false news
-
చంద్రబాబు రాజకీయం ఇలాగే ఉంటుంది!
అడ్డగోలు వాదనలు చేయడంలో కొంతమంది రాజకీయ నేతలు సిద్దహస్తులుగా ఉంటారు. వారిలో మొదటి పేరు ఎవరిదైనా చెప్పవలసి వస్తే అది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుదే అవుతుంది. అలాగే అడ్డగోలు చెత్త కథనాలు ప్రచారం చేయడంలో ఈనాడు, ఆధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియాకు మొదటి ర్యాంకు ఇవ్వవలసిందే. ఈ విషయం పలుమార్లు రుజువు అవుతూనే ఉంది. తాజాగా సోలార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా( సెకీ ) నుంచి ఏపీకి విద్యుత్ కొనుగోలు చేయడానికి గత జగన్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంపై విషం చిమ్మడానికి టీడీపీతో పాటు, ఎల్లో మీడియా పోటీ పడ్డాయి. సాధారణంగా.. నిజం నిలకడమీద తెలుస్తుందంటారు. కాకపోతే వాస్తవం బయటపడే లోపు అబద్దాలు లోకం అంతా చుట్టేస్తుంటాయి. సెకీతో ఒప్పందం వల్ల ఏపీకి జగన్ తీరని నష్టం చేశారని ఎల్లో మీడియా అసత్యాన్ని ఒకటికి పదిసార్లు ప్రచారం చేసింది. లక్ష కోట్ల భారం ఏపీపై జగన్ వల్ల పడిందని కూడా ఆ మీడియా సంస్థలు ఆరోపించాయి. వాస్తవం ఏమిటంటే జగన్ చేసుకున్న ఒప్పందం వల్ల లక్షా పదివేల కోట్ల రూపాయల మేర ఏపీ ప్రజలకు ఆదా అయింది. ఒకరకంగా చెప్పాలంటే జగన్ వల్ల ఏపీకి లక్ష కోట్లకు పైగా ఆదాయం వచ్చినట్లన్నమాట.👉సెకీ(SECI)తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం ప్రకారం యూనిట్ 2.49 రూపాయలకు ఏపీకి సరఫరా అవుతుంది. ఇంత తక్కువ ధరకు గతంలో ఎప్పుడూ ఒప్పందం జరగలేదు. అయినా అది చాలా ఎక్కువ ధర అని, దీనికి ట్రాన్సిమిషన్ చార్జీలు అదనంగా చెల్లించాలంటూ ఇష్టం వచ్చినట్లు ఆ మీడియా ప్రచారం చేయడం, దానిని చంద్రబాబు తలకు ఎత్తుకుని విమర్శలు చేయడం.. కొద్ది నెలల క్రితం నిత్యకృత్యంగా సాగింది. రాష్ట్రం ఏమైపోయినా ఫర్వాలేదు..పెట్టుబడులపై ప్రభావం చూపినా ఫర్వాలేదన్నట్లుగా జగన్ పై దుష్ప్రచారం చేశాయి.అర్ధరాత్రి టైమ్ లో ఫైల్ పై సంతకం పెట్టించారని జనసేనలోకి వెళ్లిన మాజీ విద్యుత్ శాఖ మంత్రితో చెప్పించారు. అయినా జగన్ చేసింది రాష్ట్రానికి మంచి అని ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వమే ఒప్పుకోక తప్పలేదు. 👉తాము ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు(Super Six Promises), ఎన్నికల ప్రణాళిక వాగ్దానాలనుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి అదాని,జగన్ మద్య లింక్ అని, అదాని నుంచి జగన్ లంచం తీసుకున్నారని, అమెరికాలో కేసు అయిందని విపరీతంగా పబ్లిసిటీ చేశారు. ఏపీ ప్రభుత్వంతో నేరుగా అదానీ ఒప్పందమే జరగనప్పుడు లంచాల ప్రస్తావన ఎలా వస్తుందని వైఎస్సార్సీపీ వారు చెప్పినా.. తమ దుర్మార్గపు మీడియాతో పదే పదే ప్రచారం చేయించారు. సరే.. వారు చెబుతున్నారు కదా! సెకీతో ఒప్పందం వల్ల ఏపీకి లక్ష కోట్ల భారం పడుతుందని అంటున్నారు కదా! దానిని రద్దు చేసుకోండని ఎవరైనా సవాల్ చేస్తే మాత్రం దానికి జవాబు చెప్పేవారు కారు. వైఎస్ జగన్పై ఈ విద్యుత్ ఒప్పందంపై ఏసీబీతో విచారణ చేయిస్తున్నామని కూడా బిల్డప్ ఇచ్చారు. అవన్నీ ఉత్తిత్తివేనని అందరికి తెలుస్తూనే ఉంది. కాకపోతే జగన్ పై ప్రజలలో ఒక అపనమ్మకం కలిగించడానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి మీడియా సంస్థలు నానా చెత్త అంతా ప్రచారం చేసేవి. దానికి అనుగుణంగా చంద్రబాబు మాట్లాడడమో,లీక్ ఇవ్వడమో చేస్తుండేవారు. విశేషం ఏమిటంటే దేశం బీజెపీయేతర రాజకీయ పక్షాలు అదానీపై, ప్రధాని మోదీపైన విమర్శలు చేస్తుంటే, చంద్రబాబు మాత్రం వారిని పల్లెత్తి అనకుండా, జగన్ పై మాత్రం ఆరోపణలు గుప్పిస్తుండేవారు. ఇలా ఉంటుంది చంద్రబాబు రాజకీయం. ఇప్పుడు ఏపీలో విద్యుత్ నియంత్రణ మండలి(AP ERC) సెకీ ఒప్పందం సక్రమమని, దానివల్ల ఎపికి మేలు జరుగుతుందని, కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి కూడా ఈ ఒప్పందానికి ఆమోదం తెలిపిందని స్పష్టం చేసింది. ఏపీఈఆర్సి లో చైర్మన్ ను చంద్రబాబు ప్రభుత్వమే నియమిస్తుంది. అంటే ప్రభుత్వ అభిష్టానికి వ్యతిరేకంగా ఈ మండలి సాధారణంగా నిర్ణయాలు తీసుకోదు. మండలి ఒప్పుకున్నా.. కోకున్నా చంద్రబాబు ప్రభుత్వం తాము సెకీతో ఒప్పదం ప్రకారం విద్యుత్ సరఫరా చేసుకోబోమని కూడా చెప్పి ఉండవచ్చు. ఆ పని చేయలేదు. అంటే చంద్రబాబు అండ్ కో(Chandrababu & Co) ఎప్పటిమాదిరే డబుల్ గేమ్ ఆడారన్నమాట. 👉జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల వచ్చే ప్రయోజనం వారు పొందాలి. అదే టైమ్ లో జగన్ ను బదనాం చేయాలి..ఇది వారి వ్యూహం. అదానీ వివాదం చెలరేగినప్పుడు చాలా స్పష్టంగా ఏ విచారణకు అయినా సిద్దం అని జగన్ చాలెంజ్ చేశారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం యూనిట్ విద్యుత్ను రూ.4.50 నుంచి రూ.6 వరకు కొనుగోలు చేయడానికి చేసుకున్న ఒప్పందాలను సమీక్షించడానికి జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తే.. దానిని టీడీపీ, ఎల్లో మీడియా వ్యతిరేకించి పెట్టుబడులపై ప్రభావం పడుతుందని ప్రచారం చేశాయి. అదే జగన్ రూ.2.49 ఒప్పందం అయితే మాత్రం ఏదో ఘోరం జరిగినట్లు అబద్దాలు సృష్టించారు. ఇప్పుడు ఏపీఈఆర్సీ నిర్ణయంతో చంద్రబాబుకాని, ఎల్లో మీడియాకాని ఎంత తప్పుడు ప్రచారం చేసింది జనానికి పూర్తిగా అర్దం అవుతుంది. 👉ఈనాడు మీడియాలో వచ్చిన హెడింగ్లు చూస్తే.. జర్నలిజం ఇంత నీచంగా మారిందా? అనే బాధ కలుగుతుంది. అదానీ కేసులో జగన్ పేరు లేకపోయినా, పనికట్టుకుని ఒకటికి రెండుసార్లు ఆయన పేరు రాసేవారు. నేరుగా అదానీ నుంచి జగన్కు రూ. 1,750 కోట్ల లంచం అందిందని అచ్చేశారు. ఇప్పుడు అదే ఒప్పందాన్ని చంద్రబాబు కొనసాగిస్తున్నందున ఆయనకు రూ.2,750 కోట్ల ముడుపులు ముట్టాయా? అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది.👉అబద్దాల ఆంధ్రజ్యోతి ఇప్పటికీ ఏదో రూపంలో వైఎస్సార్సీపీ బురదచల్లడానికి నిస్సిగ్గుగా యత్నిస్తోంది. ఈనాడు పెట్టిన కొన్ని శీర్షికలు చూడండి..⇒నిబంధనలు ఉల్లంఘించి అదానీకి అనుమతిచ్చేశారుఅసలు అదానీతో ఒప్పందమే లేదని ఈఆర్సీ నివేదిక ప్రకారం కూడా తెలుసుకోవచ్చు. జగన్ ఈ అంశంపై తన వాదన తెలిపితే.. ⇒అవినీతి ఒప్పందానికి అడ్డగోలు సమర్ధనా? అని ఈనాడు విషం కక్కింది. ఇప్పుడు ఈనాడు ఎవరి నుంచి ముడుపులు తీసుకుని ఇలాంటి అవినీతి కధనాలు రాసిందో అని వైఎస్సార్సీపీ ప్రశ్నిస్తోంది.'రాష్ట్రానికి నష్టం..రాజస్తాన్ కు లాభం" అంటూ మరో వార్త ఇచ్చారు. రాజస్తాన్ కు ఇందులో ప్రత్యేకంగా వచ్చే లాభం ఏమి ఉండదు. అదానీ లేదంటే ఇతర పారిశ్రామికవేత్తలు ఆయా చోట్ల నెలకొప్పిన సౌర విద్యుత్ కేంద్రాల నుంచి కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీ విద్యుత్ కొనుగోలు చేసి రాష్ట్రాలకు సరఫరా చేస్తుంది. పైగా అక్కడ నుంచి ఏపీకి ట్రాన్సిమిషన్ చార్జీలు ఉండవని కేంద్రం స్పష్టం చేసినా.. జగన్ పై బురదచల్లుడు కధనాలు ఇచ్చి తన కుసంస్కారాన్ని ప్రదర్శించుకుంది.అంతర్జాతీయ స్థాయికి జగన్ అవినీతి అంటూ చంద్రబాబు ,ఈనాడు,ఆంధ్రజ్యోతి దారుణాతిదారుణంగా ప్రచారం చేశాయి. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పరువు పొగొట్టుకున్నది చంద్రబాబు, ఎల్లో మీడియా కాదా?. అదానీ స్కామ్ నిజంగా జరిగి ఉంటే.. అందులో చంద్రబాబు, ఎల్లో మీడియాకు వాటా ఉన్నట్లు అనుకోవాల్సిందేగా! ఏది ఏమైనా ద్వేషంతో జర్నలిజం ప్రాధమిక సూత్రాలను విస్మరించి ఈనాడు చేస్తున్నది పచ్చి పాపం అని చెప్పాలి. అందుకే జగన్ ఈ మీడియాపై పరువు నష్టం దావా వేశారు.అది ఎప్పటికి తేలుతుందో కాని,కచ్చితంగా న్యాయం నిలబడి వారికి శిక్షపడడానికి ఇప్పుడు ఈఆర్సీ చేసిన నిర్ణయం ఒకటే సరిపోవచ్చు.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
చిన్నారిపై లోకేష్ సైకో టీం విషప్రచారం
విజయవాడ, సాక్షి: పచ్చ బ్యాచ్ సైకోలు ఇంతకన్నా దిగజారరు అనుకున్న ప్రతీసారి ఆశ్చర్యపరస్తూ వస్తున్నారు. తాజాగా.. మరోసారి విష పడగ విప్పారు. జగన్పై అభిమానంతో ఓ చిన్నారి చేసిన పనిని విపరీతంగా ట్రోల్ చేశారు. అయితే ఈసారి నెటిజన్ల నుంచి ఛీత్కారాలు వచ్చాయి. దీంతో ఐటీడీపీ జీతగాళ్లు మరింత దిగజారి ప్రవర్తించారు. ఆ చిన్నారి విషయంలో అసత్య ప్రచారం చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు.రవీంద్రభారతిలో ఎనిమిదో తరగతి చదువుతున్న దేవికారెడ్డి(Devika Reddy) .. విజయవాడ పర్యటనలో వైఎస్ జగన్ను కలిసింది. ఆ సమయంలో ఆయన ఆ పాపను దగ్గరికి తీసుకున్నారు. అయితే ఆ తర్వాత భావోద్వేగంతో ఆ చిన్నారి మీడియా ముందు మాట్లాడింది. జగన్ అంటే ఎంతో ఇష్టమని చెప్పింది. కూటమి ప్రభుత్వంలో అమ్మ ఒడి రావట్లేదని ఉన్నమాటే చెప్పింది. అయితే పచ్చ బ్యాచ్కు ఇది ఏమాత్రం సహించనట్లుంది.అందుకే తమ అనుకూల సోషల్ మీడియా పేజీలు, వెబ్సైట్లలో చిన్నారి గురించి ఇష్టానుసారం పోస్టులు చేయించారు. దిగజారిపోయి మరీ పోల్ క్వశ్చన్స్ పెట్టించారు. ఈ క్రమంలో #Childabuser అంటూ ఆ వెబ్సైట్లను జనం తిట్టిపోశారు కూడా. గతంలో చిన్నపిల్లలతో రాజకీయం చేసింది ఎవరంటూ.. టీడీపీకి సంబంధించిన వీడియోలను పోస్ట్ చేశారు.టీడీపీ సోషల్ మీడియా(TDP Social Media) ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందో తెలియంది కాదు. గతంలో ప్రభుత్వ స్కూల్లో అనర్గళంగా ఆంగ్లం మాట్లాడిన మేఘన అనే ఓ విద్యార్థిని విపరీతంగా ట్రోల్ చేశారు. జగన్ సాయం చేశారని చెప్పిన గీతాంజలికి.. సొంతింటి కల నెరవేరిన సంతోషాన్ని లేకుండా చేశారు. ఏకంగా.. ఆమె బలవన్మరణానికి పాల్పడేంతగా సోషల్ మీడియాలో ఏడ్పించారు. జగన్ పాలనలో సాయం పొందిన వాళ్లను, ఆయనపై అభిమానం ప్రదర్శించిన వాళ్లనూ ఏ ఒక్కరినీ వదలకుండా విపరీతంగా ట్రోల్ చేయడం చూశాం. ఇప్పుడు ఓ చిన్నారి విషయంలోనూ అదే చేస్తున్నారు. అయితే ఈ వ్యవహారం మరీ శ్రుతిమించడంతో బూమరాంగ్ అయ్యింది. దీంతో ఈసారి అసత్య ప్రచారాలకు దిగారు. చిన్నారి దేవిక డీపీహెచ్ స్కూల్లో చదువుతుందంటూ ప్రచారం చేశారు. పైగా ఆమె తల్లి వైఎస్సార్సీపీ నాయకురాలు అని, ఆర్థికంగా ఆ కుటుంబ పరిస్థితి ఎంతో బాగుందంటూ విషం చిమ్మారు. దేవిక తండ్రి అద్దె ఇంట్లో ఉంటూనే ఓ షాప్లో పని చేస్తూ పిల్లల్ని చదివించుకుంటున్నారు. కానీ, లోకేష్ సైకో టీం(Nara Lokesh Team) విషప్రచారం ఇంకా ఆ ప్రచారం ఆపట్లేదు.ఇంత జరుగుతున్నా.. టీడీపీ సోషల్ మీడియా విభాగాలపై పోలీసులు ఎలాంటి కేసులు పెట్టడం లేదు. వైఎస్సార్సీపీ నేతలు, హామీలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ పోస్టులు పెడుతున్నవాళ్లపై కూటమి పెద్దల ఆదేశాలతో తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తుండడంలో తలమునకలైపోయారు అంతే!. -
బిగ్ టీవీ, మహాటీవీ తప్పుడు కథనాలు.. వైఎస్సార్సీపీ ఫిర్యాదు
సాక్షి, తాడేపల్లి: బిగ్ టీవీ, మహాటీవీ కథనాలపై వైఎస్సార్సీపీ మండిపడింది. సబ్ రిజిస్టార్ సింగ్, శ్రీకాంత్ వ్యవహారాలను వైఎస్సార్సీపీ నేతలకు అంటగట్టడంపై ఆ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. రూ.700 కోట్ల విలువైన భూములను అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారంటూ బిగ్ టీవీ, మహాటీవీ తప్పుడు కథనాలు ప్రసారం చేశాయి.తప్పుడు కథనాలను ప్రసారం చేసిన సదరు చిల్లర ఛానళ్లపై చర్యలకు వైఎస్సార్సీపీ నిర్ణయించింది. ఇప్పటికే న్యాయ నిపుణులతో వైఎస్సార్సీపీ ముఖ్య నేతలు చర్చించారు. తప్పుడు వార్తలు ప్రసారం చేసిన ఛానళ్లపై చర్యలు తీసుకోవాలని తాడేపల్లి పీఎస్లో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఫిర్యాదు చేశారు.ఇదీ చదవండి: ఏపీలో ప్రభుత్వ టీచర్లకు అందని జీతాలు -
‘మళ్లీ భూ ప్రకంపనలు’.. వాట్సాప్లో వాయిస్ మెసేజ్ చక్కర్లు
జయశంకర్, సాక్షి: ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో ఏ నలుగురు కలిసినా.. ఆఖరికి ఫోన్లలో మాట్లాడిన ఈ ఉదయంపూట సంభవించిన భూ ప్రకంపనల గురించే చర్చించుకుంటున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంతో పాటు కాటారం రెవెన్యూ డివిజన్ లోని కాటారం , మల్హార్ రావు, మహముత్తారం, మహదేవపూర్, పలిమెల మండలాల్లో నాలుగు సెకండ్ల పాటు కంపించిన భూమి.. ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. అయితే..ఇది చర్చ వరకే పరిమితం కాలేదు. ‘‘మళ్లీ భూకంపం వస్తోందంటూ..’’ సోషల్ మీడియాలో ఓ వాయిస్ మెసేజ్.. వాట్సాప్ గ్రూపులలో చక్కర్లు కొడుతోంది. దీంతో జనం హడలిపోతున్నారు. ఇళ్లలోకి వెళ్లకుండా రోడ్లపై కూర్చుని.. భూకంపం గురించే చర్చించుకుంటున్నారు. అయితే ఈ ప్రచారాన్ని ఖండించిన పోలీసులు.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు. అలాగే తప్పుడు ప్రచారాలు చేసేవాళ్లపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు.ఇదిలా ఉంటే.. జిల్లా వ్యాప్తంగా ఉదయం భూమి స్వల్పంగా కంపించడంతో ప్రజలు వణికిపోయారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంతో పాటు చిట్యాల మండలం కైలాపూర్ గ్రామంలో భూకంప తీవ్రత దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డు అయ్యాయి. అలాగే.. రంగాపురం గ్రామంలోని ఓ ఇంటి పెంకులు ఊడిపడిపోవడంతో.. ఆ ఊరి ప్రజలు ఆ ఇంటి వద్ద గుమిగూడారు. తమ ప్రాంతాల్లో ఏళ్ల తరబడి ఇలాంటి ఘటనలు చూడలేదని కొందరు వృద్ధులు చెబుతున్నారు. అయితే ఈ ప్రాంతం సేఫ్ జోన్గానే ఉందని, స్వల్ప ప్రకంపనలకు భయపడనక్కర్లేదని, భారీ భూకంపాలు అసలు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే ఛాన్సే లేదని శాస్త్రవేత్తలు అంటున్నారు.అయితే.. గోదావరి పరివాహక ప్రాంతాల్లో భారీ భూకంపాల సంభవించే అవకాశాలపై.. అలాగే వీక్ జోన్ల పరిశీలనపై తమ అధ్యయనం కొనసాగుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.20 ఏళ్ల తర్వాత తెలుగు గడ్డపై భూకంపం!.. చిత్రాల కోసం క్లిక్ చేయండి -
‘ఈనాడు’ తప్పుడు రాతలు.. ఎంవీవీ సత్యనారాయణ సీరియస్
సాక్షి, విశాఖపట్నం: ‘ఈనాడు’ తప్పుడు కథనాలపై మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మండిపడ్డారు. తన కుటుంబాన్ని కిడ్నాప్ చేసి హేమంత్ అనే వ్యక్తి వేధించాడు. హేమంత్, తనకు సంబంధం ఉందంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనకు హేమంత్ ఎవరో తెలియదని స్పష్టం చేశారు.‘‘నా కుటుంబాన్ని కిడ్నాప్ చేసిన ఘటనపై మళ్లీ విచారణ జరపాలని కోరుతున్నా.. హేమంత్ సంతకం లేని ఒక ఉత్తరాన్ని బయటకు తెచ్చి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. హేమంత్కు ఖరీదైన కార్లు, బంగాళాలు ఇస్తే అవి ఎక్కడ ఉన్నాయో చూపించాలి. ‘‘నేను, నా వియ్యంకుడు 12 స్థలాలు హేమంత్కు గిఫ్ట్ ఇచ్చినట్లు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. నిరాధార ఆరోపణలతో నన్ను మానసికంగా వేధిస్తున్నారు. నా పై చేసిన ఆరోపణలు నిరూపించాలి’’ అంటూ ఎంవీవీ సత్యనారాయణ సవాల్ విసిరారు. -
గౌరవాన్ని ఇచ్చిన పార్టీని మేమేందుకు వదిలేస్తాం
-
‘రాజీనామా గోప్యత’ కథనంపై భూమన అభినయ్ సీరియస్
తిరుపతి, సాక్షి: మున్సిపల్ కార్పొరేషన్కు తన రాజీనామా విషయంలో తప్పుడు కథనాలు ప్రచురితం కావడంపై వైఎస్సార్సీపీ తిరుపతి నియోజకవర్గ ఇంఛార్జి భూమన అభినయ్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. అందులో ఎలాంటి గోప్యతా లేదని.. తాను రాజీనామా ఎప్పుడు చేశానో, దానికి ఎప్పుడు ఆమోదం లభించిందో.. తదితర విషయాల్ని ఆయన మీడియాకు వివరించారు. ‘‘తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్, అలాగే నేను ప్రాతినిథ్యం వహించిన నాల్గో డివిజన్ కార్పొరేషన్ పదవికి నేను ఎప్పుడో రాజీనామా చేశాను. తిరుపతి వైఎస్సార్సీపీ అసెంబ్లీ అభ్యర్థిగా నా పేరు ఖరారైన వెంటనే, నైతిక విలువలకు ప్రాధాన్యం ఇచ్చే నాయకుడిగా ఆ పదవుల్ని వద్దనుకున్నా. నా రాజీనామాను మేయర్ డాక్టర్ శిరీష గారితో పాటు మున్సిపల్ శాఖ అధికారులు కూడా ఆమోదం తెలిపారు. .. నేను పదవులకు రాజీనామా చేసిన విషయం ఎన్నికలకు ముందు అన్ని పత్రికల్లో వచ్చింది. తాజాగా ఒక పత్రికలో నా రాజీనామాల విషయాన్ని గోప్యంగా వుంచానని రాయడం ఆశ్చర్యం అనిపించింది. .. నా రాజీనామా లేఖను బయట పెట్టొద్దని ఒత్తిడి చేసానని రాయడం వారి ఆలోచనల సంకుచితాన్ని బయట పెడుతున్నదే తప్ప, అందులో నిజం లేదని అందరికీ తెలుసు. పచ్చకామెర్లోళ్లకి లోకమంతా అట్లే కనిపిస్తుందని పెద్దలన్నట్టుగా, రాజీనామాపై గోప్యత పాటించడం వెనుక అనుమానాలున్నాయని రాయడాన్ని ఆ కోణంలోనే చూడాల్సి వుంటుంది. .. ప్రజాతీర్పు నాకు వ్యతిరేకంగా వచ్చినప్పటికీ హుందాగా స్వీకరించాను. ప్రజాతీర్పును గౌరవించి కొత్తగా ఎన్నికైన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు గారికి నేను శుభాకాంక్షలు కూడా తెలియజేశాను. .. డిప్యూటీ మేయర్ పదవి కోసం కక్కుర్తి పడే స్వభావం నాది కాదని మరోసారి చెబుతున్నాను. తిరుపతిలాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో పుట్టడం, ఈ నగరానికి డిప్యూటీ మేయర్గా రెండేళ్ల పాటు సేవ చేయడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అంతే తప్ప, దాన్ని అలంకారంగా నేనెప్పుడూ వాడుకోలేదు. రాబోయే రోజుల్లో ప్రతిపక్ష నాయకుడిగా తిరుపతి ప్రజాసమస్యలపై పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నా రాజీనామాపై నిజానిజాలు చెప్పడానికే ఈ వివరణ’’ అని భూమన అభినయ్ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. ఆంధ్రజ్యోతి పత్రికలో తాజాగా డిప్యూటీ మేయర్, కార్పొరేటర్ పదవులకు అభినయ్ రాజీనామా అంటూ తాజాగా కథనం వచ్చింది. పోలింగ్కు 40 రోజుల ముందే రాజీనామా లేఖ సమర్పించారని తెలిసింది. అయితే మున్సిపల్ యంత్రాంగం ఈ విషయం చాలా గోప్యంగా ఉంచిందని అందులో పేర్కొంది. టీడీపీ ఎంపీగారి బస్సులా.. అయితే ఓకే! -
ఐఫోన్ అప్డేట్ కూడా తెలియదా..పరువు పోగొట్టుకున్న లోకేష్
-
టోటల్ డర్టీ పాలిటిక్స్!
సాక్షి, పుట్టపర్తి: అధికారం కోసం ‘తమ్ముళ్లు’ నానా తంటాలు పడుతున్నారు. అధినేత ఆదేశాల మేరకే తప్పుదోవ పడుతున్నారు. ఎల్లో మీడియాను అడ్డు పెట్టుకుని టీడీపీ కార్యకర్తలు అసత్య కథనాలను ప్రచారం చేస్తున్నారు. రోజురోజుకూ టీడీపీని వీడుతున్న వారి సంఖ్య పెరుగుతున్న క్రమంలో దిక్కుతోచని స్థితిలో టీడీపీ నేతలు అసత్య వార్తలను ఎల్లో మీడియా ద్వారా జనాల్లోకి తీసుకెళ్తున్నారు. టీడీపీలో ఉన్న వారికే కండువాలు వేసి ఫొటోలకు ఫోజులు ఇచ్చి.. కొత్తగా పార్టీలో చేరినట్లు వార్తలు రాయిస్తున్నారు. ఒకరిద్దరికి కండువాలు వేసి వందల కుటుంబాలు వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలో చేరినట్లు ఉత్తుత్తి ప్రచారం చేస్తున్నారు. శ్రీసత్యసాయి జిల్లాలో ఇటీవల పుట్టపర్తి, రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాల్లో ఇలాంటి ఘటనలు వెలుగు చూశాయి. అయితే వాస్తవాలు తెలుసుకున్న ప్రజలు, చివరకు టీడీపీ కార్యకర్తలు కూడా నేతల తీరుపై మండిపడుతున్నారు. పార్టీ క్రెడిబులిటీ పోతుందని వాపోతున్నారు. ఓటర్లను మభ్య పెట్టేందుకే.. టీడీపీ గ్రాఫ్ రోజురోజుకూ పడిపోతోంది. పార్టీ వీ డుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. ధర్మవరంలో వార్డుల వారీగా ఆ పార్టీ ఖాళీ అవుతోంది. పరిటాల ఇలాకాలోని గ్రామాల్లో సైతం వైఎస్సార్సీపీలోకి వె ల్లువలా చేరుతున్నారు. ఈ నేపథ్యంలో ఉన్న వారిని కాపాడుకునే క్రమంలో టీడీపీ నేతలు వాళ్లకే మళ్లీ మళ్లీ కండువాలు వేసి పార్టీలో చేరినట్లు ప్రకటిస్తున్నారు. వైఎస్సార్సీపీని ఎదుర్కొనే సత్తా లేకే.. శ్రీసత్యసాయి జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ హవా కొనసాగుతోంది. వైఎస్సార్సీపీ అభ్యర్థుల ప్రచారానికి అనూహ్య స్పందన వస్తోంది. ప్రజాదరణను చూసి ఓర్వలేని టీడీపీ నేతలు తప్పుడు ప్రచారాలకు పూనుకున్నారు. అందుకు ఎల్లో, సోషల్ మీడియాలను ఉపయోగించుకుంటున్నారు. ఫలితంగా ప్రజల్లో మరింత చులకన అవుతున్నారు. -
‘మాతో సమ్మె చేయించాలన్న ఎల్లోమీడియా పాచిక పారదు’
విడపనకల్లు/రాయదుర్గం/దేవరాపల్లి/కొయ్యలగూడెం/వలివేరు: తాము సమ్మెలోకి వెళ్తున్నామంటూ తప్పుడు రాతలు రాసిన ఎల్లో మీడియాపై వలంటీర్లు కన్నెర్ర చేశారు. తప్పుడు వార్తలు రాయవద్దని హెచ్చరిస్తూ గురువారం రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలను దహనం చేశారు. తమతో సమ్మె చేయించాలన్న ఎల్లోమీడియా కుట్రలు సాగవని చెప్పారు. తాము ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాటకు కట్టుబడి పనిచేస్తామని స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం గడేకల్లులో అవాస్తవ కథనాలు రాసిన ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలను తగులబెట్టారు. ఈ సందర్భంగా వలంటీర్ల సంఘం మండల అధ్యక్షుడు హేమంత్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు నేరుగా ప్రజల ఇంటివద్దకే చేరేవిధంగా సీఎం జగన్మోహన్రెడ్డి వలంటీర్ల వ్యవస్థను ప్రవేశ పెట్టారని చెప్పారు. సీఎం ఏ ఉద్దేశంతో అయితే ఈ వ్యవస్థను ప్రవేశపెట్టారో.. తామంతా అందుకు అనుగుణంగానే ప్రభుత్వానికి విధేయులుగా పనిచేస్తున్నామని తెలిపారు. కానీ ఎల్లోమీడియా తమకు లేనిపోనివి ఆపాదించి కథనాలు ప్రచురిస్తూ ప్రజల్లో పత్రికలకున్న విలువను పోగొట్టుకుంటున్నాయని చెప్పారు. రాయదుర్గంలో వలంటీర్ల సంఘం నాయకులు జబివుల్లా, సునీల్, వంశీ, ప్రవీణ్, జునీయాద్బాష తదితరులు మీడియాతో మాట్లాడుతూ వలంటీర్లు సమ్మె చేస్తారంటూ ఎల్లోమీడియా తప్పుడు ప్రచారం చేయడం తగదన్నారు. తమను వేగులని, సంఘవిద్రోహ శక్తులని గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు పవన్కళ్యాణ్ అన్నారని, ఆ వ్యాఖ్యల్ని ఈ పచ్చపత్రికలు పతాక శీర్షికలతో ప్రచురించాయని గుర్తుచేశారు. గతంలో తమపై అంతలా విషం చిమ్మిన పత్రికలు ఇప్పుడు కొందరితోనైనా సమ్మె చేయించాలని ప్రయత్నిస్తున్నాయన్నారు. కానీ ఆరునూరైనా వారి పాచిక పారదని చెప్పారు. తప్పుడు రాతలు మానుకోవాలంటూ నినాదాలు వలంటీర్లు సమ్మెకు సిద్ధమవుతున్నారంటూ అసత్య కథనాలు ప్రచురించిన ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలపై అనకాపల్లి జిల్లా దేవరాపల్లి గ్రామ సచివాలయం–1, 2 పరిధిలోని వలంటీర్లు నిరసన తెలిపారు. సేవాభావంతో పనిచేస్తున్న తమపై విషప్రచారం చేయడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. మరోసారి తప్పుడు రాతలు ప్రచురిస్తే గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. మండల కేంద్రం దేవరాపల్లిలో ఈనాడు పత్రికలు చేతపట్టి పచ్చమీడియాకు వ్యతిరేకంగా ‘ఈనాడు డౌన్డౌన్, తప్పుడు రాతలు మానుకోవాలి’ అంటూ నినాదాలు చేశారు. దేవరాపల్లి ప్రధాన రోడ్డులో పచ్చ పత్రికలను దహనం చేశారు. వలంటీర్ల వ్యవస్థకు రూపకల్పనచేసి తమకు సేవచేసే భాగ్యాన్ని కల్పించిన సీఎం జగన్ అంటే తమకెంతో గౌరవభావం ఉందని, ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తెస్తామని దేముళ్లు, పోతురాజు, జోష్, ఉమ, దేవి, రాజు, ఎర్రినాయుడు స్పష్టం చేశారు. సమ్మె చేయం బాపట్ల జిల్లా చుండూరు మండలం వలివేరు గ్రామ సచివాలయం వద్ద గురువారం వలంటీర్లు ఈనాడు పత్రిక ప్రతులను దహనం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము సమ్మె చేయకుండా చేస్తున్నారని ఈనాడు పేపరులో రాయడం దారుణంగా ఉందని చెప్పారు. ప్రజలకు సేవచేసేందుకే గ్రామ సచివాలయ, వలంటీర్ల వ్యవస్థలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చారని గుర్తుచేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎప్పుడూ సమ్మె చేయబోమని వలంటీర్లు స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా పచ్చ పత్రికలు పచ్చ పత్రికలైన ఈనాడు, ఆంధ్రజ్యోతి ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా మారాయని, మీడియా వ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్నాయని ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం బయ్యనగూడెం గ్రామ సచివాలయం వద్ద వలంటీర్లు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. వలంటీర్ల అసోసియేషన్ నాయకుడు జొన్నకూటి పట్టియ్య ఆధ్వర్యంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి డైలీ పేపర్లతో దిష్టిబొమ్మను తయారుచేసి దహనం చేశారు. తాము విధులకు హాజరై బాధ్యతలను నిర్వర్తిస్తున్నప్పటికీ ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు అసత్య కథనాలతో తమపై బురద చల్లుతున్నాయని మండిపడ్డారు. వలంటీర్ల వ్యవస్థను దేశమంతా కొనియాడుతుంటే అంపశయ్యపై ఉన్న తెలుగుదేశం, దాని తోకపార్టీ జనసేనను అధికారంలోకి తీసుకురావడానికి రామోజీ, రాధాకృష్ణ వెంపర్లాడుతున్నారని దుయ్యబట్టారు. వలంటీర్ల ఐక్యత వర్థిల్లాలని, పచ్చ పత్రికల నీతిమాలిన రాతలు మానుకోవాలని నినాదాలు చేశారు. -
బానిసగా మారిన గురువు
పాడిందే పాడరా.. పాచిపళ్ల దాసుడా అని ఒక నానుడి ఉంది. ప్రస్తుతం సరిగ్గా ఈనాడు మీడియాకు అది వర్తిస్తుంది. రాసిందే, రాసి, చూపిందే చూపి ఈనాడు మీడియా వారి పాఠకులను, ప్రేక్షకులను నానా విధాలుగా హింసిస్తోంది. ఈనాడు రామోజీరావు దశకంఠుడుగా అంటే రావణాసురుడిగా మారి ఆంధ్రప్రదేశ్ ప్రజలను చెరబట్టాలని తీవ్రంగా యత్నిస్తున్నారు. ఏపీ అప్పులపై అనునిత్యం వార్తలు రాసి ప్రజలకు బోరు కొట్టిస్తున్నారు. పదే, పదే ఒక వార్తను ప్రచారం చేస్తే జనం నమ్మక చస్తారా అన్నది అభినవ గోబెల్స్ గా మారిన రామోజీరావు నమ్మకం. ✍️టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఒకప్పుడు ఆయన గురువుగా ఉండేవారు. ఇప్పుడు ఆయన బానిస పాత్రకు మారినట్లు అనిపిస్తుంది. అందుకే టీడీపీ కరపత్రం కన్నా హీనంగా ఈనాడు పత్రికను మార్చేశారు. ఈటివిని టీడీపీ యూట్యూబ్ ఛానల్ కన్నా అధ్వాన్నంగా మార్చారు. డిసెంబర్ 19వ తేదీన ఈనాడు దినపత్రికలో రాసిన బానర్ చూస్తే, ఛీ.. ఈనాడు ఇంతగా దిగజారిందేమిటా అనిపిస్తుంది. ఇప్పటికి ఈ నాలుగేళ్లలో ఒక వంద సార్లు ఈ వార్త రాసి ఉంటారు. అయినా వారికి తృప్తి కలగలేదు. ఎన్నికలలోగా ఇంకెన్ని సార్లు రాస్తారో! ముఖ్యమంత్రి జగన్ కారికేచర్ వేసి తొమ్మిది తలలు తగిలించి రుణకంఠుడు అని ఒక చెత్త కథనం వండారు. ✍️నిజానికి పది తలలు ఉన్న దశకంఠుడు రామోజీరావే. రావణాసురుడుగా మారింది ఆయనే. రోజూ ఒక పది పేజీలలో పచ్చి అబద్దాలు రాస్తూ జగన్ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నది రామోజీరావే. ఏ మాత్రం జర్నలిజం విలువలతో నిమిత్తం లేకుండా పత్రికలు కూడా వ్యభిచారం చేయవచ్చని ఈనాడు మీడియా నిరూపిస్తోంది. రాష్ట్ర విభజన నాటి ఉన్న అప్పులన్నీ జగన్ ప్రభుత్వం అప్పులన్నట్లుగా ప్రచారం చేస్తున్న ఈనాడు మీడియా, ఇంత అప్పులు ఉన్న నేపథ్యంలో చంద్రబాబు ఇస్తున్న భవిష్యత్తుకు గ్యారంటీ హామీలు ఆచరణ సాధ్యం కావని, అది ప్రజలను మోసంచేయడమేనని చెప్పగలదా? ✍️చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన ఆ వాగ్దానాలను అమలు చేయరని మాజీ ఐఎఎస్ జయప్రకాష్ నారాయణ చెప్పినదానితో ఈనాడు మీడియా ఏకీభవిస్తుందా? ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా మితి మీరి అప్పులు చేయాలని ఎవరూ చెప్పరు. కాని ఈనాడు రాసిన వైనం చూస్తే జగన్ ప్రభుత్వమే అప్పులు తీసుకువచ్చినట్లు, వాటిని ఎక్కడా ఉపయోగించకుండా వృధా చేశారన్న భావన కలిగించేట్లు దిక్కుమాలిన వార్తను వండింది. రాష్ట్రం అప్పులు సుమారు నాలుగున్నర లక్షల కోట్లు అని కేంద్రం ఎన్నిసార్లు పార్లమెంటులో చెప్పినా, వీరు మాత్రం వినిపించుకోరు. పది లక్షల కోట్లపైనే అప్పులని దుష్ప్రచారం చేస్తారు. పోనీ దానిని అయినా పద్దతిగా రాస్తారా అంటే అదీ ఉండదు. చంద్రబాబు ప్రభుత్వ టైమ్లో అప్పులు ఎన్ని ఉన్నాయన్నది రాయకుండా, మొత్తం అప్పు అంతా జగన్ ప్రభుత్వమే చేసినట్లు పిక్చర్ ఇస్తుంటారు. ఇంతకన్నా దుర్మార్గం ఏమైనా ఉంటుందా? ✍️చంద్రబాబు ప్రభుత్వం సుమారు రెండు లక్షలకు కోట్లకు పైగా అప్పు ఎందుకు తెచ్చిందో చెప్పమనండి. అప్పట్లో వివిధ కార్పొరేషన్ల ద్వారా ఎన్ని లక్షల కోట్ల అప్పు తీసుకున్నారో వివరించమనండి. ఆ డబ్బు దేనికి వాడారో ఎన్నడైనా రాశారా? ఊహూ.. వాటికి జోలికే వెళ్లరు. ఎంతసేపు జగన్ ప్రభుత్వంపైనే పడి ఏడుపు. పోనీ జగన్ ప్రభుత్వం ఏ, ఏ కార్యక్రమాలకు అప్పులు చేసిందో చెబుతారా?అంటే అదీ ఉండదు. చంద్రబాబు టైమ్లో సివిల్ సప్లైస్ కార్పొరేష్ ద్వారా అప్పులు తీసుకుని ఆ డబ్బును పసుపు-కుంకుమ, అన్నదాత సుఖీభవ అంటూ ఎన్నికల ముందు పంచిపెడితే అప్పుడు ఈనాడు, తదితర ఎల్లో మీడియా కు అందులో ఎంతో విజన్ కనిపించింది. జనం మాత్రం అది విజన్ కాదు.. వికృతం అని గమనించి టీడీపీ ప్రభుత్వానికి కర్రు కాల్చి వాతపెట్టారు. ✍️టీడీపీ హయాంలో 1.60 లక్షల కోట్ల మేర అసెంబ్లీ అనుమతి లేకుండా అప్పులు తీసుకున్నారు. చంద్రబాబు టైమ్లో అప్పుల శాతం 15 శాతం అయితే, జగన్ ప్రభుత్వం చేసిన అప్పుల శాతం 12.4 మాత్రమే. ఈ విషయాలన్నిటిని కప్పిపుచ్యుతూ ప్రభుత్వంపై బురద చల్లుతుంది. చంద్రబాబు పెట్టిన వేల కోట్ల బకాయిలను ఈ ప్రభుత్వం తీర్చవలసి వచ్చింది. చంద్రబాబు దిగిపోతూ వంద కోట్లే మిగిల్చారని అప్పట్లో ఈనాడు మీడియా రాయలేదా! అసలు జగన్ ముఖం చూసి అప్పులు ఎవరు ఇస్తారని యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానిస్తే ఆనందంగా ప్రచురించింది కూడా ఈ మీడియానే. ఈ సంగతిని పక్కనబెడితే రామోజీరావుకు ఒక సవాల్ విసరదలిచాను. ✍️రాష్ట్ర విభజన నాటి నుంచి ఉన్న అప్పులన్నీ జగన్ ప్రభుత్వానికి అంటగట్టి బదనాం చేయాలని అనుకుంటున్నారు కదా! వీరు రాసిన లెక్క ప్రకారం జగన్ ప్రభుత్వం ఇన్ని లక్షల కోట్లు అప్పు చేస్తే, ఒకవేళ చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ వస్తే ఆయన ఇచ్చిన హామీలకు ఎన్ని లక్షల కోట్ల వ్యయం అవుతుంది? ఆ డబ్బు ఎక్కడ నుంచి వస్తుంది. చంద్రబాబు కేవలం ప్రజలను మోసం చేయడానికే అంతటి భారీ వాగ్దానాలు ఇస్తున్నారని ఈనాడు రాయగలదా?. తెలుగుదేశం అధికారంలోకి రాలేదని తెలిసే, ఈనాడు మీడియా ఆ పార్టీని జాకీలు పెట్టి లేపడానికే ఇలాంటి చెత్త కథనాలు ఇస్తోంది. జగన్ ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలకు ఏడాదికి నలభైఐదు వేల కోట్లు వ్యయం చేస్తోంది. దీనికే ఇంత భారీగా అప్పులు అయ్యాయని రాశారు. మరి అలాంటప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్,లోకేష్ లు కలిసి ఇస్తున్న హామీలకు ఎన్ని లక్షల కోట్లు కావాలి? ✍️చంద్రబాబు ఇచ్చిన ఆరు హామీలకే ఏడాదికి లక్షన్నర కోట్లకు పైగానే నిధులు అవసరం అవుతాయి. వాటిని సమకూర్చుకోవడం అసాధ్యం కాబట్టి యథా ప్రకారం చంద్రబాబు మళ్లీ మోసం చేయడానికే ఈ హామీలన్ని ఇచ్చారని ఈనాడు రాస్తే అప్పుడు ఆ పత్రికను నమ్మవచ్చు. లేకుంటే టీడీపీకి అమ్ముడు పోయి ఇలాంటి దారుణమైన నీచ కథనాలను ఇస్తోందని ప్రజలు అనుకోరా! ఒకపక్క ఆయా స్కీములలో కోత పెడుతున్నారని రాసేది వీరే. వాటికి నిధులు తెచ్చి అమలు చేస్తుంటే, అప్పులు చేస్తున్నారని తప్పుడు ప్రచారం చేసేది వీరే. ✍️అదే చంద్రబాబు టైమ్లో బాండ్ల ద్వారా అప్పులు తీసుకున్నా, ఆహా.. చంద్రబాబు కాబట్టి అప్పులు వచ్చాయని భాజా వాయించారు. ఈనాడు మీడియాకు ఏపీ ప్రజలపై ఎలాంటి మమకారం లేదు. చిత్తశుద్ది అసలే లేదు. వారిది వ్యాపార, రాజకీయ ప్రయోజనమే. రామోజీ ఎప్పుడో ఏపీతో సంబంధం వదలుకున్నారన్నది వాస్తవం. చంద్రబాబు కోసం ఆయన ఏపీ ప్రజలను చెరబట్టాలని చూస్తున్నారు. పోనీ ఆయన అంత నిపుణుడైతే తన గ్రూపు సంస్థలు ఎందుకు నష్టాలు పాలవుతున్నాయి?. మార్గదర్శి వ్యవహారంలో అప్పులు తీర్చడానికి ఆయన తన టివీ చానళ్లను ఎందుకు అమ్ముకున్నారు?. న్యూస్ టైమ్, సోమా తదితర కంపెనీలను ఎందుకు మూసివేశారు? ✍️మార్గదర్శిలో ఎందుకు అక్రమాలకు పాల్పడుతున్నారన్న అభియోగాలను ఎదుర్కుంటున్నారు? అందులో నల్లధనం తిప్పుతున్నారన్న విమర్శలకు ఎందుకు గురి అవుతున్నారు?. మార్గదర్శి చిట్స్ సంస్థ లెక్కలను పారదర్శకంగా ఎందుకు చూపించడం లేదు? ఈయనేమో తన సంస్థల కోసం ఎంత అప్పు అయినా డిపాజిట్ల రూపంలో తీసుకోవచ్చు. ప్రభుత్వం మాత్రం నిర్ణీత నిబంధనల ప్రకారం అప్పులు చేస్తే మాత్రం చండాలపు స్టోరీలు రాస్తుంటారు. ఎన్నికలు మరో నాలుగు నెలల్లో జరగబోతున్నాయి. అంతవరకు ఈనాడు మీడియా అరాచకపు దాడిని జగన్ ఎదుర్కోవలసిందే. -కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
‘ఈనాడు’ రోత రాతలు.. రామోజీ ఇక మారవా?
ఒకప్పుడు ఆత్మహత్యలను ప్రోత్సహించేలా వార్తలు ఇవ్వాలంటే సంపాదకులు ఒప్పుకునేవారు కారు. కాని ఇప్పుడు తమకు గిట్టని ప్రభుత్వం ఉందని ఉగ్రవాద మీడియాగా మారిన ఈనాడు ఎంత నీచానికి అయినా పాల్పడుతోంది. ఏపీ ప్రజలపై రోజూ కక్ష కట్టి ఇలాంటి దారుణమైన వార్తలను ఇవ్వడానికి సిగ్గుపడడం లేదు. తమ అంతేవాసి అయిన చంద్రబాబు నాయుడును మళ్లీ పఠం ఎక్కించాలన్న తాపత్రయంలో ఉచ్చనీచాలు మరిచి రాస్తోంది. టీవీలో ప్రచారం చేస్తోంది. రోజుకో నిరుద్యోగి ఆత్మహత్య అంటూ కొద్ది రోజుల క్రితంం ఇచ్చిన వార్త చదివితే కడుపు మండుతుంది. ✍️ఏపీ ప్రజల మీద ఇంతలా ఈనాడు రామోజీరావు పగ పట్టాలా అన్న ఆవేదన కలుగుతుంది. ఎల్లో మీడియాగా, ఎల్లో జర్నలిజంగా వస్తున్న విమర్శలను ఆయన సార్ధకం చేసుకుంటున్నారు. నిజానికి కేంద్రం ఇచ్చిన లెక్కల ప్రకారం ఏపీలో నిరుద్యోగుల సంఖ్య తగ్గుతోంది. చంద్రబాబు పాలన టైమ్లో ప్రతి వెయ్యి మందికి నలభై ఐదు మంది నిరుద్యోగులు ఉంటే, వైఎస్ జగన్ పాలనలో అది 33కి తగ్గింది. ఈ వార్త రావడంతోనే ఈనాడు మీడియాకు కడుపు ఉబ్బి పోయింది. ఎలా దీనిని చెడగొట్టాలని ఆలోచించింది. వెంటనే ఓ కథ అల్లేసింది. ✍️దేశ వ్యాప్తంగా జరిగిన ఆత్మహత్యలపై కేంద్రం ఏదో నివేదిక ఇచ్చిందంటూ దాని ప్రకారం 364 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారని అంటే ప్రతి రోజూ ఒక నిరుద్యోగి ఇలా చనిపోయారని అంటూ రాసేసింది. అంతేకాదు. పరిశ్రమలు తరిమేస్తున్నారట. అమరావతిని వదలివేశారట. ఇలా ఏవేవో అసత్యాలతో అతి దారుణమైన కథనాన్ని వండి వార్చారు. ప్రభుత్వపరంగా వైఎస్ జగన్ వచ్చాక ఇచ్చిన ఉద్యోగాలు దేశ చరిత్రలోనే ఒక రికార్డు. ఒకేసారి లక్షాపాతికవేల ప్రభుత్వ ఉద్యోగాలను సృష్టించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించిన ఘనత ఒక్క జగన్ దే. ✍️దమ్ముంటే ఈనాడు మీడియా చంద్రబాబు పద్నాలుగేళ్ల పాలన టైమ్లో కాని, అంతకుముందు ఎన్.టి.ఆర్.పాలించిన ఏడేళ్ల టైమ్ లో కాని ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో లెక్కలు ఇవ్వాలి. గత టరమ్లో చంద్రబాబు టైమ్ లో ఇచ్చిన ఉద్యోగాలు అన్నీ కలిపి ఏభై వేలు లేకపోయినా, ఆయన నిరుద్యోగ సమస్యను తీర్చేశారని ఈనాడు రామోజీరావు బిల్డప్ ఇచ్చేస్తున్నారు. అసలు చంద్రబాబు ప్రభుత్వ ఉద్యోగాలకు వ్యతిరేకం అన్న సంగతి తెలిసిందే. ✍️ఆయన హయాంలోనే ఏభైనాలుగు కార్పొరేషన్లను మూసివేశారు. వాటిలో పనిచేసే ఉద్యోగులకు వీఆర్ఎస్ ఇచ్చి పంపించేశారు. ఆ సంగతి జనం మర్చిపోతారన్నది వారి నమ్మకం. జగన్ టైమ్ లో వివిధ రకాల ఉద్యోగాలు అన్నీ కలిపి రెండు లక్షలకు పైగా ఇచ్చినా అసలేమీ ఇవ్వలేదన్నట్లు పచ్చి అబద్దపు వార్తలను సృష్టిస్తున్నారు.ఇక వలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసి వారికి నెలకు ఐదువేల రూపాయల చొప్పున ఇస్తున్నది కూడా జగన్ ప్రభుత్వమే. తద్వారా ఎవరైనా ఇంకా ఉద్యోగం రాని వారికి ఒకపక్క ప్రజలకు సేవ చేస్తూ ,మరో వైపు ఇది భృతిగా ఉపయోగపడుతోంది. ఇలా సుమారు ఇంకో రెండున్నర లక్షల మందికి మేలు కలుగుతోంది. ✍️చంద్రబాబు నాయుడు టీడీపీ మానిఫెస్టోలో నిరుద్యోగులకు నెలకు రెండువేల రూపాయల చొప్పున భృతి ఇస్తానని నాలుగున్నరేళ్లపాటు ఇవ్వకుండా మోసం చేసినా, రామోజీరావు, వారి సంపాదక బృందానికి, విలేకరులకు కనిపించనే కనిపించదు. వారు అప్పుడు కళ్లు మూసేసుకున్నారు. ఈ మధ్య కేటీఆర్ ఎన్నికలకు ముందు నిరుద్యోగ యువత కొందరితో భేటీ అయ్యారు. ఆంధ్రలో రెండుసార్లు గ్రూప్ నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేస్తే తెలంగాణలో మాత్రం ఒక్కటి కూడా చేయలేదని ఒక యువతి చెప్పినప్పుడు దానిని ఆయన అంగీకరించిన సంగతి ఈనాడుకు వినిపించి ఉండదు. ఆరోగ్య శాఖలో సుమారు నలభై వేల పోస్టులు భర్తీ చేస్తున్న సంగతి వీరికి పట్టదు. ✍️ఎస్.ఐ.తదితర పోలీసు ఉద్యోగాలను ఎంపికలు జరుగుతున్న సంగతి హైకోర్టు సాక్షిగానే తెలిసింది కదా! అయినా రోజుకో నిరుద్యోగి ఆత్మహత్య చేసుకుంటున్నారంటూ ఈనాడు నీచంగా రాస్తూ యువత పట్ల పాపం చేస్తోంది. ఈ మధ్యనే ఒక యువకుడు సోషల్ మీడియాలో ఒక వ్యాఖ్య చేశారు. రామాయపట్నం పోర్టు నిర్మాణం తలపెట్టడం ద్వారా తనకు ఉద్యోగం వచ్చిందని, అందుకు ముఖ్యమంత్రి జగన్కు ధాంక్స్ అని పేర్కొన్నాడు. అక్కడ సుమారు రెండుఉవేల మందికి ఉపాధి అవకాశాలు వచ్చాయి. అలా మరో మూడు పోర్టుల నిర్మాణం జరుగుతోంది. విశాఖలో అనేక పరిశ్రమలు వస్తుంటే, ఐటి కంపెనీలు వస్తుంటే ఈనాడు కళ్లల్లో నిప్పులు పోసుకుంటోంది. ✍️అక్కడ వాటిని ఎలా పాడు చేయాలా? వారు రాకుండా ఎలా భయపెట్టాలా అని చంఢాలపు కథనాలు ఇస్తోంది. కేవలం ఉద్యోగం రాలేదని ఆత్మహత్య చేసుకునేవారు చాలా తక్కువ ఉంటారు. వారి ఆత్మహత్యలకు వేరే కారణాలు ఉండవచ్చు. ఇలాంటి ఘటనలను ఒక్కొక్కటి పరిశీలించి రాస్తే ఫర్వాలేదు. కాని గంపగుత్తగా ప్రభుత్వం మీద బురద చల్లే లక్ష్యంతో ఇష్టారీతిన రాసేస్తూ, పైగా తమకు స్వేచ్చ లేదని తప్పుడు ప్రచారం చేస్తోంది. గత కొద్ది నెలల్లోనే సుమారు అరవైవేల కోట్ల విలువైన పెట్టుబడులతో పరిశ్రమలు ఏర్పాటైతే వాటి గురించి ఒక్క ముక్క రాయని ఈనాడు, ఇలాంటి అబద్దాలను ప్రజలపై రుద్ది వారి మనసులను కలుషితం చేయాలని విశ్వయత్నం చేస్తోంది. అందుకే ఈనాడు మీడియా ఉగ్రవాద సంస్థ మాదిరే తయారైందన్న వాదనలో వాస్తవం ఉందనిపిస్తుంది. ✍️దేశవ్యాప్తంగా 15783 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారని, అందులో 2.3 శాతం ఎపివారని, వైకాపా పాలన రికార్డు అని రాసింది. బీహారు, బెంగాల్ లో నిరుద్యోగుల ఆత్మహత్యలు తక్కువని లెక్కలు చెబుతున్నాయట.ఆత్మహత్యలు తక్కువ ఉంటే నిరుద్యోగం లేనట్లేనా? ఆ రాష్ట్రాల యువత పెద్ద సంఖ్యలో తెలంగాణ, ఏపీలోని వివిధ పట్టణాలలో చిన్న, చిన్న పనులు చేసుకుని ఎందుకు బతుకుతోంది. తెలంగాణలో ఆత్మహత్యల పరిస్థితి, నిరుద్యోగ శాతం ఎంత పెరిగిందో కూడా కేంద్ర నివేదికలలో ఉంటుంది కదా! దాని గురించి ఎందుకు రాయలేదు? కేసీఆర్ ప్రభుత్వం ఓడిపోవడానికి నిరుద్యోగ సమస్య కూడా ఒక కారణం కాదా?. టీపీపీఎస్సీ లో జరిగిన గందరగోళం గురించి ఎన్నడైనా ఈ పత్రిక ధైర్యంగా కేసీఆర్ను విమర్శిస్తూ వార్తలు ఇచ్చిందా? ✍️ఏపీలో అసలు ఉద్యోగాలే లేనట్లు, పరిశ్రమలే రానట్లు ఈనాడు గుడ్డిగా రాసినంత మాత్రాన ప్రజలంతా గుడ్డివాళ్లుగా ఉండరు. పుంగనూరులో నాలుగువేల కోట్లతో విద్యుత్ బస్ ల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు రంగం సిద్దం అవుతుంటే దానిని చెడగొట్టడానికి ఈనాడు ఎంతలా ప్రయత్నిస్తోంది కనిపించలేదా? అక్కడ కొద్ది మంది రైతులు తమ భూములు ఇవ్వబోమని చెబుతున్నారట. అయినా ప్రభుత్వం వారినుంచి స్వాధీనం చేసుకుంటోందని ఇదే పత్రిక రాసింది. ✍️పరిశ్రమలు వస్తుంటే వాటిని ఎలా రాకుండా చేయాలా అని భూములు ఇవ్వకుండా ప్రజలను రెచ్చగొట్టాలని ఒక వైపు, పరిశ్రమలు రావడం లేదని మరో వైపు ప్రచారం చేస్తూ ఈనాడు నికృష్టమైన రీతిలో వ్యవహరిస్తోంది. డిసెంబర్ ఆరో తేదీ ఈనాడు మొదటి పేజీ చూస్తే ఆ పత్రిక ఎంత రోతగా తయారైంది అర్ధం అవుతుంది. పోలవరం ప్రాజెక్టుకు 31 వేల కోట్ల రూపాయల అంచనాకు కేంద్రం ఒకే చేస్తే దాని గురించి రాయకుండా, ఎవరో అధికారి ఏదో అన్నారని పెద్ద అక్షరాలతో ఎల్లో మీడియా రాస్తుంది. నిత్యం ఈనాడుది ఇదే రొద, ఇదే సొద. వీటన్నిటికి ప్రభుత్వం సిద్దపడాల్సిందే. ఎందుకంటే నిజంగానే ఈనాడు తదితర ఎల్లో మీడియా వారు దుష్టులుగా మాత్రమే కాదు.. ఏపీ ప్రజలకు శత్రువులుగా మారారు కనుక. -కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ ఇదీ చదవండి: దిగజారుడు అబద్ధాన్ని జనం నమ్ముతారనేనా! -
అక్కడకంటే.. ఇక్కడే తక్కువ
సాక్షి, అమరావతి: తెలంగాణతో పోల్చుతూ ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ చార్జీలు ఎక్కువగా ఉన్నాయని నమ్మించబోయిన ‘ఈనాడు’ అడ్డంగా దొరికిపోయింది. మన రాష్ట్రంలో స్పినింగ్ మిల్లులకు తెలంగాణకంటే తక్కువకు విద్యుత్ సరఫరా చేస్తున్నా, అక్కడే తక్కువంటూ ఓ తఫ్పుడు కథనం ఇచ్చింది. ‘చిక్కుల్లో దారం.. సర్కారు చోద్యం’ శీర్షికన సోమవారం ఈనాడు ప్రచురించిన కథనం పచ్చి అబద్దమని సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీసీపీడీసీఎల్) సీఎండీ జె. పద్మాజనార్ధనరెడ్డి చెప్పారు. ‘స్పిన్నింగ్ మిల్లులకు గతంలో యూనిట్ రేటు రూ.5.85 పైసలు ఉండేది. ఇప్పుడూ అదే రేటు వసూలు చేస్తున్నాం. యూనిట్కి రూ.8.35 వసూలు చేస్తున్నారని ఈనాడు రాసింది పూర్తిగా అవాస్తవం. ఇది ఈనాడు పత్రిక అవగాహన లేమికి నిదర్శనం. ఇలాంటి అసత్య కథనాలు విద్యుత్ సంస్థలు, పారిశ్రామిక వినియోగదారుల మధ్య సత్సంబంధాలను దెబ్బతీస్తాయి. నిజానికి రాష్ట్రంలో యూనిట్ రేటు రూ.5.85 పైసలు ఉండగా తెలంగాణలో యూనిట్కు రూ.7.15 పైసలు వసూలు చేస్తున్నారు. ఇది తెలంగాణకంటే తక్కువకు సరఫరా చేస్తున్నట్లా? ఎక్కువకా? ఇలా తప్పుడు కథనాలతో ప్రజలను ఎందుకు తప్పుదోవ పట్టిస్తున్నారు? కేవలం స్పిన్నింగ్ మిల్లులకు ఊతమివ్వాలనే ఉద్దేశంతో ఆ పరిశ్రమలపై ఏమాత్రం భారం లేకుండా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రూ.5.85 పైసలు మాత్రమే వసూలు చేస్తోంది. అలాగే విద్యుత్ సర్దుబాటు చార్జీలు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి నిబంధనలు, ఆదేశాల మేరకు వసూలు చేస్తాము. స్పిన్నింగ్ మిల్లులు మూతపడటానికి విద్యుత్ చార్జీల భారమే కారణమనడం కూడా సత్యదూరం. వాస్తవానికి ముడిసరుకు అందుబాటులో లేకపోవడం, మార్కెట్ దెబ్బతినడం, ఇతర దేశాల్లో యుద్ధ, అనిశ్చితి పరిస్థితులు, ఆర్ధిక ఇబ్బందులు వంటి కారణాలు స్పిన్నింగ్ పరిశ్రమల మనుగడపై ప్రభావం చూపి ఉండవచ్చు. దీనికి కరెంటు బిల్లులను ముడిపెట్టి రామోజీ తన పత్రికలో అర్ధం లేని కథనం ప్రచురించారు’ అని ఆయన తెలిపారు. -
అవసరం లేకపోయినా ఎత్తిపోయాలా!?
సాక్షి, అమరావతి: పట్టువదలని వక్రమార్కుడు (రామోజీ) ఎప్పటిలాగే మళ్లీ తన అభూత కల్పనలతో ఓ సత్యదూరమైన కథనాన్ని అల్లారు. ఈసారి ఆయన రాతల గాలి పట్టిసీమ గోదావరి జలాలపై మళ్లింది. ‘పట్టిసీమ నీరూ తేలేరా’ అంటూ శనివారం ‘ఈనాడు’లో పాఠకుల మీద తన పైత్యాన్ని రుద్దిన తీరుచూస్తే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై నిత్యం బురదజల్లడానికే ఈ తప్పుడు రాతలు అని మరోసారి తన మనస్సులో మాటను చెప్పకనే చెప్పుకున్నారు. నిజానికి.. పులిచింతల, పట్టిసీమ ఎత్తిపోతల జలాలను ప్రణాళికాబద్ధంగా వినియోగించుకుంటూ కృష్ణా డెల్టా చివరి ఆయకట్టుకూ రాష్ట్ర ప్రభుత్వం నీళ్లందిస్తుంటే.. పది లక్షల ఎకరాల్లో పంటలు సాగుచేసిన రైతుల కళ్లలో ఆనందాన్ని చూసి ఓర్చుకోలేని రామోజీ.. తన కథనంలోని ప్రతి అక్షరంలో జగన్పై అక్కసు వెళ్లగక్కారు తప్ప అందులో వీసమెత్తు నిజంలేదు. అప్పట్లో ఏనాడైనా సకాలంలో నీళ్లిచ్చారా? అసలు టీడీపీ సర్కార్ అధికారంలో ఉన్న ఆ ఐదేళ్లలో ఏనాడూ కృష్ణా డెల్టాకు సకాలంలో నీళ్లందించిన దాఖలాల్లేవు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక 2019 నుంచి ఏటా జూన్ మొదటి వారంలోనే నీళ్లందిస్తున్నారు. ఈ ఏడాది జూన్ 7న కృష్ణా డెల్టాకు నీళ్లందిస్తే సకాలంలో నీళ్లందించలేదంటూ రామోజీ గగ్గోలు పెట్టారు. ప్రస్తుత సీజన్ ప్రారంభంలో పులిచింతలలో 38 టీఎంసీలు నిల్వ ఉండేవి. గోదావరిలో వరద ప్రవాహం ప్రారంభం కానంత వరకూ కృష్ణా డెల్టాకు పులిచింతల నుంచి 18 టీఎంసీలను విడుదల చేశారు. బేసిన్లో వర్షాలు కురవడం.. గోదావరిలో వరద ప్రారంభమవడంతో జూలై 21న పట్టిసీమ ఎత్తిపోతల పంపులు ఆన్చేసి.. పోలవరం కుడి కాలువ ద్వారా ప్రకాశం బ్యారేజీకి జలాలను తరలించి డెల్టాకు విడుదల చేశారు. జూలై ఆఖరు, ఆగస్టు ప్రథమార్థంలో తెలంగాణలో కురిసిన వర్షాలవల్ల మూసీ నుంచి పులిచింతలలోకి 19 టీఎంసీలు చేరాయి. సీజన్ ప్రారంభంలో పులిచింతల నుంచి కృష్ణా డెల్టాకు 18 టీఎంసీలను విడుదల చేయకపోతే.. మూసీ వరద నుంచి వచ్చిన 19 టీఎంసీలు కడలి పాలయ్యేవి. ఇది ప్రస్తుత ప్రభుత్వ దూరదృష్టికి నిదర్శనం. ప్రజాధనాన్ని వృథా చేయమంటారా? గోదావరి నుంచి ప్రకాశం బ్యారేజ్కి పట్టిసీమ ద్వారా ఒక టీఎంసీని ఎత్తిపోయాలంటే రూ.2.65 కోట్లు వ్యయమవుతుంది. అయినా.. పులిచింతల, పట్టిసీమ జలాలతో కృష్ణా డెల్టాలో ప్రతి ఎకరాకూ నీళ్లందించాలని విద్యుత్ ఛార్జీలు ఎంతైనా భరిస్తామని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఈ ఎత్తిపోతల నిర్వహణకు రూ.15.80 కోట్లను విడుదల చేశారు. మరోవైపు.. తెలంగాణలో, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వర్షాలు కురవడంవల్ల ఉప నదులు, వాగులు, వంకల ద్వారా ప్రకాశం బ్యారేజ్కు వరద నీరు చేరింది. కృష్ణా డెల్టాలో మూడు దఫాలుగా భారీ వర్షాలు కురిసిన సందర్భాలలోనూ నీటి అవసరం తక్కువగా ఉంది. అలాంటి సందర్భాల్లోనూ పట్టిసీమ నుంచి నీటిని ఎత్తిపోసి ప్రకాశం బ్యారేజి గేట్లు ఎత్తేసి సముద్రంలోకి వదిలేయడం ద్వారా ప్రజాధనాన్ని వృథా చేయాలా రామోజీ? పట్టిసీమ ద్వారా ఇప్పటిదాకా ఎత్తిపోసిన 54.35 టీఎంసీలను పులిచింతల నీటికి జతచేసి డెల్టాలో ఆయకట్టు చివరి భూములకు ప్రభుత్వం నీళ్లందించింది. డెల్టా ఎగువ ప్రాంతాల్లో పంట కోత దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో.. కాలువల ద్వారా నీటి సరఫరా మీద ఒత్తిడి తగ్గుతుంది. ప్రస్తుతం పులిచింతలలో నిల్వ ఉన్న 13.61 టీఎంసీలను తాగునీరు, అత్యవసర సాగునీటి అవసరాలకే ఉపయోగిస్తారు. అదే చంద్రబాబు హయాంలో పట్టిసీమ ద్వారా పూర్తిస్థాయిలో నీటిని ఎత్తిపోసినా కృష్ణా డెల్టాలో ఏటా లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయి, రైతులు నష్టపోయారు. అయినా రామోజీ పెన్ను ఏనాడూ పెగల్లేదు. దోపిడీని కప్పిపుచ్చుకునేందుకే రోతరాతలుఅంతకుముందు.. జలయజ్ఞం ప్రాజెక్టుల్లో మిగిలిన పనులను కేవలం రూ.17,368 కోట్లతో పూర్తిచేస్తానంటూ 2014, జూలై 28న శ్వేతపత్రం ప్రకటించిన చంద్రబాబు.. ఐదేళ్లలో రూ.68,293.94 కోట్లు ఖర్చుచేసినా ఒక్క ప్రాజెక్టునూ పూర్తిచేయలేకపోయారు. ధరల సర్దుబాటు (జీఓ–22), పరిమాణం ఆధారంగా బిల్లుల చెల్లింపు (జీఓ–63)ల ద్వారా కాంట్రాక్టర్లకు ప్రజాధనాన్ని దోచిపెట్టి.. రాబట్టుకున్న కమీషన్లను చంద్రబాబు ముఠా పప్పుబెల్లాల్లా పంచుకుంది. అందులో రామోజీకి వాటా దక్కింది. నిజానికి.. నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తే పులిచింతలలో 45.77 టీఎంసీలు నిల్వచేసుకోవచ్చునని.. కృష్ణా డెల్టాకు అది వరమని అప్పట్లో సీఎం వైఎస్ జగన్ అనేకసార్లు చెప్పినా చంద్రబాబు పట్టించుకోలేదు. కమీషన్ల కోసం పట్టిసీమను చేపట్టారు. కృష్ణా, గోదావరి నదుల్లో దాదాపుగా ఒకేసారి వరద వస్తుంది. ప్రకాశం బ్యారేజ్ నిల్వ సామర్థ్యం 2.93 టీఎంసీలే. అలాంటప్పుడు గోదావరి నుంచి పట్టిసీమ ద్వారా నీటిని తరలిస్తే.. ప్రకాశం బ్యారేజి గేట్లు ఎత్తి సముద్రంలోకి వదిలేయాల్సిందే. పట్టిసీమకు పెట్టే వ్యయాన్ని పోలవరంపై పెట్టి పూర్తిచేస్తే.. గ్రావిటీపై కృష్ణా డెల్టాకు నీళ్లందించవచ్చునని కూడా ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు వైఎస్ జగన్ చెప్పారు. దీన్ని సాగునీటిరంగ నిపుణులు, అధికారులు అప్పుడూ, ఇప్పుడూ బలపరుస్తున్నారు. మరోవైపు.. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాకే నిర్వాసితుల సమస్యను పరిష్కరించి 2019 నుంచి పులిచింతలలో 45.77 టీఎంసీలను నిల్వచేస్తున్నారు కాబట్టే.. ఏటా కృష్ణా డెల్టాకు సకాలంలో సమృద్ధిగా నీళ్లందించగలుగుతున్నారు. -
Fact Check: ఆర్టీసీపై ఇవేం అబద్ధాలు రామోజీ.. వాస్తవాలు ఇవిగో..
సాక్షి, విజయవాడ: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి సాహసోపేత నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్పై ‘ఈనాడు’ విషం చిమ్ముతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై నిత్యం బురదజల్లడమే పనిగా పెట్టుకున్న రామోజీ మరో మారు తన నైజాన్ని చాటుకున్నారు. ఆర్టీసీకి ప్రతీ నెలా రూ.275 కోట్ల ఆర్ధిక సహాయాన్ని అందిస్తోన్న ప్రభుత్వంపై ‘డొక్కు బస్సులే దిక్కా’ అంటూ ఈనాడు పత్రిక ప్రచురించిన అవాస్తవ కథనాన్ని ఏపీఎస్ఆర్టీసీ ఖండించింది. ఇందులో నిజానిజాల్లోకి వెళితే.. 2020 జనవరి 1 నుంచి ఇప్పటి వరకు రూ. 11,711 కోట్ల భారీ ఆర్థిక సహాయాన్ని అందించింది. కరోనా సమయంలో దేశంలోని అన్ని ఆర్టీసీల ఉద్యోగులు దయనీయమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన మద్దతుతోనే ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులు కరోనా కాలంలో ఆకలితో అలమటించే పరిస్థితి తప్పింది. ప్రభుత్వంలో విలీనం చేయకముందు ఏపీఎస్ ఆర్టీసీలో 693 కారుణ్య నియామకాలు జరిగాయి. విలీనం వల్ల ఏపీఎస్ఆర్టీసీలోని ఖాళీల మేరకు మాత్రమే కాకుండా ఇతర ప్రభుత్వ శాఖలలో కూడా మరణించిన కుటుంబాలకు కారుణ్య ఉపాధి లభించింది PRC-2022 అన్ని ఇతర ప్రభుత్వ శాఖలతో సమానంగా అమలు చేయబడింది. విలీనం కారణంగా ఇప్పటి వరకూ 2,760 కోట్ల అప్పు తీరింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టీసీ అత్యుత్తమ సేవలు అందించింది. 2019-20 ఆర్ధిక సంవత్సరం ఆర్టీసీ ఆదాయం 4,781 కోట్లు. 2022-23 ఆర్ధిక సంవత్సరం ఆర్టీసీ ఆదాయం 5,574 కోట్లు. దసరా,సంక్రాంతి పండుగల్లో అదనపు ఛార్జీలు వసూలు చేయకుండానే ఆదాయం వచ్చింది. 2019-20 సంవత్సరంలో 406 కొత్త బస్సులు కొనుగోలు చేసిన ఆర్టీసీ.. పాత బస్సుల స్థానంలో 900 కొత్త డీజిల్ అద్దె బస్సులను ప్రవేశపెట్టింది. తిరుపతి-తిరుమల ఘాట్ రోడ్డు, తిరుపతి నుండి సమీప నగరాలకు నడపడానికి 2022-23లో 100 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టింది. కొత్తగా 1,500 డీజిల్ బస్సుల కొనుగోలు పురోగతిలో ఉంది. కేంద్రప్రభుత్వం ప్రకటించిన కొత్త స్క్రాప్ పాలసీ ప్రకారం 15 ఏళ్ల సర్వీసు పూర్తైన 214 బస్సులను ఆర్టీసీ రద్దు చేసింది. 2024 మార్చిలోపు మరో 52 బస్సులను రద్దు చేసే యోచనలో ఆర్టీసీ ఉంది. ప్రజల రవాణా కోసం ఏపీఎస్ ఆర్టీసీ బస్సులను అధ్వాన్న స్థితిలో నడుపుతోందని చెప్పడం సరికాదు. ప్రస్తుత సంవత్సరంలో ప్రజల ఆదరణ పెరిగింది. గతేడాది కంటే169 కోట్ల మేర అదనపు రాబడి వచ్చింది. డిపోలకు విడిభాగాల సరఫరాపై ఖర్చు భారీగా తగ్గిందని చెప్పడం సరికాదు. 2019-20 సంవత్సరంలో 163.11 కోట్లు చేసిన ఆర్టీసీ.. 2020-21 సంవత్సరంలో 91.65 కోట్లు, 2021-22 సంవత్సరంలో 168.51 కోట్లు, 2022-23 సంవత్సరంలో 231.29 కోట్లు విడిభాగాల సరఫరా కోసం ఆర్టీసీ ఖర్చు చేసింది. 110 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా బస్ స్టేషన్ల పునరుద్ధరణ,కొత్త డిపోల నిర్మాణం ఆర్టీసీ చేపట్టింది. గతంతో పోలిస్తే ప్రమాదాలు గణనీయంగా పెరిగాయని చెప్పడం సరికాదు.. 2019-20 లో జరిగిన ప్రమాదాలు 974.. 2020-21లో జరిగిన ప్రమాదాలు 392.. 2021-22 లో జరిగిన ప్రమాదాలు 617.. 2022-23 లో జరిగిన ప్రమాదాలు 907. ఈ నెల 6వ తేదీన విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో జరిగిన ఘోర ప్రమాదంపై చర్యలు తీసుకున్నాం. ముగ్గురు సభ్యులతో కూడిన సీనియర్ అధికారుల కమిటీ విచారణ చేపట్టింది. డ్రైవర్ గేర్ను తప్పుగా ఎంచుకోవడం, యాక్సిలరేటర్ను గట్టిగా నొక్కడం వల్లే ప్రమాదం జరిగిందని కమిటీ నివేదించింది. ప్రమాదంలో ముగ్గురు మరణించారు.. ఒకరికి గాయాలయ్యాయి. ఘటనకు బాధ్యులైన బస్సు డ్రైవర్ను సస్పెండ్ చేశాం. డ్రైవర్కు తగిన శిక్షణ ఇవ్వడంలో విఫలమయ్యారనే కారణంతో ఆటోనగర్ డిపో అసిస్టెంట్ మేనేజర్ (ట్రాఫిక్) ను సస్పెండ్ చేశాం. మృతులకు ఒక్కొక్కరికి పది లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించాం. గాయాలపాలైవన వారి పూర్తి వైద్య సంరక్షణ బాధ్యత ఆర్టీసీ తీసుకుంటుంది. ఆర్టీసీ బస్టాండ్ లో ప్లాట్ ఫారానికి ఆనుకుని ఉన్న ప్రతి బస్ బేకు స్టాపర్ వాల్ ఎత్తు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం’’ అని ఆర్టీసీ పేర్కొంది. అసత్యాన్ని ప్రచురించడం బాధ్యతారాహిత్యమే కాకుండా సాధారణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుంది. ఇటువంటి ప్రయత్నాలు ఆర్టీసీ సంస్థతో పాటు ఉద్యోగుల మనోధైర్యాన్ని దెబ్బతీస్తాయి. తప్పుడు సమాచారాన్ని ప్రచురించి, సంస్థ గౌరవానికి భంగం కలిగిస్తే పరువు నష్టం కేసు నమోదు చేస్తామని ఆర్టీసీ హెచ్చరించింది. చదవండి: Fact Check: రోడ్డున పడ్డది రామోజీ పరువే.. -
అమర్త్యసేన్ ఆరోగ్యంగానే ఉన్నారు
ప్రముఖ ఆర్తికవేత్త, నోబెల్ గ్రహీత.. భారతరత్న అమర్త్య సేన్(89) కన్నమూశారంటూ జరిగిన ప్రచారాన్ని ఆయన కుటుంబ సభ్యులు ఖండించారు. మంగళవారం మధ్యాహ్నాం ఆయన చనిపోయారంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. అది కాస్త ఆంగ్ల మీడియాలో టెలికాస్టింగ్ దాకా వెళ్లింది. అయితే.. అదంతా ఫేక్ సమాచారం అని ఆయన కూతురు నందనా సేన్ స్పష్టత ఇచ్చారు. ఆయన క్షేమంగానే ఉన్నట్లు తెలిపారు. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని.. ఎప్పటిలాగే తన పనుల్లో బిజీగా ఉన్నారంటూ కూతురు నందనా దేబ్ సేన్ స్పష్టత ఇచ్చారు. తాజాగా ఆయన కుటుంబంతో కేంబ్రిడ్జిలో వారంపాటు గడిపారని, హర్వార్డ్లో తరగతులు చెప్పడంలో మునిగిపోయారని ఆమె వెల్లడించారు. Friends, thanks for your concern but it’s fake news: Baba is totally fine. We just spent a wonderful week together w/ family in Cambridge—his hug as strong as always last night when we said bye! He is teaching 2 courses a week at Harvard, working on his gender book—busy as ever! pic.twitter.com/Fd84KVj1AT — Nandana Sen (@nandanadevsen) October 10, 2023 అమెరికన్ ప్రొఫెసర్ క్లాడియా గోల్డిన్(2023 ఆర్థిక శాస్త్రంలో నోబెల్ విజేత కూడా).. తాజాగా తన ఎక్స్ అకౌంట్లో అమర్త్యసేన్ కన్నుమూశారని ట్వీట్ చేశారంటూ ఒక ప్రచారం నడిచింది. అయితే.. అది ఫేక్ అకౌంట్ అని తర్వాతే తేలింది. హర్వార్డ్ యూనివర్సిటీలో చదివిని అమర్త్య సేన్ కూతురు నందనా దేవ్ సేన్ పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించడమే కాదు.. బాలల హక్కుల ఉద్యమకారిణి కూడా. -
చట్టం మీ చుట్టమా రామోజీ ?
-
TS: గృహలక్ష్మి పథకానికి లాస్ట్డేట్ లేదు!
సాక్షి, హైదరాబాద్: ఆగష్టు 10వ తేదీతో గృహలక్ష్మి పథకం గడువు ముగుస్తుందంటూ జరుగుతున్న ప్రచారంపై బీఆర్ఎస్ ప్రభుత్వం స్పందించింది. అలాగే.. దరఖాస్తుల స్వీకరణకు రకరకాల పేపర్లు అడుగుతూ కొర్రీలు పెడుతున్నారంటూ ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాల విమర్శలపైనా స్పందించింది. గృహలక్ష్మి పథకం అనేది తెలంగాణలో కొనసాగే నిరంతర ప్రక్రియ అని, కాబట్టి దరఖాస్తుదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టమైన ప్రకటన చేసింది. ఇళ్లులేని నిరుపేదల కోసం తెలంగాణ ప్రభుత్వం గృహలక్ష్మి పథకం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. సొంత జాగా ఉండి.. ఇల్లు కట్టుకోవాలనుకునేవారికి ప్రభుత్వం రూ.3 లక్షల ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించుకుంది. ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తుల కోసం ప్రభుత్వం డెడ్ లైన్ విధించిందని, అర్హులైన వారు ఈనెల 10వ తేదీలోగా ధరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించిందని పలు కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే దరఖాస్తు విషయంలో ఎలాంటి ఆందోళన అక్కర్లేదని ప్రభుత్వం భరోసా ఇస్తోంది. ‘‘గృహలక్ష్మి పథకం నిరంతర ప్రక్రియ. దరఖాస్తుల విషయంలో ప్రతిపక్షాలు,కొన్ని పత్రికలు చేసే అసత్య ప్రచారాలకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దరఖాస్తుదారులు దరఖాస్తు చేసే విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గ్రామ కంఠంలో ఉన్న పాత ఇల్లు కాని, స్థలాలకు కానీ దస్తావేజు పేపర్లు ఉండవు. కాబట్టి ఇంటి నంబర్ అయినా సరే లేకుంటే ఖాళీ స్థలం ఉన్నా సరే దరఖాస్తు చేసుకోవచ్చు అని స్పష్టం చేసింది. దీనికి గడువు అయిపోయిందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దరఖాస్తుదారులు తమతమ ప్రజాప్రతినిధులతో జిల్లా కలెక్టర్ గారికి దరఖాస్తులు పంపించవచ్చు. ఇది నిరంతర ప్రక్రియ. ప్రతీ నియోజకవర్గానికి ప్రస్తుతం మొదటి దశలో 3వేల ఇండ్లు పూర్తి అయిన తర్వాత.. రెండో దశలో ఇచ్చే గృహలక్ష్మి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కాబట్టి ఇండ్లు లేని పేదలు ఆందోళన చెందాల్సిన అక్కర్లేదు. దశల వారీగా అర్హులైన పేదల ఇంటి నిర్మాణం కోసం గృహలక్ష్మి అమలు చేస్తారు అని తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఒక ప్రకటన ద్వారా స్పష్టం చేశారు. గృహలక్ష్మి పథకం విషయంలో.. ప్రతి పక్షాలు, కొన్ని పత్రికలు చేసే అసత్య ప్రచారాలు నమ్మొద్దని, పేదలు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారాయన. గృహలక్ష్మి పథకం నిరంతర ప్రక్రియ - దరఖాస్తుల విషయంలో ప్రతిపక్షాలు,కొన్ని పత్రికలు చేసే అసత్య ప్రచారాలకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు గౌరవ ముఖ్యమంత్రి కేసిఆర్ గారు ఇండ్లులేని నిరుపేదల కోసం ఖాళీ స్థలం ఉండి సొంత ఇల్లు కట్టుకోవడానికి రూ. 3 లక్షలు ఆర్ధిక సహాయం అందించే గృహలక్ష్మి… pic.twitter.com/yLp0zgYM0s — BRS Party (@BRSparty) August 9, 2023 మార్గదర్శకాలు ఇవే.. ► ఈ పథకం కింద 100 శాతం రాయితీతో ప్రభుత్వం రూ. 3 లక్షల ఈ ఆర్థిక సాయం అందించనుంది. ► రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి 3 వేల మంది చొప్పున మెుత్తం 4 లక్షల మంది లబ్ధిదారులకు సాయం అందిస్తారు. ► మహిళల పేరు మీదే ఆర్థిక సాయం అందిస్తారు. ► లబ్ధిదారైన మహిళ పేరిట బ్యాంకు ఖాతా తెరవాలి (జన్ధన్ ఖాతాను వినియోగించవద్దు) . ► కలెక్టర్లు, కమిషనర్లు నోడల్ అధికారులుగా వ్యవహరిస్తారు. ► ఇంటి బేస్ మెంట్ లెవెల్, రూఫ్ లెవెల్, స్లాబ్ ఇలా మూడు దశల్లో ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుంది. ► ఇప్పటికే ఆర్సీసీ (RCC) ఇళ్లు ఉన్న వారికి, 59 ఉత్తర్వులు కింద లబ్ధి పొందిన వారు ఈ పథకానికి అనర్హులు. ► ఈ పథకం కింద ఎస్సీలకు 20 శాతం, ఎస్టీలకు 10 శాతం, బీసీ, మైనార్టీలకు 50 శాతం లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. దివ్యాంగులకు 5 శాతం ప్రత్యేక రిజర్వేషన్లను ప్రకటించారు. -
తూత్తుకుడి ప్లాంట్ విక్రయించం
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం వేదాంతా లిమిటెడ్ తమిళనాడులోని తూత్తుకుడిలోగల కాపర్ ప్లాంటును విక్రయించబోమని తాజాగా స్పష్టం చేసింది. స్టెరిలైట్ కాపర్ ప్లాంటును విక్రయిస్తున్నట్లు మీడియాలో వచ్చిన వార్తలను తప్పుపట్టింది. ఇవి ఆధారరహిత, తప్పుడు వార్తలని పేర్కొంది. వీటికి ఎలాంటి ప్రాతిపదికలేదంటూ తోసిపుచి్చంది. స్టెరిలైట్ కాపర్ జాతీయ ఆస్తిఅని, దేశీయంగా మొత్తం కాపర్ ఉత్పత్తిలో 40 శాతం వాటాను ఆక్రమిస్తున్నట్లు స్టాక్ ఎక్సే్ఛంజీలకు ఇచి్చన సమాచారంలో తెలియజేసింది. మీడియాలోని కొన్ని వర్గాలు తూత్తుకుడిలోని స్టెరిలైట్ కాపర్ ప్లాంటును వేదాంతా విక్రయిస్తున్నట్లు తప్పుడు వార్తలు సృష్టించినట్లు పేర్కొంది. వీటిని ఖండిస్తున్నట్లు తెలియజేసింది. దేశం నికరంగా కాపర్ను దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో మెటల్కు డిమాండ్ పెరుగుతూనే ఉన్నదని, కార్యకలాపాలు తిరిగి ప్రారంభించవలసిన ఆవశ్యకత ఉన్నట్లు వివరించింది. -
వక్రీకరణ రాతల్లో ఈనాడును కొట్టేవారు లేరు
ప్రసార మాద్యమాలలో అసత్యాలు, అర్ధసత్యాలు ప్రచారం చేయడం ఎలా?.. అన్నది నేర్చుకోవాలంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి పాలో అయితే సరిపోతుంది. ఒకప్పుడు హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఈనాడు పత్రికలో రాసుకునేవారు. కాని వారు అసలు హృదయం, ఆత్మ రెండూ లేకుండా రోజూ పచ్చి అబద్దాలను రాస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వంపై విషం కక్కడమే ధ్యేయంగా పెట్టుకున్నారు. ఉదాహరణకు.. ✍️ బుధవారం నాడు ఈనాడులో వచ్చిన కధనం చూడండి. విజయవాడ మెట్రోకి ఉరి అని బానర్ కధనాన్ని ఇచ్చారు. ఆ వార్త మొత్తం చదివితే ఈనాడు రాతలు ఎంత విషపూరితమో, వికృతమో అర్ధం అయిపోతుంది.విజయవాడ నగరానికి మెట్రో రైలు వేసే అవకాశం పై పరిశీలన చేస్తామని కేంద్రం చెప్పింది. ఆ తర్వాత కాలంలో చంద్రబాబు నాయుడు టైమ్ లోనే మెట్రో మాన్ గా పేరొందిన ప్రముఖ ఇంజనీర్ శ్రీధరన్ ఆధ్వర్యంలో కమిటీ వేశారు. ఆయన పరిశీలన చేసి విజయవాడకు ఇది వయబలిటీ కాదని స్పష్టం చేశారు.అయినా చంద్రబాబు ప్రభుత్వ ప్రచార ఆర్భాటాలను గమనించిన ఆయన చెప్పాపెట్టకుండా ఏపీ నుంచి వెళ్లిపోయారు.ఆ తర్వాత చంద్రబాబు ప్రభుత్వమే ఆ ప్రతిపాదనను మూలపడేసింది. అది నిజం. ఒకవేళ విజయవాడకు మెట్రో రైలు అవసరం అని, ఇప్పుడు హైదరాబాద్, చెన్నై,బెంగుళూరు లలో ఉన్నంత జనాభా లేకపోయినప్పటికీ, భవిష్యత్తులో పెరుగుతుందని ఈనాడు భావిస్తే తదనుగుణంగా వార్త ఇవ్వవచ్చు. లేదూ.. చంద్రబాబు పిలుపు మేరకు ప్రజలు ఇక పిల్లలను ఎక్కువమంది కంటారని ఈనాడు రామోజీరావు అనుకుంటే కూడా ఆ విషయమే చెప్పవచ్చు. అవేమీ కాకుండా గుడ్డ కాల్చి మీద వేసినట్లుగా ఈనాడు చెత్త కధనాన్ని వండి వార్చింది. ఆ కథనంలో ఇంతకీ విషయం ఏమిటంటే ఎనికే పాడు వద్ద గత ప్రభుత్వ హయాంలో 2017లో 3,272 గజాల స్థలం సేకరణకు ముసాయిదా నోటిఫికేషన్ ఇచ్చారట. దానిని ఇప్పుడు రద్దు చేశారట!!. ✍️ చంద్రబాబు ప్రభుత్వం 2017లో ముసాయిదా జారీ చేస్తే మరి ఆ తర్వాత రెండేళ్లు ఆయనే అధికారంలో ఉన్నారు కదా!. మరి ఎందుకు భూ సేకరణ చేయకుండా వదలివేశారు?. ఆ సంగతి మాత్రం రాయరు. పోనీ ఆ ఒక్క చోట భూ సేకరణ చేస్తే మెట్రో వచ్చేస్తుందా? అలాగే శ్రీధరన్ కమిటీ చెప్పిన విషయాలను ప్రస్తావించరు. 2019లోనే ముసాయిదా నోటిఫికేషన్ గడువు ముగిసిందని, అయినా దానిపై తగు నిర్ణయం చేయకపోవడం వల్ల స్థల యజమానులు ఇబ్బందులు పడుతున్నారని, మళ్లీ అవసరమైతే సేకరిస్తామని జిల్లాకలెక్టర్ పేర్కొంటే దానిని వక్రీకరించి ఈనాడు ఈ వార్త ఇచ్చింది. చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ స్కీమ్ ఆగిపోతే ,దానిని జగన్కు అంటగట్టడమేమిటి?.. ✍️ విజయవాడ అంటే ఈ ప్రభుత్వానికి కక్ష అంటూ విద్వేషపూరిత కధనాన్ని ఇచ్చారు. విజయవాడలో కీలకమైన బెంజ్ సర్కిల్లో రెండో వంతెనను ప్రారంభించి ఈ ప్రభుత్వం సకాలంలో పూర్తి చేస్తే.. దానిని ఈ పత్రిక గుర్తించదు. అలాగే చంద్రబాబు ప్రభుత్వం పూర్తి చేయలేకపోయిన కనకదుర్గమ్మ గుడి వద్ద వంతెను జగన్ ప్రభుత్వం పూర్తికావిస్తే.. దానికి క్రెడిట్ ఇవ్వరు. కృష్ణానదిలో ప్రజల రక్షణార్దం ఒక భారీ వాల్ నిర్మిస్తుంటే అది వీరికి కనిపించదు. పైగా గత ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టిన ప్రాజెక్టులను ఆపివేయడం ,మళ్లీ కోలుకోలేనంతగా దెబ్బతీయడమే ప్రధాన ఎజెండాగా ప్రస్తుత ప్రభుత్వం పనిచేస్తోందని నీచమైన వ్యాఖ్య చేశారు. ✍️ ఆ ప్రభుత్వం ఆరంభించిందేమిటి? వీళ్లు ఆపిందేమిటి? ఇలా రాసినవారు జర్నలిస్టులు అవుతారా? పార్టీ కార్యకర్తలు అవుతారా? రాజకీయపార్టీలవారు కూడా ఇంత ఘోరంగా అబద్దాలు చెప్పలేరేమో!. జార్ఖండ్ , ఒడిషాలలో కూడా మెట్రో ప్రతిపాదనలు లేవని, అవి వెనుకబడిన రాష్ట్రాలని ,వాటి సరసన ఏపీ చేర్చారని ఒక చెండాలపు కామెంట్. విజయవాడ కన్నా రాంచీ, భువనేశ్వర్ లు పెద్ద నగరాలు, అక్కడే ప్రాజెక్టు వయబిలిటి లేకపోతే ఇక్కడ ఎలా అవుతుందన్నది ప్రశ్న. ✍️ కోటి మంది ఉన్న హైదరాబాద్ లోనే మెట్రో భారీ నష్టాలను చవిచూస్తోంది. తమకు ప్రభుత్వం రాయితీ ఇవ్వాలని మెట్రో కోరుతోంది. ఈ సంగతులు ఈనాడువారికి తెలియవా!. చంద్రబాబు అమరావతి రాజధాని అంటూ ప్రధాన రహదారికి నలభై కిలోమీటర్ల దూరంలో పల్లెటూళ్లలో ఎందుకు పెట్టారు?ఆయన ఏకంగా అమరావతికి రైలు, అదేదో గొట్టపు రైలు ప్రాజెక్టు అని, బులెట్ ట్రైన్ అని చాలా చెప్పారు కదా!. మరి వాటి గురించి ఈనాడు ఎప్పుడైనా రాసిందా? టీడీపీ ప్రభుత్వం మెట్రో ప్రాజెక్టుకు సంబంధించి అవసరమైన భూ సేకరణ అంతా పూర్తి చేసిందా? అదేమీ జరగలేదే? ఒక్క ఎనికేపాడులో అది కూడా డ్రాఫ్ట్ నోటిఫికేషన్ మాత్రమే. టిడిపి హయాంలోనే అది సాద్యం కాదని ప్రాజెక్టును పక్కనబెడితే, రాని ప్రాజెక్టు కోసం స్థల యజమానులు అటు భూమి లేక, ఇటు పరిహారం రాక ఇబ్బంది పడాలా? ✍️ ఈనాడు విలేకరి ఈ కథనంలో తన పైత్యం అంతా చూపించి చెత్త వార్తలు ఎలా రాయవచ్చో ప్రజలకు తెలియచేశారన్నమాట. ఈనాడు పత్రికలోనే అదే రోజు మార్గదర్శి ఆస్తుల అటాచ్ మెంట్ గురించి పెద్ద వివరణ ఇచ్చారు. వారు తమకు ఏ చట్టం వర్తించదని చెబుతున్నారు. తాము కార్పొరేట్ ఆఫీస్ కు తరలిస్తున్నది కంపెనీకి వచ్చే ఆదాయం అని బుకాయించే యత్నం చేసినట్లు అనిపిస్తుంది. భవిష్యత్తు సెక్యూరిటీ కోసం చందాదారులు డిపాజిట్ చేస్తున్నారట. అసలు డిపాజిట్లే తీసుకోరాదని చట్టం చెబుతుంటే దానికి కొత్త భాష్యం. ప్రభుత్వ ఆర్ధిక ఆరాచకం అని నిత్యం రాసే ఈనాడువారు ముందుగా మార్గదర్శిలో అర్ధిక అరాచకం లేకుండా చూసుకుంటే మంచిది కదా!. అలాగే వేరే వారి భూమి డ్రాప్ట్ నోటిఫికేషన్ నుంచి తొలగించడాన్ని తప్పుపడుతున్న ఈనాడు.. మార్గదర్శి ఆస్తుల విషయంలో మాత్రం ఎవరూ చర్య తీసుకోకూడదని అంటోంది. ఇతరుల ఆస్తి ఏమైపోయినా ఫర్వాలేదు తమ ఆస్తుల జోలికి రావద్దని ఈనాడు అంటున్నట్లుగా ఉంది. తమను ప్రశ్నించరాదని, తమ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తామని ఈనాడు రామోజీ చెప్పగలుగుతున్నారంటే అది ఆయనకే చెల్లుతుందనుకోవాలి. :::కొమ్మినేని శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ ఛైర్మన్ -
నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు ‘ఈనాడు’పై వివేకా పీఏ ఫైర్
సాక్షి, పులివెందుల: తాను పారిపోయానంటూ ‘ఈనాడు’ తప్పుడు ప్రచారం చేస్తోందని వైఎస్ వివేకా పీఏ కృష్ణారెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్ జిల్లా పులివెందులలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తాను కాలేజీ పని మీద కడపకు వెళితే.. ఈనాడు పత్రిక వాళ్లు ‘కృష్ణారెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు.. పారిపోయారు’ అంటూ తప్పుడు కథనాలు రాశారని మండిపడ్డారు. సీబీఐ అధికారులు తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని, ఫోన్ కూడా చేయలేదని తెలిపారు. కాగా, వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఇది కూడా చదవండి: ఆ షాక్ నుంచి జేసీ బ్రదర్స్ ఇంకా తేరుకోలేదా? -
జగనన్న విద్యా కానుకపై ‘ఈనాడు’ తప్పుడు ప్రచారం
సాక్షి, అమరావతి: జగనన్న విద్యా కానుకపై ‘ఈనాడు’ దినపత్రిక అసత్యాలతో దుష్ప్రచారం సాగిస్తోందని పాఠశాల విద్యా శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘విద్యా కానుక బూట్లు కాళ్లకు పట్టవు’ శీర్షికన ఆదివారం ప్రచురితమైన వార్త పూర్తిగా అవాస్తవమని ఖండించింది. ‘ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం వేముల కోట జడ్పీ ఉన్నత పాఠశాలను ఈనెల 15న పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ సందర్శించారు. 7వ తరగతికి వెళ్లి విద్యార్థులు ధరించిన షూలను పరిశీలించారు. కొంత మంది విద్యార్థులు షూ ధరించలేదు. ఇందుకు వారు చెప్పిన కారణాలు సహేతుకంగా లేకపోవడంతో వారికి ఇచ్చిన షూలు సరిగా ఉన్నాయో లేదో తెలుసుకునేందుకు వారి ఇళ్లకు వెళ్లారు. జి.సందీప్ కుమార్, కె.శివపార్వతి ఇళ్ల వద్ద ఉన్న వారి షూలను పరిశీలించారు. అవి ఆ విద్యార్థులకు సరిగ్గా సరిపోయాయి. ఎలాంటి డ్యామేజీ కూడా లేదు. దీంతో ఆ షూలను విద్యార్థులకు తొడిగించారు. ప్రతి రోజూ పిల్లలతో షూ ధరింపచేసి స్కూళ్లకు పంపాలని వారి తలిదండ్రులకు సూచించారు. ఆ తర్వాత ఆ పిల్లలను తన వెంట స్కూలుకు తీసుకెళ్లారు. అక్కడి టీచర్లతో సమావేశమై 100 రోజుల పాటు అలవాటు చేస్తే విద్యార్థులు తప్పకుండా షూ వేసుకొని వస్తారని సూచించారు. ప్రకాశం జిల్లాలో 21 వేల మంది విద్యార్థులకు సంబంధించిన షూ లను ఎక్స్ఛేంజ్ చేసి అందించారు. ఈ మేరకు విద్యా శాఖ అన్ని స్కూళ్ల హెచ్ఎంల నుంచి విద్యార్థులందరికీ షూలు సరిపోయాయని డిక్లరేషన్ కూడా తీసుకుంది. ఈ వాస్తవాలను విస్మరించి, విద్యా కానుక బూట్లు విద్యార్థులకు పట్టవు అంటూ ‘ఈనాడు’ అసత్యాలతో వార్త ప్రచురించడం దారుణం. ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది’ అని ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. -
ఈనాడు తప్పుడు కథనాలపై దేవులపల్లి అమర్ ఫైర్..
సాక్షి, అనంతపురం: ఈనాడు తప్పుడు కథనాలపై ఏపీ ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ మండిపడ్డారు. అనంతపురంలో జరిగిన సీనియర్ జర్నలిస్టు వై.తిమ్మారెడ్డి వర్థంతి సందర్భంగా ఏర్పాటు చేసిన జర్నలిజం నాడు-నేడు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పాత ఫొటోలను ప్రచురించి ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయాలని రామోజీ రావు కుట్ర పన్నినట్లు తెలిపారు. 151 స్థానాలతో ఏర్పడిన ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ఓ వర్గం మీడియా ప్రతి రోజూ ప్రయత్నిస్తోందని అమర్ మండిపడ్డారు. పట్టాభి విషయంలో పాత ఫోటోలను ప్రచురించి.. ఆ తర్వాత చింతిస్తున్నామంటూ సవరణ రాసిన ఈనాడు వైఖరి సరికాదన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పాలన అందిస్తున్నారని.. ఏ ఒక్క రోజూ ఎల్లో మీడియా మంచిని చూడలేదని అమర్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర, దేశరాజకీయాలు తన చెప్పు చేతల్లో ఉండాలని రామోజీ కోరుకుంటారని దుయ్యబట్టారు. చదవండి: 'జూనియర్ ఎన్టీఆర్ని టీడీపీలోకి ఆహ్వానించడానికి లోకేష్ ఎవరు?' -
ఏపీ సీఎస్పై కథనాలు అవాస్తవం: ఐఏఎస్ అసోసియేషన్
సాక్షి, విజయవాడ: ఏపీ సీఎస్ జవహర్రెడ్డిపై వచ్చిన కథనాలు పూర్తి అవాస్తమని, తప్పుడు వార్తలను ఖండిస్తున్నామని ఐఏఎస్ అసోసియేషన్ తెలిపింది. సీఎస్ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా కథనాలు రాయడం సరికాదన్నారు. తప్పుడు కథనాలపై ఐఏఎస్ అసోసియేషన్లో చర్చించాం. ఇలాంటి కథనాలపై న్యాయపరమైన చర్యలు ఉంటాయని స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ప్రవీణ్ అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగంగా సీఎస్ జవహర్రెడ్డి కడపలో పర్యటించారని ప్రవీణ్ వివరణ ఇచ్చారు. సీనియర్ అధికారిపై తప్పుడు వార్తలను ఖండిస్తున్నామని ఆయన అన్నారు. చదవండి: ‘లోకేష్ పప్పు కాబట్టే.. చంద్రబాబు అలా చేశారు’ -
రైతుభరోసాపై ‘ఈనాడు’ విష ప్రచారం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి పెద్దపీట వేసి రైతులకు అనేక రకాలుగా మేలు చేస్తుంటే ఈనాడు దినపత్రిక తప్పుడు కథనాలు ప్రచురిస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై విషప్రచారం చేస్తోందని రాష్ట్ర వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్ హరికిరణ్ మండిపడ్డారు. రైతులకు అవసరమైన అన్నిరకాల సేవలను సత్వరమే అందించేందుకు గ్రామస్థాయిలో ఏర్పాటుచేసిన రైతుభరోసా కేంద్రాలతో లక్షలాది మంది రైతులు లబ్ధిపొందుతున్నారని ఆయన తెలిపారు. ఆదివారం ‘ఈనాడు’లో ‘రైతుకు భరోసా ఏది’.. శీర్షికతో ప్రచురించిన వార్తను తీవ్రంగా తప్పుబట్టారు. చదవండి: Cyclone Sitrang: తుపానుగా మారిన వాయుగుండం ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. దేశంలోని అనేక రాష్ట్రాలతోపాటు అంతర్జాతీయంగా పలు దేశాలు రాష్ట్రంలోని ఆర్బీకేలను మోడల్గా తీసుకుని అమలుచేస్తున్నాయని ఆయన గుర్తుచేశారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధిగమించడానికి, రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం గ్రామస్థాయిలో 10,778 ఆర్బీకేలను ఏర్పాటుచేసి వ్యవసాయ, అనుబంధ శాఖలకు సంబంధించి నాణ్యమైన ఉత్పాదకాలు అందించడంతో పాటు రైతులకు అవసరమైన విజ్ఞానాన్ని వాటి ద్వారా అందిస్తున్నట్లు వివరించారు. అలాగే ఆయన ఇంకా ఏం చెప్పారంటే.. ♦ఆర్బీకేల ద్వారా 42.22 లక్షల మంది రైతులకు రూ.157.97 కోట్ల విలువైన 23.74 లక్షల క్వింటాళ్ల సబ్సిడీ విత్తనాలను, 18.28 లక్షల మంది రైతులకు రూ.744.25 కోట్ల విలువైన 6.69 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను పంపిణీ చేశాం. ♦1.5 లక్షల మంది రైతులకు రూ.14.01 కోట్ల విలువైన 1.36 లక్షల లీటర్ల పురుగు మందులను కూడా అందించాం. ♦ఎరువుల లోడింగ్, అన్లోడింగ్, రవాణా ఖర్చుల కోసం ఒక్కో బస్తాకు రూ.20 ఆదా అవుతోంది. ఆ లెక్కన గడిచిన రెండేళ్లలో పంపిణీ చేసిన 6.69 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువుల సరఫరా ద్వారా రైతులకు రూ.27 కోట్లు ఆదా అయింది. ♦ఆర్బీకేల్లో 6,321 మంది వ్యవసాయ, 2,356 ఉద్యాన, 378 మంది పట్టు, 4 వేల మందికి పైగా పశు సంవర్థక, 756 మంది మత్స్య సహాయకులు పనిచేస్తుండగా, మిగిలిన పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ ద్వారా చర్యలు చేపట్టాం. ♦9,277 మంది బ్యాంకు సహాయకులను ఆర్బీకేలకు అనుసంధానం చేసి గ్రామస్థాయిలోనే ఎక్కడికక్కడ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చాం. ♦ఆర్బీకేల ద్వారా 1.59 కోట్ల మెట్రిక్ టన్నుల పంట ఉత్పత్తులను 18.18 లక్షల మంది రైతుల నుంచి కొనుగోలు చేశాం. ♦4.75 లక్షల కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డులను జారీచేసి రూ.3,595 కోట్ల రుణాలను పంపిణీ చేశాం. ♦34,550 మంది రైతులతో కమ్యూనిటీ హైరింగ్ గ్రూపులను ఏర్పాటుచేసి రూ.240.67 కోట్ల సబ్సిడీతో యంత్ర పరికరాలు అందించాం. ..ఇలాంటివెన్నో రైతు సంక్షేమ కార్యక్రమాలను అమలుచేస్తున్నా ‘ఈనాడు’ పత్రిక వాటిని పట్టించుకోకుండా తప్పుడు కథనాలను ప్రచురించడం తగదని హరికిరణ్ హితవు పలికారు. -
విశాఖ రైల్వే జోన్ తధ్యం.. దుష్ప్రచారాన్ని నమ్మొద్దు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ రైల్వే జోన్ విషయంలో వస్తున్న పుకార్లను, దుష్ప్రచారాన్ని నమ్మొద్దని చెప్తున్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. విశాఖ రైల్వే జోన్ రావడం లేదంటూ కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. ‘‘విశాఖ రైల్వే జోన్ రావడం తధ్యం. అందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. కేంద్రం చర్యలు ఇప్పటికే ప్రారంభించింది.. రైల్వేజోన్కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. గత పార్లమెంటు సమావేశాల్లో నేను అడిగిన ప్రశ్నకు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ సమాధానం కూడా ఇచ్చింది. ఈరోజు ఉదయం కూడా కేంద్ర రైల్వే బోర్డు ఛైర్మన్ వి కె త్రిపాఠీ మాట్లాడాను. కొన్ని పత్రికలు తప్పుడు వార్తలు రాస్తున్నాయి’’ అని జీవీఎల్ పేర్కొన్నారు. రైల్వే జోన్ ప్రక్రియ యధాతధంగా కొనసాగుతున్నదన్న ఎంపీ జీవీఎల్.. విశాఖ రైల్వే జోన్ పై వచ్చే ఎలాంటి పుకార్లను నమ్మొద్దంటూ ప్రజలకు మరోసారి విజ్ఞప్తి చేశారు. -
వైఎస్ జగన్ ప్రభుత్వంపై వివక్షపూరిత కథనాలు
-
పోలీసులపై తప్పుడు కథనాలు.. ఈనాడుకు ఎస్పీ ఫకీరప్ప నోటీసులు
సాక్షి, అనంతపురం: పోలీసులపై తప్పుడు కథనాలు రాస్తున్న ఈనాడుపై ఎస్పీ ఫకీరప్ప సీరియస్ అయ్యారు. తప్పుడు కథనాలపై వివరణ కోరేందుకు ఫకీరప్ప.. బుధవారం ఈనాడు కార్యాలయానికి వెళ్లి సిబ్బందికి నోటీసులు అందజేశారు. అయితే, ఇటీవల ఉద్యోగం నుంచి డిస్మిస్ అయిన ఏఆర్ కానిస్టేబుల్ ప్రశాశ్పై ఇది వరకే పలుమార్లు సస్పెన్షన్ వేటు పడింది. అయినప్పటికీ ప్రకాశ్ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో కానిస్టేబుల్ను సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తూ అనంతపురం ఎస్పీ ఫకీరప్ప ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రోగ్రామ్ సందర్భంగా ప్రకాశ్ నిరసన వ్యక్తం చేసినందుకే కానిస్టేబుల్ను డిస్మిస్ చేశారని ఈనాడు తప్పుడు కథనాలు రాసింది. అంతేకాకుండా పోలీసు అధికారులను టార్గెట్ చేస్తూ వార్తలు రావడంతో వివరణ కోరేందుకు ఈనాడు కార్యాలయానికి వెళ్లిన ఫకీరప్ప సిబ్బందికి నోటీసులు ఇచ్చారు. -
వైఎస్ జగన్ ప్రభుత్వంపై రామోజీ బురద రాతలు
-
బాబు తప్పులకు బాజాలెందుకు?
వాస్తవాలను వక్రీకరించడంలో తనకు సాటి మరెవరూ రారని ‘ఈనాడు’ రామోజీరావు మరో సారి నిరూపించుకున్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు నాయుడు చేసిన తప్పిదాలను కప్పిపెట్టడానికి ప్రతిరోజూ పనిగట్టుకుని మరీ ప్రభుత్వంపై విషం చిమ్ముతూ కథనాలు అచ్చేస్తున్న ‘ఈనాడు’... శుక్రవారం మరీ చిత్రమైన కథనాన్ని ప్రచురించింది. చంద్రబాబు చేసింది తప్పా? కాదా? అన్న దానికి సమాధానం చెప్పకుండా.. ప్రభుత్వం ఆది నుంచి తెగేసిచెబుతూ వస్తున్న మాటలను సైతం వక్రీకరించే దుస్సాహసానికి ఒడిగట్టడం ఆ పత్రిక దిగజారుడుతనానికి పరాకాష్ట. పోలవరంపై ఆది నుంచీ చంద్రబాబు వైఫల్యాలను బయటపెడుతూ వస్తున్న రాష్ట్రం... తాము అధికారంలోకి వచ్చిన 15 రోజులకే వరదలొచ్చాయని, దాంతో పనులు చేపట్టడం కుదరలేదని పదేపదే చెబుతోంది. అంతకు ముందు మూడున్నరేళ్లుగా ఒక్క బస్తా సిమెంటు వేసే పనిని కూడా చంద్రబాబు సర్కారు చేపట్టకపోవటాన్ని ఎండగడుతోంది కూడా. ఇవేవీ ప్రస్తావించని ‘ఈనాడు’... మొన్నటిదాకా చంద్రబాబుపై... ఇపుడు కేంద్ర సంస్థలపై నెపం నెట్టుకొస్తూ పోలవరాన్ని కావాలనే జాప్యం చేస్తున్నట్లుగా వై.ఎస్.జగన్ ప్రభుత్వంపై విషం చిమ్మే ప్రయత్నం చేశారు. ‘పోలవరం వైఫల్యంపై పిల్లి మొగ్గలు’ అనే శీర్షికతో తన వంకర పాత్రికేయాన్ని మరోసారి బయటపెట్టుకున్నారు. ఒక్కటి చెప్పండి రామోజీరావు గారూ? చంద్రబాబు వైఫల్యం వల్లే ప్రాజెక్టుకు ఈ దుస్థితి వచ్చిందని ప్రభుత్వం పదేపదే చెబుతోంది. దానికి సమాధానం చెప్పండి? బాబు పనులు చేసింది కమీషన్ల కోసం కాదా? కమీషన్లు వచ్చే పనులను ముందుగా చేపట్టడం అబద్ధమా? ఇవేవీ చెప్పకుండా కేంద్రంపై నెపం పెట్టేస్తున్నారంటూ శివాలెత్తడం దేనికి? బాబును వెనకేసుకు రావటం దేనికి? అసలు ‘ఈనాడు’ రాతల్లో నిజమెంత? రాష్ట్ర ప్రభుత్వం పదే పదే చెబుతోన్న నిజాలను వక్రీకరిస్తూ.. పోలవరంపై రామోజీ పదేపదే విషపూరిత కథనాలను వండి వార్చటానికి అసలు కారణం... తన కుమారుడి వియ్యంకుడికి చెందిన నవయుగ సంస్థను కాంట్రాక్టు ఒప్పందం నుంచి తప్పించడమే తప్ప మరొకటి కాదన్నది కాదనలేని వాస్తవం. పైపెచ్చు చంద్రబాబుతో కలిసి సాగిస్తున్న దోచుకో.. పంచుకో.. తినుకో(డీపీటీ) విధానానికి విఘాతం కలిగింది కూడా!. చంద్రబాబు పాల్పడిన తప్పిదాలను కేంద్ర సంస్థలు సూచించిన మార్గదర్శకాల మేరకు సరిదిద్దుతూ.. ప్రణాళికాయుతంగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు సీఎం వైఎస్ జగన్ అడుగులు వేస్తున్నారన్నది కాదనలేని నిజం కాదా రామోజీరావు గారూ? కరోనా కష్టకాలంలో కూడా స్పిల్ వే, స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్, ఫైలట్ ఛానల్లను రికార్డు సమయంలో పూర్తి చేయడం అబద్ధమా? 35 మీటర్ల కాంటూర్ పరిధిలోని 4,886 కుటుంబాలకు పునరావాసం కల్పించి.. ఎగువ కాఫర్ డ్యామ్ను పూర్తి చేసి.. గతేడాది జూన్ 11న గోదావరి ప్రవాహాన్ని 6.1 కిమీల పొడవున మళ్లించడం నిజం కాదా? 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని మిగతా 12,138 కుటుంబాలకు పునరావాసం కల్పిస్తూ.. కేంద్ర సంస్థలు సూచించిన మేరకు ఈసీఆర్ఎఫ్ నిర్మాణ ప్రాంతంలో ఏర్పడిన అగాధాలు, దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్, దిగువ కాఫర్ డ్యామ్లో కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చే పనులు చేపట్టి.. వేగంగా ప్రాజెక్టును పూర్తి చేసే దిశగా సీఎం వైఎస్ జగన్ ప్రయత్నించటం మీకెన్నడూ కనిపించదా? చంద్రబాబుది తప్పా? కాదా? ఇక్కడ రామోజీ చెప్పాల్సింది ఒకటే!. నదీ ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్ వే, స్పిల్ ఛానల్ కట్టకుండా.. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్లు నిర్మించకుండా.. 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండా అప్పట్లో అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రధాన డ్యామ్ పునాది డయాఫ్రమ్ వాల్ను నిర్మించేశారు. ఎందుకంటే దాన్లో అయితేనే ఎక్కువ కమీషన్లు వస్తాయి కాబట్టి. అందుకే పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎం మాదిరిగా వాడుకున్నారని సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఇలా చేయటం వల్లే ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో అగాధాలు ఏర్పడ్డాయని, డయఫ్రమ్ వాల్ దెబ్బతిందని ఐఐటీ హైదరాబాద్ నిపుణుల బృందం సహా ప్రపంచ వ్యాప్తంగా ఇంజనీరింగ్ నిపుణులు స్పష్టంచేశారు. ఇలా చేయటం వల్లే డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని ఆంధ్రప్రదేశ్ రిటైర్డ్ ఇంజినీర్ ఇన్ చీఫ్ బీఎస్ఎన్ రెడ్డి కూడా స్పష్టంగా చెప్పారు. ప్రభుత్వం పలు సందర్భాల్లో అధికారికంగానే ఈ విషయాన్ని బయటపెట్టింది. విచిత్రమేంటంటే ‘ఈనాడు’ ఎప్పుడు పోలవరంపై ఎలాంటి రాతలు రాసినా... చంద్రబాబు తప్పు చేశారని గానీ... అలా కాదు చంద్రబాబు చేసిందంతా కరెక్టేనని గానీ ఎన్నడూ చెప్పదు. అదంతా వదిలేసి చంద్రబాబును విమర్శించటం తప్పనే విచిత్రమైన వాదన చేస్తుండటమే దారుణాతిదారుణం. ఐదేళ్లలో చేయలేనిది..15 రోజుల్లో సాధ్యమా? వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2019, మే 30న అధికారాన్ని చేపట్టింది. అదే ఏడాది జూన్ 15న గోదావరికి వరద ప్రవాహం ప్రారంభమైంది. 2014, జూన్ 8 నుంచి 2019, మే 29 వరకూ అధికారంలో ఉన్న ఐదేళ్లలో చంద్రబాబు పూర్తి చేయలేని ఎగువ కాఫర్ డ్యామ్ పనులు, 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని 17,024 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించడం వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 15 రోజుల్లో పూర్తి చేయడం సాధ్యమా? రాజధాని అమరావతిని నిర్మించేసినట్లు గ్రాఫిక్స్లో చూపిన చంద్రబాబుకు.. గోబెల్స్ తలదన్నేలా అబద్ధపు రాతలు అచ్చేసే ‘ఈనాడు’ రామోజీకి మాత్రమే అది సాధ్యమవుతుందేమో? పోలవరంలో విధ్వంసం సృష్టించింది చంద్రబాబే.. కమీషన్ల కక్కుర్తితో చంద్రబాబు పాల్పడిన ఇంజనీరింగ్ తప్పిదాల వల్ల 2019, ఆగస్టులో గోదావరికి వచ్చిన వరదలకు 2400 మీటర్ల వెడల్పుతో ప్రవహించాల్సిన ప్రవాహం ఎగువ కాఫర్ డ్యామ్లో ఖాళీ ప్రదేశం 750 మీటర్లకే కుచించుకుపోయి ప్రవహించింది. అందుకే వరద ఉద్ధృతి అధికమై ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో ఇసుక తిన్నెలు కోతకు గురై రెండు భారీ అగాధాలు ఏర్పడ్డాయి. దిగువ కాఫర్ డ్యామ్లో ఖాళీగా వదిలేసిన ప్రాంతంలోనూ పెద్ద అగాధం ఏర్పడింది. ఇది చంద్రబాబు ఘోర వైఫల్యం కాదా? పోలవరం పనులు ఆలస్యమవుతుండటానికి ప్రధాన కారణం చంద్రబాబు చేసిన తప్పిదాలు కాదా? చంద్రబాబు సృష్టించిన విధ్వంసాన్నే ఐఐటీ హైదరాబాద్ నిపుణుల బృందం ఎత్తిచూపింది. దీనిపై నోరుమెదపరెందుకు రామోజీ? వరదల్లో పనులు చేయడం మీకే సాధ్యమేమో!! దిగువ కాఫర్ డ్యామ్లో 0 నుంచి 680 మీటర్ల వరకూ కోతకు గురైన ప్రదేశాన్ని జెట్ గ్రౌటింగ్ చేస్తూ.. జియో మెంబ్రేన్ బ్యాగ్లలో ఇసుకను నింపి.. వాటిని అగాధం ఏర్పడిన ప్రాంతంలో వేసి.. వైబ్రో కాంపాక్షన్ చేస్తూ పూడ్చి.. 30.5 మీటర్ల ఎత్తుతో జూలై 31 నాటికి పూర్తి చేయాలని ఏప్రిల్ ఆఖరులో పీపీఏ, డీడీఆర్పీ, సీడబ్ల్యూసీలు సూచించాయి. జియో మెంబ్రేన్ బ్యాగ్స్ వినియోగం చాలా తక్కువ. దాంతో వాటి లభ్యత కూడా అంతంత మాత్రమే. అయినా సరే గుజరాత్, అస్సోంలలో వాటిని ఉత్పత్తి చేసే సంస్థలకు ఆర్డర్ ఇచ్చి.. 2.50 లక్షల జియో మెంబ్రేన్ బ్యాగ్స్ను సేకరించారు. జెట్ గ్రౌటింగ్ విఫలమవుతుండటంతో సమయం ఎక్కువ తీసుకోవడంతో పాటు కష్టమైన పాలీయురిథేన్ (పీయూ) గ్రౌటింగ్ చేస్తూ.. జూలై 9 నాటికే 20 మీటర్ల ఎత్తుకు దిగువ కాఫర్ డ్యామ్ను పూర్తి చేశారు. గోదావరికి అనుకోకుండా ఈ సారి వరదలు ముందే వచ్చాయి. దీంతో జూలై 10న అర్ధరాత్రి స్పిల్ వే నుంచి దిగువకు విడుదలైన వరద దిగువ కాఫర్ డ్యామ్ మీదుగా ఈసీఆర్ఎఫ్ నిర్మాణ ప్రాంతంలోకి చేరి నిర్మాణ పనులను ముందుకెళ్లకుండా చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో జూలై 31 నాటికి దిగువ కాఫర్ డ్యామ్ను పూర్తి చేయడం ఎలా సాధ్యం రామోజీరావు గారూ? వరదల్లోనూ పనులు చేస్తూ.. పూర్తి చేసినట్లు గ్రాఫిక్స్ను సృష్టించి.. అదే నిజమని నమ్మబలికే చంద్రబాబే మీకు సరైన జోడీ. వరదల్లో పరీక్షలు చేయడం ఎలా ఈసీఆర్ఎఫ్ నిర్మాణ ప్రాంతంలో ఏర్పడిన అగాధాలను పూడ్చటానికి 9 రకాల పరీక్షలు చేసి.. జూలై 15 నాటికి ఇస్తే.. వాటిని అధ్యయనం చేసి.. ఆ గోతులు పూడ్చే విధానాన్ని ఖరారు చేస్తామని.. వరదలు తగ్గాక ఆ పనులు చేపట్టవచ్చునని రాష్ట్ర జలవనరుల శాఖకు కేంద్ర జల్ శక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం మే 17న నిర్వహించిన సమావేశంలో సూచించారు. ఆ మేరకు రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు పరీక్షలు నిర్వహిస్తున్న క్రమంలోనే జూలై 10న అర్ధరాత్రి గోదావరి వరద ప్రవాహం ఈసీఆర్ఎఫ్ నిర్మాణ ప్రాంతాన్ని ముంచెత్తింది. పరీక్షలకు ఆటంకం కలిగింది. వరదల్లో పరీక్షలు చేయడం అసాధ్యమని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు. అవి కూడా రామోజీకే సాధ్యమని చెప్పాలి మరి. -
ఈనాడు విషపు రాతలపై కోర్టును ఆశ్రయిస్తాం: మంత్రి కారుమూరి
సాక్షి, అమరావతి: ఈనాడు విషపు రాతలపై కోర్టుని ఆశ్రయించనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వర రావు తెలిపారు. ధాన్యం కొనుగోలులో దోపిడీ అంటూ ఈనాడు పత్రికలో వచ్చిన వార్త హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆర్బీకే ద్వారా రైతులకు మేలు చేయాలని ముఖ్యమంత్రి సంకల్పించారని పేర్కొన్నారు. ఈనాడు కథనం పూర్తి అవాస్తవమని, ఆర్బీకేలపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తడిసిన ధాన్యమైనా కొనుగోలు చేయాలని సీఎం అధికారులకి స్పష్టమైన ఆదేశాలిచ్చారని పేర్కొన్నారు. ‘పొలమే లేని వ్యక్తి ఆర్బీకేకు ధాన్యం అమ్మడానికి వెళ్లగా తిరస్కరించినట్లు ఈనాడు పత్రిక సృష్టించింది. తనకి పొలమే లేదని, తాను రైతునే కాదని, అదంతా అబద్దమని ఆ వ్యక్తే చెబుతున్నారు. రైతులే కాని వారిని రైతులగా చూపిస్తూ తప్పుడు వార్తలతో విషప్రచారం చేస్తున్నారు. రైతులకి మేలు చేయడానికే ఈ ప్రభుత్వం ఉంది. ఈనాడు విషప్రచారంపై కోర్టుని ఆశ్రయించనున్నాం. దిగజారుడు వార్తలతో మీ పత్రిక విలువ మరింత దిగజార్చుకుంటున్నారు. రాజ్యసభ ఎంపీ సుభాష్ చంద్రబోస్ చెప్పిన మాటలకు.. ఈనాడు వార్తకు సంబంధం లేదు’ అని మంత్రి అన్నారు. ఈ కేవైసీ త్వరగా చేయకపోవడం వల్ల తప్పులు జరిగే అవకాశాలున్నాయని మాత్రమే ఎంపీ సుభాష్ చంద్రబోస్ చెప్పినట్లు పౌరసరఫరాల శాఖ కమిషనర్ గిరిజా శంకర్ స్పష్టం చేశారు. 68 వేల రైతులు తూర్పుగోదావరిలో ఉంటే 51 వేల మంది నమోదు చేస్తుకున్నారని, ఇంకా 17 వేల మంది రైతులు ఈ కేవైసీ చేసుకోవాల్సి ఉందన్నారు. ప్రత్యేక మేళా ద్వారా ఈ కేవైసీ త్వరగా నమోదు చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. ఈ కేవైసీ నమోదు ద్వారా అక్రమాలకి ఆస్కారం ఉండదన్నారు. మిల్లర్లు, అదికారులు తప్పులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
అదానీకి రాజ్యసభ సీటు?.. క్లారిటీ ఇచ్చిన సంస్థ
ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ.. రాజకీయాల్లోకి రానున్నారా..? ఆయనకు రాజ్యసభ సీటు ఇస్తున్నారా..? దీనిపై కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై అదానీ సంస్థ తరఫున ఓ ప్రకటన విడులైంది. ఏపీ నుంచి గౌతమ్ అదానీ లేదా అతడి భార్య ప్రీతి అదానీలలో ఒకరికి రాజ్యసభ సీటు గ్యారెంటీ అంటూ వస్తున్న వార్తలపై అదానీ సంస్థ క్లారిటీ ఇచ్చింది. ఇదంతా తప్పుడు ప్రచారమంటూ కొట్టిపారేసింది. గౌతమ్ అదానీకి గానీ, అతడి భార్య ప్రీతి అదానీకి గానీ రాజ్యసభ సీటు ఇస్తున్నారంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని స్పష్టం అదాని సంస్థ ట్విట్టర్ వేదికగా స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే అదానీ ఫ్యామిలీలో ఎవరికీ రాజకీయాల మీద ఆసక్తి లేదని, ఏ రాజకీయ పార్టీలో చేరడం లేదని సంస్థ క్లారిటీ ఇచ్చింది. దీంతో ఫేక్ వార్తలకు అదాని చెక్ పెట్టారు. Media Statement on false news about Rajya Sabha Seat pic.twitter.com/GK4y3uIWGL — Adani Group (@AdaniOnline) May 14, 2022 -
ఏయూపై విపక్షాల విషప్రచారం
-
పుట్టినరోజు పార్టీనే.. రేవ్ పార్టీ కాదు: సీఐ రాజశేఖర్రెడ్డి
గుంటూరు: పట్టాభిపురంలో రేవ్పార్టీ జరిగిందన్నది అవాస్తవమని సీఐ రాజశేఖర్రెడ్డి తెలిపారు. అక్కడ హోటల్లో జరిగింది పుట్టినరోజు పార్టీనే.. రేవ్ పార్టీ కాదని వెల్లడించారు. కొన్ని ఛానల్స్లో అసత్య కథనాలు వచ్చినట్లు సీఐ పేర్కొన్నారు. పోలీసు అధికారితోపాటు కొంతమందిని పోలీసులు తప్పించారంటూ.. మీడియాలో వచ్చిన వార్తల్లో నిజం లేదని సీఐ రాజశేఖర్రెడ్డి తెలిపారు. -
వ్యాక్సిన్: ‘అలాంటివారిపై ఓ కన్నేసి ఉంచండి’
న్యూఢిల్లీ: కోవిడ్ సామర్థ్యంపై ప్రజల్లో అపోహలు రేకెత్తిస్తూ, తప్పుడు వార్తలను ప్రచారం చేస్తూ పుకార్లు పుట్టించేవారిపై ఓ కన్నేసి ఉంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. కోవిడ్ వ్యాక్సిన్లపై తప్పుడు వార్తలు ప్రచారం చేసేవారిని గుర్తించి, అటువంటి వారిపై తగు చర్యలు తీసుకోవాలని కేంద్రం, రాష్ట్రాలకు సూచించింది. ఈ మేరకు హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సమాచారమిచ్చారు. అందులో సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేస్తోన్న కోవిషీల్డ్, భారత్ బయోటెక్ తయారుచేస్తోన్న కోవాగ్జిన్ సురక్షితమైనవి అజయ్ భల్లా అన్నారు. ఈ రెండు వ్యాక్సిన్లు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయని దేశంలోని నేషనల్ రెగ్యులేటరీ అథారిటీ గుర్తించిన విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. భారత్లో తయారు చేస్తోన్న ఈ రెండు వ్యాక్సిన్ల వ్యాక్సినేషన్ ప్రక్రియకు జనవరి 16 కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెల్సిందే. అయితే ఔషధ నియంత్రణ సంస్థ అనుమతులు పొందిన ఈ రెండు వ్యాక్సిన్ల సమర్థతపై అనేక అనుమానాలకు తావిస్తూ, అపోహలు సృష్టిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిపట్టించే ప్రయత్నం సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందని, అలా చేస్తే చర్యలు తప్పవన్నారు. -
తప్పుడు ప్రచారాలు చేస్తే ఖబడ్దార్!
సాక్షి, ప్రకాశం: తప్పుడు రాతల పై వైఎస్సార్సీపీ కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఏడాది పాలనలో అభివృద్ధి, సంక్షేమంలో దూసుకుపోతున్న ప్రభుత్వంపై తప్పుడు రాతలు రాస్తే సహించేది లేదని ధ్వజమెత్తారు. సోమవారం జిల్లాలో ఆయన మాట్లాడుతూ, దిగజారుడు రాతలు రాస్తే ఆ పత్రికల యాజమాన్యాల సంగతి తెలుస్తామని హెచ్చరించారు. ఎల్లో మీడియాపై ఆయన విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష నేత చంద్రబాబుకు చంచాగిరి చేసే వాళ్లు హద్దు మీరితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అసమ్మతి అంటూ తమ పార్టీ ఐక్యతను, విశ్వాసాన్ని దెబ్బతీసే కుట్రలను తిప్పికొడతాం అన్నారు. అవసరమైతే ఈ కుట్రలకు వ్యతిరేకంగా ప్రజాపోరాటం చేస్తామని మహాధర్ రెడ్డి ఎల్లోమీడియాపై నిప్పులు చెరిగారు. (డబ్బా కొట్టి, పత్తా లేకుండా పోయారు!) -
అవాస్తవాలను రాస్తే చట్టపరమైన చర్యలు
-
తప్పుడు రాతలపై ఎమ్మెల్యే సీరియస్..
సాక్షి, ఒంగోలు: తనపై కొన్ని పత్రికలు తప్పుడు రాతలు రాస్తున్నాయని కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి మండిపడ్డారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ తాను అసంతృప్తిగా ఉన్నానంటూ అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. జిల్లాలో కొందరు అధికారులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని.. అందుకే ప్రశ్నించానని వివరణ ఇచ్చారు. (ఇసుక విక్రయాలు మరింత పారదర్శకం..) ఏ సీఎం చేయని గొప్ప కార్యక్రమాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్నారన్నారు. తన నియోజకవర్గంలో కూడా అడిగినవన్నీ చేస్తున్నారని ఆయన తెలిపారు. జిల్లాలో కొందరు కిందస్థాయి అధికారులు పనిచేయడం లేదని, బిల్లులు చేయమని మాత్రమే నిలదీశానన్నారు. తప్పుడు రాతలు రాసే పత్రికలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి హెచ్చరించారు. (ప్రజారంజక పాలన చూసి ఓర్వలేకే దుష్ప్రచారం) -
అలాంటి వార్తలు రాయొద్దు: మంత్రి బొత్స
సాక్షి, విశాఖపట్నం: వైజాగ్ గ్యాస్ లీక్ ఘటనపై ప్రజలను భయాందోళనలకు గురిచేసేలా వార్తలు రాయొద్దని మంత్రి బొత్స సత్యనారాయణ కోరారు. లోకో పైలట్లు విష వాయువు బారిన పడ్డారన్నది అవాస్తవం అని స్పష్టం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సోషల్ మీడియాలో అసత్య కథనాలను ప్రచారం చేయడం మంచిది కాదని విజ్ఞప్తి చేశారు. గ్రామాల్లో అన్ని వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. (స్టైరిన్ తరలింపు ప్రక్రియ ప్రారంభం) ఆహారం అందిస్తాం: అవంతి శ్రీనివాస్ ఉదయం నుంచి గ్రామాల్లో అంత క్లీనింగ్ చేయిస్తున్నామని.. జీవీఎంసీ అధికారులు ఇచ్చిన సూచనలు మేరకు ఇళ్లలోకి వెళ్లాలని ప్రజలకు మంత్రి అవంతి శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. ఇళ్లలో ఏసీలు ఆన్ చేయొద్దన్నారు. గ్రామాల్లోకి వచ్చేవారికి ఆహారంతో పాటు వైద్య సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఇళ్లలో ఎవరూ ఆహారం వండుకోవద్దని తెలిపారు. వార్డు వలంటీర్లు, అధికారులు గ్రామాలను పర్యవేక్షణ చేసి సమస్యలను పరిష్కరిస్తారని తెలిపారు. (గ్యాస్ లీక్ : సీఎం జగన్ సహాయం ఓ నిదర్శనం) -
కరోనా: దొరికిపోయిన ఎల్లోమీడియా
సాక్షి, విశాఖపట్నం: వృద్దురాలి మరణంపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేసి దొరికిపోయింది. చోడవరం ద్వారకానగర్కు చెందిన షేక్ మీరాబి అనే వృద్ధురాలు రేషన్ కోసం ఎండలో నిలబడి చనిపోయారంటూ ఎల్లో మీడియా ప్రచారం చేసింది. సహజ మరణాన్ని ఇలా రాజకీయం చేయడం ఏంటని ఆవేదన చెందిన కుటుంబ సభ్యులు ఎల్లో మీడియాపై పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు. (విశాఖలో కోలుకున్న కరోనా బాధితుడు) వృద్దురాలిది సహజ మరణం: ఆర్డీఓ చోడవరం ద్వారకానగర్లోని వృద్దురాలిది సహజ మరణమని అనకాపల్లి ఆర్డిఓ సీతారామరాజు తెలిపారు. గత మూడు రోజులుగా వృద్దురాలు అనారోగ్యంతో బాధపడుతున్నారని వెల్లడించారు. రేషన్ షాపుకు రాకుండానే రేషన్ కోసం ఎండలో నిలబడి చనిపోయిందని చెప్పటం తప్పుడు ప్రచారమని అన్నారు. తప్పుడు వార్తలతో ప్రజలను భయబ్రాంతులకు గురిచెయొద్దని మీడియాకు విజ్ఞప్తి చేశారు. వాస్తవాలను వక్రీకరించారు: ఎమ్మెల్యే ధర్మశ్రీ చోడవరంలోని వృద్దురాలు షేక్ మీరాబి సహజంగానే మృతి చెందారని విశాఖ చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తెలిపారు. గత మూడు రోజులుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నట్లుగా కుటుంబ సభ్యులు చెప్పారని వెల్లడించారు. ఇంటి నుంచి బయలు దేరగానే పడిపోయిందని.. వెంటనే ఇంటికి తీసుకురాగా చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారని చెప్పారు. రేషన్ షాపు దగ్గరకు వెళ్లకుండానే మార్గం మద్యలోనే ఆమె చనిపోయింది. వాస్తవాలను వక్రీకరిస్తూ రేషన్ కోసం ఎండలో నిలబడి ఎండ దెబ్బకు చనిపోయిందని ఎల్లోమీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో తప్పుడు వార్తలు ఇవ్వటం అన్యాయమని, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. ప్రజలను తప్పుద్రోవ పట్టించే ఇటువంటి తప్పుడు వార్తలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. (మీరూ ఒక జర్నలిస్టుగా పనిచేయండి) అసత్య ప్రచారం చేస్తున్నారు: కొడాలి నాని విశాఖపట్నం జిల్లా చోడవరంలో రేషన్ సరుకులు కోసం ఎండలో క్యూలో నిల్చుని వృద్ధురాలు మృతి చెందినట్లు అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. వృద్ధురాలు రేషన్ షాపు దగ్గర క్యూలో మృతి చెందలేదని స్పష్టం చేశారు. రేషన్ సరుకులు కోసం ప్రజలు ఆందోళన చెందనవసరం లేదని, రేషన్ షాపు దగ్గర ప్రతి మనిషికి మూడు నిమిషాలు వ్యవధి పడుతుందన్నారు. రేషన్ సరుకులు ప్రతి రోజు సాయంత్రం వరకు షాపు వద్ద ఇవ్వడం జరుగుతుందని, ప్రజలు సామాజిక దూరం పాటిస్తూ సరుకులు తీసుకోవాలని కోరారు. -
విశాఖనే బెస్ట్ ఆప్షన్ : జీఎన్ రావు
సాక్షి, హైదరాబాద్ : తమ కమిటీ నివేదికపై ఈనాడు, ఆంధ్రజ్యోతిలలో వచ్చిన వార్తలను విశ్రాంత ఐఏఎస్ అధికారి జీఎన్ రావు ఖండించారు. 13 జిల్లాలను 4 జోన్లుగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించినట్టు చెప్పారు. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ఉండాలని తమ నివేదికలో స్పష్టంగా చెప్పామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధిపై తమ కమిటీ ఇచ్చిన నివేదికపై కొన్ని మీడియా సంస్థలు ప్రచురించిన తప్పుడు వార్తలపై జీఎన్ రావు స్పందించారు. బుధవారం హైదరాబాద్లోని లేక్వ్యూ గెస్ట్హౌస్లో జీఎన్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి 13 జిల్లాల అభివృద్ధికి సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి అందజేసినట్టు తెలిపారు. కొందరు జీఎన్ రావు రిపోర్టును తగలబెట్టడం బాధకరమని అన్నారు. తమ నివేదికపై తప్పుడు వార్తలను ప్రసారం చేయడాన్ని ఖండిస్తున్నట్టు చెప్పారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా పెట్టొద్దని తాము చెప్పలేదన్నారు. తమ కమిటీ సభ్యులను ప్రభావితం చేశారనేది పూర్తిగా తప్పుడు ఆరోపణ అని అన్నారు. కమిటీలో 40 ఏళ్ల అనుభవం కలిగినవారు ఉన్నారని జీఎన్ రావు గుర్తుచేశారు. ప్రలోభాలకు లొంగే సాదాసీదా వ్యక్తులు కమిటీలో లేరని స్పష్టం చేశారు. కమిటీ సభ్యులు దేశవ్యాప్తంగా వారి వారి రంగాల్లో ఎంతో అనుభవం కలవారని చెప్పారు. మూడు, నాలుగు నెలలు కష్టపడి తాము నివేదికను తయారుచేస్తే.. దానిని తగలబెట్టడం సరికాదన్నారు. విశాఖపట్నంతోపాటు విజయవాడ, మచిలీపట్నం ప్రాంతాలకు సంబంధిచిన లాభనష్టాలను చర్చించామని వెల్లడించారు. విశాఖలో ఎటువైపు రాజధాని పెట్టుకోవచ్చో రిపోర్టులో స్పష్టంగా చెప్పామని అన్నారు. విశాఖలో అన్ని మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖపట్నం బెస్ట్ ఆప్షన్ అని తెలిపారు. మూడు ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధి జరగాలనే.. మూడు ప్రాంతాల్లో రాజధానులు సూచించినట్టు చెప్పారు. అభివృద్ది వికేంద్రీకరణ కోసం 4 స్థానిక కమిషనరేట్లు ఏర్పాటు చేయాలని రిపోర్టులో స్పష్టంగా పేర్కొనడం జరిగిందన్నారు. ఈ కమిషనరేట్లలో సీనియర్ అధికారాలను నియమించి.. వాటికి పూర్తి అధికారాలు ఇవ్వాలని సూచించినట్టు వెల్లడించారు. కర్నూలులో హైకోర్టు పెడితే.. నాలుగు జిరాక్స్ సెంటర్లు మాత్రమే వస్తాయని అనడం చాలా తప్పని అన్నారు. హైకోర్టుతో ట్రిబ్యునల్స్ కూడా ఏర్పడతాయని చెప్పారు. అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలు తీసుకున్నాకే సూచనలు ఇచ్చినట్టు పేర్కొన్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా అధికారుల, వివిధ వర్గాల ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకున్నామని చెప్పారు. భౌతికంగా, ఆన్లైన్ పద్ధతుల్లో అభిప్రాయాలు స్వీకరించామని.. ఆ తర్వాత డేటాను పూర్తిస్థాయిలో విశ్లేషించామని తెలిపారు. చదవండి : ఎల్లో మీడియాకు ఇప్పుడు అది భగవద్గీత..? -
అసత్య కథనాలపై భగ్గుమన్న యువత
సాక్షి, గుంటూరు: గ్రామ సచివాలయ పరీక్షలపై అవాస్తవాలు ప్రచారం పట్ల నిరుద్యోగులు, విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, ఆంధ్రజ్యోతికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ శనివారం గుంటూరు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సచివాలయ ఉద్యోగ రాత పరీక్షల ప్రశ్నపత్రం లీకైందంటూ ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనాలను ఖండించారు. తప్పుడు వార్తలు రాసిన ఆంధ్రజ్యోతి పత్రిక కాపీలను తగలబెట్టారు. వంద రోజుల్లో 4 లక్షల ఉద్యోగాల కల్పనపై యువత హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, ఉండవల్లి శ్రీదేవి, పార్టీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, ఏసురత్నం, రమేష్ గాంధీ, విద్యార్థి నేతలు సలాం, పానుగంటి చైతన్య తదితరులు పాల్గొన్నారు. -
ఆ వార్తలను ఖండించిన కోటంరెడ్డి
సాక్షి, నెల్లూరు : ఓ పత్రిక సంపాదకుడిపై తాను దాడికి పాల్పడినట్టు వస్తున్న వార్తలను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఖండించారు. తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై ఆయన వివరణ ఇచ్చారు. జమీన్ రైతు పత్రిక సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ అసలు పత్రిక సంపాదకుడే కాదని తెలిపారు. అతను కేవలం అక్రమ సంపాదకుడు మాత్రమేనని అని ఆరోపించారు. డోలేంద్రపై తాను హత్యాయత్నానికి పాల్పడిందనే మాటల్లో వాస్తవం లేదన్నారు. అతను బ్లాక్ మెయిలింగ్ చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. అతని గత చరిత్ర గురించి అందరికి తెలుసన్నారు. డోలేంద్ర మద్యం మత్తులో తనపై కేసు పెట్టారని.. అందులో వాస్తవాలు ఉంటే ఎలాంటి శిక్షకైనా తాను సిద్దమని స్పష్టం చేశారు. -
ఏబీఎన్ చానెల్పై చర్యలు తీసుకోండి
కోనేరు సెంటర్ (మచిలీపట్నం) : ఈవీఎంలు, వీవీప్యాట్లు తరలిపోతున్నాయంటూ అబద్ధపు కథనాన్ని ప్రసారం చేసిన ఏబీఎన్ చానల్, ఆ సంస్థ విలేకరిపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని కృష్ణా యూనివర్శిటీలో భద్రపరచిన ఈవీఎంలు, వీవీప్యాట్లు తరలిపోతున్నాయంటూ ఏబీఎన్ చానల్లో ఈనెల 13న వచ్చిన కథనాన్ని వారు ఖండించారు. తప్పుడు సమాచారంతో వార్తను ప్రసారమయ్యేలా పనిచేసి జిల్లా ప్రజలు, అభ్యర్థుల ఆందోళనకు కారణమైన చానెల్, ఆ విలేకరిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం ఆ పార్టీ నాయకులు జిల్లా అడిషనల్ ఎస్పీ సోమంచి సాయికృష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి ఎ.ప్రసాద్లకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ మచిలీపట్నం పట్టణ కన్వీనర్, మునిసిపల్ మాజీ చైర్మన్ షేక్ సిలార్దాదా మాట్లాడుతూ.. ఎన్నికలకు సంబంధించిన సామగ్రిని భద్రపరచిన యూనివర్శిటీ స్ట్రాంగ్ రూంలలోకి ఏబీఎన్ విలేకరి ప్రవేశించడంతో భద్రతా ఏర్పాట్లలోని డొల్లతనం బయటపడిందన్నారు. ప్రైవేటు వీడియోగ్రాఫర్ను అంటూ సదరు విలేకరి దర్జాగా లోపలికి ప్రవేశించి రహస్యంగా వీడియోలు తీసి చానల్లో ప్రసారం చేయడం ఎన్నికల చట్టాన్ని ఉల్లంఘించడమేనన్నారు. కాగా, ఈ కథనంపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోగా విషయాన్ని నీరుగార్చేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అర్బన్ బ్యాంకు మాజీ చైర్మన్ బొర్రా విఠల్ మాట్లాడుతూ.. వాస్తవాలను ప్రసారం చేయాల్సిన చానళ్లు ఇలాంటి అసత్యపు కథనాలతో తమ రేటింగ్లను పెంచుకునే ప్రయత్నం చేయటం సిగ్గుచేటన్నారు. అబద్ధపు ప్రసారంతో ప్రజాప్రతినిధులు, ప్రజలను తప్పుదోవ పట్టించిన ఏబీఎన్ ఛానల్పై కలెక్టర్, ఎస్పీ తక్షణమే అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. -
అంతర్జాతీయ మీడియా అత్యుత్సాహం
బీజింగ్: అంతర్జాతీయ మీడియా అత్యుత్సాహంపై చైనా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సయీద్ తరలింపు వ్యవహారంలో వస్తున్న వార్తలను ఖండించింది. ఈ మేరకు గురువారం చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఓ ప్రకటనను విడుదల చేశారు. ‘నిరాధారమైన ఈ వార్తలు షాక్కు గురిచేశాయి. అంతర్జాతీయ ఉగ్రవాది, జమాతే ఉద్ దవా అధ్యక్షుడు హఫీజ్ సయీద్ను అంతర్జాతీయ ఒత్తిడికి తలొగ్గి పాక్ నుంచి పశ్చిమ ఆసియా దేశాలకు తరలించమని జిన్పింగ్ కోరినట్లు వార్తలు వచ్చాయి. అదంతా నిరాధారం. మేం ఎలాంటి సూచనలు చెయ్యలేదు’ అని ఆ ప్రకటనలో పేర్కొంది. ఇదిలా ఉంటే అంతర్జాతీయ ఉగ్రవాది సయీద్పై చర్యలు తీసుకోవాలని అమెరికాతోపాటు భారత్ కూడా పాక్పై తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సయీద్ను పశ్చిమ ఆసియా దేశాలకు పంపించాలని గత నెల బీజింగ్లోని బావో ఫోరమ్ సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్, పాక్ ప్రధాని అబ్బాసీతో సమావేశమైనపుడు కోరినట్టు వార్తలు గుప్పుమన్నాయి. ఇరు దేశాధినేతలు దాదాపు అరగంట పాటు సయీద్ అంశం గురించి చర్చించినట్లు జాతీయ, అంతర్జాతీయ మీడియాలు కథనాలు సైతం ప్రచురించాయి. ఈ నేపథ్యంలోనే డ్రాగన్ కంట్రీ ఖండన ప్రకటన విడుదల చేసింది. కాగా, హఫీజ్ సయీద్ను 2012లో అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన అమెరికా, అతడిపై 10 మిలియన్ల డాలర్ల రివార్డును ప్రకటించింది. -
బిగ్బాస్ అబద్ధం చెపుతున్నాడు..!
ప్రముఖ రియాలిటీ షో బిగ్బాస్ సౌత్లో కూడా ఘనవిజయం సాధించింది. తమిళనాట లోక నాయకుడు కమల్ హాసన్ ఈ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుండటంతో మరింత క్రేజ్ ఏర్పడింది. తొలి సీజన్కు మంచి ఆదరణ లభించినందున త్వరలోనే మరో సీజన్ను స్టార్ట్ చేసేందుకు బిగ్బాస్ యూనిట్ రెడీ అవుతోంది. రెండో సీజన్కు కూడా కమల్ హాసనే వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. ఇటీవల ఈ సీజన్లో పాల్గొనబోయే వారు వీరే అంటూ వికటన్ సోషల్ మీడియా పేజ్లో కొంత మంది సెలబ్రిటీ ఫొటోలను పోస్ట్ చేశారు. ఈ లిస్ట్లో జననీ, నందితా, భరత్, అశోక్ సెల్వన్, ప్రియా ఆనంద్ వంటి వారితో పాటు రాయ్ లక్ష్మీకూడా షోలో పాల్గొననుందని వెల్లడించారు. ఈ వార్తలపై స్పందించిన రాయ్ లక్ష్మీతాను బిగ్ బాస్లో పాల్గొనబోవటం లేదని క్లారిటీ ఇచ్చారు. ఈ విషయంపై తన సోషల్ మీడియా పేజ్ స్పందించిన ఆమె ‘బిగ్బాస్ తమిళ్ ఎందుకు నా గురించి ప్రతీ సీజన్లో తప్పుడు వార్తలు సృష్టిస్తోంది..? ఎందుకు..?’ అంటూ ట్వీట్ చేశారు. Why is #bigbosstamil spreading a false news about me every season ? Why why why ? 🤷🏻♀️🙄 https://t.co/BFZBjLeUHD — RAAI LAXMI (@iamlakshmirai) 13 May 2018 -
అవాస్తవ కథనాలపై లీగల్ చర్యలు
సాక్షి, న్యూఢిల్లీ : ఆధార్ గోప్యత విషయంలో మీడియాల్లో వస్తున్న కథనాలపై యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) స్పందించింది. అసత్య కథనాలను, అవాస్తవాలను ప్రసారం చేసినా, ప్రచురించినా న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. జెడ్డీ నెట్ అనే వ్యాపార సంబంధిత వెబ్సైట్.. ఆధార్ వ్యవస్థలో లోపాలు ఉన్నాయంటూ ఓ కథనాన్ని ప్రచురించింది. ఆధార్ వ్యవస్థ పటిష్టంగా లేదని.. వినియోగదారుల వ్యక్తిగత విషయాలతోపాటు బ్యాంక్ వివరాలను కూడా సులువుగా బుట్టదాఖలు చేసే పద్ధతులు ఉన్నాయని.. అందుకు ప్రభుత్వ కార్యాలయాల్లోని కంప్యూటర్లు సరిపోతాయంటూ పేర్కొంది. గతంలో ఇలాంటి వ్యవహారాలు(ఏజెంట్ల యూజర్ ఐడీ, పాస్ వర్డ్ల ద్వారా, ప్రభుత్వ కార్యాలయాల ద్వారా లీక్ కావటం) వెలుగులోకి వచ్చినప్పుడు వాటిని సరిచేసినట్లు ప్రభుత్వం ప్రకటించిందని.. కానీ, ఇప్పటికీ అది ఆగలేదని జెడ్డీ నెట్ కథనం తెలిపింది. దీనిపై యూఐడీఏఐ స్పందించింది. ఆధార్ గోప్యతపై ఆధారాలు లేకుండా కథనాలు ప్రచురిస్తే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఆధార్ సమాచారం అత్యంత సురక్షితంగా ఉందని.. సూపర్ కంప్యూటర్ నుంచి ఆధార్ సమాచారాన్ని తస్కరించాలంటే వందల కోట్ల సంవత్సరాలకు పైగా పడుతుందని పేర్కొంది. కాగా, ఆధార్ డేటా భద్రతపై సుప్రీం కోర్టులో ప్రజంటేషన్ ఇచ్చిన యూఐడీఏఐ 2048-ఎన్క్రిప్షన్ కీ సిస్టమ్లో భద్రంగా ఉన్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. -
శ్రీదేవి మృతిపై పుకార్లు.. ఏక్తా ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ నటి శ్రీదేవి మరణం పట్ల వస్తున్న పుకార్లపై బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ ఘటుగా స్పందించారు. శ్రీదేవి సర్జరీ కారణంగానే మృతి చెందిందని, సర్జరీ వికటించడంతో గుండెపోటు వచ్చిందంటూ సోషల్మీడియా, ప్రసార మాధ్యమాల్లో వస్తున్న వార్తలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో లేనివి, ఉన్నవి కల్పిస్తూ అసత్య వార్తలు ప్రచారం చేయవద్దని ఆమె సూచించారు. ‘చెడ్డ వాళ్లు ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎలాంటి గుండె సంబంధిత వ్యాధుల్లేకుండా, సంపూర్ణ ఆరోగ్యం కలిగిన వారిలో 1శాతం మందికి గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. ఈ విషయం పరిశోధకులు తెలిపారని ఓ డాక్టర్ నాకు చెప్పారు. ఇది విధి రాత.. ఉన్నవి లేనివి కల్పిస్తూ తప్పుడు వార్తలు ప్రచారం చేయవద్దు’ అని ట్వీట్ చేశారు. శనివారం రాత్రి దుబాయ్లో నటి శ్రీదేవి గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. దుబాయ్ నుంచి ప్రత్యేక విమానంలో ఆమె పార్దీవ దేహం తీసుకురానున్నారు. ఆమె అంత్యక్రియలు ముంబైలో జరగనున్నాయి. Evil ones pls realise one percent ( as fwded as my doc told me) of the population can have an cardiac arrest without any heart condition or any kind of surgery ! It’s destiny not how evil rumour mongers portray!!! — Ekta Kapoor (@ektaravikapoor) 25 February 2018 -
మీడియా వార్తలు.. నిలదీసిన వర్మ
సాక్షి, సినిమా : సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసుల విచారణలో జీఎస్టీని అసలు తాను తీయలేదని వర్మ చెప్పాడంటూ కొన్ని ప్రముఖ మీడియా ఛానెళ్లలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ఆ చిత్ర తెరకెక్కించిన ఘనత తనకే దక్కినప్పుడు.. అందులో తాను భాగస్వామిని కాలేదన్న విషయాన్ని ఎలా ప్రచురిస్తారంటూ నిలదీస్తున్నాడు. ‘అసత్యపు వార్తలను ప్రసారం చేస్తున్న కొందరు గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ను అసలు తాను తీయలేదని.. కేవలం సాంకేతిక సాయం మాత్రమే అందించానని చెబుతున్నారు. సినిమా తెరెక్కించిన ఘనత నాదే అయినప్పుడు ఆ వార్తలను నేను ఖండించకుండా ఎలా ఉంటా?’ అని వర్మ తన ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ఈమేరకు ఓ జాతీయ పత్రిక కథనాన్ని ఆయన పోస్ట్ చేశారు. కాగా, వర్మ తాను అసలు జీఎస్టీ తీయలేదని.. కేవలం స్క్రిప్టు మాత్రమే అందించానని విచారణలో వెల్లడించినట్లు కొన్ని పత్రికలు కథనాలు రాయగా.. నిర్మాణంలో కూడా భాగస్వామ్యం అయ్యాడంటూ మరికొన్ని కథనాలు ప్రచురించాయి. ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్’ (జీఎస్టీ) వీడియో, మహిళను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన కేసులో నోటీసులు అందుకున్న వర్మ గత శనివారం సీసీఎస్ పోలీసుల ముందు హాజరయ్యాడు. సుమారు 3గంటలకు పైగా వర్మను విచారించిన పోలీసులు ల్యాప్ ట్యాప్, సెల్ ఫోన్ను సీజ్ చేసి మళ్లీ ఈ శుక్రవారం(23వ తేదీ) విచారణకు హాజరు కావాలంటూ ఆదేశించారు. For all those false news circulating that I have denied making #GodSexTruth,its only a production and technical process that I was detailing ..How can I deny when I am credited in the film? https://t.co/eJrULnCBUJ — Ram Gopal Varma (@RGVzoomin) 19 February 2018 -
'ఆ వార్తల్లో నిజం లేదు'
సాక్షి, హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా తాను భాద్యతలు చేపట్టబోతున్నట్టు వస్తున్న వార్తలను ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు ఖండించారు. గత రెండు మూడు రోజులుగా కొన్ని పత్రికల్లో, సోషల్ మీడియాలో రాఘవేంద్రరావు టీటీడీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించనున్నట్టు వార్తలు వచ్చాయి. దీంతో ఆయన సన్నిహితులు అభినందనలు తెలిపారు. అయితే ఈ విషయంపై బయట వస్తున్న వార్తల్లో నిజం లేదని రాఘవేంద్రరావు వెల్లడించారు. ఎస్వీఎస్సీ ఛానల్ ద్వారా స్వామివారి సేవ చేస్తున్నానని.. మరిన్ని వైవిధ్యమైన కార్యక్రమాలతో అలరిస్తూ స్వామి సేవలో తరలించాలన్నదే తన కోరిక అని దర్శకేంద్రుడు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయన టీటీడీ బోర్డు మెంబర్గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. -
ఓ టెకీనే అమ్మపై దుష్ప్రచారం చేశాడు
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై దుష్ప్రచారం చేసిన వ్యక్తుల్లో ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్ కూడా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. జయ ఆరోగ్యం సరిగా లేదంటూ ఓ వెబ్ సైట్ ద్వారా ఆపోలో ఆస్పత్రిలో ఉద్యోగి చెప్పినట్లుగా ఓ వెబ్ సైట్ ద్వారా ప్రచారం చేశారు. దీనికి సంబంధించి సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులు విచారించి సతీశ్ కుమార్ (26), మదాసమి(25) అనే ఇద్దరు యువకులను అరెస్టు చేశారు. వీరిలో సతీశ్ కుమార్ ఎంసీఏ చదివాడు. ప్రస్తుతం ఓ ప్రైవేట్ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తుండగా మదాసమి కూడా వాలచెరీలోని ఓ ప్రైవేట్ సంస్థలో టెక్నీషియన్ పని చేస్తున్నాడు. 'టెక్నీషియన్ వెబ్ సైట్లో అపోలో ఆస్పత్రి ఉద్యోగి చెప్పినట్లుగా ఉన్న ఆడియోను వెబ్ సైట్ లో నమోదు చేయగా.. ఐటీ ఇంజినీర్ ఫేస్బుక్ లో జయ ఆరోగ్యంపై దుష్ప్రచారం చేశాడు. వీరిద్దరు కూడా ప్రజలు భయపడేంత స్థాయిలో ఆడియో క్లిప్పింగులు, సందేశాలు పెట్టారు' అని పోలీసులు వివరించారు. ఏఐఏడీఎంకే ఐటీ విభాగం సెక్రటరీ కేఆర్ రామచంద్రన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ విచారణ చేసి అరెస్టులు చేశారు. -
అసత్య వార్తలు పోస్ట్ చేస్తే చర్యలు
జిల్లా ఎస్పీ రవిప్రకాష్ హెచ్చరిక రాజమహేంద్రవరం క్రైం : కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం దీక్షకు సంబంధించి సోషల్ మీడియాలో అసత్య వార్తలు, ఫొటోలు హల్చల్ చేస్తున్నాయని, వాటిని ప్రజలు నమ్మవద్దని జిల్లా ఎస్పీ రవిప్రకాష్ పేర్కొన్నారు. ఆదివారం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రి మీడియా పాయింట్ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్, టెలిగ్రామ్ మెసేజ్స్ తదితర సోషల్ మీడియాలో అసత్య వార్తలు వస్తున్నాయని తెలిపారు. దీనివల్ల ప్రజలు భయాందోళనలకు గురై, శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందన్నారు. ఇవి సైబర్ నేరాల్లోకి వస్తాయని, వాటిపై విచారణ జరుపుతామని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వంద శాతం అసత్య ప్రచారాలే ఉంటున్నాయని తెలిపారు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చే వార్తలు వాస్తవమని ప్రజలు గ్రహించాలని వివరించారు. దీక్ష చేపట్టాక పురుగు మందు తాగుతానని, ఆత్మహత్య ప్రేరణకు యత్నించడంతో.. ముద్రగడను కాపాడే చర్యల్లో భాగంగా ఆయనను అరెస్టు చేసి, ప్రభుత్వాస్పత్రికి తరలించామని చెప్పారు. తొలి రోజున ఆస్పత్రికి తీసుకువచ్చిన పది నిమిషాల్లో ఆయన కడుపులో ఏమైనా పురుగు మందు ఉంటే శుభ్రం చేసేందుకు ప్రయత్నించిన వీడియో క్లిప్పింగ్ను సోషల్ మీడియా తప్పుదోవ పట్టిస్తోందని పేర్కొన్నారు. కాపు జేఏసీ ఛలో రాజమహేంద్రవరానికి పిలుపునిచ్చిన సందర్భంగా దానిని అడ్డుకుంటామని చెప్పారు. ఇప్పటికే సెక్షన్ 30, 144 అమలులో ఉన్నాయని, సభలు, సమావేశాలకు అనుమతిచ్చేది లేదని స్పష్టం చేశారు. జిల్లావ్యాప్తంగా ముద్రగడ దీక్ష నేపథ్యంలో 160 మందిని అదుపులోకి తీసుకున్నామని, 60 మందిని గృహ నిర్బంధంలో ఉంచామని చెప్పారు. జిల్లావ్యాప్తంగా శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని తెలిపారు. -
ఎన్నికల వేళ... తారస్థాయికి ఎల్లో ఫీవర్
ఏడాది కిందటి కథనమే మళ్లీ వండివార్చిన ‘ఈనాడు’ రొటీన్గా జరిగిన లీజు బదలాయింపునకు క్విడ్ ప్రో కో రంగు ఈ లీజుకు దరఖాస్తు చేసింది చంద్రబాబు హయాంలోనే బాబు హయాంలో భారీ ఎత్తున లీజు బదలాయింపులు అవన్నీ విస్మరించి జగన్ జనాదరణ టార్గెట్గా కథనాలు దాల్మియా పెట్టుబడికి అతితక్కువ కాలంలో రూ. 55 కోట్ల లాభం క్విడ్ ప్రో కో పెట్టుబడులకు లాభాలొస్తాయా? ఆది నుంచీ సీబీఐతో కుమ్మక్కయి విషం గక్కుతున్న రామోజీ ఎన్నికల వేళ. ఎల్లో ఫీవర్ తారస్థాయికి చేరుతోంది. విషపు రాతలు విజృంభిస్తున్నాయి. జన క్షేత్రంలో జగన్మోహన్రెడ్డిని ఎదుర్కోలేని శక్తులన్నీ ఏకమవుతున్నాయి. వై.ఎస్.జగన్మోహన్రెడ్డి జనాదరణను లక్ష్యంగా చేసుకుని... ఎల్లో వంటకాలు సిద్ధమవుతున్నాయి. ‘‘టన్నులు కాదు... సొమ్ములే’’ అంటూ శనివారం ‘ఈనాడు’ వండివార్చిన కథనమూ ఆ కోవలోనిదే. నిజానికి ఈ కథనం ‘‘టన్నులంటే రూ.కోట్లు’’ అంటూ సరిగ్గా ఏడాది కిందట పని గట్టుకుని రాసిందే. మళ్లీ అదే కథనాన్ని... సీబీఐ అదనపు వివరాలు సమర్పించిందనే సాకు చూపిస్తూ... యథాతథంగా మరోమారు అచ్చేశారు రామోజీ... నిజమే!! తన ‘ఈనాడు’ పత్రికలో ఓ విభాగమైన ‘న్యూస్టుడే’... అదే ఈనాడు కాంపౌండ్లో తాను పెట్టిన ‘న్యూస్టుడే’... తన వందిమాగధులే డెరైక్టర్లుగా కొనసాగుతున్న న్యూస్టుడే... ఎక్కడుందో కూడా తనకు తెలీదని, ఆ డెరైక్టర్లెవరో కూడా గుర్తులేదని కోర్టులో ప్రమాణం చేసి మరీ చెప్పిన చరిత్ర రామోజీది. అలాంటి రామోజీకి అంతా తనలానే ఉంటారని అనిపించటంలో తప్పేమీ లేదు. గతేడాది ఏప్రిల్ 14న ఈనాడు ప్రచురించిన కథనం శనివారం నాటి ఈనాడులో ప్రచురించిన నాటి కథనానికి నకలు లీజు బదలాయిస్తే ముడుపులు వస్తాయా? అసలు దాల్మియా సిమెంట్స్కు సంబంధించి సీబీఐ వేసిన ఈ ఛార్జిషీటు, దానికి అనుబంధంగా సాగిందని చెబుతున్న దర్యాప్తు... అన్నీ తిరిగింది ఒకే అంశం చుట్టూ. అది... కడప జిల్లా మైలవరం తలమంచిపట్నం, నవాబ్పేట గ్రామాల పరిధిలో దాల్మియా సిమెంట్స్కు 407 హెక్టార్లలో ఉన్న సున్నపురాయి గనుల లీజుల్ని వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలోని ప్రభుత్వం వేరొకరి నుంచి బదలాయించిందని. అందుకు ప్రతిఫలంగానే భారతి సిమెంట్స్లో దాల్మియా సంస్థ పెట్టుబడులు పెట్టిందని!! అన్నిటికన్నా చిత్రమేంటంటే ఈ లీజుకు దరఖాస్తు చేయటం, దాన్ని పరిగణనలోకి తీసుకోవటం... అంతా జరిగింది వైఎస్ హయాంలో కాదు. సాక్షాత్తూ చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా 1997లో. కానీ ఎల్లో మీడియా రాతల నుంచి, ఎల్లో పార్టీల ఆరోపణల నుంచి, సీబీఐ చార్జిషీట్ల దాకా ఎక్కడా ఈ విషయం కనపడదు. జగన్మోహన్రెడ్డి తరఫు న్యాయవాదులు, ‘సాక్షి’ దీన్ని ఆధారాలతో సహా ప్రచురించినా వారికి పట్టదు. ఇదీ జరిగింది... వైఎస్సార్ కడప జిల్లా ఏమంత అభివృద్ధి చెందినది కాదన్నది ఆంధ్రప్రదేశ్లో గడప గడపకూ తెలుసు. వ్యవసాయం గిట్టుబాటయ్యే పరిస్థితి లేదు. వర్షాలూ తక్కువే. ఒక్క కడప అనే కాదు. రాయలసీమంతా ఇదే పరిస్థితి. అలాంటిచోట సున్నపురాయి గనుల్ని లీజు పద్ధతిన మైనింగ్ చేయటానికి అనుమతివ్వాలని 1997లో జయా మినరల్స్ దరఖాస్తు చేసుకుంది. అప్పటికి ముఖ్యమంత్రి చంద్రబాబే. తరవాత ఈ భూముల లీజు కోసం ఎలాంటి దరఖాస్తూ రాలేదు. పోటీ లేకుండా ఒకే దరఖాస్తుదారు ఉన్నట్టన్నమాట. పెపైచ్చు జయా మినరల్స్ అడిగిన భూమి ప్రైవేటు భూమే తప్ప ప్రభుత్వ భూమి కాదు. పూర్తిగా రైతుల చేతుల్లోనే ఉంది. వర్షాభావంతో నిండిన ప్రాంతం కనుక రైతులు కూడా మంచి ధర వస్తే విక్రయానికి వెనకాడే పరిస్థితి ఉండదు. ఇవన్నీ పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం... పోటీదారులెవరూ లేకపోవటంతో 2008లో 1005 ఎకరాల సున్నపురాయి గనుల్ని లీజు పద్ధతిపై చట్టబద్ధంగా కేటాయించింది. తరవాత ఫ్యాక్టరీ పెట్టడానికి జయా మినర ల్స్ వాళ్లే ఈశ్వర్ సిమెంట్స్ సంస్థను ఏర్పాటు చేశారు. రుణాలు రావాలంటే కంపెనీ పేరిట గనులుండాలి కనుక లీజును ఈశ్వర్ సిమెంట్స్కు బదలాయించాలని దరఖాస్తు చేసుకోవటం... ప్రభుత్వం రొటీన్గా బదలాయించటం అన్నీ జరిగిపోయాయి. లీజు పొందిన ఈశ్వర్ సిమెంట్స్... ఫ్యాక్టరీ ఏర్పాటు చేయలేని పరిస్థితుల్లో అందుకు ముందుకొచ్చిన దాల్మియాకు లీజును బదలాయించాలని కోరటం... రెండు సంస్థలు పరస్పర ఆమోదం తెలియజేయటంతో ప్రభుత్వం అనుమతించటం జరిగింది. నిజానికి ఏటా వంద వరకూ మైనింగ్ లీజుల బదలాయింపులకు సంబంధించి ఉత్తర్వులు జారీ అవుతుంటాయి. మరి ఈ ఒక్క బదలాయింపునే పట్టుకుని, దాల్మియా సిమెంట్స్ పెట్టిన పెట్టుబడుల్ని క్విడ్ ప్రో కోలుగా, ముడుపులుగా చూపిస్తూ రాద్ధాంతం చేస్తున్నారంటే లోగుట్టు తెలియటం లేదూ!!. అసలు దాల్మియా సిమెంట్స్కు మేలు చేయాలనుకుంటే వైఎస్ నేరుగా చంద్రబాబు మాదిరిగా ప్రభుత్వ భూమిలో ఉన్న మైనింగ్ లీజునే ఇచ్చేవారుగా!! అపుడు ఎల్ అండ్ టీ మాదిరిగా దాల్మియాకు కూడా ఎకరా రూ. 4వేలకే వచ్చేదిగా? ప్రైవేటు భూముల్లో ఉన్న లీజును ఎందుకు బదలాయిస్తారు? అయినా సున్నపురాయి గనులు సిమెంట్ కంపెనీలకు కాక దేనికి పనికొస్తాయి? ఎప్పటికైనా సున్నపురాయి గనుల్ని సిమెంట్ కంపెనీలకు ఇవ్వాల్సిందేగా? ఏ కంపెనీ ముందు దరఖాస్తు చేసుకుంటే దానికే ఇస్తారుగా? దీన్ని ఇంతవరకూ తీసుకొచ్చారంటే అర్థం కావటం లేదా? చంద్రబాబు బదలాయింపులివీ... వైఎస్సార్ హయాంలో ఒక లీజు బదలాయించినందుకే దాల్మియా సంస్థ క్విడ్ ప్రో కో పెట్టుబడులు పెట్టిందని ఎల్లో మీడియా శివాలెత్తుతోంది. మరి చంద్రబాబు హయాంలో జరిగిందేంటి? నల్లగొండ జిల్లాలో రాశి సిమెంట్స్కు చెందిన 1800 ఎకరాల సున్నపురాయి గనుల లీజును చంద్రబాబు ఇండియా సిమెంట్స్కు బదలాయించారు. అదే జిల్లాలో ప్రియా సిమెంట్స్కు కేటాయించిన వేయి ఎకరాల సున్నపురాయి గనుల లీజును రెయిన్ ఇండస్ట్రీస్కు బదలాయిస్తూ బాబు ప్రభుత్వమే ఉత్తర్వులిచ్చింది. నల్లగొండ జిల్లాకు చెందిన సెజ్ సిమెంట్ నుంచి 300 ఎకరాల సున్నపురాయి గనుల లీజును అంజనీ పోర్ట్ల్యాండ్ సిమెంట్కు బదిలీ చేస్తూ బాబు ఉత్తర్వులిచ్చారు. గుంటూరు జిల్లాలో పార్థసారథి సిమెంట్స్కు చెందిన 500 ఎకరాల సున్నపురాయి గనుల లీజును శ్రీ చక్ర సిమెంట్స్కు బాబు సర్కారు బదలాయించింది. ఇవి జస్ట్ మచ్చుకు మాత్రమే. ఇక బాబు లీజు కేటాయింపులు చూస్తే బుర్రతిరిగిపోతుంది. గుంటూరు జిల్లాలో అంబుజా సిమెంట్స్కు 1999లో చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా 2,500 ఎకరాల సున్నపురాయి గనుల లీజులిచ్చింది. ఇదే జిల్లాలో 2003లో పరాశక్తి సిమెంట్స్కు 300 ఎకరాల సున్నపురాయి గనులను లీజుకిచ్చింది. ఇంతెందుకు!! ఒక్క కర్నూలు జిల్లాలోనే చంద్రబాబు ఏకంగా 8,112 ఎకరాల మైనింగ్ లీజులిచ్చారంటే ఏమనుకోవాలి? ఎల్లో మీడియా, దానితో జతకలిసిన దర్యాప్తు సంస్థల థియరీ ప్రకారం ఎన్ని వేల కోట్లు చేతులు మారి ఉండాలి? చంద్రబాబు జేబులోకి ఎన్ని లక్షల కోట్లు వచ్చి ఉండాలి? దీన్ని క్విడ్ ప్రో కో అంటారా? భారతి సిమెంట్స్లో దాల్మియా సిమెంట్స్ పెట్టుబడి పెడితే... దాన్ని ఇన్వెస్ట్మెంట్గా చెప్పాలి గానీ పదేపదే క్విడ్ ప్రో కో అంటూ ఇష్టం వచ్చిన ఆరోపణలు చేస్తున్నవారికి ఏమైనా ఇంగితజ్ఞానం ఉందా అనిపిస్తుంది. ఎందుకంటే దాల్మియా సంస్థ భారతి సిమెంట్లో దశలవారీగా 95 కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టింది. ఈ 95 కోట్లకు గాను తమ చేతికొచ్చిన వాటాను దాల్మియా ఆ తరవాత ఫ్రాన్స్కు చెందిన వికా కంపెనీకి విక్రయించేసింది. దాంతో ఆ కంపెనీకి ఏకంగా 150 కోట్ల పైచిలుకు సొమ్ము చేతికొచ్చింది. అంటే అతితక్కువ కాలంలో రూ.55 కోట్ల లాభం వచ్చినట్లు. మరి ముడుపులకు లాభాలొస్తాయా? లాభాలొచ్చినా కూడా అవి ‘క్విడ్ ప్రో కో’ పెట్టుబడులే అంటూ సాగుతున్న దర్యాప్తును, దాన్ని పనిగట్టుకుని ప్రచారం చేస్తున్న ఎల్లో మీడియాను ఏమనుకోవాలి? ఈ రాష్ట్ర ప్రజలకు ఆ మాత్రం అర్థం కాదనా రామోజీ ఉద్దేశం? 40 ఏళ్లుగా తానేం చెప్పినా చెల్లిపోతోందన్న తెంపరితనమా? దాల్మియా ఎందుకు పెట్టిందంటే... దాల్మియా సంస్థ చాన్నాళ్లుగా సిమెంట్ రంగంలో ఉంది. భారతి సిమెంట్కు దగ్గర్లోనే తన ఫ్యాక్టరీ కూడా ఉండటంతో దీన్లో కూడా వాటా తీసుకుంటే వారికి కలిసొస్తుందనే అంశం ఎవ్వరూ కాదనలేనిదే. ఎందుకంటే భవిష్యత్తులో కనుక భారతి సిమెంట్ విక్రయానికి వస్తే వాటాదారుగా తనకు ప్రయోజనం ఉంటుందని, తానే తీసుకుంటే ఆ ప్రాంతంలో తమ ఆధిపత్యం ఉంటుందని వారు భావించి ఉండవచ్చనేది ఈజీగా అర్థమయ్యే అంశం. ఒకే ప్రాంతంలో ఉన్న కంపెనీల మధ్య పోటీ ఉంటుంది కాబట్టి సహజంగా ఏ పెద్ద వ్యాపార సంస్థయినా ఇలానే ఆలోచిస్తుంది. సీబీఐ ఆది నుంచీ అదే తీరు... వరస చార్జిషీట్లు వేయటంతో పాటు ప్రపంచంలో ఏ కేసులోనూ ఎవ్వరూ వేయలేనన్ని చిత్రమైన ఫీట్లు సీబీఐ ఈ కేసులో వేసిందనేది కాదనలేని సత్యం. దీన్లో భాగంగానే దర్యాప్తును ముందుగానే ఓ వర్గంలోని మీడియాకు తెలియజేస్తూ... లీకులిస్తూ... వారు వేసిన కథనాలనే చార్జిషీట్లలో చేరుస్తూ సాగించిన దర్యాప్తు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ తెలిసిందే. తాజా కథనం కూడా అలాంటిదే. ఏడాది కిందట వేసిన ఛార్జిషీటుకు సంబంధించి, దాన్లోని విషయాలపై సీబీఐ అధికారి ఒకరు దర్యాప్తు చేశారని, నిజాల్ని నిగ్గు తేల్చారని పేర్కొంటూ ‘ఈనాడు’ కథనం వండేసింది. నిజానికి సీబీఐ ఆ పత్రాల్ని శుక్రవారమే కోర్టుకు సమర్పించింది. కోర్టు వాటినింకా పరిగణనలోకి తీసుకోలేదు కూడా. అయినా ఈనాడు చేతికవి రావటం, అచ్చువేసేయటం చూస్తుంటే... ఆ బంధం ఎంత బలంగా కొనసాగుతోందో కనిపించటం లేదూ!!!