ecuador
-
టీవీ స్టూడియోలో దుండగుల దాడి..
-
టీవీ స్టూడియోలో దుండగుల దాడి.. లైవ్లో వీక్షించిన ప్రేక్షకులు!
ఈక్వెడార్ అధ్యక్షుడు డేనియల్ నోబోవా తాజాగా క్రిమినల్ గ్రూప్ ‘ఈక్వెడార్ గ్యాంగ్స్టర్స్ స్టార్మ్ స్టూడియో’పై సైనిక చర్యకు ఆదేశించారు. హుడ్ ధరించిన ఈ గ్రూప్నకు చెందిన ముష్కరులు టెలివిజన్ స్టూడియోపై దాడి చేయడంతో పాటు భద్రతా బలగాలను, పౌరులను చంపుతామని బెదిరించడంతో అధ్యక్షుడు ఇటువంటి ఆదేశాలు జారీచేశారు. ఈక్వెడార్లో పేరుమోసిన నేరస్తుడు జోస్ అడాల్ఫో ఇటీవల మాసియాస్ జైలు నుండి తప్పించుకోవడంతో దేశంలో భద్రతా సంక్షోభం తలెత్తింది. దేశంపై గ్యాంగ్స్టర్లు యుద్ధం ప్రకటించారు. దీంతో దేశం అంతర్గత సాయుధ సంఘర్షణలో ఉందని అధ్యక్షుడు నోబోవా ప్రకటించారు. శాంతియుత స్వర్గధామంగా ఉన్న ఈక్వెడార్పై పట్టుసాధించేందుకు ఇటీవలి కాలంలో మెక్సికన్,కొలంబియన్ కార్టెల్స్తో సంబంధం కలిగిన ప్రత్యర్థి ముఠాలు పోటీ పడుతున్నాయి. తాజాగా ఈ క్రిమినల్ గ్రూపులను మట్టుబెట్టేందుకు సైనిక చర్య చేపట్టాలని దేశ సాయుధ బలగాలను అధ్యక్షుడు నోబోవా ఆదేశించారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. పోర్ట్సిటీలోని టీసీ టెలివిజన్ స్టూడియోలో తుపాకులు, గ్రెనేడ్లతో దుండగులు దాడికి పాల్పడిన దరమిలా అధ్యక్షుడు ఈ ప్రకటన చేశారు. కాగా స్టూడియోలో తుపాకీ కాల్పుల మధ్య ఒక మహిళ.. ‘షూట్ చేయవద్దు, దయచేసి కాల్చకండి’ అని వేడుకుంది. అయితే ముష్కరులు వార్తలు చదువుతున్న వ్యక్తితో పాటు అక్కడున్న ఇతర ఉద్యోగులను నేలపై కూర్చోమని ఆదేశించి, తలపై తుపాకీ ఎక్కుపెట్టారు. తమ వద్ద బాంబులు ఉన్నాయని బెదిరించారు. ఈ ఉదంతమంతా టీవీ ఛానెల్లో ప్రత్యక్ష ప్రసారమైంది. లైవ్లో తుపాకీ శబ్దాలూ వినిపించాయి. దీనిని ప్రేక్షకులు ఆసక్తిగా వీక్షించారు. సుమారు 30 నిమిషాల గందరగోళం తర్వాత అధికారులు స్టూడియోలోకి ప్రవేశించడం కనిపించింది. దీనికి ముందు గ్యాంగ్స్టర్లు పోలీసు అధికారులను కిడ్నాప్ చేశారు. అధ్యక్షుడు నోబోవా ప్రకటించిన 60 రోజుల అత్యవసర పరిస్థితి, రాత్రిపూట కర్ఫ్యూకి నిరసనగా గ్యాంగ్స్టర్లు దేశంలోని పలు నగరాల్లో పేలుడు పదార్థాలతో విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నించారు. కాగా 36 ఏళ్ల నోబోవా దేశంలో మాదకద్రవ్యాల సంబంధిత నేరాలు, హింసకు వ్యతిరేకంగా పోరాడతానని డేనియల్ నోబోవా ప్రతిజ్ఞ చేసిన దరిమిలా అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. -
అర్జెంటీనాను గెలిపించిన మెస్సీ
2026 ఫుట్బాల్ ప్రపంచకప్ టోర్నమెంట్ క్వాలిఫయింగ్ మ్యాచ్లు మొదలయ్యాయి. బ్యూనస్ ఎయిర్స్లో శుక్రవారం జరిగిన దక్షిణ అమెరికా జోన్ క్వాలిఫయింగ్ మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా 1–0తో ఈక్వెడార్ జట్టును ఓడించింది. 83 వేల మంది ప్రేక్షకులు హాజరైన ఈ మ్యాచ్లో ఆట 78వ నిమిషంలో కెపె్టన్ మెస్సీ చేసిన గోల్తో అర్జెంటీనా ఆధిక్యంలోకి వెళ్లింది. 176 అంతర్జాతీయ మ్యాచ్ల్లో మెస్సీకిది 104వ గోల్ కావడం విశేషం. వరల్డ్ కప్ క్వాలిఫయింగ్ టోర్నీల్లో మెస్సీకిది 29వ గోల్. 29 గోల్స్తో లూయిస్ స్వారెజ్ (ఉరుగ్వే) పేరిట ఉన్న రికార్డును మెస్సీ సమం చేశాడు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్ల్లో కొలంబియా 1–0తో వెనిజులాపై గెలుపొందగా... పరాగ్వే–పెరూ మ్యాచ్ 0–0తో ‘డ్రా’ అయింది. 2026 ప్రపంచకప్ను అమెరికా, మెక్సికో, కెనడా దేశాలు సంయుక్తంగా నిర్వహించనున్నాయి. మొత్తం 48 దేశాలు బరిలోకి దిగుతాయి. -
ఈక్వెడార్ ఎన్నికల నేపధ్యంలో వరుస హత్యలు
క్విటో: త్వరలో జరగనున్న ఈక్వెడార్ రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో రాజకీయ నాయకుల వరుస హత్యలు అక్కడ సంచలనం సృష్టిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితమే సిటిజన్ రివొల్యూషన్ పార్టీ రాష్ట్రపతి అభ్యర్థి ఫెర్నాండో విల్లావిసెన్షియా ప్రచార కార్యక్రమం నిర్వహిస్తుండగా కాల్చి చంపబడ్డారు. ఆ సంఘటన మరువక ముందే అదే పార్టీకి చెందిన మరో నాయకుడు పెడ్రో బ్రయోన్స్ ను ఆయన ఇంటి ముందే కాల్చి చంపారు దుండగులు. పెడ్రో బ్రయోన్స్ ఎస్మెరాల్డాస్ ప్రావిన్సులోని కొలంబియా సరిహద్దు ఉద్యమంలో కీలక నాయకుడు. ఈ హత్య అనంతరం సిటిజన్ రివొల్యూషన్ పార్టీ మరో రాష్ట్రపతి అభ్యర్థి లూయిసా గొంజాలెజ్ బ్రయోన్స్ కు నివాళులు అర్పిస్తూ.. పెడ్రో బ్రయోన్స్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రస్తుతం ఈక్వెడార్లో రక్తం ఏరులై పారుతోందని చెబుతూ హత్యా రాజకీయాలకు పాల్పడుతున్న ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇప్పుడున్న ప్రభుత్వం నేర సామ్రాజ్యాన్ని విస్తరించిందని చెబుతూనే ఇదొక పనికిమాలిన ప్రభుత్వంగా ఆమె వర్ణించారు. ఆగస్టు 9న సిటిజన్ రివొల్యూషన్ పార్టీ అధ్యక్షుడి రేసులో ఉన్న ఫెర్నాండో విల్లావిసెన్షియాను అత్యంత కిరాతకంగా చంపబడ్డారు. క్విటో నగరంలో ఒకచోట ప్రచార కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని తన వాహనంలోకి వెళ్తుండగా దుండగులు ఆయనపై కాల్పులు జరిపారు. చుట్టూ సెక్యూరిటీ వలయం ఉండగానే హత్య జరగడం విశేషం. అవినీతికి వ్యతిరేకంగా విల్లావిసెన్షియా తన స్వరాన్ని చట్టసభల్లో చాలా బలంగా వినిపించేవారు. ఇదే క్రమంలో ఈసారి జరగబోయే ఎన్నికల్లో విల్లావిసెన్షియా అధ్యక్షుడి రేసులో ముందువరసలో ఉన్నారు. కానీ ఎన్నికలు జరిగే లోపే ప్రత్యర్థి తుపాకీ గుళ్లకు బలయ్యారు. ఎన్నికల తంతు ముగిసేలోపు ఇంకెన్ని హత్యలు చూడాల్సి వస్తుందోనని ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటూ రోజులు వెళ్లదీస్తూ ఉన్నారు. ఇది కూడా చదవండి: Viral Video: కూతురి గదిలోకి దూరిన బాయ్ఫ్రెండ్.. ఏం చేశారంటే? -
3000 మీ ఎత్తులో ఆగిపోయిన కేబుల్ కార్.. తర్వాత ఏమైందంటే..
ఈక్వెడార్: ప్రపంచంలోనే ఎత్తైన ఈక్వెడార్ క్విటో కేబుల్ కార్ సాంకేతిక లోపం కారణంగా మధ్యలోనే ఆగిపోయింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న సుమారు 75 మంది గంటల తరబడి అందులో బిక్కుబిక్కుమంటూ గడిపారు. వెంటనే స్పందించిన సహాయక బృందాలు గంటల పాటు శ్రమించి అందులో ప్రయాణిస్తున్న మొత్తం 75 మందిని సురక్షితంగా కిందికి చేర్చగలిగారు. గాల్లో కేబుల్ కార్ ప్రయాణమంటే సాహసం చేస్తున్నామన్న భావం తోపాటు వినోదం కూడా గ్యారెంటీ. మరి అలాంటి కేబుల్ కార్ లో ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తి ప్రమాదం జరిగితే వినోదం కాస్తా విషాదంగా మారిపోతుంది. ఈక్వెడార్ కేబుల్ కార్ లో అచ్చంగా అలాంటి పరిస్థితే నెలకొంది. ఈక్వెడార్ క్విటో కేబుల్ కార్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనది. ఇది సముద్ర మట్టానికి సుమారు మూడు వేల నుండి నాలుగు వేల మీటర్ల ఎత్తులో రెండు టెర్మినల్స్ మధ్యలో ప్రయాణిస్తుంది. శుక్రవారం 75 మంది పర్యాటకులతో ప్రయాణిస్తున్న ఈ కేబుల్ కార్ లో సాంకేతిక సమస్య తలెత్తి మధ్యలోనే ఆగిపోయింది. ఏం జరిగిందో తెలియక అందులోని వారు అలాగే ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని గడిపారు. Atrapados sin salida. Falla eléctrica en las cabinas del Teleférico de Quito dejó a 20 personas en el aire. Luego de cinco horas, los Bomberos comenzaron a evacuar a los atrapados. El alcalde Pabel Muñoz llegó al sitio preocupado por lo que estaba pasando. pic.twitter.com/UWa4aEphnS — LaHistoria (@lahistoriaec) July 7, 2023 సుమారు పది గంటల నిరీక్షణ తర్వాత సహాయక బృందాలు గాల్లో కార్ ఆగిన చోటికి చేరుకొని 65 మందిని తాడుల సాయంతో క్షేమంగా కిందికి దించారు. మరో పది మంది మాత్రం కేబుల్ కార్ తిరిగి ప్రారంభమైన తర్వాత సురక్షితంగా కిందికి వచ్చారు. వీడియోలో ప్రయాణికులను రక్షిస్తున్న దృశ్యాలను చూడవచ్చు. Este final nadie se lo esperaba. Así fue la evacuación de las personas atrapadas durante varias horas en las cabinas del Teleférico de Quito. pic.twitter.com/C9LHaI6Zqw — LaHistoria (@lahistoriaec) July 7, 2023 ఇది కూడా చదవండి: రైలుకు వేలాడుతూ బిత్తిరి చర్య.. పట్టుతప్పితే అంతే సంగతులు! -
పాపం.. బతికిందని సంతోషించేలోపే గుండె ఆగింది
ఒంట్లో ఓపికలేకున్నా.. బలానంతా కూడదీసుకుని, తానింకా బతికే ఉన్నానని శవపేటిక మూతను తట్టిమరీ కొన ఊపిరితో బయటపడిన బామ్మ ఉదంతం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించింది. అయితే.. బతికిందని సంతోషించేలోపే.. అదీ వారంలోపే ఆమె ఉదంతం విషాదాంతం అయ్యింది. ఈక్వెడార్ బామ్మ బెల్లా మోంటోయా(76) కార్డియాక్ అరెస్ట్తో కన్నుమూసినట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ అధికారికంగా ప్రకటించింది. ఆస్పత్రిలో ఉన్నంత సేపు ఆమె ఆరోగ్యం గురించి ఆరా తీస్తూనే ఉన్నామని, వారం తర్వాత(జూన్ 16న) ఆమె మృతి చెందినట్లు ఆరోగ్యశాఖ తన ప్రకటనలో పేర్కొంది. ఇక తల్లి మృతిపై గిల్బర్ట్ బార్బెరా స్పందిస్తూ.. తన తల్లి శాశ్వత నిద్రలోకి జారుకున్నట్లు ప్రకటించాడు. చనిపోయిందనుకుని భావించి జూన్ 9వ తేదీన శవపేటికలో ఉంచి సమాధి చేయబోతుండగా.. శవపేటికను బాది ఆమె ప్రాణాలతో బయపడి అందరినీ ఆశ్చర్యపర్చింది. సుమారు ఐదు గంటలపాటు ఆ బామ్మ శవపేటికలోనే ఉండిపోయింది. శ్వాస అందకపోవడంతో ఇబ్బంది పడిన ఆమెను అప్పటికప్పుడే ఆంబులెన్స్లో ఆస్పత్రికి తరలించారు. catalepsy(కండరాలు బిగుసుకుపోవడం) వల్ల ఆమె స్పృహ కోల్పోయి కదల్లేని స్థితిలో అచేతనంగా ఉండిపోయిందని, అలా ఆమె మరణించిందని కుటుంబ సభ్యులు భావించి ఉంటారని ఆ టైంలో వైద్య నిపుణులు పేర్కొన్నారు. అప్పటి నుంచి ఆమె ఐసీయూలో చికిత్స పొందుతూ.. వారం తర్వాత గుండెపోటు రావడంతో కన్నుమూసిందామె. ఏ స్మశానవాటికలో ఆమె బతికిందని సంతోషించారామె.. అదే చోట ఆమెను మళ్లీ ఇప్పుడు సమాధి చేశారు. Video Credits: Associated Press ఇదీ చదవండి: రక్తం కారుతున్నా లెక్క చేయకుండా.. -
రక్తం కారుతున్నా లెక్క చేయకుండా విమానాన్ని నడిపిన పైలెట్
ఈక్వెడార్: లాస్ రోస్ ప్రాంతంలో ఓ విమానం పైలెట్ కు వింత అనుభవం ఎదురైంది. విధి నిర్వహణలో విమానాన్ని నడుపుతున్న పైలెట్ కాక్ పిట్ లోకి ఒక పెద్ద పక్షి విండ్ షీల్డుని పగులగొట్టుకుని పొరపాటున లోపలి వచ్చింది. కాక్ పిట్ లో ఇరుక్కున్న ఆ పక్షి తన కాళ్లతో పొడుస్తున్నా, మొహమంతా రక్తం కారుతున్నా ఏమాత్రం లెక్కచేయని పైలెట్ అలాగే విమానాన్ని నడిపాడు. మొహమంతా రక్తం.. లాస్ రోస్ ప్రాంతంలో ఆకాశంలో సుమారు 10 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న ఒక విమానం పైలెట్ క్యాబిన్లోకి భారీ పక్షి ఒకటి విండ్ షీల్డ్ ను బద్దలుగొట్టుకుని మరీ లోపలికి చొచ్చుకుని వచ్చింది. అద్దంలో ఇరుక్కుపోయిన ఆ పక్షి సగభాగం లోపల వేలాడుతూ ప్రాణాలు కాపాడుకోవటానికి విశ్వప్రయత్నాలు చేసి చివరికి రక్తమోడుతూ గాల్లోనే ప్రాణాలు విడిచింది. దీంతో పైలెట్ ఏరియల్ వాలియంట్ రక్తమోడుతున్న తన ముఖాన్ని, కాక్ పిట్ లోకి వచ్చిన ఆ భారీ పక్షిని వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్లో వైరల్ గా మారింది. రాబందు జాతి పక్షి.. అంత ఎత్తులో ఎగిరే ఈ పక్షిని ఆండియాన్ కాండోర్ పక్షిగా గుర్తించారు. ఇది దక్షిణ అమెరికా కాథర్టిడ్ రాబందు జాతికి చెందినదని గుర్తించారు. దీని రెక్కలు సుమారుగా పది అడుగుల వెడల్పు ఉంటాయని ఇవి భూమికి 21 వేల అడుగుల ఎత్తులో ఎగురుతుంటాయని అక్కడి స్థానికులు చెబుతున్నారు. Pilot safely lands his plane after a huge bird struck his windshield in the Los Ríos Province, Ecuador. Ariel Valiente was not injured during the incident. pic.twitter.com/Rl3Esonmtp — Breaking Aviation News & Videos (@aviationbrk) June 15, 2023 ఇది కూడా చదవండి: ఆ నరమాంస భక్షకిని భద్రపరుస్తారట! -
'నేను డేంజర్లో ఉన్నా' అని లవర్కు మెసేజ్.. కాసేపటికే ముగ్గురూ బీచ్లో..
క్విటో: బీచ్లో సరదాగా గడిపేందుకు వెళ్లిన ముగ్గురు యువతులు దారుణ హత్యకు గురయ్యారు. చనిపోవడనికి ముందు తమ ప్రియమైన వారికి వీరు పంపిన సందేశాలు కన్నీరు పెట్టిస్తున్నాయి. తాము డేంజర్లో ఉన్నామని, ఎదో జరగబోతుందని ముందే పసిగట్టి వారు మెసేజ్లు పంపిన కాసేపటికే కిరాతకంగా హత్యకు గురయ్యారు. దండగులు వీరి గొంతులు కోసి చిత్ర హింసలకు గురి చేసి హతమార్చారు. ఈక్వెడార్లోని క్వినెడే సమీపంలో ఎస్మరాల్డస్ బీచ్లో ఏప్రిల్ 5న జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. ముగ్గురు యువతుల పేర్లు.. డెన్నిసి రేనా(19), యులియానా మాసియస్(21), నయేలి తాపియా(22). ఏప్రిల్ 4న అదృశ్యమైన వీరు ఆ మర్నాడే దారుణంగా హత్యకు గురయ్యారు. మంచి స్నేహితులైన వీరు బీచ్కు వెళ్లి సరదాగా గపడపాలని ప్లాన్ చేసుకున్నారు. అన్ని ఏర్పాట్లు చేసుకుని ఏప్రిల్ 4న అనుకున్నట్టే బీచ్కు వెళ్లారు. స్విమ్ సూట్ లాంటి దుస్తులు ధరించి అక్కడే హాయిగా సేదతీరారు. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు గానీ ఈ ముగ్గురూ ఊహించని ప్రమాదంలో పడ్డారు. ఎవరో వారిని వెంబడించారు. దీంతో తమకు ఏదో జరగబోతుందని భావించి తమ ప్రియమైన వారికి సందేశాలు పంపారు. అయితే మెసేజ్లు రాత్రి 11:10 గంటల సమయంలో పంపడంతో కుటుంబసభ్యులు తీవ్ర భయాందోళన చెందారు. వారు అనుకున్నట్టే.. జరగకూడని ఘటన జరిగింది. నయేలి, డెన్నిసి చనిపోయే ముందు నయేలి తన సోదరికి వాట్సాప్ సందేశం పంపింది. 'ఏదో జరగబోతుంది అని నాకు అనిపిస్తుంది. అందుకే మెసేజ్ చేస్తున్నా' అని నయేలి మెసేజ్ చేసింది. సోదరి వెంటనే ఆమెకు కాల్ చేయగా.. స్విచాఫ్ వచ్చింది. నయేలికి పెళ్లైంది. నాలుగేళ్ల కుమార్తె కూడా ఉంది. దీంతో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మరో యువతి డెన్నిస్ హత్యకు గురికావడానికి ముందు తన బాయ్ఫ్రెండ్కు సందేశం పంపింది. 'ఏదో జరగబోతుందని నాకు అన్పిస్తుంది. ఒకవేళ నాకేదైనా జరిగితే.. ఒక్క విషయం గుర్తుంచుకో.. ఐ లవ్ యూ వెరీ మచ్' అని మెసేజ్ చేసింది. జాలర్లు చూసి.. ఆ తర్వాత కాసేపటికే ముగ్గురిని ఎవరో దారుణంగా హత్య చేశారు. బీచ్లో అర్ధనగ్నంగా ఉన్న వీరిని చిత్ర హింసలు పెట్టి పదునైన ఆయుధాలతో గొంతులు కోశారు. ఆ తర్వాత శవాలను పూడ్చిపెట్టారు. ఏప్రిల్ 5న చేపల వేటకు వెళ్లిన జాలర్లు.. ఓ కుక్క వీరి మృతదేహాల వద్ద తవ్వడం చూసి అక్కడకు వెళ్లగా శవాలు కన్పించాయి. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఈ హత్యలు ఎవరు చూసి ఉంటారనే విషయంపై పోలీసులకు ఇంకా ఎలాంటి క్లూ లభించలేదు. ముగ్గురిలో ఓ యువతి బీచ్కు వెళ్లినరోజు సమీపంలోని ఓ హోటల్లో గడిపింది. దీంతో అధికారులు క్లూ కోసం సీసీటీవీ రికార్డులను పరిశీలిస్తున్నారు. ముగ్గురిలో ఇద్దరు మంచి భవిష్యత్ కోసం వేరే దేశం వెళ్లి స్థిరపడాలనుకున్నారని, కానీ ఇంతలోనే ఇలా ప్రాణాలు కోల్పోతారని ఊహించలేదని బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. చదవండి: వేరొకరి ఇంటి డోర్బెల్ మోగించాడని చంపేందుకు యత్నం..చివరికి.. -
Earthquake: ఈక్వెడార్లో భారీ భూకంపం.. 14 మంది మృతి..
పెరు, ఈక్వెడార్లోని గయాస్ తీరప్రాంతంలో శనివారం భారీ భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై తీవ్రత 6.8గా నమోదైంది. 66 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. భూకంపం ధాటికి చాలా ఇళ్లు, భవనాలు నేలమట్టం అయ్యాయి. వాహనాలు ధ్వంసమయ్యాయి. ముఖ్యంగా మచాలా, క్యుయెన్సా నగరాల్లో భూకంప ప్రభావం ఎక్కువగా ఉంది. భూప్రకంపనల ధాటికి జనం ప్రాణభయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం కారణంగా మొత్తం 14 మంది చనిపోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈక్వెడార్ అధ్యక్షుడు గ్విల్లెర్మో భూకంప ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. మచాలాలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. ఇతర నగరాలను కూడా సందర్శిస్తానని చెప్పారు. చదవండి: కోవిడ్ డేటాను చైనా తొక్కిపెడుతోంది -
కూతుళ్ల కోసం ‘తల్లి’గా మారాడు!
క్విటో(ఈక్వెడార్): కన్న కూతుళ్లంటే ఆ తండ్రి ఎంతో ఇష్టం. విడిపోయిన భార్య వద్ద ఉన్న ఇద్దరు కూతుళ్ల కస్టడీ తనకే ఇవ్వాలంటూ కోర్టులో కేసు వేశాడు. అయితే, తల్లి వద్దే కూతుళ్లు ఉండాలంటుంది చట్టం. అందుకే, కూతుళ్లకు తల్లి ప్రేమను పంచేందుకు దుస్సాహసమే చేశాడు ఆ తండ్రి. ఏకంగా లింగమార్పిడి చేసుకుని మహిళగా మారాడు. ఇప్పుడైనా చట్టం కూతుళ్లను తన వద్దకే పంపిస్తుందని ఆశపడుతున్నాడు..! ఈ ఘటన దక్షిణ అమెరికా దేశం ఈక్వెడార్లో చోటుచేసుకుంది. న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రకారం.. రెనె సలినాస్ రమోస్(47), అతని భార్య విడిపోయారు. చట్టం ప్రకారం వీరి సంతానం తల్లి సంరక్షణలోనే ఉండాలి. మహిళ మాత్రమే బిడ్డలకు ప్రేమను అందిస్తుందని చట్టం అంటోంది. భార్య ఐదు నెలలుగా కూతుళ్లను కలుసుకునే అవకాశం లేకుండా చేస్తోందని అంటున్నాడు. తనకెంతో ఇష్టమైన కూతుళ్లు దూరం కావడం తట్టుకోలేని రమోస్ మరో మార్గం ఆలోచించాడు. ఏకంగా లింగమార్పిడి చేయించుకుని, మహిళగా మారాడు. అధికార రికార్డుల్లో మహిళగానే ఉన్నా, నిత్య జీవితంలో పురుషుడిగానే చెలామణి అవుతున్నాడు. మహిళగా మారినందున, కోర్టు కేసు గెలుస్తాననే నమ్మకంతో ఉన్నాడు. తల్లి వద్ద ఇబ్బందులు పడుతున్న తన బిడ్డలకు తల్లిగా మారుతానంటున్నాడు. ఈక్వెడార్ ఎల్జీబీటీఐ హక్కుల సంస్థలు మాత్రం రమోస్ చర్యపై మండిపడుతున్నాయి. -
'నేను అమ్మనయ్యాను..' కూతుళ్ల కోసం లింగాన్ని మార్చుకున్న తండ్రి..
కన్నకూతుళ్లను దక్కించుకోవడం కోసం ఓ వ్యక్తి తన లింగాన్ని మార్చుకున్నాడు. చట్టపరంగా పోరాటం చేసి ఐడీ కార్డులో మగ నుంచి ఆడగా మారాడు. ఈక్వేడార్లో ఈ ఘటన జరిగింది. చట్టపరంగా లింగాన్ని మార్చుకున్న ఈ వ్యక్తి పేరు రినె సలినాస్ రామోస్(47). భార్యతో విడిపోయాడు. అయితే ఈ దేశ చట్టాల ప్రకారం పిల్లలు తల్లిదగ్గరే ఉండాలనే నిబంధన ఉంది. కానీ తన కూతుళ్లు తల్లి వద్ద సంతోషంగా లేరని, తనకు అప్పగించాలని రామోస్ కోర్టును ఆశ్రయించాడు. న్యాయస్థానం అందుకు ఒప్పుకోలేదు. దీంతో ఐడీ కార్డులో తన లింగాన్ని పురుషుడి నుంచి స్త్రీగా మార్చుకున్నాడు రామోస్. చట్టపరంగా అనుమతులు తీసుకున్నాడు. ఇప్పుడు తాను కూడా తల్లిని అయ్యానని, పిల్లలను తనకే అప్పగించాలని రామోస్ కోర్టును కోరాడు. అయితే న్యాయస్థానం దీనిపై తుది తీర్పు వెల్లడించాల్సి ఉంది. రామోస్ తన కూతుళ్ల కోసమే లింగాన్ని మార్చుకున్నప్పటికీ దేశంలోని ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. తాము సర్జరీ చేయించుకొని ఆడ నుంచి మగగా, పురుషుడి నుంచి స్త్రీగా మారితే అధికారిక గుర్తింపు లభించేందుకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, అలాంటిది ఓ పురుషుడు మాత్రం సులభంగా మహిళగా లింగాన్ని మార్చుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అయితే తాను చేసిన దాంట్లో దురుద్దేశం ఏమీ లేదని రామోస్ పేర్కొన్నాడు. కేవలం తన కూతుళ్ల కోసమే ఇలా చేసినట్లు చెప్పాడు. పురుషులకు కూడా తమ పిల్లలపై హక్కు కల్పించేందుకే తాను పోరాడుతున్నట్లు వివరణ ఇచ్చాడు. చదవండి: బీజింగ్లో కోవిడ్ బీభత్సం -
FIFA World Cup Qatar 2022: 20 ఏళ్ల తర్వాత...
దోహా: రెండు దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సెనెగల్ జట్టు ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నీలో రెండోసారి నాకౌట్ దశకు అర్హత సాధించింది. మంగళవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ చివరి రౌండ్ లీగ్ మ్యాచ్లో సెనెగల్ 2–1 గోల్స్ తేడాతో ఈక్వెడార్ జట్టును ఓడించింది. ఆరు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి తదుపరి దశకు అర్హత పొందింది. సెనెగల్ తరఫున ఇస్మాయిల్ సార్ (44వ ని.లో), కెప్టెన్ కలిదు కులిబాలి (70వ ని.లో) ఒక్కో గోల్ చేయగా... ఈక్వెడార్కు మోజెస్ కైసెడో (67వ ని.లో) ఏకైక గోల్ అందించాడు. మూడోసారి ప్రపంచకప్లో ఆడుతున్న సెనెగల్ తొలిసారి బరిలోకి దిగిన 2002లో క్వార్టర్ ఫైనల్కు చేరింది. ఆ తర్వాత వరుసగా మూడు ప్రపంచకప్లకు అర్హత పొందలేకపోయింది. మళ్లీ 2018లో రెండో సారి ఈ మెగా ఈవెంట్లో ఆడిన సెనెగల్ గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. ఈసారి సమష్టిగా రాణించి తొలి అడ్డంకిని అధిగమించి ప్రిక్వార్టర్ ఫైనల్కు చేరింది. తప్పనిసరిగా గెలిస్తేనే నాకౌట్ దశకు చేరే అవకాశం ఉండటంతో సెనెగల్ ఆటగాళ్లు ఆద్యంతం దూకుడుగా ఆడారు. ‘డ్రా’ చేసుకున్నా నాకౌట్ దశకు చేరే చాన్స్ ఉండటంతో ఈక్వెడార్ కూడా వెనక్కి తగ్గలేదు. సాధ్యమైనంత ఎక్కువసేపు తమ ఆధీనంలో బంతి ఉండేలా ఈక్వెడార్ ఆటగాళ్లు ప్రయత్నించారు. సెనెగల్ ఆటగాళ్లను మొరటుగా అడ్డుకునేందుకు వెనుకాడలేదు. ఈ క్రమంలో 44వ నిమిషంలో ‘డి’ ఏరియాలో సెనెగల్ ప్లేయర్ ఇస్మాయిల్ సార్ను ఈక్వెడార్ డిఫెండర్ హిన్కాపి తోసేశాడు. దాంతో రిఫరీ మరో ఆలోచన లేకుండా సెనెగల్కు పెనాల్టీ కిక్ను ప్రకటించాడు. పెనాల్టీని ఇస్మా యిల్ సార్ గోల్గా మలిచాడు. దాంతో విరామ సమయానికి సెనెగల్ 1–0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో అర్ధభాగంలో ఈక్వెడార్ స్కోరును సమం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. 67వ నిమిషంలో లభించిన కార్నర్ను ప్లాటా ‘డి’ ఏరియాలోకి కొట్టాడు. దానిని టోరెస్ హెడర్ షాట్తో ఒంటరిగా ఉన్న మోజెస్ కైసెడో వద్దకు పంపించగా అతను గోల్గా మలిచాడు. దాంతో స్కోరు 1–1తో సమం అయింది. అయితే ఈక్వెడార్కు ఈ ఆనందం మూడు నిమిషాల్లోనే ఆవిరైంది. 70వ నిమిషంలో సెనెగల్ జట్టుకు లభించిన కార్నర్ను గుయె ‘డి’ ఏరియాలోకి కొట్టగా ఈక్వెడార్ ప్లేయర్ టోరెస్కు తగిలి బంతి గాల్లో లేచింది. అక్కడే ఉన్న కెప్టెన్ కులిబాలి బంతిని గోల్పోస్ట్లోనికి పంపించి సెనెగల్కు 2–1తో ఆధిక్యం అందించాడు. ఆ తర్వాత సెనెగల్ చివరివరకు ఆ ఆధిక్యాన్ని కాపాడుకుంది. నెదర్లాండ్స్ 11వసారి... మరోవైపు ఆతిథ్య ఖతర్ జట్టుతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో నెదర్లాండ్స్ 2–0తో గెలిచి ఏడు పాయింట్లతో గ్రూప్ ‘ఎ’ టాపర్గా నిలిచి 11వసారి ప్రపంచకప్లో ప్రిక్వార్టర్ ఫైనల్ దశకు అర్హత సాధించింది. నెదర్లాండ్స్ తరఫున కొడి గాప్కో (26వ ని.లో), ఫ్రాంకీ డి జాంగ్ (49వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. ఈ టోర్నీలో గాప్కోకిది మూడో గోల్ కావడం విశేషం. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5101504615.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
FIFA World Cup Qatar 2022: నెదర్లాండ్స్, ఈక్వెడార్ మ్యాచ్ ‘డ్రా’
దోహా: ఫుట్బాల్ ప్రపంచకప్లో మరో మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. నెదర్లాండ్స్, ఈక్వెడార్ జట్ల మధ్య శుక్రవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్ 1–1తో ‘డ్రా’ అయింది. ఈ మ్యాచ్ ఫలితంతో గ్రూప్ ‘ఎ’లో ఉన్న ఆతిథ్య ఖతర్ జట్టు ప్రస్థానం గ్రూప్ దశలోనే ముగిసింది. ఆట ఆరో నిమిషంలో కోడి గాప్కో గోల్తో నెదర్లాండ్స్ 1–0తో ఆధిక్యంలో నిలిచింది. విరామ సమయం వరకు ఆధిక్యంలో నిలిచిన ‘ఆరెంజ్ జట్టు’ రెండో అర్ధభాగంలో తడబడింది. ఆట 49వ నిమిషంలో ఈక్వెడార్ ప్లేయర్ ఎనెర్ వాలెన్సియా గోల్ సాధించి స్కోరును 1–1తో సమం చేశాడు. ఒక విజయం, ఒక ‘డ్రా’తో ప్రస్తుతం గ్రూప్ ‘ఎ’లో నెదర్లాండ్స్, ఈక్వెడార్ నాలుగు పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాయి. తమ గ్రూప్ చివరి లీగ్ మ్యాచ్లను ఈ రెండు జట్లు ‘డ్రా’ చేసుకుంటే నాకౌట్ దశకు (ప్రిక్వార్టర్ ఫైనల్స్) అర్హత సాధిస్తాయి. -
FIFA World Cup Qatar 2022: వహ్వా! అయ్యో ఆతిథ్య జట్టు...
అట్టహాసంగా ప్రారంభోత్సవం ‘మనల్నందరినీ కలిపే ఈ క్షణం మనందరినీ విడదీసే ఘటనలకంటే ఎంతో గొప్పది... అయితే ఇది ఈ ఒక్క రోజుకు పరిమితం కాకుండా శాశ్వతంగా నిలిచిపోయేందుకు ఏమేం చేయాలి’... హాలీవుడ్ స్టార్ మోర్గన్ ఫ్రీమన్ గంభీర స్వరంతో ప్రేక్షకులను అడిగిన ఈ ప్రశ్నతో విశ్వ సంబరానికి విజిల్ మోగింది. ఖతర్ దేశం అంచనాలకు తగినట్లుగా అద్భుతమైన ప్రారంభోత్సవ వేడుకలతో ప్రపంచ అభిమానుల మనసులు దోచింది. తమ దేశ సంస్కృతిని ప్రతిబింబించేలా కార్యక్రమాలను రూపొందించారు. అల్ బైత్ స్టేడియం మధ్యలో ఫ్రీమన్ ఆద్యంతం తన వ్యాఖ్యానంతో రక్తి కట్టిస్తుండగా... భిన్నమైన సాంస్కృతిక, సంప్రదాయ కార్యక్రమాలు కట్టి పడేశాయి. ప్రపంచకప్ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న ఖతర్ ‘యూ ట్యూబర్’ ఘనిమ్ అల్ ముఫ్తాతో ఫ్రీమన్ సంభాషణ ఆసక్తికరంగా సాగింది. కాడల్ రిగ్రెషన్ సిండ్రోమ్తో బాధపడుతూ ఘనిమ్ నడుము కింది భాగం మొత్తం చచ్చుబడిపోయింది. ఈ ప్రపంచంలో ఉన్న భిన్నత్వం గురించి ఫ్రీమన్ అడగ్గా... ఖురాన్లోని కొన్ని పంక్తులతో ఘనిమ్ సమాధానమిచ్చాడు. కొరియా ప్రఖ్యాత గాయకుడు జుంగ్ కూక్, ఖతర్ సింగర్ ఫహద్ అల్ కుబైసి కలిసి వరల్డ్ కప్ థీమ్ సాంగ్ ‘డ్రీమర్స్’ను ఆలాపించినప్పుడు 60 వేల సామర్థ్యం గల స్టేడియం దద్దరిల్లింది. సాంప్రదాయ కత్తి నృత్యం ‘అల్ అర్దా’ ప్రదర్శించినప్పుడు కూడా భారీ స్పందన వచ్చింది. వరల్డ్ కప్ మస్కట్ ‘లయీబ్’ను, టోర్నీలో పాల్గొంటున్న 32 దేశాల జెండాలను కూడా ఘనంగా ప్రదర్శించారు. చివరగా...ఖతర్ రాజు తమీమ్ బిన్ హమద్ అల్–థని ‘అరబ్ ప్రపంచం తరఫున అందరికీ ఈ వరల్డ్ కప్లో స్వాగతం పలుకుతున్నాం’ అంటూ మెగా టోర్నీ ప్రారంభమైనట్లు అధికారికంగా ప్రకటించడంతో కార్యక్రమం ముగిసంది. 92 సంవత్సరాల ఫుట్బాల్ ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటి వరకు ఆతిథ్య జట్టు తాము ఆడిన తొలి మ్యాచ్లో ఓడిపోలేదు. విజయం సాధించడం లేదంటే ‘డ్రా’తో సంతృప్తి పడటం జరిగింది. కానీ ఆదివారం ఈ ఆనవాయితీ మారింది. టోర్నీ చరిత్రలో తొలిసారి ఆతిథ్య జట్టు ఆడిన తొలి మ్యాచ్లోనే ఓటమి మూటగట్టుకుంది. ఈ మెగా ఈవెంట్ నిర్వహణ కోసం లక్షల కోట్లు వెచ్చించిన ఖతర్ దేశానికి తొలి మ్యాచ్ మాత్రం నిరాశను మిగల్చగా... నాలుగోసారి ప్రపంచకప్లో ఆడుతున్న ఈక్వెడార్ విజయంతో బోణీ కొట్టి శుభారంభం చేసింది. అల్ ఖోర్: గతంలో ఏనాడూ ఫుట్బాల్ ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధించలేకపోయిన ఖతర్ జట్టు ఆతిథ్య జట్టు హోదా కారణంగా తొలిసారి బరిలోకి దిగింది. ఈ మెగా టోర్నీకి సన్నాహాలు చాలా ఏళ్ల నుంచి సాగుతున్నా ఆతిథ్య జట్టు మాత్రం మైదానంలో ఆశించినస్థాయిలో మెరిపించలేకపోయింది. ఆదివారం జరిగిన గ్రూప్ ‘ఎ’ తొలి లీగ్ మ్యాచ్లో ప్రపంచ 44వ ర్యాంకర్ ఈక్వెడార్ 2–0 గోల్స్తో ప్రపంచ 50వ ర్యాంకర్ ఖతర్ జట్టును ఓడించి శుభారంభం చేసింది. ఈక్వెడార్ తరఫున నమోదైన రెండు గోల్స్ను ఇనెర్ వాలెన్సియా (16వ నిమిషంలో, 31వ నిమిషంలో) సాధించడం విశేషం. ఈ గెలుపుతో ఈక్వెడార్కు మూడు పాయింట్లు లభించాయి. గత ప్రపంచకప్నకు అర్హత సాధించడంలో విఫలమైన ఈక్వెడార్ తాజా టోర్నీలో మాత్రం ఖతర్పై అదరగొట్టే ప్రదర్శన చేసింది. గతంలో ఈ రెండు జట్ల మధ్య మూడు మ్యాచ్లు జరగ్గా... ఇరు జట్లు చెరో మ్యాచ్లో గెలిచి, మరో మ్యాచ్ను ‘డ్రా’గా ముగించాయి. అయితే ఈసారి మాత్రం ఈక్వెడార్ స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. పూర్తి సమన్వయంతో కదులుతూ ఖతర్ గోల్పోస్ట్పై తొలి నిమిషం నుంచే దాడులు చేసింది. ఆట మూడో నిమిషంలోనే ఈక్వెడార్ ఖాతా తెరిచింది. ఫెలిక్స్ టోరెస్ ఆక్రోబాటిక్ కిక్ షాట్ గాల్లోకి లేవగా వాలెన్సియా హెడర్ షాట్తో బంతిని గోల్పోస్ట్లోనికి పంపించాడు. ఈక్వెడార్ జట్టు సంబరంలో మునిగింది. అయితే ఖతర్ జట్టు గోల్పై సమీక్ష కోరింది. వీడియో అసిస్టెంట్ రిఫరీ (వీఏఆర్) టీవీ రీప్లేను పరిశీలించగా ‘ఆఫ్ సైడ్’ అని తేలింది. దాంతో రిఫరీ గోల్ ఇవ్వలేదు. అయితే ఈక్వెడార్ పట్టువదలకుండా తమ దాడులకు పదును పెట్టింది. ఫలితంగా ఖతర్ జట్టు ప్రత్యర్థి ఆటగాళ్లను నిలువరించడమే తప్ప ఎదురు దాడులు చేయలేకపోయింది. 16వ నిమిషంలో బంతితో ‘డి’ ఏరియాలోకి వచ్చిన ఈక్వెడార్ ప్లేయర్ వాలెన్సియాను ఖతర్ గోల్ కీపర్ సాద్ అల్ షీబ్ మొరటుగా అడ్డుకోవడంతో వాలెన్సియా పడిపోయాడు. ఫలితంగా రిఫరీ ఈక్వెడార్కు పెనాల్టీ కిక్ ప్రకటించగా... వాలెన్సియా ఈ పెనాల్టీని గోల్గా మలిచి ఈక్వెడార్కు 1–0 ఆధిక్యాన్ని అందించాడు. ఆ తర్వాత 31వ నిమిషంలో సహచరుడు ఏంజెలో ప్రెసియాడో క్రాస్ షాట్ను వాలెన్సియా హెడర్ షాట్తో బంతిని లక్ష్యానికి చేర్చాడు. విరామ సమయానికి ఈక్వెడార్ 2–0తో ఆధిక్యంలోకి నిలిచింది. రెండో అర్ధ భాగంలోనూ ఈక్వెడార్ జోరు కొనసాగగా...ఖతర్ జట్టుకు ప్రత్యర్థిని నిలువరించడంలోనే సరిపోయింది. ఈక్వెడార్కు మూడో గోల్ ఇవ్వకుండా ఖతర్ మ్యాచ్ను ముగించగలిగింది. -
నాకౌట్కు చేరే అవకాశాలు ఆ రెండు జట్లకే..!
ఫిఫా వరల్డ్కప్లో భాగంగా గ్రూప్ ‘ఎ’లో ఆతిథ్య ఖతర్తో పాటు నెదర్లాండ్స్, సెనెగల్, ఈక్వెడార్లు పోటీ పడుతున్నప్పటికీ నాకౌట్ అవకాశాలు డచ్, సెనెగల్ జట్లకే ఉన్నాయి. ఆసియా చాంపియన్ ఖతర్ ఆ రెండు జట్లను మించి నాకౌట్కు చేరడం అంత సులువేమీ కాదు. అయితే ఘనమైన ఆతిథ్యంతో పాటు టోర్నీలో చక్కని ప్రదర్శనతో ఆకట్టుకోవాలనే లక్ష్యంతో ఖతర్ బరిలోకి దిగుతోంది. ఈ నేపథ్యంలో ఎవరి బలాబలాలేంటో పరిశీలిద్దాం ఖతర్ ప్రపంచకప్ అత్యుత్తమ ప్రదర్శన: ఇదే తొలిసారి ఇతర ఘనతలు: ఆసియా కప్ విజేత (2019) ఫిఫా ర్యాంకు: 50 అర్హత: ఆతిథ్య హక్కులతో నేరుగా సాకర్ వరల్డ్కప్ ఆతిథ్యం కోసం ఖతర్ ప్రభుత్వం, పాలకులు తెరముందు, తెరవెనుక ఎంతో చేశారు. అయితే ఖతర్ ఫుట్బాల్ జట్టు కోసం అహర్నిశలు కృషిచేసింది మాత్రం కోచ్ ఫెలిక్స్ సాంచెజ్ మాత్రమే! స్పానిష్కు చెందిన 46 ఏళ్ల కోచ్ కృషి వల్లే 2019లో ఖతర్ ఆసియా కప్ సాధించింది. 2006 నుంచి ఆయన జట్టును సానబెడుతూ వచ్చారు. ఈ జట్టులో అక్రమ్ అఫిఫ్ కీలక ఆటగాడు. నిలకడైన ప్రదర్శనతో రాణిస్తున్నాడు. నెదర్లాండ్స్ ప్రపంచకప్ అత్యుత్తమ ప్రదర్శన: మూడు సార్లు రన్నరప్ (1974, 1978, 2010) ఇతర ఘనతలు: యూరోపియన్ చాంపియన్ (1988) ఫిఫా ర్యాంకు: 8 అర్హత: యూరోపియన్ క్వాలిఫయింగ్లో తొలిస్థానం ఈ గ్రూపులో మేటి జట్టు నెదర్లాండ్స్. ఈ సీజన్లో మంచి ఫామ్లో ఉంది. యూరోపియన్ క్వాలిఫయింగ్ టోర్నీలో గ్రూప్–జిలో అగ్ర స్థానంతో మెగా ఈవెంట్కు అర్హత పొందింది. మిడ్ఫీల్డర్ ఫ్రెంకీ డి జాంగ్ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. డిఫెండర్లలో డేలి బ్లిండ్, స్టీఫన్ డి రిజ్ ప్రత్యర్థి స్ట్రయికర్లను చక్కగా నిలువరిస్తున్నారు. దీంతో ఈ సారి ఫైనల్ చేరితే మాత్రం కప్ను చేజార్చుకునే ప్రసక్తే లేదనే లక్ష్యంతో ఉంది. సెనెగల్ ప్రపంచకప్ అత్యుత్తమ ప్రదర్శన: క్వార్టర్స్ (2002) ఇతర ఘనతలు: ఆఫ్రికన్ చాంపియన్స్ (2022) ఫిఫా ర్యాంకు: 18 అర్హత: ప్లే–ఆఫ్స్లో ఈజిప్టును ఓడించి ఈ గ్రూపు నుంచి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరే అర్హత ఉన్న రెండో జట్టు సెనెగల్. ఈ ఏడాది ఆఫ్రికన్ చాంపియన్గా నిలిచింది. స్టార్ డిఫెండర్ కలిడో కలిబేలి సారథ్యంలోని సెనెగల్ ఈసారి మెరుగైన ప్రదర్శన కనబరచాలనే పట్టుదలతో ఉంది. మిడ్ఫీల్డర్లలో ఇడ్రిసా గుయె, పేప్ గుయె, ఫార్వర్డ్లో బౌలయె డియా, హబిబ్ డైయలోలు కూడా స్థిరంగా రా>ణిస్తుండటం జట్టుకు కలిసొచ్చే అంశం. ప్రిక్వార్టర్స్ లక్ష్యంగా పెట్టుకున్న సెనెగల్ 20 ఏళ్ల క్రితంనాటి క్వార్టర్ ప్రదర్శనను మెరుగుపర్చుకోవాలనుకుంటుంది. ఈక్వెడార్ ప్రపంచకప్ అత్యుత్తమ ప్రదర్శన: ప్రిక్వార్టర్స్ (2006); ఫిఫా ర్యాంకు: 44 ఇతర ఘనతలు: కోపా అమెరికా కప్లో నాలుగో స్థానం (1959, 1993) అర్హత: దక్షిణ అమెరికా క్వాలిఫయింగ్లో నాలుగో స్థానం నెదర్లాండ్స్, సెనెగల్లతో కనీసం డ్రాతో గట్టెక్కినా అది ఈక్వెడార్ గొప్ప ప్రదర్శనే అవుతుంది. సంచలనాలు నమోదైతే తప్ప నాకౌట్ చేరడం కష్టం. అర్జెంటీనాకు చెందిన కోచ్ గుస్తావో అల్ఫారోకు అక్కడి క్లబ్ జట్లను తీర్చిదిద్దిన అనుభవంతో 2020లో ఈక్వెడార్ కోచింగ్ బాధ్యతలు చేపట్టాడు. కెప్టెన్ ఎన్నెర్ వాలెన్సియా ఈక్వెడార్ తురుపుముక్క. మేజర్ ఈవెంట్లలో 35 గోల్స్తో ఈక్వెడార్ ఆల్టైమ్ గ్రేట్ ఫుట్బాలర్లలో ఒకడిగా నిలిచాడు. –సాక్షి క్రీడావిభాగం -
FIFA World Cup: ఆ జట్ల మధ్యే తొలి పోరు.. ఏయే గ్రూపులో ఏ జట్లు అంటే!
FIFA World Cup- దోహా: ఈ ఏడాది నవంబర్ 21 నుంచి డిసెంబర్ 18 వరకు జరిగే ఫుట్బాల్ ప్రపంచకప్ టోర్నమెంట్ ‘డ్రా’ శుక్రవారం విడుదలైంది. ఆతిథ్య దేశం ఖతర్, ఈక్వెడార్ జట్ల మధ్య మ్యాచ్తో ఈ మెగా ఈవెంట్ ప్రారంభంకానుంది. తొలి రోజు నాలుగు మ్యాచ్లు ఉంటాయి. మొత్తం 32 జట్లను ఎనిమిది గ్రూప్లుగా విభజించారు. ఇప్పటికి 29 జట్లు అర్హత పొందగా... మిగతా మూడు జట్లు ప్లే ఆఫ్స్ మ్యాచ్ల ద్వారా ఖరారవుతాయి. ప్లే ఆఫ్స్లో పోటీపడనున్న జట్లకూ ‘డ్రా’లో చోటు కల్పించారు. గ్రూప్ల వివరాలు ఇలా ఉన్నాయి. గ్రూప్ ‘ఎ’: ఖతర్, ఈక్వెడార్, నెదర్లాండ్స్, సెనెగల్. గ్రూప్ ‘బి’: ఇంగ్లండ్, ఇరాన్, అమెరికా, స్కాట్లాండ్ /వేల్స్/ఉక్రెయిన్. గ్రూప్ ‘సి’: అర్జెంటీనా, సౌదీ అరేబియా, మెక్సికో, పోలాండ్. గ్రూప్ ‘డి’: ఫ్రాన్స్, డెన్మార్క్, ట్యునిషియా, యూఏఈ/ఆస్ట్రేలియా/ పెరూ. గ్రూప్ ‘ఇ’: స్పెయిన్, జర్మనీ, జపాన్, కోస్టారికా/న్యూజిలాండ్. గ్రూప్ ‘ఎఫ్’: బెల్జియం, కెనడా, మొరాకో, క్రొయేషియా. గ్రూప్ ‘జి’: బ్రెజిల్, సెర్బియా, స్విట్జర్లాండ్, కామెరూన్. గ్రూప్ ‘హెచ్’: పోర్చుగల్, ఘనా, ఉరుగ్వే, కొరియా. చదవండి: IPL 2022: రసెల్ విధ్వంసం -
'బాస్ నేను మనిషినే'.. స్టార్ ఫుట్బాలర్కు వింత అనుభవం
అర్జెంటీనా స్టార్ ఫుట్బాలర్ లియోనల్ మెస్సీకి ఒక అభిమాని నుంచి వింత అనుభవం ఎదురైంది. ఫిఫా వరల్డ్కప్ 2022 క్వాలిఫయింగ్ మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈక్వెడార్తో మ్యాచ్ ముగిసిన అనంతరం మెస్సీ అభిమాని ఒకరు ''మెస్సీ.. మెస్సీ'' అని గట్టిగా అరుస్తూ గ్రౌండ్లోకి చొచ్చుకొచ్చాడు. ఇది గమనించకుండా వెళ్తున్న మెస్సీకి అడ్డుగా వెళ్లి.. అతని భుజంపై చేయి వేసి ఒక్క సెల్ఫీ అంటూ అడిగాడు. అయితే పొరపాటు ఆ అభిమాని తన చెయ్యిని మెస్సీ మెడకు చుట్టేయడంతో ఊపిరి ఆడడం కష్టంగా మారింది. దీంతో మెస్సీ కోపంతో.. ''బాస్ నేను మనిషినే.. సెల్ఫీ కోసం నన్ను ఇబ్బంది పెట్టకు'' అంటూ అతన్ని పక్కకు నెట్టేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత సెక్యురిటీ వచ్చి అతన్ని స్టేడియం నుంచి బయటకు పంపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈక్వెడార్తో జరిగిన మ్యాచ్ను అర్జెంటీనా 1-1తో డ్రా చేసుకుంది. కాగా అర్జెంటీనాకు క్వాలిఫయింగ్లో ఇదే చివరి మ్యాచ్. ఫిఫా వరల్డ్కప్ క్వాలిఫయింగ్ టోర్నీలో మొత్తం 17 మ్యాచ్లు ఆడిన అర్జెంటీనా 11 మ్యాచ్లు గెలిచి.. ఆరు డ్రా చేసుకొని రెండో స్థానంలో నిలిచింది. కాగా అర్జెంటీనాతో పాటు బ్రెజిల్, ఉరుగ్వే, ఈక్వెడార్లు ఫిఫా వరల్డ్కప్కు అర్హత సాధించాయి. చదవండి: Manchester United: 23 ఏళ్లకే రిటైర్మెంట్.. ఎవరా ఆటగాడు? View this post on Instagram A post shared by @jossuegarzon -
జైల్లో ఘర్షణ.. 68 మంది ఖైదీలు మృతి
క్విటో: ఈక్వెడార్లోని జైలులో రెండు ముఠాల మధ్య భీకరస్థాయిలో ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో 68 మంది ఖైదీలు మృతిచెందారు. మరో 25 మంది గాయపడ్డారు. కోస్తా తీర నగరం గుయాక్విల్లో ఈ దారుణం జరిగినట్లు అధికారులు తెలిపారు. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాలతో సంబంధం ఉన్న రెండు గ్యాంగుల నడుమ దాదాపు 8 గంటలపాటు ఈ ఘర్షణ జరిగింది. తుపాకులతో కాల్పులు జరుపుకున్నట్లు తెలిసింది. జైలు అధికారులు ఎట్టకేలకు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. (చదవండి: 89 ఏళ్ల వయసు.. ఫిజిక్స్లో పీహెచ్డీ!) -
స్టార్ అథ్లెట్ అలెక్స్ క్వినెజ్ కాల్చివేత...
క్విటో: ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ చరిత్రలో ఈక్వెడార్కు తొలి పతకాన్ని అందించిన అథ్లెట్ అలెక్స్ క్వినెజ్ను దుండగులు కాల్చిచంపారు. గ్వాయకిల్ నగరంలో అతను కాలి్చవేతకు గురైనట్లు పోలీసులు తెలిపారు. 32 ఏళ్ల అలెక్స్ 2019లో దోహాలో జరిగిన ప్రపంచ చాంపియన్షిప్లో 200 మీటర్ల స్ప్రింట్లో కాంస్య పతకం సాధించాడు. టోక్యోలో జరిగిన ఒలింపిక్స్కు అర్హత సంపాదించినప్పటికీ ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) ‘ఎప్పుడు ఎక్కడ ఉన్నాడు’ అనే నిబంధన అతిక్రమించడంతో సస్పెన్షన్కు గురయ్యాడు. అథ్లెట్ మృతిపట్ల ఈక్వెడార్ అధ్యక్షుడు గులెర్మో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చదవండి: T20 World Cup 2021 Ind Vs Pak: ‘అసలేం చేశారయ్యా.. ఆ సెలక్షన్ ఏంటి?’ -
‘నేను భారత్లో అడుగుపెడితేనే కరోనా అంతం’
దక్షిణ అమెరికా ఖండంలోని ఈక్వెడార్ సమీపంలో ఓ ద్వీపంలో నివసిస్తున్న నిత్యానంద స్వామి భారతదేశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో కరోనా వైరస్ తీవ్రంగా విజృంభించడంపై ఆయన స్పందిస్తూ భారత భూభాగంలో తాను అడుగుపెడితే ఆ వైరస్ ఇక అంతమవుతుందని ప్రకటించారు. ఈ విషయాన్ని తన శిష్యులతో మాట్లాడినట్లు తెలిసింది. కరోనా పోవాలంటే తాను భారత్లో అడుగుపెట్టాలని శిష్యులకు చెప్పాడు. ‘కైలాస’ అని తనకు తాను ఓ దేశాన్ని రూపొందించుకుని అక్కడే ఉంటున్న నిత్యానంద తరచూ భారతదేశానికి సంబంధించిన అంశాలపై స్పందిస్తున్నాడు. తాజాగా భారత్లో కరోనా విజృంభణపై స్పందించాడు. భారత్ను కరోనా ఎప్పుడు విడిచిపోతుందని ఓ శిష్యుడు అడిగిన ప్రశ్నకు ‘నేను భారత భూభాగంపై ఎప్పుడు అడుగు పెడతానో అప్పుడే కరోనా అంతం అవుతుంది’ అని నిత్యానంద తెలిపారు. నిత్యానంద స్వామి లైంగిక వేధింపుల కేసుల్లో ఇరుక్కున్నాడు. అనంతరం 2019లో గుట్టుచప్పుడు కాకుండా భారత్ను విడిచి పారిపోయాడు. అనంతరం ఈక్వెడార్ సమీపంలో ఓ చిన్న దీవిని కొనుగోలు చేసుకుని దానికి ‘కైలాస’ అని పేరు పెట్టుకున్నాడు. రాజకీయాలు లేకుండా హిందూ దేశంగా రూపొందించినట్లు నిత్యానంద తెలిపారు. ఆ దేశానికి ప్రత్యేక జెండా, పాస్పోర్టు, జాతీయ చిహ్నం రూపొందించుకున్నాడు. రిజర్వ్ బ్యాంక్ కూడా ఏర్పాటుచేసుకున్నాడు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో కొన్ని దేశాల రాకపోకలపై నిషేధం విధించాడు. తన దేశాన్ని గుర్తించాలని ఐక్యరాజ్యసమితికి లేఖ కూడా రాశాడు. -
అంతరించిదనుకుంటే.. 100 ఏళ్ల తర్వాత మళ్ళీ ప్రత్యక్షం
ఓ అరుదైన తాబేలు. పేరు ఫెర్నాన్డినా జెయింట్. అంతరించిపోయింనుకున్నారు. కానీ మళ్లీ వందేళ్ల తర్వాత దర్శనమిచ్చింది. దీంతో శాస్త్రవేత్తలను ఆనందంలో మునిగితేలుతున్నారు. ఈ భూమిపై ఉన్న అనేక జీవజాతుల్లో జరిగిన అనేక మార్పులకు తాబేలు జాతి ప్రత్యక్ష సాక్షి అని శాస్త్రవేత్తలు భావిస్తుంటారు. ఒకప్పుడు ఈ జాతి తాబేళ్లు అనేక ప్రాంతాల్లో నివసిస్తూ ఉండేవి. అయితే ఇవి క్రమంగా అంతరించిపోయాయి. దీంతో ఈ జాతి తాబేలు ఇక పూర్తిగా అంతరించిపోయిందని శాస్త్రవేత్తలు భావించారు. అయితే 2019 చివరలో ఈక్విడార్కు వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్న గాలాపెగాస్ ద్వీపంలో ఈ తాబేలు కనిపించింది. ఇప్పుడు మళ్లీ కనిపించిన ఫెర్నాన్డినా జెయింట్ తాబేలును 1906లో ఆఖరిసారి చూసినట్లు రికార్డుల్లో నమోదైంది. అయితే ఇది ఫెర్నాన్డినా తాబేలా? కాదా? అనే విషయం శాస్త్రవేత్తలకు తెలియలేదు. దీంతో డీఎన్ఏ పరీక్షలకు పంపించగా తాజాగా ఫలితాలు వచ్చాయి. ఈ పరీక్షల్లో 2019లో దొరికినది ఫెర్నాన్డినా తాబేలేనని తేలడంతో శాస్త్రవేత్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. (చదవండి: వైరల్: తేనెటీగలతో సాహసం.. 21 మిలియన్ల వ్యూస్!) -
కుప్పకూలిన ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక నిర్మాణం
దక్షిణ పసిఫిక్ సముద్రంలో ఉన్న ద్వీపకల్పంలో పర్యాటకులను అమితంగా ఆకట్టుకునే ప్రసిద్ధ పర్యాటక కట్టడం కుప్పకూలిపోయింది. వైల్డ్లైఫ్ ప్రియులకు ఇది చేదువార్తే. గాలాపోగోస్ ద్వీపంలో సహజసిద్ధ రాతి కట్టడం డార్విన్ ఆర్చ్ అకస్మాత్తుగా కుప్పకూలింది. ఈ విషయాన్ని ఈక్వెడార్ పర్యాటక శాఖ అధికారికంగా ప్రకటించింది. సహజ సిద్ధ శిలా తోరణం ప్రస్తుతం రెండు స్తంభాలుగా మారి బోసిపోయి కనిపిస్తోంది. ఒకప్పుడు డార్విన్ ద్వీపంలో ఈ కట్టడం ఓ భాగంగా ఉందంట. కొన్ని వేల సంవత్సరాల అనంతరం ఆ కట్టడం నీటిలోకి చేరిపోయింది. సముద్రపు నీటి మధ్యలో ఈ ఆర్చ్ అద్భుతంగా కనిపించేంది. ఈ కట్టడానికి జీవశాస్త్రజ్ఞుడు చార్లెస్ డార్విన్ పేరు మీదుగా డార్విన్ ఆర్చ్ పేరు పెట్టారు. ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో యునెస్కో దీనికి చోటు కల్పించింది. గాలాపాగోస్ ద్వీపం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. ముఖ్యంగా అడ్వైంచర్స్, సాహసాలు చేయాలనుకున్న వారికి ఇది అనువైన ప్రాంతం. ఫొటో షూట్లకు పేరు పొందింది. డార్విన్ ఆర్చ్ కూలిపోయిందని ఈక్వెడార్ పర్యావరణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ చారిత్రక సహజ కట్టడంలో ప్రస్తుతం రెండు స్తంభాలు మాత్రమే మిగిలి ఉందని చెబుతూ ఫొటోలు విడుదల చేసింది. The famed Darwin's Arch in the Galapagos Islands has lost its top, and officials are blaming natural erosion. The collapse was reported on Monday by the Ecuadorean Environment Ministry. pic.twitter.com/QeJZW8IIqp — CBS News (@CBSNews) May 19, 2021 కూలిన అనంతరం రెండు స్తంభాలుగా నిలిచిన సహజ శిలా తోరణం ‘డార్విన్స్ ఆర్చ్’ -
ఈక్వెడార్ జైళ్లలో భారీ ఘర్షణ
క్విటో: ఈక్వెడార్లో దారుణం చోటుచేసుకుంది. ఖైదీలను సంస్కరించాల్సిన కారాగారాల్లో రక్తపాతం జరిగింది. మూడు జైళ్లలో ఖైదీల మధ్య భీకర స్థాయిలో ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో 79 మంది మరణించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. సోమవారం రాత్రి ఘర్షణ జరగ్గా, 800 మంది పోలీసులు రంగంలోకి దిగి మంగళవారం నాటికి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చినట్లు తెలిపాయి. దక్షిణ ఈక్వెడార్లోని క్యున్కా జైల్లో 34 మంది, పసిఫిక్ తీరప్రాంతంలోని గుయాక్విల్ జైల్లో 37 మంది, సెంట్రల్ సిటీ లాటకూంగా జైల్లో 8 మంది ఖైదీలు ప్రాణాలు కోల్పోయారు. అధిపత్యం కోసమే ఈ గ్రూపుల మధ్య దాడులు జరిగినట్లు తెలుస్తోంది. -
రిపోర్టర్ లైవ్ చేస్తుండగా.. గన్తో బెదిరించి దోపిడి
క్విటో: రిపోర్టర్ లైవ్ ఇస్తుండగా, ఓ దుండగుడు తుపాకీతో బెదిరించి దోపిడీ చేసిన ఘటన ఈక్వెడార్లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం..ఈనెల 12న ఈక్వెడార్లోని ఓ ఫుట్బాల్ స్టేడియం వద్ద మ్యాచ్కు సంబంధించి డైరెక్టివి స్పోర్ట్స్ చానల్కు చెందిన జర్నలిస్ట్ డియెగో ఆర్డినోలా లైవ్ రిపోర్టింగ్ చేస్తున్నారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన దుండగుడు రిపోర్టర్తో పాటు సిబ్బందిని తుపాకీతో బెదిరించి వారి వద్ద ఉన్న ఫోన్లు,డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో భయపడిపోయిన సిబ్బంది ఒకరు తన వద్ద ఉన్న వస్తువులను ఇచ్చేయడంతో, అవి తీసుకొని దుండగుడు, అతని స్నేహితుని బైక్పై పరారయ్యాడు. అయితే ఇదంతా పట్టపగలే అది కూడా లైవ్లో జరగడం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియోను జర్నలిస్ట్ డియోగో తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్గా మారింది. పలువురు నెటిజన్లు జర్నలిస్ట్తో సహా సిబ్బందికి తమ మద్దతును తెలుపుతున్నారు. ఇక దుండగుడు ముఖం గుర్తుపట్టకుండా ఉండేందుకు మాస్క్, తలపై టోపీని ధరించాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి : (నగ్నంగా ఏనుగెక్కిన మోడల్!) (Shweta Memes: ఎందుకింతలా ట్రెండవుతోంది!) Ni siquiera podemos trabajar tranquilos, esto ocurrió a las 13:00 de hoy en las afueras del Estadio Monumental. La @PoliciaEcuador se comprometió a dar con estos delincuentes. #Inseguridad pic.twitter.com/OE2KybP0Od — Diego Ordinola (@Diegordinola) February 12, 2021 -
నిత్యానంద: సొంతంగా రిజర్వ్ బ్యాంక్!
న్యూఢిల్లీ: అత్యాచారం, కిడ్నాప్ కేసులు ఎదుర్కొంటున్న వివాదాస్పద గురువు నిత్యానంద మరోసారి వార్తల్లోకి ఎక్కారు. అత్యాచార ఆరోపణలతో దేశం విడిచి పారిపోయిన నిత్యానందా తనకంటూ ప్రత్యేకంగా ఒక దేశాన్నే ఏర్పారుచుకున్నారు. దానికి కైలాసదేశం అని కూడా నామకరణం చేసిన సంగతి తెలిసిందే. అయితే వినాయక చవితి రోజు కైలాసం దేశానికి కొత్త రిజర్వు బ్యాంకు, కొత్త కరెన్సీ, కొత్త చట్టాలు ప్రారంభిస్తున్నట్లు మరోసారి నిత్యానంద సంచలన ప్రకటనలు చేశారు. దేశం విడిచి పారిపోయిన నిత్యానందకు కొత్త రిజర్వ్ బ్యాంక్, కొత్త కరెన్సీ సృష్టించడం ఎలా సాధ్యమయ్యిందో తెలియడం లేదు. అంతే కాకుండా ఆ కరెన్సీ వేరే దేశాలలో కూడా చలామణి అవుతుందని నిత్యానంద ప్రకటించారు. ఇందుకు సంబంధించి ఆ దేశాలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు కూడా తెలిపారు. అయితే ఆ దేశాలు ఏంటి అని మాత్రం ఆయన ప్రకటించలేదు. 300 పేజీలతో కూడా ఆర్థిక విధానాలను ఆయన తయారు చేశారు. వాటికన్ బ్యాంకు తరహాలోనే కైలాసా రిజర్వు బ్యాంకు కార్యకలాపాలు ఉంటాయని, అందులో ఎలాంటి తేడాలు ఉండవని చెప్పారు. భారతదేశానికి చాలా దూరంలో ఉన్న ఈక్విడార్ సమీపంలోని ఒక చిన్నదీపంలో నిత్యానంద ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆ దేశం ఎక్కడ ఉందో ఇప్పటి వరకు ఆయనకు, ఆయన అనుచరులకు తప్ప ఎవరికీ తెలియదు. భారతదేశానికి వేల కిలోమీటర్ల దూరంలోని ఈక్విడార్ సమీపంలోని ఓ చిన్న ద్వీపంలో మకాం వేసిన నిత్యానందస్వామి వినాయక చవితి రోజు ప్రపంచానికి షాక్ ఇచ్చారు. నిత్యానందస్వామితో పాటు ఆయన అనుచరులు శనివారం వినాయక చవితి సందర్బంగా రిజర్వు బ్యాంక్ ఆఫ్ కైలాసాని నిత్యానందస్వామి స్థాపించారు. అందులో కైలాసదేశం ప్రధాన మంత్రి పదవి గురించి ప్రస్తావించిన నిత్యానంద అందర్నీ ఆచ్చర్యానికి గురిచేస్తున్నారు.ఇక ఈ సందర్భంగా విడుదల చేసిన వీడియోలో నిత్యానంద తాను తాను హిందూ సంస్కర్తను కానని, పునర్జీవిని అంటూ చెప్పారు. హిందూ మతాన్ని పాటించే వారు హక్కులు కోల్పోవడం వలనే కైలాసదేశం స్థాపించానని, అక్కడ మానవత్వం ఉన్న ఎవరికైనా చోటు ఉంటుందని, ఆ దేశంలో ప్రతిఒక్కరికి జ్ఞానోదయం అవుతోందని నిత్యానంద చెప్పారు. చదవండి: ఇంతకూ నిత్యానంద కథేంటి? -
కరోనా మృతదేహం కోసం కిడ్నాప్
క్వీటో: అమెజాన్ తెగకు చెందిన గిరిజనులు కిడ్నాప్ చేసిన ఆరుగురు వ్యక్తులను విడుదల చేసినట్లు ఈక్వెడార్ ప్రభుత్వం ఆదివారం తెలిపింది. కరోనా వైరస్తో మృతి చెందిన తమ నాయకుడి మృతదేహాన్ని తమకే ఇవ్వాలనే డిమాండ్తో ఆరుగురు వ్యక్తులను గిరిజనులు కిడ్నాప్ చేశారు. ఇద్దరు పోలీసు అధికారులతో పాటు ఇద్దరు సైనికులు, సాధారణ పౌరులను పెరువియన్ సరిహద్దుకు సమీపంలోని కుమయ్ గ్రామ గిరిజన ప్రజలు గురువారం బంధించారు. (హైడ్రాక్సీక్లోరోక్విన్ ట్రయల్స్ నిలిపివేత: డబ్ల్యూహెచ్వో) అయితే ప్రభుత్వానికి, గిరిజన తెగ ప్రజలకు మధ్య జరిగిన చర్చల అనంతరం బంధించిన వారిని గిరిజనులు ఆదివారం విడుదల చేశారని ప్రభుత్వం పేర్కొంది. ‘ఆగ్నేయ ఈక్వెడార్లోని అమెజాన్ అడవిలో ఉన్న పాస్తాజా ప్రావిన్స్లో గిరిజనుల బంధీ నుంచి విడుదలైన పౌరులకు వైద్య పరీక్షలు నిర్వహించాము’ అని ఈక్వెడార్ అంతర్గత మంత్రి పౌలా రోమో ట్విటర్లో తెలిపారు. అదే విధంగా కిడ్నాప్ చేసిన బృందంలో సమారు 600 మంది గిరిజనుల ఉన్నారని పేర్కొన్నారు. (అగ్రరాజ్యంలో కరోనా తాండవం) ఇక బందీలైన పౌరులను విడిపించేందుకు పోలీసు కమాండర్ జనరల్ ప్యాట్రిసియో కారిల్లో చర్చలు జరిపారని చెప్పారు. ముందుగా గిరిజన నేతకు కారోనా సోకడంతో మరణించాడు. దీంతో ఆరోగ్యశాఖ నిబంధనలు మేరకు ఖననం చేశారు. కానీ గిరిజనులు తమ నేత పార్థివదేహం కోసం ఆరుగురు పౌరులను కిడ్నాప్ చేయడంతో ప్రభుత్వం చర్చలు జరిపింది. బంధించిన వారిని వదిలిపెట్టిన అనంతరం గిరిజన నేత మృతదేహాన్ని కుమయ్ గ్రామానికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. -
కరోనా మృతదేహాల కోసం ప్రత్యేకంగా..
బొగోటా: మహమ్మారి కరోనా వైరస్ ఎన్నోన్నో హృదయవిదారక దృశ్యాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. అంటువ్యాధి సోకి మరణించిన వారిని కుప్పలుతెప్పలుగా ఖననం చేసిన దృశ్యాలు ప్రతీ ఒక్కరిని కంటతడి పెట్టించాయి. దక్షణ అమెరికా దేశం ఈక్వెడార్లోనూ మహమ్మారి విలయం కొనసాగుతోంది. ఈ క్రమంలో కరోనాతో మరణించిన తమ వాళ్ల మృతదేహాలతో పదుల సంఖ్యలో కుటుంబ సభ్యులు వీధుల్లో నిలబడిన ఫొటోలు కొలంబియా వ్యాపారవేత్త రొడాల్ఫో గోమెజ్ను కలచివేశాయి. ఆస్పత్రి పడకలనే శవపేటికలుగా మార్చే ఆవిష్కరణకు దారిచూపాయి. ఈ విషయం గురించి రొడాల్ఫో మాట్లాడుతూ.. ‘‘ ఈక్వెడార్లోని గ్వాయేకిల్లో మృతదేహాలతో కొంతమంది వీధుల్లోకి వచ్చారు. మహమ్మారి కారణంగా అంత్యక్రియలు కూడా సరైన పద్ధతిలో నిర్వహించుకునే వీల్లేకుండా పోయింది. అందుకే శవపేటికలుగా రూపాంతరం చెందే బెడ్లను తయారుచేశాం’’అని తెలిపారు.(‘సీటు బెల్టు తీసి.. కిందకు దూకేశా’) ‘‘ఈ బెడ్లకు మెటల్ రెయింగ్స్ ఉంటాయి. కింది భాగంలో బ్రేకులతో కూడిన చక్రాలు అమర్చాం. ఇది 150 కిలోల బరువును మోయగలుగుతుంది. ఈ బయోగ్రేడబుల్ బెడ్- కఫిన్స్ 92 నుంచి 132 డాలర్ల ధరలో అందుబాటులోకి తీసుకువస్తున్నాం. దీంతో మృతదేహం నుంచి వైరస్ వ్యాపించే అవకాశం కూడా తక్కువగా ఉంటుంది’’అని పేర్కొన్నారు. తొలుత కొలంబియాలోని లెటీసియాలో ఉన్న ఓ ఆస్పత్రికి ఈ బెడ్లను విరాళంగా ఇస్తున్నామని రొడాల్పో తెలిపారు. బొగోటాలో ఉన్న తమ ఫ్యాక్టరీలో నెలకు 3 వేల బెడ్ల చొప్పున తయారు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు. కొలంబియా, ఈక్వెడార్లతో పాటు పెరూ, చిలీ, బ్రెజిల్, మెక్సిక్, యూఎస్కు వీటిని ఎగుమతి చేసేందుకు వివిధ వర్గాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొన్నారు.(అమెరికాను బ్రేక్ చేయనున్న బ్రెజిల్!) -
వీధుల్లోనే కరోనా మృతదేహాలు
-
వీధుల్లోనే కరోనా మృతదేహాలు
క్విటో: దక్షిణ అమెరికాలోని ఈక్వెడార్ దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. భౌతిక దూరం పాటించడంలో అక్కడి ప్రజలు విఫలమవ్వడంతో అత్యంత దారుణమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తోంది. కరోనా మృతదేహాలను ఖననం చేయడానికి ఎక్కువ సమయం పడుతుండటంతో ఇళ్ల ఎదుటే శవాలను రోజుల తరబడి ఉంచాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక పట్టించుకునే వారులేని వారి మృతదేహాలను రోడ్లపైనే వదిలేసి వెళుతున్నారు. ఇదే సమయంలో సాధారణ మృతదేహాల సంఖ్య కూడా ఎక్కువగా ఉండటంతో ఆసుపత్రుల ఎదుట శవాలు కుప్పలు కుప్పలుగా పేరుకుపోతున్నాయి. రోజుల తరబడి అంత్యక్రియలు చేయడానికి వేచి చూసి చివరికి చేసేదేమిలేక సముద్రాలలో కూడా శవాలను పడేస్తున్నారు. (కరోనా మృతులు న్యూయార్క్లోనే ఎందుకు ఎక్కువ?) ప్రపంచంలోనే కరోనా బాధితుల సంఖ్య ఎక్కువగా నమోదవుతున్న స్పెయిన్, ఇటలీలతో ఈక్వెడార్కు రాకపోకలు ఎక్కువగా ఉండటంతో ఈ పరిస్థితి తలెత్తగా, ఆర్థిక అసమానతలు కూడా మరోకారణంగా తెలుస్తోంది. పని చేస్తే కానీ ఆహారం దొరకని పేద వారు ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వం ఎంత చెప్పినా వారు పనుల్లోకి వెళ్లడం వైరస్ వ్యాప్తికి కారణమవుతోంది. ఇక 1.7 కోట్ల జనాభా ఉన్న ఈక్వెడార్లో ఇప్పటికే 7,466 మందికి కరోనా సోకగా 333 మంది మృతిచెందినట్టు ప్రభుత్వం పేర్కొంది. ఇక్కడ మృతుల సంఖ్య అధికారికంగా చెప్పిన దానికి కొన్ని రెట్లు అధికంగా ఉంటుందని ఆరోగ్యశాఖ సిబ్బంది చెబుతున్నారు. గ్వయాకిల్లో ఇళ్ల ఎదుటే కరోనా మృతదేహాలను ఉంచి అంత్యక్రియల కోసం రోజుల తరబడి వేచి చూస్తున్న కుటుంబ సభ్యులు -
నేను పరమశివుణ్ణి.. నన్నెవరూ టచ్ చేయలేరు!
న్యూఢిల్లీ: అత్యాచారం కేసులతో పాటు పలు ఆరోపణలు ఎదుర్కొంటూ దేశం వదిలి పారిపోయిన వివాదాస్పద స్వామీజీ నిత్యానంద.. తనను ఎవ్వరూ టచ్ చేయలేరంటూ చేసిన వ్యాఖ్యల వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆధ్యాత్మిక గురువుగా చలామణి అవుతూ అనేక అరాచకాలకు పాల్పడుతున్నాడని నిత్యానందపై ఆరోపణలున్నాయి. నిత్యానందపై ఇప్పటికే ఎన్నో కేసులున్నాయి. లెక్కలేనన్ని వివాదాలున్నాయి. కేసుల భయంతో ఎక్కడ తలదాచుకున్నాడో కూడా తెలియదు. కానీ.. తాజాగా బయటకు వచ్చిన ఓ వీడియోలో మాత్రం తనను ఎవ్వరూ టచ్ చేయలేరని నిత్యానంద పేర్కొన్నారు. ఆ వీడియోను పరిశీలిస్తే.. 'నన్ను ఎవ్వరూ టచ్ చేయలేరు.. ఏ స్టుపిడ్ కోర్టు నన్ను ప్రాసిక్యూట్ చేయలేదు.. నేను పరమశివుడిని.. నేను నిజం చెప్పగలను.. మీ ముందు నా నిజాయితీని నిరూపించుకోగలను' అంటూ తన శిష్యగణాన్ని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించాడు. అయితే, అది ఎక్కడ? ఏ సందర్భంలో మాట్లాడారు అనేది మాత్రం స్పష్టంగా తెలియదు.. కానీ, ఆ వీడియో మాత్రం వైర్గా మారిపోయింది. "No judiciary can touch me. M param shiva" : #NithyanandaSwami from an undisclosed location. pic.twitter.com/WXdZ6bGCdO — Divesh Singh (@YippeekiYay_DH) November 22, 2019 వివాదస్పద స్వామిజీ నిత్యానందకు తమ దేశం ఆశ్రయం కల్పించిందనే వార్తలపై ఈక్వెడార్ రాయబార కార్యాలయం స్పందించింది. ఆ వార్తలో ఏ మాత్రం వాస్తవం లేదని స్పష్టం చేసింది. ఆశ్రయం కోసం నిత్యానంద చేసుకున్న శరణార్థి దరఖాస్తును తమ ప్రభుత్వం తిరస్కరించినట్టు తెలిపింది. దీంతో అతను ఈక్వెడార్ నుంచి హైతీ వెళ్లాడని చెప్పింది. ఈక్వెడార్ నుంచి నిత్యానంద ద్వీపం కొనుగోలు చేసాడని వస్తున్న వార్తలను ఖండించింది. నిత్యానందకు తాము ఎలాంటి సాయం చేయలేదని వెల్లడించింది. నిత్యానందకు చెందిన కైలాస వెబ్సైట్లోని సమాచారం ఆధారంగా పలు కథనాలు వెలువడ్డాయని.. అందులో వాస్తవాలు లేవని తెలిపింది. నిత్యానందకు సంబంధించిన విషయాల్లో ఈక్వెడార్ పేరును వాడటం మానుకోవాలని మీడియాను కోరింది. కాగా, ఈక్వెడార్ నుంచి తాను ఒక చిన్న ద్వీపాన్ని కొనుగోలు దానికి కైలాస పేరుపెట్టినట్టు ఇటీవల నిత్యానంద ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఓ వెబ్సైట్ను కూడా అందుబాటులోకి తెచ్చారు. కైలాస అనేది రాజకీయేతర హిందూ దేశమని, హిందూత్వ పునరుద్ధరణ కోసం కృషి చేస్తోందని అందులో పేర్కొన్నారు. ప్రస్తుతం అత్యాచారం సహా పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద తనను కాపాడుకోవడానికి విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిందే. చదవండి: నిత్యానంద దేశానికి ప్రధానిగా తమిళనటి? -
నిత్యానంద పాస్పోర్టు రద్దు
న్యూఢిల్లీ: అత్యాచారం కేసులో ఆరోపణలెదుర్కొంటున్న స్వామి నిత్యానంద పాస్పోర్టును భారత ప్రభుత్వం రద్దు చేసింది. అదేవిధంగా ఆయనకు ఈక్వెడార్ దేశం ఆశ్రయం కల్పించిందన్న వార్తల్ని ఆ దేశ ప్రభుత్వం ఖండించింది. నిత్యానందను పట్టుకోవాలని విదేశాల్లో ఉన్న భారతీయ రాయబార కార్యాలయాలు, అధికారులను స్థానిక ప్రభుత్వాన్ని భారత్ అప్రమత్తం చేసింది. అత్యాచార కేసులో ఆరోపణలతోపాటుగా అపహరణ వంటి అనేక కేసులు నిత్యానందపై ఉన్నాయని వెల్లడించింది. -
నిత్యానందకు ఆశ్రయం; ఈక్వెడార్ క్లారిటి
న్యూఢిల్లీ : వివాదస్పద స్వామిజీ నిత్యానందకు తమ దేశం ఆశ్రయం కల్పించిందనే వార్తలపై ఈక్వెడార్ రాయబార కార్యాలయం స్పందించింది. ఆ వార్తలో ఏ మాత్రం వాస్తవం లేదని స్పష్టం చేసింది. ఆశ్రయం కోసం నిత్యానంద చేసుకున్న శరణార్థి దరఖాస్తును తమ ప్రభుత్వం తిరస్కరించినట్టు తెలిపింది. దీంతో అతను ఈక్వెడార్ నుంచి హైతీ వెళ్లాడని చెప్పింది. ఈక్వెడార్ నుంచి నిత్యానంద ద్వీపం కొనుగోలు చేసాడని వస్తున్న వార్తలను ఖండించింది. నిత్యానందకు తాము ఎలాంటి సాయం చేయలేదని వెల్లడించింది. నిత్యానందకు చెందిన కైలాస వెబ్సైట్లోని సమాచారం ఆధారంగా పలు కథనాలు వెలువడ్డాయని.. అందులో వాస్తవాలు లేవని తెలిపింది. నిత్యానందకు సంబంధించిన విషయాల్లో ఈక్వెడార్ పేరును వాడటం మానుకోవాలని మీడియాను కోరింది. కాగా, ఈక్వెడార్ నుంచి తాను ఒక చిన్న ద్వీపాన్ని కొనుగోలు దానికి కైలాస పేరుపెట్టినట్టు ఇటీవల నిత్యానంద ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఓ వెబ్సైట్ను కూడా అందుబాటులోకి తెచ్చారు. కైలాస అనేది రాజకీయేతర హిందూ దేశమని, హిందూత్వ పునరుద్ధరణ కోసం కృషి చేస్తోందని అందులో పేర్కొన్నారు. ప్రస్తుతం అత్యాచారం సహా పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద తనను కాపాడుకోవడానికి విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిందే. దేశం ఏర్పాటు చేయడమనేది అంత సులువు కాదు: కేంద్రం ప్రభుత్వం నిత్యానంద పాస్పోర్ట్ రద్దు చేసిందని భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఆ శాఖ అధికార ప్రతినిధి రవీష్కుమార్ మాట్లాడుతూ.. గత నెల నుంచి కనబడకుండా పోయిన నిత్యానంద ఆచూకీని కనుగొనేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. అలాగే కొత్త పాస్పోర్ట్కై అతను పెట్టుకున్న దరఖాస్తు పెండింగ్లో ఉందని చెప్పారు. నిత్యానంద కైలాస దేశంపై స్పందిస్తూ.. ఒక దేశం ఏర్పాటు చేయడం వెబ్సైట్ ఏర్పాటు చేసినంత సులువైన పని కాదని అన్నారు. -
ప్రైవేటు దీవిలో తేలిన నిత్యానంద!
న్యూఢిల్లీ: దొంగ పాస్పోర్టుతో దేశం దాటిన వివాదాస్పద స్వామిజీ నిత్యానంద ట్రినిడాడ్ దీవుల్లో తేలారు. అక్కడ ఓ ప్రైవేట్ దీవిని కొనుగోలు చేసిన నిత్యానంద.. దానికి కైలాస అని పేరు కూడా పెట్టారు. తన దీవికి దేశం హోదా ప్రకటించాలని కోరుతున్న నిత్యానంద ఆ దేశానికి ప్రత్యేక పాస్పోర్ట్కూడా రూపొందించనున్నాట్టు చెబుతున్నారు. అనేక వివాదాలతో ఇప్పటికే అనేకసార్లు పతాక శీర్షికలు ఎక్కిన నిత్యానంద.. గుజరాత్లోని అహ్మదాబాద్లో నిత్యానంద యోగిణి సర్వజ్ఞపీఠం పేరుతో ఆశ్రమం నిర్వహిస్తున్నాడు. ఆ ఆశ్రమంలో అక్రమంగా అమ్మాయిలను నిర్బంధించారంటూ జనార్ధనశర్మ అనే ఓ వ్యక్తి కేసు పెట్టాడు. ఆశ్రమంలో పరిస్థితిని చూసిన పోలీసులు అక్కడ అక్రమంగా అమ్మాయిలను నిర్బంధించిన మాట నిజమేనని నిర్ధారణకు వచ్చారు. దీంతో నిత్యానందపై కేసు రిజిస్టర్ చేశారు. మరోవైపు నిత్యానందను తొమ్మిదేళ్లనాటి కేసు వెంటాడుతోంది. ఆశ్రమానికి వచ్చిన ఓ మహిళపై అత్యాచారం చేసాడని ఆరోపణ దాదాపు నిర్ధారణ అయింది. గతంలో ఉన్న కేసుల్లో నిత్యానంద 40కిపైగా వాయిదాలకు కోర్టులో హాజరుకాలేదు.ఈ నేపథ్యంలో ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉండటంతో నిత్యానంద..దొంగ పాస్పోర్టుతో దేశం విడిచిపారిపోయాడు. అప్పటినుండి అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
అసాంజేకు తప్పిన గండం
లండన్: వికిలీక్స్ వ్యవస్థాపకుడు జులియన్ అసాంజేకు గండం తప్పింది. ప్రస్తుతం ఆయన ఉంటున్న ఈక్వెడార్లోనే కొనసాగేందుకు మరోసారి సిద్ధమయ్యారు. ఇప్పటి వరకు తనకు ఆశ్రయం ఇచ్చిన పార్టీనే తాజాగా మరోసారి విజయానికి చేరువలో ఉండటంతో ఆయన పునరావాసానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండనుంది. వాస్తవానికి ఈక్వెడార్ నుంచి 30 రోజుల్లోగా అసాంజేను వెళ్లగొట్టాలని ప్రస్తుతం అక్కడ అధికారంలో ఉన్న లెప్టిస్ట్ పార్టీని రైట్ వింగ్ పార్టీ డిమాండ్ చేసింది. దీంతో అసాంజేలో కొంత ఆందోళన నెలకొంది. స్వీడన్లో లైంగికదాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన ప్రస్తుతం లండన్ రాయబార కార్యాలయం అయిన ఈక్వెడార్లో ఉంటున్నారు. ఆయనకు లెప్టిస్ట్ పార్టీ ఆశ్రయం కల్పించింది. తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో మరోసారి లెఫ్టిస్ట్ పార్టీనే అధికారానికి చేరువవుతున్న నేపథ్యంలో ఆయన ఈక్వెడార్లోనే ఇక ఉండిపోయేందుకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వ ప్రతినిధి లెనిన్ మోరెనో మాట్లాడుతూ తాము అసాంజేకు ఆశ్రయం ఇస్తామని హామీ ఇచ్చారు. -
విచారణకు అసాంజే!
లండన్: వికిలీక్స్ ద్వారా అగ్రరాజ్యానికి కంటిమీద కులుకులేకుండా చేసిన జూలియన్ అసాంజె.. తనపై వచ్చిన లైంగిక ఆరోపణలపై విచారణను ఎదుర్కోనున్నారు. నాలుగేళ్లుగా లండన్లోని ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో తలదాచుకుంటున్న అసాంజెను సోమవారం స్వీడన్ ప్రాసిక్యూటర్ సమక్షంలో ఈక్వెడార్ ప్రాసిక్యూటర్ ప్రశ్నించనున్నారని స్వీడన్ అధికారులు వెల్లడించారు. వికీలీక్స్ ద్వారా అమెరికా ప్రభుత్వ రహస్య పత్రాలను వెల్లడించి సంచలనం సృష్టించిన కొద్ది రోజులకే అసాంజేపై ఇద్దరు స్వీడన్ మహిళలు లైంగిక ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. వారిలో ఓ మహిళ లైంగిక చర్యలో అసాంజే ఉద్దేశపూర్వకంగా కండోమ్ను ధ్వంసం చేశాడని ఆరోపించగా.. మరో మహిళ తాను నిద్రలో ఉన్న సమయంలో అసాంజే లైంగిక చర్యకు పాల్పడ్డాడని ఆరోపించింది. స్వీడన్ చట్టాల ప్రకారం స్పృహలో లేని, తాగిన మైకంలో ఉన్న, నిద్రలో ఉన్న వారితో లైంగిక చర్య జరిపితే.. దాన్ని రేప్గా పరిగణించి.. ఆరేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. విచారణ సందర్భంగా అసాంజే డీఎన్ఏ శాంపిల్ను కోరే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా.. అసాంజేను కావాలనే ఈ కేసులో ఇరికించారని అంతర్జాతీయ సమాజం పెద్ద ఎత్తున అతడికి బాసటగా నిలుస్తోంది. -
అసాంజేకు నెట్ ను కట్ చేసింది మేమే : ఈక్వెడార్
క్విటో: వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేకు ఇంటర్నెట్ సదుపాయాన్ని నిలిపేసినట్లు ఈక్వెడార్ తెలిపింది. అమెరికా ఎన్నికల్లో అంతరాయాలు సృష్టించకుండా ఆంక్షలు విధించినట్లు తెలిపింది. ఇతర దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదన్న సూత్రాన్ని పాటిస్తామంది. విదేశీ ఎన్నికల్లో జోక్యం చేసుకోవడం గాని, ప్రత్యేకించి ఓ అభ్యర్థివైపు మొగ్గు చూపడం గాని తమ అభిమతానికి విరుద్ధమని ఈక్వెడార్ విదేశాంగ మంత్రి తెలిపారు. అసాంజే విడుదల చేసిన పలు పత్రాలు అమెరికా ఎన్నికలపై ప్రభావం చూపొచ్చని అందుకే అసాంజేకు కమ్యూనికేషన్ వ్యవస్థ నిలిపేశామన్నారు. -
ఈక్వెడార్లో శక్తిమంతమైన భూకంపం
క్విటో: ఈక్వెడార్లో శక్తిమంతమైన భూకంపం సంభవించింది. దక్షిణ ప్రాపిషియాకు 41 కిలోమీటర్ల దూరంలో రిక్టర్ స్కేలుపై 6.4తీవ్రతతో భూకంపం సంభవించినట్లు అమెరికా జియాలాజికల్ సర్వీస్ అధికారులు తెలిపారు. భూగర్భంలో 35 కిలో మీటర్ల లోతున ఈ భూప్రకంనలు మొదలయ్యాయని అధికారులు చెప్పారు. ఈ ప్రకంపనల కారణంగా ఈక్వెడార్ రాజధాని క్విటోలో కూడా వణికిపోయిందట. అయితే నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు. -
సెమీస్ కు దూసుకెళ్లిన అమెరికా
కోపా అమెరికా కప్ క్వార్టర్స్లో ఈక్వెడార్పై విజయం సీటెల్: కోపా అమెరికా సెంటినరీ కప్లో ఆతిథ్య అమెరికా జట్టు దుమ్ము రేపుతోంది. వెటరన్ ఫార్వర్డ్ ఆటగాడు క్లింట్ డెంప్సీ తన సూపర్ ఫామ్ను మరోసారి చాటుకోవడంతో పాటు జట్టును సెమీఫైనల్స్కు చేర్చాడు. గురువారం ఈక్వెడార్తో హోరాహోరీగా జరిగిన క్వార్టర్ఫైనల్లో అమెరికా 2-1తో విజయాన్ని అందుకుంది. 1995 అనంతరం ఈ టోర్నీలో అమెరికా సెమీస్కు చేరుకోవడం ఇదే తొలిసారి. శనివారం అర్జెంటీనా, వెనిజులా మధ్య జరిగే క్వార్టర్స్ మ్యాచ్ విజేతతో ఈ జట్టు సెమీస్లో తలపడుతుంది. 22వ నిమిషంలోనే గోల్ చేసి జట్టుకు ఆధిక్యాన్ని అందించిన డెంప్సీకి ఈ టోర్నీలో ఇది మూడో గోల్. గ్యాసీ జార్డెస్ (65) మరో గోల్ సాధించాడు. ఈక్వెడార్ నుంచి మైకేల్ అరోయో (74) ఏకైక గోల్ చేశాడు. మ్యాచ్ ఆరంభంలో అమెరికా జోరును కనబరిచింది. ఈక్వెడార్ డిఫెన్స్ను ఏమార్చుతూ స్ట్రయికర్ బాబీ వుడ్ వేగవంతమైన ఆటను ప్రదర్శించినా గోల్స్ మాత్రం నమోదు కాలేదు. అయితే 22వ నిమిషంలో జెర్నెన్ జోన్స్ ఇచ్చిన పాస్ను గాల్లోకి ఎగిరి హెడర్ ద్వారా డెంప్సీ గోల్ చేశాడు. మరో ఐదు నిమిషాల్లోనే డెంప్సీ ప్రమాదకర షాట్ను ఈక్వెడార్ కీపర్ అడ్డుకున్నాడు. అయితే ద్వితీయార్ధం ఆరంభం నుంచే ఈక్వెడార్ గోల్ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. 48వ నిమిషంలో ఎన్నెర్ వాలెన్సియా హెడర్ షాట్ కొద్దిలో మిస్సయ్యింది. 52వ నిమిషంలో ఇరు జట్లకు రిఫరీ షాక్ ఇచ్చారు. జెర్నెన్ జోన్స్ (అమెరికా) ప్రత్యర్థిని దురుసుగా అడ్డుకోవడంతో రెడ్ కార్డుకు గురికాగా ఆంటోనియో వాలెన్సియా (ఈక్వెడార్)కు రెండో ఎల్లో కార్డ్ చూపడంతో రెండు జట్లు పది మందితోనే మిగతా మ్యాచ్ ఆడాయి. 65వ నిమిషంలో డెంప్సీ అందించిన పాస్ను గోల్పోస్టుకు అత్యంత సమీపంలో అందుకున్న జార్డెస్ ఏమాత్రం పొరపాటు చేయకుండా జట్టు ఆధిక్యాన్ని 2-0కు పెంచాడు. అయితే కొద్దిసేపటికే ఈక్వెడార్ తమ ఏకైక గోల్ చేయగలిగింది. 74వ నిమిషంలో మైకేల్ అరోయో తక్కువ ఎత్తులో సంధించిన షాట్ గోల్పోస్టులోకి దూసుకెళ్లింది. మరో రెండు నిమిషాల్లోనే ఎన్నెర్ వాలెన్సియా హెడర్ అతి సమీపం నుంచి వెళ్లిపోవడంతో అమెరికా ఊపిరిపీల్చుకుంది. ఇంజ్యూరీ సమయంలోనూ ఈక్వెడార్ శాయశక్తులా గోల్ కోసం ప్రయత్నించినా అదృష్టం కలిసిరాలేదు. చివర్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఈక్వెడార్ కోచ్ గుస్తావో క్వింటెరోస్కు సైతం రిఫరీ రెడ్ కార్డ్ చూపించి స్టాండ్స్లోకి పంపారు. -
అయ్యో... బ్రెజిల్!
* రిఫరీ తప్పిదంతో తొలి రౌండ్లో నిష్ర్కమణ * కోపా అమెరికా కప్ క్వార్టర్స్లో పెరూ ఫాక్స్బరో (యూఎస్): కోపా అమెరికా కప్లో బ్రెజిల్ జట్టును దురదృష్టం వెంటాడింది. ఐదుసార్లు ప్రపంచ చాంపియన్గా నిలిచిన ఈ జట్టు పాలిట రిఫరీ విలన్గా మారారు. ప్రత్యర్థి జట్టు ఆటగాడి చేతికి తాకి నెట్లోనికి వెళ్లిన బంతిని గోల్గా ప్రకటించడంతో ఈ ప్రఖ్యాత జట్టు లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టాల్సి వచ్చింది. ఆదివారం జరిగిన గ్రూప్ ‘బి’ మ్యాచ్లో పెరూ ఈ వివాదాస్పద గోల్తో 1-0తో నెగ్గింది. 31 ఏళ్లలో బ్రెజిల్పై పెరూకిదే తొలి విజయం. మ్యాచ్ తొలి అర్ధభాగం బ్రెజిల్ హవా కనిపించింది. అయితే ద్వితీయార్ధం 74వ నిమిషంలో బ్రెజిల్కు ఊహించని షాక్ తగిలింది. బై లైన్ నుంచి పెరూ ఆటగాడు ఆండీ పోలో ఇచ్చిన క్రాస్ను రౌల్ రూడియాజ్ గోల్ చేసేందుకు ప్రయత్నించాడు. అయితే ఈ క్రమంలో బంతి అతడి చేతిని తాకి గోల్పోస్టులోకి వెళ్లింది. అనూహ్యంగా ఉరుగ్వేకు చెందిన రిఫరీ ఆండ్రెస్ కున్హా దీన్ని గోల్గా ప్రకటించడంతో బ్రెజిల్ ఆటగాళ్లు నిశ్చేష్టులయ్యారు. రిఫరీతో వాగ్వాదానికి దిగి తమ నిరసన వ్యక్తం చేశారు. రీప్లేలోనూ ఈ విషయం స్పష్టంగా కనిపించినప్పటికీ రిఫరీ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఇంజ్యూరీ సమయం (90+2)లో బ్రెజిల్కు స్కోరును సమం చేసే అవకాశం వచ్చినా విఫలమైంది. గ్రూప్లో టాపర్గా నిలిచిన పెరూ క్వార్టర్స్కు చేరింది. ఈ మ్యాచ్కు ముందు బ్రెజిల్ ఆడిన రెండింటిలో ఒకటి గెలిచి, ఒకటి డ్రా చేసుకుంది. ఈ మ్యాచ్ను డ్రా చేసుకున్నా క్వార్టర్స్కు చేరేది. కానీ ఓటమితో టోర్నీ నుంచి నిష్ర్కమించాల్సి వచ్చింది. క్వార్టర్స్కు చేరిన ఈక్వెడార్ ఈస్ట్ రూథర్ఫోర్డ్ (యూఎస్): గ్రూప్ ‘బి’లోనే జరిగిన మరో మ్యాచ్లో ఈక్వెడార్ 4-0తో హైతీని ఓడించింది. ఎన్నెర్ వాలెన్సియా (11), అయోవి (20), నొబోవా (57), ఆంటోనియో వాలెన్సియా (78) గోల్స్ చేశారు. దీంతో ఈ గ్రూపులో రెండో స్థానం పొందిన ఈక్వెడార్ క్వార్టర్స్లో 16న అమెరికాతో తలపడనుంది. -
ఈక్వెడార్లో భూకంపం
క్విటో: ఈక్వెడార్లో బుధవారం భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 6.7గా నమోదు అయింది. ఈ మేరకు యూఎస్ జియోలాజికల్ సర్వే సంస్థ వెల్లడించింది. అయితే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కానీ చోటు చేసుకున్నట్లు సమాచారం అందలేదని పేర్కొంది. ఈ రోజు తెల్లవారుజామున 2.57 గంటలకు ఈ భూకంపం సంభవించిందని ఈక్వెడార్ నేషనల్ జియోలాజికల్ ఇనిస్టిట్యూట్ వెల్లడించింది. -
రెండు కాళ్లు లేకున్నా కే 2ని అధిరోహించి..
ఈక్వెడార్: పర్వత శిఖరాల అధిరోహణ అతి కొద్దిమందికే సాధ్యమవుతుంది. అది కూడా ఒంట్లో అవయవాలన్నీ సక్రమంగా ఉంటేనే. లేదంటే అతి కష్టంమీద ఆ ప్రయాణం సాగుతుంది. శరీరం పూర్తి స్థాయిలో సహకరిస్తే తప్ప అలాంటి సాహసాలు చేయడం సుసాధ్యం కాదు. కానీ, ఈక్వెడార్ కు చెందిన సాహసికుడు తి రెండు కాళ్లు లేకుండా కృత్రిమ కాళ్ల సహాయంతో ప్రపంచంలో ఎత్తైన శిఖరాల్లో ఒకటైన కే 2 పర్వతాన్ని అధిరోహించాడు. అది కూడా ఆక్సిజన్ సహాయం కూడా లేకుండా. ఈ రికార్డుతో ప్రపంచంలోనే ఇలాంటి పరిస్థితులతో ఉండి కే 2ను అధిరోహించిన తొలి సాహసికుడిగా అతడు నిలిచాడు. ప్రముఖ సాహసికుడు శాంటియాగో క్వింటరో 2002లో అర్జెంటీనాలోని ఓ పర్వత శిఖరాన్ని అధిరోహించే క్రమంలో అతడి రెండు కాళ్లు దెబ్బతిని చచ్చుబడిపోవడంతో వాటిని తొలగించారు. కానీ, అతడి లక్ష్యం మాత్రం అంతటితో ఆగిపోలేదు. గతంలో మౌంట్ ఎవరెస్టు ఎక్కిన అతడు ఈసారి వినూత్నంగా కే 2ను అధిరోహించి భళా అనిపించుకున్నాడు. 'నాకు వైద్యం చేసిన వాళ్లు నన్ను 5000 మీటర్ల ఎత్తుకు ఎక్కలేనని అన్నారు. కానీ, నేను ఏంటనే విషయం ఎవరూ చెప్పలేరు. నేను తీసుకున్న నిర్ణయం ప్రకారమే నేను ఉండాలని అనుకుంటా' అని ఆయన చెప్పారు. గతంలో ఇతడు మౌంట్ ఎవరెస్టును కూడా క్వింటెరో అధిరోహించాడు. -
ఈక్వెడార్లో మరోసారి భూకంపం
క్వీటో: ఈక్వెడార్లో మరోసారి భూకంపం వచ్చింది. శుక్రవారం ఈక్వెడార్లో వచ్చిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్పై 6.0గా నమోదు అయింది. ఇదిలా ఉంటే.. గతవారం ఈక్వెడార్లో సంభవించిన భూకంపం ధాటికి శుక్రవారం మృతుల సంఖ్య 587కు చేరుకుంది. వారిలో 539 మంది మృతదేహాలను వారి కుటుంబసభ్యులు గుర్తించారని ప్రభుత్వ ఉన్నతాధికారులు వెల్లడించారు. మరో 48 మృతదేహాలను గుర్తించవలసి ఉందన్నారు. అయితే మృతుల్లో 27 మంది విదేశీయులు ఉన్నారని తెలిపారు. వారిలో 10 మంది కొలంబియన్... ఆరుగురు క్యూబా... ఇద్దరు కెనడా... ఇద్దరు డొమినిక్ రిపబ్లిక్.... ఇద్దరు బ్రిటన్ దేశాలకు చెందినవారు కాగా.. ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్, ఐర్లాండ్ దేశాలకు చెందిన వారు ఒక్కొక్కరు ఉన్నారని... మరోక మృతదేహాన్ని గుర్తించవలసి ఉందని వివరించారు. ఈ భూకంపంలో 5733 మంది గాయపడ్డారు. వారు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారన్నారు. 163 మంది ఆచూకీ ఇంతవరకు లభ్యం కాలేదని తెలిపారు. -
ఈక్వెడార్లో మళ్లీ భూకంపం
♦ తీవ్రత 6.1గా నమోదు ♦ శనివారం నాటి భూకంపంలో 525కి చేరిన మృతుల సంఖ్య మాంటా: ఈక్వెడార్లోని తీరప్రాంతంలో బుధవారం 6.1 తీవ్రతతో మరోసారి భూకంపం వచ్చింది. మ్యూజిన్కు పశ్చిమాన 25 కి.మీ. దూరంలో 15.7 కి.మీ లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు. తాజా ప్రకంపనలతో సునామీ ప్రమాద మేమీలేదని అధికారులు తెలిపారు. ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు వార్తలు రాలేదు. శనివారం 7.8 తీవ్రతతో వచ్చిన భూకంపానికి ఎపిక్ కేంద్రంగా ఉన్న ప్రాంతం తాజా భూకంప కేంద్రం దగ్గర్లోనే ఉంది. శనివారం నాటి భూకంపం మృతుల సంఖ్య 525కు చేరింది. 1,700 మంది ఆచూకీ తెలియడం లేదు. పెడెర్నల్స్, మాంటాల్లో సహాయక సిబ్బంది భవన శిథిలాల్లో చిక్కుకుపోయిన మృతదేహాలను వెలికి తీస్తున్నారు. -
ఈక్వెడార్ లో మళ్లీ భూకంపం
క్విటో: నాలుగు రోజుల కందట సంభవించిన భారీ భూకంపానికి కకావికలమైన దక్షిణ అమెరికా ఖండ దేశం ఈక్వెడార్ లో మళ్లీ ప్రకంపనలు చెలరేగాయి. బుధవారం ఆ దేశ తీరప్రాంతం కేంద్రంగా మరో భూకంపం వచ్చింది. దీని తీవ్రత రిక్కర్ స్కేలుపై 6.1గా నమోదయింది. ప్రకంపనల ధాటికి తీర పట్టణాలన్నీ కంపించాయి. ముయిసె పట్టణానికి పశ్చిమంగా సముద్రంలో 15 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించిన్టుల అమెరికా భూగర్భ పరిశోధనా సంస్థ తెలిపింది. ఈ నెల 16న ఈక్వెడార్ పసిఫిక్ తీర ప్రాంతంలో (7.8 పాయింట్ల తీవ్రతతో) ఏర్పడిన భూకంపం తీరప్రాంతనగరం గువాయాక్విల్ను శిధిలాల దిబ్బగామార్చింది. ఇప్పటివరకు అందిన సమాచారంమేరకు భూకంప మృతుల సంఖ్య 500కు చేరువలో ఉంది. ఇంకా శిథిలాలకింద వేల మంది చిక్కుకుని ఉంటారని అంచనా. ఓవైపు పెద్ద ఎత్తున సహాయక చర్యలు కొనసాగుతుండగానే మరో భూకంపం సంభవించడం అక్కడి ప్రజలు, అధికారులను కలవరపాటుకుగురిచేసింది. అయితే ఒక భారీ భూకంపం అనంతరం రెండు మూడు నెలలపాటు ప్రకంపనలు చోటుచేసుకోవటం సహజమేనని నిపుణులు అంటున్నారు. తాజా భూకంపం ఎలాంటి నష్టం చేసిందనే సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. -
ఈక్వెడార్లో భూవిలయం
♦ 7.8 తీవ్రతతో భూకంపం.. 235 మంది మృతి ♦ 1557 మందికి గాయాలు కుప్పకూలిన ఇళ్లు.. కొద్దిలో తప్పిన సునామీ ముప్పు! క్విటో: దక్షిణ అమెరికా ఖండదేశం ఈక్వెడార్ చిగురుటాకులా వణికిపోయింది! శనివారం రాత్రి(స్థానిక కాలమానం ప్రకారం) 12 గంటలకు 7.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. 235 మంది దుర్మరణం పాలయ్యారు. 1557 మంది గాయపడగా అనేకమంది శిథిలాల కింద చిక్కుకున్నారు. మాంటా, పోర్టోవీజో, గుయాక్విల్ నగరాల్లో పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు చెప్పారు. భూకంపం తర్వాత 55 సార్లు చిన్నపాటి ప్రకంపనలు వచ్చాయి. దేశ రాజధాని క్విటోకు వాయవ్య దిశలో 170 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. దాదాపు ఒక నిమిషం పాటు ఈక్వెడార్తోపాటు పెరూ ఉత్తర భాగం, కొలంబియా దక్షిణ ప్రాంతం కంపించింది. ఈక్వెడార్లోనే ఎక్కువ నష్టం చోటుచేసుకుంది. పలు ప్రాంతాల్లో అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి. తీర పట్టణమైన గుయాక్విల్లో ఓ వంతెన కుప్పకూలడంతో కారు ధ్వంసమైంది. భవనాలు ఊగిపోవడంతో జనం భయంతో పరుగులు తీశారు. దారుణంగా దెబ్బతిన్న పెడెర్నాలస్ పట్టణంలోనే 400 మంది మరణించి ఉంటారని భావిస్తున్నారు. అక్కడ 40 హోటళ్లు కుప్పకూలాయి. ‘నా జీవితంలో ఇంతటి తీవ్ర భూకంపం ఎన్నడూ చూడలేదు. భూమి చాలాసేపు కంపించింది. బయటకు పరుగెత్తాలనుకున్నా. కానీ కనీసం నడవలేకపోయా’ అని క్విటో వాసి టోరెస్ పేర్కొన్నారు. భూకంప కేంద్రానికి సమీపంలో ఉన్న పెడెర్నాలెస్ పట్టణంలోని వందలమంది రాత్రంతా ఆరుబయటే పడుకున్నారు. ఈ పట్టణంలో పలువురు లూటీలకు పాల్పడ్డారని, ప్రజల్ని రక్షించేందుకు తాము ప్రాధాన్యమిస్తున్నామని స్థానిక అధికారులు వెల్లడించారు. విపత్తుపై దేశాధ్యక్షుడు రఫేల్ కొరెయ, ఉపాధ్యక్షుడు జార్జ్ గ్లాస్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆరు రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ.. నష్టం ఎక్కువగా చోటుచేసుకున్న ఆరు రాష్ట్రాల్లో ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించి యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టింది. పోలీసు, సైన్యం, విపత్తు నిర్వహణ సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. 10 వేల మంది సైన్యంతో పాటు 4,600 మంది పోలీసులు భూకంప బాధిత ప్రాంతాలకు తరలివెళ్లారు. పెడెర్నాలెస్, పోర్టోవీజో నగరాల్లో ప్రజలకు 3 వేల ఆహార పొట్లాల్ని, 8 వేల నిద్ర సామగ్రిని అందచేశారు. వాటికన్ సిటీ వెళ్లిన అధ్యక్షుడు రఫెల్ పర్యటన రద్దు చేసుకొని ఈక్వెడార్ బయల్దేరారు. భూకంపం తర్వాత సునామీ వచ్చే ప్రమాదం ఉన్నట్లు హవాయికి చెందిన సునామీ హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. అయితే ఆ ప్రమాదం కొద్దిలో తప్పిపోయిందని, సునామీ ప్రమాదమేమీ లేదంటూ తర్వాత పేర్కొంది. భూగర్భంలో టెక్టానిక్ ఫలకాల సరిహద్దులపై ఈక్వెడార్ ఉండడంతో ఈ దేశంలో తరచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి. దీంతో 1900 నుంచి ఇప్పటివరకు రిక్టర్ స్కేల్పై 7.0 లేదా అంతకుమించిన తీవ్రతతో ఏడుసార్లు భూకంపాలు సంభవించాయి. 1987 మార్చిలో సంభవించిన భూకంపంలో వెయ్యి మంది మరణించారు. జపాన్లో బిక్కుబిక్కుమంటూ... కుమమొటో: జపాన్ భూకంప ప్రభావం నుంచి ప్రజలు ఇంకా కోలుకోలేదు. చిన్న చిన్న ప్రకంపనలు భయపెడుతుండడంతో జనం ఇళ్లలో ఉండేందుకు ఇష్టపడడం లేదు. ఒజు పట్టణంలోని పలువురు స్థానిక పార్కులో కార్లలో నిద్రిస్తున్నారు. కుమమొటో, మహిషి నగరాల్లో వేలాది మంది శనివారం రాత్రంతా ఆరుబయటే నిద్రించారు. జపాన్లో గురు, శనివారాల్లో వచ్చిన రెండు భూకంపాల ధాటికి 41 మంది మృతిచెందగా.. 1,500 మంది గాయపడ్డం తెలిసిందే. గల్లంతైన వారి కోసం జపాన్, అమెరికా వైమానిక దళాలు గాలిస్తున్నాయి. అసో పర్వత ప్రాంతంలో అదృశ్యమైన ఆరుగురి కోసం గాలింపు కొనసాగుతోంది. మినమియాసో ప్రాంతంలో అదృశ్యమైన వారికోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. సహాయక కార్యక్రమాల్లో అమెరికా ఆర్మీ సాయం తీసుకుంటున్నామని ప్రధాని షింజో అబే తెలిపారు. ఇప్పటికీ కుమమొటోలో 80 వేల ఇళ్లకు విద్యుత్ సరఫరా లేదు. 4 లక్షల గృహాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. నగరంలో 200 ఇళ్లు, భవంతులు దెబ్బతిన్నాయని, 91 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని స్థానిక అధికారులు తెలిపారు. -
ఈక్వెడార్ భూకంపం: 235కు చేరిన మృతుల సంఖ్య
ఈక్వెడార్ రాజధాని క్వీటోను కుదిపేసిన భారీ భూకంపం రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.8గా నమోదు తీర ప్రాంతాల్లో సునామీ హెచ్చరికల జారీ క్వీటో: ఈక్వెడార్ రాజధాని క్వీటోను భారీ భూకంపం కుదిపేయగా మృతుల సంఖ్య గంటగంటకూ పెరిగిపోతోంది. భూకంప ధాటికి మృతిచెందిన వారి సంఖ్య 235 కి పెరిగినట్టు ఆ దేశ అధికారులు ఆదివారం రాత్రి వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆ దేశ ఉపాధ్యక్షుడు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించినట్టు జార్జ్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో రాజధాని క్వీటోలో భూప్రకంపనల తీవ్రత బలంగా ఉండటంతో అక్కడి ప్రాంతీయ తీరప్రాంతాల్లో సునామీ హెచ్చరికలను జారీ చేశారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కాగా, స్థానిక కాలమానం ప్రకారం శనివారం 11.58 గంటల ప్రాంతంలో భూకంప కేంద్రానికి 300 కిలోమీటర్ల దూరంలో బలమైన భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.8గా నమోదైనట్టు అమెరికా జీయోలాజికల్ సర్వే వెల్లడించింది. క్వీటోకు పశ్చిమ-వాయువ్యంగా 173 కిలోమీటర్ల దూరంలో, మరో చోట ఆగ్నేయ దిశగా మూస్నేకు 28 కిలోమీటర్ల దూరంలో భూప్రకపంనలు చోటుచేసుకున్నాయి. 11 నిమిషాల కాల వ్యవధిలో ఒకే ప్రాంతంలో రెండు భూకంపాలు కుదిపేసినట్టు యూస్జీయస్ వెల్లడించింది. తొలుత 4.8 గా ఉన్న భూకంప తీవ్రత, ఆ తర్వాత 7.8 తీవ్రత నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. -
ఈక్వెడార్లో భారీ భూకంపం, సునామీ హెచ్చరిక
♦ ఈక్వెడార్ రాజధాని క్వీటోను కుదిపేసిన భారీ భూకంపం ♦ భూకంప ధాటికి 28 మంది దుర్మరణం ♦ రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.8గా నమోదు ♦ తొలుత భూకంప తీవ్రత 4.8 గా నమోదు ♦ తీర ప్రాంతాల్లో సునామీ హెచ్చరికల జారీ ఈక్వెడార్: ఈక్వెడార్ రాజధాని క్వీటోలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.8గా నమోదైనట్టు అమెరికా జీయోలాజికల్ సర్వే వెల్లడించింది. రాజధాని క్వీటోలో భూప్రకంపనల తీవ్రత బలంగా ఉండటంతో అక్కడి ప్రాంతీయ తీరప్రాంతాల్లో సునామీ హెచ్చరికలను జారీ చేశారు. భూకంప కేంద్రానికి 300 కిలోమీటర్ల దూరంలో శనివారం (స్థానిక కాలమానం)11. 58 గంటల ప్రాంతంలో భారీగా భూప్రకంపనలు చోటుచేసుకున్నట్టు పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం పేర్కొంది. ఈ భూకంప ధాటికి 28 మంది దుర్మరణం చెందినట్టు పేర్కొంది. క్వీటోకు పశ్చిమ-వాయువ్యంగా 173 కిలోమీటర్ల దూరంలో 11.58 గంటల ప్రాంతంలో ఏర్పడగా, మరో చోట ఆగ్నేయ దిశగా మూస్నేకు 28 కిలోమీటర్ల దూరంలో భూప్రకపంనలు చోటుచేసుకున్నట్టు పేర్కొంది. 11 నిమిషాల కాల వ్యవధిలో ఒకే ప్రాంతంలో రెండు భూకంపాలు కుదిపేసినట్టు యూస్జీయస్ వెల్లడించింది. తొలుత భూకంప తీవ్రత 4.8 గానూ, రెండో భూకంప తీవ్రత 7.8 గా నమోదైనట్టు తెలిపింది. ఈ భూకంప ధాటికి క్వీటోలో భవనాలు ధ్వంసం కాగా, 28 మంది మృత్యువాత పడినట్టు ఆ దేశ ఉపాధ్యక్షుడు జార్జ్ గ్లాస్ పేర్కొన్నారు. గుయాస్లో ఇద్దరు, పోర్ట్వ్యిజో నగరంలో 16 మంది, మాంటాలో 10 మంది మృతిచెందినట్టు చెప్పారు. దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించినట్టు జార్జ్ పేర్కొన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. కాగా, జపాన్లో రెండ్రోజుల వ్యవధిలో సంభవించిన రెండు భారీ భూకంపాలు కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ భూకంప ధాటికి మృతుల సంఖ్య 41కు పెరిగగా, 1500 మంది గాయపడ్డారు. క్యుషు ద్వీపంలోని కుమమొటో ప్రాంతాన్ని శనివారం తెల్లవారుజామున (స్థానిక కాలమానం) 1.30 నిముషాలకు మరో భూకంపం కుదిపేయడంతో 32 మందికి మరణించిన సంగతి విధితమే. -
కుప్పకూలిన సైనిక విమానం, 22 మంది మృతి
క్విటో: దక్షిణ అమెరికా ఈక్వెడార్కు చెందిన ఓ సైనిక విమానం పాస్తజా ప్రావిన్స్ లో కుప్పకూలింది. షెల్ మీరా ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో 22 మంది ప్రయాణికులు దుర్మరణం చెందారు. మంగళవారం సైనికుల నిర్వహిస్తున్నపారాచూట్ విన్యాసాలకు సన్నద్ధమవుతున్న తరుణంలో ఈ విషాదం చోటుచేసుకుంది. మృతుల్లో 19 మంది సైనికులు, ఇద్దరు వైమానిక సిబ్బంది, ఓ మెకానిక్ ఉన్నారు. పైలట్ ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా అనుమతి కోరిన కొద్దిసేపటికే విమానం కుప్పకూలినట్టు ఈక్వెడార్ రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అటు ఈ విమాన ప్రమాదాన్ని ఈక్వడార్ అధ్యక్షుడు రాఫెల్ కొరియా తన అధికారిక ట్విట్టర్ లో ధ్రువీకరించారు. ఏ రకం విమానమో, ప్రమాదం ఎలా సంభవించిందో పేర్కొనలేదు. అయితే ఈ ప్రమాదంలో అందరూ చనిపోయినట్టు వెల్లడించారు. -
కుప్పకూలిన విమానం: 22 మంది దుర్మరణం
క్వీటో: దక్షిణ అమెరికా ఖండంలోని ఈక్వెడార్ లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. దేశ తూర్పుప్రాంతంలోని పస్తాజా ప్రావిన్స్ లో మంగళవారం(భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామన) ఒక సైనిక విమానం కుప్పకూలిపోయినట్లు ఆర్మీ వర్గాలు ప్రకటించాయి. ఈ ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న 22 మంది సైనికులు దుర్మరణం చెందినట్లు తెలిసింది. 'విమానంలో ఉన్న 22 మంది సైనికుల్లో ఏ ఒక్కరూ ప్రాణాలతో జీవించిలేరు' అని దేశాధ్యక్షుడు రాఫెల్ కొరియో ట్విట్టర్ లో తెలిపారు. ఈక్వెడార్ చరిత్రలోనే ఇది అత్యంత ఘెర విమాన ప్రమాదం కావటం గమనార్హం. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది. -
నిజమండి! ఆ తాటిచెట్లు నడుస్తాయ్!!
హాలీవుడ్ ఎపిక్ 'ద లార్డ్ ఆఫ్ ద రింగ్' సినిమా చూస్తే.. అందులో చిత్రవిచిత్రమైన ప్రాణులతోపాటు నడిచే చెట్లు కూడా కనిపిస్తాయి. వేర్లతో సహా అవి చిత్రంగా నడుచుకుంటూ పోతాయి. ఆ వృక్షాలంతా వేగంగా కాకపోయినా కొంచెం నెమ్మదిగా నడిచే చెట్లు నిజంగానే ఉన్నాయి. వాటిని చూడాలంటే ఈక్వెడార్కు వెళ్లాల్సిందే. ఈక్వెడార్ రాజధాని క్విటోకు వాయవ్యంగా 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న సుమాకో బయోస్ఫెర్ రిజర్వు ఉంది. యూనెస్కో గుర్తించిన ఈ అడవి అంచుకు వెళితే ఆహ్లాదకరమైన అందాలు, సహజ సుందరమైన దృశ్యాలే కాదు.. మనల్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తే నడిచే తాటిచెట్లు (పామ్ ట్రీస్) కనిపిస్తాయి. ఈ తాటిచెట్లు అడవంతా సంచరిస్తూ ఉంటాయి. ఈ చెట్లకు పెరిగే కొత్త వేర్లు క్రమంగా కొత్త ప్రాంతాలకు పాకుతూ పోవడం వల్ల వాటితోపాటు చెట్లు కూడా వెళ్తూ ఉటాయి. కొన్నిసార్లు రోజుకు రెండు, మూడు సెంటీమీటర్లు కూడా ఈ చెట్లు ప్రయాణిస్తుంటాయి. దాదాపు 20 మీటర్ల వరకు ఇవి నడువగలవు. 'భూసారం క్షీణిస్తుండటంతో దృఢమైన మూలాల కోసం ఈ చెట్లు పొడవైన కొత్త వేర్లను పెంచుతాయి. కొన్నిసార్లు ఈ వేర్లు 20 మీటర్ల దూరం వరకు పెరుగుతాయి' అని పురాతన వృక్ష పరిశోధకుడు పీటర్ వృసంకీ తెలిపారు. 'ఇలా కొత్త నేలలోకి తన వేర్లు స్థిరపడిన తర్వాత ఈ తాటిచెట్టు సహనంతో అటువైపు వంగుతాయి. పాత వేర్లు క్రమంగా గాలిలోకి లేస్తాయి. కొత్త వేర్లు పాతుకుంటాయి. ఇలా కొన్ని సంవత్సరాలపాటు ఈ ప్రక్రియ కొనసాగిన అనంతరం మంచి సూర్యరశ్మి, బలమైన భూసారమున్న ప్రదేశానికి ఈ చెట్టు చేరుతుంది' అని స్లోవాక్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ బ్రాటిస్లావాలో పనిచేస్తున్న పీటర్ వివరించారు. అయితే ఎన్నో జీవవైవిధ్య వింతలకు నెలవైన ఈ అటవీ ప్రాంతం ప్రస్తుతం పలు రకాల ముప్పులను ఎదుర్కొంటున్నది. పీటర్, స్థానిక గైడ్, పర్యావరణవేత్త థీయిరీ గ్రాషియా కలిసి కొన్ని నెలలపాటు ఈ అడవిలో గడిపి, ఎన్నో ఆటంకాలు, కష్టనష్టాలు ఎదుర్కొని.. ఇక్కడి విషయాలను వెలుగులోకి తెచ్చారు. ఈ మహారణ్యంలో 30 మీటర్లకుపైగా జలపాతాలు, బల్లి, కప్ప జాతులకు చెందిన నూతన జీవులను కనుగొన్నట్టు వారు వివరించారు. -
చిలీ శుభారంభం
కోపా అమెరికా కప్ శాంటియాగో : సొంతగడ్డపై ఆతిథ్య జట్టు చిలీ టైటిల్ వేటను విజయంతో ప్రారంభించింది. కోపా అమెరికా కప్లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్లో చిలీ 2-0 గోల్స్ తేడాతో ఈక్వెడార్ను ఓడించి శుభారంభం చేసింది. ఆట 67వ నిమిషంలో లభించిన పెనాల్టీ కిక్ను అర్తురో విడాల్ గోల్గా మలచగా... 84వ నిమిషంలో ఎడుఆర్డో వర్గాస్ గోల్తో చిలీ విజయం ఖాయమైంది. ఆట ఆరంభం నుంచే చిలీ గోల్ చేయడానికి ప్రయత్నించింది. అయితే ఈక్వెడార్ రక్షణపంక్తి ఆటగాళ్లు అప్రమత్తంగా ఉండటంతో తొలి అర్ధభాగంలో చిలీ ఖాతా తెరువలేకపోయింది. రెండో అర్ధభాగంలో చిలీ తమ ప్రయత్నాలను కొనసాగించింది. ఆఖరికి 67వ నిమిషంలో ‘డి బాక్స్’లో విడాల్ను ప్రత్యర్థి ఆటగాడు మొరటుగా అడ్డుకోవడంతో రిఫరీ చిలీకి పెనాల్టీ కిక్ను ప్రకటించారు. ఈ అవకాశాన్ని విడాల్ సద్వినియోగం చేసుకొని చిలీకి తొలి గోల్ను అందించాడు. ఆ తర్వాత శాంచెజ్ అందించిన పాస్ను వర్గాస్ లక్ష్యానికి చేర్చడంతో చిలీ ఖాతాలో రెండో గోల్ చేరింది. దక్షిణ అమెరికా దేశాల మధ్య జరిగే ఈ మెగా ఈవెంట్ 99 ఏళ్ల చరిత్రలో చిలీ ఇప్పటివరకు విజేతగా నిలువలేదు. నాలుగుసార్లు ఫైనల్కు చేరినా రన్నరప్తోనే సరిపెట్టుకుంది. -
మాజీ అధ్యక్షుడికి 12 ఏళ్ల జైలుశిక్ష
ఈక్వెడార్ మాజీ అధ్యక్షుడు జమిల్ మహౌద్కు అక్కడి కోర్టు 12 ఏళ్ల జైలుశిక్ష విధించింది. ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసి పక్కదోవ పట్టించినందుకు ఆయనకు ఈ శిక్ష పడింది. మహౌద్ చేసిన నేరం వల్ల సామాజికంగా తీవ్ర పరిణామాలు సంభవించాయని, ఈక్వెడార్ ఈ రోజు వరకు ఇంకా దాని ఫలితం అనుభవిస్తూనే ఉందని కోర్టు తెలిపింది. ప్రస్తుతం అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న మహౌద్పై రిమాండ్ ఉత్తర్వులు జారీ చేశారు. 1998లో ఈక్వెడార్కు అధ్యక్షుడిగా ఎన్నికైన ఆయన, 2000 జనవరిలో బలవంతంగా రాజీనామా చేయాల్సి వచ్చింది. ప్రజలు నిరసన ప్రదర్శనలు నిర్వహించడం, సైనిక తిరుగుబాటు కూడా జరగడంతో ఆయన తప్పుకోవాల్సి వచ్చింది. అయితే, తనపై ఆరోపణలన్నీ రాజకీయ ప్రేరేపితమేనని, తాను ఏ తప్పూ చేయలేదని ఆయన అంటున్నారు. -
రుతు రాగంలో అపశృతి... ఎల్నినో
ఎల్నినో అంటే: ఎల్నినోకు స్పానిష్ భాషలో అర్థం..లిటిల్బాయ్. దక్షిణ అమెరికా పశ్చిమ తీరాన (పెరూ, ఈక్వెడార్) వందల ఏళ్ల క్రితం జాలర్లు తొలిసారిగా ఎల్నినోను గుర్తించారు. దక్షిణ అమెరికా పశ్చిమ తీరంలోని పసిఫిక్ మహాసముద్రంలో నీటి ఉష్ణోగ్రతలు ఉన్నట్లుండి అసాధారణంగా పెరగడాన్ని ఎల్నినో అంటారు. సాధారణ ఉష్ణోగ్రత కంటే రెండు నుంచి మూడు డిగ్రీల ఉష్ణోగ్రత అకస్మాత్తుగా పెరుగుతుంది. సాధారణ వాతావరణ పరిస్థితుల్లో వేడి సముద్ర గాలులు తూర్పు, మధ్య పసిఫిక్ నుంచి ఇండోనేషియా, ఆస్ట్రేలియా వైపు పశ్చిమ దిశగా వీస్తాయి. ఎల్నినో సమయంలో తూర్పు, మధ్య పసిఫిక్ సముద్ర ప్రాంతాల్లో అసాధారణంగా సముద్ర ఉపరితలం వేడెక్కుతుంది. ఫలితంగా పెరూ, అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో విపరీత వర్షపాతం నమోదవుతుంది. దీని పర్యవసానంగా పశ్చిమ పసిఫిక్ ప్రాంతమంతా చల్లగా ఉంటూ.. భారత్, ఇండోనేషియా, ఆస్ట్రేలియా ప్రాంతాల్లో రుతుపవనాలు బలహీన పడి వర్షపాతం తగ్గుతుంది. భారత సేద్యానికి గొడ్డలిపెట్టు: భారత వ్యవసాయరంగాన్ని స్వల్ప నుంచి తీవ్ర స్థాయిలో ప్రభావితం చేసే అంశాల్లో ఒకటి ఎల్నినో. ఈ ఏడాది ఎల్నినో ప్రభావాన్ని చవిచూసే అవకాశం ఉందని ఇప్పటికే భారత్తో పాటు ఇతర దేశాల వాతావరణ విభాగాలు నిర్ధారించాయి. జూన్-ఆగస్ట్ మధ్య కాలంలో సంభవించే ఎల్నినో ద్వారా నైరుతి రుతుపవనాలు ప్రభావితమై అల్ప వర్షపాతం నమోదయ్యే ప్రమాదం ఉంది. ఫలితంగా వ్యవసాయ ఉత్పాదకతకు విఘాతం వాటిల్లనుంది. అదే జరిగితే అన్నదాతలను ఆదుకునేలా కనీస మద్దతు ధరలను ప్రభుత్వం పెంచాల్సి ఉంటుంది. వరి, చక్కెర, కూరగాయలు, ఫలాల ధరలు పెరుగుతాయి. ఈ పరిణామాలు రూపాయి విలువను తగ్గించి ద్రవ్యోల్బణం పెరగడానికి కారణాలవుతాయి. ఎల్నినో సాధారణంగా 3 నుంచి 7 ఏళ్లకోసారి సంభవిస్తుంది. భారత్పై నైరుతి రుతుపవనాల కాలంలో దీని ప్రభావం ద్వారా పంటల దిగుబడి దారుణంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. 2001-2010 ఖరీఫ్ కాలంలో 2002, 2007, 2009లో ఎల్నినో దాపురించడంతో వర్షపాతం వరుసగా 19 శాతం, 13 శాతం, 23 శాతం మేరకు తగ్గింది. భారత వాతావరణ విభాగం (ఇండియన్ మెటరాలజికల్ డిపార్ట్మెంట్) ప్రకారం ఈ ఏడాది ఎల్నినో సంభవిస్తే వర్షపాతం సుమారు 60 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది. ఐ.ఎమ్.డి ప్రకారం ఈ ఏడాది ఆగస్ట్-సెప్టెంబర్ మధ్య కాలంలో ఎల్నినో ప్రభావం ఉంటుంది. ఆస్ట్రేలియా బ్యూరో వాతావరణ విభాగం ప్రకారం ఇది జూలైలో అభివృద్ధి చెందనుంది. ఎల్నినో ప్రభావం కనిపించిన గత పరిణామాలను పరికిస్తే... 2002, 2004, 2009లో పప్పు దినుసుల దిగుబడి వరుసగా 14,23,27 శాతం మేర క్షీణించింది. అదే విధంగా వాణిజ్య పంటైన చెరకుతోపాటు సజ్జలు, మొక్కజొన్న, రాగి పంటల దిగుబడి కూడా తగ్గింది. ఖరీఫ్ సేద్యానికి నైరుతి రుతుపవనాల వర్షపాతమే ప్రధాన ఆధారం. ఇక వర్షాదార ప్రాంతాలకైతే వేరే చెప్పనక్కర్లేదు. ఇక్కడ ఏ విధమైన సేద్యపు నీటి సదుపాయాలు ఉండవు. ఈ ప్రాంతాల్లో పప్పు దినుసుల సాగు అధికం. జూలై- సెప్టెంబర్ కాలంలో నీటి అవసరం ఎక్కువగా ఉంటుంది. ఆగ స్ట్లో వర్షపాతం తగ్గితే..వీటి దిగుబడిపై తీవ్ర ప్రభావాన్ని ప్రదర్శిస్తుంది. ఐఎమ్డీ అంచనా ప్రకారం ఆగస్ట్లో ఎల్నినో ప్రభావం ఉండనుంది. అంటే ప్రధాన ఆహార ధాన్యాలతోపాటు పప్పు దినుసుల ఉత్పత్తి తగ్గే అవకాశం ఉంది. ఎల్నినో ప్రభావం ద్వారా భారత్లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థ చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది. ఇదివరకే ఎల్నినో సంభవించిన సంవత్సరాల్లో దేశ జీడీపీ కూడా తగ్గింది. ప్రస్తుతం దేశ జనాభాలో 68.9 శాతం మంది గ్రామాల్లోనే నివసిస్తున్నారు. దేశ వ్యవసాయ భూ విస్తీర్ణత 56 శాతంలో వర్షాధార వ్యవసాయం కొనసాగుతోంది. కాబట్టి వ్యవసాయరంగ క్షీణత అధిక జనాభాపై ప్రభావాన్ని చూపుతుంది. ఎల్నినో ద్వారా వ్యవసాయ ఆదాయం తిరోగమిస్తే అది అనేక రంగాలపై దుష్ర్పభావం చూపుతుంది. గ్రామీణ ప్రాంతాల ప్రజల కొనుగోలు సామర్థ్యం కుంటుపడుతుంది. ఎఫ్ఎంసీజీ, ఆటోమొబైల్ రంగాలపై ప్రత్యక్ష ప్రభావం ఉంటుంది. నిత్యావసర ధరలు పెరిగి దేశ ద్రవ్యోల్బణం రేటు కూడా పెరుగుతుంది. వ డ్డీ రేట్లు పెరిగి చివరకు పారిశ్రామిక ఉత్పత్తికి విఘాతం వాటిల్లుతుంది. మూడు నుంచి ఏడేళ్లకోసారి సంభవించే ఎల్నినోలతోనే ఇంతటి విపత్కర పరిణామాలు దాపురిస్తే ఏటా పునరావృతమైతే ఆ నష్టం ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకుంటేనే భయమేస్తోంది. ఏడింటిలో రెండు మాత్రమే: 1991 నుంచి ఇప్పటిదాకా 7 ఎల్నినో ప్రభావాలు సంభవించాయి. అయితే ఈ ఏడింటిలో కేవలం రెండు మాత్రమే తీవ్ర కరువు పరిస్థితులకు దారితీశాయి. 1994లో తలెత్తిన ఎల్నినో ధాటికి రుతుపవనాల ద్వారా 10 శాతం అధికంగానే వర్షపాతం నమోదైంది. అయితే ఈసారి వచ్చే ఎల్నినో ద్వారా రుతుపవనాలు 30 శాతం మేరకు ప్రభావితం అయ్యే అవకాశం ఉందని క్రిసిల్ భావిస్తోంది. మూలాలెక్కడ? ఎక్కడో పసిఫిక్ మహాసముద్రంలో జరిగే ఈ అసాధారణ వాతావరణ సంఘటన దాదాపు ప్రపంచంలోని అనేక దేశాలపై ఏదో ఒక రూపంలో కష్టనష్టాలకు గురిచేస్తోంది. అమెరికా తీర ప్రాంతంలో వరద లు ముంచెత్తితే, భారత్లో రుతుపవనాలకు విఘాతం కలిగిస్తూ కరువు కాటకాలకు కారణ భూతమవుతోంది. ఎల్నినోపై ఇప్పటికే పలు అధ్యయనాలు జరుగుతున్నప్పటికీ దాని మూలాలను పూర్తిస్థాయిలో అర్థం చేసుకోవడంలో శాస్త్రవేత్తలు ఇంకా పూర్తి స్థాయిలో సఫలీకృతులు కాలేకపోతున్నారు. అమెరికా దీనిపై సమగ్ర అధ్యయనాలను నిర్వహిస్తున్నప్పటికీ ఇంకా కావాల్సినంత సమాచారం అందుబాటులోకి రాలేదు. భూతాపం (గ్లోబల్ వార్మింగ్) ఈ ఎల్నినోకు కారణమా? లేదా? భూతాపం ద్వారా ఎల్నినో తీవ్రత పెరుగుతుందా? అనే విషయంలో స్పష్టతకు రాలేదు. భిన్నాభిప్రాయాలు: ఎల్నినో ప్రభావంపై వాతావరణ శాస్త్రవేత్తల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఐఎమ్డీ అంచనాల ప్రకారం ప్రతికూలత కొంత మాత్రమే ఉండొచ్చని 96 శాతం వర్షాలు కురుస్తాయని చెబుతుండగా.. అమెరికా వాతావరణ శాస్త్రవేత్తలు మాత్రం 1997-1998 నాటి తీవ్ర ఎల్నినో ఈసారి సంభవించనుందని అంచనావేస్తున్నారు. ఇలా ఈ ఏడాది ఎల్నినో ప్రభావం ఉంటుందని అన్ని ప్రధాన వాతావరణ విభాగాలు నిర్ధారించినప్పటికీ అది ఏ స్థాయిలో ఉంటుందనే విషయమై ఏకాభిప్రాయం కనిపించడం లేదు. నైరుతి గతికి ఇవే ప్రామాణికాలు: మన దేశంపై నైరుతి రుతుపవనాల ప్రభావం ఏవిధంగా ఉంటుందనే విషయంలో నిపుణులు ప్రధానంగా ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. 1. ఫిబ్రవరి, మార్చి నెలలో దక్షిణ హిందూ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు 2. ఫిబ్రవరి, మార్చి నెలలో తూర్పు ఆసియా దేశాల్లో నమోదైన వాతావరణ పీడనాలు . 3. జనవరిలోని వాయవ్య ఐరోపాలోని భూఉపరితల ఉష్ణోగ్రతలు 4. ఫిబ్రవరి,మార్చిలలో పసిఫిక్ మహాసముద్రంలో భూమధ్య రేఖ వద్ద ఉష్ణోగ్రతలు వీటి ఆధారంగా నైరుతి రుతుపవనాల గమనం ఎలా ఉంటుందో అంచనా వేస్తారు. ఇప్పటి వరకు అనుకూలం: ఈ ఏడాది అనుకున్నదానికంటే రెండు రోజుల ముందుగానే మే 18 నాటికే భారత ఉపఖండంలో నైరుతి జల్లులు ప్రవేశించాయి. వాటికి అనుకూలంగానే ప్రస్తుతం బంగాళాఖాతంలో విస్తరించడానికి సానుకూల వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. బంగాళాఖాతమంతటా విస్తరించిన తర్వాత అరేబియా సముద్రం మీదుగా నైరుతి కేరళ తీరాన్ని తాకుతుంది. వాస్తవానికి అన్ని వాతావరణ పరిస్థితులను అంచనావేస్తే భారత్ వాతావరణ శాఖ ఎల్నినో ప్రభావం ఉందని అంచనా వేసింది. కానీ దాని ప్రభావం ఉండుంటే రుతు పవనాల ఆగమనం మరింత ఆలస్యమయ్యేది. ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే...రుతుపవనాలు విస్తరించడానికి అనుకూల వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. దీనికి శుభశకునంగానే తూర్పు, మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది మరింత బలపడి వాయుగుండంగా మారింది. ఇది తీవ్రవాయుగుండంగా మారే అవకాశం ఉందని, తద్వారా రుతుపవనాల విస్తరణకు తోడ్పడుతుందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.రుతుపవనాల విషయానికి వస్తే ఈ గాలులు దేశమంతా విస్తరించిన తర్వాతే నైరుతి ద్రోణి ఏర్పడుతుంది. ఈద్రోణికి సముద్రంలో ఏర్పడే అల్పపీడనాలు, ఉపరితల ఆవర్తనాలు, వాయుగుండాలు, తీవ్రవాయుగుండాలు తోడైతే దేశమంతా మంచివానలే కురుస్తాయి. వీటి ద్వారా జూన్ నుంచి సెప్టెంబర్ వరకు దేశమంతా చిరుజల్లులనుంచి భారీవర్షాల వరకు పలు దఫాలుగా కురిసే అవకాశముంది. మన రాష్ట్రానికి వస్తే: మన రాష్ట్రంలో జూన్-సెప్టెంబర్ మధ్య నైరుతి ప్రభావం అధికంగా ఉంటుంది. తెలంగాణ ప్రాంతంలో నైరుతి రుతుపవనాలు, కోస్తా, రాయలసీమల్లో ఈశాన్య రుతుపవనాలు అధికంగా ప్రభావం చూపుతాయి. గడచిన ఐదేళ్ల వర్షపాతంతో పోలిస్తే ఈ ఏడాది అంత ఎక్కువగా ఉండకపోవచ్చని నిపుణుల అంచనా. అయితే మధ్యలో వచ్చే అల్పపీడనాలు, వానలు, రుతుపవనాల ఉపసంహరణతో వచ్చే వర్షపాతాలు, ఆ లోటును పూడుస్తాయని మొత్తంగా చూస్తే ఈ ఏడాది మంచి వానలే కురుస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పేరుకే పరిరక్షణ: పర్యావరణ దినోత్సవం... క్యోటో ప్రోటోకాల్... జీవ వైవిధ్య సదస్సు... ఓజోన్ పరిరక్షణ దినం... ఇలా నెలకోమారు ఏదో రూపంలో మన పర్యావరణాన్ని కాపాడేందుకు జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి దాకా సదస్సులు, చర్చాగోష్ఠులు, మేధోమథనం లాంటివి చేపడుతున్నా మరోవైపు జరగరాని నష్టం జరుగుతూనే ఉంది. ఈ సదస్సులు చేపట్టిన నాటి నుంచి కనీసం వైపరీత్యాల పరంపరకు అడ్డుకట్ట పడడం లేదు సరికదా నష్టాల తీవ్రత రేటు పెరిగి పోతోంది. ప్లాస్టిక్ వ్యర్థాలు పెచ్చరిల్లుతున్నాయి. పర్యావరణానికి ఎనలేని విఘాతం కలిగిస్తున్నాయి. వీటిని నిషేధించాలని వేదికలపై గొంతెత్తి చాటుతున్న ఏలికలు తమ పరిపాలనలో అమలు చేయడంలో మాత్రం ఘోర వైఫల్యం మూటగట్టుకుంటున్నారు. ప్లాస్టిక్ నిషేధం విషయంలో జపాన్, సింగపూర్ లాంటి చిన్న దేశాలను చూసి మనదేశం నేటికీ గుణపాఠం నేర్వలేకపోవడం విచారకరం. మన కృషి ఎంత? భారత్లో కూడా ఈ ఎల్నినో అంశంపై పూర్తి స్థాయిలో పరిశోధనలను నిర్వహించాలి. ప్రపంచ జల వలయంపై ప్రభావాన్ని చూపగల ఎల్నినోను తేలిగ్గా తీసుకోవడం భవిష్యత్ ఆహార భద్రతకు ముప్పుగా పరిణమిస్తుంది.దారిద్య్ర రేఖకు దిగువనున్న జనాభాకు నిరంతర ఆహారభద్రతను కల్పించాలంటే అది వ్యవసాయ దిగుబడులను పెంచడం ద్వారానే సాధ్యమవుతుంది. వరుసగా సంభవించే ఎల్నినోలతో ఆహారభద్రతకు ముప్పు వాటిల్లుతోంది. దీన్ని అధిగమించాలంటే ఎల్నినో మూలాలను వెతికి పట్టుకొని అడ్డుకట్ట వేయాలి. ఆ దిశగా మన శాస్త్రవేత్తలు ప్రగతి సాధించాలి. క్లిష్ట పరిస్థితులను తట్టుకోగలిగే వ్యవసాయ వంగడాలను అభివృద్ధి చేసి అందుబాటులోకి తీసుకురావాలి. ఎల్నినో, భూతాపం లాంటి వైపరీత్యాలను సమర్థంగా ఎదురొడ్డే సాంకేతిక పరిజ్ఞానం మన సొంతమవ్వాలి.