Fake Certificates
-
ఉద్యోగం నుంచి తొలగించడం సబబే
సాక్షి, అమరావతి: తనకు వినికిడి లోపం ఉందని నకిలీ ధ్రువీకరణ పత్రం సమర్పించి దివ్యాంగుల కోటాలో స్కూల్ అసిస్టెంట్గా ఉద్యోగం సంపాదించిన ఓ మహిళను సర్వీస్ నుంచి తొలగిస్తూ విద్యాశాఖ అధికారులు జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు సమర్థించింది. సర్వీస్ నుంచి వెళ్లిపోయే స్వేచ్ఛను ఆ మహిళా టీచర్కు ఇస్తూ ఏపీ పరిపాలనా ట్రిబ్యునల్ (ఏపీఏటీ) ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది.తనకు వినికిడి లోపం లేదని తెలిసి కూడా.. ఆ లోపం ఉన్నట్టు నకిలీ ధ్రువీకరణ పత్రం సమర్పించి ఉద్యోగం పొందినందుకు ఆ మహిళకు రూ.లక్ష ఖర్చులు విధించింది. ఈ మొత్తాన్ని నెల రోజుల్లోపు విశాఖపట్నంలో వినికిడి లోపంతో బాధపడుతున్న వారి కోసం ప్రత్యేక స్కూల్ నిర్వహిస్తున్న ఓంకార్ అండ్ లయన్స్ ఎడ్యుకేషనల్ సొసైటీకి చెల్లించాలని ఆ మహిళను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రవినాథ్ తిల్హరీ, జస్టిస్ న్యాపతి విజయ్ ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది.కేసు పూర్వాపరాలివీ2012లో నిర్వహించిన డీఎస్సీలో దివ్యాంగుల కోటా (వినికిడి లోపం) కింద స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు జి.వెంకటనాగ మారుతి అనే మహిళ ఎంపికయ్యారు. అంతకు ముందు ఆమె తనకు 70 శాతం వినికిడి వైకల్యం ఉందని దరఖాస్తులో పేర్కొన్నారు. దీంతో ఆమె ప్రకాశం జిల్లా పి.నాగులవరం జెడ్పీ హైసూ్కల్లో స్కూల్ అసిస్టెంట్గా నియమితులయ్యారు. అయితే.. వినికిడి లోపానికి సంబంధించి ఆమె సమర్పించిన ధ్రువీకరణ పత్రంపై ఫిర్యాదు రావడంతో విచారణ జరిపిన విద్యాశాఖ అధికారులు ఆమెను సర్వీసు నుంచి తొలగిస్తూ 2015 మార్చిలో ఉత్తర్వులిచ్చారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ మారుతి ఏపీఏటీలో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన ట్రిబ్యునల్ మారుతిని సర్వీసు నుంచి తొలగిస్తూ అధికారులు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది. స్వచ్ఛందంగా ఉద్యోగం నుంచి వెళ్లిపోయేందుకు ఆమెకు అవకాశం ఇవ్వాలని అధికారులను ఆదేశిస్తూ 2017లో తీర్పునిచ్చింది. ట్రిబ్యునల్ తీర్పును సవాల్ చేస్తూ ఆమె 2018లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ తిల్హరీ నేతృత్వంలోని ధర్మాసనం ఇటీవల తుది విచారణ జరిపింది. దివ్యాంగుల కోటా కిందకు తాను రానని తెలిసి కూడా నాగ మారుతి అదే కోటా కింద దరఖాస్తు చేసి తప్పుడు వివరాలు పొందుపరచి, నకిలీ ధ్రువీకరణ పత్రం సమర్పించి ఉద్యోగం పొందారని ధర్మాసనం తేల్చింది. ఉద్యోగం పొందేందుకు పిటిషనర్ మోసపూరితంగా వ్యవహరించారని స్పష్టం చేసింది. ఉద్యోగం నుంచి తొలగించాల్సి ఉండగా, స్వచ్ఛందంగా ఉద్యోగం నుంచి వెళ్లిపోయేందుకు అమెకు వెసులుబాటు కల్పించాలని అధికారులను ట్రిబ్యునల్ ఆదేశించడం పట్ల విస్మయం వ్యక్తం చేసింది. అమెను సర్వీసు నుంచి తొలగిస్తూ అధికారులు ఇచ్చిన ఉత్తర్వులు సబబేనంది. -
పూజా ఖేడ్కర్పై కేంద్రం సీరియస్
ముంబై: కంటిచూపు లోపాలు, మానసిక, శారీరక వైకల్యం ఉందంటూ యూపీఎస్సీలో తప్పుడు అఫిడవిట్లు సమర్పించడం, నాన్ క్రీమీలేయర్ పత్రాల దురి్వనియోగం, ఎంబీబీఎస్లో చేరేందుకు తప్పుడు పత్రాల సృష్టి.. ఇలా పలు వివాదాలకు కేంద్రబిందువైన 2023 బ్యాచ్ ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా మనోరమ దిలీప్ ఖేడ్కర్ వ్యవహారంపై ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది.తక్షణం మహారాష్ట్రలో ఆమెకు జిల్లా శిక్షణను నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. తిరిగి ముస్సోరీలోని లాల్బహదూర్ శాస్త్రి నేషనల్ అడ్మిని్రస్టేషన్ అకాడమీలో రిపోర్ట్చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు పూజకు మహారాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి నితిన్ గాడ్రే లేఖ రాశారు. ‘‘ మహారాష్ట్రలో వాసిం జిల్లా సూపర్న్యూమరీ అసిస్టెంట్ కలెక్టర్ హోదాలో ఉన్న మిమ్మల్ని తక్షణం ‘జిల్లా శిక్షణ’ నుంచి పక్కనపెడుతున్నాం. 23వ తేదీలోపు మళ్లీ ముస్సోరీ ఐఏఎస్ అకాడమీలో రిపోర్ట్చేయండి. అకాడమీ తీసుకునే చర్యలకు సిద్దంగా ఉండండి’’ అని ఆమెకు పంపిన లేఖలో నితిన్ పేర్కొన్నారు. ప్రత్యేక వసతులతో వార్తల్లోకి..ట్రైనీ అయినాసరే జిల్లా కలెక్టర్ స్థాయిలో తనకూ అధికారిక సదుపాయాలు, వసతులు కలి్పంచాలని డిమాండ్చేయడంతో పూజ వ్యవహార శైలి తొలిసారిగా వార్తల్లోకి ఎక్కింది. ప్రత్యేకంగా ఆఫీస్ను కేటాయించాలని, అధికారిక కారు ఇవ్వాలని డిమాండ్చేయడంతోపాటు సొంత ఖరీదైన కారుపై ఎర్ర బుగ్గను తగిలించుకుని తిరిగారు. దీంతో పుణెలో అసిస్టెంట్ కలెక్టర్ హోదా నుంచి ఆమెను వాసిమ్ జిల్లాలో సూపర్న్యూమరీ అసిస్టెంట్ కలెక్టర్గా ప్రభుత్వం బదిలీచేసింది.తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించి సివిల్స్లో ఆమె ఆలిండియా 821వ ర్యాంక్ సాధించారని మీడియాలో వార్తలొచ్చాయి. దాంతో యూపీఎస్సీకి ఆమె సమర్పించిన వైకల్యం సర్టీఫికెట్లు, అఫిడవిట్ల విశ్వసనీయతపై నీలినీడలు కమ్ముకున్నాయి. దీంతో ఈ విషయంలో నిజానిజాలను నిగ్గుతేల్చాలని కేంద్రప్రభుత్వ ఏకసభ్య కమిటీని నియమించింది. రెండు వారాల్లోగా నివేదించాలని ఆదేశించింది. ఆదివారం పుణె పోలీసులు పూజ లగ్జరీకారును సీజ్చేశారు. తప్పుడు పత్రాలతో ఎంబీబీఎస్ సీటు సాధించారని విమర్శలు వెల్లువెత్తాయి. సోమవారం అర్ధరాత్రి పూజ ఇంటికి మహిళా పోలీసులు వెళ్లారు. కొంచెం పని ఉందని చెప్పి ఆమే వారిని పిలిపించినట్లు తెలుస్తోంది. అయితే పుణె కలెక్టర్ సుహాస్ దవాసే తనను వేధిస్తున్నారని ఫిర్యాదు చేసేందుకే వారిని ఇంటికి పిలిపించిందని పోలీసు అధికారి ఒకరు మంగళవారం వెల్లడించారు. కాగా 2022 ఆగస్ట్లో పుణె జిల్లా పింప్రి ఆస్పత్రిలో ఎడమ మోకాలికి వైకల్యం ఉందని ఆమె వికలాంగ సర్టీఫికెట్ సంపాదించారని యశ్వంత్రావ్ చవాన్ స్మారక ప్రభుత్వాసుపత్రి డీన్ రాజేంద్ర వాబ్లే వెల్లడించారు. అయితే అదే నెలలో ఔధ్ ప్రభుత్వాసుపత్రిలో వైకల్య సరిఫికెట్ కోసం పెట్టుకున్న ఆమె దరఖాస్తు తిరస్కరణకు గురైందని తెలుస్తోంది. ‘‘కమిషనర్ ఫర్ పర్సన్స్ విత్ డిజబిలిటీ ఆదేశాల మేరకు పూజ గతంలో సమర్పించిన వైకల్య సర్టీఫికెట్లు అన్నింటినీ పరిశీలిస్తాం. ఆమెకు కంటి, మానసిక, అంగ వైకల్యం ఉందని ధ్రువపరిచిన ఆస్పత్రులు, వైద్యులెవరో తేలుస్తాం’ అని పుణె పోలీసు అధికారి వెల్లడించారు. పరారీలో తల్లిదండ్రులు ! తల్లిదండ్రులకు కోట్ల రూపాయల ఆస్తులున్న విషయాన్ని దాచి పెట్టి నాన్ క్రిమిలేయర్ సర్టిఫికెట్ను సంపాదించారనీ పూజపై ఆరోపణలున్నాయి. పూజ తల్లిదండ్రుల వ్యవహారశైలిపైనా మీడియాలో వార్తలొచ్చాయి. గ్రామ సర్పంచ్ అయిన పూజ తల్లి మనోరమ ఒక భూవివాదంలో కొందరిని గన్తో బెదిరిస్తున్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. క్రిమినల్ కేసులో తల్లిదండ్రుల జాడ కోసం పోలీసులు వెతుకుతున్నారు. వారిద్దరి మొబైల్స్ స్విచ్చాఫ్ చేసి ఉన్నాయి. పుణెలోని మెట్రో రైల్ కారి్మకులతో గొడవ పడుతున్న వీడియో కూడా సోషల్మీడియాలో చక్కర్లు కొడుతోంది. -
వేల కార్లు చోరీ, నకిలీ జడ్జి అవతారం, 2 వేల క్రిమినల్స్ రిలీజ్
చదివింది లా. కానీ వృత్తి మాత్రం దొంగతనం.చేతివ్రాత నిపుణుడు, గ్రాఫాలజీలో కోర్సు కూడా చేసాడు. కానీ చోరీలు చేయడంలో అతని ట్రాక్ రికార్డ్ చూస్తే ఔరా అంటారు. పోలీసులను సైతం బురిడీ కొట్టించడంలో అతని తర్వాతే మరెవ్వరైనా. దొంగతనంలో ఈ విధంగా ఆరితేరిన ప్రపంచంలోనే తొలి, ఏకైక వ్యక్తి. నకిలీ పత్రాలను ఉపయోగించి ఏకంగా జడ్జ్ అయిపోయాడు. 2000 మంది నేరస్థులను విడుదల చేశాడు. ఆశ్చర్యంగా ఉంది కదా..ఈ స్టోరీ ఏంటో తెలుసుకుందాం రండి. అతగాడి పేరే ధన్ రామ్ మిట్టల్...అత్యంత దుర్మార్గపు దొంగ. ఓ కారు దొంగతనం సందర్బంగా ధనిరామ్ను అరెస్ట్ చేసిన పోలీసులు అతను చెప్పిన విషయాలు విని పోలీసులు సైతం ఖంగుతిన్నారు. జడ్డిగా, ట్రాన్స్ పోర్టు అధికారిగా, రైల్వే స్టేషన్ మాష్టరుగా పక్కనున్నోడికి కూడా అనుమానం రాకుండా తన దందా కొనసాగించాడు. 1960 ప్రాంతంలో రోహ్ తక్ కోర్టులో క్లర్కుగా విధులు నిర్వర్తించాడు. క్లర్కుగా పనిచేస్తున్న సమయంలో అక్కడి జడ్జి రెండు నెలలు లీవులో ఉన్నాడు. దీంతో నకిలీ పత్రాల సాయంతో ఏకంగా తానే జడ్జి అవతారం ఎత్తేశాడు ధన్ రామ్. ఈ రెండు నెలల కాలంలో దాదాపు 2 వేలమంది నేరస్థులును విడుదల చేశాడు. అంతే కాదు చాలా మందిని జైల్లో కూడా పెట్టాడు.ఆ తర్వాత విషయం బయటపడే సమయానికి మనోడు పరార్. తర్వాత ఆయన కేసులన్నింటినీ మరోసారి విచారించి తీర్పులు వెలువరించారు. అతని కోసం పోలీసులు ఇంకా వెతుకుతూనే ఉన్నారు. ఆ తర్వాత రీజనల్ ట్రాన్స్పోర్టు అధికారిగాను అవతారమెత్తి కారు డాక్యుమెంట్లపై ఫోర్జరీ సంతకాలు పెట్టేశాడు. రోహ్ తక్ రైల్వే స్టేషన్ లోనే రైల్వే అధికారులను సైతం బురిడీ కొట్టించి స్టేషన్ మాష్టరు కొలువు దక్కించుకున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇతని అరాచకాలకు లెక్కే లేదు. 25 ఏళ్ల వయసులో దొంగతనాల ద్వారా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. దొంగతనం రుచిమరిగిన అతగాడు ఇక అక్కడనుంచి వరసగా దొంగతనాలతో పోలీసులకు చుక్కలు చూపించాడు. కానీ ధని రామ్ 1964లో తొలిసారి జైలుకి వెళ్లాడు. కథ ఇక్కడితో అయి పోలేదు. వరుసగా అరెస్టులవుతూ , విడుదలవుతూ అలా ఇప్పటివరకు 25 సార్లు అరెస్టు అయిన ధని రామ్ అత్యధికంగా అరెస్టయిన వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్. సమీప ప్రాంతాలలో కార్ల దొంగతనంలో కూడా మహా ముదురు. ఏ కారును పడితే ఆ కారును దొంగిలించడు. కేవలం ఎస్టీమ్, మారుతి 800, హుందాయ్ శాంత్రో తదితర సెక్యూరిటీ అలారం లేని కార్లను మాత్రమే దొంగతనం చేస్తుంటాడు. అదీ పట్టపగలు. వాటిని సెకండ్ హ్యాండ్ మార్కెట్లో అమ్మేస్తాడు. ఒకవేళ పోలీసులకు పట్టుబడి జైలుకెళ్లినా తగ్గేదేలే అంటాడు. మళ్లీ అదే తంతు. 81 సంవత్సరాలు మీద పడ్డా కూడా.. ఇప్పుడెక్కడ ఉన్నాడో, ఏం చేస్తున్నాడో ఎవరికీ తెలియదు. ధని రామ్ ఎప్పటికి చోరీలకు ఫుల్ స్టాప్ పెడుతాడో అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. -
నకిలీ డాక్టర్లకు చెక్..
సాక్షి, హైదరాబాద్: అర్హత లేకున్నా వైద్యులుగా ప్రాక్టీస్ చేస్తున్న వారిపై, అక్రమంగా ఆసుపత్రులు నడుపుతున్నవారిపైనా తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి (టీఎస్ఎంసీ) ఉక్కుపాదం మోపుతోంది. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్, ఖైరతాబాద్లో అర్హత లేకున్నా ప్రాక్టీస్ చేస్తున్న రెండు ఆసుపత్రు లకు ఇటీవలే ఎన్నికైన కొత్త మండలి నోటీసులు జారీ చేసింది. సదరు ఆసుపత్రుల్లో యాంటీబయా టిక్స్, స్టెరాయిడ్స్ వంటి షెడ్యూల్డ్ డ్రగ్స్ను గుర్తించి ఈ మేరకు వాటిపై కేసులు నమోదు చేసింది. ఇంకా అనేక చోట్ల నకిలీ వైద్యుల దందాపై దాడులకు శ్రీకారం చుట్టింది. డాక్టర్లుగా చెప్పుకునే ఆర్ఎంపీలపై క్రిమినల్ కేసులు పెడతామని మండలి హెచ్చరించింది. పేరుకు ముందు ‘డాక్టర్’ హోదా పెట్టుకున్నా, ఆసుపత్రి అని రాసి ఉన్న బోర్డులు ప్రదర్శించినా, రోగులకు ప్రిస్క్రిప్షన్ రాసినా కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది. ఆర్ఎంపీల ముసుగులో రాష్ట్రంలో ఆర్ఎంపీ, పీఎంపీలు 30 వేల మంది వర కు ఉన్నారని ఓ అంచనా. ప్రతీ గ్రామంలో వారు ప్రాక్టీస్ చేస్తుంటారు. అయితే కొంతమంది నకిలీ సర్టిఫికెట్లతో ఆర్ఎంపీలు, పీఎంపీల ముసుగులో డాక్టర్లుగా చెలామణీ అవుతూ.. ఇష్టారాజ్యంగా అబార్షన్లు చేయడం, అత్యధిక మోతాదులో ఉన్న యాంటీబయాటిక్స్ ఇవ్వడం, చిన్న రోగాలకు కూడా అధికంగా మందులు రాస్తున్నారని మండలి గుర్తించింది. ఇటీవల నగరంలోని మలక్పేట్ ప్రాంతంలో నకిలీ రిజిస్ట్రేషన్ నంబర్ను కలిగి ఉన్న ఒక అర్హతలేని ప్రాక్టీషనర్ ప్రిస్క్రిప్షన్ను పరిశీలిస్తే, శిశువుకు యాంటీబయాటిక్ ఇంజెక్షన్ మెరోపెనెమ్ రాయడం చూసి అధికారులు విస్మయం వ్యక్తం చేశారు. సహజంగా శిశువులకు ఉపయోగించే యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్లు పెద్దలకు ఉప యోగించేవి కాకుండా ప్రత్యేకంగా ఉంటాయి. పెద్ద లకు వాడే ఇంజెక్షన్లు శిశువుకు ప్రాణాంతకంగా మారతాయి. మలక్పేటలోని ఆ నకిలీ డాక్టర్ మాది రిగానే చాలామంది నకిలీ డాక్టర్లు మానసిక ఔష ధాల ప్రిస్క్రిప్షన్లోనూ ఇష్టారాజ్యంగా మందులు రాస్తున్నారని తేలింది. ఈ నేపథ్యంలో నకిలీ డిగ్రీని ప్రదర్శించడం, అర్హత లేకున్నా ప్రిస్క్రిప్షన్లు రాయ డం వంటి దృష్టాంతాలను మండలి తీవ్రంగా తీసు కుంది. మరోవైపు అడ్డగోలుగా అల్లోపతి మందు లను సూచిస్తున్న ఇద్దరు నకిలీ ఆయుష్ వైద్యులను గుర్తించి వారిపై ఆయుష్ శాఖకు లేఖ రాసింది. ఇక నకిలీ వైద్యుల ఆగడాలకు అడ్డుకట్ట వేసే క్రమంలో డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) సాయాన్ని కూడా తీసుకోవాలని మండలి నిర్ణయించింది. నకిలీ ప్రైవేట్ ప్రాక్టీషనర్ల ద్వారా రోగులకు మందులు అందకుండా చేయాలని నిర్ణయించింది. -
అమెరికా నుంచి నకిలీ సర్టిఫికెట్
సాక్షి, హైదరాబాద్: అమెరికాలో ఉంటున్న ఓ స్నేహితుడు నకిలీ డిగ్రీ సర్టిఫికెట్తో తన మిత్రుడిని అమెరికాకు రప్పించేందుకు యత్నించగా విఫలమై.. కటకటాలపాలయ్యాడు. స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) ఎల్బీనగర్ ఇన్స్పెక్టర్ సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. సరూర్నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని కర్మన్ఘాట్కు చెందిన పులిపాటి మణికంఠ బీటెక్ ఫెయిలయ్యాడు. ఉద్యోగ వెతుకులాటలో ఉన్నాడు. ఈ క్రమంలో అమెరికాలో ఉంటున్న తన స్నేహితుడు జనార్దన్ సూచన మేరకు మేఘాలయ – షిల్లాంగ్లోని విల్లియం కార్వే యూనివర్సిటీ నుంచి నకిలీ డిగ్రీ సరి్టఫికెట్ పొందాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో జనార్దన్ సూచన మేరకు నకిలీ విద్యార్హత పత్రాల తయారీదారు నరే‹Ùను కలిశాడు. అతడిని సంప్రదించి రూ.1.6 లక్షలు చెల్లించి విల్లీయం కార్వే యూనివర్సీటీకి చెందిన నకిలీ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ డిగ్రీ సర్టిఫికెట్ పొందాడు. ఈమేరకు విశ్వసనీయ సమాచారం అందుకున్న ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు బుధవారం మణికంఠను అరెస్టు చేశారు. నరేష్, జనార్దన్లు పరారీలో ఉన్నారు. నిందితుడి నుంచి బీఎస్సీ సరి్టఫికెట్తో పాటు మూడు మార్క్స్ మెమోలు, ప్రొవిజనల్ సర్టిఫికెట్ , మైగ్రేషన్ సర్టిఫికెట్, సీఎంఎం సర్టిఫికెట్ , టీసీ, రెండు ఫోన్లను స్వాదీనం చేసుకున్నారు. -
'అంగట్లో సర్టిఫికెట్లు' డబ్బు ఇచ్చారంటే.. తెలంగాణదైనా..! ఏపీదైనా..!
మహబూబ్నగర్: మీకు పుట్టిన తేదీ తెలియదా.. మీ కూతురికి పెళ్లి వయసు లేకపోయినా కల్యాణలక్ష్మి పథకం కోసం వయస్సు పెంచిన ఆధార్ కార్డు కావాలా.. బీమా సొమ్ము కోసం మరణ ధ్రువీకరణ పత్రం కావాలా.. మీరు చేయాల్సిందంతా ఒక్కటే ప్రభుత్వ ఆధార్ సెంటర్ పేరుతో నకిలీ దందా చేస్తున్న వారిని సంప్రదిస్తే చాలు. వారికి అడిగినంత సొమ్ము ఇచ్చారంటే మీకు కావాల్సిన సర్టిఫికెట్ మీ ముందుంటుంది. అది తెలంగాణకు చెందినదైనా, ఏపీదైనా. ఈ నకిలీ దందా జరుగుతోంది ఎక్కడో కాదు, జోగుళాంబ గద్వాల జిల్లాలోనే. ‘సాక్షి’ పరిశోధనలో ఇటీవల ఈ నకిలీ ధ్రువపత్రాల దందా వెలుగులోకి వచ్చింది. అవసరాలే ఆసరాగా నకిలీవి సృష్టిస్తూ.. ప్రస్తుతం ప్రతి పథకంలో కూడా ఆధార్ కార్డు తప్పనిసరిగా అవసరముంది. అయితే, గతంలో వివిధ ఆసుపత్రుల్లో ప్రసవాలు అయిన వారు తమ పిల్లల జనన తేదీలను నమోదు చేసుకోలేదు. వారికి ఇప్పుడు ఆధార్కార్డు అవసరం ఉండటంతో వారి జనన ధ్రువీకరణ పత్రాలను ఆధార్ కేంద్రం పేరుతో నడుపుతున్న వారు తెలంగాణ ప్రభుత్వం వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ జోగుళాంబ గద్వాల ఆస్పత్రి ఇచ్చినట్లు ధ్రువీకరణ పత్రాన్ని ఇస్తున్నారు. కానీ ప్రస్తుతం రాష్ట్రం జనన ధ్రువీకరణ పత్రాలన్నీ మీసేవల ద్వారానే అందిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఏపీలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ శాఖ ద్వారా జనన ధ్రువీకరణ పత్రం అందిస్తుండగా.. అక్కడి ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ పేరుతో కర్నూల్ జనరల్ హాస్పిటల్లో జన్మించినట్లుగా జనన ధ్రువీకరణ పత్రాన్ని అందించి అటు ప్రజలను, ఇటు అధికారులను మోసం చేస్తున్నారు. అసలు నకిలీ పత్రాలను అప్లోడ్ చేస్తున్నా, అధికారులు పరిశీలించడం లేదా? లేక అధికారులకు తెలిసే జరుగుతుందా అనే అను మానాలెన్నో ఉన్నాయి. ఇప్పటికే జిల్లాలో వందల సర్టిఫికేట్లు, కర్నూల్ జిల్లాలోని వారికి సైతం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇన్ని రోజులుగా ఈ దందా సాగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై పలు అనుమానాలకు దారి తీస్తుంది. అవి నకిలీ ధ్రువపత్రాలు.. రాష్ట్ర ప్రభుత్వం పేరుతో ఇచ్చిన ధ్రువీకరణ పత్రం పూర్తిగా నకిలీది. ప్రస్తుతం జనన ధ్రువీకరణ పత్రాలు అన్ని మీసేవల ద్వారానే అందుతున్నాయి. కొందరు ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకొని చేసే వాటిని సంబంధిత అధికారులు పర్యవేక్షించాలి. ప్రజలు కూడా మోసపోకూడదు. – డాక్టర్ కిషోర్, సూపరింటెండెంట్, జిల్లా ప్రభుత్వాసుపత్రి దందా జరుగుతోందిలా.. కేవలం పాఠశాలల విద్యార్థులకు, వారి ఆధార్ వివరాలు నమోదు చేయడం కోసం సర్వశిక్షా అభియాన్ ద్వారా జిల్లాలోని పలు విద్యా సంస్థల వద్ద ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కానీ మార్కెట్లో నెట్వర్క్ సేవల పేరుతో పెద్దఎత్తున షాపులు తెరిచి, అక్కడ ఆధార్ కార్డులు, పేరు మార్పిడి, కొత్త కార్డులు తదితర సవరణలు చేస్తున్నారు. అంతవరకు బాగానే ఉంది. కానీ, ఆధార్ కార్డులో సవరణల కోసం, కొత్త కార్డుల కోసం జనన ధ్రువీకరణ పత్రాలు అవసరముంటుంది. నిబంధనల ప్రకారం గ్రామపంచాయతీ, మున్సిపాలిటీ, రెవెన్యూ అధికారుల వద్దకు వెళ్లకుండా నేరుగా ఆసుపత్రి నుండే ధ్రువీకరణ పత్రాలు వచ్చినట్లు నకిలీ పత్రాలను తయారు చేసి, వాటిని ప్రామాణికంగా తీసుకుని ఆధార్ కార్డు డౌన్లోడ్ చేస్తున్నారు. దీని కోసం రూ.5వేల నుంచి అత్యవసరమైతే మరింత ఎక్కువ వసూలు చేస్తున్నట్లు సమాచారం. ‘సాక్షి’ పరిశోధనలో ఇలాంటి నకిలీ ధ్రువీకరణ పత్రాలు చాలానే బయటపడ్డాయి. ఆధార్ సైట్లో ఉన్న లొసుగులను వాడుకుంటూ తమ దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. దానికి అమాయక ప్రజలు బలైపోతున్నారు. రూ.వేలకు వేలు డబ్బులు చిల్లు పెట్టుకుని తీరా అది నకిలీవి అని తెలిసినా చేసేదేమి లేక మౌనంగా ఉండిపోతున్నారు. -
హైదరాబాద్ లో నకిలీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు కలకలం
-
బ్యాడ్మింటన్ క్రీడలో తప్పుడు డేట్ ఆఫ్ బర్త్లు.. వయసు మార్చి గోల్మాల్!
-శ్రీరంగం కామేష్, సాక్షి ప్రతినిధి బ్యాడ్మింటన్లో ఓ వయస్సు క్రీడాకారుడు అదే ఏజ్ గ్రూప్లో ఉండే మరో ఆటగాడితో పోటీ పడాలి. నిబంధనలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అలా జరిగినప్పుడే సరైన పోటీ అన్పించుకుంటుంది. వయస్సులో తేడాలున్నప్పుడు ఆటలోని అనుభవాన్ని బట్టి ప్రతిభా సామర్థ్యాల్లో సైతం తేడా ఉండేందుకు అవకాశం ఉంటుంది. పతకాలు, ర్యాంకుల్ని సైతం ప్రభావితం చేస్తుంది. ఇంతటి కీలకమైన వయస్సు నిబంధనకు తెలుగు రాష్ట్రాలకు చెందిన కొందరు జాతీయ స్థాయి ఉత్తమ ర్యాంకర్లు తూట్లు పొడిచారు. తమ పుట్టిన తేదీ విషయంలో భారీ స్కామ్కు పాల్పడ్డారు. తమ వాస్తవ వయస్సును తగ్గించేసి బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు (బీఏఐ) తప్పుడు సర్టిఫికెట్లు సమర్పించారు. ఈ మేరకు అందిన ఆకాశరామన్న ఉత్తరం ఆధారంగా దర్యాప్తు చేపట్టిన హైదరాబాద్ సెంట్రల్ క్రైౖమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు ముగ్గురి విషయంలో ఈ అక్రమాలను నిర్ధారించారు. సమగ్ర ఆధారాలతో తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్కు లేఖ రాశారు. కానీ వారు ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. ఉత్తరం ఆధారంగా.. ఈ స్కామ్కు సంబంధించిన సమాచారాన్ని సిటీ సీసీఎస్ పోలీసులకు ఓ అజ్ఞాత వ్యక్తి లేఖ ద్వారా అందజేశారు. ఈ ఏడాది మార్చి 29న అందిన ఈ లేఖలో ఆరుగురు క్రీడాకారులపై ఆరోపణలున్నాయి. వీరు తమ అసలు వయస్సును దాచి పెట్టి నకిలీ సర్టిఫికెట్ల సృష్టించి బీఏఐకి సమర్పించారని, తద్వారా తమ కంటే చిన్న వారితో పోటీల్లో తలపడుతూ మెడల్స్, జాతీయ స్థాయి ర్యాంకులు సాధిస్తున్నారని అతను ఆరోపించారు. దీనివల్ల నిబంధనలు పాటించిన క్రీడాకారులకు అన్యాయం జరుగుతోందని పేర్కొన్నారు. దీనిపై ఇప్పటికే బీఏఐకి అనేకమంది నుంచి ఫిర్యాదులు వెళ్లినా పట్టించుకోవట్లేదని ఆరోపించారు. సమగ్ర దర్యాప్తు చేసిన సీసీఎస్.. కేవలం ఈ ఆరుగురే కాకుండా దాదాపు 40 మంది బ్యాడ్మింటన్ ఆటగాళ్ల వయస్సు విషయంలో తమకు సందేహాలు ఉన్నట్లు అజ్ఞాత వ్యక్తి ఆ లేఖలో పేర్కొన్నారు. వీరిలో చాలామంది 2005–10 మధ్య పుట్టారని, అయితే జనన ధ్రువీకరణ పత్రాలకు బదులుగా కొందరు వైద్యులు ఇచ్చిన బోగస్ మెడికల్ సర్టిఫికెట్లు దాఖలు చేసి తమ వయస్సు తగ్గించుకున్నారని పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ క్రీడాకారులకు తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేక మంది కోచ్లు, వారి తల్లిదండ్రులతో పాటు ఈ వైద్యుల సహకారం ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ లేఖను సిటీ పోలీసు ఉన్నతాధికారులు సీరియస్గా తీసుకున్నారు. సీసీఎస్ ఇన్స్పెక్టర్ కె.చంద్రకుమార్ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. చదవండి: BWF Rankings: తొమ్మిదో ర్యాంక్కు ప్రణయ్.. పీవీ సింధు మాత్రం.. ముగ్గురి విషయంలో ఆధారాలు లభ్యం... సీసీఎస్ ప్రత్యేక బృందానికి తొలి దశలోనే ముగ్గురు క్రీడాకారులకు సంబంధించిన సమగ్ర ఆధారాలు లభించాయి. బీఏఐ జాబితాలో అండర్–17 కేటగిరీలో 1176 పాయింట్లతో మూడో ర్యాంకులో ఉన్న రోహన్కుమార్ ఆనంద్దాస్ రాజ్కుమార్ తాను పుట్టిన తేదీని 2007 జనవరి 29గా పేర్కొంటూ బీఏఐకి సర్టిఫికెట్లు సమర్పించి టోర్నమెంట్లలో ఆడాడు. వాస్తవానికి రోహన్ పుట్టిన తేదీ 2005 అక్టోబర్ 29గా పోలీసులు నిర్ధారించారు. ఇదే కేటగిరీలో 92 పాయింట్లతో 44వ ర్యాంక్లో ఉన్న దవు వెంకట శివ నాగరామ్ మౌనీష్ తన పుట్టిన తేదీని 2007 జనవరి 29గా పేర్కొన్నారు. అయితే ఇతని అసలు పుట్టిన తేదీ 2006 జూన్4 అని దర్యాప్తులో తేలింది. అండర్–15 కేటగిరీలో 188 పాయింట్లతో 32వ ర్యాంక్లో ఉన్న భూక్యా నిషాంత్ తన పుట్టిన రోజును 2010 అక్టోబర్ 12గా పేర్కొనగా.. ఇతడి వాస్తవ పుట్టిన తేదీ 2007 జనవరి 12గా తేలింది. అయితే వీళ్లంతా మైనర్లు కావడంతో తమంతట తాముగా ఇలాంటి చర్యలకు పాల్పడలేరని, వాళ్ల కోచ్లు లేదా తల్లిదండ్రుల సహకారం, ప్రోద్బలంతోనే ఇలా చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. వారినే ఈ వ్యవహారంలో బాధ్యుల్ని చేయాలని భావిస్తున్నారు. ఏమాత్రం స్పందించని అసోసియేషన్.. ముగ్గురి బాగోతం బట్టబయలు కావడంతో ఇలాంటి వాళ్లు మరికొందరు ఉండి ఉంటారని పోలీసులు అనుమానించారు. అయితే ఈ వ్యవహారాన్ని అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలన్నా, బాధ్యుల్ని గుర్తించి చర్యలు తీసుకోవాలన్నా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఫిర్యాదు తప్పనిసరి. ఈ నేపథ్యంలో అన్ని వివరాలతో తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్కు ఈ ఏడాది మే 25న ఓ లేఖ (నం.65/పీఈ/క్యాంప్/డీసీపీ/డీడీ/సీసీఎస్/డీడీ/2023) రాశారు. దీనిపై తగిన చర్యలు తీసుకుని తమకు తెలియజేయాల్సిందిగా డిటెక్టివ్ డిపార్ట్మెంట్ డీసీపీ కోరారు. కానీ అసోసియేషన్ ఇప్పటివరకు స్పందించక పోవడంతో వారికి తెలిసే ఈ స్కామ్ జరుగుతోందా? అనే అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఈ స్కామ్ దేశ వ్యాప్తంగా జరుగుతూ ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. చదవండి: ఔటర్ చుట్టూ ఏడు ఇంటర్చేంజ్ మెట్రో స్టేషన్లు -
‘ఆ టీచర్ల డ్యూటీ సర్టిఫికెట్లు ఫేక్?’
జగిత్యాల: జిల్లాలో ఇటీవల జరిగిన ఇంటర్మీడియట్ మొదటి, రెండో సంవత్సరం పరీక్షలకు పర్యవేక్షకులుగా సారంగాపూర్ మండలంలోని 10 మంది ఉపాధ్యాయులను మార్చి 15 నుంచి ఏప్రిల్ 1 వరకు రిలీవ్ చేశారు. దీంతో వారు మార్చి 14న మధ్యాహ్నం 2 గంటలకు సదరు పరీక్ష కేంద్రాల్లో రిపోర్ట్ సైతం చేశారు. కానీ వీరిలో కొందరు టీచర్లు అటు ఇంటర్మీడియట్ పరీక్షల పర్యవేక్షణకు, ఇటు పాఠశాలలకు వెళ్లలేదు. అన్నీ ప్రెజెంట్ అని వేసుకున్నారు.. ఇంటర్మీడియట్ పరీక్షల పర్యవేక్షణకు వెళ్లిన టీచర్లు తిరిగి పాఠశాలల్లో జాయిన్ అయ్యే సమయంలో హెచ్ఎంలకు, హెచ్ఎంలే అయితే ఎంఈవోలకు డ్యూటీ సర్టిఫికెట్లు అందజేయాల్సి ఉంటుంది. కానీ అవి అందజేయకుండానే ఉపాధ్యాయులు తమ విధుల్లో చేరారు. 15 రోజులకు సంబంధించిన జీతం సైతం తీసుకున్నారు. ‘సాక్షి’ దినపత్రికలో ‘ఇన్విజిలేషన్కు వెళ్లలేదు’ అనే శీర్షికన వార్త ప్రచురితం కావడంతో సంబంధిత ఎంఈవో ఈ నెల 15వ తేదీలోపు డ్యూటీ సర్టిఫికెట్లు అందించాలని వారిని ఆదేశించారు. దీంతో కొందరు అందజేశారు. వీరిలో పర్యవేక్షకులుగా పనిచేయనప్పటికీ ఫేక్ సర్టిఫికెట్ సృష్టించి, ఎంఈవోకు అందించినట్లు తెలిసింది. రిలీజ్ ఆర్డర్లో ఇంటర్మీడియట్ అధికారులు కంప్యూటర్ షీట్లో అబ్సెంట్, ప్రెజెంట్ వేశారు. కానీ కొందరు టీచర్లు వాటిని జిరాక్స్ తీసుకొని, చేతితో అన్నీ ప్రెజెంట్ అని వేసుకున్నారు. కాగా, మార్చి 15 నుంచి వీరు విధుల్లో చేరుతున్నట్లు ఉండగా డ్యూటీ సర్టిఫికెట్లో మాత్రం 10 నుంచే వెళ్లినట్లు పెట్టారు. అలాగే పేర్లను అధికారులు పెన్నుతో రాయగా కొందరు కంప్యూటర్ షీట్లో టైప్ చేసుకున్నారు. ఎవరి ఇష్టానుసారంగా వారు డ్యూటీ సర్టిఫికెట్లు తయారు చేసి, అందజేశారు. ఇవి ఫేక్ డ్యూటీ సర్టిఫికెట్లు అని స్పష్టంగా తెలుస్తోంది. పూర్తిస్థాయిలో విచారణ చేపడితే నిజానిజాలు బయటపడతాయన్న అభిప్రా యాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై సారంగాపూర్ ఎంఈవో భీమయ్యను వివరణ కోరగా డ్యూటీ సర్టిఫికెట్లు తీసుకొని, డీఈవోకు పంపించామని, ఆయన పరిశీలిస్తారని తెలిపారు. -
‘చార్మినార్’ నుంచే ఎక్కువ!
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో జనన, మరణ ధ్రువీకరణ నకిలీ పత్రాలు అత్యధికంగా చార్మినార్ ప్రాంతం నుంచే జారీ అయినట్లు హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) అధికారులు గుర్తించారు. జీహెచ్ఎంసీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ కె.పద్మజ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఏసీపీ ఎం.సందీప్రెడ్డి నేతృత్వంలోని బృందం దర్యాప్తు ప్రారంభించింది. ఈ కేసులో ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై సమగ్ర ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం చేస్తోంది. ఈ స్కామ్పై అంతర్గత విచారణ చేపట్టిన జీహెచ్ఎంసీ విజిలెన్స్ విభాగం ప్రాథమికంగా 50 కంటే ఎక్కువ జనన, 100 కంటే ఎక్కువ మరణ నకిలీ ధ్రువీకరణ పత్రాలు జారీ చేసిన ఈ–సేవ, మీ–సేవ కేంద్రాల పైనే దృష్టి పెట్టారు. అఫ్జల్గంజ్, అంబర్పేట్, ఆసిఫ్నగర్, బహదూర్పుర, బోయిన్పల్లి, చార్మినార్, చిక్కడపల్లి, చిలకలగూడ, గోల్కొండ, కాచిగూడ, మొఘల్పుర, ముషీరాబాద్, నల్లకుంట, సైదాబాద్, సైఫాబాద్, షాహినాయత్గంజ్, యాకత్పురల్లోని 25 కేంద్రాల నిర్వాహకులు ఇన్స్టంట్ అప్రూవల్ విధానాన్ని దుర్వినియోగం చేసినట్లు గుర్తించారు. వీళ్లు ఎలాంటి ధ్రువీకరణ లేని వారితో తెల్లకాగితాలు అప్లోడ్ చేయించి జనన, మరణ ధ్రువీకరణలు జారీ చేశారని తేలింది. శివార్లను కలిపితే మరింత అధికం.. ● మొత్తం 22,954 నకిలీ సర్టిఫికెట్లకుగాను చార్మినార్ ప్రాంతంలోని నాలుగు కేంద్రాల నుంచే 4512 (19.65 శాతం) జారీ అయినట్లు వెలుగులోకి వచ్చింది. అత్యధికంగా ఓవైసీ బిల్డింగ్లో ఉన్న కేంద్రం నుంచి 2913 జారీ కాగా... ముషీరాబాద్ ఎక్స్ రోడ్లోని కేంద్రం నుంచి 969 నకిలీ ధ్రువీకరణ పత్రాలు జారీ అయ్యాయి. 50, 100 కంటే ఎక్కువ జారీ చేసిన కేంద్రల సంఖ్య సిటీలోనే 25గా ఉందని, శివార్లతో కలిపితే ఈ సంఖ్య మరింత పెరుగుతుందని ఓ అధికారి వ్యాఖ్యానించారు. వీటి కంటే తక్కువ సంఖ్యలో జారీ చేసిన ఈ–సేవ, మీ–సేవ కేంద్రాల వివరాలను ఆరా తీస్తామని ఆయన స్పష్టం చేశారు. ● గతేడాది ఏప్రిల్ నుంచి మొత్తం 31,454 దరఖాస్తులు అప్లోడ్ కాగా.. 22,954 నకిలీ సర్టిఫికెట్లు జారీ అయ్యాయని, వీటిలో 21,085 జనన, 1869 మరణ ధ్రువీకరణ పత్రాలు ఉన్నట్లు పోలీసులు తేల్చారు. ఈ తరహా దందా రాష్ట్ర వ్యాప్తంగా సాగినట్లు సీసీఎస్ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ స్కామ్ దర్యాప్తు కోసం రంగంలోకి దిగిన అధికారులు ఎలా ముందుకు వెళ్లాలనే అంశానికి సంబంధించి ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం చేస్తున్నారు. దీన్ని ఉన్నతాధికారులకు సమర్పించడం ద్వారా వారి అప్రూవల్ తీసుకోనున్నారు. ఈ కుంభకోణంపై జీహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికే ఈ–సేవ, మీ–సేవ కేంద్రాల ఈఎస్డీకీ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో వారి స్పందనను పోలీసులు పరిగణలోకి తీసుకోనున్నారు. వచ్చే వారం నుంచి ఆయా కేంద్రాల నిర్వాహకులకు నోటీసులు జారీ చేసి విచారణ ప్రారంభించనున్నారు. -
ఫేక్ సర్టిఫికేట్ల వ్యవహారంపై జీహెచ్ఎంసీ కఠిన చర్యలు..
సాక్షి, హైదరాబాద్: బర్త్, డెత్ ఫేక్ సర్టిఫికెట్ల వ్యవహారంపై జీహెచ్ఎంసీ కఠిన చర్యలు చేపట్టింది. బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు సిధ్దమైంది. మొత్తం నలుగురు బల్దియా ఉద్యోగులపై బదిలీ వేటు వేసింది. హెల్త్ విభాగం సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్లను బదిలీ చేయాలని నిర్ణయించింది. స్టాటిస్టికల్ విభాగంలో ఏఎస్ఏ, డీఎస్ఓ లను సొంత డిపార్ట్ మెంట్లకు పంపించాలని నిర్ణయం తీసుకుంది. కంప్యూటర్ ఆపరేటర్ల నియామకంలో అవకతవకలపై మేయర్ విజయలక్ష్మి సీరియస్ అయ్యారు. బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని కమిషనర్ను ఆదేశించారు. పూర్తి విచారణ జరిపి నివేదిక అందజేయాలన్నారు. ఇలాంటివి పునరాృతం కాకుండా చూడాలని కమిషనర్, మిగతా అధికారులకు ఆదేశాలు పంపారు. ఏం జరిగిందంటే..? ఆన్లైన్లో బర్త్ సర్టిఫికెట్ వచ్చేలా సాఫ్ట్వేర్ రూపొందించింది జీహెచ్ఎంసీ. అయితే ఈ చర్య ద్వారా వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యిందనే విమర్శ ఇప్పుడు వినిపిస్తోంది. బర్త్తో పాటు డెత్ సర్టిఫికెట్లను ఎడాపెడా జారీ చేశారు ఇంటిదొంగలు. అలాగే.. నాన్ అవైలబిలిటీ పేరుతో గత మార్చి నెల నుంచి డిసెంబర్ దాకా 31 వేల సర్టిఫికెట్లు జారీ చేశారు. ఆ నకిలీ సర్టిఫికెట్ల ఆధారంగానే కొందరికి పాస్ పోర్టులు, వీసాలు కూడా మంజూరు అయ్యాయి. వాటి ఆధారంగానే మరికొందరు ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నారు . అంతేకాదు.. ఫేక్ డెత్ సర్టిఫికెట్లతో బీమా బురిడీ జరిగిందని గుర్తించారు. ఈ మొత్తం వ్యవహారంలో కంప్యూటర్ ఆపరేటర్లేదే కీలక పాత్రగా నిర్ధారించుకున్న పోలీసులు.. అలాగే మీ సేవా సిబ్బందితో కొందరు అధికారులు కుమ్మకై పత్రాలు జారీ చేసినట్లు గుర్తించారు. పోలీసుల చర్యలతో బయటపడ్డ బాగోతం గత డిసెంబర్లో మొఘల్ పురలోని మూడు మీసేవా సెంటర్లలో టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. వందల కొద్దీ నకిలీ సర్టిఫికెట్లు బయటపడ్డాయి. దీంతో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది ఈ అంశం. ఇక పోలీసుల చర్యలతో జీహెచ్ఎంసీ మేల్కొంది. గ్రేటర్లోని 30 సర్కిళ్లలో ఈ తతంగం జరిగినట్లు గుర్తించి, 27 వేలకు పైగా నకిలీ సర్టిఫికెట్లను రద్దు చేస్తున్నట్టు జీహెచ్ఎంసీ ప్రకటించింది. అంతేకాదు.. విజిలెన్స్ విచారణకు ఆదేశించింది కూడా. చదవండి: రసవత్తరంగా రాజకీయం.. కవిత లేఖకి ఈడీ రిప్లై! -
ఫేక్ సర్టిఫికెట్ల స్కాం.. రాజాసింగ్ సంచలన ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్: నగరంలో వెలుగుచూసిన నకిలీ సర్టిఫికెట్ల జారీ వ్యవహారంపై ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారాయన. పాతబస్తీ కేంద్రంగా నకిలీ బర్త్ సర్టిఫికెట్స్ జారీ చేశారని, ఈ స్కాంలో ఎంఐఎం పాత్ర కూడా ఉందని ఆరోపించారాయన. పాకిస్థాన్, బంగ్లాదేశ్కు చెందిన వారికి కూడా సర్టిఫికేట్స్ అంది ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే కచ్చితంగా సర్జికల్ స్ట్రీక్ నిర్వహిస్తామన్నారు. విదేశీ చొరబాటు దారులను అరికట్టేందుకు ఎన్ఆర్సీ, సీఏఏ అమలు కావాలన్నారు. బీఆర్ఎస్ నేతలు ఎంఐఎంకు భయపడి ఓల్డ్ సిటీ వైపు చూడరని ఆయన వ్యాఖానించారు. ఔట్ సోర్సింగ్ ఇచ్చాక వారిపై నిఘా పెట్టల్సిన అవసరం ఉందని రాజాసింగ్ అన్నారు. ఇదిలా ఉంటే.. ఆన్లైన్లో బర్త్ సర్టిఫికెట్ వచ్చేలా సాఫ్ట్వేర్ రూపొందించింది జీహెచ్ఎంసీ. అయితే ఈ చర్య ద్వారా వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యిందనే విమర్శ ఇప్పుడు వినిపిస్తోంది. బర్త్తో పాటు డెత్ సర్టిఫికెట్లను ఎడాపెడా జారీ చేశారు ఇంటిదొంగలు. అలాగే.. నాన్ అవైలబిలిటీ పేరుతో గత మార్చి నెల నుంచి డిసెంబర్ దాకా 31 వేల సర్టిఫికెట్లు జారీ చేశారు. ఆ నకిలీ సర్టిఫికెట్ల ఆధారంగానే కొందరికి పాస్ పోర్టులు, వీసాలు కూడా మంజూరు అయ్యాయి. వాటి ఆధారంగానే మరికొందరు ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నారు . అంతేకాదు.. ఫేక్ డెత్ సర్టిఫికెట్లతో బీమా బురిడీ జరిగిందని గుర్తించారు. ఈ మొత్తం వ్యవహారంలో కంప్యూటర్ ఆపరేటర్లేదే కీలక పాత్రగా నిర్ధారించుకున్న పోలీసులు.. అలాగే మీ సేవా సిబ్బందితో కొందరు అధికారులు కుమ్మకై పత్రాలు జారీ చేసినట్లు గుర్తించారు. పోలీసుల చర్యలతో బయటపడ్డ బాగోతం గత డిసెంబర్లో మొఘల్ పురలోని మూడు మీసేవా సెంటర్లలో టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. వందల కొద్దీ నకిలీ సర్టిఫికెట్లు బయటపడ్డాయి. దీంతో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది ఈ అంశం. ఇక పోలీసుల చర్యలతో జీహెచ్ఎంసీ మేల్కొంది. గ్రేటర్లోని 30 సర్కిళ్లలో ఈ తతంగం జరిగినట్లు గుర్తించి, 27 వేలకు పైగా నకిలీ సర్టిఫికెట్లను రద్దు చేస్తున్నట్టు జీహెచ్ఎంసీ ప్రకటించింది. అంతేకాదు.. విజిలెన్స్ విచారణకు ఆదేశించింది కూడా. -
ఎఫ్ఎంజీ నకిలీ సర్టిఫికెట్ల కుంభకోణం బట్టబయలు
సాక్షి, అమరావతి/లబ్బీపేట (విజయవాడ తూర్పు): దేశంలో ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ (ఎఫ్ఎంజీ) ఫేక్ సర్టిఫికెట్ల కుంభకోణం వెలుగు చూసింది. దాంతో సీబీఐ మన రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం సహా దేశంలోని 91 నగరాలు, పట్టణాల్లో గురువారం విస్తృతంగా సోదాలు నిర్వహించింది. ఎఫ్ఎంజీ ఫేక్ సర్టిఫికెట్లకు సంబంధించిన కీలక ఆధారాలను సేకరించింది. విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన భారతీయ విద్యార్థులు మనదేశంలో వైద్యవృత్తి చేపట్టాలంటే ఎఫ్ఎంజీ పరీక్షలో ఉత్తీర్ణులు కావాలి. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్బీఈఎంఎస్) ఈ పరీక్ష నిర్వహిస్తుంది. కాగా, ఇందులో ఉత్తీర్ణులు కాకుండానే ఉత్తీర్ణులైనట్టుగా దేశంలో 73మంది ఫేక్ సర్టిఫికెట్లు సమర్పించినట్టు సీబీఐ గుర్తించింది. ఆ ఫేక్ సర్టిఫికెట్లను ఆయా రాష్ట్రాల మెడికల్ కౌన్సిళ్లు సైతం ఆమోదించడం గమనార్హం. దీనిపై సీబీఐ ఈ నెల 22న కేసు నమోదు చేసింది. దర్యాప్తులో భాగంగా గురువారం దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహించింది. ఈ ఫేక్ సర్టిఫికెట్లతో ప్రమేయం ఉన్న పలువురు ఎఫ్ఎంజీ గ్రాడ్యుయేట్లు, అందుకు సహకరించిన మెడికల్ కౌన్సిళ్లు, వైద్య సంస్థలను గుర్తించింది. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తామని సీబీఐ ప్రకటించింది. మన రాష్ట్రంలోనూ నకిలీ సర్టిఫికెట్ల రిజిస్ట్రేషన్ ఎఫ్ఎంజీ ఫేక్ సర్టిఫికెట్ల కుంభకోణానికి సంబంధించి విజయవాడలోని రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ కార్యాలయంలో సీబీఐ అధికారులు ఈ నెల 23న తనిఖీలు నిర్వహించారు. 12 గంటలపాటు ఏకబిగిన కొనసాగిన ఈ సోదాల్లో 2014 నుంచి 18 మధ్య విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసి రాష్ట్రంలో రిజిస్టర్ చేసుకున్న వైద్యుల వివరాలను పరిశీలించారు. ఇతర రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. తనిఖీలు కొనసాగుతున్నంతసేపు కార్యాలయంలో అధికారులు, సిబ్బందిని బయటకు కూడా పంపించలేదు. కాగా గురువారం విజయవాడలోని రాష్ట్ర మెడికల్ కౌన్సిల్తోపాటు విశాఖపట్నంలోనూ సీబీఐ సోదాలు నిర్వహించింది. -
భలే అడ్వొకేట్లు.. వంశ వృక్షాన్నే డూప్లికేట్ చేశారు!
అనంతపురం శ్రీకంఠం సర్కిల్: న్యాయవాద వృత్తిలో ఉన్న తల్లీ కుమారుడు సునాయసంగా డబ్బు సంపాదించేందుకు అడ్డదారి తొక్కారు. బతికున్న యజమానులను చనిపోయినట్లుగా సర్టిఫికెట్లు సృష్టించి.. నకిలీ వారసులను తెరపైకి తీసుకొచ్చి.. వారి ద్వారా రూ.75లక్షల విలువచేసే ఆస్తి కాజేయబోయారు. బాధితుడి ఫిర్యాదుతో బండారం బయటపడిపోయింది. కీలక సూత్రధారులైన తల్లీ కుమారుడు, వీరికి సహకరించిన మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను అనంతపురం ఇన్చార్జ్ డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు ఆదివారం తన చాంబర్లో టూటౌన్ సీఐ శివరాముడుతో కలిసి మీడియాకు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లో నివాసముంటున్న అనంతపురం వాసి శ్రీరాములునాయక్కు స్థానిక ఆదర్శ నగర్ కాలనీలో 333, 339 సర్వేనంబర్లలోని 5.14 సెంట్ల విస్తీర్ణంలో ఇల్లు ఉంది. రూ.75లక్షలు విలువ చేసే ఈ ఆస్తిని ప్రస్తుతం అమ్మకానికి పెట్టారు. ఈ క్రమంలో ధర్మవరం న్యాయవాది కట్టా శ్రీదేవి, ఆమె కుమారుడు కట్టా గణేష్లు ఆ ఆస్తి డాక్యుమెంట్లు సేకరించారు. యజమాని ఇక్కడ లేనందున ఎలాగైనా ఆస్తిని కొట్టేయాలని కుట్ర పన్నారు. శ్రీరాములు నాయక్, ఆయన భార్య ఇద్దరూ చనిపోయినట్లుగా తమ ల్యాప్టాప్లోనే నకిలీ డెత్ సర్టిఫికెట్లు తయారు చేశారు. కట్టా శ్రీదేవి తనకు అత్యంత నమ్మకస్తురాలైన పనిమనిషి ముత్యాలమ్మ, అనిల్కుమార్, బండిమాల లోకేశ్వర, సాంబశివ, డాక్యుమెంట్ రైటర్ శ్రీనివాసప్రసాద్, గుర్రం గణేష్ల సహకారం తీసుకున్నారు. అనిల్కుమార్ను శ్రీరాములునాయక్ కొడుకుగా చిత్రీకరిస్తూ ఆధార్కార్డులో మార్పులు చేశారు. నకిలీ వంశ వృక్షం తయారు చేయించారు. వీటి ద్వారా గత సెప్టెంబర్ 23న ధర్మవరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో శ్రీరాములునాయక్ ఆస్తిని అనిల్కుమార్ పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. ఆ తర్వాత అనిల్కుమార్ నుంచి పనిమనిషి ముత్యాలమ్మకు జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ చేయించారు. మోసం బయటపడిందిలా.. శ్రీరాములు నాయక్ తన ఆస్తిని అమ్మే ఏర్పాట్లను ఈ నెలలో ముమ్మరం చేశాడు. ఈ క్రమంలో ‘జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ’ అనిల్కుమార్ నుంచి ముత్యాలమ్మకు వెళ్లినట్లు బయటపడింది. దీంతో శ్రీరాములునాయక్ ఎవరో తన ఆస్తిని కాజేశారని ఎస్పీ ఫక్కీరప్పకు ‘స్పందన’లో ఫిర్యాదు చేశారు. దీన్ని సీరియస్గా తీసుకున్న ఎస్పీ కేసును టూటౌన్ పోలీసులకు అప్పగించారు. ఎస్పీ ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు తీగ లాగితే డొంక కదిలింది. దర్యాప్తులో తల్లీ కొడుకులైన అడ్వొకేట్లు కట్టా శ్రీదేవి, కట్టా గణేష్ల పన్నాగం బయట పడింది. దీంతో తల్లీకుమారుడితో పాటు ధర్మవరం మండలం దర్శినమలకు చెందిన బేతరాసి అనిల్కుమార్, అనంతపురం రామ్నగర్కు చెందిన జింక శ్రీనివాస ప్రసాద్, చెన్నేకొత్త పల్లి మండలం బసంపల్లికి చెందిన పుట్టపర్తి సాంబశివ, బండిమాల లోకేశ్వర్ను ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి ల్యాప్టాప్, సెల్ఫోన్, డెత్ సర్టిఫికెట్, లీగల్ హైర్ సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు రిమాండ్కు పంపారు. ఈ కేసులో మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. త్వరలోనే వారిని కూడా అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు. -
ఇద్దరు దోస్తులు.. టెన్త్లో ఒకరు ఫెయిల్, ఒకరు పాస్.. 25 ఏళ్లుగా డాక్టర్ పని
వరంగల్ క్రైం: చదివింది పదో తరగతి.. అందులో ఒకరు ఫెయిల్.. మరొకరు పాస్. ఇద్దరు మిత్రులు.. డాక్టర్ల వద్ద పనిచేసిన అనుభవం.. పైసలపై ఆశ పెరగడంతో డాక్టర్ల అవతారమెత్తారు. అందుకు అవసరమయ్యే సర్టిఫికెట్లను కొనుగోలు చేశారు. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 25ఏళ్లుగా నగరంలో డాక్టర్లుగా చలామణి అవుతున్న ఇద్దరు నకిలీల బాగోతం ఎట్టకేలకు బయటపడింది. నిందితులను టాస్క్ఫోర్స్, ఇంతేజార్గంజ్ పోలీసులు అరెస్టు చేసినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి తెలిపారు. నకిలీ డాక్టర్ల నుంచి రూ.1.28 లక్షలు నగదు, ఆస్పత్రి పరికరాలు, మందులను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. మంగళవారం కమిషరేట్లో నిందితుల వివరాలు వెల్లడించారు. హంటర్రోడ్డు ప్రాంతానికి చెందిన ఇమ్మడి కుమార్ పదో తరగతి పూర్తి చేయగా, వరంగల్ చార్బౌళి ప్రాంతానికి చెందిన మహ్మమద్ రఫీ ఫెయిల్ అయ్యాడు. ఇద్దరు మిత్రులు కావడంతో 1997 సంవత్సరానికి ముందు ప్రముఖ డాక్టర్ల దగ్గర అసిస్టెంట్లుగా పనిచేశారు. డబ్బులు బాగా సంపాదించాలనే ఆలోచనతో బీహార్ రాష్ట్రంలోని దేవఘర్ విద్యాపీఠ్ విశ్వవిద్యాలయంనుంచి ఆయుర్వేద వైద్యంలో డిగ్రీ పూర్తి చేసినట్లుగా నకిలీ సర్టిఫికెట్లతోపాటు గుర్తింపు కార్డులు కొనుగోలు చేశారు. కుమార్ క్రాంతి క్లినిక్ పేరుతో కొత్తవాడలో దుకాణం తెరిచాడు. రఫీ సలీమా క్లినిక్ పేరుతో చార్బౌళి ప్రాంతంలో 25 ఏళ్లుగా ఆస్పత్రి నడిపిస్తున్నాడు. సాధారణ రోగాలతో వచ్చే వారి దగ్గర పెద్ద మొత్తంలో డబ్బులు గుంజేవారు. రోగం ముదిరేలోపే కార్పొరేట్ ఆస్పత్రులకు పంపేవారు. చివరికి నకిలీ డాక్టర్ల వ్యవహారం బయటకు తెలియడంతో టాస్క్ఫోర్స్ పోలీసులు స్థానిక మట్టెవాడ, ఇంతేజార్గంజ్ పోలీసులు.. వరంగల్ రీజినల్ ఆయుష్ విభాగం వైద్యుల ఆధ్వర్యంలో రెండు ఆస్పత్రులపై దాడి చేశారు. నిందితులను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించడంతో నేరం ఒప్పుకున్నారు. నకిలీ డాక్టర్లను అరెస్టు చేయడంలో ప్రతిభ చూపిన టాస్క్ఫోర్స్, పోలీసులను సీపీ డాక్టర్ తరుణ్ జోషి అభినందించారు. -
మున్నాభాయ్ వర్సిటీ..! పది నుంచి పీహెచ్డీ దాకా.. ఏది కావాలన్నా రెడీ
సాక్షి, హైదరాబాద్: ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాయడం చూశాం.. కాపీ కొట్టి పరీక్ష రాసి టాప్ ర్యాంకులు పొందిన వారినీ చూశాం.. కానీ ఏ కోర్సు చదవకుండానే ఎంబీబీఎస్, ఎంటెక్, పీహెచ్డీ... ఇలా ఏ సర్టిఫికెట్ కావాలన్నా చిటికెలో రూపొందించి ఇస్తున్న ముఠాలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. పదో తరగతి నుంచి పీహెచ్డీ, ప్రొఫెషనల్ కోర్సుల సర్టిఫికెట్ల దాకా ఏదైనా తయారుచేసి నిరుద్యోగ యువతను కటకటాల్లోకి వెళ్లేలా చేస్తున్నాయి. సర్టిఫికెట్ను బట్టి రేటు.. కూకట్పల్లికి చెందిన నవీన్ (పేరు మార్చాం) డిగ్రీ సర్టిఫికెట్ కావాలని తన స్నేహితుడు కరణ్ (పేరు మార్చాం)కి అడి గాడు. తనకు తెలిసిన విజయవాడ స్నేహితుడు రామ్మో హన్ను కలిస్తే పని అవుతుందని, యూపీలోని ఓ యూని వర్సిటీ నుంచి బీకాం సర్టిఫికెట్ తెప్పిస్తాడని చెప్పాడు. రామ్మోహన్కు కాల్ చేయగా రూ.1.2 లక్షలు ఖర్చువుతుందనగా... తాను 90 వేలు ఇవ్వగలను అన్నాడు. ఆ మేరకు డబ్బులివ్వగా వారంలోనే సర్టిఫికెట్ ఇచ్చాడు. ఇలా ముఠాలు నిరుద్యోగ యువత అవసరాన్ని ఆసరాగా చేసుకొని పేర్లు కూడా సరిగ్గా తెలియని యూనివర్సిటీల పేరిట నకిలీ సర్టిఫికెట్లు ఇస్తున్నాయి. పదో తరగతి సర్టిఫికెట్కు రూ.లక్ష, ఇంటర్ రూ.80 వేలు, డిగ్రీకి కనీసం రూ.లక్ష, బీటెక్ అయితే రూ.2.5 లక్షల నుంచి 3 లక్షల వరకు వసూలు చేస్తున్నట్టు రాచకొండ, సైబరాబాద్ పోలీసుల విచారణలో బయటపడింది. వరుస కేసులతో గుట్టురట్టు.. ఈ ఏడాది జూన్, జూలై, ఆగస్టులో సైబరాబాద్, రాచకొండ పోలీసులు నకిలీ సర్టిఫికెట్ రాకెట్ల గుట్టురట్టు చేసి పలువురిని కటకటాల పాలుచేశారు. జూలైలో గ్యాంగ్ సూత్రధారిగా ఉన్న విజయవాడకు చెందిన ప్రైవేట్ టీచర్ కోటా కిషోర్ వివిధ బోర్డులు, యూనివర్సిటీల పేరిట నకిలీ సర్టిఫికెట్లు అమ్ముతున్నట్టు గుర్తించి 11మందిని అరెస్ట్ చేశారు. 18 వర్సి టీలు, 13 రాష్ట్రాల బోర్డుల పేరిట వందల సర్టిఫికెట్లు సృష్టించి డబ్బులు దండుకున్నట్టు గుర్తించారు. ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లాలనుకున్న వారిని టార్గెట్ చేసు కొని నకిలీలు రూపొందించిన ఏడుగురిని గత ఆగస్టులో అరెస్ట్చేశారు. రూ.25 వేల నుంచి 5 లక్షల వరకు తీసుకొని 500 మందికి నకిలీ సర్టిఫికెట్లు, రికమెండేషన్ లెటర్లు సమకూర్చి నట్టు వెలుగులోకి వచ్చింది. అలాగే, విదేశాలకు వెళ్లా లనుకునే వారికి బీటెక్, ఎంటెక్ సర్టిఫి కెట్లు రూపొందించి లక్షలు సొమ్ము చేసుకున్నట్టు బయటపడింది. అమెరికా, యూకే, కెనడా వెళ్లేందుకు వీసాలు ప్రాసెస్ చేస్తా మని చైతన్యపురిలో కన్సల్టెన్సీ బోర్డు పెట్టి నకిలీలు రూపొందించిన ముఠాను అరెస్ట్ చేశారు. కాక తీయ, ఉస్మానియా, ఆచార్య నాగార్జున, జేఎన్టీయూ వర్సిటీల ఒరిజినల్ సర్టిఫికెట్లను స్కాన్ చేసి నకిలీలు సృష్టి స్తూ వీసాలకు డాక్యుమెంట్లను రూపొందించిన వ్యవహా రా న్ని పోలీసులు బయటపెట్టారు. ఈ ముఠాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇంజనీ రింగ్ పూర్తిచేసిన ఓ మహిళ, మరో ఇద్దరు నిరుద్యోగులను కటకటాల్లోకి నెట్టినట్టు పోలీసులు తెలిపారు. గల్లీకో కన్సల్టెన్సీ.. ఎలాగైనా విదేశాలకు వెళ్లి సెటిల్ అవ్వాలని అక్రమ మార్గాలను ఎంచుకుంటున్న యువతకు ఈ కన్సల్టెన్సీలు ఆశాదీపంగా కనిపిస్తున్నాయి. పైగా ఎంత డిమాండ్ చేస్తే అంత మొత్తంలో డబ్బులు దండుకోవచ్చన్న అత్యాశతో మోసాలకు పాల్ప డుతున్నారు. గల్లీకో కన్సల్టెన్సీ పేరిట అందమైన ఆఫీసులు పెట్టి బురిడీ కొట్టిస్తున్నారు. ఒక్క హైదరాబాద్లోనే 2వేలకు పైగా ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ లున్నాయంటే ఆశ్చర్యపోవాల్సిందే. ఇందులో సగానికి పైగా కన్సల్టెన్సీలు అక్రమ మార్గాల్లో విద్యార్థులను విదేశాలకు పంపుతున్నట్టు తెలుస్తోంది. కొంతమంది ఒరిజినల్ సర్టిఫికెట్లు ఉన్నా వీసా రాదనే భయంతో కన్సల్టెన్సీలను సంప్రదిస్తున్నారు. -
నకిలీ సర్టిఫికెట్ల తయారీలో శిక్షణ!
సాక్షి, హైదరాబాద్: నకిలీ విద్యార్హత పత్రాల తయారీ ముఠా గుట్టురట్టయ్యింది. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాలకు చెందిన ఇంటర్, డిగ్రీ సర్టిఫికెట్లను సృష్టించి, విక్రయిస్తున్న ముఠాను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. మంగళవారం ఎస్ఓటీ డీసీపీ కే మురళీధర్, ఎల్బీనగర్ డీసీపీ సన్ప్రీత్సింగ్లతో కలిసి రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ వివరాలు వెల్లడించారు. చాంద్రాయణగుట్ట, క్యూబా కాలనీకి చెందిన మహ్మద్ ఖలీముద్దీన్ అలియాస్ ఖలీం నకిలీ సర్టిఫికెట్లను తయారు చేయడంలో దిట్ట. గత ఏడేళ్లుగా ఈ దందాను నిర్వహిస్తున్నాడు. ఇతనిపై చాంద్రాయణగుట్ట, అబిడ్స్ ఠాణాలలో రెండు కేసులున్నాయి. పోలీసుల నిఘా ఉండటంతో అజ్ఞాతంలో ఉంటూ తన అనుచరులకు శిక్షణ ఇస్తున్నాడు. ఖలీం స్నేహితుడైన గోల్కొండ మోతీ దర్వాజకు చెందిన ముక్తార్ అహ్మద్కు అడోబ్ ఫొటోషాప్లో ఫొటోలు, డాక్యుమెంట్ల ఎడిటింగ్పై మంచి అనుభవం ఉంది. దీంతో ఖలీం ఇతనికి నకిలీ సరి్టఫికెట్ల తయారీ శిక్షణ ఇచ్చాడు. అలాగే విద్యార్హత పత్రాల తయారీకి అవసరమైన యూనివర్సిటీ గుర్తింపు చిహ్నలు, హాలోగ్రామ్స్ ఇతరత్రా వస్తువులను అందించాడు. తన పేరు బయటకు రాకుండా రహస్యంగా ఉంచాలని, కమీషన్ ఏజెంట్లను నియమించుకోవాలని సూచించాడు. రాజేంద్రనగర్కు చెందిన అహ్మద్ ఫిరోజ్, లక్డీకపూల్ ఏసీ గార్డ్స్కు చెందిన మహ్మద్ ఫరూక్ అజీజ్, టోలిచౌకీ పారామౌంట్ కాలనీకి చెందిన మహ్మద్ సారూషుల్లా ఖాన్లను ముక్తార్ కమీషన్ ఏజెంట్లుగా నియమించుకున్నాడు. వారికి అవసరమైనట్లు నకిలీ విద్యార్హత పత్రాలను తయారు చేసేవాడు. ఒక్కో సరి్టఫికెట్ను రూ. లక్ష, రూ. 2 లక్షలకు విక్రయించేవాడు. ఇందులో 25 శాతం కమీషన్ను ఖలీంకు చెల్లించేవారు. ఈ క్రమంలో నిందితుల నుంచి హుస్సేనీఆలంకు చెందిన మహ్మద్ జుబేర్ అలీ, టోలిచౌకీకి చెందిన సయ్యద్ అతీఫుద్దిన్ రూ.లక్షకు నకిలీ విద్యార్హత పత్రాలను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. సర్టిఫికెట్లను తీసుకునేందుకు బాలాపూర్ ఎర్రకుంటకు వెళ్లారు. విశ్వసనీయ సమాచారంతో పోలీసులు దాడులు చేసి సరూషుల్లా ఖాన్, జుబేర్, అతీఫుద్దిన్, ఫరూఖ్ అజీజ్, మహ్మద్ ఫిరోజ్, ముక్తార్ అహ్మద్లను పట్టుకున్నారు. వీరి నుంచి నకిలీ సర్టిఫికెట్లతో పాటు ల్యాప్టాప్, స్టాంప్లు, 6 సెల్ఫోన్లు ఇతరత్రా వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు ఈ ముఠా 258 సర్టిఫికెట్లను తయారు చేసి, విక్రయించారని, వీరిలో పలువురు విదేశాలకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఎర్రగడ్డకు చెందిన సల్మాన్ యూకేకు, కాలాపత్తర్కు చెందిన మీర్జా యూసుఫుద్దిన్ న్యూయార్క్కు, మెహదీపట్నానికి చెందిన మహ్మద్ మాజీద్ అమెరికాకు, గోల్కొండకు చెందిన రెహాన్, అశ్వాక్ అహ్మద్ దుబాయ్ దేశాలకు వెళ్లినట్లు సీపీ తెలిపారు. నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేసి, ఫాస్ట్ట్రాక్ కోర్ట్లో శిక్ష పడేలా చేస్తామని పేర్కొన్నారు. వీరి వెనకెవరున్నారు? ఈ నకిలీ సరి్టఫికెట్ల రాకెట్ను నడుపుతున్న ప్రధాన నిందితుడు మహ్మద్ ఖలీముద్దిన్తో సహా ఇతర నిందితులు, కొనుగోలు చేసే విద్యార్థులు అందరూ ఒకే వర్గానికి చెందిన వారే కావటంతో పోలీసులు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. వీరి నుంచి నకిలీ పత్రాలను కొనుగోలు చేసిన విద్యార్థులు ఎక్కువగా గల్ఫ్ దేశాలకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో వీరి వెనక ఎవరైనా అదృశ్య శక్తులు ఉండి ఈ రాకెట్ను నడిపిస్తున్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు సూత్రధారి ఖలీం పట్టుబడితేనే దీని వెనక ఎవరున్నారనేది బయటపడుతుందని ఓ పోలీసు ఉన్నతాధికారి పేర్కొన్నారు. అతని కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు తెలిపారు. (చదవండి: నకిలీ పత్రాలతో ఇల్లు విక్రయం) -
హైదరాబాద్ లో ఫేక్ సర్టిఫికెట్ల దందా గుట్టురట్టు
-
తెలంగాణ: నకిలీ సర్టిఫికెట్స్తో 230 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు
సాక్షి, హైదరాబాద్: కాంట్రాక్ట్ జూనియర్ లెక్చర్లలో 230 మంది నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగం పొందినట్లు తెలంగాణ ఆర్థికశాఖ అధికారులు గుర్తించారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరణ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో వివిధ శాఖల్లోని కాంట్రాక్ట్ ఉద్యోగుల వివారలను సేకరించారు. రాష్ట్రవ్యాప్తంగా కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్న వారు 11 వేల మంది ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే వారి వివరాలు పంపించాలని ఆయా శాఖలను ఆర్థిక శాఖ కోరింది. దీంతో తమ తమ శాఖల్లోని ఉద్యోగుల వివరాలను అధికారులు సేకరించి, వారి సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేశారు. ఈ క్రమంలో అనేక అవకతవకలు వెలుగు చూశాయి. 230 మంది కాంట్రాక్ట్ లెక్చర్ర్లు నకిలీలుగా తేలింది. మరికొంతమంది మంజూరు లేని పోస్టులలోపనిచేస్తున్నట్లు, క్వాలిఫికేషన్ లేకున్నా కాంట్రాక్ట్ లెక్చరర్లుగా జాయిన్ అయినట్లు బయటపడింది. ఇప్పటి వరకు 18 మంది డిగ్రీ లెక్చర్లు, ఆరుగురు పాలిటెక్నిక్ లెక్చరర్లకు అధికారులు షోకాజ్ నోటీసులు అందించారు. మరి నకిలీ లెక్చరర్ల విషయంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి. చదవండి: బండి సంజయ్కు హయత్ నగర్ పోలీసులు నోటీసులు -
నకిలీ కోవిడ్ డెత్ సర్టిఫికెట్లపై సుప్రీం ఆందోళన
న్యూఢిల్లీ: దేశంలో కొందరు డాక్టర్లు నకిలీ కోవిడ్–19 డెత్ సర్టిఫికెట్లు జారీ చేస్తుండడం పట్ల సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా కారణంగా మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ఇస్తున్న నష్ట పరిహారాన్ని కాజేయడానికి నకిలీ డెత్ సర్టిఫికెట్లు పుట్టుకొస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంలో దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందని జస్టిస్ ఎం.ఆర్.షా, జస్టిస్ బి.వి.నాగరత్నతో కూడిన ధర్మాసనం పేర్కొంది. నష్టపరిహారం కోరుతూ వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి నిర్ధిష్ట కాల వ్యవధి ఉండాలని సూచించింది. ఏకంగా డాక్టర్లే నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాలు ఇస్తుండడం తీవ్రమైన విషయమని ధర్మాసనం తెలిపింది. దీనివల్ల అసలైన బాధితులకు అన్యాయం జరుగుతుందని వెల్లడించింది. గౌరవ్ బన్సల్తోపాటు మరికొందరు దాఖలు చేసిన పిటిషన్లపై ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. -
నాడే చిక్కిన నాగమణి!
సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ (టీఎస్ఎంసీ) డేటాబేస్ ట్యాంపరింగ్ చేసి, అనర్హులను రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు జారీ చేసిన కేసు దర్యాప్తును సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ముమ్మరం చేశారు. ఈ కేసులో కౌన్సిల్ సీనియర్ అసిస్టెంట్ అనంతకుమార్తో సహా ముగ్గురు నిందితులను గురువారం అరెస్టు చేసిన విషయం విదితమే. ఈ కేసులో మరో అనుమానితురాలిగా ఉన్న నాగమణి 2015లోనే అరెస్టు అయినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ►విజయవాడకు చెందిన భూక్యా నాగమణి, విజయనగరానికి చెందిన గంట రాంబాబు సన్నిహితులు. వీరిద్దరూ కలిసి 2015లో నకిలీ ఎంబీబీఎస్ సర్టిఫికెట్తో పాటు ఏపీ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ పత్రాన్ని డీటీపీలో రూపొందించారు. గుంటూరు జిల్లా నిజాంపట్నానికి చెందిన చెన్ను నాగమణి 2012లో ఏపీ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ చేయించుకున్నారు. ఈమెకు చెందిన 65699 నంబర్నే వినియోగించిన ఈ ద్వయం నకిలీ పత్రాలు రూపొందించింది. ►వీటి ఆధారంగా నాగమణి నగరానికి చెందిన రమేష్ ద్వారా ఆదిలాబాద్ జిల్లా చెన్నూరులో ఉన్న లక్ష్మీ నర్సింగ్ హోమ్లో గైనకాలజిస్ట్గా చేరారు. తన విద్యార్హత పత్రాల్లో ఎంబీబీఎస్, ఎంఎస్ (ఓబీజీ) అంటూ పొందుపరచడంతో ఆస్పత్రి యాజమాన్యం ఉద్యోగం ఇచ్చింది. ఈమె వ్యవహారశైలి, రాస్తున్న మందులు చూసిన సదరు హాస్పిటల్ పరిపాలనాధిపతి సుభాష్ అనుమానించారు. తన సందేహం నివృతి చేయాల్సిందిగా కోరుతూ మెడికల్ కౌన్సిల్కు లేఖ రాశారు. ►పూర్వాపరాలు పరిశీలించిన కౌన్సిల్ నాగమణి నకిలీ వైద్యురాలని తేల్చడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిందిగా సుభాష్కు సూచించింది. దీంతో ఆయన చెన్నూరు పోలీసు లకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న ఆ పోలీసులు నాగమణితో పాటు రాంబాబును 2015 ఆగస్టు 22న అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టు విచారణలో ఉంది. ►ఇంతవరకు బాగానే ఉన్నా... ఈ కేసును లోతుగా దర్యాప్తు చేయడంలో చెన్నూరు పోలీసులు విఫలయ్యారు. నాగమణి, రాంబాబు కలిసి డీటీపీ ద్వారా నకిలీ సర్టిఫికెట్లు తయారు చేశారని తేల్చారు. ఉమ్మడి రాష్ట్రంలోని ఏపీ మెడికల్ కౌన్సిల్లో నిజాంపట్నానికి చెందిన చెన్ను నాగమణి రిజిస్టర్ చేసుకున్నారని, ఆమె రిజిస్ట్రేషన్ నంబర్ 65699 అని వీరికి ఎలా తెలిసిందనేది ఆరా తీయలేదు. ఇప్పుడు ఈ కోణంపై దృష్టి పెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది. -
నకిలీల ‘అవుట్ సోర్సింగ్’
వరంగల్ జిల్లాలో ఉన్న ఓ ఏకలవ్య మోడల్ స్కూల్లో క్రాఫ్ట్ టీచర్గా ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగి పనిచేస్తున్నాడు. వాస్తవానికి ఆ వ్యక్తి పదోతరగతి మాత్రమే చదవగా.. డిగ్రీ, అనుబంధ కోర్సులో ఉత్తీర్ణత సాధించినట్లు నకిలీ సర్టిఫికెట్లు సృష్టించాడు. తర్వాత అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా క్రాఫ్ట్ టీచర్ ఉద్యోగం సంపాదించాడు. ఇలా ఒకరిద్దరు కాదు.. గిరిజన గురుకుల విద్యా సంస్థల సొసైటీ, ఏకలవ్య మోడల్ పాఠశాలల్లోని పలు విభాగాల్లో పదుల సంఖ్యలో నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు పొందారు. సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ విభాగాల్లో తాత్కాలిక పద్ధతిలో నియమించే అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకూ ‘నకిలీ’చీడ పట్టింది. వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగామ, భూపాలపల్లి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని గురుకుల విద్యా సంస్థలు, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో పెద్ద సంఖ్యలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో ‘నకిలీలు’ఉ న్నట్లు తెలుస్తోంది. వారికి అర్హత లేకున్నా ఇంటర్మీ డియట్, డిగ్రీ, పీజీ సర్టిఫికెట్లను తప్పుడు పద్ధతిలో సృష్టించి వాటి ద్వారా అవుట్ సోర్సింగ్ కొలువులు సంపాదించుకున్నట్లు తెలిసింది. ఈ అంశం జిల్లా స్థాయిలో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లినప్పటికీ ఏమాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం. బోగస్ సర్టిఫికెట్లతో బురిడీ.. అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలను జిల్లా స్థాయిలో ఒక ప్రైవేటు ఏజెన్సీ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఈ ఏజెన్సీల ద్వారా వచ్చే అభ్యర్థుల సర్టిఫికెట్లు పరిశీలించి, ఆమోదం తెలిపిన అనంతరం వారిని ఉద్యోగంలో చేరనిస్తారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు నెలవారీ జీతాలను ప్రభుత్వం నేరుగా కాకుండా ఏజెన్సీల ద్వారా చెల్లిస్తారు. ఈ క్రమంలో ఏజెన్సీల్లోని కొందరు నిర్వాహకులు ఒకరిద్దరు అధికారులతో మిలాఖత్ అయ్యి నకిలీ సర్టిఫికెట్లున్న అభ్యర్థులకు కొలువులు కట్టబెట్టినట్లు తెలుస్తోంది. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని గురుకుల విద్యాసంస్థలు, కాలేజీలతో పాటు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో పెద్ద సంఖ్యలో తప్పుడు పద్ధతిలో ఉద్యోగాలు భర్తీ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాదాపు వందకు పైగా ఉద్యోగులను ఇలా ఎంపిక చేసినట్లు వెల్లడైంది. సబార్డినేట్ పోస్టులే ఎక్కువ.. గిరిజన గురుకుల సొసైటీతో పాటు ఏకలవ్య మోడల్ స్కూళ్లలో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేసిన ఉద్యోగాల్లో అత్యధికం సబార్డినేట్ పోస్టులే ఉన్నట్లు సమాచారం. వాటితో పాటు కొన్నిచోట్ల బోధన సిబ్బందిని సైతం ఇలాగే భర్తీ చేసినట్లు తెలుస్తోంది. ల్యాబ్ అసిస్టెంట్, అటెండర్ పోస్టులతో పాటు మెస్ మేనేజర్, క్రాఫ్ట్ టీచర్, ఆర్ట్ టీచర్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టుల్లో ఇలాంటి ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం. సబార్డినేట్ పోస్టులకు సంబంధించి ఇంటర్మీడియట్ సర్టిఫికెట్లు నకిలీవి సృష్టించగా, బోధన సిబ్బంది కేటగిరీలో డిగ్రీ, పీజీ సర్టిఫికెట్లను తప్పుడు పద్ధతిలో సృష్టించారు. ఈ వ్యవహారానికి సంబంధించి విచారణ జరపాలని ఉన్నతాధికారులకు సైతం ఫిర్యాదులు అందినట్లు తెలిసింది. పూర్తిస్థాయిలో విచారణ జరిపితే అక్రమాల గుట్టు తెలుస్తుందని అంటున్నారు. -
బేరాల్లేవమ్మా.. ఎస్సెస్సీ టు బీటెక్.. ఏదైనా ఒకే రేటు!
సాక్షి, హైదరాబాద్: ప్రతిభ కలిగిన విద్యార్థులకు శరాఘాతంగా మారుతున్న నకిలీ విద్యార్హత పత్రాలపై నగర పోలీసులు జంగ్ కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా దక్షిణ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు బుధవారం ఓ గ్యాంగ్ను పట్టుకున్నారు. గతంలో చిక్కిన నాలుగు ముఠాలు ఆయా వర్సిటీల నుంచి సర్టిఫికెట్లు జారీ చేయిస్తుండగా... వీళ్లు మాత్రం నకిలీవి తయారు చేసి అమ్మేస్తున్నారు. టెన్త్ నుంచి డిగ్రీ వరకు ఏదైనా ఒకే రేటుకు విక్రయించేస్తున్నారని అదనపు డీసీపీ చక్రవర్తి గుమ్మి వెల్లడించారు. యాకుత్పురకు చెందిన సయ్యద్ నవీద్ సంతోష్నగర్ ప్రాంతంలో ఎంహెచ్ కన్సల్టెన్సీ పేరుతో ఎడ్యుకేషనల్ సేవలు అందించే సంస్థను నిర్వహిస్తున్నాడు. లాక్డౌన్ ప్రభావంతో వ్యాపారం దెబ్బతిన్న ఇతగాడు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాడు. గతేడాది మేలో బషీర్బాగ్లో క్యూబేజ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో వీసా ప్రాసెసింగ్ సంస్థను ఏర్పాటు చేశాడు. నిబంధనల ప్రకారం వీసా ప్రాసెసింగ్ చేస్తే ఇతడికి ఎక్కువ లాభాలు రావట్లేదు. మరోపక్క అనేక మంది సరైన విద్యార్హతలు లేని వాళ్లు సైతం వీరి వద్దకు ప్రాసెసింగ్కు వస్తున్నారు. దీంతో తానే నకిలీ సర్టిఫికెట్లు రూపొందించి ప్రాసెసింగ్ చేస్తే భారీ లాభాలు ఉంటాయని భావించాడు. చదవండి: ఇకపై జంక్షన్లో చుక్కలే!.. రెడ్ సిగ్నల్ పడగానే డ్రంకన్ డ్రైవ్ డీటీపీలో మంచి పట్టున్న మీర్చౌక్ వాసి షేక్ నదీమ్ను తన సంస్థలో నియమించుకున్నాడు. జమాల్కాలనీకి చెందిన మహ్మద్ అబ్రారుద్దీన్ ఆ తరహా విద్యార్థులను తీసుకువచ్చేవాడు. వారి అవసరాలకు తగ్గట్టు నవీద్ పదో తరగతి నుంచి బీటెక్ వరకు సర్టిఫికెట్లను నదీమ్తో తయారు చేయించేవాడు. వీటిని రూ.70 వేల నుంచి రూ.80 వేలకు విక్రయిస్తున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న దక్షిణ మండల టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎస్.రాఘవేంద్ర నేతృత్వంలో ఎస్సైలు వి.నరేందర్, ఎన్.శ్రీశైలం, పి.శ్రీనయ్యలతో కూడిన బృందం దాడి చేసింది. నవీద్, నదీమ్, అబ్రార్లతో పాటు సర్టిఫికెట్లు ఖరీదు చేసిన అబ్దుల్ రహీం ఖాన్, అబ్దుల్ కరీం ఖాన్, మహ్మద్ ఇస్మాయిల్ అహ్మద్, మహ్మద్ నాసిర్ అహ్మద్, ఫైసల్ బిన్ షాదుల్లాలను పట్టుకున్నారు. అన్నిరకాల సర్టిఫికెట్లు లభ్యం నిందితుల నుంచి రాష్ట్ర ఎస్సెస్సీ బోర్డు పేరుతో ఉన్న సర్టిఫికెట్లు 4, మహారాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు పేరు తో ఉన్న సర్టిఫికెట్లు 4, ఓయూ పేరుతో ఉన్న డిగ్రీలు 3, ఏయూ పేరుతో ఉన్న బీటెక్ పట్టాలు 7, తెలంగాణ యూనివర్శిటీ పేరుతో ఉన్న డిగ్రీలు 30, పుణేలోని సింబయోసిస్ ఇంటర్నేషనల్ డీమ్డ్ యూనివర్సిటీ పేరుతో ఉన్న పట్టా ఒకటి స్వాధీనం చేసుకున్నారు. -
ఒకటి తర్వాత మరొకటి.. వందల సంఖ్యలో నకిలీ సర్టిఫికెట్లు..
సాక్షి,హైదరాబాద్: మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఉన్న సర్వేపల్లి రాధాకృష్ణన్ యూనివర్సిటీ (ఎస్ఆర్కేయూ) నుంచి నగరంలోని విద్యార్థులకు వందల సంఖ్యలో నకిలీ సర్టిఫికెట్లు సరఫరా అయ్యాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఆ వర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కేతన్ సింగ్తో పాటు మూడు కన్సల్టెన్సీల నిర్వాహకులను ఇప్పటికే అరెస్టు చేశారు. తాజాగా ఉత్తర మండల టాస్క్ఫోర్స్ పోలీసులు మరో కన్సల్టెన్సీ నిర్వాహకుడిని కటకటాల్లోకి నెట్టారు. ఇతడి విచారణలో కేతన్తో పాటు ఆ వర్సిటీ ఇంజినీరింగ్ (ఈఈఈ) విభాగాధిపతి ఇ.విజయ్కుమార్కు ఈ స్కామ్లో ప్రమేయం ఉన్నట్లు తేలిందని సోమవారం ఓఎస్డీ పి.రాధాకిషన్రావు వెల్లడించారు. ► విజయవాడకు చెందిన పీకే వీరన్నస్వామి బతుకుదెరువు కోసం హైదరాబాద్కు వలసవచ్చాడు. చాదర్ఘాట్ పరిధిలో వీఎస్ గ్లోబల్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ పేరుతో కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నాడు. ఇందులో ఆశించిన మేర ఆదాయం లేకపోవడంతో నకిలీ సర్టిఫికెట్ల దందా మొదలుపెట్టాడు. ► కేతన్ సింగ్తో పాటు విజయ్కుమార్తో ఒప్పందం చేసుకున్న ఇతగాడు ఈ పని మొదలెట్టాడు. డ్రాప్ఔట్స్, బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్లతో పాటు ఫెయిల్ అయిన విద్యార్థుల వివరాలను కాలేజీల నుంచి సేకరిస్తున్నాడు. ఆ విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను సంప్రదిస్తున్న వీరన్న స్వామి ఎలాంటి అడ్మిషన్లు, పరీక్షలు లేకుండా సర్టిఫికెట్లు ఇస్తానని ఒప్పందాలు చేసుకుంటున్నాడు. ► వీరన్న ఈ విద్యార్థులు, నిరుద్యోగుల వివరాలను వాట్సాప్ ద్వారా వర్సిటీలో ఉన్న కేతన్, విజయ్లకు పంపిస్తున్నాడు. వీటి ఆధారంగా బ్యాక్ డేట్స్తో డిగ్రీలు రూపొందిస్తున్న వాళ్లు వర్సిటీలోనూ రికార్డులు సృష్టిస్తున్నారు. ఇలా తయారు చేసిన డిగ్రీలను కోర్సును బట్టి రూ.80 వేల నుంచి రూ.2.5 లక్షలు వరకు విక్రయిస్తున్నా రు. కొన్నాళ్లుగా ఈ దందా గుట్టుగా సాగుతోంది. ► సమాచారం అందుకున్న నార్త్జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావు నేతృత్వంలో ఎస్సై శ్రీకాంత్ తదితరులతో కూడిన బృందం కన్సల్టెన్సీపై దాడి చేసింది. వీరన్నతో పాటు సర్టిఫికెట్లు ఖరీదు చేయడానికి వచ్చిన విద్యార్థులు, నిరుద్యోగులైన కంభపు సాయి గౌతమ్ (కొత్తపేట), చిన్రెడ్డి రితీష్ రెడ్డి (వనస్థలిపురం), బచ్చు వెంకట సాయి సుమ రోహిత్ (ఫతేనగర్), మున్నా వెల్ఫ్రెడ్ (వికారాబాద్), కోసిమెత్తి సూర్యతేజ (మాదాపూర్), తుమ్మల సాయితేజ (బాచుపల్లి) పట్టుబడ్డారు. ► నిందితులతో పాటు వారి నుంచి స్వాధీనం చేసుకున్న సర్టిఫికెట్లు, స్టాంపులు తదితరాలను తదుపరి చర్యల నిమిత్తం చాదర్ఘాట్ పోలీసులకు అప్పగించారు. ఇప్పటికే అరెస్టు అయిన కేతన్ను పీటీ వారెంట్పై ఈ అధికారులు తమ కస్టడీలోకి తీసుకోనున్నారు. పరారీలో ఉన్న విజయ్కుమార్ కోసం టాస్క్ఫోర్స్ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. -
హైదరాబాద్ పోలిస్ కమిషనర్ కీలక ఆదేశాలు.. ‘ఇకపై వేసేయడమే’
సాక్షి, హైదరాబాద్: నగర పోలీసు కమిషనరేట్కు సంబంధించి ఎలాంటి నేరంలో ఎవరికి పాత్ర ఉన్నా ఉపేక్షించేది లేదని కొత్వాల్ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘ఫ్రెండ్లీ పోలీసింగ్లో భాగంగా ఇప్పటి వరకు కౌన్సెలింగ్లు చేశాం. వాటితో ఫలితం ఉండట్లేదు. అందుకే ఇకపై వేసేయడమే (జైల్లో)’ అని వ్యాఖ్యానించారు. నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్న రెండు నకిలీసర్టిఫికెట్ల ముఠాల నుంచి వందల మంది ధ్రువపత్రాలు ఖరీదు చేశారు. ఈ వ్యవహారం వారి తల్లిదండ్రులకు తెలిసి జరగడంతో పాటు వారికీ పాత్ర ఉంది. ఇప్పటికే ఏడుగురి విద్యార్థులను అరెస్టు చేశామని, త్వరలో మిగిలిన వారినీ పట్టుకుంటామని ఆనంద్ అన్నారు. వీరికి సర్టిఫికెట్లు కొని పెట్టిన, ప్రోత్సహించిన తల్లిదండ్రులను సైతం అరెస్టు చేస్తామని ఆయన పేర్కొన్నారు. నకిలీ సర్టిఫికెట్లు జారీ చేసిన యూనివర్సిటీల గుర్తింపు రద్దు చేయాలని సిఫారసు చేస్తూ యూజీసీకి ఆధారాలతో సహా లేఖ రాస్తాం. ఇటీవల డ్రగ్స్ కేసుల విషయంలోనూ తమ పంథా మార్చామని ఆయన అన్నారు. గతంలో మాదకద్రవ్యాల విక్రేతలను మాత్రమే అరెస్టు చేసే వాళ్లు. వీరి నుంచి డ్రగ్స్ ఖరీదు చేసి, వినియోగించిన వారికి కౌన్సెలింగ్ ఇచ్చేవాళ్లు. పోలీసు కమిషనర్గా సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ విధానం మారింది. చదవండి: నిజామాబాద్లో రెచ్చిపోయిన రౌడీమూకలు.. టీస్టాల్పై వీరంగం టోనీ కేసులో ఏడుగురు బడా వ్యాపారులను కటకటాల్లోకి పంపారు. ఇకపైనా ఇదే విధానం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. మరోపక్క రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అస్సాం ముఖ్యమంత్రిపై వచ్చిన ఫిర్యాదుపై న్యాయ సలహా తీసుకున్నామని పేర్కొన్నారు. దీనిపై ఇప్పటికే మహారాష్ట్రలో కేసు నమోదైనట్లు తెలిసిందని, ఒకే నేరంగా రెండు కేసులు సాధ్యం కావని అన్నారు. ఎక్కడ నమోదైందో తెలుసుకుని ఇక్కడి ఫిర్యాదులనూ అక్కడికే పంపుతామన్నారు. ఇప్పటి వరకు ఎక్కడా రిజిస్టర్ కాకపోతే మాత్రం జూబ్లీహిల్స్లో కేసు నమోదు చేస్తామని, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో వచ్చే ఫిర్యాదులు ఆ ఠాణాకే వస్తాయని పేర్కొన్నారు. చదవండి: బాలిక అనుమానాస్పద మృతి.. రాత్రి సమయంలో ఎందుకు వెళ్లింది? -
అనంతపురంలో టీడీపీ నేతల భూ కుంభకోణం
సాక్షి, అనంతపురం: అనంతపురంలో టీడీపీ నేతల భారీ భూ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. రూ.100 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను టీడీపీ నేతలు స్వాహా చేసినట్లు అధికారులు గుర్తించారు. మాజీ సైనికుల పేరిట నకిలీ డాక్యుమెంట్లు సమర్పించి టీడీపీ నేతలు భూ అక్రమాలకు పాల్పడ్డారు. చంద్రబాబు హయాంలో జరిగిన ఈ భూ బాగోతం రాచానపల్లి, ఇటుకలపల్లి, కురుగుంట గ్రామాల్లో టీడీపీ నేతలు అక్రమాలకు పాల్పడ్డారు. మాజీ మంత్రి పరిటాల సునీత వర్గీయులపై రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఈ మేరకు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. అక్రమాలపై అనంతపురం ఆర్డీవో మధుసూదన్ విచారణ చేపట్టారు. ఈ క్రమంలో రూ.100 కోట్ల విలువైన 40 ఎకరాల భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, నకిలీ పత్రాలతో ప్రభుత్వ భూమిని స్వాహా చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటికే అక్రమ రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలని ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లు తెలిపారు. అక్రమార్కులకు సహకరించిన రెవెన్యూ సిబ్బందిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని అనంతపురం ఆర్డీవో మధుసూదన్ తెలిపారు. మాజీ సైనికుల పేరుతో వంద కోట్ల రూపాయల విలువైన భూములు స్వాహా చేసిన టీడీపీ నేతల పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అనంతపురం జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నకిలీ పత్రాలతో.. మాజీ సైనికుల పేర్లతో భూమి పట్టాలు పొంది.. ఆ వెంటనే విక్రయించి సొమ్ము చేసుకున్నారు టీడీపీ నేతలు. మాజీ మంత్రి పరిటాల సునీత వర్గీయులే ఈ అక్రమాలకు పాల్పడ్డారని.. లోతుగా విచారిస్తే వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను టీడీపీ నేతలు ఏవిధంగా స్వాహా చేశారో తెలుస్తుందని స్థానికులు కోరుతున్నారు. చదవండిః కన్నయ్య కుమార్పై దాడికి యత్నం -
‘నకిలీ’ని పట్టేస్తుంది!
హైదరాబాద్కు చెందిన ఓ సాఫ్ట్వేర్ కంపెనీకి ఓ ఉద్యోగి తెలంగాణలో పేరున్న యూనివర్సిటీ నుంచి బీటెక్ చేసినట్టు సర్టిఫికెట్ సమర్పించాడు. దీనిపై థర్డ్పార్టీ విచారణ చేయించిన ఆ కంపెనీ అది నకిలీదని తెలుసుకుంది. సదరు వర్సిటీ దీన్ని పరిశీ లించి, కంపెనీకి రిపోర్టు ఇవ్వడానికి రెండేళ్లు పట్టింది. అప్పటికే ఆ ఉద్యోగి అక్కడ పనిచేసిన అనుభవంతో వేరే కంపె నీలో చేరాడు. రంగంలోకి దిగిన పోలీసులు హైదరాబాద్లోని పాతబస్తీలో అది తయారైనట్టు తేల్చారు. అప్పటికే ఆ నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చే వ్యక్తి మకాం మార్చాడు. దీంతో కేసు పెండింగ్లో పడింది. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఏటా అన్ని యూనివర్సిటీల నుంచి 20కి పైగా నకిలీ సర్టిఫికెట్లను గుర్తిస్తున్నారు. ఇవి కేవలం దర్యాప్తు సంస్థల దృష్టికొచ్చినవే. అంతకన్నా ఎన్నో రెట్లు నకిలీలు పుట్టుకొస్తున్నాయని పోలీసు వర్గాలు సైతం ఒప్పుకుంటున్నాయి. ఫిర్యాదులు లేకపోవడంతో ఇవి వెలుగులోకి రావడంలేదు. కేవలం ఒక కంప్యూటర్, కొద్ది పాటి టెక్నాలజీతోనే అన్ని వర్సిటీల నకిలీ సర్టిఫికెట్లు చేస్తున్నట్టు ఇటీవల ఉన్నత విద్యామండలి దృష్టికొచ్చింది. పలు ఇంజనీరింగ్ కాలేజీల్లో కూడా నకిలీ సర్టిఫికెట్లతో అధ్యాపకులుగా చెలామణి అవుతున్నారనే ఆరోపణ లున్నాయి. వాటిని తనిఖీ చేసే యంత్రాంగం లేకపోవడం పెను సమస్యగా మారింది. కళ్లు తెరిచిన అధికారులు నకిలీ ధ్రువపత్రాలను అడ్డుకునేందుకు ఉన్నత విద్యామండలి, పోలీసు యంత్రాంగం సంయుక్తంగా కృషి చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా గత నెల డీజీపీ మహేందర్ రెడ్డి సమక్షంలో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. వీటిని గుర్తించేందుకు ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొం దించాలని నిర్ణయించారు. అన్ని వర్సిటీల వీసీలతో ఉన్నత విద్యామండలి సంప్రదింపులు జరుపు తోంది. సర్టిఫికెట్ అసలుదా? నకిలీదా? తేల్చడా నికి ఇప్పటివరకూ వర్సిటీ సిబ్బంది మాత్రమే పరిశీలించాల్సి వస్తోంది. విశ్వవిద్యాలయాల్లో అంతంత మాత్రంగా ఉన్న సిబ్బంది కారణంగా ఈ ప్రక్రియ ఆలస్యమవుతోంది. ఈలోగా నకిలీల ముఠా యథేచ్ఛగా దందా కొనసాగిస్తోంది. విదేశాల్లో ఉద్యోగాలు పొందాలనుకునే వాళ్లు, రాష్ట్రంలో సాఫ్ట్వేర్, ఇతర సాంకేతిక ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవాలనుకునే వాళ్లు నకిలీ సర్టిఫికెట్లనే ఆశ్రయిస్తున్నారని అధికారులు అంటు న్నారు. దీన్ని అడ్డుకోవడానికి కంపెనీలు నేరుగా తనిఖీ చేసుకునే వెసులుబాటు కల్పించాలని నిర్ణయించారు. కట్టడి ఇలా... ♦అన్ని విశ్వవిద్యాలయాల సర్టిఫికెట్లను ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. ఇందుకు సంబం« దించిన సర్వర్ రాష్ట్ర అధికారుల పర్యవే క్షణలో ఉంటుంది. దీనిద్వారా ప్రతీ కంపెనీ అభ్యర్థి సర్టిఫికెట్లు అసలువో, నకిలీవో తెలుసుకోవచ్చు. ♦అన్ని భద్రతా చర్యలు తీసుకుని సాఫ్ట్వేర్ ను రూపొందించాలని భావిస్తున్నారు. సంబంధిత కంపెనీలు ఆ వెబ్సైట్కు లాగిన్ అయి దాని సరిఫ్టికెట్ స్థితిగతులు తెలుసుకోవచ్చు. ♦కొన్ని సందర్భాల్లో విధిగా సంబంధిత వర్సిటీలు ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఇలాంటప్పుడు ఆయా కంపెనీలు వర్సిటీ అధికారులను సంప్రదించాలి. ♦పోలీసుల భాగస్వామ్యం కూడా ఉండే ఈ సాఫ్ట్వేర్ ద్వారా నకిలీ సర్టిఫికెట్లు వచ్చిన వెంటనే పోలీసులు అప్రమత్తమవుతారు. వెంటనే కేసు నమోదు చేసి, నిందితులను అదుపులోకి తీసుకునే అవకాశం ఉంటుందని అధికారులు చెప్పారు. మంచి ప్రయోగం నకిలీ సర్టిఫికెట్లను అడ్డుకునేందుకు ఉన్నత విద్యామండలి కృషి చేస్తోంది. ఇప్పటికే సాఫ్ట్వేర్ ఎలా రూపొందించాలి? ఎలాంటి మెళకువలు అవసరమనే దానిపై డీజీపీతో జరిగిన సమావేశంలో చర్చించాం. త్వరలోనే ఈ ప్రక్రియ ఓ కొలిక్కి వస్తుంది. అత్యాధునిక సాంకేతికతతో రూపొందిస్తున్నందున కచ్చితంగా మంచి ఫలితాలుంటాయి. – ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి (ఉన్నత విద్యామండలి చైర్మన్) -
అశోక్బాబుపై కేసు నమోదు
అమరావతి: టీడీపీ ఎమ్మెల్సీ అశోక్బాబుపై సీఐడీ కేసు నమోదు చేసింది. గతంలో ఏసీటీవోగా పని చేసిన సమయంలో అశోక్బాబు తప్పుడు సమాచారం ఇచ్చారనే అభియోగాలపై కేసు నమోదు చేసింది సీఐడీ. తన సర్వీసు రికార్డు లేకుండానే తప్పుడు సమాచారం ఇచ్చారని కేసు నమోదైంది. బీకాం చదవకుండానే నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చారనే అభియోగంపై కేసు నమోదు చేశారు. తప్పుడు సమాచారం ఇచ్చి రికార్డులను ట్యాంపరింగ్ చేయడమే కాకుండా, ఎన్నికల అఫిడవిట్లో కూడా డిగ్రీ చదివినట్లు పేర్కొన్నారనే అభియోగాల కింద కేసులు నమోదు చేశారు. అశోక్ బాబు పైన సెక్షన్ 477A, 465,420 కింద కేసు నమోదు చేశారు. 2021లో అశోక్బాబుపై లోకాయుక్తాలో కేసు నమోదు కాగా, ఆ కేసును సీఐడీకి అప్పగించాలని లోకాయుక్తా ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. -
కరోనా పాజిటివ్ ఉన్నా.. లేనట్లుగా..
సాక్షి,చాంద్రాయణగుట్ట(హైదరాబాద్): వేర్వేరు ఘటనల్లో నకిలీ ఆర్టీపీసీఆర్ నివేదికలు, వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లను సృష్టిస్తున్న ఆరుగురిని దక్షిణ మండలం టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. పురానీహవేళీలోని తన కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నగర టాస్క్ఫోర్స్ అదనపు డీసీపీ గుమ్మి చక్రవర్తి వివరాలు వెల్లడించారు. మహబూబ్నగర్కు చెందిన పి.లక్ష్మణ్(30) పదేళ్ల క్రితం డిప్లోమా పూర్తి చేసి పలు డయాగ్నోస్టిక్ సెంటర్లలో ల్యాబ్ టెక్నిషియన్గా పనిచేశాడు. ఏడాది క్రితం ఆస్మాన్ఘడ్లో ‘హోం కేర్ డయాగ్నోస్టిక్ సర్వీసెస్ సెంటర్’ను ప్రారంభించాడు. ఇటీవల థర్డ్వేవ్ ప్రారంభం కావడంతో విమాన, ఇతర రాష్ట్ర ప్రయాణాలకు ఆర్టీపీసీఆర్ నెగిటివ్ రిపోర్ట్ తప్పనిసరి చేయడాన్ని లక్ష్మణ్ తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. నాంపల్లికి చెందిన ప్రభాత్ కుమార్ సంఘీ(45) సహకారంతో అవసరమైన వారికి స్వాబ్ను పూర్తిస్థాయిలో తీయకుండా (లిక్విడ్ వేయకపోవడం) తను ఒప్పందం చేసుకున్న ల్యాబ్లకు పంపి నెగిటివ్ రిపోర్ట్ వచ్చేలా చేసి వినియోగదారులకు ఇచ్చేవాడు. ఇలా ఒక్కో రిపోర్ట్కు రూ.2–3 వేల వరకు వసూలు చేస్తున్నాడు. సమాచారం అందుకున్న దక్షిణ మండలం టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎస్.రాఘవేంద్ర నేతృత్వంలోని ఎస్సైలు శ్రీశైలం, నరేందర్, మలక్పేట పోలీసులు ఇద్దరినీ అరెస్ట్ చేసి వీరి వద్ద నుంచి 65 నకిలీ ఆర్టీపీసీఆర్ నివేదికలు, 20 శాంపిల్ కిట్లు, ఒక సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. నకిలీ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లను సృష్టిస్తూ వ్యాక్సిన్ తీసుకోకున్నా యూపీహెచ్ఎసీ అవుట్ సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్ సహకారంతో నకిలీ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లను తయారు చేస్తున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆసిఫ్నగర్కు చెందిన ల్యాబ్ టెక్నిషియన్ మహ్మద్ తారీఖ్ హబీబ్(28) ఏడాది క్రితం స్థానికంగానే “ఇమేజ్ డయాగ్నోస్టిక్ సెంటర్’ను ఏర్పాటు చేసి నెగెటివ్ రిపోర్ట్లు ఇచ్చాడు. కరోనా వ్యాక్సిన్ తీసుకున్నట్లు నకిలీ సర్టిఫికెట్లు సృష్టించాడు. అఫ్జల్సాగర్ యూపీహెచ్సీలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న ‘కుమారీ’ అనే అవుట్ సోర్సింగ్ ఉద్యోగితో కలిసి పథకం పన్నాడు. మెహదీపట్నంకు చెందిన గులాం ముస్తఫా షకీల్(48), అబ్దుల్ బషీర్(37), ఇర్ఫాన్ ఉర్ రబ్ అన్సారీ (32)ల సహకారంతో వాటిని అందజేస్తున్నాడు. హుమాయన్నగర్ పోలీసులతో కలిసి దాడులు చేసిన టాస్క్ఫోర్స్ పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. -
నకిలీ సర్టిఫికెట్ ముఠా గుట్టురట్టు
సాక్షి, ముంబై: భారత ఆర్థిక రాజధాని ముంబైలో నకిలీ సర్టిఫికేట్లు, డిగ్రీ పట్టాలను తయారు చేస్తున్న రాకెట్ బయటపడింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు బోరివలి ప్రాంతంలోని ఒక భవనంపై ఆకస్మికంగా దాడిచేశారు. దాడిచేసిన ప్రదేశంలో అనేక యూనివర్సిటీలకు చెందిన నకిలీ సర్టిఫికేట్లు, డిగ్రీపట్టాలు కుప్పలుగా ఉండటాన్ని కనుగొన్నారు. ఈ క్రమంలో.. అక్కడే ఉన్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులిద్దరినీ స్థానిక న్యాయస్థానం ఎదుట హజరుపర్చారు. వీరిని విచారించిన న్యాయస్థానం నిందితులకు ఈనెల 27 వరకు పోలీసు కస్టడికి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. దర్యాప్తులో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని ముంబై డీసీపీ సంగ్రామ్ నిషాందర్ ఒక ప్రకటనలో తెలిపారు. చదవండి: ప్రేయసి కళ్లలో ఆనందం కోసం ప్రియుడి కిడ్నీ దానం.. ట్విస్ట్ ఏంటంటే -
నకిలీ సర్టిఫికెట్ల భరతం పడతాం: డీజీపీ
సాక్షి, హైదరాబాద్: నకిలీ డిగ్రీలను తయారు చేస్తున్న నేరస్తుల భరతం పడతామని రాష్ట్ర డీజీపీ మహేందర్రెడ్డి హెచ్చరించారు. దీనికోసం రాష్ట్ర ఉన్నత విద్యామండలి సమన్వయంతో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు. ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల ఉపకులపతులతో సోమవారం ఆయన ఉన్నత విద్యామండలి కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ యూనివర్సిటీలు ఇచ్చే సరిఫికెట్లన్నీ ఒకే పోర్టల్ ద్వారా సంబంధిత కంపెనీలు తేలికగా పరిశీలించుకునే అవకాశం ఉందన్నారు. ఎక్కడైనా నకిలీ అని తేలితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని వీసీలకు సూచించారు. ఈ ప్రక్రియలో పోలీసులు పూర్తి సహకారం అందిస్తారని చెప్పారు. సర్టిఫికెట్ల ధ్రువీకరణ దిశగా అన్ని యూనివర్సిటీలు డేటాను అందుబాటులో ఉంచాలని సూచించారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్.లింబాద్రి మాట్లాడుతూ నకిలీల గుర్తింపునకు ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తామన్నారు. అవసరమైన సంస్థలు పోర్టల్కు లాగిన్ అవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. 2016 వరకు అన్ని సర్టిఫికెట్లు ఆన్లైన్ చేశామని, త్వరలో మిగతా సంవత్సరాలవి కూడా చేస్తామన్నారు. కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్చైర్మన్ వెంకటరమణ, యూనివర్సిటీల వీసీలు పాల్గొన్నారు. -
డిగ్రీ చదివి... నకిలీ తెలివి
సాక్షిప్రతినిధి, వరంగల్: వరంగల్ కేంద్రంగా సాగుతున్న నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టురట్టు అయింది. విద్యార్థులు, నిరుద్యోగుల అమాయకత్వాన్ని సొమ్ము చేసుకుంటున్న నిందితులు ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. నకిలీ సర్టిఫికెట్ల సహాయంతో విద్యార్థులను విదేశాలకు తరలిస్తున్న 12 మంది నిందితులను మంగళవారం వరంగల్ పోలీసు కమిషనరేట్ టాస్క్ఫోర్స్ బృందం అరెస్టు చేసింది. వీరి నుంచి 212 నకిలీ సర్టిఫికెట్లు, ఆరు ల్యాప్టాప్లు, ఐపాడ్, 2 ప్రింటర్లు, ఐదు సీపీయూలు, 25 నకిలీ రబ్బర్ స్టాంపులు, 2 ప్రింటర్ రోలర్స్, 5 ప్రింటర్ కలర్స్ బాటిళ్లు, లామినేషన్ మిషన్, 12 సెల్ఫోన్లు, 10 లామినేషన్ గ్లాస్ పేపర్లను స్వాధీనం చేసుకుంది. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. ఈ ముఠా వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్జోషి వెల్లడించారు. నిందితులందరూ డిగ్రీ చదివినవారే. దార అరుణ్, ఆకుల రవిఅవినాష్ ప్రధాన నిందితులు. కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉన్న ఈ ఇద్దరు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఇంటర్నెట్ సెంటర్ నిర్వహిస్తుండేవారు. పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాలనే దుర్బుద్ధితో పక్కదారి పట్టారు. దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలు, డీమ్డ్ ఇంజనీరింగ్ కళాశాలల పేరిట నకిలీ సర్టిఫికెట్లను తయారు చేసి అర్హతలులేని విద్యార్థులకు కొన్ని కన్సల్టెన్సీ సంస్థల ద్వారా విక్రయించేవారు. ఆ విధంగా విద్యార్థులు విదేశాలకు వెళ్లేందుకు మార్గం సుగమం చేసేవారు. ముఠా అక్రమాలు అనేకం.. కొన్ని విదేశాల్లో విద్యాభాసనకు కనీస మార్కుల శాతాన్ని తప్పనిసరి చేయడంతోపాటు, మొదటి ప్రయత్నంలోనే ఉత్తీర్ణులై ఉండాలని కొన్ని యూనివర్సిటీలు నియమం పెట్టడంతో ఆ మేరకు నకిలీ సర్టిఫికెట్లను తయారు చేసి విద్యార్థులకు అందజేసేవారు. ఇందుకుగాను రూ.లక్ష నుంచి రూ.4 లక్షల వరకు వసూలు చేసేవారు. సర్టిఫికెట్లపై ఎవరికీ అనుమానం రాని విధంగా విదేశాల నుంచి సర్టిఫికెట్ల ముద్రణకు అవసరమైన కాగితాలను ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేసేవారు. పక్కా సమాచారంతో టాస్క్ఫోర్స్ ఇన్చార్జ్, అదనపు డీసీపీ వైభవ్ గైక్వాడ్ అధ్వర్యంలో ప్రత్యేక నిఘా వేసిన పోలీసులు వలపన్ని నిందితులను పట్టుకున్నారు. ఒకే సమయంలో అన్ని ప్రాంతాల్లో ముఠాకు సంబంధించిన కన్సల్టెన్సీ సంస్థలపై దాడులు నిర్వహించడంతో నకిలీ సర్టిఫికెట్ల తయారీ వ్యవహారం బయటపడింది. ఈ ముఠాను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన పోలీసులను కమిషనర్ ప్రత్యేకంగా అభినందించారు. -
ఉద్యోగుల బదిలీలలో ఫేక్ సర్టిఫికెట్ల కలకలం
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగులకు జిల్లాల కేటాయింపు వ్యవహారంలో నకిలీ అనారోగ్య సర్టిఫికెట్ల వ్యవహారం కలకలం రేపుతోంది. దీనివల్ల అసలైన వ్యాధిగ్రస్తులకు, దివ్యాంగులకు అన్యాయం జరిగే వీలుందని పలువురు వాపోతున్నారు. దీర్ఘకాల వ్యాధులతో బాధపడే వారు, దివ్యాంగులను బదిలీల నుంచి మినహాయించే నిబంధన ఉండటంతో దీన్ని అడ్డం పెట్టుకొని కొందరు నకిలీ వ్యాధులు ఉన్నట్లు సర్టిఫికెట్లు సృష్టిస్తున్నారనే ఆరోపణలు అన్ని జిల్లాల నుంచి వస్తున్నాయి. అయినా ఈ విషయాన్ని ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని పలువురు ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికిప్పుడు వాటన్నింటినీ పరిశీలించడం ఎలా అని ఉన్నతాధికారులు అంటున్నారు. ►వరంగల్ జిల్లాలో 40 మందికిపైగా ఉద్యోగులు నకిలీ సర్టిఫికెట్లు సమర్పించినట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులొచ్చాయని సమాచారం. దీనిపై కలెక్టర్కు ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినా ఇంతవరకూ విచారణకు కూడా ఆదేశించలేదని ఓ ఉపాధ్యాయుడు తెలిపాడు. ►మేడ్చల్, నాగర్కర్నూల్, మహబూబాబాద్ 10 మందికిపైగా టీచర్లు చిన్నచిన్న సర్జరీలు చేయించుకున్నప్పటికీ తమకు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నట్లు సర్టిఫికెట్లు పుట్టించి బదిలీలు లేకుండా ప్రయత్నిస్తున్నారని స్థానిక ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. ఇందులో ఉన్నతాధికారుల బంధువులూ ఉన్నారని చెబుతున్నారు. ►ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో కొందరు ఉపాధ్యాయులు సమర్పించిన పత్రాలపై అధికారుల్లోనూ అనుమానాలున్నట్లు తెలిసింది. సీనియారిటీపైనా సందేహాలు! టీచర్ల సీనియారిటీ జాబితా తయారీపైనా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో జరిగిన ప్రమోషన్లు, బదిలీల్లో కొందరు అధికారులు అవినీతికి పాల్పడి సస్పెండైన ఉదంతాలున్నాయని పలువురు ఉపాధ్యాయులు అంటున్నారు. ఇలాంటి అధికారులు ప్రస్తుతం పారదర్శకంగా సీనియారిటీ జాబితాను తయారు చేస్తారా? అని ఖమ్మంకు చెందిన ఓ ఉపాధ్యాయుడు అనుమానం వ్యక్తం చేశాడు. కేడర్ స్ట్రెంత్, రోస్టర్ విధానం, వర్కింగ్ పోస్టులు, క్లియర్ వెకెన్సీలు ఎన్ని ఉన్నాయో ఇప్పటికీ స్పష్టతలేదన్నాడు. జిల్లాలోని వర్కింగ్, ఖాళీ పోస్టులను ఏ దామాషా ప్రకారం భర్తీ చేయనున్నారో ప్రభుత్వం అధికారికంగా వెల్లడించలేదని గుర్తుచేశాడు. వితంతువులకు, ఒంటిరి మహిళలకు, తీవ్ర వ్యాధిగ్రస్థులకు రక్షణ లేదని, మీడియం పంచాయితీలో సీనియారిటీని ఎలా రూపొందించాలో స్పష్టత ఇవ్వలేదని పలువురు టీచర్లు అంటున్నారు. -
రండి బాబు రండి!.... రూ.50 వేలకే బీటెక్, డిగ్రి, ఇంటర్ సర్టిఫికేట్లు!!
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రా యూనివర్సిటీ (ఏయూ), తెలంగాణ విశ్వ విద్యాలయం (టీయూ), మహారాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డ్ వెబ్సైట్ల నుంచి ఒరిజినల్ సర్టిఫికెట్లను డౌన్లోడ్ చేసి.. నకిలీవి తయారు చేస్తూ అవసరమున్న వారికి విక్రయిస్తోంది ఓ కన్సల్టెన్సీ. రూ.50 వేల నుంచి రూ.75 వేలకు ఆయా వర్సిటీల బీటెక్, డిగ్రీ, ఇంటర్ సర్టిఫికెట్లను విక్రయిస్తున్నట్లు వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ దృష్టికి రావటంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వీరి నుంచి ఏయూకు చెందిన 130, టీయూకు చెందిన 63, మహారాష్ట్ర ఇంటర్ బోర్డుకు చెందిన 27 నకిలీ సర్టిఫికెట్లను, 6 కంప్యూటర్లు, 4 ల్యాప్టాప్లు, 2 హెచ్పీ ప్రింటర్లను స్వాధీనం చేసుకున్నారు. నగర సీపీ అంజనీకుమార్ వివరాలను వెల్లడించారు. యాకుత్పురా దోభీఘాట్కు చెందిన సయ్యద్ నవీద్ అలియాస్ ఫైసల్ (30)కు బషీర్బాగ్లోని బాబుఖాన్ ఎస్టేట్స్ 7వ అంతస్తులో క్యూబెస్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ కన్సల్టెన్సీ ఉంది. ఇందులో గౌలిపురకు చెందిన సయ్యద్ ఓవైస్ అలీ అలియాస్ ఓవైస్ (22) డీటీపీ ఆపరేటర్గా పనిచేస్తున్నారు. ఈ కన్సల్టెన్సీ డీటీపీ వర్క్, వీసా ప్రాసెసింగ్, సర్టిఫికేషన్ వర్క్స్ వంటి అన్ని రకాల ఆన్లైన్ సేవలను అందిస్తోంది. కరోనా నేపథ్యంలో వ్యాపారం నష్టాల్లో ఉండటంతో అక్రమ మార్గంలో డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. ఈ ఏడాది జులై నుంచి నకిలీ సర్టిఫికెట్లు, సాలరీ స్లిప్లు, మెడికల్, ఫిట్నెస్ సర్టిఫికెట్లు, జాబ్ ఆఫర్, రిలీవింగ్ లెటర్లు వంటివి తయారు చేస్తూ.. అవసరం ఉన్న కస్టమర్లకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఆయా యూనివర్సిటీ వెబ్సైట్ల నుంచి ఒరిజినల్ సర్టిఫికెట్లను డౌన్లోడ్ చేసుకొని అభ్యర్థుల పేర్లు, రోల్ నంబర్లను ఫొటోషాప్, డీటీపీ వర్క్తో ఎడిట్ చేసి నకిలీవి తయారు చేస్తున్నారు. గల్ఫ్ దేశాల్లో పనిచేయడానికి వెళ్లే ప్రైవేట్ ఉద్యోగులకు, అల్రెడీ చేస్తున్న వారికి అంతర్గత ప్రమోషన్ల కోసం ఈ నకిలీ సర్టిఫికెట్లను విక్రయించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. అలాగే యూకేలోని టీసైడ్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ బ్లాక్పోల్, యూనివర్సిటీ ఆఫ్ లా, స్కాంట్లాండ్లోని హెరియట్వాట్ యూనివర్సిటీ, అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ షిల్లెర్, యూనివర్సిటీ ఆఫ్ కన్కార్డియాలలో చదువుకునేందుకు వెళ్లే విద్యార్థులకు నకిలీ సర్టిఫికెట్లను తయారు చేసి విక్రయించారు. నిందితులను కస్టడీలోకి తీసుకొని విచారణ చేస్తే వాస్తవాలు బయటపడతాయని టాస్క్ఫోర్స్ ఓఎస్డీ డీసీపీ పి. రాధాకిషన్ రావు తెలిపారు. నకిలీ సర్టిఫికెట్లను తయారు చేస్తున్న నిందితులు నవీద్, సయ్యద్ ఓవైస్ అలీలపై సైఫాబాద్, అబిద్ రోడ్, ముషీరాబాద్, నిజామాబాద్లోని డిచ్పల్లి పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. (చదవండి: ఫిలిప్పీన్స్లో టైఫూన్ తుపాను బీభత్సం.. 21 మంది మృతి) -
నయా నకిలీ దందా.. రూ.900కే వెహికిల్ ఆర్సీ..
సాక్షి, హైదరాబాద్: నకిలీ ఆర్సీలు, ఆధార్ కార్డులను సృష్టించి సొమ్ము చేసుకోవడంతో పాటు కొత్త ఆర్సీ జారీతో ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి గండి కొడుతున్నారు నకిలీ ఆర్సీ ముఠాను సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఓటీ డీసీపీ సందీప్తో కలిసి సీపీ స్టీఫెన్ రవీంద్ర మంగళవారం వివరాలు వెల్లడించారు. నగరంలోని యూసుఫ్గూడ వాసి షేక్ జాంగీర్ బాషా, కిషన్బాగ్కు చెందిన సయ్యద్ హుస్సేన్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాసి సంపత్.. వీరు ముగ్గురు అత్తాపూర్, భద్రాద్రి కొత్తగూడెం రీజినల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టీఏ) కార్యాలయాల్లో ఏజెంట్లుగా పనిచేస్తున్నారు. ఆర్టీఏ కార్యాలయాలోని లొసుగులను ఆసరాగా చేసుకొని సొమ్ము చేసుకునేందుకు పక్కా ప్లాన్ వేశారు. ప్రధాన నిందితుడు శంషాబాద్ రాళ్లగూడకు చెందిన చామన సతీష్, కాటేదాన్కు చెందిన డీటీపీ ఆపరేటర్ ఎం గణేష్, వాహన మధ్యవర్తులు అల్వాల్కు చెందిన కలిగిడి చంద్రశేఖర్, మదీనాగూడ వాసి సీహెచ్ రమేష్లు ముఠాగా ఏర్పడ్డారు. ఆర్టీఏలో వాహనాలను రిజిస్ట్రేషన్ చేయించే సమయంలో ఆర్సీ కార్డు చేతికివ్వరు. వాహనదారు సూచించిన ఇంటి అడ్రస్కు కొరియర్ ద్వారా వస్తుంది. ఆ సమయంలో ఇంటికి తాళం వేసి ఉన్నా లేదా వాహనదారు ఇల్లు మారినా, మరే కారణంతోనైనా ఆర్సీ తీసుకోని పక్షంలో అది తిరిగి ఆర్టీఏ కార్యాలయానికి వస్తుంది. ఇలా వచ్చిన ఆర్సీలను జాంగీర్ బాషా, సయ్యద్ హుస్సేన్, సంపత్లు దొంగిలించి.. ఒక్కో ఆర్సీని రూ.900 చొప్పున సతీష్, చంద్రశేఖర్, రమేష్లకు విక్రయిస్తారు. డేటా ఆపరేటర్ గణేష్ ఆయా ఒరిజినల్ ఆర్సీ కార్డులపై ఉన్న యజమాని వివరాలను నెయిల్ పాలిష్ (డాజ్లర్)తో తొలగించి నకిలీ ఆర్సీలను సృష్టిస్తాడు. ఆయా బ్రోకర్ల నుంచి వాహనాలను కొనుగోలు చేసిన వాహనాదారులు రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఏ కార్యాలయానికి సందర్శించినప్పుడు కొత్త ఆర్సీలు జారీ కావు. ఎందుకంటే ఒరిజినల్ ఆర్సీని అధికారులు స్వాధీనం చేసుకొని ఆధార్ కార్డును ధ్రువీకరించుకున్న తర్వాతే కొత్త ఆర్సీ జార్సీ చేస్తారు గనక! దీంతో ఆయా వాహన బ్రోకర్లు అంతకుముందే సృష్టించిన నకిలీ ఆర్సీ, ఆధార్ కార్డులను వాహనాదారులకు అందిస్తారు. వీటిని ఆర్టీఏ అధికారులకు సమర్పించి.. వాహనదారులు కొత్త ఆర్సీలను తీసుకుంటారు. ఒడిశా వాహనాలకు నకిలీ ఆర్సీ కాపీలు సృష్టిస్తున్నారని సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసుల దృష్టికి రావటంతో రంగంలోకి దిగారు. ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.10 వేల నగదుతో పాటు 1,200 నకిలీ ఆర్సీలు, 29 రబ్బర్ స్టాంపులు, 75 ఆధార్ కార్డులు, రెండు ల్యాప్టాప్లు, సీపీయూ లు, ప్రింటర్లు, 6 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి గత కొన్ని నెలలుగా ఈ ముఠా నకిలీ ఆర్సీ బాగోతాన్ని నడుపుతోంది. ఒక్కో ఆర్సీ జారీ ద్వారా ప్రభుత్వానికి వచ్చే రూ.1,000 నుంచి 1,200 ఆదాయానికి గండిపడింది. సుమారు వెయ్యి వా హనాలకు నకిలీ ఆర్సీలను సృష్టించారు. ఆయా ఆర్టీఏ అధికారులకు పోలీసులు లేఖ రాశారు. వాహనాలను దొంగతనం చేసే నేరస్తులకు కూడా నకిలీ ఆర్సీలను ఇవ్వాలని ఈ మోసగాళ్లు భావించినట్లు పోలీసుల విచారణలో తేలింది. -
అప్పులు తెచ్చిన తిప్పలు.. మహిళ బతికుండగానే ‘చంపేశాడు’
సాక్షి, పరిగి: తాను చేసిన అప్పులు, ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు బతికుండగానే ఓ మహిళా రైతు చనిపోయినట్లు దస్తావేజులు సృష్టించాడో ప్రబుద్ధుడు. బాధిత మహిళ కుటుంబ సభ్యుల అమాయకత్వం,నిరక్షరాస్యతను ఆసరాగా చేసుకుని ఆమె పేరున వచ్చిన రైతు బీమా డబ్బులు కాజేశాడు. కుల్కచర్ల మండలంలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రతిపక్షాలు, దళిత, ప్రజాసంఘాల ఆందోళనల నేపథ్యంలో పోలీసులు సదరు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఆదివారం పరిగి సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ లక్ష్మిరెడ్డి సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. కుల్కచర్ల మండల పరిధిలోని పుట్టాపహాడ్కు చెందిన రాఘవేందర్రెడ్డి (45) గ్రామంలో వ్యవసాయం చేయటంతో పాటు రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. కాగా ఇటీవలి కాలంలో అతనికి ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. ఈజీగా డబ్బులు సంపాదించి ఇబ్బందుల నుంచి గట్టెక్కాలనే ఉద్దేశంతో తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నాడు. బతికుండగానే చంద్రమ్మ అనే మహిళ చనిపోయినట్లుగా రికార్డుల్లో నమోదు చేసి ఆమె పేరున వచ్చిన రైతుబీమా డబ్బులు కాజేశాడు. బాధితురాలి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని.. అదే గ్రామానికి చెందిన ఎనుగొండ చంద్రమ్మ రాఘవేందర్రెడ్డి ఇంట్లో చాలాకాలంగా పనిచేస్తూ వస్తుంది. ఆమె కుమారుడు బాలయ్య కూడా నిరక్షరాశ్యుడు. చంద్రమ్మకు ప్రస్తుతం 57 సంవత్సరాలు ఉండటంతో మరో ఏడాదిలో ఆమెకు రైతు బీమా వర్తించకుండా పోతుంది. దీంతో ఆమె బీమాను రెన్యువల్ చేయాల్సిన అవసరం కూడా ఉండదని భావించిన రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ రాఘవేందర్రెడ్డి పక్కా ప్లాన్తో ఆమె పేరున రైతు బీమా కాజేశాడు. ఫోర్జరీ సంతకాలతో సర్టిఫికెట్ తయారీ.. బీమా డబ్బులు రావాలంటే బాధితురాలు చంద్రమ్మ చనిపోయినట్టుగా నిరూపించే డెత్ సర్టిఫికెట్ అవసరమని గుర్తించిన నిందితుడు సర్టిఫికెట్ కోసం మహబూబ్నగర్కు వెళ్లి గ్రామ పంచాయతీ ముద్రలు కొనుగోలు చేసి తెచ్చుకున్నాడు. వాటితో సర్టిఫికెట్ తయారు చేసి సంతకాలు ఫోర్జరీ చేశాడు. సదరు మహళ కుటుంబ సభ్యులు నిందితుడి ఇంట్లో పనిచేసే వ్యక్తులే కావటంతో ఏదో అవసరం ఉందని నమ్మించి వారి నుంచి ఆధార్ కార్డులు తెప్పించుకున్నాడు. అనంతరం అన్ని వివరాలతో రైతు బీమా పోర్టల్లో అన్ని పత్రాలు అప్లోడ్ చేసి రైతు బీమాకు దరఖాస్తు చేశాడు. అనంతరం ఫిజికల్గా విచారణ చేయాల్సిన ఏఈఓ సత్తార్.. రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ అయిన రాఘవేందర్రెడ్డికే ఫోన్చేసి చంద్రమ్మ మృతి విషయమై విచారణ చేశాడు. అతను చంద్రమ్మ మృతి చెందిన విషయం వాస్తవమే అని తెలపటంతో ఏఈఓ విచారణ సర్టిఫికెట్ కూడా అప్లోడ్ చేశాడు. నగదు జమవ్వగానే.. కొద్దిరోజుల తర్వాత చంద్రమ్మకు నామినీగా ఉన్న ఆమె కుమారుడు బాలయ్య బ్యాంకు ఖాతాలో రైతుబీమా నగదు జమయ్యాయి. విషయం తెలుసుకున్న రాఘవేందర్రెడ్డి తాను ధాన్యం విక్రయించగా వచ్చిన డబ్బులు నీ ఖాతాలో వేయించానని బాలయ్యను నమ్మించి రూ.5 లక్షల బీమా డబ్బులు బాలయ్య ఖాతా నుంచి తన స్నేహితుడైన మధు ఖాతాలో దఫదఫాలుగా వేయించుకుని తన ఆర్థిక అవసరాలు తీర్చుకున్నాడు. రైతుబంధు రాకపోవటంతో.. అయితే చంద్రమ్మ మృతి చెందినట్లు సర్టిఫికెట్లు సృష్టించి బీమా డబ్బులు నొక్కేయటంతో ఈ ఏడాది ఆమె ఖాతాలో పడాల్సిన రైతు బంధు డబ్బులు జమకాలేదు. దీంతో ఆమె కుమారుడు బాలయ్య రైతుబంధు డబ్బుల విషయమై రాఘవేందర్రెడ్డిని అడిగాడు. పలుమార్లు అడిగినా అతను స్పందించకపోవటంతో వేరే వారికి చెప్పి వ్యవసాయ శాఖ కార్యాలయంలో విచారించగా అసలు విషయం వెలుగు చూసింది. ఈ విషయమై రెండు, మూడు రోజులుగా ప్రతిపక్షాలు, దళిత, ప్రజాసంఘాలు ఆందోళన బాటపట్టాయి. కేసు నమోదు చేసిన పోలీసులు ఆదివారం నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏఈఓ సత్తార్పై చర్యలు తీసుకోవాలని ఆ శాఖ ఉన్నతాధికారులకు పోలీసులు లేఖ రాశారు. నిందితుడి స్నేహితుడి ఖాతాలో ప్రస్తుతం రూ.80వేలు ఉండగా అవి సీజ్ చేయాలని బ్యాంకు అధికారులకు కూడా లేఖ రాశారు. కుల్కచర్ల ఎస్ఐ విఠల్రెడ్డి, పరిగి ఎస్ఐ క్రాంతికుమార్ తదితరులు విలేకరుల సమావేశంలో ఉన్నారు. -
ఏం సేస్తిరి..ఏం సేస్తిరి..చావు తెలివితేటలంటే ఇదేనేమో
సాక్షి, కుల్కచర్ల(వికారాబాద్): బతికున్న మనిషి చనిపోయినట్లుగా నకిలీ రికార్డులు సృష్టించి రైతుబీమా సొమ్మును స్వాహా చేశారు. రైతుబంధు కోఆర్డినేటర్ ఇందులో కీలక పాత్ర పోషించాడని ఆరోపణలు వస్తున్నాయి. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలంలో గురువారం ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. కుల్కచర్ల మండలం పుట్టపహడ్కు చెందిన రాఘవేందర్ రెడ్డి రైతుబంధు గ్రామ కోఆర్డినేటర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఎనుగొండ చంద్రమ్మ (57) 2020 సెప్టెంబర్ 14న చనిపోయిందని అదే నెల 30న నకిలీ డెత్ సర్టిఫికెట్ సృష్టించాడు. వ్యవసాయశాఖ అధికారులను మభ్యపెట్టి రైతుబీమా ప్రక్రియను పూర్తి చేశాడు. రైతుబీమా డబ్బులొచ్చాక.. తమకు సంబంధించిన ధాన్యం డబ్బులు పొరపాటున మీ ఖాతాలో పడ్డాయని బాధిత కుటుంబ సభ్యులకు నమ్మబలికి వారి దగ్గర నుంచి తీసుకున్నాడు. రైతుబంధు కోఆర్డినేటర్ మాయాజాలం రైతుబంధు కోఆర్డినేటర్ రాఘవేందర్రెడ్డి అధికార పార్టీ నాయకుడు. పుట్టపహడ్కు చెందిన చంద్రమ్మకు 1.30 ఎకరాల భూమి ఉండగా.. సహకార సంఘంలో ఉన్న దీర్ఘకాలిక రుణమాఫీ చేయించడంతో పాటు పంట నష్టం డబ్బులు ఇప్పిస్తానని నమ్మబలికి వారి వద్ద నుంచి పట్టా పాసుపుస్తకం, పాలసీ సర్టిఫికెట్ తీసుకున్నాడు. 2020 సెప్టెంబర్ 14న చంద్రమ్మ మరణించినట్లు నకిలీ డెత్ సర్టిఫికెట్ సృష్టించాడు. డిసెంబర్ 14న రూ.2 లక్షలు, 2021 జనవరిలో రూ.3 లక్షలు చొప్పున బాధిత కుటుంబం నుంచి డబ్బులను డ్రా చేయించి తీసుకున్నాడు. విషయం బయటికి వచ్చింది ఇలా.. పుట్టపహడ్కు చెందిన ఎనుగొండ చంద్రమ్మకు సర్వే నంబరు 129/15/అ, 207/రులో ఎకరా 30 గుంటల భూమి ఉంది. ఈమె వ్యవసాయం, దినసరి కూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. మేలో ప్రభుత్వం అందించిన రైతుబంధు డబ్బులు చంద్రమ్మకు రాకపోవడంతో ఆమె కుమారుడు బాలయ్య వ్యవసాయ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. పరిశీలించిన అధికారులు.. మీ అమ్మ చనిపోయింది కదా.. రైతుబీమా డబ్బులు కూడా తీసుకున్నారు అని చెప్పడంతో అవాక్కయ్యాడు. వెంటనే గ్రామ పెద్దలకు తెలపడంతో అసలు విషయం బయటపడింది. ఇది విన్న స్థానికులు విస్తుపోయారు. నిందితుడిపై ఫిర్యాదు చేశాం పుట్టపహడ్ గ్రామ కోఆర్డినేటర్ రాఘవేందర్ తమను నమ్మించి మోసం చేశాడని మండల వ్యవసాయశాఖ అధికారి వీరస్వామి తెలిపారు. గ్రామానికి చెందిన చంద్రమ్మ చనిపోయిందని తమకు సమాచారం అందించి.. తర్వాత బాధితురాలి కుమారుడు బాలయ్యను తీసుకొచ్చి రైతుబీమాకు అవసరమైన ధ్రువపత్రాలతో దరఖాస్తు చేశాడని తెలిపారు. డిసెంబర్ 9న రైతుబీమా డబ్బులు చంద్రమ్మ నామిని బాలయ్య ఖాతాలో జమ అయినట్లు పేర్కొన్నారు. రైతుబంధు కోఆర్డినేటర్ రాఘవేందర్పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. మమ్మల్ని మోసం చేశాడు బ్యాంకులో ఉన్న రుణం తగ్గిస్తామని, పంట నష్టం వేయిస్తానని మా దగ్గర పట్టా పాసుపుస్తకాలు తీసుకున్నాడు. డబ్బులు పడ్డాక మా వడ్ల పైసలు మీ ఖాతాలో పడ్డాయని నా కుమారుడు బాలయ్యను తీసుకుని వెళ్లి పైసలన్నీ తీసుకున్నాడు. రైతుబంధు రాకపోవడంతో వ్యవసాయ అధికారుల వద్ద ఆరా తీయగా.. మాకు అసలు విషయం తెలిసింది. నేను బతికుండగానే చనిపోయానని పత్రాలు సృష్టించడం చాలా దుర్మార్గం. ఇందుకు కారణమైన ప్రతీఒక్కరిపై చర్యలు తీసుకోవాలి. రైతుబంధు డబ్బులు ఇప్పించాలి. – చంద్రమ్మ, బాధితురాలు -
వారంలో పీజీ!.. లాడ్జీల్లో పరీక్షలు
సాక్షి,అనంతపురం: రెండేళ్ల పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సు వారం రోజుల్లో పూర్తి చేయడం సాధ్యమా?.. తాము తలచుకుంటే సాధ్యమేనని నిరూపించారు జిల్లాలోని కొందరు ఉపాధ్యాయులు. పైగా ఆ సర్టిఫికెట్లతో పదోన్నతులు కూడా పొందారు. 2009 ఫిబ్రవరిలో ఇంగ్లిష్ స్కూల్ అసిస్టెంట్గా పదోన్నతి దక్కించుకున్న వారిలో ఎక్కువ మంది ఇలా నకిలీ పీజీ సర్టిఫికెట్లతోనే కథ నడిపించినట్లు తెలుస్తోంది. నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారంపై తాజాగా ‘సాక్షి’ కథనాలు ప్రచురిస్తుండగా..అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. లాడ్జీల్లో పరీక్షలు ఇంగ్లిష్ స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు ఎంఏ ఇంగ్లిష్ చదివి ఉండాలన్నది నిబంధన. దీంతో కొందరు ఎస్జీటీలు అడ్డదారుల్లో సర్టిఫికెట్లు పుట్టించారు. ఇతర రాష్ట్రాల్లోని యూనివర్సిటీల అధికారులకు కాసులు సమర్పించారు. వారి సహకారంతో రాత్రిళ్లు లాడ్జీల్లో పరీక్షలు రాసేశారు. వారంలో సర్టిఫికెట్లు తెచ్చేసుకుని.. విద్యాశాఖ అధికారులకు సమర్పించారు. ఇలా 77 మంది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) గుర్తింపు లేని రాజస్థాన్లోని విహబ్ యూనివర్సిటీ సర్టిఫికెట్లు సమర్పించి పదోన్నతులు పొందినట్లు సమాచారం. గుడ్డిగా పదోన్నతులిచ్చిన విద్యాశాఖ పదోన్నతి కోసం సదరు ఉపాధ్యాయులు ఇచ్చిన సర్టిఫికెట్లు నిజమైనవా..కావా అన్న అంశాన్ని జిల్లా విద్యాశాఖ అధికారులు ధ్రువీకరించుకోవాలి. ఇందుకోసం సదరు యూనివర్సిటీల అధికారులను సంప్రదించాల్సి ఉంటుంది. కానీ ఎస్ఏ ఇంగ్లిష్ పోస్టు కోసం సమర్పించిన సర్టిఫికెట్ల గురించి ఏ అధికారీ ఆరా తీయలేదు. అసలు సదరు యూనివర్సిటీ దేశంలో ఉందా..లేదా అని కూడా నిర్ధారించుకోలేదు. తీరా ఇప్పుడు ఈ వ్యవహారం వివాదాస్పదం కావడంతో జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఏ సెక్షన్, బీ సెక్షన్ అధికారులు ఒకరిపై మరొకరు నెపం నెట్టుకుంటున్నారు. మరోవైపు వారం రోజుల్లోనే పీజీ సర్టిఫికెట్లు తెప్పించుకుని సర్వీసు రిజిష్టర్ (ఎస్ఆర్)లో నమోదు చేయించుకున్న కొందరు ఉపాధ్యాయులు.. ఈ వ్యవహారం రచ్చ కావడంతో అదే సబ్జెక్టుకు సంబంధించి మరో వర్సిటీ నుంచి పీజీ పూర్తి చేశారు. తిరిగి ఆ సర్టిఫికెట్ ఆధారంగా ఎస్ఆర్లో నమోదు చేయించుకున్నారు. అయినా విద్యాశాఖ అధికారులు పట్టించుకోకపోవడంపై తెరవెనుక భారీగానే మంత్రాంగం నడిచినట్లు తెలుస్తోంది. -
అక్రమ పదోన్నతులు: ‘సాక్షి’ కథనంతో కలకలం
పెనుకొండ మండలంలో పనిచేసిన ఓ సెకండరీ గ్రేడ్ టీచర్... స్కూల్ అసిస్టెంట్గా (ఇంగ్లిష్) పదోన్నతి పొందాలనుకున్నాడు. ఎంఏ ఇంగ్లిష్ చదివాల్సి ఉన్నా.. అంత ఓపికలేక ఇతర రాష్ట్రంలోని ఓ యూనివర్సిటీ నుంచి సర్టిఫికెట్ తెచ్చి ప్రమోషన్ పొందాడు. తాజాగా నకిలీ బాగోతాలన్నీ తవ్వుతుండగా ఏం జరుగుతుందోనని భయపడిపోతున్నాడు. అనంతపురం విద్య: నకిలీ సర్టిఫికెట్లు సమర్పించి పదోన్నతులు పొందిన అయ్యవార్ల గుట్టు రట్టవుతోంది. అడ్డదారిలో పదోన్నతులు పొందిన టీచర్ల వ్యవహారంపై ‘సారూ... ఇదేమి తీరు’ శీర్షికన గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంతో విద్యాశాఖలో కలకలం రేగింది. గుర్తింపు లేని వర్సిటీల నుంచి ఎంఏ ఇంగ్లిష్ సర్టిఫికెట్లు సమర్పించి పదోన్నతులు పొందిన వారి వివరాలన్నీ తక్షణమే తనకు అందించాలని డీఈఓ కే.శామ్యూల్ ఉన్నతాధికారులను ఆదేశించారు. దీంతో జిల్లా విద్యాశాఖ అధికారులు అలగప్ప, భారతీయార్, మధురై కామరాజ్, వినాయక మిషన్స్ తదితర వర్సిటీల్లో ఎంఏ ఇంగ్లిష్ పూర్తి చేసినట్లు సర్టి ఫికెట్లు అందజేసిన ఉపాధ్యాయుల వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఒకటి అక్రమం..మరొకటి సక్రమం... ఇంగ్లిష్ స్కూల్ అసిస్టెంట్ పదోన్నతికి తప్పనిసరిగా ఎంఏ ఇంగ్లిష్ పూర్తి చేసి ఉండాలి. అయితే నకిలీ సర్టిఫికెట్లతో కొందరు తక్షణమే పదోన్నతి తీసుకున్నారు. తిరిగి మరో దఫా అదే పీజీని మరో వర్సిటీ నుంచి ఒరిజినల్గా పూర్తి చేశారు. ఇలా ఆరుగురు ఎంఏ ఇంగ్లిష్ను రెండు దఫాలు పూర్తి చేసినట్లు ఎస్ఆర్ (సర్వీసు రిజిస్టర్)లో నమోదు చేయించుకున్నారు. నకిలీ పీజీ సర్టిఫికెట్ను అసలు పీజీ సర్టిఫికెట్గా మార్చేందుకు ఎత్తుగడ వేశారు. పదోన్నతి దక్కినప్పుడు నమోదు చేసిన సర్టిఫికెట్, వర్సిటీ.. తాజాగా నమోదు చేసిన సర్టిఫికెట్ వేర్వేరుగా ఉండటం గమనార్హం. సింగిల్ సబ్జెక్టు పేరుతో... ఇంగ్లిష్ స్కూల్ అసిస్టెంట్ పదోన్నతికి ఎంఏ ఇంగ్లిష్ /లేదా డిగ్రీలో ఇంగ్లిష్ లిటరేచర్ తప్పనిసరి. ఈ క్రమంలో నకిలీ ఎంఏ ఇంగ్లిష్ సర్టిఫికెట్ తెచ్చుకున్న వారు కొందరైతే.. మరికొందరు ఏకంగా సింగిల్ సబ్జెక్టు ఇంగ్లిష్ డిగ్రీ పేరుతో నకిలీ సర్టిఫికెట్ తెచ్చుకున్నారు. డీఈఓ నిర్ణయంతో వారందరికీ చెమటలు పడుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో...ఎవరిపై వేటు పడుతుందోనని ఆందోళన చెందుతున్నారు. కానీ మెజార్టీ ఉపాధ్యాయులు మాత్రం ఇప్పటికైనా అక్రమార్కులపై చర్యలు తీసుకుని సీనియార్టీ, అర్హత ఉన్న వారికి పదోన్నతి కల్పించాలని కోరుతున్నారు. -
Hyderabad: భూమా అఖిలప్రియ భర్త, సోదరుడిపై మరో కేసు
-
భూమా అఖిలప్రియ భర్త, సోదరుడిపై మరో కేసు
సాక్షి, హైదరాబాద్: భూమా అఖిలప్రియ భర్త భార్గవ్రామ్, సోదరుడు విఖ్యాత్రెడ్డిపై మరో కేసు నమోదైంది. నకిలీ సర్టిఫికెట్లు సమర్పించినట్లు బోయిన్పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ నుంచి తప్పించుకునేందుకు నకిలీ సర్టిఫికెట్లు సమర్పించినట్లు కేసు నమోదైంది. నకిలీ కోవిడ్ సర్టిఫికెట్ సమర్పించి ఈనెల 3న కోర్టులో జరగాల్సిన విచారణకు హాజరుకాలేమని జగత్విఖ్యాత్రెడ్డి, భార్గవ్ రామ్ చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. భూ వివాదం కిడ్నాప్ కేసులో భార్గవ్రామ్, విఖ్యాత్రెడ్డి నిందితులుగా ఉన్న సంగతి తెలిసిందే. -
నకీలీ సర్టిఫికెట్తో ఎంపీపీ పదవి..
సాక్షి, దేవరకద్ర(మహబూబ్నగర్): తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో దేవరకద్ర ఎంపీపీ రమాదేవి ఎంపీపీ పదవి పొందారని ఏఐసీసీ కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్కుమార్ ఆరోపించారు. మంగళవారం దేవరకద్రలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో ఓసీ కులానికి చెందిన రాములమ్మ, పదవి కోసం తహసీల్దార్ కార్యాలయం నుంచి బీసీ సర్టిఫికెట్ పొందారని, బీసీ మహిళలకు రిజర్వు అయిన దేవరకద్ర ఎంపీపీ పదవిని చేజిక్కించుకున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన శ్రీకాంత్యాదవ్ తన భార్య అయిన రాములమ్మ అలియాస్ రమాదేవిని ఎంపీపీ పదవి కోసం అప్పటి తహసీల్దార్ చెన్నకిష్టన్న సహకారంతో బీసీ సర్టిఫికెట్ పొందారని ఆరోపించారు. ఈ తప్పు బయటపడకుండా తహసీల్దార్ కార్యాలయంలో ఫైల్ను అపహరించారని అన్నారు. బీసీ మహిళకు కేటాయించిన స్థానంలో ఓసీ మహిళను ఎన్నుకోవడంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశామని తెలిపారు. సమావేశంలో టీపీసీసీ సంయుక్త కార్యదర్శి కాటం ప్రదీప్కుమార్గౌడ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రశాంత్రెడ్డి, అరవింద్రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు రాందాసు, కిషన్రావు, రాఘవేందర్రెడ్డి పాల్గొన్నారు. చదవండి: నెల క్రితం మిస్సింగ్.. 10 అడుగుల లోతులో అస్థిపంజరాలు -
ఇంద్రకీలాద్రిపై నకిలీ సర్టిఫికెట్ల కలకలం
సాక్షి, అమరావతి: ఇంద్రకీలాద్రిపై నకిలీ సర్టిఫికెట్ల ఘటన కలకలం రేపుతోంది. నకిలీ సర్టిఫికెట్లతో పని చేస్తున్న ఉద్యోగులను ఆలయ అధికారులు గుర్తించారు. ఇద్దరు వ్యక్తులు నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగం చేస్తున్నట్లు గుర్తించగా వారిని ఈఓ భ్రమరాంబ సస్పెండ్ చేశారు. అందులో ఒకరు సీనియర్ ఆసిస్టెంట్, మరొకరు జూనియర్ అసిస్టెంట్గా పని చేస్తున్నారు. చదవండి: విషాదం: క్షణికావేశం..తీసింది ప్రాణం.. -
మాయలేడి: ఇంత పనిచేసిందా?
నంద్యాల: తాను ఏకైక సంతానమని అధికారులకు బురిడీ కొట్టించి కోట్ల రూపాయల విలువైన తల్లి ఆస్తులను విక్రయించిన ఓ మహిళ బండారం నంద్యాలలో వెలుగుచూసింది. టూటౌన్ ఎస్ఐ పీరయ్య తెలిపిన వివరాల మేరకు.. నంద్యాల పట్టణంలోని కోటావీధికి చెందిన అవుకు రమాదేవి అనే మహిళ తన తల్లి ఎల్ల నర్సమ్మకు తాను ఏకైక సంతానమని, రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ పొందింది. సదరు మహిళ ఈ సర్టిఫికెట్ను చూపి తన తల్లికి చెందిన ఆస్తులను ఇతరులకు రిజిస్ట్రేషన్లు చేసింది. అయితే, నర్సమ్మకు రమాదేవితో పాటు ముగ్గురు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. ఈ విషయాన్ని రమాదేవి దాచి పెట్టి భూములను రిజిస్ట్రేషన్లు చేసిన విషయం తహసీల్దార్కు తెలియడంతో గత నవంబర్ నెలలో ఆమెను పిలిపించి విచారించారు. ఈ విచారణలో తనకు ముగ్గురు సోదరులు, నలుగురు సోదరీమణులు ఉన్న మాట వాస్తవమని ఒప్పకుంటూ, జారీ చేసిన ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ రద్దు చేయమని రాత పూర్వకంగా రాసి ఇచ్చింది. ఆ తర్వాత కూడా ఆమె ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ను అడ్డుపెట్టుకుని అవుకు మండలం గుండ్ల సింగవరానికి చెందిన మాదిరెడ్డి తిరుమలేశ్వరరెడ్డి, చిట్టెపు మద్దిలేటిరెడ్డి, బనగానపల్లెకు చెందిన వెంకట శ్రీనివాస్రెడ్డి, ఎస్బీఐ కాలనీకి చెందిన సీతారామిరెడ్డి, వెంకటకృష్ణారెడ్డిలకు డిసెంబర్ 30వ తేదీన విలువైన ఇళ్ల స్థలాలను రిజి్రస్టేషన్ చేసి ఇచ్చింది. ఈ విషయం తెలుసుకున్న తహసీల్దార్ రవికుమార్.. రమాదేవి తప్పుడు సర్టిఫికెట్తో రిజిస్ట్రేషన్లు చేస్తుందని ఆమెపై కేసు నమోదు చేయాలని టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ మాయలేడిపై ఐపీసీ సెక్షన్ 177, 182, 199, 420, 419 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పీరయ్య తెలిపారు. -
కూకట్పల్లిలో బయటపడ్డ ఫేక్ డాక్టర్ మోసం!
సాక్షి, కేపీహెచ్బీ కాలనీ: నకిలీ ధ్రువపత్రాలతో ఎంబీబీఎస్ డాక్టర్గా అవతారమెత్తిన ఓ ఆర్ఎంపీని కేపీహెచ్బీ పోలీసులు రిమాండ్కు తరలించారు. ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న మెడికల్ కౌన్సిల్ ధ్రువీకరణ పత్రాలను డౌన్లోడ్ చేసి ఫోర్జరీ సంతకాలతో పత్రాలను సృష్టించడంతో పాటు పలు ఆస్పత్రులు, రోగులను మోసం చేసిన నకిలీ డాక్టర్ బాగోతాన్ని అసలు డాక్టర్ ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ లక్ష్మినారాయణ వివరాలు వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లా, అల్లవరంకు చెందిన మంగుం కిరణ్కుమార్ (48) ఆయుర్వేద క్లీనిక్లో కాంపౌండర్గా చేరి, ఆర్ఎంపీగా మారి విశాఖపట్నంలోని ఎన్ఏడీ జంక్షన్ వద్ద 2013 – 2015లో హైమవతి క్లీనిక్ పేరుతో ఆస్పత్రిని ప్రారంభించాడు. అంతాగా లాభం రాకపోవడంతో మూసేశాడు. ఇంటర్నెట్లో ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్లో రిజిష్టర్ అయిన డాక్టర్ల ధ్రువీకరణ పత్రాలను పరిశీలిస్తుండగా అతని పేరు, ఇంటి పేరుకు దగ్గరగా ఉన్న కిరణ్కుమార్ ఎం (ముక్కు) ఎంబీబీఎస్, ఎండీ, జనరల్ ఫిజిషియన్ డాక్టర్ పత్రం కంటపడింది. వెంటనే దానిని డౌన్లోడ్ చేసి కలర్ ప్రింట్లు తీసుకుని ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ హైదరాబాద్ అనే పేరుతో నకిలీ స్టాంపును తయారు చేయించి రిజిస్ట్రార్ సంతకాన్ని తానే ఫోర్జరీ చేశాడు. ఆ సర్టిఫికెట్లను చూపించి శ్రీకాకుళం జిల్లా రాజాంలోని జీఎంఆర్ ఆస్పత్రిలో డాక్టర్గా చేరి నెలకు రూ. 80 వేల జీతం పొందాడు. ఆ తర్వాత కిరణ్కుమార్ పనితీరుపై ఆసుపత్రి వర్గాలకు అనుమానం రావటంతో చెప్పా పెట్టకుండా అక్కడి నుంచి అమలాపురంలోని శ్రీనిధి ఆస్పత్రిలో రెండు నెలల పనిచేశాడు. ఆ తర్వాత భీమవరంలోని ఇంపీరియల్ ఆస్పత్రిలో చేరాడు. వారికి కూడా అనుమానం రావడంతో 2019లో ఆస్పత్రులకు వెళ్లటం మానేసి హైదరాబాద్కు మకాం మార్చాడు. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో యూనివర్సిల్ క్లీనిక్లో, కాంటినెంటల్ ఆసుపత్రిలో కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్గా పనిచేస్తున్న అసలైన డాక్టర్ కిరణ్కుమార్ ముక్కు, తన ఇన్కంటాక్స్ రిటర్న్ల కోసం ఐటి శాఖను సంప్రందించగా, అక్కడ అతని పేరుతో అప్పటికే రెండు పాన్ కార్డులు జారీ అయినట్లు తెలిసింది. దీంతో అనుమానం వచ్చిన కిరణ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదుతో నకిలీ డాక్డర్ కిరణ్కుమార్ మంగుంను సోమవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. -
‘నేను బతికే ఉన్నాను.. గుర్తించండి’
పారిస్: బతికి ఉన్న మనిషిని చనిపోయారని ప్రకటిస్తే.. ఎంత బాధగా ఉంటుందో అనుభవించే వారికే తెలుస్తుంది. సాధారణంగా మన దగ్గర యూట్యూబ్ చానెళ్లు.. అప్పుడప్పుడు మీడియా సంస్థలు కూడా బతికి ఉన్న మనుషులను చనిపోయారని ప్రకటించి.. ఆ తర్వాత నాలుక కర్చుకుంటాయి. ఇక మన ప్రభుత్వ సంస్థల నుంచి పెన్షన్ లాంటివి పొందాలంటే అధికారులు మనం బతికి ఉన్నామనే సర్టిఫికెట్ తీసుకురమ్మాంటారు. చెట్టంత మనిషి ఎదురుగా ఉంటే నమ్మరు.. స్టాంప్ వేసిన కాగితం తెచ్చిస్తేనే.. మనం బతికి ఉన్నామనడానికి నిదర్శనం అని నమ్ముతారు. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి ఫ్రాన్స్లో చోటు చేసుకుంది. ఓ 58 ఏళ్ల మహిళ తాను బతికే ఉన్నానని.. ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలని కోరుతూ.. కోర్టు మెట్లు ఎక్కింది. జీన్ పౌచైన్ అనే మహిళ తాను బతికి ఉన్నానని గుర్తించండి అంటూ 2017 నవంబర్ నుంచి ప్రభుత్వ సంస్థలను కోరుతుంది. ఆ వివరాలు.. జాన్ ఫౌచెన్ అనే మహిళ చనిపోయిందంటూ ఆమె భర్తతో పాటు పని చేసిన ఓ ఉద్యోగి ప్రభుత్వానికి తెలియజేశాడు. దాంతో అధికారులు ఆమెకు సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్, ఐడీ కార్డ్, బ్యాంక్ అకౌంట్ వంటి రికార్డులను శాశ్వతంగా తొలగించారు. ఆమె ఉద్యోగం కూడా కోల్పోయి.. ఇబ్బంది పడుతున్నారు. ఇందుకు కారణం ఏంటి అంటే ఫౌచైన్, ఆమె భర్త, కుమారుడు పని చేస్తున్న క్లీనింగ్ కంపెనీ 2000 సంవత్సరంలో ఓ పెద్ద కాట్రాంక్ట్ కోల్పోయింది. ఆ తర్వాత 2004లో కార్మిక ట్రిబ్యునల్ ఫౌచైన్ 14 వేల యూరోల నష్ట పరిహారం చెల్లించాలని ఆదేశించింది. అయితే అదృష్టవశాత్తు కేసు సంస్థపై రిజిస్టర్ కావడంతో ఫౌచైన్ బతికి పోయిది. ఈ క్రమంలో సదరు మాజీ ఉద్యోగి ఇదే కేసులో ఫౌచైన్ భర్త, కుమారుడి మీద కేసు నెగ్గడం కోసం ఆమె మరణించింది అంటూ ఫేక్ పత్రాలను సమర్పించాడు. దాంతో అధికారులు ఆమెకు సంబంధించిన రికార్డులను శాశ్వతంగా తొలగించారు. మాజీ ఉద్యోగి ఫౌచైన్పై రెండుసార్లు కేసు పెట్టడానికి ప్రయత్నించాడు కాని ఫలించలేదు. (చదవండి: వెలుగులోకి 100 ఏళ్లనాటి పావురాయి సందేశం) ఈ సందర్భంగా ఫౌచైన్ తరపు న్యాయవాది మాట్లాడుతూ.. ‘ఇది ఒక మతిలేని కేసు. అధికారులు ఎలాంటి దర్యాప్తు, ఆధారాలను తనిఖీ చేయకుండా ఆమె చనిపోయిందని ప్రకటించారు. ఒక్కరు కూడా క్రాస్ చెక్ చేసుకోలేదు’ అంటూ మండిపడ్డారు. మనికొందరు మాత్రం కాంట్రాక్ట్ లాస్ కేసులో నుంచి బయటపడటం కోసం ఫౌచైన్ తప్పుడు పత్రాలు సృష్టించిందని ఆరోపిస్తున్నారు. ఈ వ్యాఖ్యల్ని ఆమె ఖండించారు. ‘నేను మరణించలేదని.. సంస్థలు తెలుపుతున్నాయి.. అలా అని నేను బతికి ఉన్నానని కూడా ప్రకటించడం లేదు. ఈ ప్రకటన చేయించడం కోసం నేను ఫైట్ చేస్తున్నాను’ అంటూ ఫౌచైన్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. -
నకిలీ సర్టిఫికెట్ల గుట్టు రట్టు
ఒంగోలు: రెండేళ్లుగా 11 రాష్ట్రాల్లో 200కుపై బ్రాంచీలతో నడుస్తున్న టెక్నికల్ కోర్సుల నకిలీ సర్టిఫికెట్ల తయారీ ముఠాను ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ నేతృత్వంలోని పోలీసు అధికారులు ఛేదించారు. నకిలీ సంస్థ ఏర్పాటు సూత్రధారితోపాటు మరో ఆరుగురిని అరెస్టు చేసి శనివారం మీడియా ముందు హాజరుపరిచారు. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా యద్దనపూడి మండలంలోని హనుమాన్ ఫెర్టిలైజర్స్ షాపుపై ఇటీవల విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. షాపులో సరుకుతోపాటు వ్యాపారి జంపని వెంకటేశ్వర్లు సర్టిఫికెట్లను పరిశీలించారు. అవి నకిలీవని నిర్ధారణ కావడంతో ఆ వ్యాపారిపై ఏవో సీహెచ్ ఆదినారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంకొల్లు సీఐ దీనిపై లోతుగా దర్యాప్తు చేయగా.. షాపు యజమాని రూ.10వేలకు నకిలీ సర్టిఫికెట్ను కొనుగోలు చేసినట్లు తేలింది. దీంతో దర్యాప్తును వేగవంతం చేశారు. వైజాగ్ కేంద్రంగా.. జేఎన్టీసీ పేరుతో... వైజాగ్కు చెందిన సిలారపు బాల శ్రీనివాసరావు సంపాదనపై ఆశతో 2017లో జవహర్లాల్ నెహ్రూ టెక్నికల్ సెంటర్(జేఎన్టీసీ) పేరుతో ఓ నకిలీ సంస్థను స్థాపించాడు. ఇందులో ఆయన సతీమణి సుజాత కూడా భాగస్వామి. మన రాష్ట్రంతో పాటు మొత్తం 11 రాష్ట్రాల్లో 200కుపైగా బ్రాంచీలు ప్రారంభించి నకిలీ దందా మొదలుపెట్టారు. ఒక్కో బ్రాంచి నుంచి రూ.లక్ష నుంచి 2 లక్షలు వసూలు చేశారు. మన రాష్ట్రంలో 1,855, మిగిలిన 10 రాష్ట్రాల్లో 382 మొత్తం 2,237 నకిలీ సర్టిఫికెట్లు విక్రయించారు. హోటల్ అండ్ టూరిజం మేనేజ్మెంట్, ల్యాబ్ టెక్నీషియన్, ఏవియేషన్ హాస్పిటాలిటీ, ఫ్యాషన్ అండ్ ఇంటీరియర్ డెకరేషన్, ఫైర్ సేఫ్టీ, ప్రైమరీ టీచింగ్, హెల్త్కేర్ అనుబంధ రంగాలు, క్రిటికల్ విభాగమైన అనస్తీషియా, కార్డియాలజీ, ఈసీజీ, ఆప్తల్మాలజీ, కంప్యూటర్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్, వెటర్నరీ అసిస్టెంట్, ఫిట్నెస్, యోగా వంటి అనేక టెక్నికల్ కోర్సుల్లో 3 నెలల డిప్లొమా మొదలు మూడేళ్ల కోర్సు వరకు నకిలీ సర్టిఫికెట్లను రూ.వెయ్యి నుంచి రూ.లక్ష వరకు తీసుకుని అందజేసేవారు. నిందితులు జంపని వెంకటేశ్వర్లు (చింతలపూడి– యద్దనపూడి మండలం), సిద్ది శ్రీనివాసరెడ్డి (మర్లపాలెం–కురిచేడు), కోడూరి ప్రదీప్కుమార్ (ఈపూరుపాలెం–చీరాల), అనపర్తి క్రిస్టాఫర్ (ఇందుర్తినగర్–ఒంగోలు), బట్టపోతుల వెంకటేశ్వర్లు (యర్రగొండపాలెం), సిలారపు బాల శ్రీనివాసరావు, సిలారపు సుజాత (శంకరమఠం రోడ్– విశాఖ)లను పోలీసులు అరెస్టు చేశారు. సర్టిఫికెట్లతోపాటు కంప్యూటర్, ప్రింటర్, హార్డ్ డిస్క్, స్టాంపులు, హోలోగ్రాం, రిజిస్టర్లతోపాటు సంస్థ పేరుపై బ్యాంకులో ఉన్న రూ.5,47,537లను సీజ్ చేశారు. నకిలీ సర్టిఫికెట్ల వినియోగంపై ప్రత్యేక దృష్టి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసిన పోస్టుల్లో ఇలాంటి సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన వారు ఎవరైనా ఉన్నారా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ సిద్ధార్థ కౌశల్ తెలిపారు. ఈ కేసును ఛేదించిన పోలీస్ అధికారులు అల్తాఫ్ హుస్సేన్, ఎస్.చౌదరిలను ఎస్పీ అభినందించారు. -
నకిలీ సర్టిఫికెట్స్ ముఠా గుట్టురట్టు
సాక్షి, ఒంగోలు: నకిలీ సర్టిఫికెట్స్ను తయారు చేస్తున్న ముఠా గుట్టును ప్రకాశం జిల్లా పోలీసులు రట్టు చేశారు. వివరాల్లోకెళ్తే.. ఇంకొల్లు, చీరాల, యర్రగొండపాలెం విశాఖపట్నంలను కేంద్రంగా చేసుకుని నకిలీ సర్టిఫికెట్లను తయారు చేస్తున్న ఏడుగురు నిందితులను పోలీస్లు అరెస్ట్ చేశారు. పలు ప్రాంతాలలో నకిలీ సర్టిఫికెట్ల తయారీ కేంద్రాలను గుర్తించి నిందితులు, వారికి సంబంధించిన బ్యాంకు ఖాతాలు, కంప్యూటర్లు నకిలీ పత్రాలు, స్టాంపులను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ మీడియాకు వివరించారు. జేఎన్టీసీ అనే స్వచ్ఛంద సంస్థ రిజిస్ట్రేషన్ చేసుకొని పలుమోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఈ కేసును చాకచాక్యంగా చేధించిన పోలీస్ అధికారులను జిల్లా ఎస్పీ అభినందించారు. (పెదకూరపాడు ఎక్సైజ్ ఎస్ఐ ఆత్మహత్యాయత్నం) -
జాబ్ కోసం ఫేక్?
సాక్షి, నెల్లూరు(అర్బన్): జిల్లా వైద్యారోగ్య శాఖలో నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ గ్రేడ్–2 పోస్టుల భర్తీకి అధికారులు శ్రీకారం చుట్టారు. కాగా కొందరు ఫేక్ మార్కుల జాబితాలతో ఉద్యోగాలు పొందేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు ఆ శాఖలోని కిందిస్థాయి ఉద్యోగులు సహకరిస్తున్నారనే విమర్శలున్నాయి. ఎలా వచ్చాయి? మొదటిసారి ప్రకటించించిన జాబితాలో ఓ అభ్యర్థికి 1014 మార్కులున్నట్లుగా చూపారు. ఫైనల్ మెరిట్ జాబితాలో 811 మార్కులని ఉంది. అలాగే ప్రొవిజనల్ మెరిట్ జాబితాలో 65, 73, 76, 93 ఇలా ఓ పదిమందికి సంబంధించిన ర్యాంకులపై ఆరోపణలు వెల్లువెత్తాయి. నర్సింగ్ కోర్సులో తక్కువ మార్కులు వచ్చినా ప్రకటించిన ప్రొవిజనల్ జాబితాలో ఎక్కువ మార్కులు ఎలా వచ్చాయని పలువురు అభ్యర్థులు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. అభ్యంతరాలు స్వీకరించినా సోమవారం ఫైనల్ మెరిట్ జాబితాను ప్రచురించామని డీఎంహెచ్ఓ తెలిపారు. ఆ జాబితాను వెబ్సైట్లో ఉంచామన్నారు. ఒక్కసారిగా.. ఏమి జరిగిందో గానీ మార్కుల జాబితాలో పైన పేర్కొన్న పలువురి ర్యాంకులు తలకిందులయ్యాయి. మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా లిస్ట్ను మార్పు చేశారు. అప్పటివరకు ఎక్కువ మార్కులు పొంది, మెరిట్ లిస్ట్లో ముందు వరుసలో ఉన్న కొందరికి తక్కువ మార్కులు చూపిస్తూ రెండో జాబితాను వెబ్సైట్లో ప్రదర్శించారు. దీంతో ర్యాంకుల పరంగా ఒక్కసారిగా వారు వెనక్కు వెళ్లిపోయారు. ఈ విషయంపై డీఎంహెచ్ఓ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ పోస్టుల భర్తీ పారదర్శకంగా చేపట్టామన్నారు. ఒకరికి పొరపాటున మార్కులు ఎక్కువ పడ్డాయని వాటిని సరి చేశామన్నారు. మరో ఏడుగురి సర్టిఫికెట్లæపై సందేహాలున్నాయన్నారు. ఇదిలా ఉండగా డీఎంహెచ్ఓ కార్యాలయం పరిధిలో నర్సింగ్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారు వైద్యవిధాన పరిషత్లోని (ఏపీవీపీ) పోస్టులకు కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఏపీవీపీలోని పోస్టుల్లో కూడా తమ నర్సింగ్ కోర్సులో ఎక్కువ మార్కులు పొందినట్లుగా చూపారు. ఇదే అభ్యర్థుల జాబితాను ప్రస్తుతం పరిశీలిస్తే డీఎంహెచ్ఓ పోస్టులకు సంబంధించి ప్రదర్శించిన జాబితాలో తక్కువ మార్కులు ఉండడం.. ఏపీవీపీ పోస్టుల్లో ఎక్కువ మార్కులుండడాన్ని చూసిన వారు నోరెళ్లబెడుతున్నారు. ఈ విషయమై డీసీహెచ్ చెన్నయ్యను వివరణ కోరగా నర్స్ పోస్టు కోసం ఒకరు దరఖాస్తు చేసిన మార్కుల జాబితాపై ఫిర్యాదు అందిందన్నారు. దానిని పరిశీలించేందుకు ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకురావాలని కోరగా ఆమె ఈ రోజు వస్తానని చెప్పి రాలేదన్నారు. దీనిని బట్టి చూస్తే ఆమెది ఫేక్ మార్కుల జాబితా అయి ఉండవచ్చన్నారు. ఉద్యోగాల్లో చేర్చుకునేప్పుడు అన్ని మార్కుల జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించి తప్పు చేసినట్లుగా తేలితే వారిపై చర్యలు చేపడతామన్నారు. జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయం -
నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టు రట్టు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రంగా నకిలీ సర్టిఫికెట్స్ తయారు చేస్తున్న ముఠాను నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నలుగురు నిందితులు మచ్చేందర్, రాజేష్, సంతోష్, జయంత్ల నుంచి పదోతరగతికి చెందిన 13 నకిలీ మెమోలు, ఓ లాప్ టాప్, పోస్టల్ డిపార్ట్ మెంట్కు చెందిన నకిలీ పత్రాలు, స్టాంపులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా ప్రధాన సూత్రధారి మచ్చేందర్ నుంచి జయంత్ గతంలో నకిలీ సర్టిఫికేట్లు తీసుకున్నాడు. వాటిని ఉపయోగించి జయంత్ పోస్టల్ డిపార్ట్ మెంట్లో ఉద్యోగం పొందాడు. కేసు నమోదు చేసి విచారణ నిమిత్తం గాంధీ నగర్ పోలీసులకు నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అప్పగించారు. -
జైలులో ఉన్నా ఆదివారం పొట్టేళ్లు తెగాల్సిందే..
గ్లెన్ బ్రిగ్స్... ఈ కాలపు చార్లెస్ శోభరాజ్. రాష్ట్రంలో పేరు మోసిన నకిలీ సర్టిఫికెట్ల సృష్టికర్త. బ్రిగ్స్కు పోలీసులంటే లెక్కేలేదు. జైలంటే భయం లేదు. కేసులపై ఆందోళన లేదు. గుత్తి, గుంతకల్లు, తిరుపతి కేంద్రాలుగా వేల కొద్దీ నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి దేశవ్యాప్తంగా విక్రయించాడు. పోలీసులతో ఉన్న పరిచయాలతో జైలుకు వెళ్లినా రాజభోగాలు అనుభవించాడు. ఖాకీల నుంచి అందిన సహకారం.. జైలులో బ్రిగ్స్ దర్జా చూసి ఉన్నతాధికారులే విస్తుపోతున్నారు. అనంతపురం, గుంతకల్లు: నకిలీ సర్టిఫికెట్ల కేసుల్లో నిందితుడు గ్లెన్ బ్రిగ్స్ నేరచరిత్ర.. విలాసాలు.. జైలులో గడుపుతున్న రాజభోగాలు తెలిసి అధికారులే అవాక్కవుతున్నారు. ఇటీవల అరెస్టయి ప్రస్తుతం గుత్తి సబ్జైలులో రిమాండ్ ఖైదీగా బ్రిగ్స్ బయటి ప్రపంచంతో నిత్యం టచ్లో ఉంటున్నాడు. జిల్లా ఎస్పీ సత్యయేసుబాబు గ్లెన్ బ్రిగ్స్ నేర చరిత్రను లోతుగా తవ్వడంతో నమ్మలేని ఎన్నో నిజాలు వెల్లడయ్యాయి. దీంతో ఎస్పీ సత్యయేసుబాబు ఆధారాలతో సహా జైలు శాఖ ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. దీంతో బుధవారం జైళ్ల శాఖ డీఐజీ వరప్రసాద్ గుత్తి సబ్జైలును తనిఖీ చేశారు. బ్రిగ్స్తో జైలు సిబ్బందికి ఉన్న సంబంధాలపై లోతుగా విచారణ చేపట్టారు. గ్లెన్ బ్రిగ్స్తో జైలు సిబ్బంది ములాఖత్ అవుతున్న వైనం తెలిసి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇద్దరు సబ్జైలు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న మరికొందరు సిబ్బందిపై శాఖాపరమైన విచారణకు ఆదేశాలు జారీ చేశారు. జైలుకు వెళ్తే రాజభోగమే.. గ్లెన్ బ్రిగ్స్ జైలుకు వస్తున్నాడంటే గుత్తి సబ్జైలు అధికారులు, సిబ్బందికి పండుగే. ఈ నకిలీ సర్టిఫికెట్ల కేటుగాడికి విలాసవంతమైన సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు సబ్జైలు సిబ్బంది అందరూ ఉత్సాహంతో పనిచేస్తారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రత్యేక గది, ఫ్యాన్, పరుపు తదితర సౌకర్యాలు ఏర్పాటు చేసేవారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు తన అనుచరులతో మాట్లాడుకోవడానికి ఫోన్ కూడా ఇచ్చేవారు. ఖరీదైన మద్యం, మంచి విందు భోజనం నేరుగా అతని గదికే సరఫరా అయ్యేది. అప్పుడప్పుడు రహస్యంగా జైలు నుంచి బయటికి తీసుకువెళ్లి ఆయన పనులు పూర్తి చేయించుకునే వీలు కల్పించేవారని సమాచారం. ఇందుకోసం బ్రిగ్స్ జైలు సిబ్బందికి భారీగా ముట్టజెప్పేవాడు. ఇక ఆదివారం వచ్చిందంటే జైల్లోనే పొట్టేళ్లు కోయించి జైలు సిబ్బందికి జైలు కిచెన్లోనే వండించే వారని తెలుస్తోంది. జైలు సిబ్బందికే కాదు ఆ సమయంలో జైలులో ఉన్న రిమాండ్ ఖైదీలకు సైతం మటన్ బిర్యానీ అందేదని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఎందరో ఖైదీలు గ్లెన్ బ్రిగ్స్కు అభిమానులుగా, అనుచరులుగా మారారు. ఇలా మారిన వారే ఆ తర్వాత నకిలీ సర్టిఫికెట్ల రాకెట్లో కీలకంగా వ్యవహరించారు. మొత్తంగా గుత్తి సబ్జైలు ఒక పెద్ద మోసగాడికి అన్ని సౌకర్యాలు కల్పించిన వైనంపై అధికారులను విస్మయపరిచింది. పోలీసు అండదండలతోనే.. పోలీసు అధికారుల అండదండలతోనే గ్లెన్ బ్రిగ్స్ తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నట్లు తెలుస్తోంది. ఖాకీల అండతోనే రెండు దశాబ్దాలుగా ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో విచ్చలవిడిగా నకిలీ సర్టిఫికెట్లు, నకిలీ కరెన్సీ సృష్టించి చెలామణి చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. 2006, 2007, 2008లలో గ్లెన్బ్రిగ్స్ నకిలీ సర్టిఫికెట్లు తయారీ కేసుల్లో అరెస్టయ్యాడు. అప్పటి జిల్లా ఎస్పీ స్టీఫెన్ రవీంద్ర అతనిపై జిల్లా బహిష్కరణ వేటు వేశారు. దీంతో తన మకాంను గుంతకల్లు నుంచి తిరుపతికి మార్చాడు. తిరుపతిలో సురేష్రెడ్డిగా పేరు మార్చుకొని మళ్లీ తన రాకెట్ సాగించారు. బ్రిక్స్పై 18కిపైగా కేసులున్నప్పటికీ జైలుకు వెళ్లడం...రిలీజ్ అయ్యాక మళ్లీ తన కార్యకలాపాలు యథావిధిగా కొనసాగించడం పరిపాటిగా మారింది. పోలీసు శాఖలోని కానిస్టేబుల్ నుంచి డీఎస్పీ స్థాయి అధికారుల వరకు గ్లెయిన్బ్రిక్స్ లంచాలకు దాసోహం కావడం వల్లే అతను విచ్చలవిడిగా రెచ్చిపోయేందుకు కారణమైనట్లు తెలుస్తోంది. -
పోలీసుల సర్టిఫికేట్; గ్లెన్బ్రిగ్స్తో చెట్టాపట్టాల్
విందులు.. వినోదాలు.. నజరానాలు.. ఆతిథ్యాలు.. పైరవీలు.. పోలీసులతో ఓ నకిలీ సర్టిఫికెట్ల దొంగ నెరిపిన సత్సంబంధాలు కోకొల్లలు. ఒంటిపై 70 తులాల బంగారం.. తిరుపతిలో విలాసవంతమైన భవనం.. చేతిలో పోలీసులు.. చెలరేగిపోయాడీ ఆంగ్లో ఇండియన్. దొంగలతో చేయి కలిపితే జైలుకెళ్లడం తప్పితే ఏముంటుందని.. ఏకంగా పోలీసులనే తన బుట్టలో వేసుకున్నాడు. వాళ్ల అవసరాలు తీరుస్తూ.. తన వ్యవహారాలను చక్కబెట్టుకున్న తీరుకు పోలీసు ఉన్నతాధికారులే విస్తుపోతున్నారు. చిన్నాచితక స్థాయిలో కాకుండా ఏకంగా డీఎస్పీ స్థాయి అధికారులు కూడా ఈ కేటుగాని మాయలో పడటం గమనార్హం. సాక్షి ప్రతినిధి, అనంతపురం : నకిలీ సర్టిఫికెట్ల తయారీలో ఆరితేరిన గ్లెన్ బ్రిగ్స్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తుండగా.. ఇందులో పోలీసులకు కూడా భాగస్వామ్యం ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. జిల్లాలోని నలుగురు డీఎస్పీలు ఈయనతో సన్నిహితంగా మెలిగినట్లు తెలుస్తోంది. విందులు, వినోదాల్లో పాల్గొనడంతో పాటు నజరానాలు కూడా అందుకున్నట్టు సమాచారం. జిల్లా కేంద్రంలోని ఓ విభాగంలో పనిచేసే డీఎస్పీతో పాటు మూడు సబ్ డివిజన్లకు చెందిన ముగ్గురు డీఎస్పీలు గ్లెన్ బ్రిగ్స్తో కలిసి విందులు చేసుకుని.. పోస్టింగుల కోసం పైరవీలు చేయించుకున్నట్లు చర్చ జరుగుతోంది. సదరు నేరస్తుడి నుంచి బైకులు, ల్యాప్టాప్లను కూడా కొంతమంది పోలీసులు నజరానాగా పొందినట్టు విచారణలో తేలినట్లు తెలుస్తోంది. గుంతకల్లు నియోజకవర్గంలోని ఒక ఎస్ఐకి ల్యాప్టాప్ నజరానాగా అందించి కావాల్సిన పనులు చేయించుకున్నట్లు తెలుస్తోంది. నకిలీ సర్టిఫికెట్ల తయారీలో తనదైన శైలిని గ్లెన్ కనబరిచారని.. తరగతుల వారీగానే కాకుండా యూనివర్సిటీల వారీగా ప్రత్యేక ఫైళ్లను తయారు చేసుకుని ఇంట్లో భద్రపరచుకున్నట్టు తెలుస్తోంది. ఎక్కడా అనుమానం రాకుండా సదరు బోర్డు లేదా యూనివర్సిటీ ఇచ్చే ఒరిజినల్ సరి్టఫికెట్లలాగై తయారు చేయడమే కాకుండా సరి్టఫికెట్కు ఇచ్చే సిరీస్ను కూడా అదే క్రమంలో ఉంచి అనుమానం రాకుండా తయారు చేశారని విచారణలో తేలింది. మరోవైపు గుంతకల్లులోని అప్పటి అధికార పార్టీ నేత ద్వారా పైరవీ చేసి ఓ డీఎస్పీతో పాటు పలువురు పోలీసులకు పోస్టింగ్లు ఇప్పించినట్టు కూడా తెలుస్తోంది. బెయిల్ ఇప్పిస్తామంటూ.. కేవలం నకిలీ సరి్టఫికెట్ల తయారీతో ఆగిపోకుండా ఏకంగా కోర్టులో బెయిల్ ఇప్పిస్తానని కూడా గ్లెన్ డబ్బు వసూలు చేసినట్టు తెలుస్తోంది. జిల్లాలో ఒక హత్య కేసులో నిందితునికి ఈ విధంగానే బెయిల్ వచ్చేలా మధ్యవర్తిగా ఉండి రూ.30 లక్షలు ఇప్పించి పని కానిచ్చారని సమాచారం. ఈ వ్యవహారంలో కూడా పోలీసులు కొన్ని వివరాలు సేకరించి.. నివేదికను తయారుచేసి కోర్టు ముందు ఉంచనున్నట్టు సమాచారం. తిరుపతి కేంద్రంగా.. తిరుపతిలోని తన ఇల్లు కేంద్రంగా గ్లెన్ పోలీసులతో సత్సంబంధాలు నెరిపినట్లు తెలుస్తోంది. అక్కడికి ఏదైనా డ్యూటీకి వెళ్లిన పోలీసులకు తన ఇంట్లోనే ఆతిథ్యం ఇవ్వడంతో పాటు భారీగా విందులు, వినోదాలు ఏర్పాటు చేసేవాడు. తద్వారా జిల్లాలోని నలుగురు డీఎస్పీలతో పాటు సుమారు 10 మంది సీఐల వరకు తన గుప్పిట్లో పెట్టుకుని కావాల్సిన వ్యవహారాలు నడిపినట్టు తెలుస్తోంది. లోతుగా విచారణ పవర్ బ్రోకర్గా వ్యవహరించి పోలీసులకు నజరానాలు ఇస్తూ తన పనులు కానిచ్చుకోవడం ద్వారా గ్లెన్ భారీగా ఆర్జించినట్టు తెలుస్తోంది. ఏకంగా తన ఒంటిపై 70 తులాల బంగారం ధరించడమే కాకుండా తిరుపతిలో భారీగా పొలాలు కూడా కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మొత్తం వ్యవహారంపై మరింత లోతుగా విచారణ చేయనుండటంతో ఎవరెవరి జాతకాలు బయటకొస్తాయోననే అంశంపై పోలీసుశాఖలో ఉత్కంఠ రేపుతోంది. ఈ నేపథ్యంలో గ్లెన్కు సంబంధించి నకిలీ సరి్టఫికెట్ల తయారీలోనూ పోలీసులకు సంబంధాలు ఉన్నాయా? అనే కోణంలో ఉన్నతాధికారులు విచారిస్తున్నారు. అంతేకాకుండా సదరు పోలీసులతో జరిపిన వాట్సాప్ చాట్ వివరాలను కూడా సేకరించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. గ్లెన్ ఇంట్లో కానిస్టేబుల్ ఫొటో వాస్తవానికి ఆంగ్లో ఇండియన్ అయిన గ్లెన్ బ్రిగ్స్ వ్యవహారశైలిపై అనేక అనుమానాలు ఉన్నాయి. అసహజ లైంగిక వాంఛలను తీర్చుకునేందుకు ఇష్టపడే వాడని తెలుస్తోంది. ఇందులో భాగంగా గుంతకల్లులోని ఒక పోలీసు కానిస్టేబుల్తో అసహజ లైంగిక సంబంధాలు నెరిపినట్టు సమాచారం. అంతేకాకుండా సదరు కానిస్టేబుల్ ఫొటోను ఏకంగా తిరుపతిలోని తన ఇంట్లో పెట్టుకున్నట్టు తెలుస్తోంది. సదరు కానిస్టేబుల్కు అవసరమైనవన్నీ ఈయనే సర్దుబాటు చేసేవారని కూడా విచారణలో తేలినట్టు సమాచారం. మరో కానిస్టేబుల్కు కూడా బైకు ఇవ్వడమే కాకుండా నిరంతరం అందుబాటులో ఉన్నట్టు తెలుస్తోంది. పోలీసులు స్వాధీనం చేసుకున్న ఇన్నోవా కారును కొద్ది మంది పోలీసులకు ప్రొటోకాల్ వాహనంగా కూడా వినియోగించారని.. ఇందులో భాగంగా వాహనంపై పోలీసు వెహికల్ బోర్డు కూడా పెట్టుకుని చక్కర్లు కొట్టినట్టు తేలింది. -
ఓనర్షిప్ సర్టిఫికెట్లు ఇస్తే కఠిన చర్యలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మున్సిపల్ కమిషనర్లు యాజమాన్య ధ్రువీకరణ పత్రాలు, వాల్యుయేషన్ సర్టిఫికెట్లు, ఇతర సర్టిఫికెట్లు మంజూరు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. కొందరు మున్సి పల్ కమిషనర్లు తెలంగాణ మున్సి పాలిటీ 1965, 2019 చట్టాలకు విరుద్ధంగా సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం మున్సిపల్ పాలన విభాగం డైరెక్టర్ టీకే శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశారు. -
మున్సిపాలిటీ పేరిట నకిలీ సర్టిఫికెట్లు
నల్లగొండ టూటౌన్ : నీలగిరి మున్సిపాలిటీని నకిలీ రశీదులు, నకిలీ సర్టిఫికెట్లు వెంటాడుతున్నాయి. గతంలో నకిలీ ఆస్తి పన్ను రశీదులు సృష్టించి కోట్ల రూపాయలను కొల్లగొట్టిన అవినీతి ఆనకొండలపై వేటు పడిన విషయం తెలిసిందే. ఆస్తి పన్ను కాజేసిన ఘటనపై అప్పట్లో 23 మంది మున్సిపల్ ఉద్యోగులు సస్పెన్షన్ అయి రెండేళ్ల పాటు విధులకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు మరోసారి నీలగిరి మున్సిపాలిటీ పేర నకిలీ సర్టిఫికెట్లు తయారు చేయడం వెనుక పెద్ద కథే నడిచినట్లు తెలుస్తోంది. విద్యార్థులకు నీతిని బోధించే ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం వారు నకిలీ సర్టిఫికెట్లు సృష్టించారా లేక మున్సిపాలిటీ కార్యాలయంలోని ఇంటి దొంగల హస్తం ఏమైనా ఉందా అనే అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. సంబంధిత పాఠశాల వారు అనుమతుల కోసం విద్యాశాఖకు సమర్పించే సర్టిఫికెట్లు నకిలీవా, ఒరిజినల్వా అని చూడకపోవడంతో నకిలీ సర్టిఫికెట్లు చలామని అవుతున్నట్లు తెలిసింది. నీలగిరి పట్టణంలోని మిర్యాలగూడ రోడ్డులో ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాల వారు మున్సిపాలిటీ నుంచి శానిటరీ సర్టిఫికెట్, నిరభ్యంతర సర్టిఫికెట్లు పొందలేదు. దాంతో మున్సిపాలిటీ పేరు మీద సంబం«ధిత ప్రైవేట్ పాఠశాలకు నిరభ్యంతర సర్టిఫికెట్, శానిటరీ సర్టిఫికెట్ ఇచ్చి పాఠశాల అనుమతి కోసం సమర్పించారు. రెండు రోజుల క్రితం అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు సంబంధిత పాఠశాలకు తాము ఎలాంటి సర్టిఫికెట్లు ఇవ్వలేదని మున్సిపల్ అధికారులు జిల్లా విద్యాశాఖ అధికారికి లేఖ రాశారు. మున్సిపల్ కార్యాల యం నుంచి పొందకుంగా సంబంధిత పాఠశాల యాజమాన్యం వారు విద్యాశాఖకు సమర్పించిన శానిటరీ సర్టిఫికెట్, నిరభ్యంతర సర్టి ఫికెట్ల ఎవరు సృష్టించారో తేలాల్సి ఉంది. వెయ్యి రూపాయల కోసం నకిలీవెందుకో...? ప్రైవేట్ పాఠశాలకు జిల్లా విద్యాశాఖ నుంచి అన్ని అనుమతులు రావాలంటే మున్సిపల్ కార్యాలయం నుంచి శానిటరీ సర్టిఫికెట్, నిరభ్యంతర సర్టిఫికెట్ తీసుకొని వారికి సమర్పించాలి. సంబంధిత పాఠశాల సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకుంటే మున్సిపల్ సిబ్బంది వెళ్లి పాఠశాలలో మౌలిక వసతులు, తాగు నీరు, మూత్రశాలలు, మరుగు దొడ్లు ఉండాలి. అదే విధంగా కాలనీలో నెలకొల్పిన పాఠశాలపై కాలనీవాసులు అభ్యంతరం తెలపకుండా ఉండాలి. దాని కోసమే నిరభ్యంతర సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ సర్టిఫికెట్లకు కేవలం ఒక్కో దానికి రూ. 1000 మాత్రమే చెల్లించాల్సి ఉంది. ఒక పాఠశాల స్థాపించే వారు వెయ్యి, రెండు వేలకు భయపడతారా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. నకిలీపై నజర్ ... మున్సిపాలిటీ పేరు మీద నకిలీ సర్టిఫికెట్లు వెలుగు చూడడంతో వీటిపై నిగ్గు తేల్చాల్చిన అవసరం ఉంది. ఈ నకిలీ బెడద కేవలం శానిటరీ సర్టిఫికెట్లు, నిరభ్యంతర సర్టిఫికెట్ల వరకే పరిమితం అయ్యాయా లేక ఇతర విభాగాలకు సంబంధించి కూడా ఏమైనా చలామణి అవుతున్నాయా అనే అనుమానాలు లేకపోలేదు. నకిలీ సర్టిఫికెట్లు, నకిలీ రశీదు పుస్తకాల వ్యవహారం మున్సిపాలిటీకి పెద్ద తలనొప్పిగా మారాయి. ఇలాంటి నకిలీ వ్యవహారాల వలన ఇటు మున్సిపాలిటీకి చెడ్డ పేరు రావడంతో పాటు పట్టణ ప్రజల్లోనూ అనేక అనుమానాలు రేకెత్తిస్తాయి. నకిలీ సర్టిఫికెట్లపై మున్సిపల్ అధికారులు నజర్ పెట్టి సూత్రదారులు, పాత్రదారులపై కఠిన చర్యలు తీసుకుంటేనే ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని స్థానికులు భావిస్తున్నారు. -
ఓ రిటైర్డ్ ఎస్ఐ దొంగ తెలివి
అమీర్పేట: నకిలీ పత్రాలు సృష్టించి తండ్రి సంతకాలను ఫోర్జరీ చేసి ఆస్తిని కాజేసిన ఓ రిటైర్డ్ ఎస్ఐతో పాటు బీఎస్ఎన్ఎల్ మాజీ ఉద్యోగిని ఎస్ఆర్నగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఎస్ఐ మహేందర్ తెలిపిన మేరకు.. అమీర్పేటకు చెందిన రిటైర్డ్ ఇన్స్పెక్టర్ పురంసింగ్కు నలుగురు కుమారులు. వీరిలో ముగ్గురు కుమారులైన రాజేందర్సింగ్, ఇందర్జీత్సింగ్, రజింత్సింగ్లు తండ్రికి తెలియకుండా అమీర్పేటలో 150 గజాలు, నాందేడ్లో మరో 180 గజాల స్థలాన్ని కాజేసేందుకు ప్రణాళిక రూపొందించారు. ఇందులో ఎస్ఐగా పనిచేసిన రాజేందర్సింగ్ కీలకంగా వ్యవహరించారు. 1982లో రద్దయిన బాండ్ పేపర్పై 1994లో తండ్రి పురంసింగ్ రాసి ఇచ్చినట్లు వీలునామ రాయించి సాక్షిగా బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో పనిచేసే సుర్జిత్సింగ్ను పెట్టిపై రెండు స్థలాలను కాజేశారు. తండ్రి సంపాదించిన ఆస్తి నలుగురికి సమానంగా రావాల్సి ఉండగా కేవలం నకిలీ నత్రాలు సృష్టించడమే కాకుండా సంతకాలు ఫోర్జరీ చేసి ముగ్గురే ఆస్తిని కాజేశారని గ్రహించిన పురంసింగ్ పెద్ద కుమారుడు జీవన్సింగ్ ఆధారాలు సేకరించి స్టాంపు పేపర్తో పాటు ఫోర్జరీ సంతకాలను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపగా నకిలీవని తేల్చారు. దీని ఆధారంగా నిందితులపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జీవన్సింగ్ కుమారుడు సర్ధార్ సురెందర్సింగ్ ఎస్ఆర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి వివరాలు సేకరించిన పోలీసులు వాటిని సిటీ సివిల్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. కేసు పూర్వపరాపాలను పరిశీలించిన న్యాయమూర్తి ప్రధాన నింధితుడు రాజేందర్సింగ్, సాక్షి సుర్జిత్సింగ్కు 14 రోజుల రిమాండ్ విధిస్తూ తీర్పు వెలువరించారు. తీర్పు అనంతరం వారిని శనివారం రిమాండ్కు తరళించామని ఎస్ఐ మహేందర్ తెలిపారు. -
సర్టిఫి‘కేటుగాళ్లు’
సాక్షి, అనంతపురం : ప్రభుత్వ కొలువు తెచ్చుకునేందుకు కొందరు అడ్డదారులు తొక్కారు. సచివాలయ పోస్టులకు సంబంధించి వార్డు వెల్ఫేర్ కార్యదర్శుల పోస్టులకు 21 మంది అభ్యర్థులు నిబంధనలకు విరుద్ధంగా సర్టిఫికెట్లను దాఖలు చేశారు. వాటిని నిశితంగా పరిశీలించాల్సిన వెరిఫికేషన్ అధికారులు అభ్యర్థులకే వత్తాసు పలికారు. అయితే అడ్డగోలు బాగోతం నగర పాలక సంస్థ కమిషనర్ పి.ప్రశాంతి దృష్టికి వెళ్లింది. దీంతో ఆమె ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన వెంటనే స్పందించారు. అడ్డదారిలో ఉద్యోగాలు పొందిన వారి నియామకాలను రద్దు చేయడంతో పాటు వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా ధ్రువీకరణ పత్రాల పరిశీలన సరిగా చేయని తాడిపత్రి, హిందూపురం, పామిడి, కళ్యాణదుర్గం, తదితర ప్రాంతాలకు చెందిన 15 మంది అధికారులపై చార్జెస్ ఫ్రేమ్ చేయాలని ఆదేశించారు. ఇదీ సంగతి సచివాలయ ఉద్యోగాల భర్తీలో భాగంగా వార్డు వెల్ఫేర్ కార్యదర్శుల అభ్యర్థులకు సెప్టెంబర్ 26న అంబేడ్కర్ భవన్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించారు. అందులో 21 మంది అభ్యర్థులు బీఎస్సీ, బీకాం, ఎంఏ కోర్సులతో దరఖాస్తు చేసుకున్న వారు ఉన్నారు. వాస్తవానికి వార్డు వెల్ఫేర్ కార్యదర్శుల పోస్టులకు బీఏ ఆర్ట్స్, హ్యుమానిటీస్ చేసిన వారు అర్హులు. కానీ బీఎస్సీ, బీకాం, బీజెడ్సీ చేసిన వారు దరఖాస్తు చేసుకుని ఉద్యోగాలకు ఎంపికై సర్టిఫికెట్లను సైతం అందజేశారు. వాటిని పరిశీలించిన అధికారులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. నియామకపత్రాలు కూడా అందుకున్నారు. వెలుగులోకి ఇలా అయితే ఉద్యోగాలు దక్కించుకోలేని కొందరు అభ్యర్థులు రెండ్రోజుల క్రితం కమిషనర్ పి.ప్రశాంతికి ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా పోస్టులు మంజూరు చేశారని, తాము ఆ కోర్సు చేసినా ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదని కమిషనర్ను ప్రశ్నించారు. దీంతో కమిషనర్ ప్రశాంతి.. ఉద్యోగాలు దక్కించుకున్న వారి సర్టిఫికెట్లను మరోసారి పరిశీలించాలని నగరపాలక సంస్థ సిబ్బందిని శుక్రవారం ఆదేశించారు. దీంతో అసలు విషయం బయటపడింది. కమిషనర్ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన 21 మంది నియామకాలు రద్దు చేశారు. 21 మంది అనర్హులు వీరే ఆర్ నటరాజ్ (191215002079), పి.రాజశేఖర(191215002308), ఎకిల గిరిప్రసాద్(191215002759), కేవీ అమర్నాథ్ (191215003206), కె.కృష్ణవేణి(191215003394), గూడూరు వెంకటేశు(191215002877), ఎన్పీ వెంకటనారాయణ (191215002029) బి.శ్రీదేవి(191215003446), గోరువ సుమలత(191215002050), సారే శంకర్(191215001262), వడ్డే రామకృష్ణ (191215000049), బి.మంజుల(191215002247), జె.ఓబుళమ్మ(191215001644), ఏ.శైలజ (191215001327), బి.సునీత(191215002389), ఎస్.రఘు (191215002335), ఎం.ఆదినారాయణ(191015002877), కె.లోకేష్నాయక్(191215000476), బి.ప్రియాంక(191215001345), ఎం.నాగజ్యోతి(191215002143), ఎం. అనిల్కుమార్ (191215003684). -
అమ్మకానికి సర్టిఫికెట్లు
సాక్షి, చెన్నై: పరీక్షలకు హాజరు కాకుండానే, దూరవిద్య కోర్సుల్ని అభ్యసించిన వేలాది మంది విద్యార్థులకు పాస్ సర్టిఫికెట్లు మంజూరు చేసిన మదురై కామరాజ్ వర్సిటీ దూర విద్యా విభాగం అధికారుల గుట్టురట్టు అయింది. సర్టిఫికెట్లను ఈ అధికారులు అమ్ముకున్నట్టు నిర్ధారణ కావడంతో ముగ్గుర్ని సస్పెండ్ చేస్తూ మంగళవారం ఆ వర్సిటీ పాలకమండలి నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ పరిధిలో ఉన్న అన్నావర్సిటీలో రీవాల్యుయేషన్లో మార్కుల మాయాజాలం ఇది వరకు వెలుగులోకి వచ్చి పెద్ద కలకలాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో మదురైకామరాజ్వర్సిటీలో సర్టిఫికెట్ల స్కాం వెలుగులోకి రావడం మరో చర్చకు దారి తీసింది. ఏసీబీకి అందిన సమాచారం మేరకు అధికార వర్గాలు కామరాజర్ వర్సిటీపై నిఘా వేశాయి. ఇందులో ఆ వర్సిటీ దూరవిద్యా విభాగంలో నోట్లు ఉంటే చాలు సర్టిఫికెట్లు చేతికి వచ్చినట్టే అన్నట్టుగా పరిస్థితి ఉండడాన్ని గుర్తించి ఉన్నారు. దూరవిద్యా విభాగం ద్వారా ఏకంగా వేలాది మంది మంది విద్యార్థులు సర్టిఫికెట్లను పొంది ఉన్నట్టుగా విచారణలో తేలింది. ఒక్కో విద్యార్థి నుంచి రూ.లక్షల మేరకు వసూళ్లు చేసి సర్టిఫికెట్లను అమ్మకానికి పెట్టి ఉండడం తేట తెల్లమైంది. ముగ్గురు సస్పెన్షన్..విద్యార్థులపై గురి తమకు అందిన సమాచారం మేరకు ఓ వైపు ఏసీబీ విచారణను ముమ్మరం చేసింది. మరో వైపు ఆ వర్సిటీ పాలక మండలి రిటైర్డ్ న్యాయమూర్తి అక్బర్ అలీ నేతృత్వంలోని బృందం ద్వారా విచారణ చేపట్టింది. 2014 నుంచి దూర విద్యా విభాగంలో సాగిన వ్యవహారాలపై అక్బర్ అలీ బృందం దృష్టి పెట్టింది. అదే సమయంలో అక్రమాలు జరిగినట్టు, సర్టిఫికెట్లను అమ్ముకున్నట్టుగా ఏసీబీ తేల్చడంతో ఆ వర్సిటీ వర్గాల్లో కలవరం బయలుదేరింది. దూర విద్యా విభాగం అసిస్టెంట్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ రాజరాజన్, పర్యవేక్షణాధికారి సత్యమూర్తి, మరో అధికారి కార్తిక్సెల్వన్లను విచారించేందుకు ఏసీబీ సిద్ధమైంది. ఈ ముగ్గుర్ని ఏసీబీ తమ అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. ఈ పరిస్థితుల్లో అక్బర్ అలీ బృందం విచారణలో ఇప్పటివరకు అనేక అక్రమాలు వెలుగులోకి వచ్చినట్టు పాలక మండలి దృష్టికి చేరింది. విద్యార్థులు పరీక్షలు రాయకుండానే, సర్టిఫికెట్లను పొంది ఉన్నట్టు తేల్చారు. ఐదు వేల మందికి పైగా విద్యార్థులకు సర్టిఫికెట్లను అమ్మకున్నట్టు విచారణలో వెలుగు చూసింది. దీంతో ఏసీబీ విచారణకు మరింత మార్గాన్ని చూపించే రీతిలో ఆ వర్సిటీ పాలకమండలి నిర్ణయం తీసుకుంది. తమ విచారణలో వెలుగుచూసిన అంశాల ఆధారంగా రాజరాజన్, సత్యమూర్తి, కార్తిక్ సెల్వన్లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. దీంతో ఆ ముగ్గుర్ని తమ అదుపులోకి తీసుకుని, సర్టిఫికెట్ల అమ్మకాల వ్యవహారంలో ఉన్న మరికొంత మంది అదృశ్య శక్తులు, వాటిని కొనుగోలు చేసిన విద్యార్థుల భరతం పట్టే దిశగా ఏసీబీ దూకుడు పెంచేందుకు సిద్ధం అవుతోంది. -
కేయూలో నకిలీ కలకలం
సాక్షి, కేయూ : కాకతీయ యూనివర్సిటీలో ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లు రెండేళ్ల క్రితం సమర్పించిన టైప్రైటింగ్ సర్టిఫికెట్లు నకిలీవని తేలింది. ఈమేరకు యూనివర్సిటీ అధికారులు ఇటీవల హైదరాబాద్లోని స్టేట్ టెక్నికల్ బోర్డుకు సర్టిఫికెట్లను పంపించగా అక్కడి అధికారులు తాము జారీ చేసినవి కావని తేల్చిచెప్పారు. దీంతో ఆ ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లకు నోటీసులు ఇవ్వగా సమాధానం వచ్చినా చర్యలు తీసుకోకుండా తాత్సారం చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది. కారుణ్య నియామకాలు కింద... కాకతీయ యూనివర్సిటీలో కొన్నేళ్ల క్రితం ఇద్దరు కారుణ్య నియామకాల కింద టైపిస్టు కమ్ క్లర్క్లుగా నియమితులయ్యారు. ఆ సమయంలో వారి వద్ద టైప్రైటింగ్ ఉత్తీర్ణత పొందినట్లుగా సర్టిఫికెట్లు లేకపోయినప్పటికీ ఏడాదిలోగా ఉత్తీర్ణత సాధించాలనే నిబంధనతో పోస్టింగ్ ఇచ్చారు. అయితే, వారు గడువులోగా ఉత్తీర్ణత పొందకపోవడంతో ఇంక్రిమెంట్లో కోత విధించారు. ఆ తర్వాత స్టేట్ టెక్నికల్ బోర్డు ఇచ్చినట్లుగా చెబుతూ నకిలీ సర్టిఫికెట్లను సమర్పించారు. అయితే, వాటినిసరిగ్గా పరిశీలించకుండానే టైపిస్టు కమ్ క్లర్క్లుగా కొనసాగిస్తూ బెనిఫిట్స్ ఇచ్చారు. 2017లో పదోన్నతుల సందర్భంగా వీరిద్దరికి సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించగా ఒకరు క్యాంపస్లోని పరీక్షల విభాగంలో, మరొకరు కొత్తగూడెం ఇంజనీరింగ్ కళాశాలలో విధులు నిర్వర్తిస్తున్నారు. నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చారంటూ ఫిర్యాదు కాకతీయ యూనివర్సిటీలో వివిధ కేడర్లలో కారుణ్య నియామకాల సందర్భంగా, పదోన్నతుల పొందిన వారు నకిలీ సర్టిఫికెట్లు సమర్పించాలని ఉద్యోగ సంఘాల బాధ్యులు కొంతకాలం క్రితం అప్పటి వీసీ ఆచార్య సాయన్నకు ఫిర్యాదు చేశారు. తొలుత స్పందించకున్నా వీసీగా పదవీకాలం ముగియబోతున్న సమయంలో 12 మంది ఉద్యోగుల ఎస్సెస్సీ, ఇంటర్, డిగ్రీతో పాటు టైప్ రైటింగ్ కోర్సుల సర్టిఫికెట్లను పరిశీలన కోసం హైదరాబాద్కు పంపించారు. అయితే, ఇద్దరు సీనియర్ అసిస్టెంట్ల సర్టిఫికెట్లు నకిలీవనీ తేల్చారు. అయితే, ఇతర కేడర్లలోని మరో 12 మంది సర్టిఫికెట్లను కూడా పరిశీలనకు పంపించగా నివేదిక రావాల్సి ఉందని.. అందులోనూ ఇద్దరు, ముగ్గురు తప్పుడు సర్టిఫికెట్లు సమర్పించారనే ప్రచారం సాగుతోంది. కాగా, నకిలీ సర్టిఫికెట్లు సమర్పించినట్లు తేలిన ఇద్దరికి కేయూ రిజిస్ట్రార్ ఆచార్య పురుషోత్తం నోటీసులు జారీచేశారు. ఆ నోటీసులకు వారు సమాధానం కూడా ఇచ్చారని సమాచారం. అయితే, సర్టిఫికెట్లు నకిలీవని తేలాక కూడా తేలాక నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకోవడం.. ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ముందే పరిశీలిస్తే... యూనివర్సిటీలో వివిధ కేడర్లలో ఉద్యోగాలు పొందినప్పుడు, పదోన్నతులు ఇచ్చినప్పుడే సర్టిఫికెట్లను పరిశీలించాల్సి ఉంటుంది. కానీ అలా చేయకపోవడంతో కొన్నేళ్ల తర్వాత నకిలీ బయటపడుతోంది. అప్పటికే ఆయా ఉద్యోగులు పదోన్నతులు, ఇంక్రిమెంట్ తీసుకుని ఉంటున్నారు. ఎట్టకేలకు కొన్నినెలల క్రితం అప్పటి వీసీ సాయన్న స్పందించినా.. మిగతా వీసీల హయాంలో జరిగిన పదోన్నతులు, నియామకాలను పట్టించుకోకుండా తన హయాంలో జరిగినవే పరిశీలనకు పంపించారు. అలా కాకుండా యూనివర్సిటీలో గత కొన్నేళ్లుగా పదోన్నతులు పొందిన, నియమాకమైన ఉద్యోగుల విద్యార్హతల సర్టిఫికెట్లను పరిశీలనకు పంపించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. -
నకిలీ సర్టిఫికెట్ల గుట్టురట్టు
సాక్షి, సిటీబ్యూరో: నకిలీ సర్టిఫికెట్లు ముద్రిస్తున్న సూత్రధారితో పాటు వాటిని కొనుగోలు చేసిన మరో ఐదుగురిని నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. టాస్క్ఫోర్స్ డీసీపీ రాధాకిషన్రావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మీర్పేట్, ఆర్ఎన్రెడ్డినగర్కు చెందిన హస్మతుల్హా ఓపెన్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాడు. అనంతరం తమ బంధువులకు చెందిన సాదన్ ఒకేషనల్ జూనియర్ కాలేజీలో కొన్నాళ్లు ఫ్యాకల్టీగా పనిచేశాడు. ఈ నేపథ్యంలో ఒకేషనల్ కాలేజీ నిర్వహణపై పట్టు సాధించిన అతను వివిధ రాష్ట్రాల నుంచి దూరవిద్యా కోర్సులను అందిస్తున్న పలు వర్సిటీల సిబ్బందితో పరిచయాలు పెంచుకున్నాడు. దీంతో 2009 నుంచి 2014 వరకు హిమాయత్నగర్లో స్కోప్ పేరుతో ఒకేషనల్ జూనియర్ కాలేజీని నిర్వహించాడు. అనంతరం చార్మినార్ ప్రాంతంలో చార్మినార్ కాలేజీ పేరుతో దూరవిద్యా కేంద్రాన్ని ఏర్పాటు చేసిన అతను అమాయకులు, విద్యార్హత సర్టిఫికెట్లు అవసరమున్న వారిని తమ కాలేజీలో చేర్పించుకొని, వారికి వివిధ యూనివర్శిటీలకు చెందిన నకిలీ సర్టిఫికెట్లను అందిస్తూ రూ.లక్షలు వసూలు చేస్తున్నాడు. ఇందుకు బెంగుళూరు యూనివర్సిటీ, ఢిల్లీలోని కళింగ యూనివర్సిటీ, రాజస్థాన్లోని నిమ్స్ యూనివర్సిటీకి సంబంధించి నకిలీ సర్టిఫికెట్లను తయారుచేసి సరఫరా చేసేందుకు ఐజాజ్, సందీప్ అనే వ్యక్తులను ఏజెంట్లను నియమించుకున్నాడు. సర్టిఫికెట్ల కోసం తన వద్దకు వచ్చిన వారి డాటాను సేకరించి వారి పేర్లను ఐజాజ్, సందీప్లకు పంపించేవారు. వారు ఆయా యూనివర్సిటీల నకిలీ సర్టిఫికెట్లను ముద్రించి కొరియర్ ద్వారా హైదరాబాద్కు పంపేవారు. బీకాం, ఎంకామ్, ఎం,ఏ, బీటెక్, బీబీఏ, బీఎస్సీ, ఇంజినీరింగ్, డిప్లామా సర్టిఫికెట్లకు రూ. 30 వేల నుంచి రూ. 1.5 లక్షల వరకు వసూలు చేసేవాడు. ఇతనిపై గుల్బార్గ, హైదరాబాద్లోని మొగల్పురా ఠాణాలో రెండు కేసులు నమోదయ్యాయి. శుక్రవారం చార్మినార్ కాలేజీలో సయ్యద్ అద్నాన్ అరీఫ్, అబ్దుల్హా సలీం, మన్సురాబాద్కు చెందిన సందీప్, మహ్మద్ షా అక్రమ అలీ, మహ్మద్ కలీముద్దీన్లకు నకిలీ సర్టిఫికెట్లు అందజేస్తున్నట్లు సమాచారం అందడంతో నార్త్జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్రావు నేతృత్వంలో దాడులు నిర్వహించిన పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. ఈ సందర్బంగా చత్తీస్ఘడ్ కళింగ యూనివర్సిటీ పేరుతో ఉన్న 45, బెంగుళూరు యూనివర్సిటీకి చెందిన 30, నిమ్స్ యూనివర్సిటీ పేరుతో ఉన్న 5 నకిలీ సర్టిఫికెట్లు, చార్మినార్ కాలేజీ కరపత్రాలు, పలువురు విద్యార్థుల బయోడెటాలు, రబ్బర్ స్టాంప్లు, కంప్యూటర్, స్కానర్ తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను తదుపరి చర్యల నిమిత్తం మొగల్పురా పోలీసులకు అప్పగించారు. -
క్రికెటర్ రసిక్ సలామ్పై రెండేళ్ల సస్పెన్షన్
న్యూఢిల్లీ: నకిలీ జనన ధ్రువీకరణ పత్రం సమర్పించినందుకు జమ్మూ కశ్మీర్ యువ పేసర్ రసిక్ సలామ్ను బీసీసీఐ రెండేళ్ల పాటు సస్పెండ్ చేసింది. వచ్చే నెలలో ఇంగ్లండ్లో పర్యటించనున్న జాతీయ అండర్–19 జట్టు నుంచి సైతం తప్పించింది. అతడి స్థానంలో బెంగా ల్కు చెందిన ప్రభాత్ మౌర్యను ఎంపిక చేసింది. రసిక్... ఐపీఎల్–12 సీజన్లో ముంబై ఇండియన్స్కు ఒక మ్యాచ్లో ప్రాతినిధ్యం వహించాడు. ప్రతిభావంతుడైన బౌలర్గా పేరు తెచ్చుకున్న అతడు అనవసర వివాదంతో కెరీర్కు చేటు తెచ్చుకున్నాడు. -
తప్పంతా సిబ్బందిదేనట!
నిజామాబాద్అర్బన్: ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో నకిలీ ఉద్యోగుల వ్యవహారంపై చేపట్టిన దర్యాప్తు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాష్ట్ర వ్యాప్తం గా సంచలనం సృష్టించిన ఈ ఘటనలో ఉన్నతాధికారుల విచారణ కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఉంది. అసలు సూత్రదారులను వదిలే సి, తప్పంతా కింది స్థాయి సిబ్బందిదేనని అధికారులు తేల్చడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటనలో ఆయా, సూపర్వైజర్లపై వేటు వేసిన ఉన్నతాధికారులు.. ఇద్దరు స్టాఫ్నర్సులకు మెమోలు జారీ చేసి చేతులు దులుపుకోవడం గమనార్హం. సాక్షాత్తూ డీఎంఈ రమేశ్రెడ్డి విచారణ జరిపినా అసలు నిందితులు బయటకు రాకపోవడమేమిటో అంతు చిక్కడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం.. జిల్లా ఆస్పత్రిలో రెండు నెలల పాటు ఎలాంటి అనుమతి లేకుండా 17 మంది ఉద్యోగులుగా కొనసాగుతూ వైద్యం చేసిన ఘటన బయటకు రావడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఏకంగా జిల్లా ఆస్పత్రిలో నకిలీ ఉద్యోగులు తిష్ట వేసి, ఏకంగా అత్యవసర విభాగంలోనూ వైద్యచికిత్సలు అందించడం అప్పట్లో కలకలం రేపింది. ఆస్పత్రిలోని 328వ గదిలో అక్రమార్కులు తమ దందా కొనసాగించడం, బాధితుల నుంచి డబ్బులు వసూలు చేయడం, ఈ గదిలోనే నకిలీ ఉద్యోగులకు విధులు కేటాయించడం చేశారు. దాదాపు రెండు నెలలు ఉద్యోగుల పేరిట ప్రైవేట్ వ్యక్తులు ఆస్పత్రిలో ఇంజక్షన్లు, ఇతరత్రా చికిత్సలు అందించడం చేశారు. అయితే, అత్యవసర విభాగంలో ఓ రోగికి యువకుడు సూది మందు ఇచ్చే విధానంలో తేడా కనిపించడాన్ని గమనించిన ఆస్పత్రి సూపరింటెండెంట్ రాములు ఆ యువకుడ్ని వారించాడు. అసలు నువ్వు ఎవరని ఇంజక్షన్ ఇస్తున్న యువకుడ్ని సూపరింటెండెంట్ గట్టిగా నిలదీస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తాను కొత్తగా రిక్రూట్ అయినట్లు సదరు వ్యక్తి చెప్పడంతో అవాక్కయిన రాములు అసలు విషయం ఆరా తీయగా నకిలీ ఉద్యోగుల యవ్వారం బయట పడింది. మొత్తం 17 మంది నకిలీ ఉద్యోగులు ఆస్పత్రిలోని వివిధ విభాగాల్లో పని చేస్తున్నట్లు తేలింది. ఈ విషయం అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది డీఎంఈ విచారించినా.. ఈ వ్యవహారంపై కలెక్టర్తో పాటు ప్రభుత్వం కూడా తీవ్రంగా స్పందించింది. వైద్య విద్య సంచాలకుడు (డీఎంఈ) రమేశ్రెడ్డి ఆస్పత్రికి స్వయంగా విచారణ జరిపారు. మాక్లూర్ మండలానికి చెందిన ఓ యువకుడు.. జిల్లా ఆస్పత్రిలో కొలువుల పేరిట కొంత మంది యువతీయువకుల నుంచి డబ్బులు వసూలు చేసి, వారిని ఆస్పత్రిలో ఉంచి పని చేయించినట్లు తేలింది. బాధితులతో పాటు నిందితుడ్ని విచారించిన డీఎంఈ.. ఆస్పత్రి అధికారులపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రైవేట్ వ్యక్తులు ఆస్పత్రిలో నేరుగా వైద్యసేవలు అందించడం, శిక్షణ పేరిట కొనసాగడంపై ఎందుకు పసిగట్టలేకపోయారని గట్టిగా క్లాస్ తీసుకున్నారు. దీంతో ఆస్పత్రిలోని కీలక అధికారులపై చర్యలు తప్పవని అంతా భావించారు. ఏం జరిగిందో ఏమో కానీ, తప్పంతా చిరుద్యోగులేనని ఉన్నతాధికారులు వారిపై కొరడా ఝళింపించారు. ఆయా, సూపర్వైజర్ను విధుల నుంచి తొలగించారు. అలాగే, అత్యవసర విభాగం, ఓపీ విభాగం వద్ద విధులు నిర్వర్తించే స్టాఫ్నర్సులకు మెమోలు జారీ చేసి, అధికారులు చేతులు దులుపుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముందుకు సాగని కేసు నకిలీ ఉద్యోగుల వ్యవహారంలో బాధితులు ఒకటో టౌన్లో ఫిర్యాదు చేశారు. మాక్లూర్ మండలం గుత్పకు చెందిన సతీష్ ఉద్యోగాల పేరిట డబ్బుల తీసుకుని తమను జిల్లా ఆస్పత్రిలో చేర్పించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సతీష్ను ప్రశ్నించిన అధికారులు.. మోపాల్ మండలం కాల్పోల్కు చెందిన గోపాల్ పేరును వెల్లడించాడు. ఈ వ్యవహారంపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. నెల రోజులు గడిచినా కేసు విచారణ కొలిక్కి తేలేక పోయారు. అసలు సూత్రదారులను వెలికి తీయడంలో జాప్యం జరుగుతుండడంపై బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తాము మోసపోయమని, తమకు న్యాయం చేసి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇద్దరిని తొలగించాం.. నకిలీ ఉద్యోగుల వ్యవహారంలో ఒక ఆయాతో పాటు సంబంధిత ఫ్లోర్ సూపర్వైజర్ను తొలగించాం. ఇద్దరు స్టాఫ్నర్సులకు మెమోలు జారీ చేశాం. ఆస్పత్రి నిర్వహణలో కఠినంగా వ్యవహరిస్తున్నాం. ఇలాంటి ఘటనలు జరుగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. – డా.రాములు, ఆస్పత్రి సూపరింటెండెంట్ -
ఉచితశిక్షణ పేరిట మోసం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఉచిత కుట్టు శిక్షణ పేరుతో అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి ఘరాన మోసానికి పాల్పడ్డాడు. రెండునెలల శిక్షణ పేరుతో మహిళల నుంచి రూ.1550 చొప్పున వసూలు చేశాడు. అనంతరం నకిలీ సర్టి ఫికెట్లు అంటగడుతున్నట్లు బయటపడడంతో బాధితులు ఆదివారం లబోదిబోమన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని మాలసంక్షేమ సంఘంలో మూడు నెలలక్రితం టీఆర్ఎస్ అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి, మాల మహిళా సంఘం అధ్యక్షురాలు బెల్లం శ్రీలతతో కుట్టుశిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రారంభ దశలో ప్రభుత్వ గుర్తింపు పొందిన కుట్టు సర్టిఫికెట్తో పాటు ఉచితంగా కుట్టుశిక్షణ రెండు నెలలపాటు ఇచ్చి కుట్టుమిషన్ను ప్రభుత్వం ద్వారా అందిస్తామని మాయమాటలు చెప్పాడు. ఇది నమ్మిన 550 మంది మహిళలు రెండు నెలల నుంచి కుట్టు శిక్షణ పొందారు. కొంతమంది హాజరు కాలేదు. కుట్టు శిక్షణ నేర్చుకున్నవారు తమకు కుట్టుమిషన్ ఇప్పించాలని కోరారు. దీంతో అసలు విషయం బయటపడింది. 550 మంది వద్ద రూ.1550 చొప్పున రూ.8.60 లక్షలు వసూలు చేసి, మాల మహిళా సంఘం పేరుతో ఉన్న సర్టిఫికెట్లు జారీ చేశారు. అనుమానం వచ్చిన మహిళలు దీనిపై నిలదీశారు. బెల్లం శ్రీలత సర్టిఫికెట్ల విషయంతో మాట మార్చగా ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై ప్రవీణ్కుమార్ ఆధ్వర్యంలో రంగప్రవేశంచేసి శ్రీలతతో పాటు అందుకు కారకులైన వారిని అందుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్, గంభీరావుపేట మండలంలో కూడా అనేక మంది దీంట్లో మోసపోయారని తేలింది. సీఐ రవీందర్ ఆధ్వర్యంలో పోలీసులు ఈ సంఘటనపై విచారణ చేస్తున్నారు. బాధ్యులపై కేసునమోదు చేసి తగు చర్యలు తీసుకుంటామని ఎస్సై ప్రవీణ్కుమార్ తెలిపారు. -
కౌలు రైతుల పేరిట నకిలీ పత్రాలు
-
‘పాకిస్థానీ కేసు’లో ముంబైవాసి అరెస్టు
సాక్షి, సిటీబ్యూరో: ‘ఆమె’ కోసం అక్రమంగా భారత్లోకి ప్రవేశించి... సైబర్ నేరంలో సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు పట్టుబడిన పాకిస్థాన్ జాతీయుడు మహ్మద్ ఉస్మాన్ ఇక్రమ్ కేసులో మరో నిందితుడు చిక్కాడు. ఇతడు వినియోగించిన నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసిన ముంబై వాసి రాజ్ ముల్లీని శుక్రవారం అరెస్టు చేశారు. బోగస్ ధ్రువీకరణలు తయారు చేయడమే వృత్తిగా ఉన్న రాజ్ ఇప్పటికే అనేక మందికి వీటిని విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. నగరంలోని పాతబస్తీకి చెందిన ఓ మహిళ కొన్నేళ్ల క్రితం భర్తను కోల్పోయింది. సదరు మహిళకు ఇద్దరు కుమార్తెలు. పదేళ్ల క్రితం ఆమె బతుకుతెరువు కోసం దుబాయ్ వెళ్లగా అక్కడ ఆమెకు పాకిస్థానీ మహ్మద్ ఉస్మాన్ ఇక్రమ్ అలియాస్ మహ్మద్ అబ్బాస్ ఇక్రమ్తో పరిచయం ఏర్పడింది. తానూ భారతీయుడినేనని, స్వస్థలం ఢిల్లీ గా చెప్పుకున్న అతగాడు ఆమెను వివాహం చేసుకున్నాడు. కొన్నాళ్లకు అసలు విషయం తెలిసిన ఆమె హైదరాబాద్ తిరిగి వచ్చేసింది. దీంతో 2011లో ఉస్మాన్ సైతం హైదరాబాద్కు చేరుకున్నాడు. అప్పట్లో తాను ఆరు నెలల విజిట్ వీసాపై వచ్చినట్లు చెప్పాడు. అయితే వాస్తవానికి దుబాయ్ నుంచి నేపాల్ వరకు విమానంలో వచ్చిన అతను అక్కడి నుంచి రోడ్డు, రైలు మార్గాల్లో ఢిల్లీ వెళ్లి అట్నుంచి హైదరాబాద్ చేరుకున్నాడు. ఆరు నెలల తర్వాత ఈ విషయం తెలుసుకున్న మహిళ అతడిని దూరంగా ఉంచింది. దీంతో కక్షకట్టిన అతను ఆమె 12 ఏళ్ల కుమార్తె నగ్న చిత్రాలు తీయడంతో పాటు వాటిని ఆన్లైన్లో విక్రయించానంటూ ఆమెను బెదిరించాడు. తనకు డబ్బు ఇవ్వకపోతే సదరు ఫొటోలను బయటపెడతానంటూ బాధిత మహిళ స్నేహితురాలికీ వాట్సాప్ సందేశం పంపాడు. అతడి వేధింపులు తాళలేక బాధితురాలు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేసింది. ఈ ఏడాది జూన్ నెలలో నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. విచారణ నేపథ్యంలో అబ్బాస్ పేరుతో అనేక బోగస్ ధ్రువీకరణలు పొందిన ఉస్మాన్ పాస్పోర్ట్ సైతం తీసుకున్నట్లు వెల్లడైంది. సర్టిఫికెట్ల ఆధారంగా కొన్ని ప్రైవేట్ ఉద్యోగాలు చేసినట్లు గుర్తించారు. ఇతను మహారాష్ట్రలోని ఓ ప్రైవేట్ విద్యా సంస్థలో టెన్త్ నుంచి డిగ్రీ చదివినట్లు ఉన్న సర్టిఫికెట్లతో పాటు అబ్బాస్ పేరుతో గోల్నాక చిరునామాతో 2012లో తీసుకున్న భారత పాస్పోర్ట్, ఆధార్ సహా ఇతర గుర్తింపుకార్డులతో పాటు పాక్ పాస్పోర్ట్నకు చెందినదిగా అనుమానిస్తున్న ఓ పేజీ జిరాక్సు ప్రతిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇతడి వద్ద ఉన్న సర్టిఫికెట్ల ప్రకారం 2003లో టెన్త్, 2003–05లో ఇంటర్, 2005–08లో డిగ్రీ పూర్తి చేసినట్లు ఉంది. వీటిని ఇక్రమ్ నిజామాబాద్కు చెందిన వారి నుంచి ఖరీదు చేసినట్లు తేలడంతో వారినీ పట్టుకున్నారు. ఈ నిందితుల విచారణలోనే ఈ నకిలీ ధ్రువీకరణ పత్రాలను ముంబైకి చెందిన రాజ్ సరఫరా చేస్తున్నట్లు వెల్లడైంది. దీంతో అప్పటి నుంచి రాజ్ కోసం గాలిస్తున్న సిటీ సైబర్క్రైమ్ పోలీసులు ఎట్టకేలకు పట్టుకోగలిగారు. బోగస్ సర్టిఫికెట్లను తానే తయారు చేస్తానని, దేశ వ్యాప్తంగా ఉన్న ఏజెంట్ల ‘ఆర్డర్ల’ మేరకు విక్రయిస్తానంటూ రాజ్ పేర్కొన్నాడు. -
వీడియో డ్రీమ్ తీరకుండానే...
సాక్షి, సిటీబ్యూరో: అన్ని అర్హతలు ఉన్న ఓ యువకుడు విదేశాల్లో ఉద్యోగం కోసం ఓ కన్సల్టెన్సీని ఆశ్రయించి, వారు ఆశించిన మొత్తం అందించి, అసలుది అనుకుని నకిలీ వీసా తీసుకుని... మోసపోతే అతడు బాధితుడు అవుతాడు. అర్హతలు లేని ఓ విద్యార్థి స్టడీ వీసా కోసం కన్సల్టెన్సీని సంప్రదించి, వారు డిమాండ్ చేసిన మొత్తం ఇవ్వడం ద్వారా నకిలీ సర్టిఫికెట్లు పొంది, వీటిని దాఖలు చేయడం ద్వారా విదేశాలకు వెళితే... కచ్చితంగా నిందితుడే. సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం పట్టుకున్న మూడు కన్సల్టెన్సీల నిర్వాహకుల నుంచి సర్టిఫికెట్లు కొన్న వారు రెండో కోవకే చెందుతారు. అయినప్పటికీ వీరిని బాధితులుగా భావించాలా? నిందితులుగా చేర్చాలా? అనే అంశంపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ అంశంపై స్పష్టత కోసం న్యాయ నిపుణుల సలహా తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఆయా కన్సల్టెన్సీలకు నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి ఇచ్చిన వ్యక్తికి ‘ట్రావెల్ వీడియో’ డ్రీమ్గా ఉంది. దానికి సన్నాహాలు చేస్తుండగానే గుట్టురట్టు కావడంతో జైలుకు వెళ్లాడు. ఆ మూడు ఆరోపణలపై... నగరంలోని బేగంపేట, ఎస్సార్నగర్ ప్రాంతాల్లో జస్ట్ వీసా కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్, ఇండో–యూరోపియన్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్, రైజర్స్ ఆర్గనైజేషన్ కన్సల్టెన్సీలు దాదాపు నాలుగున్నరేళ్లుగా నకిలీ సర్టిఫికెట్లు తయారు చేయించి విక్రయిస్తున్నాయి. ఈ కాలంలో దాదాపు 650 మంది విద్యార్థులు, విదేశాలకు వెళ్లాలని భావించిన వారు వీటిని సంప్రదించి రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు వెచ్చించి సర్టిఫికెట్లు కొనుగోలు చేశారు. వీటినే ఆయా కాన్సులేట్స్, ఎంబస్సీల్లో దాఖలు చేయడం ద్వారా స్టడీ వీసాలు పొందిన వారు 250 మంది వరకు ఉన్నారు. వీరు తమకు తెలిసే నకిలీ సర్టిఫికెట్లు ఖరీదు చేసి వాటి ఆధారంగానే వీసాలు పొందారు. ఈ పనులన్నీ వారికి తెలిసే చేసిన నేపథ్యంలో మోసం చేయడం, ఫోర్జరీ, నకిలీ పత్రాలను అసలువిగా చూపించడం వంటి ఆరోపణల కింద వీరు నేరం చేసినట్లే. ఇందుకుగాను సర్టిఫికెట్లు ఖరీదు చేసిన వారందరినీ నిందితులుగా చేర్చే అవకాశం ఉందని కొందరు అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం విదేశాలకు వెళ్లిన 250 మందినీ ఈ ఆరోపణలపై వెనక్కు రప్పించే ఆస్కారం ఉందని తెలిపారు. ‘కస్టమర్లు’గా వచ్చి ఏజెంట్లుగా మారి... ఈ కన్సల్టెన్సీల వద్దకు ఓసారి కస్టమర్గా వచ్చి సర్టిఫికెట్లు ఖరీదు చేసుకున్న వారే కొన్ని రోజులకే వారికి ఏజెంట్లుగా మారిపోతున్నారు. సంగారెడ్డి జిల్లా బొంతుపల్లికి చెందిన అఖిల్ మంథి గతంలో వీరి నుంచే ధ్రువీకరణ పత్రాలు ఖరీదు చేసి విదేశాల్లో ఎంఎస్ చేసి వచ్చాడు. తిరిగి వచ్చిన తర్వాత పలువురు స్టడీ వీసా పొందటంపై ఇతడి సలహాలు కోరారు. వారందరికీ ఆ మూడు కన్సల్టెన్సీలకు ‘మార్గదర్శకుడి’గా మారిపోయిన అఖిల్ ఏజెంట్గా వ్యవహరించాడు. ఒక్కో విద్యార్థిని కన్సల్టెన్సీకి తీసుకువచ్చినందుకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు నిర్వాహకుల నుంచి కమీషన్గా తీసుకునేవాడు. ఇలానే మరికొందరూ ఈ కన్సల్టెన్సీలకు ఏజెంట్లగా మారిపోయి ‘వ్యాపారాభివృద్ధి’కి సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ గ్యాంగ్ విక్రయించే సర్టిఫికెట్స్లో టెన్త్ నుంచి పీజీ వరకు... డిగ్రీ నుంచి మెడిసిన్ వరకు వివిధ రకాలైన కోర్సులకు చెందినవి, 19 విద్యా సంస్థలు, యూనివర్శిటీలవి ఉంటున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థల పేర్లనూ వీరు ‘వాడేశారు’. ఈ మూడు కన్సల్టెన్సీలు ఇప్పటి వరకు విక్రయించిన సర్టిఫికెట్ల జాబితా, ఖరీదు చేసిన వారి వివరాలతో కూడిన చిట్టాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీడియో డ్రీమ్ తీరకుండానే... ఈ మూడు కన్సల్టెన్సీలకూ ఇమ్రాన్ షేక్ అనే వ్యక్తి నకిలీ సర్టిఫికెట్లను తయారు చేసి ఇచ్చాడు. కడపకు చెందిన ఇతను 16 ఏళ్ల క్రితం నగరానికి వలసవచ్చి టోలిచౌకిలో స్థిరపడ్డాడు. కొన్నాళ్ల పాటు చిన్న చిన్న ఉద్యోగాలు చేసినా ఆ జీతంతో సంతృప్తి చెందలేదు. కంప్యూటర్, సాఫ్ట్వేర్స్పై పట్టు సాధించిన అతను 2015 నుంచి నకిలీ సర్టిఫికెట్ల తయారీ ప్రారంభించాడు. కొన్నాళ్ల పాటు ఓ ప్రైవేట్ ఛానల్లో వీడియో ఎడిటర్గా పని చేసిన ఇమ్రాన్కు ఓ డ్రీమ్ ప్రాజెక్టు కూడా ఉంది. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్పై హైదరాబాద్ నుంచి టిబెట్ వరకు వెళ్ళాలని, మార్గ మధ్యంలో తన అనుభవాలతో ట్రావెల్ వీడియో రూపొందించాలని భావించాడు. దీనికోసం ఎన్ఫీల్డ్ను కొనుగోలు చేసుకుని ప్రయాణానికి సిద్ధమయ్యాడు. అయితే అది కార్యరూపంలోకి రాకుండానే పోలీసులకు చిక్కి కటకటాల్లోకి చేరాడు. ఇతడు తయారు చేసిన సర్టిఫికెట్లలో సిటీ, కాకినాడల్లోని జేఎన్టీయూ, ఉస్మానియా వర్శిటీ, యూనివర్శిటీ ఆఫ్ మద్రాస్, గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, హేమ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ ఇంజనీరింగ్ స్టడీస్ (ఆస్ట్రేలియా), ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ (విజయవాడ), కేఆర్ఎం యూనివర్శిటీ తదితరాలకు చెందినవి ఉన్నాయి. -
‘పాస్ చేసి’ పంపిస్తారు!
సాక్షి, సిటీబ్యూరో: విదేశాల్లో విద్యనభ్యసించడా నికి వెళ్లాలని భావిస్తూ వివిధ పరీక్షల్లో ఫెయిలైన, అవసరమైన స్కోరింగ్ లేని వారితో పాటు అవసరమై విద్యార్హతలు లేని వారికి సైతం బోగస్ సర్టిఫికెట్లు తయారు చేసి విక్రయిస్తున్న ముఠా గుట్టును మధ్య మండల టాస్క్ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. ఈ గ్యాంగ్ ప్రధానంగా విద్యార్థులకే ఎక్కువగా ఈ ధ్రువపత్రాలు విక్రయించినట్లు గుర్తించారు. వివిధ ప్రాంతాల్లోని మూడు ఏజెన్సీలపై ఏకకాలంలో దాడి చేసిన టాస్క్ఫోర్స్ బృందాలు ఐదుగురు నిందితులను అరెస్టు చేశాయి. వీరి నుంచి 19 విద్యా సంస్థల పేరుతో ఉన్న 1360 సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం టాస్క్ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావుతో కలిసి నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ వివరాలు వెల్లడించారు. కన్సల్టెన్సీల ముసుగులో నకిలీల దందా... నగరానికి చెందిన జె.శ్రీకాంత్రెడ్డి, మహ్మద్ అతీఖ్ ఉర్ రెహ్మాన్ వేర్వేరుగా బేగంపేట ప్రాంతంలో జస్ట్ వీసా కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్, ఇండో–యూరోపియన్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ సంస్థలను. కె.శరత్చంద్ర ప్రసాద్ ఎస్సానగర్లో రైజర్స్ ఆర్గనైజేషన్ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నారు. 2014 నుంచి ఈ వ్యాపారంలో ఉన్న ఈ మూడు సంస్థలు బోగస్ సర్టిఫికెట్ల దందా సైతం చేస్తున్నాయి. అమెరికా, లండన్, కెనడా, ఆస్ట్రేలియా, పోలెండ్ తదితర దేశాలకు విద్యాభ్యాసం కోసం వెళ్తున్న విద్యార్థులకు వీసా ప్రాసెసింగ్ చేస్తామంటూ ప్రచారం చేసుకున్నారు. ఆయా దేశాల్లో చదువుకునేందుకు అవసరమైన అనుమతి పొందాలంటే అకడమిక్స్లో మంచి మార్కులు ఉండటంతో పాటు ప్రత్యేక పరీక్షల్లో మెరుగైన స్కోరింగ్, నిర్ణీత బ్యాంకు బ్యాలెన్స్లు, నిర్దేశిత రికమండేషన్ లెటర్స్ తప్పనిసరి. అయితే ఈ కన్సల్టెన్సీలకు వచ్చే వారిలో అందరి వద్దా ఇవి ఉండట్లేదు. మరోపక్క అనేక మంది ఫెయిలైన వారూ డబ్బు వెచ్చించి విదేశీ విద్య అభ్యసించాలని ఆసక్తి చూపుతుండటంతో వీరు ముగ్గురూ వాటిని అందించడం ద్వారా తేలిగ్గా డబ్బు సంపాదించాలని భావించారు. ఒక్కో సర్టిఫికెట్కు ఒక్కో రేటు ఈ పథకాన్ని అమలులో పెట్టడంలో భాగంగా ఈ మూడు సంస్థల నిర్వాహకులు టోలిచౌకి ప్రాంతానికి చెందిన ఇమ్రాన్ షేక్తో ఒప్పందం చేసుకున్నారు. కంప్యూటర్, సాఫ్ట్వేర్స్ వినియోగించి నకిలీ సర్టిఫికెట్ల తయారు చేయడంలో పట్టు ఉన్న ఇమ్రాన్ ఒక్కో దానికి రూ.10 వేల వరకు వసూలు చేసేవాడు. సంగారెడ్డి జిల్లాకు చెందిన అఖిల్ మంథి ఈ గ్యాంగ్కు ఏజెంట్లా వ్యవహరిస్తూ విద్యార్థులను తీసుకువస్తూ కమీషన్ తీసుకుంటున్నారు. ఇలా తమ వద్దకు వచ్చిన విద్యార్థులు కచ్చితంగా ఒరిజినల్ సర్టిఫికెట్స్ తీసుకురావాలంటూ మూడు సంస్థల నిర్వాహకులు సూచించేవారు. ఫెయిలైన, అవసరమైన స్థాయిలో స్కోరింగ్స్ లేని వారితో రూ.50 వేల నుంచి రూ.60 వేలకు బేరం కుదుర్చుకుని ఆ మొత్తం ముట్టిన తర్వాత ఆయా సర్టిఫికెట్లను ఇమ్రాన్కు పంపేవారు. అతను అవే సర్టిఫికెట్లు స్కాన్ చేసి, ఫొటోషాప్ ద్వారా అందులోని మార్కులు, స్కోరింగ్స్ మార్చేసి ప్రింట్ఔట్ తీస్తాడు. ఒరిజినల్ సర్టిఫికెట్ నుంచి కత్తిరించిన హోలోగ్రామ్ను వీటిపై అతికించి, నకిలీ స్టాంపులు కొట్టి కొత్తగా మరో సర్టిఫికెట్ తయారు చేసి అందించేవాడు. బ్యాంకు బ్యాలెన్స్లూ ‘చూపించేస్తారు’... ఈ గ్యాంగ్ కేవలం విద్యార్హత పత్రాలు తయారు చేసి ఇవ్వడమే కాదు... అవసరమైన బ్యాంకు బ్యాలెన్స్లూ చూపించేస్తుంది. వివిధ బ్యాంకుల పేర్లతో లెటర్హెడ్స్ సృష్టించిన ఇమ్రాన్ వాటిపై సదరు విద్యార్థి సంబంధీకుడికి భారీ మొత్తం బ్యాంక్ బ్యాలెన్స్ ఉందంటూ ప్రింట్ తీసి, స్టాంపులు వేసి, సంతకాలు చేసి ఇచ్చేస్తాడు. ఇందుకు గాను ఒక్కో సర్టిఫికెట్కు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు వసూలు చేసేవారు. దాదాపు నాలుగున్నరేళ్ళుగా ఈ మూడు సంస్థల నిర్వాహకులు మిగిలిన ఇద్దరితో కలిసి యథేచ్ఛగా దందా కొనసాగిస్తున్నారు. వీరి నుంచి ఓ నకిలీ సర్టిఫికెట్ పొందిన వ్యక్తి ఇటీవల నగరంలోని ఓ సంస్థలో ఇంటర్వ్యూకు వెళ్ళాడు. అతడి ధ్రువపత్రంపై అనుమానం వచ్చిన సదరు సంస్థ నిర్వాహకులు ఈ విషయాన్ని టాస్క్ఫోర్స్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో మధ్య మండల టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ సాయిని శ్రీనివాసరావు నేతృత్వంలో ఎస్సైలు తాత శ్రీధర్, కె.శ్రీనివాసులు తమ బృందాలతో రంగంలోకి దిగి మూడు కన్సల్టెన్సీలపై ఏకకాలంలో దాడులు చేశారు. ఫలితంగా ఐదుగురు నిందితులు చిక్కడంతో పాటు భారీ సంఖ్యలో నకిలీ ధ్రువీకరణ పత్రాలు, హోలోగ్రామ్స్ కట్ చేసిన అసలు సర్టిఫికెట్లతో ల్యాప్టాప్స్, కంప్యూటర్లు తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం కేసులను స్థానిక పోలీసులకు అప్పగించారు. -
అడ్డ‘దారులు’
కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఎంటెక్ పూర్తిచేసి.. అదే జిల్లాలోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఉన్నట్టుండి ఓ రోజు తాను పీహెచ్డీ పూర్తిచేశానని తనకు వేతనం పెంచాలని కోరుతూ.. ఇతర రాష్ట్రంలోని ఓ యూనివర్సిటీకి చెందిన డాక్టరేట్ పట్టా తీసుకొచ్చి యాజమాన్యం చేతిలో పెట్టాడు. కంగుతిన్న సదరు యాజమాన్యం.. సదరు అధ్యాపకుడి ఉద్యోగ హాజరును పరిశీలించింది. సెలవులు పెద్దగా పెట్టలేదని గమనించి.. కళాశాలలో పనిచేస్తూనే పీహెచ్డీ ఎలా పూర్తిచేశావని ప్రశ్నించగా.. తెల్లముఖం వేశాడు. చేసేదిలేక అసిస్టెంట్ ప్రొఫెసర్గానే కొనసాగుతున్నాడు. ఇలా ఈ ఒక్క అధ్యాపకుడే కాదు.. జిల్లాకు చెందిన చాలా మంది వివిధ రాష్ట్రాల్లో పీహెచ్డీ పూర్తిచేసినట్లు ‘నకిలీ’ సర్టిఫికెట్లు సృష్టించి.. కళా శాలల్లో చేరి.. ఉద్యోగాలు చేస్తున్నారు. శాతవాహనయూనివర్సిటీ: ఇంజినీరింగ్ కళాశాలల అధ్యాపకుల్లో నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం దూమారం రేపుతోంది. కొంతమంది డిగ్రీ, పీజీ, పీహెచ్డీ పట్టాలు నకిలీవి పట్టుకుని ఉద్యోగాల్లో కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ విషయం జేఎన్టీయూ (హెచ్) అధికారుల తనిఖీల్లో వెలుగుచూస్తుండడం కలవరపెడుతోంది. హైదరాబాద్లోని వివిధ ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రిన్సిపాల్ స్థాయి హోదాలో పనిచేస్తున్నవారే నకిలీ సర్టిఫికెట్లు పెట్టినట్లు వెలుగుచూడడంతో గవర్నర్ సీరియస్ అయ్యారు. రాష్ట్రంలోని అన్ని ఇంజినీరింగ్ కళాశాలల్లో అధ్యాపకుల సమగ్ర వివరాలతో నివేదిక పంపించాలని ఉన్నత విద్యామండలి అధికారులను ఇటీవల ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు జేఎన్టీయూ అధికారులు ఆయా కళాశాలల్లోని అధ్యాపకులతోపాటు జేఎన్టీయూ పరిధిలోని పలు కళాశాలల్లో పనిచేస్తున్నవారి సర్టిఫికెట్లను తనిఖీ చేస్తోంది. ఇందులోభాగంగా అనేక లొసుగులు బయటపడుతున్నట్లు సమాచారం. అధికారుల అంచనా ప్రకారం 150 మందికిపైగా అధ్యాపకులు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కళాశాలల్లో నకిలీ సర్టిఫికెట్లు పెట్టి ఉద్యోగాలు చేస్తున్నట్లు తెలుస్తుండగా.. వీరిలో కరీంనగర్ జిల్లాకు చెందినవారూ ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. జేఎన్టీయూ అధికారులు తనిఖీలకు రమ్మని పిలవగా.. జిల్లాలోని పలు కళాశాలల అధ్యాపకులు వెళ్లకుండా మల్లాగుల్లాలు పడుతున్నట్లు సమాచారం. అధికారులు పిలిచినా వెళ్లడం లేదంటే వారి సర్టిఫికెట్లు నకిలీవేనా..? అనే సందేహాలు విద్యావేత్తలో వ్యక్తమవుతోంది. అధికారులు స్పందించి.. తనిఖీ ప్రక్రియను వేగవంతం చేసి.. నకిలీలపై కఠినచర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బయటపడనున్న బాగోతం.. ఇంజినీరింగ్ కళాశాలల్లో అధ్యాపకుల నకిలీ సర్టిఫికెట్ల బాగోతం త్వరలోనే బట్టబయలు కానుందని అధికారవర్గాల ద్వారా సమాచారం. తప్పుడు ధ్రువీకరణపత్రాలు సృష్టించిన వారి ఏరివేతకు అధికారులు రంగం సిద్ధం చేశారు. నకిలీ ధ్రువీకరణపత్రాలతో అధ్యాపకులుగా కొనసాగుతున్నవారితో విద్యాప్రమాణాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇలాంటి పత్రాలు సృష్టించిన వారిలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దాదాపు 30మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది. జేఎన్టీయూ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కళాశాలల్లో 150మందికి పైగా సర్టిఫికెట్ వెరిఫికేషన్కు హాజరుకావాలని నోటీసులు పంపించగా.. కేవలం 60మందే హాజరయ్యారు. ఇక కరీంనగర్లో పనిచేస్తున్న వారు వెళ్లేందుకు మల్లగుల్లాలు పడుతున్నట్లు సమాచారం. గవర్నర్ ఆదేశాలతో.. పీహెచ్డీ సర్టిఫికెట్లు నకిలీవీ పెట్టిన అధ్యాపకుల సమగ్ర వివరాలతో నివేదిక పంపించాలని రాష్ట్ర గవర్నర్ ఉన్నత విద్యామండలి అధికారులను ఆదేశించారు. గతంలోని రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలకు సంబంధించిన పీహెచ్డీ పట్టాలు, కోర్సులు, అభ్యర్థుల సంఖ్య, తదితర వివరాలు పంపించాలని ఉన్నతవిద్యామండలిని కోరారు. ఇందులో ముఖ్యంగా ఏయే యూనివర్సిటీ ఎన్నెన్ని పీహెచ్డీలు ప్రదానం చేసింది..? ప్రస్తుతం ఏయే విభాగాల్లో ఎంతమంది పీహెచ్డీ చేస్తున్నారు..? ఎన్నేళ్లుగా చేస్తున్నారు..? అనే వివరాలు కోరారు. దీంతో ఉన్నత విద్యామండలి రెండు నెలల క్రితమే అన్ని యూనివర్సిటీలకు పీహెచ్డీ వివరాలు పంపించాలని ఆదేశించింది. అన్ని యూనివర్సిటీలు సంబంధిత వివరాలు పంపించాయి. ఈ క్రమంలోనే నకీలీల బాగోతం వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు జెఎన్టీయూ అధికారులు సైతం నకిలీలపై దృష్టి నోటీసులు పంపించడం, తనిఖీలు చేపట్టడం వంటి చర్యలు చేపడుతోంది. నకిలీ సర్టిఫికెట్లు కలిగి ఉన్నారని తేలితే కఠినచర్యలు పాల్పడనున్నట్లు సమాచారం. నకిలీలతో యాజమాన్యాలకే మోసం కరీంనగర్లోని పలు ఇంజినీరింగ్ కళాశాలల్లోని కొందరు అధ్యాపకులు తప్పుడు పీహెచ్డీ ధ్రువపత్రాలు కలిగి ఉన్నట్లు తీవ్ర ప్రచారం కొనసాగుతోంది. ప్రస్తుతం జిల్లా మొత్తం నకిలీ సర్టిఫికెట్ల బాగోతం హాట్టాఫిక్గా మారింది. ఇలా తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి.. యాజమాన్యాలనే మోసం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇతర ప్రదేశాల నుంచి వచ్చినవారు వివిధ కళాశాలల నుంచి తప్పుడు పత్రాలతోనే ఉద్యోగాలు సాధించినట్లు సమాచారం. నగర సమీపంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో ఒక విభాగానికి చెందిన అధ్యాపకుడు పీహెచ్డీ పట్టా కొనుక్కొని వచ్చారని.. అయినా యాజమాన్యం సదరు విభాగం తరఫున డాక్టరేట్గా యూనివర్సిటీకి చూపిస్తున్నట్లు సమాచారం. కొందరు అధ్యాపకుల సర్టిఫికెట్ల వ్యవహారం యాజమాన్యాలకు తెలిసినా.. కిమ్మనకుండా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా అర్హత ఉన్నవారితోనే విద్యాబోధన జరిగితే విద్యార్థులకు నాణ్యమైన బోధన అందుతుందని విద్యావేత్తలు భావిస్తున్నారు. నకిలీలపై కఠిన చర్యలు తీసుకుని విద్యార్థులకు న్యాయం చేయాలని విద్యార్థులు, విద్యార్థిసంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. -
ఇంటర్ విద్యాశాఖలో కలకలం
విద్యారణ్యపురి వరంగల్: నకిలీ కుల ధ్రువీకరణ పత్రం తో ఉద్యోగం పొందినట్లు ఆరోపణలు ఎదు ర్కొంటున్న ఐదు, ఆరో జోన్ల ఇంటర్ విద్య ఆర్జేడీ(ఎఫ్ఏసీ) సుహాసినిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు ఆదివారం తెలంగాణ ప్రభుత్వ స్పెషన్ చీఫ్ సెక్రటరీ రంజీవ్ ఆర్ ఆచార్య సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేటకు చెందిన సుహాసిని ము న్నూరుకాపు సామాజిక వర్గం అనే ఆరోపణలు ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబా ద్ జిల్లాలో ఎస్టీ కేటగిరీలో 1991లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈమె లెక్చరర్గా నియామకమయ్యారు. 2005లో ప్రిన్సి పాల్గా, 2014లో ఇంటర్ విద్య ఆర్ఐఓగా పదోన్నతి పొం దారు. గత కొంతకాలంగా కరీంనగర్ జిల్లాలో డీఐ ఈఓగా బాధ్యతలను నిర్వర్తిస్తున్న సుహాసినికి 2016లో ఐదవ, ఆరవజోన్కు సంబంధించిన వరంగల్ ఇంటర్ విద్య ఇన్చార్జి ఆర్జేడీగా అదనపు బాధ్యతలను అప్పగించారు. గత కొన్ని నెలల క్రితమే ఫుల్ అడిషనల్ చార్జి(ఎఫ్ఏసీ) కూడా ఇచ్చారు. అయితే సుహాసిని ఎస్టీ కాదని, ఆమెది మున్నూరుకాపు సామాజిక వర్గమని, నకిలీ సర్టిఫికెట్తో ఉద్యోగం పొందారని ఆరోపిస్తూ ఓ సంస్థ బాధ్యులు కొన్నేళ్ల క్రితమే ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీంతో ప్రభుత్వం సుహాసినిపై ఉన్నతాధికారులతో విచారణ చేయించింది. విచారణలో సుహాసిని ఎస్టీ కాదని, నకిలీ సర్టిఫికెట్తో ఉద్యోగం పొందినట్లు వెల్లడైనట్లు తెలిసింది. దీంతో ప్రభుత్వం సుహాసినిపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు సస్పెన్షన్లోనే కొనసాగిస్తారు. సుహాసినిని హెడ్క్వార్టర్ కూడా వదిలి వెళ్లొద్దని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఆమెపై క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకోబోతున్నట్లు తెలిసింది. ఇన్చార్జి ఆర్జేడీగా హన్మంతరావు కాగా సుహాసినిని సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు ఐదు, ఆరో జోన్ వరంగల్ ఇంటర్ విద్య ఆర్జేడీగా హన్మంతరావును నియమించినట్లు తెలిసింది. సుహాసినిని సస్పెండ్ చేసిన ప్రభుత్వం నల్లగొండ జిల్లాలో డీఐఈఓగా పనిచేస్తున్న హన్మంతరావును ఆమె స్థానంలో వరంగల్ ఇన్చార్జి ఆర్జేడీగా నియమించారని సమాచారం. ఒకటి రెండు రోజుల్లో హన్మంతరావు బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలిసింది. -
రూ. 80 వేలకే ఇంజనీరింగ్ సర్టిఫికెట్!
పదో తరగతి నుంచి ఇంజనీరింగ్, పీజీ వరకు ఏ సర్టిఫికెట్ కావాలన్నా.. ఏ యూనివర్సిటీ నుంచి కావాలన్నా నిమిషాల్లో తెప్పిస్తాడు.. కాదు, ముద్రిస్తాడు. కేవలం రూ. 80వేలు పెడితే ఇంజనీరింగ్ సర్టిఫికెట్ వచ్చేస్తుంది. ఇలా నకిలీ సర్టిఫికెట్లు సృష్టిస్తూ పలువురిని మోసం చేసిన ఘరానా మోసగాడిని టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టుచేశారు. మహ్మద్ జుమైర్ అలియాస్ జుబైర్ అలియాస్ హుస్సేన్ (43) ఎట్టకేలకు పోలీసుల చేతికి చిక్కాడు. ఇతడు మహాత్మాగాంధీ కాశీ విద్యాపీఠ్, మదురై కామరాజ్ యూనివర్సిటీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ ఇంజనీరింగ్ స్టడీస్, ఛత్రపతి సాహూజీ మహరాజ్ యూనివర్సిటీ, కాన్పూర్, సత్యభామ యూనివర్సిటీ, డాక్టర్ భీమ్రావు అంబేద్కర్ యూనివర్సిటీ ఆగ్రా, మానవ్ భారతి యూనివర్సిటీ, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఓఖ్లా, ఢిల్లీ, వినాయక మిషన్స్ యూనివర్సిటీ, బోర్డ్ ఆఫ్ సెకండరీ మధ్య భారత్ గ్వాలియర్, గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ లాంటి సంస్థల పేరు మీద నకిలీ డిగ్రీలను సప్లై చేసేవాడు. అతడి వద్దనుంచి వివిధ వర్సిటీలకు చెందిన 60 నకిలీ సర్టిఫికెట్లు, రెండు ల్యాప్టాప్లు, ఒక కలర్ ప్రింటర్ తదితరాలను స్వాధీనం చేసుకున్నారు. 2011 సంవత్సరంలో మహ్మద్ జుమైర్ క్విక్ జాబ్ సొల్యూషన్స్ అనే కన్సల్టెన్సీని మలక్పేట సమీపంలోని సిటీటవర్స్లో ప్రారంభించాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురిని మోసం చేసి చివరకు దుకాణం ఎత్తేశాడు. తర్వాత 2015లో హైదరాబాద్ కాలేజ్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అండ్ అడ్వాన్స్డ్ స్టడీస్ పేరుతో సంతోష్నగర్లోని చంపాపేట రోడ్డులో మరో దుకాణం తెరిచాడు. అక్కడ వ్యాపారం బాగోకపోవడంతో పంజాగుట్ట మోడల్ హౌస్ ప్రాంతానికి మార్చాడు. అక్కడ ఎ. హరిబాబుతో కలిసి వివిధ యూనివర్సిటీల నకిలీ సర్టిఫికెట్లు తయారుచేసేవాడు. బషీర్బాగ్ లోని బాబూఖాన్ ఎస్టేట్లో మరో ఆఫీసు తెరిచి, దాని బాధ్యతలు హరిబాబుకు ఇచ్చాడు. వన్ సిట్టింగ్, డిస్టెన్స్ ఎడ్యుకేషన్, కరస్పాండెన్స్ కోర్సుల పేరుతో పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి, అక్కడకు వచ్చినవారి నుంచి పెద్దమొత్తంలో డబ్బు తీసుకుని వాళ్లతో పరీక్షలు రాయించకుండానే ఈ నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చేవాడు. సుదూర ప్రాంతాల్లో ఉన్న బ్రోకర్లతో కూడా ఇతడికి సంబంధాలుండేవి. వాళ్లకు విద్యార్థుల వివరాలు వాట్సప్ ద్వారా పంపితే వాళ్లు కొరియర్లో సర్టిఫికెట్లు పంపేవారు. ఇంజనీరింగ్కు రూ. 80వేలు, ఎంబీఏ కావాలంటే రూ. 40 వేలు, ఎంసీఏకు రూ. 50వేలు, డిగ్రీకి రూ. 40వేలు, ఇంటర్కు రూ. 15వేలు తీసుకుని సర్టిఫికెట్లు ఇచ్చేవాడు. ఇలా ఇప్పటివరకు 80-100 మందికి సర్టిఫికెట్లు ఇచ్చినట్లు తెలిసింది. ఎట్టకేలకు ఇతగాడు పోలీసులకు చిక్కాడు. -
నకిలీ గురువులు
ప్రొద్దుటూరు టౌన్: విద్యాబుద్ధులు నేర్పి పిల్లలను సమాజానికి ఉపయోగ పడేవిధంగా తీర్చి దిద్దాల్సిన గురువులే తప్పు చేస్తే...పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పాఠశాలల్లో సెకండరీగ్రేడ్ టీచర్లుగా పని చేస్తున్న నలుగురు ఏకంగా కుల సర్టిఫికెట్లు నకిలీవి పెట్టి ఉద్యోగాలు పొందారన్న సమాచారం బయటకు పొక్కడంతో తీవ్ర చర్చ జరుగుతోంది. వీరిలో ఒకరికి ప్రమోషన్ కూడా వచ్చిందంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో నకిలీ కుల సర్టిఫికెట్ల దందా కొనసాగుతున్నా అధికారులకు తెలియకపోవడం ఏమిటన్న విషయం సర్వత్రా చర్చనీయాంశమైంది. నాలుగు పాఠశాలల్లో పని చేస్తున్న ఎస్జీటీలపై ఇటీవలే మున్సిపల్ అధికారులకు తెలియడంతో షాక్కు గురైనట్లు సమాచారం. చెంచులుగా...కమ్మరట్రైబల్గా... కొందరు ఉపాధ్యాయులు చెంచులుగా, మరి కొందరు కమ్మర ట్రైబల్గా ఉద్యోగాలు పొందారు. ఈ తతంగం ఏళ్ల తరబడి గుట్టు చప్పుడు కాకుండా సాగుతోంది. రూ.35వేల నుంచి రూ.45 వేలు జీతాలు తీసుకుంటున్న ఉపాధ్యాయుల కుల సర్టిఫికెట్లపై విచారణ జరిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీరిలో 1992, 1994, 2000 సంవత్సరాల బ్యాచ్లకు చెందిన వారు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. వీరిలో కొందరు చెంచులుగా, మరి కొందరు కమ్మర ట్రైబుల్గా కుల సర్టిఫికెట్లను పొందు పరిచినట్లు తెలిసింది. కడప జిల్లాలో చెంచులు ఉన్నారా...? అయితే రెవెన్యూ రికార్డుల ప్రకారం కడప జిల్లాలో చెంచులు ఎక్కడా లేరన్న విషయాన్ని రెవెన్యూ అధికారులు రూఢీ చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో చెంచులు ఉన్నట్లు చెబుతున్నారు. అయితే వీరికి చెంచులుగా గుర్తించి కుల సర్టిఫికెట్లను ఏ రెవెన్యూ అధికారి ఇచ్చారన్న విషయంపై కూడా పూర్తి స్థాయిలో విచారణ జరగాలి. నకిలీ సర్టిఫికెట్లపై ఉన్నత స్థాయిలో విచారణ జరగాలి... నకిలీ సర్టిఫికెట్ల ఉదంతంపై ఉన్నత స్థాయిలో విచారణ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సర్టిఫికెట్లు రెవెన్యూ అధికారులే జారీ చేశారా, లేక వాటిని కూడా నకిలీవి సృష్టించారా అన్న విషయం తేలాల్సి ఉంది. ఉద్యోగం కోసం జరిగిన ఇంటర్వ్యూలలో అధికారులు ఎందుకు గుర్తించలేకపోయారన్న విషయంపై కూడా విచారణ జరగాలి. ఒక్క ప్రొద్దుటూరులోనేనా లేక మరే ప్రాంతంలోనైనా ఈ విధంగా ఉద్యోగాలను ఏఏ శాఖల్లో పొందారన్న విషయంపై కూడా విచారణ జరిగితే ఎంత మంది ఈ దందాలో పాలుపంచుకున్నారో తేలుతుంది. మా దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటాం నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన విషయంపై మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ను వివరణ కోరగా, తమ దృష్టికి రాలేదన్నారు. ఏ పాఠశాలలో ఇలాంటి వారు ఉన్నారో సమాచారం ఇస్తే వారికి నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకుంటామన్నారు. -
నకిలీలలు...
ఖమ్మం, న్యూస్లైన్ : వికలాంగులతో భర్తీ చేసే ఉద్యోగాలపై కూడా దళారులు కన్నేశారు. నకిలీ విద్యా సర్టిఫికెట్లు పుట్టించి అర్హతలేని వారికి ఉద్యోగాలు ఇప్పించేందుకు వీరు ఇప్పటికే రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. వివిధ రకాల కోర్సులకు సంబంధించిన సర్టిఫికెట్లను విజయవాడ, విశాఖపట్టణం నగరాలలోని పలు శిక్షణకేంద్రాల నుంచి వీరు కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వీరికి కొందరు అధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నాయనే ప్రచారం కూడా జరుగుతుండడంతో అర్హులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వికలాంగులకు కేటాయించిన పలు ఉద్యోగాలు గత కొద్ది సంవత్సరాలుగా భర్తీకి నోచుకోవడం లేదు. దీంతో గ్రూప్-4 కేటగిరీకి చెందినవి 24, అంతకంటే తక్కువ స్థాయి ఉద్యోగాలు 28 పోస్టుల భర్తీ కోసం గత నెల 17న జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నోటిఫికేషన్ జారీ చేశారు. ఇందులో 8 టైపిస్టు పోస్టులు, 3 జూనియర్ అసిస్టెంట్లు, ఒక బిల్ కలెక్టర్, ఒక కాంపౌండర్, 8 వాచ్మెన్లు, 9 మల్టీపర్పస్ హెల్త్వర్కర్లు(పురుషులు), 8 అటెండర్లు, 5 కుక్, 5 కామాటీ, 2 పీహెచ్ వర్కర్లు, ఒక బాల్మెన్ పోస్టు ఖాళీలుగా చూపించారు. వీటి భర్తీకి జనవరి 20 నుంచి ఫిబ్రవరి 4 వరకు దరఖాస్తులు స్వీకరించారు. గడువు ముగిసే నాటికి వివిధ కేటగిరీలకు చెందిన ఉద్యోగాల కోసం 6,300 మంది వికలాంగులు దరఖాస్తు చేసుకున్నారు. నకిలీ సర్టిఫికెట్ల జోరు.. కాగా, దరఖాస్తు చేసిన వికలాంగులలో కావలసిన విద్యార్హత లేని వారు ఉన్నట్లు తెలుస్తోంది. దళారుల నుంచి కొనుగోలు చేసిన నకిలీ సర్టిఫికెట్లతో వీరు ఉద్యోగం పొందేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ప్రధానంగా ఎంపీహెచ్డబ్ల్యూ(పురుషులు) ఉద్యోగాల కోసం నకిలీ సర్టిఫికెట్లతో పలువురు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ఈ ఉద్యోగాలకు మల్టీపర్పస్ హెల్త్వర్కర్(ఎంపీహెచ్డబ్ల్యూ) రెండేళ్ల కోర్సు పూర్తి చేసినవారు మాత్రమే అర్హులు. అయితే కొందరు దళారులు వైజాగ్, విజయవాడలలోని పలు ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్లు, ఇతర కళాశాలల నుంచి సర్టిఫికెట్లు కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఒక్కో సర్టిఫికెట్కు రూ. 50 వేల నుంచి లక్ష వరకు చెల్లించి తెచ్చుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలా జిల్లాకు 50 సర్టిఫికెట్ల వరకు వచ్చాయని తెలుస్తోంది. అయితే అధికారుల పరిశీలనలో తమ బండారం బయటపడుతుందని భావించిన కొందరు అక్రమార్కులు.. వారికి కూడా ముడుపులు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారని, దీంతో ఆ శాఖలోని పలువురు అధికారులు నకిలీలకు ఉద్యోగాలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారని ప్రచారం జరుగుతుండడంతో అర్హత కలిగిన నిరుద్యోగులు.. న్యాయంగా తమకు రావాల్సిన ఉద్యోగం చేజారి పోయే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని, నకిలీల బండారం బయటపెట్టి అర్హత ఉన్నవారికే ఉద్యోగాలు వచ్చేలా చూడాలని కోరుతున్నారు.