రైవేట్ ఏజెన్సీలకు ప్రభుత్వం లాభం చేకూరుస్తుందన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు ఐత ప్రకాష్రెడ్డి, ఐఎన్టీయూసీ కేంద్ర కమిటీ నాయకుడు జనక్ప్రసాద్, కాంగ్రెస్ నాయకులు ఇస్లావత్ దేవన్, బుర్ర రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
‘టీఆర్ఎస్లో ఓనర్షిప్ల కొట్లాట మొదలైంది’
సాక్షి, భూపాలపల్లి : తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లో ఓనర్షిప్ కోసం నాయకులు గొడవలు పెట్టుకుంటూ ప్రజల ఆరోగ్యం, సంక్షేమం గురించి పట్టించుకోవడం లేదని కాంగ్రెస్పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. ఆదివారం జిల్లా కేంద్ర ఆసుపత్రిని విక్రమార్క, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే సీతక్కతో పాటు పలువు నాయకులు కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని రోగులను, ప్రజలను మర్చిపోయి ఆసుపత్రులను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. జిల్లా కేంద్ర ఆసుపత్రులు అంటే 250 పడకలతో ఉంటుందని, కానీ ఇక్కడ కేవలం 6 పడకలు మాత్రమే ఉన్నాయని విమర్శించారు. భూపాలపల్లి జిల్లాగా ఏర్పడి మూడేళ్లవుతున్నా ఎటువంటి మౌలిక వసతులు కల్పించకపోవడం, జిల్లా ఆసుపత్రిగా మార్చకపోవడం బాధాకరమైన విషయమన్నారు. ఆస్పత్రికి రోగుల రావాలంటే భయపడే పరిస్థితులు ఉన్నాయని, ప్రస్తుతం ఇన్ పేషంట్లు ఎవరూ లేరని భట్టి పేర్కొన్నారు. ఆస్పత్రిలో ఏంఆర్ఐ, సీటీ స్కాన్, ఎక్స్ రే ప్లాంట్, ఈసీజీ లేవని, ఇంతటి దుర్భర పరిస్థితులు ఎక్కడా ఉండవని మండిపడ్డారు. ప్రసూతి కోసం వచ్చే మహిళలకు ఉండాల్సిన గైనకాలజిస్టులు ఒక్కరు కూడా లేరని, ఆపరేషన్ థియేటర్ అత్యంత దారుణ పరిస్థితుల్లో ఉందని విక్రమార్క విమర్శించారు. ఆపరేషన్ థియేటర్ను స్టోర్ రూమ్గా మార్చిన పరిస్థితి కన్పిస్తుందని, కనీసం ఆస్పత్రిలో లాబ్ టెక్నీషియన్ కూడా లేరని దుయ్యబట్టారు. జిల్లా పరిసర ప్రాంతాల్లో ప్రజలు ఎక్కువగా కుక్క, కోతి కాట్లకు గురవుతున్నారని, అందుకు కావాల్సిన సిరంజీలు కూడా లేవని విమర్శించారు. ఆస్పత్రికి వచ్చిన రోగులు బయట సిరంజీలు కొనుక్కుంటే ఇక్కడ ఇంజక్షన్లు ఇస్తున్నారని, ఇది దుర్భరమైన పరిస్థితి బట్టి అంటూ భట్టి ఆవేదన వ్యక్తం చేశారు. -
ఒకే వేదికపై శ్రీధర్బాబు.. పుట్ట మధు
సాక్షి, మంథని : వారిద్దరూ రాజకీయ శత్రువులు. ఎక్కడ ఎదురుపడినా ఎడమొహం.. పెడమెహమే ఉంటుంది. అయితే బుధవారం మంథనిలో సింగరేణి సంస్థ ఆర్జీ– 3, అడ్రియాల ప్రాజెక్టు ఏరియా ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎంపీ వెంకటేశ్ నేత, జాయింట్ కలెక్టర్ వనజాదేవి, సింగరేణి డైరెక్టర్ చంద్రశేఖర్తో పాటు మంథని ఎమ్మెల్యే శ్రీధర్బాబు, జెడ్పీ చైర్పర్సన్ పుట్టమధు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. స్థానిక బొక్కలవాగు కరకట్టలపై మొక్కలు నాటారు. అనంతరం హరితహారంపై సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పుట్టమధు, శ్రీధర్బాబు ఒకే వేదికపై కూర్చున్నారు. దీంతో కార్యక్రమానికి వచ్చిన ఇరు పార్టీల కార్యకర్తలు ఇద్దరు నేతలకు మద్దతుగా పోటాపోటీ నినాదాలు చేశారు. దీంతో కొద్దిసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో సింగరేణి అధికారులు ప్రొటోకాల్ పాటించలేదని శ్రీధర్బాబు వ్యాఖ్యానించారు. మున్సిపాలిటీ పరిధిలో ప్రొటోకాల్ లేదని, సింగరేణి అధికారులపై ఒత్తిడిచేశారని జిల్లా పరిషత్ చైర్మన్ కౌంటర్ ఇచ్చారు. అనంతరం జిల్లాపరిషత్ పాఠశాల అదనపు తరగతి గదుల ప్రారంభోత్సవంలోనూ ఇద్దరూ కలిసి పాల్గొన్నారు. మొత్తంమీద కార్యక్రమం ప్రశాంతంగా ముగియడంతో కార్యకర్తలు.. పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. -
సభ సంకేతాలతో నడుస్తోంది
సాక్షి, హైదరాబాద్: ప్రజా సమస్యలను ప్రభుత్వం గాలికొదిలేసిందని.. అసెంబ్లీలో ప్రశ్నించే గొంతు లను నొక్కేస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. సభలో మాట్లాడే అవకాశం ఇవ్వనందుకు నిరసనగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేసిన అనంతరం మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. సభ సంకేతాలతో నడుస్తోందని ఆరోపించారు. సీఎం కేసీఆర్ నియంత పోకడలను అనుసరిస్తున్నారని.. ఇలాంటి పోకడలు ప్రజాస్వామ్యానికి చేటు చేస్తాయని ఆందో ళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తాగు, సాగు నీటి, రైతు, విద్యార్థుల సమస్యలు పక్కనబెట్టి మున్సిపల్ చట్ట సవరణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యమివ్వడం సరికాదన్నారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలపై విస్తృతంగా చర్చించాల్సిన అవసరముందని, శాసనసభ సమావేశాల గడువును పొడిగించాలని ఎమ్మెల్యే శ్రీధర్బాబు కోరారు. -
టీఆర్ఎస్ కుట్రలకు రైతులు బలి
మంచిర్యాల(ఆదిలాబాద్) : టీఆర్ఎస్ ప్రభుత్వ కుట్రలకు అమాయకపు ప్రజలను బలిచేస్తుందని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్రెడ్డి అన్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఎమ్మెల్యే శ్రీధర్బాబు నేతృత్వంలో ఎమ్మెల్యేలు సీతక్క, జగ్గారెడ్డి, పలు నియోజకవర్గాల కాంగ్రెస్ ఇన్చార్జిలతో కమిటీ వేశారు. గత నెల 30న కుమురంభీం జిల్లా కాగజ్నగర్ మండలం సార్సాలలో జరిగిన సంఘటన వివరాలను తెలుసుకునేందుకు గురువారం ఈ కమిటీ సభ్యులు సార్సాలకు వెళ్తుండగా మం చిర్యాల సమీపంలో పోలీసులు అడ్డుకునే ప్రయ త్నం చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేంసాగర్రావు నివాసానికి చేరుకున్నారు. అప్పటికే పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. వారిని పోలీసు వాహనాల్లో ఎక్కించుకుని మంచిర్యాల పోలీస్ స్టేషన్కు తరలించారు. దాదాపు గంటకు పైగా పోలీస్ స్టేషన్లోనే ఉంచి అనంతరం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీవన్రెడ్డి మాట్లాడుతూ దశాబ్దాలుగా సాగులో ఉన్న పోడు భూములపై ఆ రైతులకే హ క్కు కల్పించాలని నాడు సోనియాగాంధీ నేతృ త్వంలో హక్కుపత్రాలు ఇప్పించామన్నారు. ఇటీ వల జరిగిన ఎన్నికల సమయంలో పోడు భూములకు హక్కు పత్రాలు ఇస్తామన్న హామిని కేసీఆర్ విస్మరించి, నేడు అవే పోడు భూములను లాక్కునే ప్రయత్నం చేయడం ఏంటని ప్రశ్నించారు. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్డుకోలేక, తన తమ్ముడిచే ఇలాంటి దాడులను చేయించడం చాలా హీనమైన చర్యగా అభివర్ణించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ముంపునకు గురైన అటవీప్రాంతానికి ప్రత్యామ్నయంగా సార్సాలలోని భూములను తీసుకోవడం ఏంటని ప్రశ్నించారు. మూడెకరాల భూమిని కేటాయిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామిని విస్మరించి ఉన్నభూమిని లాక్కుంటుందని ఆరోపించారు. పోడు భూమిని లాక్కుని అక్కడి రైతులను నిర్వాసితులుగా మార్చేశారని, టీఆర్ఎస్ ప్రభుత్వ పతనం సార్సాల నుంచే ఆరంభం అవుతుందన్నారు. బాధ్యులను శిక్షించాలి సార్సాలలో దాడులకు పాల్పడిన వారిని కఠినం గా శిక్షించాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, సిర్పూర్ ఇంచార్జి పాల్వాయ్ హరీశ్రావు డిమాండ్ చేశారు. పోడు భూములను సాగు చేసుకుంటున్న వారిపై ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరించడం సరికాదన్నారు. ఓట్ల కోసం ఎన్నో మాటలు చెప్పే కేసీఆర్ ఎన్నికలు అయిపోగానే ఆ హామీలను బుట్టదాఖలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ధర్మపురి కాంగ్రెస్ ఇన్చార్జి అడ్లూరి లక్ష్మన్ కుమార్, రామగుండం ఇన్చార్జి మక్కాన్ సింగ్, చొప్పదండి ఇన్చార్జి మేడిపల్లి సత్యం, భూపాల్పెల్లి ఇన్చార్జి ప్రకాశ్రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ప్రాథమిక విచారణ చేయనివ్వరా? మంథని ఎమ్మెల్యే శ్రీధర్బాబు మాట్లాడుతూ సార్సాలకు వెళ్లి పూర్తిస్థాయిలో విషయ సేకరణ చేయాలని వెళ్తుండగా ముందుగానే మంచిర్యాలలో తమను ముందస్తు అరెస్టు చేశారన్నారు. ఇది ప్రజాస్వామ్యమా? నిరంకుశ ప్రభుత్వంలో మనం ఉన్నమా? అనేది తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సిన విషయమన్నారు.1950కి సంబంధించిన శాటిలైట్ మ్యాప్స్ ప్రకారం వాటిని అటవీశాఖకు సంబంధించిన భూములుగా పేర్కొంటూ ట్రెంచ్లను కొట్టడం ఎంతవరకు న్యాయమన్నారు. పోడు రైతుల సమస్యలను పరిష్కరించాలని హరీశ్, సీతక్క ప్రభుత్వానికి చెప్పినా పట్టించుకోకుండా ఒక మహిళా అధికారిపై చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని అదే పార్టీకి చెందిన వారు దాడులు చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. ఓవైపు ప్రభుత్వం అటవీశాఖ, పోలీస్ శాఖ అధికారులను పంపించి పోడు భూములను స్వాధీనం చేసుకోవాలని చెప్తూనే మరోవైపు అదే పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులను పంపించి గొడవలు సృష్టించి ఒక డ్రామా ఆడుతున్నట్లుగా కనిపిస్తుందన్నారు. అధికారులు, సీఎం, అక్కడి ఎమ్మెల్యే ప్రతి ఒక్కరు కూడా ప్రజల్లో నుంచి వస్తున్న వ్యతిరేకతను గమనించాలన్నారు. ఉన్న చట్టాలను సరిౖయెన విధానంలో అమలు చేసి, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాన్ని అమలు చేసి, 30, 40 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న రైతులకు హక్కు పత్రాలతో పాటు, పట్టాపాసు పుస్తకాలను ఇచ్చి, వారిని అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. – ఎమ్మెల్యే శ్రీధర్బాబు వాస్తవాలను ఎందుకు తెలుసుకోనివ్వడం లేదు.. గత నెల 30న సార్సాలలో జరిగిన ఘటనలోని వాస్తవాలను ప్రజల ద్వారా తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తుంటే తమను ఆ ప్రాంతానికి వెళ్లకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యే సీతక్క ప్రశ్నించారు. పోడు భూముల మీద ఈ సీఎంకు ఎలాంటి స్పష్టత, ఒక విధానం లేదని, ఓట్ల కోసం హామీలను ఇస్తూ పోడు భూములకు పట్టాలను ఇస్తామని గత ఎన్నికల్లో హామీలను గుప్పించారన్నారు. ఎప్పుడో ఉన్న చట్టాలను ప్రస్తుతం ప్రభుత్వం ఇక్కడ అమలు చేస్తుందన్నారు. జై జంగిల్ జమీన్ అంటూ ఉద్యమ సమ యంలో చెప్పిన కేసీఆర్ నేడు నిజాం పాలనను గుర్తు చేసేలా ఆయన విధానాలు ఉన్నాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ముంపునకు గురైన అటవీ ప్రాంతానికి ప్రత్యామ్నయంగా రాష్ట్రంలో ఎక్కడా అటవీ భూములు లేవాఅని ప్రశ్నించారు. – ఎమ్మెల్యే సీతక్క -
గండ్ర నివాసానికి వెళ్లిన భట్టి..
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ శాసనసభాపక్ష (సీఎల్పీ) నేత మల్లు భట్టి విక్రమార్క ఎమ్మెల్యేలు చేజారిపోకుండా కాపాడుకునే పనిలో పడ్డారు. పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకు శనివారం తన నివాసంలో విందు ఇచ్చిన ఆయన ఆ విందుకు హాజరుకాని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిని ఆదివారం కలిశారు. మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి హైదరాబాద్లోని గండ్ర నివాసానికి వెళ్లిన భట్టి.. అక్కడ చాలా సేపు మంతనాలు జరిపారు. ఈ సందర్భంగా గండ్ర పార్టీ మారే అంశంపై చర్చ జరిగింది. దీన్ని ఖండించిన గండ్ర తాను పార్టీ మారేది లేదని, కాంగ్రెస్లోనే కొనసాగుతానని భట్టికి హామీ ఇచ్చినట్టు సమాచారం. దీంతోపాటు రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితు లు, స్థానిక సంస్థల ఎన్నికల గురించి వీరు చర్చించినట్లు సీఎల్పీ కార్యాలయ వర్గాలు తెలిపాయి. -
సీఎల్పీ రేసులో శ్రీధర్బాబు?
సాక్షి, మంథని: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత.. ప్రభుత్వ విప్.. శాసన సభ వ్యవహారాల మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్బాబును కాంగ్రెస్ శానససభాపక్ష నేతగా ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయనే చర్చ జోరుగా జరుగుతుంది. 2014 ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జగిత్యాల నుంచి జీవన్రెడ్డి మాత్రమే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయనను సీఎల్పీ ఉపనేత పదవి వరించింది. ఆ ఆనవాయితీ ప్రకారం ఈసారి మంథనికి సీఎల్పీ కేటాయిస్తారని సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మంథని నియోజకవర్గంలోనే నిర్మాణంలో ఉండడంతో శాసన సభలో కాంగ్రెస్ తరఫున మాట్లాడే అవకాశం ఉండేలా అదే నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్యేకు సీఎల్పీ ఇస్తే బాగుంటుందనే ఆలోచన టీపీసీసీ భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న స్వర్గీయ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావును నాడు నక్సల్స్ కాల్చి చంపగా ఆయన వారసత్వంగా శ్రీధర్బాబు రాజకీయ అరగ్రేటం చేశారు. మంథని నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రభుత్వ విప్గా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ఉన్నతవిద్య, పౌర సరఫరాల శాఖలతోపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేవ్ శాసనసభ వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా ఏఐసీసీ మెంబర్గా, 2014లో మానిఫెస్టో కమిటీ చైర్మన్గా ప్రస్తుతం టీపీసీసీ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ఇలా పార్టీలో పదవులు చేపట్టి సీనియర్గా, అజాత శత్రువుగా పేరున్న శ్రీధర్బాబు అర్హతను పార్టీ అధిష్టానం పరిగణనలోకి తీసుకుంటున్నట్లు చర్చ జరుగుతోంది. ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ గాలి వీచి కాంగ్రెస్ సీనియర్ నేతలంతా ఓడిపోయారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉండగా, 10 స్థానాల్లో టీఆర్ఎస్, రామగుండంలో స్వతంత్ర ఎమ్మెల్యే గెలుపొందగా, మంథని నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా శ్రీధర్బాబు విజయం సాధించారు. -
మంథని: అసెంబ్లీ అభ్యర్థులకు కాస్త ఊరట
సాక్షి, మంథని: సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ మొదలు.. పోలింగ్ వరకు తీరిక లేకుండా బిజీబిజీగా గడిపిన మంథని అసెంబ్లీ అభ్యర్థులకు కాస్త ఊరట లభించింది. నెల రోజుల నుంచి పార్టీ శ్రేణులు, అభిమానులు, ముఖ్యులకు తమ సమయాన్ని వెచ్చించారు. ఎన్నిక ముగిసి ఫలితాలకు సమయం ఉండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు కాస్త సేద తీరారు. కుటుంబసభ్యులు, మిత్రులు, పార్టీ శ్రేణులతో ఓటింగ్ సరళిపై చర్చించారు. కాంగ్రెస్ అభ్యర్థి శ్రీధర్బాబు మంథని సమీపంలోని ఎస్ఎల్బీ గార్డెన్లో నియోజకవర్గంలోని ఆయా గ్రామాలవారీగా పార్టీ శ్రేణులతో పోలింగ్ సరళి, ఎక్కడెక్కడ పరిస్థితి ఎలా ఉందనే దానిపై సమాలోచనలు చేశారు. ఉదయం నుంచి రాత్రి వరకు అన్ని గ్రామాల నుంచి వచ్చిన కార్యకర్తలు, నాయకులతో మాట్లాడారు. అలాగే టీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధు తనను కలిసేందుకు వచ్చిన కార్యకర్తలతో బిజీగా గడిపారు. అభిమానులు, పార్టీ శ్రేణులు పుట్ట మధును అభినందిస్తూ గజమాల వేశారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభ్యర్థులతో హైదరాబాద్లో సమావేశం ఏర్పాటు చేయడంతో మధు వెళ్లిపోయారు. కాగా ప్రజలు తమకే మద్దతు తెలిపారనే ధీమాను ఎవరికి వారు వ్యక్తం చేస్తున్నారు. -
టీఆర్ఎస్కు బుద్ధి చెప్పండి: శ్రీధర్బాబు
సాక్షి, మంథని: నాల్గున్నర సంవత్సరాలు మాయమాటలు చెప్పి కాలం వెల్లదీసిన టీఆర్ఎస్ నాయకులు మరోసారి మోసం చేసేందుకు వస్తున్నారని, వారికి గుణపాఠం చెప్పాలని కాంగ్రెస్ అభ్యర్థి డి.శ్రీధర్బాబు అన్నారు. మంథని మండలం బిట్టుపల్లి, గద్దలపల్లి గ్రామాల్లో ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కిసాన్ఖేత్ మజ్దూర్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి శశిభూషణ్ కాచే, మంథని జెడ్పీటీసీ సభ్యురాలు మూల సరోజన, మండల అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్, ఎంపీటీసీ అంబీరు సరోజన, నాయకులు బాపు, లింగాగౌడ్, గడ్డం రాజు, వంగరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
అభ్యర్థుల దూకుడు..!
సాక్షి, మంథని : అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు దూకుడు పెంచారు. ఎన్నికల ప్రచారానికి 8 రోజులు మాత్రమే గడువు ఉండడంతో ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్తోపాటు ఇతర పార్టీల అభ్యర్థులు ప్రచారంను ముమ్మరం చేశారు. టీఆర్ఎస్ పార్టీ నెల రోజుల కిందే అభ్యర్థులను ప్రకటించడంతో మంథని టీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధు ముందుగానే ప్రచారాన్ని ప్రారంభించి నియోజకవర్గాన్ని చుట్టి వచ్చారు. శుభకార్యాలు, అశుభ కార్యక్రమాల పేరిట ప్రజలను పలకరించారు. రెండు ప్రధాన పార్టీల మధ్యే పోటీ ప్రధానంగా నెలకొనడంతో ఇద్దరు పత్యర్థులు తమదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. పోటాపోటీగా గ్రామాల్లో ప్రచార రథాలను దింపారు. ఓటర్లను ఆకర్షించేలా పాటలు, ప్రత్యర్థుల వైఫల్యాలు, తమ పార్టీ అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ప్రచార రథాల్లో దూసుకుపోతున్నారు. మహిళలు, యువకులతో ప్రత్యేక సమావేశాలు, చేరికలను ఓవైపు చేస్తూనే ఇంటించా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఉదయం, రాత్రి సమావేశాలు నిర్వహిస్తూ పొద్దంతా గ్రామాల్లోనే ప్రచారం చేస్తున్నారు. గతం కంటే భిన్నం.. నియోజకవర్గంలో ఈసారి ఎన్నికలు గతం కంటే భిన్నంగా జరుగుతున్నాయి. ఓటర్లు ఎవరి వైపు ఉన్నారో తెలియని పరిస్థితి నెలకొనడంతో అభ్యర్థులు వారి మద్దతు కూడగట్టుకునే పనిలో ఉన్నారు. అభ్యర్థులే కాకుండా వారి బంధువులు, కూతుళ్లు, కుమారులు కూడా ఈసారి ఎన్నికల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఈనెల 30న మంథనిలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన, వచ్చేనెల 1 లేదా 2న సినీ నటి విజయశాంతి, ప్రజా గాయకుడు గద్దర్తోపాటు ఇతర నాయకుల పర్యటనలు సైతం ఉండండంతో రాజకీయం రసవత్తరంగా మారింది. తూర్పు మండలాల్లో రెండు రోజులుగా ఇద్దరు అభ్యర్థులు పోటాపోటీ ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు. -
టీఆర్ఎస్కు ఓట్లు అడిగే హక్కులేదు
మంథని(రామగిరి) : ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చిన హామీలను అమలుచేయకుండా విస్మరించిన టీఆర్ఎస్కు ఈ ఎన్నికల్లో ఓట్లు అడిగే అర్హత లేదని కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ మంత్రి శ్రీధర్బాబు పేర్కొన్నారు. రామగిరి మండలం లొంకకేసారం, కల్వచర్ల, రత్నాపూర్, గోకుల్నగర్, కృష్ణానగర్, సెంటినరీకాలనీల్లో గురువారం ఆయన ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చేతి గుర్తుకు ఓటువేసి గెలిపించాలని ఆయన కోరారు. కాసారం, కల్వచర్ల, గోకుల్నగర్, కృష్ణానగర్, రాజాపూర్కు చెందిన పలువురు ఆయన సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. నాయకులు చొప్పరి సదానందం, గంట వెంకటరమణారెడ్డి, కర్రు నాగయ్య, తొట్ల తిరుపతి యాదవ్, తోట చంద్రయ్య, వనం రాంచెందర్రావు, ముస్త్యాల శ్రీనివాస్, మోలుమూరి శ్రీనివాస్, బండారి సదానందం తదితరులు పాల్గొన్నారు. ఆదివారంపేటలో గడపగడపకు కాంగ్రెస్ రామగిరి: మండలంలోని ఆదివారంపేటలో గురువారం కాంగ్రెస్ నాయకులు గడపగడపకు కాంగ్రెస్ కార్యాక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలో ఇంటింటా తిరుగుతూ రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ చేతి గుర్తుకు ఓటువేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన పలువురు జెడ్పీటీసీ సదానందం సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. వీరికి సదానందం కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. -
నయా ఫ్యూడలిజం నశించాలి..
గోదావరిఖని(రామగుండం) : నయా ఫ్యూడలిజం నశించాలి.. ఓట్ల విప్లవం వర్ధిల్లాలి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడలంటూ ప్రజాయుద్ధనౌక గద్దర్ ఆటాపాటా ఆకట్టుకుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా గోదావరిఖని జూనియర్ కళాశాల గ్రౌండ్ సోమవారం ఏర్పాటు చేసిన సభలో మహాకూటమి అభ్యర్థి రాజ్ఠాగూర్ మక్కాన్సింగ్ తరఫున ఆయన ప్రచారం చేశారు. చిన్నారులతో కలిసి గతంలో జరిగిన అన్యాయాలను నాటిక రూపంలో వివరించారు. గిరిజనులకు రిజర్వేషన్లు ఇస్తామని గత ప్రభుత్వం మోసం చేసిందని.. జనాభలో 50 శాతం మహిళలకు రిజర్వేషన్ ఉండగా టీఆర్ఎస్ పార్టీలో మంత్రి పదవి ఒక్కరికి కూడా దక్కలేదని విమర్శించారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తానని బిర్యాని పెట్టి బుజ్జగించారన్నారు. గొర్రెలు, తోకలు, ఈకెలు ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి పదవి మాత్రం బీసీలకు ఇవ్వకుండా తన దగ్గరే పెట్టుకున్నారని అన్నారు. సింగరేణిలో కారుణ్య నియామకాల పేరుతో కారుణ్యం లేకుండా కఠినత్వంగా వ్యవహరించారని పేర్కొన్నారు. రామగుండం ఉద్యమ గుండం, వెలుగు గుండాన్ని ప్రస్తుతం చీకటి మయం చేశారని విమర్శించారు. మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజ్ఠాగూర్మక్కాన్సింగ్ మాట్లాడుతూ.. నాలుగున్నరేళ్ల కాలంలో ప్రజలకు ఒరిగిందేమి లేదన్నారు. ఇచ్చిన హామీలు విస్మరించి ప్రజలను మోసం చేశారన్నారు. ప్రత్యేక తెలంగాణ ఇచ్చిన ఘనత సోనియాగాంధీ కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో నాయకులు కాల్వ లింగస్వామి, హర్కర వేణుగోపాల్, కౌశిక్హరి, బాబర్ సలీంపాషా, గుమ్మడి కుమారస్వామి, జీవీరాజు, విజయ్, జిమ్మిబాబు, అఫ్జల్ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికలు ఎప్పుడొచ్చినా కాంగ్రెస్ సిద్ధం
కాటారం(మంథని) వరంగల్ : రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని మాజీ మంత్రి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు డి.శ్రీధర్బాబు అన్నారు. మంగళవారం జిల్లాలోని కాటారం మండలం గుమ్మాళ్లపల్లిలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో శ్రీధర్బాబు మాట్లాడారు. రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఐదేళ్లపాటు అధి కారంలో ఉండాలని ప్రజలు తీర్పిస్తే ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేక టీఆర్ఎస్ పార్టీ ముందస్తు ఎన్నికలకు వెళ్లే యోచన చేయడం శోచనీయన్నారు. డబుల్బెడ్రూం ఇళ్లు, భూపంపిణీ, ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం హామీలను అమలు చేయడంలో సీఎం కేసీఆర్ విఫలమయ్యారని విమర్శించారు. ప్రజలు వీటిపై నిలదీస్తారన్న భయంతోనే ప్రజలను తప్పుదోవపట్టించడంలో భాగంగా ముందస్తు ఎన్నికల ఫ్యూహాం పన్నుతున్నారని పేర్కొన్నారు. ప్రజల ఆవేదన, ఆరాటంను అర్థం చేసుకోకుండా ప్రభుత్వం ప్రగతినివేదన సభ ద్వారా అంకెల గారడి చేయడానికి సిద్ధమవుతోందని ఆరోపించారు. జ్వరంతో మృతిచెందిన వారికి ప్రభుత్వం ఎక్స్గ్రేషియా చెల్లించాలని, జ్వరం, డెంగీ వ్యాధులను ఆరోగ్యశ్రీలో చేర్చాలన్నారు. సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు వేమునూరి ప్రభాకర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి శంకర్గౌడ్, యూత్ అధ్యక్షుడు చీమల సందీప్, నాయకులు తెప్పెల దేవేందర్రెడ్డి, రామిళ్ల కిరణ్, అజ్మీరా రఘురాంనాయక్, బొడ్డు మల్లయ్య, తాళ్ల లక్ష్మి, బక్కిరెడ్డి, తిరుపతి పాల్గొన్నారు. -
అందరూ కలిసే కొంపముంచారు..!
మనసులో మాట వైఎస్సార్ చనిపోవడం చాలా దురదృష్టకరమైన ఘటన. ఆంధ్రప్రదేశ్ చరిత్రనే అది మార్చిపడేసింది. ఆయన మరణం తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలను, రగులుతున్న తెలంగాణ ఉద్యమాన్ని ఎలా పరిష్కరించాలనే విషయంలో కాంగ్రెస్ పార్టీ అనేక నిర్ణయాలు చేసింది. ఆ నిర్ణయాల వల్లే మేం ఇవ్వాళ ఇలా ఉన్నాం. ఏపీలో, తెలంగాణలో కాంగ్రెస్ కొంప మునగడానికి అందరూ కారణమేనంటున్నారు మాజీ స్పీకర్ శ్రీపాదరావు తనయుడు, మాజీమంత్రి, మాజీ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్బాబు. అధిష్టానం చాలా ఆలస్యంగా తెలంగాణపై నిర్ణయం తీసుకోవడం, సీఎం పదవిలో ఉండికిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానం నిర్ణయాన్ని వ్యతిరేకించడం.. రాజకీయంగా ఏ రకంగా లబ్ధిపొందుతాం అనే వ్యూహంపై పార్టీలో జరిగిన లోపం, ప్రభుత్వ వ్యతిరేక ఓటు.. ఇలా అన్నీ కాంగ్రెస్ పార్టీకి ఎదురు తిరిగాయని చెప్పారు. రాజశేఖరరెడ్డి తనయుడిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి కాంగ్రెస్లోనే ఉండి మరింత బాధ్యతాయుత స్థానాన్ని చేపట్టాలని అందరం అనుకున్నా ఘటనలు మరోరకంగా పరి ణమించాయన్నారు. జగన్, తెలంగాణ వంటి అంశాల్లో కొంతమంది సీనియర్ల అభిప్రాయం తీసుకున్నప్పుడు అధిష్టానం తనవంతుగా ఆలోచించి ఒక వ్యూహాన్ని చేపట్టలేదని వాపోయారు. తెలంగాణ ఇచ్చేదీ, తెచ్చేదీ కాంగ్రెస్ పార్టీనే అనే విషయం పక్కకు వెళ్లి, కేసీఆర్ కాంగ్రెస్ మెడలు విరిచి తెలంగాణను తెస్తున్నాడు అనే అభిప్రాయం ముందుకు రావడమే కాంగ్రెస్ పరాజయానికి కారణం అంటున్న దుద్దిళ్ల శ్రీధర్ బాబు అభిప్రాయాలు ఆయన మాటల్లోనే.. నక్సలైట్లు నాన్నపై ఆకస్మికంగా ఎందుకు దాడి చేశారు? ఆ ఘటన గురించి ఆలోచిస్తుంటే అయన్ని ఎందుకు చంపారన్నది ఈరోజుకు కూడా మాకు షాకింగ్ గానే ఉంటుంది. ఎవరేం మాట్లాడుకున్నా, నాన్న ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండేవారు. మానవత్వంతో వ్యవహరించేవారు. ప్రత్యేకించి మా ప్రాంతం చత్తీస్గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉంటుంది. పైగా అటవీప్రాంతం. అక్కడి సామాజిక పరిస్థితులు, నక్సల్ ప్రభావం, ఏదైనా కావచ్చు...ఆ ప్రాంత సమస్యలు వేరే విధంగా ఉంటాయి. అక్కడ ఉన్నవారికే అవి తెలుస్తాయి. నాన్న విషయంలో తాము చేసింది పొరపాటే అనే అభిప్రా యాన్ని కూడా వారు వ్యక్తపరిచినట్లు పేపర్లలో చదివాం. వైఎస్ఆర్తో మీ అనుబంధం గురించి చెప్పండి? రాజకీయ జీవితం మొదలైంది వారితోనే. నాన్న చనిపోయాక వైఎస్సార్ మా ఇంటికి వచ్చినప్పుడు కుటుంబంలోంచి ఎవరో ఒకరు రాజ కీయంలోకి రావాలి అని చెప్పారు. సీనియర్ నేతలు ప్రోత్సహించారు. అలా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వైఎస్సార్ నన్ను చాలా బాగా చూసుకునేవారు. యువ రాజకీయ నేతలను ప్రోత్సహించడం ఆయన ప్రాథమ్యం. ఆయన మంత్రి వర్గంలో పనిచేయడం గొప్ప అనుభవం. డైనమిక్ నిర్ణయాలు తీసుకునేవారు. ఇవ్వాళ ఉదయం ఒక కార్యక్రమం తీసుకుంటే దానికి ఒక గంటలో పరిష్కారం వచ్చేలా చూసే వారు. పార్టీ వ్యవహారాల్లో కాని, అసెంబ్లీలో వ్యవహారాలను ఎలా సజావుగా నిర్వహిం చాలి అనే విషయంలో కాని ఆయనలో ఎప్పుడూ ఒక సానుకూల దృక్పథం కనిపించేది. జగన్మోహన్ రెడ్డి విషయంలో కాంగ్రెస్ ప్రజాస్వామికంగా వ్యవహరించిందా? వైఎస్ఆర్ మరణం తర్వాత ఆయన తనయుడు జగన్ మోహన్ రెడ్డిని సీఎం చేయాలి అంటూ 140 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చారు. కారణాలేవయినా సరే అధిష్టానం వ్యతిరేకించింది. మా పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ. ఆ సమయంలో జగన్పై కొందరు వ్యతిరేకంగా చెప్పడం నిజం. జగన్ యువకుడు. కొద్దిగా సర్దుకుని పోతే మంచిదని మేమనుకున్నాం. తనపై మేం చాలా పాజిటివ్ గానే ఉన్నాము. అరుుతే అధిష్టానం ఏ నిర్ణయాలు తీసుకున్నా, మేం తప్పకుండా దాన్ని పాటించాల్సిందే. అంత కష్టమైన సమయంలో ఒక సీనియర్ నేతను సీఎంగా పెట్టాలన్న నిర్ణయం తీసుకున్నప్పుడు మాలాంటి యువకులం కూడా ఓపికతో ఉండాలి. కాంగ్రెస్ మునిగిపోవడానికి కారణం ఎవరు? అధిష్టానమా, కిరణా, లేక మీరందరూనా? అందరి ప్రమేయం ఉండి ఉండొచ్చండి. అధిష్టానం నిర్ణయం తీసుకున్న తర్వాత కిరణ్ దాన్ని వ్యతిరేకించకూడదు. అధిష్టానం తెలంగాణపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ‘అది ఫైనల్. అది ఆగే ప్రసక్తి లేదన్నా’ అని మేము ఆయనకు చెప్పాం. కానీ కిరణ్ తన అభిప్రాయం మాకు తెలుపలేదు. ఆ తర్వాత మాకు చాలా గ్యాప్ వచ్చేసింది. రాజకీయంగా ఏవిధంగా లబ్ధి పొందుతాం అనే స్ట్రాటజీ లోపం వల్ల కాంగ్రెస్ దెబ్బతినింది. పైగా రాష్ట్రంలో మేం పదేళ్లు అధికారంలో ఉన్నాం. ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది కూడా దానికి జతకూడింది. కిరణ్ కుమార్ రెడ్డి ఏం చేసినా మీరు భయపడిపోయారా? తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉన్నప్పుడు నాలుగేళ్లపాటు ఏపీలోనూ సెంటి మెంట్ పెరిగిపోయింది. కిరణ్పై ఏదైనా చర్య తీసుకుంటే ఏపీలో సెంటిమెంటు ఇంకా రెచ్చిపోయే ప్రమాదం ఉందని కూడా అనుకున్నాం. ఏం చేద్దాం అనే విషయంపై కొంతమంది సీనియర్ల అభిప్రాయం తీసుకున్నప్పుడు అధిష్టానం చాలా ఆలోచన చేసి ఒక వ్యూహాన్ని చేపట్టవలసింది. కాని అలా జరగలేదు. జగన్పై, కొందరు కాంగ్రెస్ మంత్రులపై కేసులు పెట్టడం కరెక్టేనా? ఆరోజు జరిగిన సంఘటనలు బాధాకరం. అలా జరగకుండా ఉండాల్సింది. అవన్నీ కాంగ్రెస్ పార్టీపైనే ప్రభావం చూపారుు. దేశ చరిత్రలోనే అత్యంత గొప్ప ప్రజా నేత వైఎస్ఆర్. కాంగ్రెస్ రాష్ట్రంలో పటిష్టం కావడానికి ఆయన పాత్ర చాలా ఉంది. ఆయన చనిపోయిన తర్వాత ఆ సంఘటనలు జరగడం చాలా దురదృష్టకరం. అదే సమయంలో సోదరులు జగన్ కూడా కొద్దిగా ఓపిక పట్టాల్సి ఉండె. కేసులు ఎందుకు పెట్టారు, ఎలా పెట్టారు, ఎవరి ప్రమేయమయినా ఉందా అని తెలీదు కాని అలా జరగకుండా ఉండాల్సింది. జగన్ ఓదార్పుయాత్రకు వెళతానంటే కూడా వ్యతిరేకించడం ఏమిటి? ఓదార్పుయాత్రపై అధిష్టానానికి వ్యతిరేకంగా చెప్పినప్పుడు తాను పార్టీకోసమే చేస్తున్నాను కానీ వ్యక్తిగతంగా కాదని జగన్ కూడా అధిష్టానానికి నచ్చచెప్పాల్సింది. కాని ఆయన ఆ మార్గంలో వెళ్లలేదు. మా వైఎస్సార్ తనయుడాయన. మాతోనే ఉండాల్సింది. ఇవాళ ఆయన ప్రధాన పాత్రలో ఉంటే చూసి ఉండేవాళ్లం. అది చూడలేకపోయామన్నదే బాధ. కిరణ్ సీఎం అయిన తర్వాత జరుగుతున్న పరిణామాలను చక్కదిద్దలేకపోయారా? చక్కదిద్దడానికి వీల్లేనంతగా ఉద్యమం తీవ్ర స్థాయికి వెళ్లింది. ముఖ్యమైన విష యం ఏమిటంటే వైఎస్సార్ లాంటి స్ట్రాంగ్ లీడర్ ఉండి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. పాలనాపరంగా కిరణ్ స్ట్రాంగ్. కానీ రాజకీయంగా కాదు. రాష్ట్ర విభజన చేయ వద్దు అనే ఆలోచనతో ఒక సీఎంగా ఆయన బయట పడకూడదు. రెండు ప్రాంతాలకు ఆయన ముఖ్యమంత్రి. ఆ స్థానంలో ఉండి ఒక ప్రాంతానికి అనుకూలంగా అసలు రావద్దు. తెలంగాణ ఇచ్చిన క్రెడిట్ ఎవరికి దక్కింది? సోనియా గాంధీ పూనుకోకపోయి ఉంటే ఈరోజుకీ ప్రత్యేక రాష్ట్రం రాకపోయి ఉండేదని తెలంగాణ ప్రజల్లో ఇప్పటికీ బలంగానే అభిప్రాయం ఉంది. ప్రజానీకం మొత్తంగా ఆరోజు టీవీల చుట్టూనే ఉన్నారు. తెలియనిది ఎవరికి? ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత ఈ రెండు పాత్రల్లో వైఎస్సార్, చంద్రబాబుపై మీ అంచనా? ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు వైఎస్సార్ ప్రజాసమస్యలను బలంగా ఎత్తిచూపారు. విద్యుత్ చార్జీల పెంపుదలకు వ్యతిరేకంగా పార్టీ నేతలందరం నిరాహార దీక్ష చేశాం. అది ప్రజలందరికీ మేలు కలిగించే అంశం. ఇక సీఎంగా ఉన్నప్పుడు ఆయన తీసుకున్న విధానాలు ఎంతోమందికి ఉపయోగపడు తున్నాయి. ఈ రోజు పల్లెల్లోకి మీరెళ్లినా ఈ విషయం బోధపడుతుంది. బాబు పాలనలో జన్మభూమి సభలకు వెళ్లినప్పుడు మేం చూశాం. రూ. 200ల పించను తీసుకోవాలంటే అర్హులలో కొందరు చనిపోతే ఇతరు లకు ఆ అవకాశం వస్తుంది అనే అభిప్రాయం సృష్టించారు. వైఎస్ఆర్ హయాంలో అలాంటి పరిస్థితే లేదు. అర్హులైన ప్రతి ఒక్కరికీ వృద్ధాప్యం పించన్ ఇచ్చేవారు. మోదీ పెద్దనోట్ల రద్దుపై మీ అభిప్రాయం? ఇది చాలా ఇబ్బందికరమైన కార్యక్రమం. గ్రామీణ ప్రాంతంలో నేటివరకూ నోట్ల చలామణి లేక ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి పెద్ద నిర్ణయం గోప్యంగానే ఉండాలి. ముందుగా ఎవరికీ తెలియకూడదు. కానీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ప్రజ లను ఇబ్బంది పెట్టే ఆస్కారం ఉన్నప్పుడు ఇది నిజంగానే ఆర్థిక ఎమర్జెన్సీ లాంటిదే. కష్టపడి సంపాదించిన సొంత డబ్బును కూడా తీసుకోవడానికి సామాన్య ప్రజానీకం ఇబ్బంది పడుతున్నారంటే ఇది ఒకరకంగా ఎమర్జెన్సీయే. (దుద్దిళ్ల శ్రీధర్బాబుతో ఇంటర్వ్యూ పూర్తి పాఠం కింది లింకులో చూడండి) -
గాంధీభవన్లో తెలంగాణ జాగ్రఫీ పుస్తకావిష్కరణ
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం గాంధీ భవన్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ శ్రీపాదరావు జ్ఞాపకార్ధం తెలంగాణ జాగ్రఫీ పుస్తకాన్ని మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆవిష్కరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ..తెలంగాణ కోసం పోరాడిన విద్యార్థులు, ప్రజా సంఘాలకు చరిత్రలో సరైన గుర్తింపు ఇవ్వకపోవడం దురదృష్టమన్నారు. తెలంగాణ ఆవిర్భావంలో సోనియా పాత్రను కూడా చేర్చకపోవడం దారుణమన్నారు. ఈ విషయం గురించి టీఎస్పీఎస్సీ చరిత్ర పుస్తకాల్లో జోడించాలని డిమాండ్ చేశారు. లక్ష ఉద్యోగాలు ఇస్తానన్న కేసీఆర్ మాట ఎటుపోయిందని ఎద్దేవా చేశారు. -
ఉస్మానియా భూములు తీసుకోవడం సరికాదు: శ్రీధర్బాబు
మంథని(కరీంనగర్): ఉస్మానియా విశ్వవిద్యాలయం భూములను తీసుకుని అందులో పేదలకు ఇళ్లు కట్టించాలనే యోచన సబబు కాదని మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. మంగళవారం ఆయన కరీంనగర్ జిల్లా మంథనిలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వాలంటే అందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయన్నారు. ఉన్నత విద్యాభ్యాసానికి ఆటంకం కల్గించే విధంగా ఉస్మానియా యూనివర్సిటీ భూముల్లో ఇళ్లు కడతామనడం సరైంది కాదన్నారు. విశ్వవిద్యాలయూన్ని దూరదృష్టితో ఏర్పాటు చేశారని, రానున్న రోజుల్లో జనాభా పెరిగి అనేక మంది పేద విద్యార్థులు అందులో చేరే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం విశ్వవిద్యాలయం భూమిని కాకుండా మరోచోట కొనుగోలు చేసి ఇళ్లు కట్టించాలని సూచించారు. -
'ఎన్టీఆర్ పేరు పెడితే చూస్తూ ఊరుకోం'
మంథని: తెలంగాణలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు పెట్టాలని టీడీపీ ప్రతిపాదించడం విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. అధికారం ఉందని ఏ నిర్ణయం తీసుకున్నా ప్రతిపక్ష పార్టీగా చూస్తూ ఊరుకునేది లేదన్నారు. కరీంనగర్ జిల్లా మంథనిలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖర్రెడ్డి హయాంలో హైదరాబాద్లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి రాజీవ్గాంధీ పేరిట నామకరణం చేశారన్నారు. కాగా, తెలంగాణ ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోకుండానే పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రలో కలిపేందుకు బీజేపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకువచ్చిందని ఆరోపించారు. -
దుద్దిళ్ల వర్సెస్ పొన్నం
కరీంనగర్: కలిసి ఉన్నట్లు కనిపించినా... కాంగ్రెస్లో ఆధిపత్య పోరు అంతర్గతంగా రాజుకుంటోంది. తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో ఛైర్మన్, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎంపీ పొన్నం ప్రభాకర్ మధ్య కోల్డ్వార్ ముదురుతోంది. మొన్నటివరకు పీసీసీ చీఫ్ రేసులో అధిష్టానం దృష్టిలో పడ్డ వీరిద్దరూ... సొంత జిల్లాలో గ్రూపులు ప్రోత్సహిస్తున్నారు. అవునంటే కాదనిలే అన్నట్లు ఎవరికివారుగా ఎత్తుగడలు వేస్తున్నారు. ఇటీవల తెలంగాణ విజయోత్సవ సంబరాల్లో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలతో రచ్చకెక్కిన విభేదాలు వరుసగా వచ్చిన ఎన్నికలతో మరింత రాజుకోవటం ఖాయమైంది. ఇటీవల ప్రజా సంఘాల జేఏసీ ఛైర్మన్ గజ్జెల కాంతం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన కరీంనగర్ లోక్సభ సెగ్మెంట్ పరిధిలోని చొప్పదండి నియోజకవర్గం నుంచి పార్టీ టికెట్టు ఆశిస్తున్నారు. ముందుగా మంత్రిని ఆశ్రయించటంతో పాటు... శ్రీధర్బాబు ఇచ్చిన భరోసా మేరకే కాంతం పార్టీలో చేరినట్లు ప్రచారం జరిగింది. రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జి దిగ్విజయ్సింగ్, మాజీ మంత్రి సమక్షంలో కాంతం కాంగ్రెస్లో చేరిన సందర్భంలోనూ పొన్నం ఆ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. ఈలోపు తెలంగాణ ధూంధాం వ్యవస్థాపకుడు రసమయి బాలకిషన్ను కాంగ్రెస్లోకి రప్పించేందుకు ఎంపీ ప్రయత్నాలు చేశారు. చివరి నిమిషంలో మానకొండూరు నుంచి పార్టీ టికెట్టు హామీ ఇవ్వటంతో బాలకిషన్ టీఆర్ఎస్లో చేరారు. ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్... టీఆర్ఎస్... ఏదో ఒక పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్న టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే సుద్దాల దేవయ్య తెరపైకి వచ్చారు. మొన్నటివరకు దూరం పెట్టిన దేవయ్యను పార్టీలోకి చేర్చుకునేందుకు ఎంపీ తన వంతుగా లైన్ క్లియర్ చేసినట్లు తెలుస్తోంది. పార్టీలో చేరే విషయుంపైనే దేవయ్య హైదరాబాద్లో టీపీసీసీ చీఫ్ పొన్నాలను కలిసినట్లు సమాచారం. దీంతో రేపో మాపో దేవయ్య పార్టీలో చేరుతారని తెలుస్తోంది. ఓయూ జేఏసీ విద్యార్థి నాయకుడు మేడిపల్లి సత్యం సైతం చొప్పదండి నుంచి కాంగ్రెస్ టికెట్టు ఆశిస్తున్నారు. సిట్టింగ్ కావటంతో ఎంపీ వ్యూహాత్మకంగానే దేవయ్యను టికెట్టు రేసులోకి తెచ్చి.. గజ్జెల కాంతంకు, ఆయనను ప్రోత్సహించిన మాజీ మంత్రికి చెక్ పెట్టినట్లయిందని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. సామాజిక వర్గాల సమీకరణాల్లోనూ దేవయ్యను పార్టీలోకి చేర్చుకోవటం సరైందనే వాదన పార్టీ నాయకుల్లో వినిపిస్తోంది. మరోవైపు మున్సిపల్ ఎన్నికల టికెట్ల పంపిణీలోనూ ఎంపీ, మంత్రి మధ్య అంతరం పెరిగిపోయింది. తెలంగాణ విజయోత్సవ సంబరాల్లో మంత్రి వర్గీయులుగా హల్చల్ చేసి గొడవకు దిగిన వారందరికీ కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో టికెట్లు ఇవ్వకుండా చెక్ పెట్టాలని ఎంపీ పంతం పట్టారు. ఈ టికెట్ల వ్యవహారంలో తమను లెక్కచేయకపోతే బహిరంగంగా ప్రెస్మీట్ పెట్టి నిలదీస్తావుని ఎమ్మెల్సీ టి.సంతోష్కుమార్ మాజీ మంత్రి దగ్గర తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు బయటకు పొక్కింది. ఎంపీ.. మంత్రి వర్గీయుల పంతం కారణంగానే కార్పొరేషన్లో పార్టీ అభ్యర్థిత్వాలు కొలిక్కి రాలేదు. ఆఖరి రోజు వరకు 50 డివిజన్లలో అభ్యర్థులకు బీ ఫారాలు ఇచ్చేందుకు జిల్లా కాంగ్రెస్ కమిటీ వెనుకా ముందాడింది. ఒకప్పుడు ఒకే వర్గంగా ఉన్న శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్లు తెలంగాణ ఉద్యమం తీవ్రతరమవుతున్న కొద్దీ దూరం పెరుగుతూ రావటం గమనార్హం. -
సీఎం నోటీసు చెల్లదు: శ్రీధర్, గండ్ర
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013ను తిరస్కరించాలంటూ ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి స్పీకర్కు ఇచ్చిన నోటీసు చెల్లదని తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులన్నారు. ‘ప్రభుత్వం తరఫున నోటీసివ్వాలంటే మంత్రివర్గంలో అందరి ఆమోదమూ ఉండాలి. అందుకు భిన్నంగా ఉన్న ఈ నోటీసును అనధికార తీర్మానంగానే భావించి తిరస్కరించండి’’ అని స్పీకర్ నాదెండ్ల మనోహర్ను కోరారు. ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, విప్లు ఆరెపల్లి మోహన్, ఈరవత్రి అనిల్, ఎమ్మెల్యేలు కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, ప్రవీణ్కుమార్, కె.శ్రీధర్, బాలూనాయక్, చిరుమర్తి లింగయ్య, ప్రతాప్రెడ్డిలతో కలసి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సీఎం వ్యవహరిస్తున్న తీరును తప్పుబట్టారు. కేబినెట్లో చర్చించకుండా ప్రభుత్వం తరపున నోటీసిచ్చే అధికారం ఆయనకు లేదన్నారు. అంతేగాక శాసనసభ నిబంధన 77 కింద ఆయన ఇచ్చిన నోటీసు రాజ్యాంగంలోని 3వ అధికరణ కింద పంపిన బిల్లుకు వర్తించదన్నారు. బిల్లును తిరస్కరించాలని చెబుతున్న కిరణ్, దానిపై చర్చించేందుకు మరో నాలుగు వారాల గడువు కావాలంటూ రాష్ట్రపతిని ఎందుకు లేఖ రాసినట్టని ప్రశ్నించారు. పైగా ఆ లేఖలో కూడా ‘బిల్లు’ అని ప్రస్తావించారే తప్ప ముసాయిదా బిల్లని ఎక్కడా పేర్కొనలేదని గుర్తుచేశారు. తెలంగాణ ప్రజలను మరింత రెచ్చగొట్టడానికే కిరణ్, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కలసి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర విభజన విషయంలో అసెంబ్లీ అభిప్రాయాలను మాత్రమే చెప్పాలి తప్ప తిరస్కరించాలనుకోవడం సరికాదన్నారు. -
కిరణ్ మంత్రివర్గంలో ఇమడలేకే రాజీనామా చేశా
సిద్దిపేట జోన్ ,న్యూస్లైన్: అధిష్టాన నిర్ణయాన్ని ధిక్కరించి తెలంగాణ ప్రక్రియను అడ్డుకునేందుకు సీఎం కిరణ్కుమార్రెడ్డి మరోకుట్రకు తెరతీస్తున్నారని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఆరోపించారు. మంత్రి పదవికి రాజీనామా చేసిన అనంతరం ఆయన తొలిసారిగా సొంత జిల్లా కరీంనగర్కు వెళుతూ సిద్దిపేట మండలం పొన్నాల వద్ద మాట్లాడారు. తెలంగాణ బిల్లును శాసన సభలో అడ్డుకునే క్రమంలోనే శాసన సభ వ్యవహరాలశాఖ మంత్రి పదవి నుంచి తనను తప్పించారన్నారు. మరోవైపు శాసన సభ సమావేశాలను పొడిగించి తెలంగాణ ముసాయిదా బిల్లును అడ్డుకునేందుకు సీఎం మరోకుట్రకు తెరలేపుతున్నారన్నారు. ఈ నెల 23 అసెంబ్లీ సమావేశాలకు చివరి గడువని, అయినప్పటికీ సమావేశాలను పొడిగించాలని సీఎం చేస్తున్న కుట్రను తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు అడ్డుకొవాలన్నారు. శాసన సభలో సీమాంధ్ర ప్రజల సమస్యలను చర్చ సందర్భంగా అసెంబ్లీ దృష్టికి తీసుకురావాలని సీమాంధ్ర శాసన సభ్యులకు విజ్ఞప్తి చేశారు. తన రాజీనామా వ్యక్తిగతం కాదన్నారు. ప్రజ లందరి కోరిక మేరకే రాజీనామా చేశానన్నారు. కిరణ్ మంత్రి వర్గంలో కొనసాగడం ఇష్టం లేక పదవిని వదులుకున్నానన్నా రు. ఆయన సీఎంగా ఉన్నంత వరకు తెలంగాణ మంత్రులు ఇమడడం కష్టమన్నారు. తెలంగాణ కోసం, వ్యక్తిగతంగా తాను ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఏఐసీసీ అధినేత్రి సొనియాగాంధీ, రాహుల్ గాంధీ, దిగ్విజయ్సింగ్ రాష్ర్ట విభజన విషయంలో స్పష్టంగా ఉన్నారన్నారు. తెలంగాణను అడ్డుకొవాలని చూస్తే ఈ ప్రాంత ప్రజలు ఎవరినీ క్షమించరని పరోక్షంగా సీఎం కిరణ్కుమార్రెడ్డి, ప్రతిపక్షనేత చంద్రబాబును ఉద్దేశించి అన్నారు. కిరణ్కుమార్రెడ్డి సీమాం ధ్ర ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని దీనిని సహించలేకనే మంత్రి పదవికి రాజీనామా చేశానన్నారు. సమావేశంలో ఎంపీ పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, పీసీసీ కార్యదర్శి గంప మహేందర్రావు పాల్గొన్నారు. శ్రీధర్బాబుకు ఘన స్వాగతం మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత తొలి సారి జిల్లాకు వస్తున్న మంత్రి శ్రీధర్బాబుకు ఆదివారం పొన్నాల శివారులో కాంగ్రెస్ కార్య కర్తలు ఘనస్వాగతం పలికారు. సిద్దిపేట, సిరి సిల్ల నియోజకవర్గాల నుంచి భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. పొ న్నాల వద్ద ఏర్పాటు చేసిన వేదికపై నుంచి మం త్రి శ్రీధర్బాబు ప్రసంగించారు. అంతకు ముం దు కార్యకర్తలు మంత్రిని, ఎంపీ పొన్నం ప్రభాకర్ను ఘనంగా సన్మానించారు. అనంతరం ఓపెన్టాప్ జీపులో మంత్రి, ఎంపీని కరీంనగర్ జిల్లా సరిహద్దుల వరకు ఊరేగించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారూఖ్ , పీసీసీ కార్యదర్శి గంప మహేందర్రావు, జిల్లా అధికార ప్రతినిధి సికిందర్, ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ సాకి అనంద్తో పాటు సిద్దిపేట కాంగ్రెస్ నాయకులు ప్రభాకర్వర్మ, జీవన్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, ఖలీం, దాసరి రాజు, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కొండూరి రవీందర్రావుతో పాటు వందలాది కార్యకర్తలు పాల్గొన్నారు. అంతకు ముం దు స్థానిక రంగధాంపల్లి వద్ద తెలంగాణ ఆమరవీరుల స్థూపం వద్ద మంత్రి శ్రీధర్బాబు, ఎం పీ పొన్నం ప్రభాకర్ను సన్మానించారు. కార్యక్రమంలో వంగరి నాగరాజు, రామకృష్ణగౌడ్, రాజు, యూసుఫ్, ఖలీం, విజయ్, వంశీ, షఫీ, రమేష్, వర్మ, వినయ్, సలీంలు పాల్గొన్నారు. -
`శాఖ మార్పు.. సమైక్యాంధ్ర కోసం కాదు`
విశాఖపట్నం: తెలంగాణ ముసాయిదా బిల్లు రాష్ట్ర అసెంబ్లీలో ఉన్న ప్రస్తుత కీలక తరుణంలో శాసనసభ వ్యవహారాల శాఖ నుంచి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబును తప్పించడంపై తెలంగాణలో సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి శ్రీధర్బాబు శాఖ మార్పు అంశం ఇరు ప్రాంతాల్లో భావోద్వేగాలు పెంచడానికే తప్ప సమైక్యాంధ్ర కోసం ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి చేసింది కాదని వైఎస్సార్ సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ కోఆర్డినేటర్ కొణతాల రామకృష్ణ విమర్శించారు. సమైక్య తీర్మానం అసెంబ్లీ చేయాల్సిందేనని కొణతాల పేర్కొన్నారు. కాగా, శ్రీధర్బాబు శాఖను మార్చి వాణిజ్య పన్నుల శాఖ అప్పగించడాన్ని పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తీవ్రంగా వ్యతిరేంచిన సంగతి తెలిసిందే. -
'తెలంగాణను అడ్డుకునే వ్యక్తులపై తిరుగుబాటు'
-
'తెలంగాణను అడ్డుకునే వ్యక్తులపై తిరుగుబాటు'
హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లును ఆపుదామనే ప్రయత్నంలోనే తన శాఖ మార్చారని మంత్రి శ్రీధర్బాబు ఆరోపించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ఆగదన్నారు. తెలంగాణను అడ్డుకునే వ్యవస్థలు, వ్యక్తులపై తిరుగుబాటు కొనసాగుతుందన్నారు. తాను పదవులు కోసం పాకులాడే వ్యక్తిని కాదన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం పావులు కదుపుతున్నందునే మంత్రి పదవికి రాజీనామా చేశానని తెలిపారు. బిల్లుపై చర్చ జరగకుండా అడ్డుకునేందుకు ఇదంతా చేశారన్నారు. ఇది మూమ్మాటికీ అధికార దుర్వినియోగమే అన్నారు. తన రాజీనామాతో ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి, సీమాంధ్ర నేతలకు కనువిప్పు కలగాలన్నారు. తెలంగాణ కోసం అమరులైన వారి ముందు తన రాజీనామా చాలా చిన్నదన్నారు. -
శ్రీధర్ బాబు రాజీనామాపై తర్జనభర్జన
హైదరాబాద్: రాష్ట్ర విభజన బిల్లు అసెంబ్లీలో ఉన్న ప్రస్తుత కీలక తరుణంలో శాసనసభ వ్యవహారాల శాఖ నుంచి దుద్దిళ్ల శ్రీధర్బాబును తప్పించడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తన మంత్రి పదవికి రాజీనామా చేసే విషయంలో మంత్రి శ్రీధర్ బాబు తర్జనభర్జన పడుతున్నట్టు సమాచారం. దీనిపై చర్చించేందుకు ఈ రోజు సాయంత్రం శ్రీధర్ బాబు నివాసంలో కరీంనగర్ జిల్లా ముఖ్య నేతలతో భేటీ అయినట్టు తెలిసింది. కాగా, త్వరలో శ్రీధర్ బాబు తన రాజీనామాపై స్పష్టమైన నిర్ణయం ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. -
బాబుకు మైండ్ పోయింది: గుత్తా
నల్లగొండ: టీడీపీ అధినేత చంద్రబాబు రెండుసార్లు అధికారం కోల్పోయి మతిభ్రమించి మాట్లాడుతున్నారని కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఉండదని ఆయన జోస్యం చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి కుట్రపూరితంగానే మంత్రి శ్రీధర్బాబును తొలగించారని ఆరోపించారు. శాసనసభా వ్యవహారాల శాఖను దుద్దిళ్ల శ్రీధర్బాబు నుంచి తప్పించి మరో మంత్రి సాకే శైలజానాథ్కు అప్పగించిన నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. అయితే హైకమాండ్ వ్యూహం మేరకే శ్రీధర్బాబు శాఖ మార్పు జరిగిందని ప్రచారం జరుగుతోంది. విభజన బిల్లుపై చర్చ సాఫీగా జరిగేలా చూసేందుకు అధిష్టానం అనుమతి తీసుకునే కిరణ్ మార్పు చేపట్టినట్టు తెలుస్తోంది. -
సమైక్య తీర్మానం పెట్టినా అభ్యంతరం లేదు: డీఎస్
హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లుపై అసెంబ్లీలో చర్చలు ముగిశాక సమైక్య తీర్మానం పెట్టినా అభ్యంతరం లేదని పీసీసీ మాజీ చీఫ్ డీ. శ్రీనివాస్ చెప్పారు. విభజన ప్రక్రియ ఫిబ్రవరి మధ్యలో పూర్తవుతుందని ఆయన తెలిపారు. అయితే శాసనసభ వ్యవహారాల శాఖ నుంచి దుద్దిళ్ల శ్రీధర్బాబును తప్పించడంతో ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయడం సరియైనదేనని డీఎస్ చెప్పారు. అయితే శాఖను వదులుకోవాలి కానీ, మంత్రి పదవిని కాదని ఆయన హితవు పలికారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెట్టకపోతే పూర్తి కాలం పదవిలో ఉంటారని డీఎస్ తెలిపారు. కాగా, వేలకోట్ల అవినీతికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పాల్పడినట్టు ఆరోపణలున్నాయని డీ. శ్రీనివాస్ విమర్శించారు. అవినీతిపై మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని డీఎస్ అన్నారు. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి ఒకసారి, అటల్ బీహారీ వాజ్పాయ్కి వెన్నుపోటు పొడిచి మరోసారి ముఖ్యమంత్రి అయ్యారని ఆయన ఆరోపించారు. ఇతర పార్టీల నేతలను కించపరిచే విధంగా చంద్రబాబు మాట్లాడటం బాధాకరమని డీ శ్రీనివాస్ తెలిపారు. -
సీమాంధ్ర పీసీసీ చీఫ్గా కన్నా?
పీసీసీ అధ్యక్షుల ఎంపికపై రాష్ట్ర కాంగ్రెస్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి. రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంటులో ఆమోదానికి ముందే తెలంగాణ, సీమాంధ్రులకు వేర్వేరుగా పీసీసీలను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ రెండు పదవులకు పలువురి పేర్లు తెరపైకి వస్తున్నాయి. తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవికి పౌర సరఫరాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేరు దాదాపు ఖరాయినట్టు ప్రచారం జరిగింది. ఈ మేరకు అధిష్టానం పెద్దల నుంచి ఆయన పిలుపువచ్చినట్టుగా మీడియాలో వార్తలు వచ్చాయి. ఆయన హస్తిన పర్యటనకు వెళ్లిరావడం ఈ ఊహాగానాలకు బలం చేకూర్చింది. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ ప్రస్తుతం యువ నాయకత్వాన్ని ప్రోత్సహించే పనిలో ఉన్నారని.. ఆయన ఆదేశాల మేరకే హైకమాండ్ పెద్దలు శ్రీధర్బాబును ఢిల్లీకి పిలిపించారనే ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారం అవాస్తవమని శ్రీధర్బాబు స్పష్టం చేశారు. ఇక సీమాంధ్రలో పీసీసీ అధ్యక్ష పదవికి మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పేరు తాజాగా తెరపైకి వచ్చింది. హైకమాండ్ పిలుపుతో ఆయన హుటాహుటిన ఢిల్లీకి పయనమవడంతో కన్నాకు పీసీసీ పగ్గాలు ఖాయమన్న ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో అధినేత్రి సోనియా గాంధీతో కన్నా సమావేశంపై కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. మేడమ్తో నేడు ఆయన ప్రత్యేకంగా భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. తమ నాయకుడు తీపి కబురుతో తిరిగొస్తారని కన్నా వర్గీయులు ఆశగా ఎదురుచూస్తున్నారు. జోడు పదవులు అనుభవిస్తున్న బొత్స సత్యనారాయణ నుంచి పీసీసీ పీఠాన్ని వేరొకరికి అప్పగించేందుకు కాంగ్రెస్ అధిష్టానం చాలా రోజులుగా కసరత్తు చేస్తోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో తన నిర్ణయాన్ని హైకమాండ్ అమలు చేసే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. బొత్స స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన కన్నా పదవికి అప్పగిస్తే కాపు ఓటు బ్యాంకు చేజారిపోకుండా ఉంటుందని అధిష్టానం అంచనా వేస్తోస్తున్నట్టు సమాచారం. అయితే గతంలో కూడా పీసీసీ అధ్యక్ష పదవికి కన్నా పేరు వినిపించిన సంగతి తెలిసిందే. సీమాంధ్రకు సత్తిబాబునే తాత్కాలికంగా పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగించే అవకాశమూ లేకపోలేదన్న వాదన విన్పిస్తోంది. ఈ నెలాఖరులోగా తెలంగాణ పీసీసీ ఏర్పాటు చేస్తారని చెబుతున్నారు. ఇదే నిజమయితే పీసీసీ పీఠాలు ఎవరికి దక్కుతాయనేది తొందరలోనే తేలుతుంది. -
అమ్మను మించిన అదితి
ఈ తల్లీ కూతుళ్లను చూశారా.. వీరెవరో కాదు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు భార్య శైలజా అయ్యర్, వాళ్ల కుమార్తె అదితి. ఐఏఎస్ అధికారిణి, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ ఎండీ అయిన శైలజా అయ్యర్ స్వతహాగా నృత్య కళాకారిణి. తన కుమార్తెను కూడా తనలాగే నృత్యంలో తీర్చిదిద్దారామె. శనివారం అదితి హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో నృత్య ప్రదర్శన ఇచ్చింది. అప్పటి చిత్రాల మాలిక ఇది. ఫొటోలు: , సాక్షి ఫొటోగ్రఫర్ - వీరాంజనేయులు