Fungus
-
బీరు సీసాల్లో ఫంగస్
మల్లాపూర్(కోరుట్ల): ఓ బెల్ట్షాపులో కొనుగోలు చేసిన బీరుసీసాల్లో ఫంగస్ కనిపించింది. కొనుగోలుదారుల వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా ఖానాపూర్కు చెందిన కొంతమంది వ్యక్తులు మంగళవారం మెట్పల్లి వెళ్తున్నారు. మార్గమధ్యలో మల్లాపూర్ మండలంలోని ఒబులాపూర్ బెల్ట్షాప్లో బీర్లు తీసుకున్నారు. రెండు సీసాల్లో ఫంగస్ కనిపించింది. దీనిపై బెల్ట్షాప్ నిర్వాహకులను ప్రశ్నించగా, నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారన్నారు. అధికా రులు స్పందించి, నాణ్యత లేని మద్యం విక్రయిస్తున్న బెల్ట్షాప్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
అంతరించిపోయే స్టేజ్లో బనానా!..శాస్త్రవేత్తలు స్ట్రాంగ్ వార్నింగ్
కాలుష్యం లేదా కొన్ని రకాల చీడపీడల కారణంగా పూర్వం నాటి ప్రముఖ పండ్లు, కూరగాయాలు అంతరించిపోవడం జరిగింది. వాటి విత్తనాలు సైతం కనుమరగవ్వడం. అందుబాటులో ఉన్న మొక్కల సాయంతోనే కొత్త రకాల వంగడాలను సృష్టించడం వంటివి చేశారు శాస్త్రవేత్తలు. ఇలా ఎందుకు జరుగుతుందని శాస్త్రవేత్తల మదిని తొలిచే చిక్కు ప్రశ్న. ఇప్పుడు ఆ స్టేజ్లోకి బనానాలు కూడా వచ్చేశాయి. ఔను!.. మనం ఎంతో ఇష్టంగా తినే అరటిపండ్లు అంతరించే పోయే ప్రమాదంలో ఉన్నాయని గట్టిగా హెచ్చరిస్తున్నారు. ఎందువల్ల అరటిపండ్లు అంతరించిపోతున్నాయి? రీజన్ ఏంటి? తదితరాల గురించే ఈ కథనం!. పేదవాడు సైతం కొనుక్కుని ఇష్టంగా తినగలిగే పండు అరటిపండు. అరటిపండులో ఉండే పోటాషియం వంటి విటమిన్లు ఎన్నో రకాల వ్యాధులను దరి చేరకుండా రక్షిస్తుంది. అలాంటి పోషకవిలువలు కలిగిన పండు ప్రస్తుతం కనుమరగయ్యే స్థితిలో ఉందని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు. ప్రజలు ఇష్టంగా తినే అరటి పండ్లలలో కావెండిష్ అరటిపండ్లు ఒకటి. ఇది వాణిజ్యం పరంగా అధికంగా ఎగుమతయ్యే అరటిపండు కూడా ఇదే. ఈ అరటిపండ్ల చెట్లకు పనామా అనే ఉష్ణమండల జాతికి చెందిన ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుందని. ఇది చెట్టు మూలల్లో అటాక్ చేసి నాశనం చేస్తుందని చెబుతున్నారు. ఇది చెట్టు మొదలులోనే రావడంతో ముందుగా మొక్కను నీటిని గ్రహించనీయకుండా చేస్తుంది. తద్వారా కిరణజన్య సంయోగక్రియను చేసుకోలేని పరిస్థితి మొక్కలో ఏర్పడి చివరికి మొక్క చనిపోతుంది. దీంతో ఈ కావెండీష్ రకం అరటిపండ్లు అంతరించిపోతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు అంతరించిపోయే దశలో ఉన్నట్లు వెల్లడించారు. సమస్యను పరిష్కరించలేని స్థితిలో ఉన్నామని "ది ఫేట్ ఆఫ్ ది ఫ్రూట్ దట్ చేంజ్ ది వరల్డ్" అనే పుస్తకంలో రచయిత డాన్ కోపెల్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం శాస్త్రవేతలు ఈ అరటిపండ్లకు ఈ ఫంగల్ తెగులుని తట్టుకునే విధంగా వ్యాధి నిరోధకతను పెంచేలా జన్యు మార్పులు చేసే పనిలో ఉన్నారన్నారు. రైతులు కూడా ఈ రకం అరటి సాగుకి సంబంధించి ప్రత్యామ్నాయా మార్గాలపై దృష్టిసారించడం లేదా ఈ పండ్ల సాగును మానేయడం వంటి పనులు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. నిజానికి ఈ కావెండిష్ రకం పండ్లను 1989లో తైవాన్లో గుర్తించారు. ఆ తర్వాత ఆస్ట్రేలియాకు విస్తరించింది. అక్కడ నుంచి భారత్, చైనాలోకి ప్రవేశించి, ప్రధాన అరటి ఉత్పత్తిలో ఒకటిగా నిలిచింది. ఆఖరికి ఆఫ్రికా వంటి ప్రాంతాల్లో కూడా ఈ రకం పండిస్తున్నారు. ఇటీవలే ఈ వ్యాధి దక్షిణాఫ్రికాలోని అరటి చెట్లలో కూడా కనిపించిందని క్వీన్స్లాండ్ యూనివర్సిటీ ప్రోఫెసర్ జేమ్స డేల్ తెలిపారు. ఈ రకమైన వ్యాధి అరటి చెట్లకు ఒక్కసారి వస్తే వదిలించడం చాలా కష్టమని చెబుతున్నారు. ఇలానే గతంతో గ్రోస్ మిచెల్ అనే రకం అరటిపండుకి టీఆర్ 4 అనే తెగులు వచ్చింది. దీంతో రైతులు మరో రకం అరటిపళ్లను సాగు చేయడంపై దృష్టిసారించాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆ రకం అరటిపండు క్రమేణ కనుమరుగయ్యింది. దాని స్థానంలోనే ఈ కావెండిష్ రకం అరటిపళ్లు వచ్చాయి. అయితే ఇది గ్రోస్ మిచెల్లా కావెండిష్ రకం అరటిపళ్లు అంతరించడానికి టైం పడుతుందని, ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ తీవ్రమవ్వడానికి కనీసం దశాబ్దం పడుతుందని అంటున్నారు శాస్త్రవేత్తలు. ఈలోగా ఆ వ్యాధిని నివారించేలా జన్యుపరమైన మార్పులు చేయడం లేదా మొక్కల్లో వ్యాధినిరోధక స్థితిని పెంచి ఈ సమస్య నుంచి సులభంగా బయటపడగలిగేలా చేయగలమని కొందరూ శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేయడం విశేషం. (చదవండి: పత్తి కేవలం వాణిజ్య పంటే కాదు ఆహార పంట కూడా..ఆఖరికి కొన్ని దేశాల్లో..) -
వేపకు మళ్లీ ‘డై బ్యాక్’ ముప్పు!
ల్లెపల్లెనా, రోడ్ల పక్కన, అడవుల్లో విస్తృతంగా పెరిగే మన వేపచెట్లకు మరోసారి ‘డై బ్యాక్’జబ్బు ముప్పు పొంచి ఉంది. సుమారు మూడేళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో ‘టీ మస్కిటో’, ఫంగస్ దాడితో తీవ్రంగా దెబ్బతిన్న లక్షలాది వేపచెట్లు ఈ ఏడాది ఉగాది తర్వాత కోలుకుంటున్న క్రమంలో మళ్లీ టీ మస్కిటో దాడి మొదలుపెట్టింది. ఈసారి ఫిబ్రవరి నుంచి అకాల వర్షాలు కురుస్తుండటంతో మళ్లీ పంజా విసురుతోంది. ఫలితంగా చెట్లన్నీ కొమ్మలతో సహా ఎండి పోవడంతోపాటు ఆకులు రాలిపోతున్నాయి. దీనివల్ల చెట్లకు పోషకాలు అందక క్రమంగా చచ్చిపోతున్నాయి. దీన్నే డై బ్యాక్గా పిలుస్తున్నారు. – సాక్షి, హైదరాబాద్ తగ్గనున్న వేప విత్తన దిగుబడి... రానున్న రోజుల్లో ఈ సమస్య మరింత తీవ్రం కావొచ్చని శాస్త్రేవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు తెగుళ్లు సోకడం వేపవిత్తనాల దిగుబడి భారీగా తగ్గిందని చెబుతున్నారు. ఈ ఏడాది 50 నుంచి 80% దాకా విత్త నాల ఉత్పత్తి తగ్గే అవకాశం ఉందని, దీని ప్రభావం వేప ఉత్పత్తులు, నీమ్కేక్స్, నీమ్ ఆయిల్, నీమ్ కోటింగ్పై ఆధారపడిన పరిశ్రమలపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. డై బ్యాక్ జబ్బును జాతీయ స్థాయిలో దీనిని కట్టడి చేసేందుకు కార్యాచరణను చేపట్టక పోతే భవిష్యత్లో వేప ఆధారిత ముడిపదార్థాలను విదేశాల నుంచి దివగుమతి చేసుకోవాల్సిన దుస్థితి ఎదురుకావొచ్చని చెబుతున్నారు. కొనసాగుతున్న పరిశోధనలు.. ఈ సమస్యపై ప్రొ.జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఫారెస్ట్ కాలేజీ ఆఫ్ రిసెర్చ్ ఇన్స్టి ట్యూట్ (ఎఫ్సీఆర్ఐ) ఐఐసీటీ, జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కాలేజీ విడి విడిగా పరిశోధనలు నిర్వహిస్తున్నాయి. వేపచెట్లకు ఎదురవుతున్న కీటక దాడు లు, చెదలు, ఫంగస్లను ఎలా కట్టడి చేయాలనే దాని పై పరిష్కారాలు కనుగునేందుకు కృషి చేస్తున్నాయి. ఎఫ్సీఆర్ఐలో పరి శోధన నిర్వహిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ బి.జగదీశ్కుమార్ చెబుతున్న దాన్ని బట్టి చూస్తే ఫోమోప్సిస్ అజాడిరాచ్టే అనే పాథోజెన్ ద్వారా వేప చెట్లకు ఈ జబ్బు సోకుతున్నట్లు గుర్తించారు. ఈ పాథోజెన్ గాలి ద్వారా సులభంగా వ్యాప్తికి అవకాశం ఉన్నందున వేపచెట్లు ఉన్న ప్రాంతానికి చేరుకున్నాక వేగంగా వ్యాప్తి చెందుతోందన్నారు. రాష్ట్రమంతటా వేప చెట్లు విస్తరించి ఉన్నందున అన్నింటికీ వివిధ రసా యన మిశ్ర మాలతో పిచికారీ చేయడం అసాధ్యంగా మారిందని వివరించారు. అయితే వేపకు బతికే శక్తిసామ ర్థ్యాలు ఎక్కువగా ఉన్నందున పెద్దచెట్లకు అంతగా నష్టం ఉండదని ప్రొ.జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధనా విభాగం రిటైర్డ్ సంచాలకుడు డాక్టర్ ఆర్.జగదీశ్వర్ అభిప్రాయపడ్డారు. కానీ గ్రామాలు, పట్టణాల్లో సీసీ రోడ్లు ఎక్కువ కావడంతో వేపచెట్టు నుంచి విత్తనం నేలపై పడి తిరిగి మొలకెత్తడం తగ్గిపోయిందన్నా రు. అందు వల్ల వేప ముడిపదార్థాల ఉత్పత్తి, సరఫరాలో తగ్గుదల కనిపిస్తోందని సాక్షితో మాట్లాడుతూ చెప్పారు. -
చదివింది 8వ తరగతే.. ఆవిష్కరణలు అద్భుతం.. ఎవరా ఘనాపాటి!
ఆయనకు 67 ఏళ్లు. తలపండిన రైతు, అంతకుమించిన శాస్త్రవేత్త. చదివింది 8వ తరగతే. అయినా.. జ్ఞాన సంపన్నుడు. పురుగులను అరికట్టే బవేరియా బాసియానా అనే శిలీంద్రాన్ని 44 ఏళ్ల క్రితం ఆయన గుర్తించే నాటికి దాని గురించి శాస్త్రవేత్తలకే తెలీదు. అప్పటి నుంచి జీవన పురుగుమందు(బయో పెస్టిసైడ్)లను సొంతంగా తయారు చేసుకొని మిరప, పత్తి, మామిడి తదితర పంటలపై వాడుతున్నారు. అనేక సరికొత్త వంగడాలను అభివృద్ధి చేశారు. దేశ విదేశీ యూనివర్సిటీలతో కలసి సుదీర్ఘకాలంగా పరిశోధనలు చేస్తున్నారు. అంతర్జాతీయ జర్నల్స్లో శాస్త్రజ్ఞులతో కలిసి 3 పరిశోధనా వ్యాసాలు ప్రచురించిన ఘనాపాటి ఆయన. ప్రకృతి వ్యవసాయానికి బయో పెస్టిసైడ్స్ ఎంతో అవసరమంటున్న విలక్షణ రైతు శాస్త్రవేత్త కొంగర రమేష్పై ప్రత్యేక కథనం. స్వీయ అనుభవ జ్ఞానంతో వ్యవసాయ రంగంలో అద్భుత ఆవిష్కరణలు వెలువరిస్తున్న తపస్వి కొంగర రమేష్. వ్యవసాయ కుటుంబంలో ఆయన పుట్టి పెరిగింది గుంటూరు జిల్లా కాకుమాను గ్రామంలో. రైతు శాస్త్రవేత్తగా పరిశోధనలు చేస్తున్నది విశాఖ జిల్లా ఆనందాపురం మండలం తర్లువాడలో. సొంతంగా తయారు చేసుకున్న జీవన పురుగుమందులతో మిరప, పత్తి, మామిడి వంటి పంటలను సాగు చేయటంతో పాటు.. అనేక విశిష్టమైన వంగడాలకు రూపుకల్పన చేసి భళా అనిపించుకుంటున్నారు. ఎంతకాలమైనా నిల్వ ఉండే, అత్యంత తీపి, సువాసన కలిగిన మామిడి వంగడాలు.. విలక్షణమైన మిరప వంగడం.. ఆవులకు ప్రాణాంతకమైన బ్రూస్లోసిస్ వ్యాధిని హోమియో వైద్యంతో తగ్గించడం.. ఇవీ రైతు శాస్త్రవేత్తగా రమేష్ సాధించిన కొన్ని విజయాలు. బయో పెస్టిసైడ్స్పై ఆయన సుదీర్ఘకాలంగా చేస్తున్న పరిశోధనల గాథ ఆసక్తిదాయకం.. ‘బవేరియా’ అప్పటికి ఎవరికీ తెలీదు సొంత పొలంలో పత్తి తదితర పంటల ఆకులు తినే పురుగుల్ని చంపుతున్న బవేరియా బాసియానా అనే శిలీంధ్రాన్ని 1978లో 22 ఏళ్ల యువ రైతుగా రమేష్ తొలుత గుర్తించారు. 1977లో దివిసీమ ఉప్పెన కారణంగా కోస్తా ఆంధ్ర తీరప్రాంతంలో లెక్కలేనన్ని పక్షులు మత్యువాత పడ్డాయి. పురుగులను తినే పక్షులు లేనందున వాటి సంఖ్య ఉధృతంగా పెరిగిపోయింది. ఒక పొలం నుంచి మరో పొలంలోనికి పురుగుల మంద గొర్రెల మందలా వచ్చేవి. ఏమి చేయాలో పాలుపోని ఆ దశలో.. కొన్ని పురుగులు సహజసిద్ధంగా చనిపోతున్నట్లు ఆయన గమనించారు. ఒక్కోసారి గుంపులో 90% పురుగులు చనిపోతూ ఉండేవి. చనిపోయిన పురుగులపై బూజు మాదిరిగా పేరుకొని ఉండేది. ఏదో ఒక ఫంగస్ ఈ పురుగులను చంపగలుగుతోందని రమేష్ గమనించారు. ఆ ఫంగస్ను తిరిగి వాడుకొని పురుగులను చంపగలమా? అన్న జిజ్ఞాస కలిగింది. ఫంగస్ సోకి చనిపోయిన పురుగులను బాపట్ల వ్యవసాయ కళాశాల, గుంటూరు లాం ఫారం, హైదరాబాద్లోని ఇక్రిశాట్, రాజేంద్రనగర్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంతో పాటు యూపీలోని పంత్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి తీసుకెళ్లి శాస్త్రవేత్తలకు చూపించారు. ఆరేళ్లపాటు ఎంతోమంది శాస్త్రవేత్తలను కలిసి వివరించినా దీనిపై వారు సరైన అవగాహనకు రాలేకపోయారని రమేష్ తెలిపారు. రమేష్ మాత్రం పట్టువీడలేదు. ప్రయత్నం మానలేదు. చివరికి 1984లో ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం బాపట్ల వ్యవసాయ కళాశాలలో పాథాలజిస్టు డాక్టర్ మొహిద్దీన్ దీన్ని ఇంగ్లాండులోని మైకలాజికల్ సొసైటీకి పంపంగా.. ఇది పురుగుల పాలిట మృత్యుపాశం వంటి ‘బివేరియా బాసియానా’ అనే శిలీంధ్రం అని వెల్లడైంది. ఆ తరువాత కాలంలో శాస్త్రజ్ఞుల సూచనలతో రమేష్ స్వయంగా పరిశోధనలు చేపట్టారు. చనిపోయిన పురుగుపై నుంచి సేకరించిన ఈ ఫంగస్ను వేరు చేసి, తన వ్యవసాయ అవసరాల మేరకు శుద్ధమైన బవేరియా బాసియానా శిలీంధ్రాన్ని అభివృద్ధి చేయటం, పంటలపై వాడి ఫలితాలు సాధించడం నేర్చుకున్నారు. అతి తక్కువ ఖర్చుతో బవేరియా బాసియానా వంటి జీవన పురుగుమందులను పత్తి, మిరప తదితర పంటలు సాగు చేసే రైతులకు విస్తృతంగా అందుబాటులోకి తెస్తే రసాయనిక పురుగుమందుల అవసరం లేకుండా చేయవచ్చని రమేష్ భావించారు. 1987లో రాజేంద్రనగర్లో జరిగిన పత్తి శాస్త్రవేత్తల జాతీయ సదస్సులోనూ బవేరియా బాసియానాపై లోతైన పరిశోధనలు చేస్తే జల్లెడ పురుగులు, తెల్లదోమ ఆట కట్టించవచ్చని సూచించినా ఎవరికీ పట్టలేదు. అయినా రమేష్ తన పరిశోధనలు కొనసాగించారు. రూ. 200 ఖర్చుతో పురుగులకు చెక్ బవేరియా బాసియానా, నివేరియా రిలే, మెటరైజమ్ వంటి శిలీంధ్రాలను శాస్త్రీయ పద్ధతిలో తయారుచేసుకుని జాగ్రత్తగా వినియోగిస్తే ఎకరాకు సుమారు రూ. 200 ఖర్చుతోనే మిర్చి, పత్తి, మామిడి, కూరగాయ పంటల్లో పురుగుల బెడదను తప్పించుకోవచ్చని రమేష్ అంటున్నారు. మిరప తదితర పంటలను తీవ్రంగా నష్టపరుస్తున్న నల్ల తామర (బ్లాక్ త్రిప్స్)పై బవేరియా బాసియానా పని చేస్తున్నట్లు కొందరు రైతులు చెబుతున్నారు. అయితే, జాగ్రత్తలు తీసుకోకపోతే ఇతర రకాల ఫంగస్లతో కలుషితమై ప్రతికూల పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉందంటున్నారు. గతంలో ఇలాంటి బయో ఫెస్టిసైడ్ను వాడిన అనుభవం రైతులకు లేనందున శాస్త్రజ్ఞులు సరైన విధానాలను రైతులకు వివరించాలన్నారు. ఏ స్ట్రెయిన్? ఏ పురుగు? బవేరియా బాసియానా శిలీంద్రానికి సంబంధించి అనేక స్ట్రెయిన్లు ఉంటాయి. ఏ స్ట్రెయిన్ ఏ పంటపై, ఏయే పురుగులపై పనిచేస్తుందో తెలుసుకోవడానికి స్థానికంగా పరిశోధనలు చేసి, జీవన పురుగుమందులను ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. జీవన ఎరువులపై పరిశోధనలు కొంత మెరుగ్గా జరుగుతున్నప్పటికీ.. జీవన పురుగుమందులపై పరిశోధనలు మన దేశంలో చురుగ్గా జరగటం లేదని రమేష్ తెలిపారు. బవేరియా శిలీంధ్రం అనేక దేశాల్లో 200 వరకు పురుగుల నియంత్రణకు సమర్థవంతంగా పనిచేస్తున్నదని రమేష్ తెలిపారు. 16 మందికి డాక్టరేట్లు ఆంధ్ర విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలతో కలిసి రమేష్ తర్లువాడలోని తన క్షేత్రంలో పత్తి పంటపై బవేరియా ప్రభావంపై చింతా విశ్వేశ్వరరావు సహకారంతో పరిశోధనలు కొనసాగించారు. ఈ పరిశోధనలపై అంతర్జాతీయ జర్నల్స్లో రమేష్ ముఖ్య పరిశోధకుడిగా 3 పరిశోధనా పత్రాలు అచ్చయ్యాయి. ఈ క్రమంలో ఏకంగా 16 మంది శాస్త్రవేత్తలకు డాక్టరేట్లు వచ్చాయి. ఈ పరిశోధనలు అడకమిక్ స్థాయిలోనే ఆగిపోయాయి. బవేరియాకు చెందిన 4–5 స్ట్రెయిన్లను వేరు చేసి యూనివర్సిటీలో భద్రపరచటం సాధ్యపడిందే తప్ప.. వాటిని విస్తృతంగా రైతుల దగ్గరకు తీసుకెళ్లటం సాధ్యపడలేదని రమేష్ తెలిపారు. జర్మనీ శాస్త్రవేత్తలు తమ కాకుమాను పొలంలో నుంచి మట్టి నమూనాలు సేకరించి తీసుకువెళ్లి ఈ ఫంగస్ను వాడుతున్నా తెలిపారు. ఈ నేపథ్యంలో నాబార్డ్ ఆర్థిక సాయంతో వైజాగ్లోని గీతం విశ్వవిద్యాలయంతో కలసి రమేష్ పరిశోధనలు చేశారు. గీతం యూనివర్సిటీ తన పేరుతో పేటెంట్కు దరఖాస్తు చేయబోగా, రమేష్ పేరును మొదటి ఆవిష్కర్తగా పెట్టాలని నాబార్డ్ సూచించింది. అయితే, వారు అంగీకరించకపోవటంతో వారితో నాబార్డ్ నిధులు ఇవ్వటం నిలిపివేసింది. నూనెతో కలపి చల్లాలి బవేరియా బాసియానా వంటి శిలీంధ్రాలతో తయారు చేసిన జీవన పురుగుమందులను సాయంత్రం పూట, తేమ తక్కువగా ఉన్న పరిస్థితుల్లో నీటిలో కాకుండా ఏదో ఒక నూనె (ఎకరానికి 2 లీ.)లో శిలీంధ్రాన్ని కలిపి హెలీస్ప్రేయర్/డ్రోన్తో సాయంకాలం పూట పిచికారీ చేయాలని రమేష్ సూచిస్తున్నారు. రైతులు నీటితో కలిపి చల్లుతున్నారని, నీటి తేమ ఆరిపోతే శిలీంద్రపు బీజాలు చనిపోయి పురుగులపై ప్రభావం చూపలేకపోవచ్చు. అందుకని ఏదో ఒక నూనెలో కలిపి పిచికారీ చేస్తే ప్రయోజనం బాగుంటుందన్నారు. నిద్రాణంగా ఉండే శిలీంద్రపు బీజాలకు తేమ తగిలితే జర్మినేట్ అవుతాయని, ఆ తర్వాత కొద్ది గంటల వరకే బతికి ఉంటాయి. ఆ లోగానే పురుగు వాటిని తినటం లేదా దాని శరరీంపై ఇవి పడటం జరిగితే.. ఆ శిలీంద్రం పురుగు దేహంలో పెరిగి దాన్ని చంపగలుగుతుంది. అందుకు రెండు–మూడు రోజుల సమయం పడుతుంది. నూనెతో కలిపి చల్లితే బీజాలు వారం, పది రోజుల పాటు గింజగానే ఉంటాయని.. పురుగులు ఈ బీజాలను తిన్నా, వాటి శరీరానికి తగిలినా చాలు. (క్లిక్ చేయండి: జనం మేలుకోకపోతే జీఎం పంటల వెల్లువే!) శిలీంధ్రం బారిన పడిన చనిపోయిన తర్వాత 5 రోజుల్లోనే ఒక పురుగులో కోట్ల కొలదీ శిలీంధ్రపు బీజాలు పెరిగి, గాలి ద్వారా వ్యాపించి, పురుగులను నాశనం చేస్తాయి. ఇందువల్లనే జీవన పురుగుమందులు రసాయన పురుగు మందుల్లా వెంటనే కాక రెండు రోజుల తర్వాత ప్రభావం చూపుతాయి. రీసైక్లింగ్ పెస్టిసైడ్గానూ పనిచేస్తాయి. రైతులు చల్లిన గంటలోనే ఫలితం ఆశిస్తున్నారు తప్ప తర్వాత రోజుల్లో ఏమి అవుతుందో గమనించడం లేదని, ఈ విషయమై రైతుల్లో అవగాహన కలిగించాలని రమేష్ సూచిస్తున్నారు. జీవన పురుగుమందుల వల్ల పర్యావరణానికి, మనుషులకు, ఇతర జీవులకు ఎటువంటి సమస్యా ఉండదు. – గేదెల శ్రీనివాసరెడ్డి, సాక్షి, తగరపువలస, విశాఖ జిల్లా ప్రకృతి వ్యవసాయానికి తప్పనిసరి అవసరం రైతులకు మోయలేని ఆర్థిక భారంతో పాటు పర్యావరణ కాలుష్యానికి కారణమవుతున్న రసాయనిక పురుగుమందులకు ఎన్నో విధాలుగా చక్కటి ప్రత్యామ్నాయం జీవన పురుగుమందులే. బవేరియా బాసియానా, నివేరియా రిలే, మెటరైజమ్, వర్టిసెల్ల లకాని వంటి శిలీంధ్రాలతో కూడిన జీవన పురుగుమందులపై ప్రభుత్వం విస్తృతంగా పరిశోధనలు జరపాలి. ఏయే పురుగులపై ఏయే స్రెయిన్లు పనిచేస్తున్నాయో నిర్థారించాలి. వ్యవసాయ వర్సిటీ నిపుణుల పర్యవేక్షణలో జీవన పురుగుమందులను ప్రభుత్వమే ఉత్పత్తి చేయించి రైతులకు అందుబాటులోకి తేవాలి. నిల్వ సామర్థ్యం తక్కువ కాబట్టి రైతులను ముందుగా చైతన్యవంతం చేయాలి. ప్రకృతి వ్యవసాయం వ్యాప్తికి బయో పెస్టిసైడ్స్ తప్పనిసరి అవసరం. – కొంగర రమేష్, నవనీత ఎవర్గ్రీన్స్, తర్లువాడ, విశాఖ జిల్లా -
వేపను వదలని శిలీంధ్రం
సాక్షి, హైదరాబాద్: గతేడాది వేప చెట్లను అతలాకుతలం చేసిన ఫంగస్ ఇక కొన్నేళ్లపాటు ఆ వృక్ష జాతి పాలిట ‘సీజనల్ వ్యాధి’గా కొనసాగనుంది. వచ్చే ఐదారేళ్లపాటు ఆగస్టు, సెప్టెంబర్ సమయంలో ఆ శిలీంధ్రం ఆశించి వేప చెట్లకు నష్టం చేసే అవకాశం ఉంది. రాజేంద్రనగర్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన విభాగం తాజాగా ఈ విషయం గుర్తించింది. ఈ నెల 15 నుంచి జరిపిన పరిశోధనలో, గతేడాది తీవ్ర ప్రభావం చూపిన ఫోమోప్సిస్ అజాడిరెక్టే, ఫ్యుజేరియం అనే ఫంగస్ వేప చెట్లకు మళ్లీ ఆశించినట్టు తేల్చారు. గతేడాది ప్రభావం తీవ్రంగా ఉండగా, ఈసారి కాస్త తక్కువగా ఉంది. దాదాపు 20 శాతం చెట్లు చనిపోతాయన్న అంచనా గతేడాది వ్యక్తమైనా, చివరకు ఔషధ వృక్షంగా పేరుగాంచిన వేప తనను తాను బతికించుకుంది. అతి తక్కువ సంఖ్యలోనే చెట్లు చనిపోయాయి. ప్రభావం తీవ్రంగా ఉన్నా చివరకు ప్రమాదం నుంచి వాటంతట అవే బయపడడాన్ని చూసి శిలీంధ్రాన్ని విజయవంతంగా జయించినట్టేనని, ఇక ఆ శిలీంద్రం అంతమైనట్టేనని భావించారు. కానీ, సరిగ్గా మళ్లీ గత ఆగస్టు చివరికల్లా కొన్ని ప్రాంతాల్లో చెట్ల కొమ్మల చివర్లు ఎండిపోవటం మొదలైంది. క్రమంగా సమస్య పెరుగుతుండటంతో ఈ నెల రెండో వారంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన విభాగం సంచాలకులు జగదీశ్వర్ ఆదేశం మేరకు డాక్టర్ సి.నరేందర్రెడ్డి, డాక్టర్ ఎస్జే రహమాన్, డాక్టర్ జి.ఉమాదేవి, డాక్టర్ ఎస్.హుస్సాని, డాక్టర్ ఎం.లక్ష్మీనారాయణ, డాక్టర్ ఎం.వెంకటయ్య, డాక్టర్ బి.రాజేశ్వరి, డాక్టర్ మాధవిలతో కూడిన బృందం వివిధ ప్రాంతాల్లో పర్యటించి వేప నమూనాలు సేకరించి యూనివర్సిటీ ల్యాబ్లో వారం పాటు బీఓడీ ఇంక్యుబేటర్లో ఉంచి పరీక్షలు నిర్వహించారు. ఇందులో ఫొమోప్సిస్ అజాడిరెక్టే, ఫ్యుజేరియం ఫంగస్ భారీగానే ఉన్నట్టు తేలింది. అయితే ఈసారి వాటిపై రసాయనాలు పిచికారీ చేయాల్సిన అవసరం లేదని, మళ్లీ పొడి వాతావరణం వచ్చేసరికి ఫంగస్ను వేప జయిస్తుందని పరిశోధన విభాగం సంచాలకులు జగదీశ్వర్ పేర్కొన్నారు. భారీ వర్షాలతోనే.. గతేడాది ఆశించిన శిలీంధ్రం పూర్తిగా మాయం కాకముందే వరసపెట్టి భారీగా కురిసిన వర్షాలతో మళ్లీ అది ఉత్తేజితం అయిందని జగదీశ్వర్ చెప్పారు. మధ్యలో దాదాపు పక్షం రోజుల పాటు పూర్తి పొడి వాతావరణం కొనసాగిన సమయంలో వీచిన గాలులకు శిలీంద్రం వాతావరణంలో కలిసి మిగతా ప్రాంతాలకు వేగంగా విస్తరించిందని పేర్కొన్నారు. అయితే దాన్ని తట్టుకునే శక్తి వేపకు ఈపాటికే వచ్చిందని, భారీ నష్టం లేకుండానే క్రమంగా అది తగ్గుముఖం పడుతుందని వివరించారు. కానీ సీజనల్ వ్యాధి మాదిరి కొన్నేళ్లపాటు వేపను ఆశించే అవకాశం ఉందని పేర్కొన్నారు. గతేడాది క్రిమినాశకాలు, శిలీంధ్ర నాశకాలను ప్రభుత్వానికి సిఫారసు చేసినప్పటికీ, ఈ సారి మాత్రం అలాంటి సిఫారసులు చేయటం లేదని తెలిపారు. నర్సరీల్లో పెంచే వేప మొక్కలకు మాత్రం మందులను పిచికారీ చేయాల్సిన అవసరం ఉంటుందని పేర్కొన్నారు. కార్బెండిజమ్, మాంకోజెబ్, థియామెథాక్సమ్, అసెటామాప్రిడ్లను పిచికారీ చేయొచ్చని సూచించారు. -
వేపచెట్టు మళ్లీ ఎండిపోతోంది
సాక్షి, హైదరాబాద్: వేపకు మళ్లీ ఫంగస్ సవాల్ విసురుతోంది. గతేడాది ఆగస్టు–సెప్టెంబర్ మాసాల్లో వేపకొమ్మల చివర్లు మాడిపోయి.. చూస్తుండగానే చెట్టు మొత్తం ఎండిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడూ సరిగ్గా అదే సమయంలో వేపచెట్ల చివర్లు ఎండిపోవటం మొదలైంది. దీంతో ఈ ఫంగస్ సమస్య వేపచెట్ల పాలిట సీజనల్ దాడిగా మారనుందనే నిపుణుల హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. గత వారం పది రోజులుగా నగర శివారుల్లో, శంషాబాద్, మహబూబ్నగర్, వరంగల్ ప్రాంతాల్లో వేపచెట్ల కొమ్మ చివరి భాగాలు ఎండిపోయి కనిపిస్తున్నాయి. అయితే గతేడాది స్థాయిలో తీవ్రత లేకున్నా, కొన్ని ప్రాంతాల్లో ఈ ఎండిపోతున్న తీరు వేగంగా విస్తరిస్తోంది. మళ్లీ అదే ఫంగస్ వ్యాప్తి? గతేడాది రాష్ట్రవ్యాప్తంగా 70 శాతానికిపైగా వేపచెట్ల కొమ్మలు ఎండిపోయాయి. వీటిలో 10 శాతం చెట్లు నిలువునా ఎండిపోయాయి. కానీ ఔషధ వృక్షమనే పేరున్న వేపచెట్లు తమను తాము కాపాడుకుని.. ఉగాదికల్లా మళ్లీ చిగురించాయి. మురికినీళ్లు నిరంతరం నిలిచే ప్రాంతాలు, మొదలు వద్ద కాంక్రీట్ చేసిన ప్రాంతాల్లోని చెట్లు మాత్రం ఎండిపోయాయి. వేపను సాధారణంగా ఆశించే టిమస్కిటో బగ్ అనే పురుగు కాటువేయటం, ఆ ప్రాంతం నుంచి ‘పోమోస్సిస్ అజాడిరెక్టే’ అనే ఫంగస్ లోపలికి ప్రవేశించి చెట్లు ఎండిపోయేలా చేసినట్టు నిపుణులు గుర్తించారు. రాజేంద్రనగర్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన విభాగం సంచాలకుడు జగదీశ్వర్ ఆధ్వర్యంలో నిపుణులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి ఎండిన వేపకొమ్మలు తెచ్చి పరిశోధించారు. వివిధ పరీక్షల్లో పోమోప్సిస్ అజాడిరెక్టే ప్రభావం చాలా ఎక్కువుందని, ప్యుజేరియం, కర్వులేరియా అనే ఫంగస్లు సోకాయని తేలింది. వీటి నివారణకు కొన్ని మందులను సూచిస్తూ ప్రభుత్వానికి సిఫారసు చేశారు. మళ్లీ పరీక్షలు ప్రారంభం ఇప్పుడు మళ్లీ వేపకొమ్మలు ఎండిపోతున్న నేపథ్యంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం నిపుణులు శంషాబాద్ సమీపంలోని కొన్ని చెట్ల నమూనాలను సేకరించి కల్చర్ పరీక్షలు చేస్తున్నారు. ఫిర్యాదులొచ్చిన మిగతా ప్రాంతాల నుంచి కూడా నమూనాలు సేకరిస్తున్నామని పరిశోధన విభాగం సంచాలకుడు జగదీశ్వర్ సాక్షితో చెప్పారు. ‘వాతావరణంలో ఫంగస్లు కలిసిపోయినప్పుడు తదుపరి సంవత్సరాల్లోనూ అవి మళ్లీ ప్రభావం చూపుతాయి. కొన్నిచోట్ల చెట్లు ఎండిపోవటానికి ఇదే కారణం కావచ్చు. ఈ నెలలో సమస్య విస్తరిస్తే, ఈసారీ ఫంగస్ ప్రభావం ఉన్నట్టేనని భావించాల’ని వివరించారు. -
ఒక చావు.. మరో పుట్టుక.. ఈగను చంపేసి వృద్ధి చెందిన ‘జాంబీ’ ఫంగస్
ఈ ఫొటో చూశారా? ‘బీఎంసీ ఎకాలజీ అండ్ ఎవాల్యూషన్ ఇమేజ్’ పోటీలో మొదటిస్థానం దక్కించుకుంది. అందులో ప్రత్యేకత ఏముందనేగా సందేహం? ఈగలోకి ప్రవేశించిన ‘జాంబీ’ ఫంగస్ ఈగను చంపేసి.. అది వృద్ధి చెందింది. ఈగ మరణించి... ఫంగస్ బతకడమే కాదు, మరింత విస్తరించటానికి ఉపయోగపడింది. ఒక చావు.. మరో పుట్టుక. జీవ పరిణామ క్రమమే అది కదా! సైన్స్ ఫిక్షన్ను తలపిస్తున్న ఈ చిత్రాన్ని పరిణామ జీవశాస్త్రవేత్త రాబర్టో గ్రాసా రో, పెరూలోని తంబోపత నేషనల్ రిజర్వ్లో క్యాప్చర్ చేశాడు. రిలేషన్షిప్స్ ఇన్ నేచర్, బయోడైవర్సిటీ అండర్ థ్రెట్, లైఫ్ క్లోజప్, రీసర్జ్ ఇన్ యాక్షన్ అనే నాలుగు కేటగిరీల్లో జరిగిన పోటీల్లో... జాంబీ ఫంగస్ ఫొటో టాప్ ప్రైజ్ గెలుచుకుంది. చదవండి: మిస్టరీ కేసు: ఆన్లైన్ వేలంలో కొన్న సూట్కేసులో ఏముందంటే... -
గాంధీ ఆస్పత్రికి కోవిడ్ బాధితుల క్యూ
Covid Patients At Gandhi Hospital: గాంధీ ఆస్పత్రికి మళ్లీ కోవిడ్ బాధితులు పోటెత్తుతున్నారు. ఆస్పత్రిలో శుక్రవారం ఒక్కరోజే 28 మంది చేరారు. ఇన్పేషెంట్ వార్డుల్లో సుమారు 70 నుంచి 80 మంది మాత్రమే ఉండగా, తాజాగా ఈ సంఖ్య 111కు చేరింది. ఫలితంగా మెయిన్ బిల్డింగ్లోని సెకండ్ ఫ్లోర్ రోగులతో పూర్తిగా నిండిపోవడంతో కొత్తగా వచ్చే రోగుల కోసం మూడో వార్డును సిద్దం చేస్తున్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్లో 11 మంది గర్భిణులు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. వీరిలో మరో ఎనిమిది మంది బ్లాక్ఫంగస్ బాధితులు కూడా ఉన్నారు. తగ్గినట్లే తగ్గిన ఇన్పేషంట్ల సంఖ్య మళ్లీ క్రమంగా పెరుగుతుండటంతో ఆస్పత్రి వైద్యులు అప్రమత్తమయ్యారు. సాధారణ అడ్మిషన్లను, సర్జరీలను నిలిపివేశారు. గచ్చిబౌలిలోని టిమ్స్లోనూ ఇన్పేషెంట్ల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం అక్కడ వంద మందికిపైగా చికిత్స పొందుతున్నారు. వీరిలో ఎక్కువగా ఒమిక్రాన్ బాధితులే. చదవండి: దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే.. -
38 సార్లు మందు కొట్టినా.. చేతికి అందలేదు
సాక్షి, కోదాడ(నల్లగొండ): గతేడాది మిర్చికి మార్కెట్లో మంచి రేటు ఉండటంతో ఈ ఏడాది రైతులు ఎంతో ఆశతో మిరప సాగు చేపట్టారు. కానీ, తెగుళ్ల తీవ్రతతో రైతుల ఆశలు ఆవిరయ్యాయి. విపరీతమైన తెగుళ్లతో పంట ఎదుగుదల లేక, పూత రాక.. వచ్చినా కాత నిలవకుండా పోయింది. సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలోని రెడ్లకుంటకు చెందిన అంబటి నారాయణ రెండు ఎకరాల్లో మిరప సాగు చేపట్టారు. సాగు చేసిన తర్వాత పంటకు విపరీతంగా తెగుళ్లు సోకడంతో పురుగు మందులతో పాటు సేంద్రియ ద్రావణాలను కూడా దాదాపు 38 సార్లు స్ప్రే చేశాడు. రెండు ఎకరాల సాగు కోసం రూ.లక్షా 25 వేల పెట్టుబడి పెట్టాడు. అయినా ఫలితం లేకుండా పోయింది. క్వింటా మిరప కూడా దిగుబడి రాలేదు. చేసేదేం లేక గత వారం రోజులుగా పంటపొలంలో గేదెలు మేపుతున్నానని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. -
ఈ పుట్టగొడుగు పొడిని మహిళలు ప్రసవసమయంలో తింటే..
ప్రస్తుతం ప్రపంచమంతా పెనిస్ మష్రూమ్స్ గురించే మాట్లాడుకుంటున్నారు. దీని శాస్త్రీయనామం ఫాలస్ రూబికండస్. ఇది స్టిన్క్హాన్ కుటుంబానికి చెందిన ఫంగస్. దీనిని 1811లో కనిపెట్టారు. భారత్, ఆస్ట్రేలియా, అమెరికా, చైనా, జపాన్, కొరియా, థాయ్లాండ్, ఘనా, కాంగో, కెన్యా, దక్షిణాఫ్రిక వంటి ఉష్ణమండల దేశాల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. ఐతే దీనికి సంబంధించిన ఇమేజ్ను తాజాగా సైన్స్ అలర్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. ఏమిటి ఈ పుట్టగొడుగుల ప్రత్యేకత పెనిస్ పుట్టగొడుగులు ఎటువంటి మట్టిలోనైనా బతుకుతాయి. ఐతే మధ్యప్రదేశ్లోని ఆదివాసీలు మాత్రం ఈ పుట్టగొడుగులను జిరి-ఫిరి అని పిలుస్తారు. భరియా, బైగా ఆదివాసీల సంప్రదాయ ఔషధాల్లో ఇది ప్రముఖమైనది. ఈ పుట్టగొడుగులను టైఫాయిడ్, పేగు జ్వరాల నివారణకు ఔషధంగా వినియోగిస్తారు. చక్కెరతో ఈ పుట్టగొడుగులను బాగారుద్ది, ఎండబెట్టి పొడిచేస్తారు. ఈ పొడిని ప్రసవ సమయంలో మహిళలకు టీ స్పూను చొప్పున అందిస్తే సుఖ ప్రసవం జరుగుతుందట. అలాగే టైఫాయిడ్తో బాధపడుతున్నవారికి రోజుకు మూడు స్పూనుల చొప్పున పట్టిస్తే నయం అవుతుంది. ఈ విధంగా గిరిజనులు వివిధ రోగాలను నయంచేయడానికి పెనిస్ పుట్టగొడుగులను ఉపయోగిస్తుంటారు. చదవండి: ఐదేళ్లుగా వెతుకులాట.. దొరికిన గోల్డ్ ఐలాండ్.. లక్షల కోట్ల సంపద! మన దేశంలోనేకాకుండా, ఆస్ట్రేలియాలోని స్థానిక ఆదివాసీలు లైంగిక శక్తిని పెంచే ఔషధంగా దీనిని ఉపయోగిస్తారు. ఐతే దాని వాసన చాలా ప్రమాదకరమైనది. ఈ పుట్టగొడుగుల వాసన కీటకాలను ఆకర్షిస్తుంది. సాధారణంగా వర్షాల తర్వాత చాలా దేశాలలో పెరుగుతోంది. చదవండి: అందుకే కార్డియాక్ అరెస్ట్ సంభవిస్తుందట..! ఇలా చేస్తే ప్రాణాలు నిలుపుకోవచ్చు.. -
ప్రకృతే పరమౌషధం!
ఎన్నో రకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల నుంచి మానవాళిని కాపాడిన మందు పెన్సిలిన్.. దాని తయారీకి మూలం ఓ ఫంగస్.. ఇప్పుడు కరోనా టెస్టుల కోసం వినియోగిస్తున్న ఆర్టీపీసీఆర్ విధానంలో వాడేది ఓ బ్యాక్టీరియా.. ఇవే కాదు.. మానవాళిని పట్టిపీడిస్తున్న రోగాలు, ఆరోగ్య సమస్యలకు పరిష్కారం చూపినదీ ప్రకృతే. అత్యంత ముఖ్యమైన ఔషధాల తయారీకి స్ఫూర్తినిచ్చినదీ ప్రకృతే.. ఇలా ప్రకృతి ఇచ్చిన కొన్ని ముఖ్యమైన మందులు, వాటి ప్రత్యేకతలేమిటో తెలుసుకుందామా.. జంతువులు, మొక్కల నుంచి.. వైరస్, బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవుల వల్లగానీ, మన జీవనశైలి వల్లగానీ ఎన్నో రకాల రోగాలు, ఆరోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. వాటికి ఉపశమనం కోసం ఎన్నో ప్రయోగాలు, మరెన్నో పరిశోధనలతో మందులు తయారు చేస్తుంటారు. ఒక్కోసారి కొన్నిరకాల జంతువులు, చెట్లలోని రసాయనాల సమ్మేళనాలు నేరుగా రోగాలు, ఆరోగ్య సమస్యలకు ఔషధాలుగా పనిచేస్తుంటాయి. శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో భాగంగానో, అనుకోకుండానో అలాంటి వాటిని గుర్తించి.. మానవాళికి అందుబాటులోకి తెచ్చారు. మధుమేహానికి మందు ఇచ్చి.. గిలా మాన్స్టర్.. నలుపు, నారింజ రంగుల్లో ఉండే ఒక రకమైన పెద్దసైజు బల్లి. అమెరికా, మెక్సికో దేశాల్లో ఉండే ఈ బల్లి లాలాజలంలో ఎక్సెండిన్–4 అనే హార్మోన్ ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టైప్–2 మధుమేహం చికిత్సలో వాడుతున్న ఎక్సెనటైడ్ ఔషధానికి మూలం ఆ హార్మోనే. టైప్–2 మధుమేహాన్ని నియంత్రణలో ఉంచడానికి, పేషెంట్లు బరువు తగ్గడానికి ఈ హార్మోన్ తోడ్పడుతుందని నార్త్ కరోలినా వర్సిటీ శాస్త్రవేత్తలు 2007లో గుర్తించారు. దానిని ప్రస్తుతం కృత్రిమంగా తయారు చేస్తున్నారు. కరోనాను గుర్తిస్తున్నది ఇదే.. థర్మస్ అక్వాటికస్ బ్యాక్టీరియా.. 1969లో అమెరికాలోని ప్రఖ్యాత ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్లో దీనిని గుర్తించారు. ఎక్కువ ఉష్ణోగ్రతలను తట్టుకుని ప్రొటీన్ల పునరుత్పత్తి చేయగల సామర్థ్యం ఈ బ్యాక్టీరియాకు ఉంది. దీనిని ఆర్టీపీసీఆర్ టెస్టులో ఉపయోగించినప్పుడు.. సంబంధిత వైరస్ల ప్రొటీన్లను గుర్తించడానికి వీలవుతుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా నిర్ధారణ పరీక్షల్లో దీనిని విస్తృతంగా వినియోగిస్తున్నారు. హా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) లెక్కల ప్రకారం.. ఇండియా, అమెరికా, బ్రిటన్, ఇటలీ, టర్కీ ఈ ఐదు దేశాల్లోనే ఏడాది మే చివరినాటికి ఏకంగా 100 కోట్ల కరోనా టెస్టులు చేశారు. ఫంగస్పై పోరు నుంచి.. కేన్సర్ చికిత్సకు.. పాక్లిటాక్సెల్.. కేన్సర్ చికిత్సలో ఉపయోగించే అత్యంత కీలకమైన ఔషధం. పసిఫిక్ యూ అనే చెట్టు బెరడులో లభించే ఈ రసాయన మిశ్రమాన్ని 1971లోనే గుర్తించారు. అది కేన్సర్లపై సమర్థవంతంగా పనిచేస్తుందని 2015లో జరిగిన పరిశోధనల్లో తేల్చారు. దాదాపు అన్నిరకాల కేన్సర్లకు చేసే కెమోథెరపీ చికిత్సలో ఈ ఔషధాన్ని వినియోగిస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించిన అత్యవసర మందుల జాబితాలో ఈ పాక్లిటాక్సెల్ ఔషధం కూడా ఉండటం గమనార్హం. నిజానికి పసిఫిక్ యూ చెట్లు ఈ రసాయన సమ్మేళనాన్ని ఎందుకు ఉత్పత్తి చేస్తాయో తెలుసా.. తమపై ఫంగస్లు పెరిగి తెగుళ్లు కలిగించకుండా ఉండటం కోసమే. వాటి ఇమ్యూనిటీ మనకు ఔషధంగా మారింది. సూక్ష్మజీవులను నాశనం చేసే కప్ప మాగేనిన్.. ఆఫ్రికన్ క్లాడ్ రకం కప్ప చర్మంలో ఉండే ఓ ప్రత్యేకమైన ప్రొటీన్. చాలా రకాల బ్యాక్టీరియాలు, ఫంగస్లు, ఇతర సూక్ష్మజీవులను నాశనం చేయగల సామర్థ్యం దీని సొంతం. కొన్నేళ్ల కింద ఆ కప్పలపై పరిశోధనలు చేస్తున్న కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు.. వాటి శరీరంపై గాయాలైనా ఇన్ఫెక్షన్లు పెద్దగా సోకడం లేదని గుర్తించారు. దానికి కారణం ఏమిటని పరిశోధించి ‘మాగేనిన్’ ప్రొటీన్ను గుర్తించారు. ఇది సూక్ష్మజీవుల పైపొరను ధ్వంసం చేస్తోందని తేల్చారు. అయితే ఈ ప్రొటీన్ను మానవ వినియోగానికి అనుగుణంగా మార్చడం, వాణిజ్యపరంగా ఉత్పత్తి చేయడంపై శాస్త్రవేత్తలు దృష్టిపెట్టారు. మరెన్నో మందులు.. ►జ్వరం, నొప్పులతోపాటు మరెన్నో అనారోగ్య లక్షణాలకు ఉపశమనంగా వాడే ఆస్పిరిన్ అనే మందు విల్లో చెట్ల బెరడు, ఆకుల్లో ఉంటుంది. వందల ఏళ్లుగా ప్రజలు దానిని వాడుతూ వచ్చారు. 1850వ దశకంలో ఆస్పిరిన్ను కృత్రిమంగా తయారుచేశారు. ►మలేరియాకు మందుగా వినియోగించే క్వినైన్ అనే ఔషధం సింకోనా చెట్ల బెరడు నుంచి వస్తుంది. వందల ఏళ్లుగా దాన్ని వినియోగిస్తున్నారు. 1940వ దశకంలో శాస్త్రవేత్తలు క్వినైన్ను కృత్రిమంగా తయారు చేశారు. ►రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించే ‘స్టాటిన్స్’ను పలు రకాల ఫంగస్ల నుంచి విడుదలయ్యే రసాయనాల నుంచి అభివృద్ధి చేశారు. లక్షల కోట్ల విలువ! మనం పండించే, పెంచే చెట్లు, జంతువులు వంటివి కాకుండా.. సహజ ప్రకృతి నుంచి మనం ఏటా లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులను వాడేసుకుంటున్నాం. ప్రపంచ వన్యప్రాణి నిధి (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) అంచనాల ప్రకారం.. భూమ్మీద ఉన్న ప్రకృతిని రూపాయల్లో లెక్కిస్తే.. 92.5 కోట్ల కోట్లు (125 ట్రిలియన్ డాలర్లు) విలువ ఉంటుంది. ప్రకృతిని సంరక్షించుకోకపోవడం వల్ల ప్రస్తుతం ఏటా రూ.35.4 లక్షల కోట్లు (479 బిలియన్ డాలర్లు) నష్టపోతున్నామని డబ్ల్యూడబ్ల్యూఎఫ్ హెచ్చరించింది. -
కణితి అని భావిస్తే.. వైట్ ఫంగస్గా తేలింది
భోపాల్: మధ్యప్రదేశ్లో ఓ విభిన్నమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ మెదడులో కణితి ఉందని భావించిన వైద్యులు ఆపరేషన్ తీసి దాన్ని తొలగించారు. తీరా చూస్తే అది కాస్త వైట్ ఫంగస్గా తేలింది. దాంతో వైద్యులు ఆశ్చర్యపోతున్నారు. ఆ వివరాలు.. మధ్యప్రదేశ్ ఇండోర్కు చెందిన కలా బాయ్ కోవిడ్ బారిన పడి కోలుకున్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఆమెకు తన శరీరం కుడి భాగం విపరీతంగా లాగడం ప్రారంభించింది. దాంతో మరోసారి ఆస్పత్రికి వెళ్లింది. వైద్యులు ఆమెకు ఎంఆర్ఐ స్కాన్ చేసి.. మెదడులో కణితి ఏర్పడినట్లు గుర్తించారు. ప్రాణాంతక కణితిని వెంటనే తొలగించాలని సూచించారు. వెంటనే ఆపరేషన్ చేశారు. ఆ తర్వాత కణితికి బయాప్సి నిర్వహించగా షాకింగ్ విషయం తెలిసింది. వైద్యులు భావించినట్లు అది కణితి కాదు.. వైట్ ఫంగస్ అని తేలింది. ఈ సందర్భంగా కలా బాయ్కు ఆపరేషన్ చేసిన వైద్యులు మాట్లాడుతూ.. ‘‘ఎంఆర్ఐ స్కాన్లో ఫంగస్ కణితిలానే కనిపించింది. పైగా కణితి ఏర్పడినప్పుడు ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయో కలా బాయ్లో అవే లక్షణాలు కనిపించాయి. ఆమె అదృష్టం బాగుండి ఫంగస్ మిగతా భాగాలకు చేరేలోపే దాన్ని తొలగించగలిగాము. ప్రస్తుతం ఆమె కోలుకుంటుంది. త్వరలోనే డిశ్చార్జ్ చేస్తాం’’ అని తెలిపారు. చదవండి: శరీర బరువులో సగం ఉన్న కణితి, తొలగించిన డాక్టర్లు -
బ్లాక్-వైట్-ఎల్లో... ఈ ఫంగస్లతో ప్రమాదమేంటి?
కరోనా సెకండ్ వేవ్ మొదలైనప్పటి నుంచి బ్లాక్ ఫంగస్ కేసులు పెరిగిపోతున్నాయి. దీనిని మహమ్మారిగా ప్రకటించారు. మరోవైపు కొత్తగా వైట్, ఎల్లో ఫంగస్ కేసులూ నమోదవుతున్నాయి. కరోనా చికిత్సలో స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడినవారిలో.. రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బులు వంటి కోమార్బిడిటీస్ ఉన్నవారిలో రోగ నిరోధక శక్తి తగ్గి.. ఫంగస్లు దాడి చేస్తున్నాయి. మరి ఈ ఫంగస్లు ఏమిటి? ఎలా సోకుతాయి? వాటితో లక్షణాలు, ప్రమాదాలు ఏమిటనే వివరాలు తెలుసుకుందామా? – సాక్షి సెంట్రల్ డెస్క్ ఒకరి నుంచి మరొకరికి సోకవు బ్లాక్, వైట్, ఎల్లో... ఫంగస్ ఏదైనా సరే నిజానికి మన చుట్టూ ఉండే పరిసరాలు, వాతావరణంలోనే ఉంటాయి. వాటిని మన శరీరం తరచూ ఎదుర్కొంటూనే ఉంటుంది. మామూలు పరిస్థితుల్లో అవి మనను ఏమీ చేయలేవు. శరీరం బలహీనమై, రోగ నిరోధక శక్తి తగ్గిపోయినవారిపై మాత్రమే ప్రభావం చూపుతాయి. వైరస్, బ్యాక్టీరియాల తరహాలో ఒకరి నుంచి మరొకరికి సోకుతాయన్న ఆందోళన అవసరం లేదు. ముందే గుర్తిస్తే చికిత్స సులువు ఫంగస్ ఇన్ఫెక్షన్ ఏదైనా ముందుగా గుర్తించగలిగితే సులువుగానే చికిత్స చేయవచ్చని వైద్య నిపు ణులు చెప్తున్నారు. ఒక స్థాయి వరకు సాధారణ మందులతోనే బయటపడొచ్చని పేర్కొంటున్నారు. ఇన్ఫెక్షన్ తీవ్రస్థాయికి చేరి శరీర భాగాలు దెబ్బతినడం మొదలైతే.. ప్రభావవంతమైన యాంటీ ఫంగల్ ఇంజెక్షన్లు వాడాల్సి ఉంటుందని, శస్త్రచికిత్సలు చేసి ఫంగస్ సోకిన కణజాలా న్ని తొలగించాల్సి వస్తుందని వివరిస్తున్నారు. చదవండి: వైట్ ఫంగస్: పేగులకు రంధ్రాలు బ్లాక్ ఫంగస్ బ్లాక్ ఫంగస్ అసలు పేరు మ్యూకోర్ మైకోసిస్. సాధారణంగా మన పరిసరాల్లోనే ఉండే ఈ ఫంగస్.. శరీరం బలహీనమై, రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడు ప్రభావం చూపడం మొదలుపెడుతుంది. ఏవైనా వ్యాధులకు గురై స్టెరాయిడ్లు, యాంటీ బయాటిక్స్, యాంటీ వైరల్ మందులు అధికంగా వాడినప్పు డు, శస్త్రచికిత్సలు చేయించుకున్నప్పుడు, మధుమేహం, షుగర్ పెరిగిపోయినప్పుడు ఈ ఫంగస్ దాడిచేసే అవకాశాలు ఎక్కువ. దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో.. 12 వేల మందికి పైగా బ్లాక్ ఫంగస్ బారినపడినట్టు ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. లక్షణాలు ఇవీ.. తీవ్రమైన తలనొప్పి, ముక్కు బిగుసుకుపోవడం, ముక్కు నుంచి ఆకుపచ్చ రంగులో స్రావం, ముక్కులోంచి రక్తం కారడం, గొంతు నొప్పి, పంటి నొప్పి, పళ్లు వదులుకావడం, కళ్ల చుట్టూ, ముఖం ఉబ్బడం, చర్మం రంగుమార డం వంటివి బ్లాక్ ఫంగస్ సాధారణ లక్ష ణా లు. ముక్కు లోపలిభాగంలో, కొండనాలుక ఉండే చోట నల్ల రంగు మచ్చలు కనిపిస్తాయి. ► ఈ ఫంగస్ ఊపిరితిత్తులకు వ్యాపిస్తే.. జ్వరం, ఛాతీలో నొప్పి, నోట్లోంచి రక్తం పడటం వంటివి ఏర్పడతాయి. ► బ్లాక్ ఫంగస్ జీర్ణ వ్యవస్థకూ సోకే ప్రమా దం ఉంది. అదే జరిగితే కడుపునొప్పి, పొ ట్ట ఉబ్బడం వంటి లక్షణాలు ఉంటాయి. ► ఈ ఫంగస్ సోకినవారిలో కొందరికి కళ్లు, ముక్కు లోపలి భాగంలో కండరాలను తొలగించాల్సి వస్తుంది. చదవండి: బ్లాక్ ఫంగస్: నెల రోజుల్లో జిల్లాలో 23 కేసులు ఎవరికి ప్రమాదకరం? బ్లాక్ ఫంగస్ బారినపడుతున్న వారి లో 90 శాతానికిపైగా మధుమేహం ఉన్నవారు/ స్టెరాయిడ్లు అధికమో తాదులో వాడినవారేనని ఎయిమ్స్ డైరెక్టర్ ఇటీవలే తెలిపారు. ► అవయవ మార్పిడి చేయించుకున్నవారు, కేన్సర్ వ్యాధికి చికిత్స పొందుతున్న వారు, ఐసీయూలో దీర్ఘకాలం చికిత్స పొందుతున్న వారికి సోకే అవకాశం ఉంది. ► వెరికొనజోల్ థెరపీ (ఊపిరితిత్తులకు సోకే ఓ రకం ఫంగస్ వ్యాధికి చికిత్స) తీసుకుంటున్న వారికి బ్లాక్ ఫంగస్ వచ్చే ప్రమాదం ఉంటుంది. వైట్ ఫంగస్ బ్లాక్, వైట్ ఫంగస్ల కన్నా మరింత ప్రమాదకరమైనది ఎల్లో ఫంగస్. దీనిని మ్యూకోర్సెప్టిక్గా పిలుస్తారు. ఉత్తరప్రదేశ్లోని ఘజి యాబాద్లో తొలి ఎల్లో ఫంగస్ కేసును గుర్తిం చారు. బ్లాక్, వైట్ ఫంగస్ల లక్షణాలు ఎక్కువగా బయటికి కనిపిస్తే.. ఎల్లో ఫంగస్ లోలోపలే వ్యాపిస్తూ ఉంటుంది. బయటికి పెద్దగా లక్షణాలు కనబడకపోవడంతో దానిని గుర్తించేసరికే ప్రాణాంతకంగా మారు తుందని ఘజియాబాద్ ఆస్పత్రి ఈఎన్టీ వైద్యుడు డాక్టర్ త్యాగి తెలిపారు. సాధారణంగా ఎల్లో ఫంగస్ ఎక్కువగా సరీసృపాల (పాములు, బల్లులు, ఇతర పాకే జంతువుల)కు సోకుతుందని.. మనుషు ల్లో దాని ప్రభావంపై అధ్యయనం చేయాల్సి ఉందని ఐసీఎంఆర్లో అంటువ్యాధుల విభాగం చీఫ్ సమీరన్ పండా చెప్పారు. లక్షణాలు ఇవీ.. బద్ధకం, ఆకలి తగ్గడం, బరువు తగ్గిపోవడం వంటివి సాధారణంగా ఎల్లో ఫంగస్ లక్షణా లు. ఈ వ్యాధి ముదిరితే.. గాయాలు తగ్గకపోవడం, చిన్న గాయాలైనా సరే చీము పట్టడం, శరీరంలో అంతర్గతంగా రక్తస్రావం జరగడం వంటివి కనిపిస్తాయి. చివరికి అవయవాలు దెబ్బతిని ప్రాణాంతకంగా మారుతుంది. ఎల్లో ఫంగస్ బ్లాక్, వైట్ ఫంగస్ల కన్నా మరింత ప్రమాదకరమైనది ఎల్లో ఫంగస్. దీనిని మ్యూకోర్సెప్టిక్గా పిలుస్తారు. ఉత్తరప్రదేశ్లోని ఘజి యాబాద్లో తొలి ఎల్లో ఫంగస్ కేసును గుర్తిం చారు. బ్లాక్, వైట్ ఫంగస్ల లక్షణాలు ఎక్కువగా బయటికి కనిపిస్తే.. ఎల్లో ఫంగస్ లోలోపలే వ్యాపిస్తూ ఉంటుంది. బయటికి పెద్దగా లక్షణాలు కనబడకపోవడంతో దానిని గుర్తించేసరికే ప్రాణాంతకంగా మారు తుందని ఘజియాబాద్ ఆస్పత్రి ఈఎన్టీ వైద్యుడు డాక్టర్ త్యాగి తెలిపారు. సాధారణంగా ఎల్లో ఫంగస్ ఎక్కువగా సరీసృపాల (పాములు, బల్లులు, ఇతర పాకే జంతువుల)కు సోకుతుందని.. మనుషు ల్లో దాని ప్రభావంపై అధ్యయనం చేయాల్సి ఉందని ఐసీఎంఆర్లో అంటువ్యాధుల విభాగం చీఫ్ సమీరన్ పండా చెప్పారు. లక్షణాలు ఇవీ.. బద్ధకం, ఆకలి తగ్గడం, బరువు తగ్గిపోవడం వంటివి సాధారణంగా ఎల్లో ఫంగస్ లక్షణా లు. ఈ వ్యాధి ముదిరితే.. గాయాలు తగ్గకపోవడం, చిన్న గాయాలైనా సరే చీము పట్టడం, శరీరంలో అంతర్గతంగా రక్తస్రావం జరగడం వంటివి కనిపిస్తాయి. చివరికి అవయవాలు దెబ్బతిని ప్రాణాంతకంగా మారుతుంది. ఎవరికి ప్రమాదకరం? ఎల్లో ఫంగస్ ప్రత్యేకంగా ఎవరికి సోకుతుందన్నదానిపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ధారణ జరగలేదని వైద్యులు చెప్తున్నారు. రోగ నిరోధకశక్తి తగ్గినవారు, మధుమేహం నియంత్రణలో లేనివారు, కేన్సర్ చికిత్స పొందుతున్నవారు, ఇతర కోమార్బిడిటీస్ ఉన్న వాళ్లపై ఈ ఫంగస్ ప్రభావం చూపుతుందంటున్నారు. ఎవరికి ప్రమాదకరం? ఎల్లో ఫంగస్ ప్రత్యేకంగా ఎవరికి సోకుతుందన్నదానిపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ధారణ జరగలేదని వైద్యులు చెప్తున్నారు. రోగ నిరోధకశక్తి తగ్గినవారు, మధుమేహం నియంత్రణలో లేనివారు, కేన్సర్ చికిత్స పొందుతున్నవారు, ఇతర కోమార్బిడిటీస్ ఉన్న వాళ్లపై ఈ ఫంగస్ ప్రభావం చూపుతుందంటున్నారు. చికిత్స దాదాపు ఒకేలా.. బ్లాక్, వైట్, ఎల్లో ఫంగస్.. ఇలా ఏదైనా దాదాపుగా చికిత్స ఒకే రకంగా ఉంటుందని వైద్యులు చెప్తున్నారు. చాలా రకాల ఫంగస్లను నిర్మూలించగల ‘ఆంఫొటెరిసిన్ బి’ని చికిత్సలో వాడతారు. కాస్త తక్కువ సామర్థ్యం ఉండే ఇతర యాంటీ ఫంగల్ మందులనూ వినియోగిస్తారు. ఫంగస్ ఎక్కువుంటే శస్త్రచికిత్సలు చేసి.. ఫంగస్ సోకిన కణజాలాన్ని తొలగించాల్సి ఉంటుంది. ఈ జాగ్రత్తలు తప్పనిసరి శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం, మధుమేహం నియంత్రణలో లేకపోవడం, అపరిశుభ్ర పరిస్థితులు ఈ మూడు కూడా ఫంగస్ వ్యాధులకు ఉమ్మడి కారణాలు. ► కరోనా చికిత్సలో అధికంగా స్టెరాయిడ్లు వాడితే ఇమ్యూనిటీ శక్తి దెబ్బతింటుంది. అవసరమైన మేరకే ఉపయోగించాలి. ► మధుమేహం ఉంటే మరింత జాగ్రత్త అవసరం. షుగర్ స్థాయిని తరచూ చెక్ చేసుకుంటూ, మందులు వాడుతూ ఉండాలి. ► పేషెంట్లకు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, వెంటిలేటర్లు పెట్టినప్పుడు వాటిల్లోని హ్యుమిడిఫయర్లు, పైపులను తరచూ శుభ్రం చేయాలి. లేకుంటే ఫంగస్ పెరిగి.. నేరుగా ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది. ► ఇల్లు, చుట్టుపక్కల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. కలప, కాగితం, అట్టడబ్బాలపై ఫంగస్ పెరుగుతుంది. అలాంటివి లేకుండా చూడాలి. ►ఇంట్లో నిల్వ ఆహార పదార్థాలపై ఫంగస్ పెరుగుతుంది. అందువల్ల ఎప్పటికప్పుడు బయటపడేయాలి. ► గదుల్లో తేమ (హ్యుమిడిటీ) తక్కువగా ఉండేలా చూసుకోవాలి. హ్యుమిడిటీ పెరి గితే ఫంగస్ ఎక్కువగా పెరుగుతుంది. -
వైట్ ఫంగస్: పేగులకు రంధ్రాలు
న్యూఢిల్లీ: కరోనా కంటే ఎక్కువగా ఫంగస్ కేసులు జనాలను తీవ్రంగా భయపెడుతున్నాయి. కరోనా నుంచి కోలుకున్నామని సంతోషించే లోపలే ఫంగస్ వ్యాప్తి ప్రాణాలకు మీదకు తెస్తుంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా బ్లాక్, వైట్, యెల్లో అంటూ వేర్వేరు ఫంగస్లను గుర్తించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా వైట్ ఫంగస్ బారిన పడిన వ్యక్తిలో అరుదైన లక్షణాలు కనిపించాయి. ఫంగస్ వల్ల బాధితురాలి చిన్న పేగులు, పెద్ద పేగుల్లో రంధ్రాలు ఏర్పడ్డాయని వైద్యులు తెలిపారు. ఈ తరహా కేసు ప్రపంచంలో ఇదే మొదటిదన్నారు. ఆ వివరాలు..ఈ నెల 13న 49 ఏళ్ల మహిళ ఒకరు తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులతో బాధపడుతూ ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆస్పత్రిలో చేరింది. ఇక బాధితురాలు క్యాన్సర్తో బాధపడుతుంది. ఈ క్రమంలో ఆస్పత్రిలో చేరడానికి వారం రోజుల ముందే ఆమెకు కీమో థెరపీ చేయించారు. ఆ తర్వాత ఆమె కడుపునొప్పితో బాధపడుతుండటంతో గంగా రామ్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. డాక్టర్లు ఆమెకి సీటీ స్కాన్ చేయగా పేగులకు రంధ్రాలు పడినట్లు గుర్తించారు. ఈ సందర్భంగా సర్ గంగా రామ్ ఆసుపత్రిలోని గ్యాస్ట్రోఎంటరాలజీ అండ్ ప్యాంక్రియాటికోబిలియరీ సైన్సెస్ విభాగానికి చెందిన డాక్టర్ (ప్రొఫెసర్) అమిత్ అరోరా మాట్లాడుతూ.. ‘‘నాలుగు గంటల పాటు సాగిన శస్త్రచికిత్స ద్వారా, మహిళ ఆహార పైపు, చిన్న పేగు, పెద్ద పేగులలోని రంధ్రాలు మూసివేశాము. బాధితురాలి శరీరం లోపల ద్రవం లీకేజీని ఆపడానికి ఈ శస్త్రచికిత్స సహాయపడుతుంది’’ అని తెలిపారు. డాక్టర్ అరోరా మాట్లాడుతూ స్టెరాయిడ్ వాడకం వల్ల ఇటీవల పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ కేసుల్లో కొన్ని చోట్ల పేగులకు రంధ్రాలు పడిన కేసులు కొన్ని వెలుగు చూశాయి. అయితే వైట్ ఫంగస్ కేసులో.. పేగుల్లో రంధ్రాలు ఏర్పడిన కేసు ప్రపంచంలో ఇది మొదటిది అన్నారు. చదవండి: 4 గంటలు శ్రమించి.. బ్లాక్ ఫంగస్ తొలగించి.. -
ముంచుకొస్తున్న మరో ముప్పు.. ఆ రెండింటి కన్నా డేంజర్
లక్నో: కరోనా నుంచి కోలుకున్న వారిని బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ రూపంలో మరో ప్రమాదం భయపెడుతున్న సంగతి తెలిసిందే. ఫంగస్ బారిన పడిన వారు ప్రారంభంలోనే దాన్ని గుర్తించకపోతే.. ప్రాణాలే పోతున్నాయి. ఈ రెండు ఫంగస్లు జనాలను భయభ్రాంతలకు గురి చేస్తుండగా.. తాజాగా యెల్లో ఫంగస్ రూపంలో మరో ముప్పు ముంచుకొస్తుంది. బ్లాక్, వైట్ ఫంగస్లకన్నా ఇది మరింత ప్రమాదకరం అంటున్నారు వైద్య నిపుణులు. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో తొలిసారి ఈ యెల్లో ఫంగస్ కేసును గుర్తించారు వైద్యులు. ప్రస్తుతం బాధితుడికి నగరంలోని ప్రసిద్ధ ఈఎన్టీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. యెల్లో ఫంగస్ లక్షణాలు.. బద్ధకం, ఆకలి తక్కువగా ఉండటం.. లేదా అసలు ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం యెల్లో ఫంగస్లో ప్రధానంగా కనిపించే లక్షణాలు. ఫంగస్ తీవ్రమైతే చీము కారడం, శరీరం మీద ఉన్న గాయాలు, లోపలి గాయాలు నెమ్మదిగా మానడం, పోషకాహార లోపం, అవయవాలు వైఫల్యం చెందడం, చివరికి నెక్రోసిస్ కారణంగా కళ్ళు పోవడం జరుగుతుంది అంటున్నారు వైద్యులు. యెల్లో ఫంగస్ ఒక ప్రాణాంతక వ్యాధి.. ఎందుకంటే ఇది అంతర్గతంగా మొదలవుతుంది. అందువల్ల పైన చెప్పిన ఏదైనా లక్షణాలను గమనించిన వెంటనే వైద్య చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం అంటున్నారు వైద్యులు. యెల్లో ఫంగస్ వ్యాప్తికి కారణాలు.. యెల్లో ఫంగస్ ఇన్ఫెక్షన్ ప్రధానంగా అపరిశుభ్ర వాతావరణం వల్ల వ్యాప్తిస్తుంది. కనుక ఇంటిని.. చుట్టుపక్కల పరిసరాలను సాధ్యమైనంత శుభ్రంగా ఉంచడం చాలా ముఖ్యం. బ్యాక్టీరియా, ఫంగస్ పెరుగుదలను నివారించడానికి మిగిలిపోయిన ఆహారాలు, మల పదార్థాలను వీలైనంత త్వరగా తొలగించుకోవాలి. ఇంటిలోని తేమ కూడా బ్యాక్టీరియా, ఫంగస్ పెరుగుదలను ప్రోత్సహిస్తుంది కాబట్టి ఇంటిని సాధ్యమైనంత పొడిగా ఉంచుకోవాలి. సరైన తేమ స్థాయి 30% నుంచి 40% వరకు ఉంటుంది. కనుక ఇంటిని సాధ్యమైనంత పొడిగా ఉంచుకోవాలి అని సూచిస్తున్నారు నిపుణులు. చదవండి: బ్లాక్ ఫంగస్కు ఆయుర్వేద మందు -
బ్లాక్ ఫంగస్ అంటువ్యాధా.. డాక్టర్లు ఏమంటున్నారు?
సాక్షి, రామగుండం: రాష్ట్రంలో కరోనా రెండో దశ రోజురోజుకు విజృంభిస్తున్న తరుణంలో వైరస్ కట్టడికి మాస్కులు ధరిస్తూ, భౌతిక దూరం పాటించాలి. అనవసరంగా బయట తిరగకుండా ఇంట్లోనే ఉండడం మంచిది’ అని యైటింక్లయిన్కాలనీ అల్లూరు అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కుమార్ అన్నారు. పాజిటివ్ వచ్చినా ఆందోళన చెందకుండా మనోధైర్యంతో వైద్యుల సలహాలు, సూచనలు పాటించాలని పేర్కొన్నారు. అత్యవసరమైతే తప్ప ఆసుపత్రికి వెళ్లకుండా 14 రోజులు క్యారంటైన్లో ఉండాలంని తెలిపారు. ఈమేరకు ‘సాక్షి’కి పలు విషయం వివరించారు. చదవండి: బ్లాక్ ఫంగస్ మహమ్మారే! ప్రశ్న: కరోనా సోకిన వ్యక్తి ముట్టుకున్న వస్తువులపై వైరస్ ఎన్ని రోజులు ఉంటుంది? జవాబు: కరోనా సోకిన వ్యక్తి ముట్టుకున్న వస్తువులపై కరోనా వైరస్ 2–3 రోజులు మాత్రమే ఉంటుంది. శానిటైజేషన్ చేసి వాడుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రశ్న: బ్లాక్ ఫంగస్ అంటువ్యాధా..? జవాబు: మ్యూకార్ మైకోసిస్ అనే ఫంగస్తో వచ్చేది బ్లాక్ ఫంగస్. ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి సోకదు. ప్రశ్న: కరోనా సోకిన వ్యక్తికి దగ్గు ఎన్ని రోజుల వరకు ఉంటుంది.? జవాబు: కరోనా నుంచి కోలుకున్నాక 14 రోజుల తర్వాత తిరిగి పరీక్ష అవసరం లేదు. మందులు వాడిన తర్వాత వైరస్ చనిపోయి వ్యక్తి శరీరంలో 3 నెలల వరకు ఉంటుంది. కాని దీని ద్వారా ఇతరులకు వైరస్ వ్యాప్తి చెందదు. అలాగే దగ్గు రెండుమూడు నెలల వరకు ఉండవచ్చు. దాని ప్రభావంతో ఆయాసం వస్తే వైద్యుల సూచనలు పాటిస్తూ మందులు వాడాలి. ప్రశ్న: జ్వర సర్వేతో ఉపయోగం ఉందా..? జవాబు: జ్వర సర్వేతో చాలా ఉపయోగాలు ఉన్నాయి. కోవిడ్ లక్షణాలు ఉన్న వ్యక్తులను గుర్తించి వారికి ముందస్తు చికిత్స అందించే అవకాశం ఉంటుంది. వ్యక్తి పరిíస్థితిని బట్టి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి వెళ్లాలని సూచనలు ఇచ్చి ప్రాణపాయ íస్థితి నుంచి రక్షించవచ్చు. బాధితుల ఫోన్నంబర్ తీసుకొని వారికి అవసరమైన మందులతో పాటు సలహాలు, సూచనలు అందిస్తారు. ఫలితంగా ఇతరులకు వైరస్ సోకకుండా కట్టడి చేసే అవకాశం చాలా ఉంటుంది. జ్వర సర్వేకు ప్రజలందరూ సహకరించాలి. ప్రశ్న: కరోనా సోకిన వ్యక్తి ముట్టుకున్న వస్తువులపై వైరస్ ఎన్ని రోజులు ఉంటుంది? జవాబు: కరోనా సోకిన వ్యక్తి ముట్టుకున్న వస్తువులపై కరోనా వైరస్ 2–3 రోజులు మాత్రమే ఉంటుంది. శానిటైజేషన్ చేసి వాడుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రశ్న: బ్లాక్ ఫంగస్ అంటువ్యాధా..? జవాబు: మ్యూకార్ మైకోసిస్ అనే ఫంగస్తో వచ్చేది బ్లాక్ ఫంగస్. ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి సోకదు. ప్రశ్న: కరోనా సోకిన వ్యక్తికి దగ్గు ఎన్ని రోజుల వరకు ఉంటుంది.? జవాబు: కరోనా నుంచి కోలుకున్నాక 14 రోజుల తర్వాత తిరిగి పరీక్ష అవసరం లేదు. మందులు వాడిన తర్వాత వైరస్ చనిపోయి వ్యక్తి శరీరంలో 3 నెలల వరకు ఉంటుంది. కాని దీని ద్వారా ఇతరులకు వైరస్ వ్యాప్తి చెందదు. అలాగే దగ్గు రెండుమూడు నెలల వరకు ఉండవచ్చు. దాని ప్రభావంతో ఆయాసం వస్తే వైద్యుల సూచనలు పాటిస్తూ మందులు వాడాలి. ప్రశ్న: జ్వర సర్వేతో ఉపయోగం ఉందా..? జవాబు: జ్వర సర్వేతో చాలా ఉపయోగాలు ఉన్నాయి. కోవిడ్ లక్షణాలు ఉన్న వ్యక్తులను గుర్తించి వారికి ముందస్తు చికిత్స అందించే అవకాశం ఉంటుంది. వ్యక్తి పరిíస్థితిని బట్టి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి వెళ్లాలని సూచనలు ఇచ్చి ప్రాణపాయ స్థితి నుంచి రక్షించవచ్చు. బాధితుల ఫోన్నంబర్ తీసుకొని వారికి అవసరమైన మందులతో పాటు సలహాలు, సూచనలు అందిస్తారు. ఫలితంగా ఇతరులకు వైరస్ సోకకుండా కట్టడి చేసే అవకాశం చాలా ఉంటుంది. జ్వర సర్వేకు ప్రజలందరూ సహకరించాలి. -
బ్లాక్ ఫంగస్: అంటువ్యాధిగా ప్రకటించిన రాజస్థాన్
జైపూర్: కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా అందరినీ కలవరపెడుతోంది. కొన్ని లక్షలమంది ఈ వైరస్ బారినపడ్డారు, వారిలో కొంతమంది తమ ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఇలాంటి మహమ్మారులు మానవాళికి కొత్తకాదు. మన పూర్వీకులు ఎదుర్కొన్న అంటురోగాల్లో కొన్ని ఇప్పటికీ మనతోనే ఉన్న విషయం తెలిసిందే.అయితే మహమ్మారి రూపంలో ప్రపంచాన్ని భయపెట్టిన కొన్ని అంటువ్యాధులు కాలక్రమేణా అంతమైపోయాయి. బ్యుబోనిక్ ప్లేగు, మశూచి, కలరా, ఇన్ఫ్లుయెంజా, సార్స్ వ్యాధులు వల్ల ఎంతో మంది మృతి చెందారు. ఇక దేశమంతా కరోనా వైరస్ ఉధృతితో వణుకుతుంటే మరోవైపు కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత మ్యుకర్మైకోసిస్(బ్లాక్ ఫంగస్) వ్యాధి లక్షణాలు కరోనా బాధితుల్లో కనిపించడం కలవరపెడుతోంది. తాజాగా బ్లాక్ ఫంగస్ను(మ్యూకోర్మైకోసిస్ను) రాజస్థాన్ ప్రభుత్వం అంటువ్యాధిగా ప్రకటించింది. ప్రస్తుతం రాజస్థాన్లో దాదాపు 100మంది బ్లాక్ఫంగస్ బారిన పడినట్టు గుర్తించారు. వీరికి చికిత్స అందించేందుకు జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ ఆస్పత్రిలో ప్రత్యేక వార్డును కేటాయించారు. ‘రాజస్థాన్ అంటువ్యాధుల నివారణ చట్టం 2020 కింద రాష్ట్రంలో దీనిని గుర్తించదగిన వ్యాధుల్లో చేర్చాం’ అని రాజస్థాన్ ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అఖిల్ అరోరా తెలిపారు. బ్లాక్ ఫంగస్, కరోనా వైరస్కు సమగ్రమైన, సమన్వయంతో కూడిన చికిత్స అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు అరోరా తెలిపారు. మధుమేహ రోగులు బ్లాక్ ఫంగస్ బారినపడే అవకాశం అధికంగా ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాగా, ఇప్పటివరకు ఢిల్లీలో 75, ఉత్తరప్రదేశ్లో 50, మధ్యప్రదేశ్ 19, ఉత్తరాఖండ్లో 38, హర్యానాలో 115, మహారాష్ట్రలో 201 మంది బ్లాక్ ఫంగస్ బారిన పడినట్లు తెలుస్తోంది. (చదవండి: వైరల్: శునకం యోగాసనాలు..నెటిజన్లు ఫిదా!) -
బ్లాక్ ఫంగస్ నియంత్రణకు చర్యలు
సాక్షి, అమరావతి: బ్లాక్ ఫంగస్ (మ్యుకర్ మైకోసిస్) నియంత్రణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్కుమార్ సింఘాల్ చెప్పారు. కేంద్రం ఈ జబ్బు నియంత్రణకు 1,650 వయల్స్ (ఇంజక్షన్లు) కేటాయించిందని తెలిపారు. రాష్ట్రప్రభుత్వం సొంత నిధులతో మూడు కంపెనీల (మైలాన్, భారత్ సీరం, సన్ఫార్మా) నుంచి 15 వేల ఇంజక్షన్లు కొనుగోలు చేస్తోందని చెప్పారు. రెండు మూడు రోజుల్లో ఇంజక్షన్లు రానున్నాయన్నారు. బుధవారం ఆయన మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో మీడియాతో మాట్లాడారు. బ్లాక్ ఫంగస్ సోకిన వారి పూర్తి వివరాలు ఇంకా రావాల్సి ఉందన్నారు. ఒక్కో పేషెంటుకు 60 ఇంజక్షన్ల వరకు అవసరం అవుతాయని చెప్పారు. ఇది ఖరీదైన చికిత్స కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆరోగ్యశ్రీలో చేర్చిందన్నారు. రాష్ట్రానికి ప్రస్తుతం 590 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉండగా, కేంద్రం 625 టన్నులకు ఆమోదం తెలిపిందన్నారు. విశాఖపట్నం నుంచి వచ్చే ఆక్సిజన్ కోటా తగ్గనుందన్నారు. గతంలో ప్రొడక్షన్ కెపాసిటీ నుంచే కాకుండా స్టోరేజీ నుంచి కూడా కలిపి మొత్తం 170 మెట్రిక్ టన్నులు తీసుకునే వాళ్లమని చెప్పారు. ఇప్పుడు స్టోరేజీ కెపాసిటీ తగ్గిపోవడంతో ప్రొడక్షన్ కెపాసిటీ 130 మెట్రిక్ టన్నులు మాత్రమే వస్తుందని తెలిపారు. ఇందువల్ల అంగూల్, రూర్కెలా ప్లాంట్ల కేటాయింపులు పెంచారన్నారు. ఈనెల 23వ తేదీలోగా మరో 4 క్రయోజనిక్ ట్యాంకర్లు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించిందని, వాటి ద్వారా 80 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ వస్తుందని చెప్పారు. 104 కాల్సెంటర్లో రిజిస్టర్ అయిన వైద్యుల సంఖ్య 4,293కు పెరిగిందని, వీరిలో 188 మంది స్పెషలిస్టులున్నారని తెలిపారు. బుధవారం 12,679 మంది హోం ఐసొలేషన్లో ఉన్న బాధితులతో వైద్యులు మాట్లాడారని చెప్పారు. కోవిడ్ కేర్ సెంటర్లను బలోపేతం చేయడం వల్ల 104కు వచ్చే ఫోన్కాల్స్ తగ్గుముఖం పట్టాయని, త్వరలోనే వైరస్ అదుపులోకి వస్తుందని భావిస్తున్నామని పేర్కొన్నారు. బ్లాక్ఫంగస్ను ఆరోగ్యశ్రీలో చేర్చడం, కోవిడ్తో తల్లిదండ్రులు మృతిచెండటం వల్ల అనాథలైన పిల్లలకు రూ.10 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్కు సంబంధించిన ఉత్తర్వులు ఇచ్చామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచుల ఆధ్వర్యంలో ఉన్న కమిటీలు రోజూ సమావేశాలు నిర్వహించి.. ఫీవర్ సర్వే, హోం ఐసొలేషన్ కిట్ల పర్యవేక్షణ చేయాలని సూచించారు. రేయింబవళ్లు పనిచేస్తున్న వైద్యసిబ్బంది సేవలు అభినందనీయమని ఆయన ప్రశంసించారు. -
ఆరోగ్యశ్రీలోకి ‘బ్లాక్ ఫంగస్’
సాక్షి, అమరావతి: బ్లాక్ ఫంగస్ చికిత్సను రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పరిధిలో చేర్చింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్కుమార్ సింఘాల్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఈ ఫంగస్ జబ్బు వస్తోంది. స్టెరాయిడ్స్ వాడిన తర్వాత షుగర్ లెవెల్స్ ఎక్కువగా పెరగడం తదితర కారణాల వల్ల ఫంగస్ ఎక్కువగా సోకుతుండటం, వైద్యం ఖరీదు కావడంతో రకరకాల వైద్య పరీక్షలతో పాటు చికిత్సలు, శస్త్రచికిత్సలను కూడా ఆరోగ్యశ్రీలోకి తెచ్చారు. సీటీ/ఎంఆర్ఐ, ఫంగల్ కల్చర్, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, రీనల్ ఫంక్షన్ టెస్ట్ (కిడ్నీ), షుగర్ టెస్ట్లు, హెచ్బీఏ1సీ, నాజల్ ఎండోస్కొపీ వంటివన్నీ ఉచిత చికిత్సలో భాగంగా చేయాలి. అంతేకాకుండా యాంటీబయాటిక్, ఐవీ ఫ్లూయిడ్స్, లింఫొసొమాల్ (యాంపొటెరిసిన్ బి) లేదా ఓరల్ పొసకొనొజోల్ ఇవ్వాలి. వైద్య పరీక్షల ఆధారంగా 2 వారాల నుంచి 3 వారాల పాటు ఈ వైద్యం చేయాల్సి ఉంటుంది. చికిత్స అనంతరం ఏదైనా శస్త్రచికిత్స చేయాల్సి వచ్చినా అదనంగా కూడా కేటాయిస్తామని ఉత్తర్వుల్లో చెప్పారు. సర్జికల్ మేనేజ్మెంట్ ఆఫ్ ప్రొప్టొసిస్కు రూ. 50 వేలు, యాంటీబయోటిక్స్, మందుల ప్యాకేజీకి రూ. 41,968, ఆఫ్తాల్మాలజీ ఆర్బిటొటొమి చికిత్సకు రూ. 27,810, ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీకి రూ. 16,932, ఎక్స్ంటరేషన్ ఆఫ్ ఆర్బిట్ చికిత్సకు రూ. 10,180 నిర్ణయించారు. లింఫొసొమాల్ (యాంఫొటెరిసిన్ బి), పొసకొనొజోల్ ఇంజక్షన్లకు ఎంఆర్పీ ధరలు చెల్లిస్తారు. ఆరోగ్యశ్రీలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ చికిత్స ఉచితంగా చేయాలని స్పష్టం చేశారు. -
Black Fungus: రూ.314 ఇంజెక్షన్ రూ.50 వేలకు!
సాక్షి, హైదరాబాద్: ఇప్పటివరకు కోవిడ్ చికిత్సలో కీలకంగా వాడే రెమిడెసివిర్ ఇంజెక్షన్లను బ్లాక్ మార్కెట్కు తరలించిన కేటుగాళ్లు తాజాగా బ్లాక్ ఫంగస్ చికిత్సకు వాడే ఔషధాలను కూడా అదే బాట పట్టిస్తున్నారు. అయితే ఈ దందా వెనుక ఏకంగా వైద్యులు కూడా ఉండటం జోరుగా సాగుతున్న బ్లాక్ మార్కెట్ పరిస్థితికి అద్దం పడుతోంది. ముఠా సమాచారాన్ని అందుకున్న నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు ఐదుగురు నిందితుల్ని వలపన్ని పట్టుకుని అరెస్టు చేశారు. ఆ ముఠా నుంచి ఐదు ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. నగరంలో బుధవారం జరిగిన ఈ ఘటన వివరాలను ఓఎస్డీ పి.రాధాకిషన్రావు మీడియాకు వెల్లడించారు. ఇటీవల బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతుండటంతో దీనికి వాడే ఇంజెక్షన్లకూ డిమాండ్ వచ్చింది. దీన్ని గమనించిన లంగర్హౌస్కు చెందిన డాక్టర్ బి.రామచరణ్, మలక్పేటకు చెందిన డాక్టర్ గాలి సాయినాథ్, గాజులరామారం ప్రాంతానికి చెందిన బి.సురేశ్, బాలానగర్ వాసి కె.శ్రీకాంత్, కూకట్పల్లికి చెందిన జి.సాయి వర్ధన్గౌడ్ ఓ ముఠాగా ఏర్పడి నగరంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యుడిగా పని చేస్తున్న చిల్లగొల్ల రవితేజ చౌదరి ద్వారా ఆంపోటెరిసీన్ బీ ఇంజెక్షన్లను అక్రమంగా సమీకరించారు. ఒక్కో ఇంజెక్షన్ ధర రూ. 314 ఉండగా దీన్ని రూ.50 వేలకు అమ్మేందుకు ప్రయత్నించారు. దీనిపై ఉత్తర మండల టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావుకు సమాచారం అందింది. ఆయన ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన ఎస్సైలు కె.శ్రీకాంత్, బి.పరమేశ్వర్ తమ బృందాలతో బుధవారం లంగర్హౌస్ ప్రాంతంలో వలపన్ని మొత్తం ఐదుగురిని పట్టుకుని అరెస్టు చేశారు. మరో వైద్యుడు రవితేజ పరారీలో ఉన్నారు. కాగా, వీరిలో ఇద్దరు డాక్టర్లు ఉన్నారు. -
బ్లాక్ ఫంగస్పై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
-
బ్లాక్ ఫంగస్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేరుస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
సాక్షి, విజయవాడ: ఇప్పటికే కరోనా చికిత్సకు ఆరోగ్యశ్రీ పథకం కింద అందిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తాజాగా బ్లాక్ ఫంగస్(మ్యుకర్ మైకోసిస్) చికిత్సను కూడా ఆరోగ్యశ్రీలో చేరుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయమై కొద్దిరోజుల కిందటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. తాజాగా దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడండంతో ఈ వ్యాధి చికిత్సకు అయ్యే ఖర్చును మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది. కాగా, కోవిడ్ నుంచి కోలుకున్న వారు బ్లాక్ ఫంగస్ వ్యాధి బారిన పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 9 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. చిత్తూరులో 3, కర్నూలులో 2, అనంతపురంలో 2, శ్రీకాకుళంలో 1, నెల్లూరులో 1 చొప్పున కేసులు వెలుగుచూశాయి. ప్రభుత్వ నిర్ణయంతో బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందనున్నాయి. -
ఫంగస్ పంజా: జిల్లాలో ముగ్గురి మృతితో ఆందోళన
సాక్షి, నిజామాబాద్: జిల్లాలో బ్లాక్ ఫంగస్ వ్యాధి లక్షణాలతో చికిత్స పొందుతూ ముగ్గురు మృతి చెందారు. వేరువేరు ప్రాంతాలకు చెందిన వీరు ఇరవై నాలుగు గంటల్లోనే మృతి చెందడంపై జిల్లా వాసుల్లో ఆందోళన మొదలైంది. కాగా ఈ మరణాలను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారికంగా గుర్తించాల్సి ఉంది. నవీపేట మండలం రాంపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఐకే ఫారానికి చెందిన బెజవాడ హరిబాబు (35), బోధన్లోని శక్కర్నగర్కు చెందిన మర్రి రాజేశ్వర్ (39), వేల్పూరు మండలం సాహెబ్పేట గ్రామానికి చెందిన ఉట్నూర్ చిన్న గంగారాం (65) హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. వారం రోజుల క్రితం నగరంలోని ఓ వ్యక్తి బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనబడడంతో హైదరాబాద్ వెళ్లి చికిత్స పొందుతున్నాడు. నిజామాబాద్ రూరల్ ప్రాంతానికి చెందిన ఓ మహిళకు సరస్వతినగర్లో స్కానింగ్ చేయడంతో ఈ ఫంగస్ లక్షణాలు కనిపించాయి. వైద్యుడిని సంప్రదించగా ముక్కువద్ద ఇన్ఫెక్షన్ ఉండడం, నల్లటి చారలు కలిగి ఉండడంతో బ్లాక్ ఫంగస్గా గుర్తించి హైదరాబాద్ రిఫర్ చేశారు. అలాగే కామారెడ్డికి చెందిన ఓ వ్యక్తి బ్లాక్ ఫంగస్ లక్షణాలు ఉండడంతో నిజామాబాద్లో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగానే హైదరాబాద్కు రిఫర్ చేశారు. ఇలా ఒక్కొక్కటి కేసులు బయటపడుతున్నాయి. వీరికే వచ్చే అవకాశం.. కరోనా వైరస్ బారిన పడి కోలుకున్నవారు ము ఖ్యంగా షుగర్ వ్యాధిగ్రస్తుల్లో బ్లాక్ ఫంగస్ లక్షణా లు కనిపిస్తున్నాయి. షుగర్ అదుపులో లేకపోవడంతో రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల ఫంగస్ వస్తుందని వైద్యులు పేర్కొంటున్నారు. కరోనా వైరస్ తగ్గించేందుకు చికిత్సలో భాగంగా స్టెరాయిడ్స్ అధికంగా వాడడంతో బ్లాక్ ఫంగస్ వచ్చే అవకాశం ఉంది. ఫంగస్ పంజా బ్లాక్ ఫంగస్ జాడలు వెలుగు చూడటంతో సర్వత్రా ఆందోళన నెలకొంటోంది. ఇరవై నాలుగు గంటల్లోనే జిల్లాకు చెందిన ముగ్గురు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మరెంత మంది దీనిబారిన పడ్డారో స్పష్టత రావడం లేదు. ఈ ఫంగస్ లక్షణాలు కనిపించిన వెంటనే బాధితులను వైద్యులు హైదరాబాద్ ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నారు. జిల్లా యంత్రాంగం, వైద్య శాఖ అప్రమత్తమైంది. బ్లాక్ ఫంగస్పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటోంది. లక్షణాలు.. బ్లాక్ ఫంగస్ సోకిన వారికి తలనొప్పి, ముక్కుదిబ్బడ, కంటిచూపు తగ్గడం, పంటినొప్పి, దవడనొప్పి, ఛాతినొప్పి, ముక్కునుంచి నల్లటి రక్తస్రావం రావడం జరుగుతుంది. ఈ లక్షణాలు ఉంటే వెంటనే వైద్యున్ని సంప్రదించాలి. కంటి గుడ్డుకింద ఎర్రబడి దురదగా ఉండడం. ముక్కు ఎర్రబడడం వంటి లక్షణాలు ఉంటే ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి. అప్రమత్తత అవసరం.. జిల్లాలో ప్రస్తుతం 58,670 మంది కరోనా పాజిటివ్ లక్షణాలతో ఉన్నారు. ఇందులో రెండు వేల వరకు యాక్టివ్ కేసులున్నాయి. ఇటీవల పాజిటివ్ రేటు తగ్గుతూ వస్తోంది. ఏప్రిల్ నెలలో పాజిటివ్ కేసుల సంఖ్య రోజుకు వెయ్యికి పైగా నమోదయ్యాయి. ఇందులో ఐసీయూలో చికిత్స పొందుతున్నవారే 500 మంది వరకూ ఉన్నారు. చికిత్స తీసుకుంటూ కరోనా తగ్గించుకున్నవారు కూడా ఉన్నారు. ఆస్పత్రుల్లో పది రోజుల వరకు చికిత్స పొందుతూ స్టెరాయిడ్లు వాడిన వారు, ఆక్సిజన్ సాయంతో చికిత్స పొందిన వారికి బ్లాక్ ఫంగస్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడిప్పుడే కేసులు వెలుగులోకి రావడంతో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. కాగా ప్రస్తుతం నమోదవుతున్న కేసులను వైద్య శాఖ అధికారికంగా గుర్తించలేదు. వీటిపై విచారణ జరుగుతోంది. బ్లాక్ ఫంగస్ అవునా..కాదా అనే ది నిర్ధారించిన తర్వాతే స్పందిస్తామంటోంది. తక్షణమే స్పందించాలి.. కరోనా సోకిన వారు చికిత్స అనంతరం శరీరంలో వచ్చే మార్పులను గమనించాలి. అధికంగా స్టెరాయిడ్స్ వాడడం వల్ల బ్లాక్ ఫంగస్ వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన లక్షణాల్లో ఏ ఒక్క లక్షణం ఉన్నా తక్షణమే వైద్యున్ని సంప్రదించాలి. నిర్లక్ష్యం చేయకూడదు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. – బి.రాజేశ్వర్, ఛాతి వైద్యనిపుణులు -
ఆరోగ్యశ్రీలోకి 'బ్లాక్ ఫంగస్'
సాక్షి, అమరావతి: కరోనా నుంచి కోలుకున్న తర్వాత బ్లాక్ ఫంగస్ (మ్యుకర్ మైకోసిస్) వ్యాధికి గురవుతున్న వారి చికిత్సలను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చి, అందుకయ్యే ఖర్చును మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరించనుందని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్కుమార్ సింఘాల్ వెల్లడించారు. దీనికోసం అన్ని ప్రభుత్వ బోధనాస్పత్రుల్లోనూ, ఆరోగ్యశ్రీ నెట్వర్క్ పరిధిలోనూ వైద్యం చేసే విధంగా ఆదేశించామని తెలిపారు. సోమవారం ఆయన మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో మీడియాతో మాట్లాడారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో బ్లాక్ఫంగస్ కేసులు నమోదైనా ప్రభుత్వానికి తెలియజేయాలన్నారు. దీనికి సంబంధించిన ఇంజక్షన్లు కొన్నింటిని కేంద్రం కేటాయించిందని, మిగతా వాటిని రాష్ట్ర ప్రభుత్వం షార్ట్ టెండర్స్ నిర్వహించి కొనుగోలు చేస్తుందని తెలిపారు. కోవిడ్తో అమ్మానాన్నలను కోల్పోయి అనాథలైన చిన్నారుల కోసం రూ. 10 లక్షల చొప్పున డిపాజిట్ చేయాలని సీఎం ఆదేశించారన్నారు. కర్ఫ్యూ తర్వాత రెండు జిల్లాల్లో కేసులు తగ్గాయని, మరికొన్ని జిల్లాల్లో నిలకడగా ఉన్నాయని, అందుకే ఈ నెల 31 వరకూ కర్ఫ్యూ పొడిగించాలని సీఎం నిర్ణయించారని వివరించారు. ఫీవర్ సర్వే ద్వారా ఇప్పటివరకూ 91 వేల మందికి జ్వర లక్షణాలున్నట్టు గుర్తించామని, వీరి ఆరోగ్యంపై రోజువారి పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న పేషెంట్లలో 67 శాతం మంది బాధితులకు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం అందుతోందన్నారు. కోవిడ్ విధుల్లోకి 17,901 మంది సిబ్బందిని తీసుకున్నామని, అవసరమైతే మరింత మందిని నియమిస్తామని సింఘాల్ వెల్లడించారు. ఆక్సిజన్ వృథా కాకుండా నేవీ బృందాలు చేస్తున్న సాయం అభినందనీయమన్నారు. సీమ జిల్లాల్లో 7 కేసులు రాష్ట్రవ్యాప్తంగా బ్లాక్ ఫంగస్ కేసులపై ప్రభుత్వం పరిశీలన చేస్తోంది. తాజాగా చిత్తూరు జిల్లాలో 3, కర్నూలు జిల్లాలో 2, అనంతపురం జిల్లాలో 2, శ్రీకాకుళం జిల్లాలో 1, నెల్లూరు జిల్లాలో 1 చొప్పున నమోదయ్యాయి. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారిపైనా పరిశీలన చేస్తున్నారు. ముఖ్యంగా మధుమేహ రోగుల్లో ఈ పరిశీలన జరుగుతోంది. కేసులకు సంబంధించి ఇప్పటికే నిపుణుల అభిప్రాయాలతో చికిత్సలు చేస్తున్నట్టు వైద్యులు వెల్లడించారు. మ్యుకర్ మైకోసిస్ కేసుల సంఖ్య చాలా తక్కువగా ఉందని, అయినా సరే దీనిపై అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్యశాఖ అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు ఆదేశాలు జారీచేసింది. -
బ్లాక్ మార్కెట్లో బ్లాక్ ఫంగస్ ఔషధం
సాక్షి, హైదరాబాద్: కరోనా బారిన పడ్డ కొంతమందిలో బయటపడుతున్న బ్లాక్ ఫంగస్ వ్యాధి ‘నల్ల దళారీ’లకు కొత్త వ్యాపారంగా మారింది. బ్లాక్ ఫంగస్ చికిత్సకు ఉపయోగించే యాంఫైట్ 50 ఎంజీ ఇంజెక్షన్లనూ అదేబాట పట్టిస్తున్నారు. ఇలా బ్లాక్ మార్కెట్లో మందులు విక్రయిస్తున్న ఓ నలుగురిని నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఐదు యాంఫైట్ ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. పీర్జాది గూడకు చెందిన నరిమెల్ల యాదయ్య మెడిసిన్స్ సప్లయర్గా, బండ్లగూడకు చెందిన పి.సతీశ్, కోఠికి చెందిన సాయికుమార్లు మెడికల్ షాపుల్లో, మణికొండకు చెందిన బి.రాజశేఖర్రెడ్డి మెడికల్ రిప్రజెంటేటివ్గా పని చేస్తున్నారు. ఇటీవల బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతుండటంతో దీనికి వాడే ఇంజెక్షన్లకు డిమాండ్ రావడంతో యాంఫైట్ ఇంజెక్షన్లను అక్రమంగా సేకరించారు. ఒక్కొక్కటి రూ.7,858 ఖరీదు చేసే వాటిని రూ.50 వేలకు అమ్మడానికి సిద్ధమయ్యారు. దీనిపై సమాచారం అందడంతో పోలీసులు వలపన్ని నలుగురినీ పట్టుకుని అరెస్టు చేశారు. -
Black Fungus: తెలంగాణలో పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ కేసులు
సాక్షి, హైదరాబాద్/సాక్షి నెట్వర్క్: కరోనా నుంచి కోలుకున్న చాలామందికి ఆ సంతోషం ఎక్కువ రోజులు మిగలట్లేదు. బ్లాక్ఫంగల్ ఇన్ఫెక్షన్ రూపంలో మళ్లీ అనారోగ్య సమస్యలు తలెత్తుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కరోనా నుంచి కోలుకున్న వారిలో ఎక్కువగా బ్లాక్ఫంగస్ లక్షణాలు కన్పిస్తున్నట్లు వైద్యులు గుర్తించారు. ఇప్పటివరకు ఢిల్లీ, అహ్మదాబాద్, మహారాష్ట్రలో మాత్రమే వెలుగుచూసిన ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ కేసులు రాష్ట్రం లోనూ పెద్దసంఖ్యలో నమోదవుతున్నాయి. సోమవారం నిజామాబాద్ జిల్లాకు చెందిన ముగ్గురు, నల్లగొండ జిల్లాకు చెందిన ఒకరు బ్లాక్ఫంగస్తో మృతిచెందారు. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో బ్లాక్ ఫంగస్ లక్షణాలతో 16 మంది చికిత్స పొందుతుండగా, కోఠి ఈఎన్టీ ఆస్పత్రిలో సోమవారం ఒక్కరోజే 25 కేసులు నమోదయ్యాయి. బాధితుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఆస్పత్రి వర్గాల ద్వారా తెలిసింది. అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా పదిమంది చనిపోయారు. బ్లాక్ఫంగస్ కేసుల చికిత్సకు వీలుగా ఈఎన్టీ ఆస్పత్రిని నోడల్ సెంటర్గా ప్రకటించారు. ఈ కేసులకు సంబంధించి కచ్చితమైన నిర్ధారణ కోసం కొందరి నమూనాలను బయాప్సీకి పంపారు. అలాగే, బ్లాక్ఫంగస్ బాధితుల కోసం గాంధీ ఆస్పత్రి 7వ అంతస్తులో ప్రత్యేక వార్డును ఏర్పాటుచేశారు. బాధితులకు శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు గాంధీ ఈఎన్టీ విభాగం ముందుకు రావడంతో ఇక్కడే ప్రత్యేక ఆపరేషన్ థియేటర్ను రెండ్రోజుల్లో అందుబాటులోకి తేవాలని ఆస్పత్రి పాలన యంత్రాంగం నిర్ణయించింది. ఎందుకు సోకుతుందంటే.. కరోనా చికిత్సలో భాగంగా స్టెరాయిడ్స్ ఎక్కువగా వినియోగిస్తుండటంతో కోలుకున్న అనంతరం బాధితులు బ్లాక్ఫంగస్ బారిన పడుతున్నారని వైద్య వర్గాలు చెబుతున్నాయి. మధుమేహం, కిడ్నీ, కాలేయం ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, రోగనిరోధకశక్తి తక్కువ ఉన్నవారికి కరోనా చికిత్స సమయంలో స్టెరాయిడ్స్ మోతాదుకు మించి ఇస్తుండటంతో.. కోవిడ్తో విముక్తి లభించిన తర్వాత బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ సోకుతోంది. సాధారణ వాతావరణంలో కూడా ఉండే బ్లాక్ఫంగల్.. రోగనిరోధక శక్తి లేనివారికి త్వరగా సోకుతోందని వైద్యులు చెబుతున్నారు. కరోనా నుంచి కోలుకున్నాక ముక్కు దిబ్బడ, ముక్కు నుంచి రక్తం కారడం, చీదినప్పుడు నల్లటి పదార్థం బయటికి రావడం, ముక్కు లోపల వాపు, నొప్పి, జ్వరం వంటి లక్షణాలు కన్పిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఒక్కరోజే నలుగురు మృతి.. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం ఎల్కే ఫారమ్ గ్రామానికి చెందిన బెజవాడ హరిబాబు (35) కరోనాతో జిల్లా ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు ముక్కు, చెవుల నుంచి రక్తం రాగా బ్లాక్ ఫంగస్ లక్షణాలుగా భావించి శనివారం సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించగా, చికిత్సపొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందారు. వేల్పూర్ మండలం సాహెబ్పేట్కు చెందిన ఉట్నూర్ చిన్న గంగారాం (65) రెండు వారాల క్రితం కరోనా బారిన పడ్డారు. కోలుకున్న కొద్దిరోజులకే మళ్లీ తిరగబెట్టడంతో నిజామాబాద్లోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. అక్కడి వైద్యులు బ్లాక్ ఫంగస్గా నిర్ధారించి మూడ్రోజుల క్రితం గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ సోమవారం మరణించారు. బోధన్ పట్టణం శక్కర్నగర్ కాలనీకి చెందిన మర్రి రాజేశ్వర్ (39) పదిరోజుల క్రితం కరోనా బారినపడి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందారు. నాల్రోజుల కిత్రం బాధితుడిలో బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపించడంతో గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా ఆదివారం రాత్రి మృతిచెందారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం ఆరెగూడెంకు చెందిన ల్యాధా గండయ్య (57) కరోనా బారినపడ్డారు. మూడ్రోజుల క్రితం గండయ్యకు ఒళ్లు నొప్పులు, జ్వరంతోపాటు కంటిచూపు మందగించింది. ఆదివారం సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తీసుకురాగా..వైద్యులు బ్లాక్ ఫంగస్గా నిర్ధారించి వైద్యం చేశారు. చికిత్సపొందుతూ సోమవారం మృతి చెందాడు. పెరుగుతున్న కేసులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాజాపురం గ్రామానికి చెందిన తూనుకుంట్ల సులోచనరాణి ఈనెల 10న కరోనా బారినపడ్డారు. సోమవారం ఆమెకు కన్ను, ముఖం వాచిపోవడంతో పెనుబల్లిలోని ఆస్పత్రికి రాగా, వైద్యులు బ్లాక్ఫంగస్గా నిర్ధారించి ఆమెను ఐసోలేషన్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన కె.సత్యనారాయణరెడ్డి (35)కి వారం క్రితం కోవిడ్ పాజిటివ్ వచ్చింది. అకస్మాత్తుగా కంటిచూపు మందగించి, కళ్లు వాచిపోవడంతో కుటుంబసభ్యులు సోమవారం ఉదయం హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. ఇంకా, రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాలకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు అల్లం లింగయ్య (44) కరోనా బారినపడి ఇటీవలే కోలుకున్నారు. ఆదివారం దవడ, ముక్కులోంచి చీము కారడంతో ఆయనను హైదరాబాద్ నిమ్స్కు తీసుకెళ్లారు. సోమవారం పరీక్షలు నిర్వహించిన వైద్యులు బ్లాక్ ఫంగస్గా నిర్ధారించారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్కు చెందిన ఓ వ్యక్తి (40) కరోనా నుంచి కోలుకున్న మూడ్రోజులకే అనారోగ్యం పాలయ్యారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు బ్లాక్ ఫంగస్గా నిర్ధారించి చికిత్స అందిస్తున్నారు. హైదరాబాద్లో ఉంటున్న రంగారెడ్డి జిల్లా కందుకూరుకు చెందిన ఓ వ్యక్తి బ్లాక్ ఫంగస్ బారినపడగా, ఆయనకు వైద్యులు సోమవారం ఒక కన్ను తొలగించారు. స్టెరాయిడ్స్ మోతాదు మించడం వల్లే.. రోగ నిరోధకశక్తి తక్కువున్నవారిపై ఫంగస్ ప్రభావం చూపుతోంది. ఇది ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. ముక్కు, కన్ను, మెదడు, పై దవడ, సైనస్లు దెబ్బతింటాయి. ఎంత వేగంగా విస్తరిస్తుందో.. అంతే వేగంగా కణాలను, ఎముకలను దెబ్బతీస్తుంది. కోవిడ్ చికిత్సల్లో మోతాదుకు మించి స్టెరాయిడ్స్ ఇచ్చిన మధుమేహ బాధితుల్లో ఎక్కువ ప్రభావం చూపుతుంది. – డాక్టర్ మేఘనాథ్, ఈఎన్టీ నిపుణుడు, ’మా’ ఆస్పత్రి కోలుకున్నాక కూడా మాస్క్ వాడాలి కరోనా బాధితులకు స్టెరాయిడ్స్ ఏ దశలో ఎంత మోతాదులో వాడాలనేది చాలామందికి అవగాహన లేదు. స్టెరాయిడ్స్ కరోనా లక్షణాల నుంచి ఉపశమనం కల్పిస్తున్నా.. రోగ నిరోధకశక్తిని తగ్గిస్తాయి. కోవిడ్ నుంచి కోలుకున్నాక కూడా మాస్క్ ధరిస్తే ఫంగస్ బారినపడకుండా ఉండొచ్చు. – డాక్టర్ రవిశంకర్, ఈఎన్టీ నిపుణుడు, కోఠి ఈఎన్టీ ఆస్పత్రి అందరికీ రాదు.. కరోనా బాధితుల్లో ప్రతి వందమందిలో ఒకరిద్దరికే బ్లాక్ఫంగస్ వస్తుంది. తొలిదశలో గాంధీలో చికిత్సపొందిన 10 మందిలో దీన్ని గుర్తించాం. ఒకరిద్దరు మినహా అంతా చికిత్సకు కోలుకున్నారు. పౌష్టికాహారం తీసుకుని రోగనిరోధకశక్తిని పెంచుకోవాలి. ఆకుకూరలు, చేపలు, గుడ్లు, మాంసాహారం, సీ విటమిన్ ఎక్కువ లభించే పండ్లు తీసుకోవాలి. – డాక్టర్ రాజారావు, సూపరింటెండెంట్, గాంధీ ఆస్పత్రి -
ఆరోగ్య శ్రీలో బ్లాక్ ఫంగస్ చికిత్స: ఆళ్ల నాని
సాక్షి, విజయవాడ: కోవిడ్ నుంచి కోలుకున్న వారిని బ్లాక్ ఫంగస్ రూపంలో మరో సమస్య వేధిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా దేశ వ్యాప్తంగా ఈ తరహా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే కోవిడ్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. బ్లాక్ ఫంగస్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని సీఎం జగన్ ఆదేశించినట్లు ఏపీ వైద్యారోగ్య శాఖమంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఈ సందర్భంగా ఆళ్ల నాని మాట్లాడుతూ.. ‘‘బ్లాక్ ఫంగస్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని సీఎం జగన్ ఆదేశించారు. కోవిడ్తో తల్లిదండ్రులు చనిపోతే వారి పిల్లలను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని.. ఆ పిల్లలకు ఆర్థికసహాయంపై కార్యాచరణ రూపొందించాలని అధికారులకు తెలిపారు. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో పకడ్బందీగా ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నాం’’ అన్నారు. చదవండి: కరోనా వ్యాధిగ్రస్తులకు ఆరోగ్య శ్రీ పథకం సంజీవనీ -
కోరలు చాస్తున్న బ్లాక్ ఫంగస్: 16 మంది మృతి
ఔరంగాబాద్: మహమ్మారి కరోనా వైరస్ బారిన పడిన వారిలో బ్లాక్ ఫంగస్ ఏర్పడి వారి ప్రాణాలను తీస్తోంది. దేశంలో ఇప్పటికే కరోనా కల్లోలం రేపుతుంటే ఇప్పుడు బ్లాక్ ఫంగస్ కలకలం సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా అనేక చోట్ల బ్లాక్ ఫంగస్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా బ్లాక్ ఫంగస్తో ఏకంగా 16 మంది మృత్యువాత పడ్డారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో 201 మందికి ఆ ఫంగస్ రాగా వారిలో 16 మంది మృతి చెందడం మహారాష్ట్రలో కలకలం రేపుతోంది. ఈ ఏడాదిలో కరోనా కేసులు పరిశీలించగా వారిలో 201 మందికి బ్లాక్ ఫంగస్ సోకిందని ఔరంగాబాద్ మున్సిపల్ అధికారులు గుర్తించారు. వారిలో ఇప్పటివరకు 16 మంది మృతి చెందారని అధికారులు ఓ నివేదికలో వివరించారు. ఔరంగాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వైద్యాధికారి డాక్టర్ నీతా పడాల్కర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘బ్లాక్ ఫంగస్ లక్షణాలు గుర్తించేందుకు కరోనా బాధితుల వివరాలు పరిశీలించాం. కరోనా బాధితుల్లో స్టెరాయిడ్స్ వాడిన వారు, మధుమేహులకు బ్లాక్ ఫంగస్ ఏర్పడుతుందని మేం ఏర్పాటుచేసిన ప్రత్యేక బృందం (ఈఎన్టీ, దంత, కంటి వైద్యులు) గుర్తించింది. బ్లాక్ ఫంగస్ లక్షణాలను గుర్తించి వారికి ప్రత్యేక వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఈ మేరకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. వారికి కావాల్సిన మందులు కూడా అందుబాటులో ఉంచాం’ అని తెలిపారు. -
కరోనా వచ్చి పోయినా జలుబు తగ్గట్లేదు.. బ్లాక్ ఫంగసా?
సాక్షి, ఖమ్మం: కరోనా సోకిన వారు అనవసర ఆందోళన చెందొద్దని, ధైర్యంగా ఉండి.. వైద్యులు సూచించిన మందులు వాడడం ద్వారా మహమ్మారిని జయించొచ్చని ఖమ్మంలోని సాయిరాం గ్యాస్ట్రో, లివర్ హాస్పిటల్ గ్యాస్ట్రెంటాలజిస్ట్ డాక్టర్ జంగాల సునీల్ కుమార్ అన్నారు. మంచి ఆహారం, ప్రశాంత జీవనం, కంటినిండా నిద్ర ద్వారా త్వరగా కోలుకోవచ్చని తెలిపారు. హోం ఐసోలేషన్లో ఉండి కూడా మనో నిబ్బరంతో కరోనా గండాన్ని అధిగమించిన వారు అనేకమంది ఉన్నారని తెలిపారు. గాలి, వెలుతురు ఉన్న గదిలో ఉంటూ, ఎక్కువ శాతం విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఇంట్లో వారితో దూరం పాటిస్తూ ఉండాలని, ప్రతిరోజూ 3 నుంచి∙4 లీటర్ల మంచినీళ్లు తాగుతూ, ప్రొటీన్, విటమిన్లతో కూడిన ఆహారం తీసుకోవాలన్నారు. సాక్షి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి అనేకమంది ఫోన్ చేసి సందేహాలను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ జంగాల సునీల్ కుమార్ వాటిని నివృత్తి చేశారు. డాక్టర్ జంగాల సునీల్ కుమార్, గ్యాస్ట్రెంటాలజిస్ట్, సాయిరాం గ్యాస్ట్రో లివర్ హాస్పిటల్, ఖమ్మం చదవండి: Corona: పిల్లల్లో కోవిడ్ లక్షణాలను ఎలా గుర్తుపట్టాలి? ఆ వివరాలు ఇలా.. ఖమ్మం నుంచి సాంబయ్య: నేను పది రోజుల్నుంచి హోం ఐసోలేషన్లో ఉన్నా. కరోనా ఎప్పుడు తగ్గిపోతుంది సార్? డాక్టర్: ఎలాంటి లక్షణాలు లేకుండా ఉంటే 15 రోజుల్లో తగ్గిపోతుంది. ఆ తర్వాత సాధారణ జీవనాన్ని కొనసాగించవచ్చు. కరోనా తగ్గినా చాలా మందికి నీరసంగా ఉంటుంది. బలవర్థకమైన ఆహారాన్ని తీసుకోవాలి. చెడు అలవాట్లకు దూరంగా ఉంటే మంచిది. కామేపల్లి నుంచి సంతోష్: ఈ రోజుల్లో ఎలాంటి ఆహారం తీసుకోవాలి? డాక్టర్: లక్షణాలు ఉన్న వారు ప్రతిరోజూ లిక్విడ్ ఫుడ్ తీసుకోవడం మంచిది. తరచూ పండ్ల జ్యూస్, పెరుగన్నం, కొబ్బరి నీళ్లు, జావ, ఉడక బెట్టిన గుడ్లు తీసుకోవాలి. లక్షణాలు తగ్గిన తర్వాత చేపలు, కాయగూరలు, పన్నీరు, డ్రైఫ్రూట్స్, వాటర్ మిలన్ సీడ్స్, గుమ్మడి కాయసీడ్స్, పొద్దుతిరుగుడు గింజలతో కూడినవి తీసుకోవాలి. అలాగే ప్రొటీన్ ఫుడ్ కూడా తీసుకోవాలి. ఖమ్మం నుంచి నాగేశ్వరరావు: నాకు కరోనా వచ్చి పోయింది. కానీ జలుబు తగ్గట్లేదు ఎందుకు? డాక్టర్: ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బ్లాక్ ఫంగస్కి సాధారణంగా కళ్లు, ముఖం వాపు, జ్వరం, తదితర లక్షణాలు ఉంటాయి. ఇది అలాంటిది కాదులెండి. సిట్రజిన్ టాబ్లెట్ వేసుకోండి. రెండు, ముడు రోజుల్లో తగ్గుద్ది. ఖమ్మం నుంచి షర్ఫుద్దీన్: నాకు 20 రోజులుగా ఆయాసం వస్తోంది. కరోనా అనుకోవచ్చా డాక్టర్? డాక్టర్: పల్స్ ఆక్సిమీటర్తో చెక్ చేసుకుంటే 95 శాతానికి పైగా ఉంటే ఇబ్బంది లేదు. అంతకన్నా తక్కువైతే డాక్టర్ను సంప్రదించండి. కరోనా లక్షణాలు ఉన్న వారు 7 రోజులకు సీటీ స్కాన్ చేయించుకుంటే కచ్చితమైన రిపోర్ట్ వస్తుంది. చింతకాని నుంచి అనంత్: నాకు కరోనా వచ్చి రెండు వారాలైంది. ఆక్సిజన్ లెవెల్స్ 85 శాతానికి పడిపోయాయి. ఏం చేయాలి? డాక్టర్: ఆక్సిజన్ లెవెల్స్ 95 శాతానికి పడిపోతే ఇబ్బంది ఉంటుంది. ఆక్సిజన్ రేటు సాధారణ స్థితికి వచ్చే వరకు ఆక్సిజన్ పెట్టుకోవాలి. భయపడకుండా ఉండండి. తగ్గిపోతుంది. ముదిగొండ నుంచి సీతారామరాజు: బీపీ, షుగర్ ఉన్న వారు టీకా తీసుకోవచ్చా? డాక్టర్: బీపీ, షుగర్కు టీకా తీసుకోవడానకి ఎలాంటి సంబంధం లేదు. నిర్భంయంగా తీసుకోవచ్చు. తర్వాత కొందరికి జ్వరం, ఒళ్లు నొప్పులు వస్తుంటాయి. అంతమాత్రాన ఆందోళన చెందకూడదు. ఒకటి, రెండు రోజులు మాత్రమే ఉంటాయి. బల్లేపల్లి నుంచి రఘురాం: కోవిషీల్డ్ రెండో డోసు ఎప్పుడు వేయించుకుంటే మంచిది? డాక్టర్: సాధారణంగా కోవిషీల్డ్ వ్యాక్సిన్ 6 నుంచి 8 వారాల మధ్య వేసుకోవాలి. ఇటీవల ఐసీఎంఆర్ 12 నుంచి 16 వారాల మధ్య వేసుకోవచ్చని సూచించింది. కరోనా నుంచి బయట పడాలంటే వ్యాక్సిన్ వేయించుకోవడం ఒక్కటే మార్గం. -
కడుపులో బిడ్డ.. కళ్ల ముందు జీవశ్చవంలా భర్త..
ఒంగోలు టౌన్: బ్లాక్ ఫంగస్ బారిన పడినవారి బతుకు చీకటి మయమవుతోంది. కరోనా నుంచి కోలుకున్నా సంబంధిత వ్యక్తి శరీరంలోని షుగర్ లెవల్స్పై బ్లాక్ ఫంగస్ దాడి చేస్తోంది. ఒంగోలులోని సీతారాంపురంలో నివాసముంటున్న పందిపంట్ల శ్రీను అనే యువకుడు కరోనా నుంచి కోలుకున్న తర్వాత బ్లాక్ ఫంగస్ బారినపడి ఒక కనుగుడ్డును పూర్తిగా తొలగించేశారు. అయితే ఆ ఫంగస్ ఇంకా శరీరంలోనే ఉండటంతో రెండో కంటిపై కూడా ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ కరోనా కారణంగా ఉద్యోగం కోల్పోయిన ఆ వ్యక్తి.. చివరకు ఒక కన్నును కూడా కోల్పోయాడు. ప్రస్తుతం చెన్నైలోని సిమ్స్ హాస్పిటల్ ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. వైద్యానికి దాదాపు రూ.18 లక్షల వరకు ఖర్చువుతుందని చెప్పడంతో శ్రీను భార్య మాలతి ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తోంది. ప్రస్తుతం ఆరో నెల గర్భిణి అయిన మాలతి కందుకూరులోని తన తండ్రి వద్ద ఉంటోంది. తల్లి చనిపోవడంతో తండ్రి వద్దనే ఉంటోంది. తిరగని ఆస్పత్రి లేదు... శ్రీను కరోనా బారిన పడటంతో గత నెల 21వ తేదీ కందుకూరులోని ప్రభుత్వాసుపత్రిలో చేరాడు. వారం రోజుల తర్వాత 28వ తేదీ డిశ్చార్జి చేశారు. ఆ తర్వాత నుంచి కుడి కన్ను వాసి ఎర్రగా ఉండటంతో కందుకూరులోని ఈఎన్టీ ఆస్పత్రికి వెళితే కంటిలో రక్తం గడ్డ కట్టిందని హైదరాబాద్ వెళ్లాలని వైద్యుడు సూచించారు. దీంతో హైదరాబాద్లోని ఎల్వీ ప్రసాద్, నిమ్స్ హాస్పిటల్, సరోజినిదేవి హాస్పిటల్, కోఠిలోని ఈఎన్టీ హాస్పిటల్స్ చుట్టూ తిరిగారు. అయితే కరోనా కేసులు ఉండటంతో అక్కడ చేర్చుకోలేదు. చివరకు యశోద హాస్పిటల్లో జాయినై ఎంఆర్ఐ, బ్రెయిన్, సిటీ స్కాన్ చేసిన తర్వాత మెదడుకు ఇన్ఫెక్షన్ పాకిందని, అర్జంట్గా చెన్నై తీసుకువెళ్లాలని వైద్యులు సూచించారు. ఈనెల 12వ తేదీ చెన్నైలోని సిమ్స్ హాస్పిటల్లో చేర్పించారు. బ్లాక్ ఫంగస్ సోకిందని గుర్తించిన వైద్యులు వెంటనే యాంటీ ఫంగస్ ఇంజక్షన్లు చేశారు. ఆ ఫంగస్ బ్రెయిన్కు కూడా పాకడంతో 18వ తేదీ ఆపరేషన్ చేసి కుడి కన్నుగుడ్డును పూర్తిగా తొలగించేశారు. అయితే ఆ ఇన్ఫెక్షన్ ఎడమ కంటిపై కూడా ప్రభావం చూపే అవకాశాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దానికితోడు బ్రెయిన్కు కూడా ఫంగస్ వ్యాపించడంతో అబ్జర్వేషన్లో ఉంచారు. ఆపన్న హస్తం కోసం ఎదురుచూపు.. చెన్నైలోని సిమ్స్ హాస్పిటల్లో బ్లాక్ ఫంగస్తో ప్రాణాపాయ స్థితిలో ఉన్న తన భర్తను కాపాడాలంటూ మాలతి వేడుకుంటోంది. వైద్యానికి మొత్తం రూ.18లక్షల ఖర్చవుతుందని, ఎవరైనా దాతలు సాయంచేసి తన భర్త ప్రాణాలను కాపాడాలని కోరుతోంది. ఆరునెలల గర్భిణి యిన మాలతి పుట్టబోయే బిడ్డ గురించి కలలు కనడం కంటే, కంటి ముందే ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతున్న భర్త ప్రాణాలను ఎలా కాపాడుకోవాలో తెలియక నరకయాతన అనుభవిస్తోంది. సాయం చేయాలనుకునేవారు 7794896521 నంబర్ను సంప్రదించవచ్చు చదవండి: గొంతు కోసిన భర్త.. కనికరించిన భార్య మాయమాటలతో బాలికను మభ్యపెట్టి.. -
కర్ణాటకను వణికిస్తున్న బ్లాక్ ఫంగస్
సాక్షి, బెంగళూరు: ఓ వైపు కరోనా కరాళ నృత్యం చేస్తుండగా చాప కింద నీరులా బ్లాక్ఫంగస్ వ్యాపిస్తోంది. కర్ణాటకలో ఇప్పటి వరకు సుమారు 100 బ్లాక్ ఫంగస్ పాజిటివ్ కేసులు తేలినట్లు సమాచారం. అంతేకాకుండా అందులో 9 మరణాలు ఉన్నట్లు తెలిసింది. రోజురోజుకీ బ్లాక్ ఫంగస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. బ్లాక్ ఫంగస్ మరణాల్లో బెంగళూరులో రెండు, బాగల్కోటె, బెళగావిలో ఒక్కొక్కటి, మంగళూరులో నాలుగు మరణాలు నమోదయినట్లు సమాచారం. కరోనా నుంచి కోలుకున్న వారికి బ్లాక్ ఫంగస్ సోకినట్లు తెలుస్తోంది. -
నిడదవోలులో బ్లాక్ ఫంగస్ లక్షణాలు
సాక్షి, పశ్చిమ గోదావరి: నిడదవోలులో ఓ వ్యక్తికి బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపించాయి. సమాచారం ప్రకారం..15 రోజుల క్రితం బాధితుడు కరోనా నుంచి కోలుకున్నాడు. కాగా ఏలూరు ఆస్పత్రిలో డిశ్చార్జి అయిన సమయానికే బాధితుడు కన్నువాపుగా ఉండేది. అయితే గత వారం రోజులుగా కన్నువాపు పెరుగుతుండడంతో రాజమండ్రి, విశాఖ ఆస్పత్రుల్లో పరీక్షలు చేసుకోగా ఫంగస్ లక్షణాలుగా నిర్థారణ అయ్యింది. ఈ వాపు కన్నుతో పాటు, ముక్కు, మెదడుకు వ్యాపిస్తుందని వైద్యులు చెప్తున్నారు. ( చదవండి: ఏలూరు ఆంధ్రా హాస్పిటల్పై క్రిమినల్ కేసు ) -
ఆదిలాబాద్ లో రోజు రోజుకు పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ కేసులు
-
బ్లాక్ ఫంగస్ విస్తరిస్తోంది
-
Black Fungus: బ్లాక్ ఫంగస్తో అప్రమత్తం!
సాక్షి, హైదరాబాద్: బ్లాక్ ఫంగస్.. కోవిడ్ బారినపడి చికిత్స పొందుతున్న కొందరిలో తలెత్తుతున్న సమస్య ఇది. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయానికీ దారితీసే ఈ బ్లాక్ ఫంగస్ (మ్యూకోర్మైకోసిస్) కేసులు ఇప్పటికే దేశవ్యాప్తంగా పలుచోట్ల నమోదయ్యాయి. తాజా తెలంగాణలోనూ ఇలాంటి కేసులు వస్తున్నట్టు గుర్తించిన వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. శరీరంలో ఫంగస్ ఇన్ఫెక్షన్లు సోకినప్పుడు తక్షణమే జాగ్రత్తలు చేపట్టాలని, లేకుంటే పరిస్థితి అదుపుతప్పే ప్రమాదం ఉందని హెచ్చరించింది. కోవిడ్ పేషెంట్లు బ్లాక్ ఫంగస్ బారిన పడకుండా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. బ్లాక్ ఫంగస్ చికిత్సల కోసం ప్రత్యేకంగా నోడల్ ఆస్పత్రులను ఏర్పాటు చేయాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల నేపథ్యంలో.. హైదరాబాద్ కోఠిలోని ఈఎన్టీ (చెవి, ముక్కు, నోరు) హాస్పిటల్ను నోడల్ ఆస్పత్రిగా ఖరారు చేసింది. దానితోపాటు గాంధీ ఆస్పత్రిలోనూ బ్లాక్ ఫంగస్కు చికిత్స అందించనున్నట్టు ప్రకటించింది. బ్లాక్ ఫంగస్ చికిత్సలో ఆప్తమాలజిస్ట్ (కంటి వైద్య నిపుణుల) సేవలు అవసరమైతే.. మెహిదీపట్నం సరోజినీ దేవి కంటి ఆస్పత్రి వైద్యుల సహకారం తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఈఎన్టీ, గాంధీ, సరోజినీదేవి ఆస్పత్రుల సూపరింటెండెంట్లకు వైద్యవిద్య డైరెక్టర్ రమేశ్రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. బ్లాక్ ఫంగస్ ఎలా వస్తుంది? శరీరంలో ఫంగస్ ఇన్ఫెక్షన్లు రావడానికి కారణం రోగనిరోధక శక్తి తగ్గిపోవడమే. దీర్ఘకాలిక జబ్బులున్నవారు, ఇప్పటికే శస్త్రచికిత్సలు జరిగినవారు.. ప్రస్తుతం కోవిడ్ చికిత్సలో మోతాదుకు మించి స్టెరాయిడ్లు వాడితే వారిలో రోగ నిరోధక శక్తి ఒక్కసారిగా తగ్గిపోతుంది. అదేవిధంగా శరీరంలో చక్కెర స్థాయిలు గాడి తప్పుతాయి. ఇలాంటి సమయంలో ఫంగస్ శరీరంలోకి ప్రవేశిస్తే.. విపరీతంగా వృద్ధి చెంది, ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. ఈ ఫంగస్ ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఆక్సిజన్ తీసుకుంటున్న పేషెంట్లకు సైతం బ్లాక్ ఫంగస్ సోకే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెప్తున్నారు. శరీరంలోకి వెళ్లే ఆక్సిజన్లో తేమ నిర్దేశిత స్థాయిలలో లేకుంటే కూడా ఫంగస్ శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. ఈ ఫంగస్ చికిత్సలో వినియోగించే లైపోజోమల్ ఆంఫోటెరిసిన్ బి మందుకు దేశవ్యాప్తంగా కొరత ఉన్నందున.. ప్రత్యామ్నాయ మందులైన పోసాకొనజోల్, ఫ్లూకనజోల్ మందులను వినియోగించాలని వైద్యారోగ్య శాఖ అధికారులు సూచించారు. టీఎస్ఎంఎస్ఐడీసీ ఇప్పటికే లైపోజోమల్ ఆంఫోటెరిసిన్–బి కొనుగోలుకు చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. పాటించాల్సిన జాగ్రత్తలివే.. కోవిడ్ చికిత్స పొందుతున్న రోగులు మ్యూకోర్ మైకోసిస్ బారిన పడకుండా ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ పలు సూచనలు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కోవిడ్ రోగులకు స్టెరాయిడ్లు వినియోగించినప్పుడు.. ముందు, తర్వాత రోగి చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చూడాలి. స్టెరాయిడ్లను సరైన మోతాదులో, సరైన విధంగా ఇవ్వాలి. రోగికి ఆక్సిజన్ అందిస్తున్నప్పుడు డిస్టిల్డ్ లేదా స్టెరైల్ నీటిని వినియోగించాలి. ఫంగల్ ఇన్ఫెక్షన్లకు తావులేకుండా ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలి. వేడిచేయని నల్లా నీళ్లు, మినరల్ వాటర్ను అస్సలు వినియోగించవద్దు. -
నకిలీ రెమ్డెసివర్ బాధితులే.. కానీ కోవిడ్ను జయించారు
భోపాల్: కోవిడ్ సెకండ్ వేవ్ విరుచుకుపడుతున్న వేళ దేశంలో రెమ్డెసివర్కు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో. అవసరం ఉన్నా లేకపోయిన ప్రతి ఒక్కరికి రెమ్డెసివర్ సిఫారసు చేస్తున్నారు. దాంతో దేశవ్యాప్తంగా ఈ ఇంక్షన్కు తీవ్ర కొరత ఏర్పడింది. ఈ క్రమంలో కొన్ని ముఠాలు ప్రజల అవసరాన్ని క్యాష్ చేసుకుంటున్నాయి. ఎక్కువ ధరకు విక్రయిస్తూ.. ప్రజలను దోచుకుంటున్నారు. దారుణమైన విషయం ఏంటంటే కొన్ని చోట్ల ఎక్కువ డబ్బులు వసూలు చేసి కూడా నకిలీ ఇంజక్షన్లను అంటగడుతున్నారు. రెమ్డెసివర్ ఇంజక్షన్కు డిమాండ్ భారీగా పెరగడంతో పలువురు నిపుణులు కోవిడ్ సోకిన ప్రతి ఒక్కరికి ఈ ఇంజక్షన్ అవసరం లేదని.. అనవసరంగా హైరానా పడి డబ్బులు వృథా చేసుకోవద్దని సూచిస్తున్నారు. తాజాగా దేశంలో బయటపడుతున్న బ్లాక్ ఫంగస్ కేసుల్లో రెమ్డెసివర్ అతి వినియోగం కూడా ఓ కారణమని నిపుణులు వెల్లడించారు. ఈ క్రమంలో మధ్యప్రదేశ్లో వెలుగు చూసిన ఓ సంఘటన వీరి సూచనలను బలపరుస్తుంది. రాష్ట్రంలో నకిలీ రెమ్డెసివర్ ఇంజక్షన్ తీసుకున్న వారిలో 90 మందికిపైగా కోవిడ్ నుంచి కోలుకున్నారు. మొత్తం 100 మందికిపైగా నకిలీ రెమ్డెసివర్ ఇంజక్షన్ ఇవ్వగా వీరిలో 10 మంది మరణించారు.. 90మందికి పైగా కోవిడ్ నుంచి కోలుకున్నారని దర్యాప్తులో తెలిసింది. ఆ వివరాలు.. తాజాగా ఇండోర్లోని ఓ ఆస్పత్రిలో నకిలీ రెమ్డెసివర్ ఇంజక్షన్ తీసుకున్న పది మంది కోవిడ్ బాధితుల మృతి చెందారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేయడమే కాక తక్షణ దర్యాప్తుకు ఆదేశించారు. ఈ క్రమంలో పోలీసులు నకిలీ రెమ్డెసివర్ ఇంజక్షన్లు సరఫరా చేసిన గుజరాత్ గ్యాంగ్ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ముఠా గ్లూకోజ్-ఉప్పు కలిపిన నీటిని రెమ్డెసివర్ ఇంజక్షన్లుగా జనాలు అమ్మారు. అయితే ఈ నకిలీ ఇంజక్షన్ తీసుకున్న వారిలో 10 మంది చనిపోగా.. 90 మందికి పైగా కోలుకున్నట్లు తెలిసింది. చనిపోయిన వారిని దహనం చేయడంతో ఈ నకిలీ ఇంజక్షన్ వల్ల కలిగిన దుష్ప్రభావాల గురించి అధ్యయనం చేసే అవకాశం లేదన్నారు పోలీసులు. ఇంకా ఎంతమందికి ఈ నకిలీ ఇంజక్షన్ వినియోగించారనే దాని గురించి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు. కేంద్రం కూడా తీవ్రమైన కేసుల్లో రెమ్డెసివర్ వాడితే ఆస్పత్రులో చేరే అవకాశాన్ని తగ్గిస్తుందని తెలిపింది. అయితే ఇది మరణాలను తగ్గిస్తుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. చదవండి: కరోనాకు ఇస్తున్న మందులు, చికిత్సతో సమస్య జటిలం -
Black Fungus: కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి సూచనలు
న్యూఢిల్లీ: కోవిడ్ను జయించిన వారిలో ఆ ఆనందం ఎక్కువ కాలం ఉండంటం లేదు. బ్లాక్ ఫంగస్ రూపంలో మరో సమస్య వారిని కలవర పెడుతోంది. కోవిడ్ వ్యాధి చికిత్సలో స్టెరాయిడ్లు అధికంగా వాడటం వల్ల తలెత్తే మ్యూకర్ మైకోసిస్ వ్యాధినే బ్లాక్ ఫంగస్ అని పిలుస్తున్నారు. దేశంలో ఈ కేసులు రోజురోజుకు పెరిగిపోతుండడంతో దాని నివారణ, నియంత్రణపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్ శుక్రవారం పలు సూచనలు చేశారు. ఈ ఫంగస్ కారణంగా బాధితులు ప్రాణాలు కోల్పోతుండడంతో.. తొలినాళ్లలోనే గుర్తించి చికిత్స చేయడం, ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా బ్లాక్ ఫంగస్ను నిరోధించవచ్చని ఆయన తెలిపారు. బ్లాక్ ఫంగస్ లక్షణాలు, దాని బారినపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సోకితే తీసుకునే చర్యల వంటి వాటిపై ఆరోగ్య శాఖ మంత్రి హర్ఫ వర్ధన్ ట్విట్టర్లో పలు వివరాలను వెల్లడించారు. బ్లాక్ ఫంగస్ ఎక్కువగా అనారోగ్యంతో బాధపడే వారికే సోకుతోంది. ఇతర రోగకారక క్రిములతో పోరాడే శక్తిని తగ్గించేస్తోంది. ఇతర వాధ్యులు, వొరికొనజోల్ ఔషధాలు వాడేవారు, మధుమేహం ఎక్కువగా ఉన్నవారు, స్టెరాయిడ్లు వాడకంతో ఇమ్యూనిటీ తగ్గిపోయినవారు, ఐసీయూలో ఎక్కువ కాలం ఉన్న వారు దీని బారిన పడుతున్నారు. #Mucormycosis, commonly known as '#BlackFungus' has been observed in a number of #COVID19 patients recently. Awareness & early diagnosis can help curb the spread of the fungal infection. Here's how to detect & manage it #IndiaFightsCorona @MoHFW_INDIA pic.twitter.com/lC6iSNOxGF — Dr Harsh Vardhan (@drharshvardhan) May 14, 2021 లక్షణాలు.. కళ్లు, ముక్కు చుట్టూ నొప్పి, ఎర్రబారడం, జ్వరం, తలనొప్పి, దగ్గు, రక్తవాంతులు, శ్వాసలో ఇబ్బందులు, మానసికంగా స్థిమితంగా ఉండలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయని మంత్రి వెల్లడించారు. అయితే కరోనా రోగులందరికీ ఇది రాదని, చికిత్సలో భాగంగా స్టెరాయిడ్లు తీసుకున్న వారందరూ బ్లాక్ఫంగస్ బారిన పడతారనేది వాస్తవం కాదని వైద్యులు వెల్లడించారు. నివారణకు చేపట్టాల్సిన చర్యలు.. మధుమేహాన్ని ఎప్పటికప్పుడు నియంత్రణలో ఉంచుకోవాలి. కోవిడ్ సోకి చికిత్స కోసం ఆస్పత్రిలో చేరిన మధుమేహులు.. కోలుకున్న తర్వాత రక్తంలోని చక్కెర స్థాయులను ఎప్పటికప్పుడు పరీక్షించువాలి. స్టెరాయిడ్లను వైద్యుల సూచనతో పద్ధతి ప్రకారం వాడాలి. ఆక్సిజన్ చికిత్సలో వాడే హ్యుమిడీఫయర్స్ కోసం పరిశుభ్రమైన నీటిని వినియోగించాలి. చికిత్సలో నిర్ధారిత మోతాదు ప్రకారమే యాంటీ బయాటిక్స్, యాంటీ ఫంగల్ ఔషధాలను వాడాలి. చేయకూడనవి లక్షణాలు కనిపించినా నిర్లక్ష్యంగా ఉండడం. కరోనా సోకి చికిత్స తీసుకునేటప్పుడు ముక్కులు మూసుకుపోతే బ్యాక్టీరియల్ ఇన్ ఫెక్షన్ అనుకోవడం. బ్లాక్ ఫంగస్ చికిత్సలో నిర్లక్ష్యంగా ఉండడం. రెమిడిసివిర్ అనవసరంగా వాడితేనే ఈ ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. చదవండి: ‘బ్లాక్ ఫంగస్’: పట్టించుకోకపోతే ప్రాణాలే పోతాయి.. -
మరో ముప్పు.. 33 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు
సాక్షి, బెంగళూరు: రాష్ట్రం ఇప్పటికే కరోనా మహమ్మారితో సతమతం అవుతున్న దశలో మరో ఇబ్బంది వచ్చింది. బెంగళూరులో 33 మందికి బ్లాక్ ఫంగస్ సోకింది. వీరికి వివిధ ఆస్పత్రులలో చికిత్సలు అందిస్తున్నట్లు బీబీఎంపీ ఆరోగ్య అధికారి విజయేంద్ర తెలిపారు. కోవిడ్ రోగులకు, కోలుకున్నవారిలో కొందరికి ఈ జబ్బు సోకుతున్నట్లు వార్తలు వచ్చాయి. మధుమేహం ఉన్న కోవిడ్ రోగులకు సోకే ప్రమాదముందని నిపుణులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆరోగ్య అధికారి మాట్లాడుతూ ఫంగస్ సోకిన వారికి వైద్యం అందిస్తూ కౌన్సెలింగ్ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కరోనాతో పాటు ఫంగస్తో బాధపడే రోగులకు ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో చికిత్సలందిస్తామని చెప్పారు. త్వరలో చికిత్సా విధానం: మంత్రి రాష్ట్రంలో త్వరలో 780 మంది స్పెషలిస్ట్ వైద్యులతో పాటు మొత్తం 2480 మంది డాక్టర్లను నియమిస్తామని ఆరోగ్యమంత్రి సుధాకర్ తెలిపారు. బ్లాక్ ఫంగస్ వ్యాప్తిపై కోవిడ్ సాంకేతిక సమితితో చర్చించా, వారు గురువారం నివేదిక ఇస్తారన్నారు. బ్లాక్ ఫంగస్కు చికిత్సా విధానం ఏమిటనేది చూడాలి. ఇందుకు మహారాష్ట్రలో ఉచితంగా వైద్యమందిస్తున్నట్లు తెలిసిందన్నారు. కరోనా ఇండియన్ వేరియంట్ బ్రిటిష్ వేరియంట్ కంటే కొంచెం విభిన్నంగా ప్రవర్తిస్తోందని గుర్తించామన్నారు. -
బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్.. తాజాగా హైదరాబాద్లోనూ..
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి నుంచి కోలుకున్న చాలా మందికి ఆ సంతోషం ఎక్కువ రోజులు ఉండట్లేదు. బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ రూపంలో మళ్లీ అనారోగ్య సమస్యలు తలెత్తుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు ఢిల్లీ, అహ్మదాబాద్, మహారాష్ట్రలో మాత్రమే బయటపడిన ఈ ఫంగస్ ఇన్ఫెక్షన్ తాజాగా హైదరాబాద్లోనూ వెలుగు చూసింది. హైదరాబాద్లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో ఐదుగురు కరోనా బాధితుల్లో ఈ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు గుర్తించారు. బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ సోకిన వారిలోనూ కరోనా లక్షణాలే కనిపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. కరోనా చికిత్సలో భాగంగా అడ్డగోలుగా స్టెరాయిడ్స్ వాడుతున్న వారిలో రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వారిలో ఈ బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా కనిపిస్తోందని ఆస్పత్రి ఈఎన్టీ వైద్యుడు డాక్టర్ దుశ్యంత్ తెలిపారు. వాతావరణంలో ఉంటుంది. ఈ ఫంగస్ ముక్కు నుంచి రక్తనాళాలకు వెళ్లి కండరాలు, ఎముకలను దెబ్బ తీస్తుంది. ఇది ప్రాణాలకే ప్రమాదం. వాతావరణంలో సహజంగా ఉండే మ్యుకోర్ అనే ఫంగస్ వల్ల ఇది వ్యాపిస్తుంది. అవయవ మార్పిడి చికిత్సలు చేయించుకున్న వారికి, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి, కోవిడ్ చికిత్సలో హై డోస్ స్టెరాయిడ్స్ వాడటం, ఇంటి పరిసరాలు, ఆస్పత్రి పరిసరాల్లో పరిశుభ్రత లోపించడం వల్ల ఇది వ్యాపిస్తుంది. మధుమేహంతో బాధపడుతున్న వారికి గ్లూకోజ్ స్థాయిని మానిటరింగ్ చేస్తూ స్టెరాయిడ్స్ ఇవ్వాలి. కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత ముక్కు, నోటిలో పొక్కులు వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి’అని డాక్టర్ దుశ్యంత్ వివరించారు. చదవండి: కరోనా నుంచి కోలుకున్నా.. కొత్త ముప్పు! ‘కింగ్ కోఠి ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక ఎవరూ చనిపోలేదు’ -
కరోనా నుంచి కోలుకున్నా.. కొత్త ముప్పు!
సాక్షి, హైదరాబాద్: గోరుచుట్టుపై రోకటి పోటు అంటే ఇదేనేమో! ఒకవైపు రోజూ లక్షల మంది కోవిడ్ బారిన పడి అల్లాడుతుంటే.. మరోవైపు వైరస్ దాడి నుంచి ఎలాగో కోలుకున్న వారిలో కొందరు, ఓ కొత్త జబ్బుకు గురికావడం, మరణాలు సైతం సంభవిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. మ్యుకోర్మైకోసిస్ లేదా బ్లాక్ ఫంగస్ అనే ఈ వ్యాధి వైద్య నిపుణులను సైతం కలవరానికి గురి చేస్తోంది. ప్రస్తుతానికి ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్లలో కోవిడ్ నుంచి బయటపడిన రోగులు కొందరిలో ఈ బ్లాక్ ఫంగస్ కనిపిస్తున్నట్లు సమాచారం. దీని లక్షణాలు కొంచెం భయం గొలిపేవిగానే ఉన్నప్పటికీ అతి తక్కువ మందిలోనే ఈ వ్యాధి కన్పించడం కాస్త ఊరటనిచ్చే అంశం. వీలైనంత త్వరగా గుర్తించడం ద్వారా మందులతోనే ఈ సమస్యను అధిగమించవచ్చని వైద్యులు చెబుతున్నారు. గత ఏడాదే వెలుగులోకి.. వాతావరణంలోనూ ఉండే మ్యుకోర్మైకోసిస్ అనే శిలీంద్రానికి గాలిద్వారా వ్యాపించే కోవిడ్–19తో సంబంధం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. గత ఏడాది కోవిడ్–19 తొలి దశలోనే దీన్ని కొన్నిచోట్ల గుర్తించారు. గతంలో దీన్ని జైగోమైకోసిస్ అని పిలిచేవారు. ఎవరికి సోకుతుంది? కోవిడ్–19 నుంచి కోలుకున్న వారికి సోకే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మధుమేహం, మూత్రపిండాల సమస్యలు, కేన్సర్లతో కోవిడ్–19కి గురైతే సమస్య మరింత జటిలమవుతుంది. అవయవ మార్పిడి జరిగిన వారు, స్టెరాయిడ్లు వాడుతున్న వారికీ ఈ శిలీంద్రంతో ముప్పు ఉంటుంది. అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం ఇది మధుమేహుల్లో ఎక్కువ కనిపిస్తుంటుంది. కోవిడ్ కంటే ముందు ఈ ఫంగస్ చాలా అరుదుగా మాత్రమే కనిపించేది. అయితే కోవిడ్ కారక కరోనా.. రోగ నిరోధక వ్యవస్థను బలహీన పరుస్తున్న విషయం తెలిసిందే. అలాగే మధుమేహులకు వైరస్ సోకే అవకాశం ఉండటం.. వారికి స్టెరాయిడ్లతో చికిత్స కల్పిస్తుండటం బ్లాక్ ఫంగస్ వ్యాప్తికి కారణమవుతోందని అంచనా. ఫంగస్ వల్ల జరిగిన జరుగుతున్న నష్టం తెలుసుకునేందుకు ఎమ్మారై స్కాన్ చేయాల్సి ఉంటుంది. ప్రాణాంతకమూ కావచ్చు: మ్యుకోర్మైకోసిస్ను సకాలంలో గుర్తించకపోయినా, చికిత్స చేయకపో యినా..అంధత్వం సంభవించవచ్చు లేదా ముక్కు, దవడ ఎముకలను తొలగించాల్సి రావచ్చు. కొన్ని సందర్భాల్లో మరణం సంభవించే అవకాశమూ ఉంటుంది. సకాలంలో గుర్తించకపోతే ఫంగస్ సోకిన వారిలో సగం మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. గుజరాత్లోని సూరత్ నగరంలో బ్లాక్ఫంగస్ బారిన పడ్డ సుమారు యాభై మందికి చికిత్స చేస్తుండగా.. ఇంకో అరవై మంది చికిత్స కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం. వ్యాధి బారిన పడ్డ వారిలో ఏడుగురు చూపు కోల్పోయినట్లు తెలుస్తోంది. కోవిడ్ చికిత్సలో జాగ్రత్త వహించాలి కోవిడ్ రోగులకు ఆక్సిజన్తో చికిత్స కల్పిస్తున్న సందర్భంలో హ్యుమిడిఫయర్ నుంచి నీరు లీక్ కాకుండా జాగ్రత్త పడాలని, అలాగే టోసిలిజుమాబ్ వంటి స్టెరాయిడ్లను చాలా విచక్షణతో మాత్రమే ఉపయోగించాలని, తద్వారా బ్లాక్ ఫంగస్ వ్యాప్తిని కొంతవరకైనా అడ్డుకునే వీలేర్పడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. బ్లాక్ ఫంగస్ అంటే.. మ్యుకోర్మైకోసిస్ అనేది ఓ అరుదైన శిలీంద్రం. తేమతో కూడిన ఉపరితలాలపై ఎక్కువగా కనిపిస్తుంటుంది. నల్లగా బూజు పట్టినట్లు ఉండటం వల్ల దీన్ని బ్లాక్ ఫంగస్గా వ్యవహరిస్తున్నారు. ఇవీ లక్షణాలు: దీని బారిన పడిన వారిలో కనిపించే సాధారణ లక్షణాల్లో ముఖం ఒకవైపు వాపు ఉండటం ఒకటి. తలనొప్పి, ముక్కుదిబ్బడ, ముక్కు పైభాగంలో, లేదా నోటి లోపలి భాగంలో నల్లటి కురుపులు, జ్వరం, పాక్షిక దృష్టి లోపం, కళ్ల కింద నొప్పి వంటివి కొన్ని ఇతర లక్షణాలు. -
‘బ్లాక్ ఫంగస్’: పట్టించుకోకపోతే ప్రాణాలే పోతాయి..
సాక్షి, న్యూఢిల్లీ: సూరత్లో కొద్ది రోజుల క్రితం కోవిడ్ నుంచి కోలుకున్న ఎనిమింది మంది కంటి చూపు కోల్పోయిన సంగతి తెలిసిందే. కరోనా నుంచి కోలుకున్నామని సంతోషించేలోపే వారి జీవితాలు అంధకారం అయ్యాయి. వీరు చూపు కోల్పోవడానికి కారణం బ్లాక్ ఫంగస్. ఢిల్లీ, అహ్మదాబాద్ తదితర చోట్ల ఈ ఫంగస్ను గుర్తించారు. తాజాగా దేశవ్యాప్తంగా ఈ తరహా కేసులు పెరుగుతండటంతో కేంద్ర ప్రభుత్వం, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సంయుక్తంగా కొన్ని మార్గదర్శకాలను జారీ చేశాయి. దీని లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వీటిలో తెలిపారు. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే కోవిడ్ మాదిరి ఈ ఫంగస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అవకాశం లేదని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. ఏమిటి బ్లాక్ ఫంగస్.. బ్లాక్ ఫంగస్, ‘మ్యూకోర్మైకోసిస్’గా పిలిచే ఈ వ్యాధి కొత్తదేం కాదు. గతంలో కూడా ఉంది. కానీ తాజాగా కోవిడ్ సోకిన వారు ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. దీని వల్ల బాధితుడికి ప్రాణాపాయం తలెత్తవచ్చు. వాతావరణంలో సహజంగానే ఉండే ‘మ్యూకోర్’ అనే ఫంగస్ వల్ల ఇది వస్తుంది. అరుదుగా మనుషులకు సోకుతుంటుంది. ముఖ్యంగా కరోనా సోకిన వారిలో, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారిలో అధిక మొత్తంలో స్టెరాయిడ్స్ వినియోగించిన వారికి ఇది ఎక్కువగా సోకే అవకాశం ఉంది. గాలి పీల్చుకొన్నప్పుడు ఈ ఫంగస్ ఊపిరితిత్తుల్లో, సైనస్ వద్ద చేరుతుంది. ఇది మెదడుకు చేరితో ప్రాణాపాయం తప్పదు అంటున్నారు నిపుణులు. బ్లాక్ ఫంగస్ సోకిందని గుర్తించడం ఎలా... బ్లాక్ ఫంగస్ సోకిన వారిలో చాలా వరకు కోవిడ్-19 లక్షణాలే కనిపిస్తాయి. ఒళ్లునొప్పులు, కళ్లు, ముక్కుచుట్టూ ఎర్రబారిపోవడం, జ్వరం, తలనొప్పి, జలుబు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, పంటి నొప్పి, దంతాలు కదిలిపోవడం, కళ్ల నొప్పి, చూపు మందగించడం, వాంతులైతే రక్తపు జీరలు పడటం, మతి భ్రమించడం, శరీరంలో షుగర్ లెవల్స్ సడెన్గా పడిపోవడం, గతంలో ఎదుర్కొన్న అనారోగ్య సమస్యలు మళ్లీ తిరగబెట్టడం వంటి తదితర లక్షణాలు కనిపిస్తే బ్లాక్ ఫంగస్ సోకిందని అనుమానించాలి. ఏం చేయాలి.. రక్తంలో షుగర్ లెవల్స్ని అదుపులో ఉంచుకోవాలి. కరోనా నుంచి కోలుకున్నా.. ఎప్పటికప్పుడు షుగర్ లెవల్స్ని పరీక్షించుకోవాలి. సమాయానికి, సరైన మోతాదులో డాక్టర్లు సూచించిన స్టెరాయిడ్లను మాత్రమే వాడాలి. ఆక్సిజన్ థెరపీ సమయంలో తేమ కోసం పరిశుభ్రమైన నీటిని మాత్రమే వాడాలి. డాక్టర్లను సూచన మేరకు యాంటీబయోటిక్స్, యాంటీఫంగల్ ఔషధాలను తీసుకోవచ్చు. నిరోధించడం ఎలా.. బహిరంగ ప్రదేశాలు, దుమ్ముదూళి ఉన్న ప్రాంతాల్లోకి వెళ్తే తప్పని సరిగా మాస్కు ధరించాలి. వీలైనంత వరకు శరీరం మొత్తం కవర్ అయ్యేలా పొడవాటి దుస్తులు ధరించాలి. చేతులకి గ్లోవ్స్, కాళ్లకు సాక్సులు వేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. Evidence based Advisory in the time of #COVID-19 (𝐒𝐜𝐫𝐞𝐞𝐧𝐢𝐧𝐠, 𝐃𝐢𝐚𝐠𝐧𝐨𝐬𝐢𝐬 & 𝐌𝐚𝐧𝐚𝐠𝐞𝐦𝐞𝐧𝐭 𝐨𝐟 𝐌𝐮𝐜𝐨𝐫𝐦𝐲𝐜𝐨𝐬𝐢𝐬) @MoHFW_INDIA @PIB_India @COVIDNewsByMIB @MIB_India #COVID19India #IndiaFightsCOVID19 #mucormycosis #COVID19Update pic.twitter.com/iOGVArojy1 — ICMR (@ICMRDELHI) May 9, 2021 ‘మ్యూకర్మైకోసిస్’ అంటే మ్యూకోర్మైకోసిస్ ఒక అరుదైన ఇన్ఫెక్షన్. సాధారణంగా మట్టిలో, మొక్కల్లో, ఎరువులో, కుళ్లిపోతున్న పండ్లు, కూరగాయల్లో కనిపించే మ్యూకర్(బూజు లాంటిది) వల్ల వస్తుంది. ఇది అన్నిచోట్లా ఉంటుంది. మట్టిలో, గాల్లో, ఆరోగ్యంగా ఉన్న వ్యక్తుల ముక్కులో, చీమిడిలో కూడా ఉంటుందన్నారు వైద్యనిపుణులు. ఇది సైనస్, మెదడు, ఊపిరితిత్తులపై ప్రభావం చూపిస్తుంది. డయాబెటిక్ రోగులకు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే క్యాన్సర్, హెచ్ఐవీ లాంటివి ఉన్న రోగులకు ఇది ప్రాణాంతకం కావచ్చు. మరణాల రేటు 50 శాతం వరకూ ఉన్న మ్యూకోర్మైకోసిస్కు స్టెరాయిడ్స్ ఉపయోగించవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. ఇదే చికిత్సతో బ్లాక్ ఫంగస్ బారిన పడిన రోగుల ప్రాణాలను కాపాడవచ్చని వైద్యనిపుణులు తెలిపారు. చదవండి: కలకలం: కరోనా నుంచి కోలుకోగానే కళ్లు పోయాయి -
దేశంలో పంజా విసురుతున్న మ్యూకోర్మైకోసిస్
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్–19 మహమ్మారి బారినపడి, కోలుకున్నవారిలో కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి. బ్లాక్ ఫంగస్ రూపంలో మృత్యువు కాటేస్తోంది. గుజరాత్, ఢిల్లీ, మహారాష్ట్రలో బ్లాక్ ఫంగస్ ఆనవాళ్లు బయటపడ్డాయి. బ్లాక్ఫంగస్గా పిలిచే మ్యూకోర్మైకోసిస్ సంక్రమణ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా నుంచి కోలుకున్నవారిలో ఈ బ్లాక్ ఫంగస్ కనిపిస్తోంది. మహారాష్ట్రలో మ్యూకోర్మైకోసిస్ అనే ఫంగల్ ఇన్ఫెక్షన్ కారణంగా శనివారం కనీసం 8 మంది కోవిడ్–19 రోగులు ప్రాణాలు కోల్పోయారని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. బ్లాక్ ఫంగస్ కేసులు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నమోదవుతున్నాయి. ఢిల్లీలో రెండు రోజుల వ్యవధిలో ఆరుగురు బ్లాక్ ఫంగస్ బారిన పడి చికిత్స కోసం సర్ గంగారాం ఆసుపత్రిలో చేరారు. గుజరాత్లోని సూరత్లో కిరణ్ సూపర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో 50 మంది బ్లాక్ ఫంగస్ బాధితులు చికిత్స పొందుతున్నారు. చికిత్స కోసం మరో 60 మంది ఎదురు చూస్తున్నారు. ఈ బాధితులంతా ఇటీవలే కోవిడ్ నుంచి బయటపడిన వారే కావడం గమనార్హం. కరోనా చికిత్స సమయంలో రోగికి ఆక్సిజన్ సపోర్ట్పై ఉన్నప్పుడు ఆ కారణంగా ఏర్పడే తేమ వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్ వారి రోగ నిరోధక వ్యవస్థపై దాడి చేసి ప్రాణాంతకంగా మారుతోందని మహారాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (డీఎంఈఆర్) అధిపతి డాక్టర్ తత్యారావు లాహనే వెల్లడించారు. రోగి మెదడుకు ఫంగస్ చేరుకుంటే అది ప్రాణాంతకమని స్పష్టం చేశారు. రోగి ప్రాణాలను కాపాడేందుకు కళ్లలో ఒకటి శాశ్వతంగా తొలగించాల్సి ఉంటుందన్నారు. మ్యూకోర్మైకోసిస్ సాధారణ లక్షణాలు తలనొప్పి, జ్వరం, కళ్ల కింద నొప్పి, పాక్షికంగా దృష్టి కోల్పోవడం వంటివి ఉన్నాయని తెలిపారు. ఈ బ్లాక్ ఫంగస్ చికిత్సలో భాగంగా ఒక్కొక్కటి రూ.9 వేల విలువైన ఇంజెక్షన్లను 21 రోజుల పాటు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. చదవండి: (కరోనాతో ఊపిరి సమస్యలే కాదు.. మరో పెనుముప్పు కూడా!) -
కలకలం: కరోనా నుంచి కోలుకోగానే కళ్లు పోయాయి
అహ్మదాబాద్: కరోనా వైరస్ ప్రభావంతో కొత్త కొత్త వ్యాధులు కూడా పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే ఆ వైరస్ ప్రజలను భయాందోళనలో నెట్టివేయగా ఈ వైరస్ ప్రభావంతో మరో ప్రమాదకర పరిస్థితులు వచ్చి పడ్డాయి. కరోనా నుంచి కోలుకున్న వారికి కంటి చూపు పోతోంది. దేశంలో అక్కడక్కడ ఈ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఒక ఫంగస్ రావడంతో దాని వలన కరోనా నుంచి కోలుకున్న వారి చూపు మందగిస్తోందని తెలుస్తోంది. తాజాగా గుజరాత్లోని సూరత్లో ఏకంగా 8 మంది కంటిచూపు కోల్పోయారు. దీంతో దేశవ్యాప్తంగా ఈ విషయం కలకలం రేపుతోంది. దేశవ్యాప్తంగా ఈ ఫంగస్ బారిన 40 మందికి పైగా పడ్డారని తెలుస్తోంది. సూరత్లో కంటిచూపు పోయిందని 8 మంది బాధితులు ఆస్పత్రికి వచ్చారు. తమ కంటిచూపు మందగించిందని వైద్యులను సంప్రదించారు. వారిని పరిశీలించగా బ్లాక్ ఫంగస్ (మ్యూకోర్మిసిస్) అనేది రావడంతో వారి చూపు పోయిందని వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఫంగస్పై వైద్యులు అధ్యయనం చేస్తున్నారు. అయితే ఈ ఫంగస్ ప్రాణాంతకమని కూడా హెచ్చరిస్తున్నారు. అయితే ఈ ఫంగస్ రావడానికి గల కారణాలను గుర్తించారు. ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రి ఈఎన్టీ విభాగం అధిపతి డాక్టర్ అజయ్ స్వరూప్ ఫంగస్ కారణాలు వివరించారు. ‘కరోనా బాధితుల్లో ఎక్కువ మంది మధుమేహం వారు ఉన్నారని, కరోనా నివారణకు తీసుకున్న ఔషధాల వలన ఈ ఫంగస్ రావడానికి కారణం’ అని తెలిపారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఈ ఫంగస్ బారినపడే అవకాశం అధికంగా ఉందని తెలిపారు. మధుమేహం, కిడ్నీ, గుండె సంబంధిత, క్యాన్సర్ బాధితులకు ఈ ఫంగస్ సోకే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అయితే ఈ ఫంగస్ వస్తే కొందరికి కంటిచూపు కోల్పోగా మరికొందరి ప్రాణాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. చదవండి: ‘కదిలావో కాల్చేస్తా..’ టీచర్ను బెదిరించిన బాలిక చదవండి: ‘వ్యవస్థ కాదు.. ప్రధాని మోదీ ఓడిపోయాడు’ -
చుండ్రు...ఆహారపరమైన జాగ్రత్తలు
చుండ్రు సమస్య ఉన్నవారు మాంసాహారం తక్కువగా తీసుకోవడం మంచిది. అలాగే పంచదార, మైదా, స్ట్రాంగ్ టీ, కాఫీ, పచ్చళ్లు, నిల్వ పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది. అవి కొంతమేర చుండ్రు సమస్యను ప్రేరేపించేందుకు అవకాశం ఉంది. ఇక చుండ్రును అరిట్టేందుకు ముదురు ఆకుపచ్చరంగులో ఉండే ఆకుకూరలతో పాటు అన్నిరకాల కాయగూరలు, తాజా పండ్లతో కూడిన సమతుల ఆహారాన్ని తీసుకోవాలి. వీటిలోని పోషకాలు చుండ్రుకు కారణమయ్యే ఫంగస్ని నివారించడంలో దోహదపడతాయి. తద్వారా చుండ్రు సమస్యకు చెక్ చెప్పొచ్చు. అలాగే చుండ్రు ఉన్నవారు రోజూ ఎనిమిది నుంచి పది గ్లాసుల నీరు తాగడం వల్ల చర్మంలోని మృతకణాలు తొలగి, చర్మం బిగుతుగా మారి చర్మ ఆరోగ్యం పదికాలాల పాటు పదిలంగా ఉంటుంది. ఇవే ఆహార నియమాలు ఆరోగ్యవంతులకూ చుండ్రు రాకుండా నివారిస్తాయి . -
బూజు జాడ చెప్పే కొత్త యంత్రం!
సాక్షి, హైదరాబాద్: బూజు పట్టిన ఆహారం తింటే ఏమవుతుంది? పలుమార్లు బాత్రూంకు వెళ్లాల్సి రావడం తాత్కాలిక ప్రతి క్రియ కానీ.. తరచూ తిన్నా.. కాలేయం పాడైపోయి ప్రాణాల మీదకు వస్తుందని సైన్స్ చెబుతోంది. బూజులోని అఫ్లాటాక్సిన్లనే విషరసాయనాల వల్ల కొన్నిసార్లు కేన్సర్ బారిన కూడా పడొచ్చు. బూజు లేని ఆహారాన్ని మాత్రమే తినడం ఈ సమస్యలకు పరిష్కారం. కానీ అఫ్లాటాక్సిన్లను గుర్తించడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. పరిశోధనశాలల్లో మాత్రమే వీలయ్యే పని. మరి తరుణోపాయం ఏంటంటే.. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ‘ప్యూర్ స్కాన్ ఎ.ఐ.’అనే స్టార్టప్ పరిశోధనల పుణ్యమా అని అఫ్లాటాక్సిన్లను గుర్తించేందుకు సరికొత్త యంత్రం అందుబాటులోకి వచ్చింది. 5 అంగుళాల పొడవు, వెడల్పు, ఎత్తు ఉండే ఈ పరికరం అతినీలలోహిత కిరణాల సాయంతో అఫ్లాటాక్సిన్లను గుర్తిస్తుంది. అర నిమిషంలోనే మోతాదును కూడా నిర్ధారిస్తుంది. అఫ్లాటాక్సిన్లు అతినీల లోహిత కిరణాల కాంతిలో ప్రతిదీప్తిని ఇస్తాయి. పరిశీలించాల్సిన ఆహార పదార్థపు ఫొటో లు తీసి వాటిల్లో ప్రతిదీప్తిని ఇస్తున్న ప్రాంతాలను గుర్తించడం.. మెషీన్ లర్నింగ్ పద్ధతుల సాయంతో అఫ్లాటాక్సిన్ల మోతాదును గుర్తించడం ఈ పరికరం పనిచేసే పద్ధతి. తక్కువ ధరకే దొరికే ఈ యంత్రం అత్యంత కచ్చితత్వంతో పని చేస్తుంది కూడా. ఇన్స్పైర్ చాలెంజ్ అవార్డు.. రైతులు, వ్యవసాయం ఎదుర్కొంటు న్న పలు సమస్యలకు బిగ్ డేటా సా యంతో పరిష్కారాలు కనుగొనేందు కు అంతర్జాతీయ మెట్ట ప్రాంత పం టల పరిశోధన కేంద్రం (ఇక్రిశాట్), సీజీఏఐఆర్లు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఇన్స్పైర్ చాలెంజ్ అవార్డుకు ప్యూర్ స్కాన్ ఎ.ఐ. అభివృద్ధి చేసిన యంత్రం ఎంపికైంది. అవార్డులో భాగంగా దాదాపు రూ.73.63 లక్షలు (లక్ష డాలర్లు) నగదు ఈ కంపెనీకి దక్కనుంది. రైతులకు లాభం అఫ్లాటాక్సిన్లను గుర్తించే పరికరం అందుబాటులో ఉంటే రైతులకు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. పంట దిగుబడులు వచ్చాక పలు కారణాల వల్ల వాటిల్లో ఈ అఫ్లాటాక్సిన్లు ఎక్కువగా ఉంటున్నాయి. ఇది కాస్తా ఎగుమతులపై ప్రభావం చూపుతోంది. అఫ్లాటాక్సిన్లను గుర్తించే యంత్రంతో రైతులు విషాలు తక్కువగా ఉన్నవాటిని పొలంలోనే వేరు చేయొచ్చు. దీంతో వారు తమ ఉత్పత్తులకు మెరుగైన ధర పొందొచ్చు. ప్యూర్ స్కాన్ ఎ.ఐ. తయారు చేసిన యంత్రంపై మరికొన్ని పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అన్నీ సవ్యంగా సాగితే వచ్చే ఖరీఫ్ నాటికి ఈ యంత్రం అందుబాటులోకి వస్తుందని ఆశిస్తున్నాం. – డాక్టర్ శ్రీకాంత్, ఇక్రిశాట్ -
షాకింగ్: ఇయర్ ఫోన్స్ వల్ల అతడి చెవిలో..
బీజింగ్: ఇయర్ ఫోన్స్ ఎక్కువ సేపు చెవిలో పెట్టుకోకూడదన్నది నిపుణుల మాట. వీటిని అధికంగా వాడటం వల్ల వినికిడి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఇక వైర్లెస్ ఇయర్ ఫోన్స్ వల్ల రేడియేషన్కు గురయ్యే ప్రమాదం ఉంది. కానీ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ ఇయర్ ఫోన్స్ శరీరంలో ఒక భాగంగా మారిపోయాయి. అంతలా దానికి బానిసలయ్యారు. తాజాగా ఇయర్ ఫోన్స్ ఎక్కువగా వాడినందుకు ఓ బాలుడు ఆస్పత్రిపాలయ్యాడు. వివరాల్లోకి వెళితే.. బీజింగ్కు చెందిన పదేళ్ల బాలుడు చెవిలో నొప్పితో బాధపడుతున్నాడు. దీంతో అతను ఆస్పత్రికి వెళ్లగా, అతడిని పరీక్షించిన వైద్యులు షాక్కు గురయ్యారు. (ఇడ్లీ, దోసె, మజ్జిగ కూడా మందులే!) చెవిలో దట్టంగా పెద్ద సమూహంలో శిలీంధ్రాలు పెరుగుతున్నట్లు గుర్తించారు. దీన్ని 'బ్లాక్ ఫారెస్ట్ ఆఫ్ ఫంగస్'గా తెలిపారు. సుదీర్ఘంగా అందిస్తున్న చికిత్స వల్ల ప్రస్తుతం అతడు పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడని తెలిపారు. దీనికి సంబంధించిన ఫొటోలను డా.వు యుహువా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇయర్ ఫోన్స్ విచ్చలవిడిగా వాడటం వల్లే ఇంత ఘోరం జరిగిందని చెప్పుకొచ్చాడు. కాబట్టి వైర్లెస్ ఇయర్ఫోన్స్, హెడ్ఫోన్స్ వాడకందారులు దాని పర్యవసానాలను తెలుసుకుని పరిమితంగా వినియోగించాలని హెచ్చరించారు. ఇయర్ ఫోన్స్ వినియోగదారులు ఎల్లప్పుడూ చెవిని పొడిగా ఉంచడమే కాక, దాన్ని వాడే గంటలను తగ్గించాలని సూచించారు. (పిల్లలూ... పెద్దలూ... బ్రష్ చేసుకోండిలా!) -
ఈ ఫంగస్ మనదేశానికిఎలా వచ్చిందంటే..
తార్నాక: ఇంట్లో పల్లీలు ఉడకబెట్టి తినడం మరిచిపోతే ఏమవుతుంది..? ఒకరోజు గడిస్తే తేమ వల్ల వాటిపై ‘బూజు’ పేరుకుపోతుంది.. బూజే కదా అని తేలిగ్గా తీసుకుని పల్లీలు తినేస్తాం. ఏ పార్కుకో వెళ్లినప్పుడు అక్కడ మొక్కజొన్న కంకులు కనిపిస్తాయి.. అవి ఎప్పటివో కూడా తెలుసుకోకుండా కొనేస్తాం. ఇలాంటి చోట్ల ముందురోజు ఉడకబెట్టి అమ్మగామిగిలిపోయినవి కూడా మరుసటి రోజు అమ్మేస్తుంటారు. ఎవరూ పెద్దగా పట్టించుకోని ఈ ‘బూజు’.. మన ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందంటున్నారు పోషకాహార శాస్త్రవేత్తలు. తేమతో ఉన్న పల్లీల నుంచి నిల్వ ఉంచిన ఆహార పదార్థాలపై కంటికి కనిపించనంత పల్చగా పేరుకునే ఈ బూజు శరీరంలోకి ప్రవేశిస్తే పెద్దవారిలో కాలేయ కేన్సర్, పిల్లల్లో పోషకాహార లోపంతో పాటు పెరుగుదల ఆగిపోయి మరుగుజ్జుతనం వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఆహార ధాన్యాలలోని బూజుతో ప్రమాదకరమైన ఆఫ్లాటాక్సిన్, మైకోటాక్సిన్, డై ఆక్సివాలిన్ వంటి విష రసాయనాలు తయారవుతాయని, అలాంటి ఆహారం తింటే మనుషులు, జంతువులు తీవ్ర అనారోగ్యం పాలవడం ఖాయమని హెచ్చరిస్తున్నారు. రైతులు పంటలను కోసిన తర్వాత వాటిలో తేమ ఆరిపోయే వరకు ఎండబెట్టకుంటే ఆ గింజల్లో మన కంటికి కనిపించని బూజు ఏర్పడుతుంది. ఈ ఫంగస్కు అనేక రకాల రసాయనాలు చేరి వాటిని విషతుల్యం చేస్తాయి. దీం తో దాన్ని తిన్న జీవుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. ముఖ్యంగా మొక్కజొన్న, గోధుమ, వేరుశనగ, ఉప్పుడు బియ్యం వంటి వాటిలో ఈ ప్రభావం అధికంగా ఉంటుంది. ఈ ఫంగస్ మనదేశానికిఎలా వచ్చిందంటే.. కోళ్ల పరిశ్రమలకు ఇంగ్లాండ్ పెట్టింది పేరు. అక్కడి ఫామ్లలో పెరుగుతున్ను కోళ్లకు బ్రెజిల్ నుంచి వేరుశనగ పిండిని దాణాగా తెప్పించే వారు. 1960లో బ్రెజిల్ నుంచి తెచ్చిన పల్లీ పిండి తిన్న లక్ష కోళ్లు చనిపోయాయి. అప్పట్లో దీనిపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు పల్లీపిండిలో ఏర్పడిన బూజు వల్లే మైకోటాక్సిన్ అనే విష రసాయనం చేరి అది కోళ్ల చావుకు కారణమైందని తేల్చారు. అదే సమయంలో మన దేశానికి కూడా బ్రెజిల్ నుంచి వేరుశనగ, మొక్కజొన్న వంటి ఆహార పదార్థాలు దిగుమతి అయ్యాయి. వాటితోపాటే ఈ బూజు ఫంగస్ కూడా మనదేశానికి అంటుకుంది. అయితే దీని జన్మస్థానం మాత్రం ఆఫ్రికా అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆల్ఫా టాక్సిన్తో కాలేయ కేన్సర్ వేరుశనగ, మొక్కజొన్నలోని బూజుతో ఆల్ఫాటాక్సిన్ అనే విషపదార్థం ఏర్పడుతుందని, దీంతో ఐదేళ్లలోపు పిల్లల్లో పెరుగుదల నిలిచిపోయి మరుగుజ్జుతనం వస్తుందంటున్నారు శాస్త్రవేత్తలు. పెద్దవారిలో కాలేయ కేన్సర్ తప్పదంటున్నారు. ఆల్ఫాటాక్సిన్ అధికంగా ఉన్న మొక్కజొన్నలు తిని గతంలో గుజరాత్లో వంద మంది గిరిజనులు చనిపోయారు కూడా. అనంతపూర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పల్లీలను ఆహారంలో అధికంగా వినియోగిస్తున్నందున వారిలో ఆల్ఫాటాక్సిన్ వల్ల ఆరోగ్య సమస్యలకు దారితీసిందంటున్నారు. అలాగే ఉప్పుడు బియ్యం తిన్నవారిలో ఆల్ఫాటాక్సిన్–బీ1 రసాయనాలు, ఈ బియ్యాన్ని మేతగా తిన్న పశువుల పాలలో ఆల్ఫాటాక్సిన్ ఎం–1 అనే విష పదార్థాలు అధికంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఫ్యూమినోసిన్తోనూ డేంజరే.. తడిసిన జొన్నల్లో ‘ఫిజీరియన్’ అనే బూజుతో ఫ్యూమినోసిన్ అనే రసాయనం ఉత్పత్తి అవుతుంది. వీటిని అధికంగా తీసుకోవడం వల్ల ఆయా వ్యక్తులకు కేన్సర్ సోకుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ♦ 1995లో రంగారెడ్డి జిల్లాలోని పలు గిరిజన తండాల్లో జొన్నలు అధికంగా ఆహారంగా తీసుకున్న మనుషులు, కోళ్లలో కేన్సర్ లక్షణాలు అధికంగా కనిపించినట్లు ఎన్ఐఎన్ పరిశోధనల్లో తేలింది. ♦ నిజామాబాద్ ప్రాంతంలో పండించే మొక్కజొన్నలను అధికంగా కోళ్లఫారాలకు సరఫరా చేయగా, అవి తిన్న కోళ్లల్లో మరిగుజ్జుతనం, గుడ్లు పెట్టకపోవడం వంటి లక్షణాలు కనిపించాయని, ఈ కోళ్ల మాంసాన్ని ఎక్కువగా తిన్నవారిలో కేన్సర్ లక్షణాలు కనిపించాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ♦ గోధుమ పిండికి బూజు పడితే అందులో ఏర్పడే ‘డైయాక్సినివోలిన్’ అనే విషపదార్థం మనిషి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందంటున్నారు సైంటిస్టులు. బూజు పట్టిన గోధుమ పిండితో తయారు చేసిన వంటకాలు తిని 1989లో కశ్మీర్లో 50 వేల మంది డయేరియా బారిన పడ్డారని, వారు దీర్ఘకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నట్లు శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. ఏయే ఆహార పదార్థాల్లో బూజు అధికంగా ఏర్పడుతుంది.. దాన్ని ఎలా గుర్తించాలి.. ఏయే ప్రాంతాల్లో దీని ప్రభావం అధికంగా ఉందనే విషయాలపై అధ్యయనం చేసి తదుపరి చర్యల కోసం రూపొందించే ప్రణాళికలపై తార్నాకలోని జాతీయ పోషకాహార సంస్థ(ఎన్ఐఎన్)లో మూడు రోజుల అంతర్జాతీయ వర్క్షాప్ బుధవారం ప్రారంభమైంది. ఇప్పటికే యూకేలోని అబర్డీన్ వర్సిటీతో ఒప్పందం కుదుర్చుకున్న ఎన్ఐఎన్ శాస్త్రవేత్తలు సంయుక్తంగా ప్రాజెక్టు చేపట్టి పరిశోధనలు చేయనున్నారు. అందులో భాగంగా∙ఈ అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నారు. అందరి భాగస్వామ్యం అవసరం ఆహార పదార్థాల్లోని బూజు వల్ల కలిగే ఆరోగ్య సమస్యల పరిష్కారానికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై మేధావులు, శాస్త్రవేత్తలు, జర్నలిస్టులు, సామాన్య ప్రజల సలహాలు, సూచనలు అవసరం. ఈ బృహత్తర కార్యక్రమంలో అందరినీ భాగస్వాములను చేయాలనే సంకల్పంతో ఈ అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నాం.– డాక్టర్ ఎస్.వాసంతి, ఎన్ఐఎన్ సైంటిస్ట్ ఆహార అలవాట్లపై అధ్యయనం ముఖ్యంగా మొక్కజొన్న, జొన్న, వేరుశనగ, గోధుమల్లో బూజుతో విషపదార్థాలు ఏర్పడి అవి తిన్న వారికి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. అయితే, ఈ తరహా ఆహారం అధికంగా తినే ప్రాంతాల వారిని ఎంపికచేసి వారిపై అధ్యయనం చేస్తాం. వారిలోని ఆరోగ్య సమస్యల ఆధారంగా నివారణ చర్యలు చేపట్టవచ్చు. అందుకు యూకే శాస్త్రవేత్తలతో కలిసి అధ్యయనం చేస్తున్నాం. – డాక్టర్ రమేష్ వి. భట్, సీనియర్ సైంటిస్ట్ పరిష్కారం చూపుతాం.. ఆహార పదార్థాల్లో ఏర్పడిన బూజు వల్ల కలిగే ఆరోగ్య సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కృషి చేస్తున్నాం. అందుకు ఎన్ఐఎన్తో ఒప్పందం కుదుర్చుకున్నాం. ఇందులో సంయుక్తంగా ప్రాజెక్టు చేపట్టి సమస్యకు తగిన పరిష్కారాన్ని చూపిస్తాం. – డాక్టర్ సిల్వియా గ్రాట్జ్, యూకే సైంటిస్ట్ -
మద్యం బాటిల్లో ఫంగస్
పశ్చిమగోదావరి, తణుకు టౌన్: ఫంగస్తో నిండిన మద్యం బాటిల్ శనివారం రాత్రి మద్యం ప్రియులను ఆందోళనకు గురి చేసింది. తణుకు పట్టణానికి చెందిన ఒక వ్యక్తి తణుకు సొసైటీ రోడ్డులోని ఒక మద్యం షాపులో శనివారం రాత్రి ఓల్డ్ ఎడ్మరల్ క్వార్టర్ బాటిల్స్ రెండు కొనుగోలు చేశాడు. వెంటనే ఒక బాటిల్ ఓపెన్ చేసి సేవించారు. రెండో బాటిల్ ఓపెన్ చేసే సమయంలో పరిశీలించగా పూర్తిగా బూజు పట్టి ఉండడం గమనించి షాపు నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లాడు. అయినా ఫలితం లేదు. ఈ విషయాన్ని ఎక్సైజ్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టు పేర్కొన్నారు. ఈ విషయమై తణుకు ఎక్సైజ్ సీఐ యు. సుబ్బారావును వివరణ కోరగా మద్యం బాట్లింగ్ చేసే సమయంలో ఏర్పడే లోపాల కారణంగా ఇలాంటి సమస్యలు వస్తాయని పేర్కొన్నారు. -
మలేరియా దోమలు ఇక మటాష్!
సిడ్నీ: మలేరియాను అదుపు చేయడంలో శాస్త్రవేత్తలు ముందడుగు వేశారు. ఆస్ట్రేలియాలో కనిపించే ఓ రకం సాలీడులో ఉండే విషంలోని జన్యువులతో అభివృద్ధి చేసిన ఫంగస్ను మలేరియా వ్యాప్తికి కారణమయ్యే ఎనాఫిలిస్ దోమల సంహారంలో వినియోగించి మంచి ఫలితాలు సాధించారు. మలేరియాను వ్యాప్తిచేసే ఆడ ఎనాఫిలిస్ దోమలకు హాని కలిగించే ‘మెటరీజియమ్ పింగ్షీన్స్’ అనే ఫంగస్ను శాస్త్రవేత్తలు వృద్ధి చేశారు. 6,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో కృత్రిమంగా ఓ ప్రాంతాన్ని సృష్టించి, అక్కడ ఈ ఫంగస్ పెరిగే ఏర్పాట్లు చేశారు. జన్యుపరంగా మార్పులు చేసిన ఈ ఫంగస్ చాలావేగంగా దోమల ప్రాణాలను హరించింది. కేవలం 45 రోజుల్లోనే అక్కడి 99 శాతం దోమలను నిర్మూలించగలిగారు. -
అంతరిక్షంలో బ్యాక్టీరియా బెడద
వాషింగ్టన్: అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఐఎస్ఎస్)లో కూడా సూక్ష్మజీవుల బెడద తప్పట్లేదు. అక్కడ బ్యాక్టీరియా, శిలీంధ్రం వంటి సూక్ష్మజీవులు ఉన్నట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన శాస్త్రవేత్తల బృందం గుర్తించింది. దీంతో అక్కడి వ్యోమగాముల ఆరోగ్యానికి హాని కలిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఐఎస్ఎస్లో భూమిపై ఉండే జిమ్, ఆస్పత్రుల్లో ఉండే అన్ని సూక్ష్మజీవులు ఉన్నట్లు కనుగొన్నారు. వీటిని కనుగొనడం వల్ల వ్యోమగాముల ఆరోగ్య సంరక్షణ కోసం, అంతరిక్షంలోకి ప్రయాణం చేసేటప్పుడు, అక్కడ నివసించేందుకు అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవచ్చని నాసా పేర్కొంది. ‘ఐఎస్ఎస్ వంటి మూసి ఉన్న ఆవరణలో సూక్ష్మజీవులు ఎంత కాలం జీవించి ఉంటాయో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది’అని పరిశోధన బృందంలోని భారత సంతితికి చెందిన కస్తూరి వెంకటేశ్వరన్ వివరించారు. అక్కడ కనుగొన్న బ్యాక్టీరియాలో 26 శాతం స్టెఫైలోకోకస్, 23 శాతం పాంటియా, 11 శాతం బాసిల్లస్ ఉన్నట్లు ఆయన తెలిపారు. మానవుడి జీర్ణవ్యవస్థలో ఉండే ఎంటిరోబ్యాక్టర్, స్టెఫైలోకోకస్ ఆరియస్ (10 శాతం)ను గుర్తించినట్లు చెప్పారు. అయితే ఇవి వ్యోమగాములు ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయా లేదా అన్న విషయం ఇంకా తెలియదని తెలిపారు. అంతరిక్షంలో ఆ వాతావరణంలో బ్యాక్టీరియాలు క్రియాశీలకంగా ఉంటాయా లేదా అనేది కూడా పరిశోధించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఐఎస్ఎస్లోని లోపలి ఉపరితలంలో 8 ప్రాంతాల్లో (కిటికీ, టాయిలెట్, డైనింగ్ టేబుల్..) సేకరించిన నమూనాలను పరిశీలించగా ఈ విషయం తెలిసింది. అరుణ గ్రహంపై జీవం అరుణగ్రహంపై జీవం ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంగారకుడికి చెందిన ఉల్కపై బ్యాక్టీరియా ఉందని వారు లండన్కు చెందిన పరిశోధకులు గుర్తించారు. దీన్ని బట్టి అంగారకుడిపై ఒకప్పుడు జీవం ఉండొచ్చని భావిస్తున్నట్లు తెలిపారు. 1977–78 మధ్య అంటార్కిటికా ప్రాంతంలో జపాన్కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలార్ రీసెర్చ్ జరుపుతున్న తవ్వకాల్లో ఏఎల్హెచ్–77005 అనే ఉల్క దొరికినట్లు శాస్త్రవేత్తలు వివరించారు. దీనిపై హంగేరియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ, ఎర్త్ సైన్సెస్కు చెందిన శాస్త్రవేత్తలు ఈ ఉల్కను అధ్యయనం చేసి బ్యాక్టీరియా ఉన్నట్లు గుర్తించారు. ఈ ఉల్క లోపల సేంద్రియ పదార్థ రూపంలో బ్యాక్టీరియా ఉందని కనుగొన్నట్లు ఇల్డికో గ్యొల్లయ్ అనే శాస్త్రవేత్త తెలిపారు. ‘భౌగోళిక, జీవ, రసాయన, వాతావరణ శాస్త్ర రంగాలకు చెందిన పరిశోధకులకు మా పరిశోధనలు ఎంతో మేలు చేస్తాయి’అని ఇల్డికో చెప్పారు. తమ పరిశోధనతో భవిష్యత్తులో ఉల్కలు, గ్రహ శకలాలను అధ్యయనం చేసే తీరు మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. -
ఫంగస్ ఫ్యాక్టరీలు వచ్చేస్తున్నాయి...
వస్త్రం మొదలుకొని రోజువారీ వ్యవహారాల్లో మనం వాడే కాస్మోటిక్స్, సబ్బుల వంటి అనేక వస్తువుల తయారీకి మూల పదార్థం ముడిచ మురు! ఈ చమురేమో పర్యావరణానికి హాని కలిగించేది. ఈ నేపథ్యంలో ఫ్రాన్హోఫర్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు కేవలం ఫంగస్ సాయంతో వాణిజ్యస్థాయిలో ఇలాంటి ఉత్పత్తులన్నింటినీ సిద్ధం చేసేందుకు ఓ వినూత్న టెక్నాలజీని అభివద్ధి చేశారు. బ్రెడ్లాంటి వాటికి పట్టే బూజు గురించి మీకు తెలిసే ఉంటుంది. తెల, పచ్చ రంగుల్లో ఉండే ఈ బూజే ఫంగస్. ఆస్పెర్గిల్లస్ అనేది ఫంగస్ జాతిలో ఒకటి. వీటికున్న ప్రత్యేకత ఏమిటో తెలుసా? కార్బన్డైయాక్సైడ్ వంటి విషవాయువులేవీ విడుదల చేయకుండానే ఇవి అనేక రకాల రసాయనాలను తయారు చేయగలవు. కాకపోతే ఇప్పటివరకూ వీటిని వాణిజ్య స్థాయిలో తయారు చేయడం మాత్రం వీలు కాలేదు. ఈ నేపథ్యంలో ఫంగస్కు అవసరమైన ఆహారంలో మార్పులు చేయడం ద్వారా నిర్దిష్టమైన రసాయనాలను ఉత్పత్తి చేయవచ్చునని ఫ్రాన్హోఫర్ శాస్త్రవేత్తలు గుర్తించారు. తగిన విధంగా వాడుకుంటే ఫంగస్ ద్వారా మాలిక్ ఆసిడ్ నుంచి పాలియేస్టర్ల వరకూ అనేక రసాయనాలను ఉత్పత్తి చేయవచ్చునని వీరు అంటున్నారు. -
ప్రభుత్వాస్పత్రిలో ఫంగస్ సోకిన సెలైన్
కర్నూలు, బనగానపల్లె: బనగానపల్లె ప్రభుత్వ కమ్యూనిటీ వైద్యశాలలో శనివారం రాత్రి ఓ రోగికి ఎక్కించేందుకు సిబ్బంది ఫంగస్ సోకిన సెలైన్ బాటిళ్లను తీసుకురాగా బంధువు గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలోని పంచమపేటకు చెందిన కొత్తమిద్దె మహేష్ వాంతులు, విరేచనాలతో శనివారం రాత్రి 10.30గంటల సమయంలో ఆస్పత్రిలో ఇన్పెషంట్గా చేరారు. డ్యూటీ డాక్టర్ అతడిని పరీక్షించి మందులు, సెలైన్ బాటిళ్ల ఎక్కాల్సిందిగా కేషీట్లో రాశారు. అయితే సిబ్బంది ఫంగస్ సోసిన విషయాన్ని గమనించకుండానే రోగికి ఎక్కించేందుకు బాటిళ్లు తీసుకొచ్చారు. రోగి వెంట వచ్చిన రాము ఫంగస్ సోకిన సెలైన్ బాటిళ్లను గుర్తించి వీటిని ఏలా ఎక్కిస్తారంటూ ప్రశ్నించాడు. చూడకపోయిఉంటే అలాగే ఎక్కించే వారు కదా అని వాగ్వాదానికి దిగాడు. అనంతరం రాము 1100కు పోన్చేసి ఫంగస్ సోకిన బాటిళ్లను తనవెంట తీసుకెళ్లాడు. ఈ విషయం పై డ్యూటీ డాక్టర్ శివశంకర్ మాట్లాడుతూ ఇందులో తన తప్పు ఏమీలేదన్నారు. తాను రాసిన మందులను రోగులకు వినియోగించడంలో సంబంధిత వార్డు డ్యూటీ సిబ్బంది చూసుకోవాలన్నారు. -
పీచుతో కడుపు సమస్యకు పరిష్కారం...
వయసు పెరిగిన కొద్దీ జీర్ణ సంబంధిత సమస్యలు పెరగడం సహజం. మన పేగుల లోపలి పొరలు బలహీనపడటం దీనికి కారణం. ఇంటస్టైనల్ బ్యారియర్ అని పిలిచే ఈ పొరలను గట్టిపరచుకోవడం సులువేనని రెబ్రో యూనిర్శిటీశాస్త్రవేత్తలు జాన్ పీటర్, గండామాల్స్ అంటున్నారు. పీచు పదార్థం ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం ద్వారా బ్యాక్టీరియా, హానికారక పదార్థాల నుంచి రక్షణ కల్పించే పేగు పొరను గట్టిగా చేసుకోవచ్చునని చెప్పారు. 65 కంటే ఎక్కువ వయసున్న వారి పేగు పొరల నమూనాలను పరిశీలించడం ద్వారా తాము ఈ అంచనాకు వచ్చినట్లు చెప్పారు. ఆరోగ్యకరమైన వారి పేగు పొరలతో పోల్చినప్పుడు పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకునే వారి పొరలు దృఢంగా ఉన్నట్లు తెలిసిందన్నారు. ఈస్ట్ ఫంగస్ నుంచి లభించే పీచు పదార్థం ఒకటి వయసు మీరిన వారి పేగులపై మంచి ప్రభావం చూపుతున్నట్లు తమ పరిశీలనలో వెల్లడైంది అన్నారు. కొంతమంది వృద్ధులకు రెండు రకాల పీచు పదార్థాలను ఆరు వారాల పాటు అందించి పరిశీలించినప్పడు మాత్రం పెద్ద తేడా లేకుండా పోయిందని అన్నారు. -
ఐస్క్రీమ్లో ఫంగస్, పురుగులు
బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్ నెం.2లోని నిత్యం అత్యంత రద్దీగా ఉండే ఓ ప్రముఖ ఐస్క్రీమ్ షాపులో తాను ఆర్డర్ చేసిన చాక్లెట్ కేక్ ఐస్క్రీమ్లో ఫంగస్, పురుగులు ఉన్నాయని ఆరోపిస్తూ రంజిత్ ఆకుతోట అనే వ్యక్తి మంత్రి కేటీఆర్తో పాటు, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్, జీహెచ్ఎంసీ ఆన్లైన్కు ట్వీట్ చేశాడు. ఆదివారం రాత్రి తన సోదరుడి బర్త్డే సందర్భంగా చాక్లెట్ కేక్ ఐస్క్రీమ్ను ఆర్డర్ చేశానని అందులో పురుగులు కనిపించడం చూసి షాక్కు గురయ్యామని ట్విట్టర్లో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన జూబ్లీహిల్స్ పోలీసులు స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేస్తే సదరు ఐస్క్రీమ్ షాపుపై చర్యలు తీసుకుంటామని ట్వీట్టర్ ద్వారా సమాధానం చెప్పారు. -
సెలైన్లో ఫంగస్
సాక్షి, హైదరాబాద్: సరోజినిదేవి ఆస్పత్రిలో ఫంగస్ ఉన్న సెలైన్తో కళ్లను శుభ్రం చేయడంతో ఏడుగురి కళ్లుపోయిన ఘటనను మరచిపోక ముందే తాజాగా హైదరాబాద్ దుర్గాబాయ్ దేశ్ముఖ్ ఆస్పత్రిలో ఇలాంటి సంఘటనే జరిగింది. అనారోగ్యంతో వచ్చిన ఓ బాలుడికి ఫం గస్ ఉన్న సెలైన్ ఎక్కించారు. దీన్ని గుర్తించిన బాలుడి తల్లిదండ్రులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ రాంనగర్కు చెందిన మనోహర్లింగం కుమారుడు వంశీ(11)కి ఫిట్స్ రావడంతో సమీపంలోని దుర్గాబాయ్ దేశ్ముఖ్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు సెలైన్ ఎక్కించాల్సిందిగా సూచించారు. ఆస్పత్రి సిబ్బంది సెలైన్ బాటిల్ పరిశీలించకుండానే ఎక్కించారు. పక్కనే ఉన్న తల్లిదండ్రులు, బంధువులు సెలైన్ బాటిల్ను పరిశీలించగా అందులో ఫంగస్ ఉన్నట్లు గుర్తించారు. ఈ అంశంపై సదరు ఆస్పత్రి వైద్యులను సంప్రదించగా వారి నుంచి కనీస స్పందన రాలేదు. ఆగ్రహించిన రోగి బంధువులు నల్లకుంట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు ఐపీసీ 336 కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. -
దుర్గాబాయ్ దేశ్ముఖ్ ఆస్పత్రిపై కేసు
సాక్షి, హైదరాబాద్: ఏడో తరగతి విద్యార్థికి ఫంగస్ ఉన్న సెలైన్ ఎక్కించిన ఘటనలో ఓ ఆస్పత్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాంనగర్కు చెందిన మనోహర్ లింగం కుమారుడు వంశీకృష్ణ(12)కి ఫిట్స్ రావడంతో దుర్గాబాయ్ దేశ్ముఖ్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించి అతడికి ఫంగస్ ఉన్న సెలైన్ ఎక్కించారు. బాలుడు మరింత అనారోగ్యానికి గురవడంతో తల్లిదండ్రులు వైద్యులను నిలదీసినప్పటికీ వారు స్పందించలేదు. దీంతో వంశీ మేనమామ శ్రీనివాస్ నల్లకుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు ఆస్పత్రిపై ఐపీసీ 336 సెక్షన్ కింద కేసు నమోదు చేశామని నల్లకుంట సీఐ యాదగిరిరెడ్డి తెలిపారు. -
ఫంగస్తో దోమల నివారణ!
వైద్య సదుపాయాలు బాగా పెరిగాయనుకుంటున్న ఈ కాలంలోనూ మలేరియా వ్యాధి ద్వారా ఏటా మరణిస్తున్న వారి సంఖ్య దాదాపు 5 లక్షలు ఉండటం బాధాకరమే. దోమల ద్వారా వ్యాపించే ఈ వ్యాధికి చెక్ పెట్టేందుకు మేరీల్యాండ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఇప్పుడో కొత్త టెక్నిక్ను ఆవిష్కరించారు. జన్యుపరమైన మార్పులు చేయడం ద్వారా సాధారణ ఫంగస్ తేలు, సాలీడు విడుదల చేసే విషాన్ని ఉత్పత్తి చేసేలా చేశారు. ఈ విషంతో దోమలు చనిపోతాయి. అయితే మనుషులకు ఎలాంటి హానీ ఉండదు. అంతేకాకుండా ఈ సరికొత్త ఫంగస్ ద్వారా తేనెటీగలకు, ఇతర క్రిమికీటకాలకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదని మేరీల్యాండ్ శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనం ద్వారా ఇప్పటికే స్పష్టమైంది. దోమల శరీరాలకు తాకిన వెంటనే ఫంగస్ పెరగడం మొదలై.. కొంత సమయానికి శరీరంలోకి చొచ్చుకుపోయి చంపేస్తుందని ఈ అధ్యయనంలో పాల్గొన్న బ్రెయిన్ లోవెట్ అనే శాస్త్రవేత్త తెలిపారు. ఫంగస్ బారిన పడ్డ దోమ మనుషుల రక్తం పీల్చడం కూడా మానేస్తుందని.. ఫలితంగా మలేరియా వంటి వ్యాధుల వ్యాప్తిని అతి తక్కువ కాలంలోనే అడ్డుకోవచ్చని వివరించారు. రసాయన మందులతో పోలిస్తే ఈ ఫంగస్ దోమపై చూపే ప్రభావం చాలా భిన్నమైందని, దోమ నాడీవ్యవస్థపై నేరుగా ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్త రేమండ్ పేర్కొంటున్నారు. ఇదే సమయంలో ఫంగస్ విడుదల చేసే విషం కేవలం దోమ రక్తంలో మాత్రమే చైతన్యవంతమయ్యేలా జన్యుపరమైన స్విచ్లను ఏర్పాటు చేయడం ద్వారా ఇతరులకు ఎలాంటి ప్రమాదం లేకుండా చేశామని వివరించారు. -
స్వచ్ఛ ఊపిరి
నగర జీవితంలో స్వచ్ఛమైన గాలి కూడా కరువే. ఇంట్లో నాలుగు గోడల మధ్య తలుపులన్నీ బిడాయించేసుకున్నా, ఏదో ఒక రూపంలో కాలుష్యాలు చొరబడుతూనే ఉంటాయి. పరిసరాల్లోని దుర్గంధాలన్నీ ఇంట్లోకీ వ్యాపిస్తూనే ఉంటాయి. అగరొత్తుల మొదలుకొని రూమ్ఫ్రెషనెర్ల వరకు ఎన్ని వాడినా పూర్తి ప్రయోజనం ఉండనే ఉండదు. పైగా అగరొత్తుల పొగ, రూమ్ఫ్రెషనర్ల వాసన సరిపడని వారికి పరిస్థితి ఉక్కిరిబిక్కిరిగా ఉంటుంది. ఇలాంటి సమస్యలకు పరిష్కారమే ఈ ఫొటోలో కనిపిస్తున్న ‘ఏరోక్యూర్ వన్’ ఎయిర్ ప్యూరిఫైయర్. ఇది ఇంట్లో ఇక నిశ్చింతగా ఊపిరి పీల్చుకోవచ్చు. గాలిలో ఉండే దుమ్ము, ధూళి కణాలను, బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్ వంటి ప్రమాదకరమైన సూక్ష్మజీవులను, దుర్గంధాన్ని ప్రసరించే ఇతర కారకాలను ఇది సమర్థంగా తొలగిస్తుంది. హెపా ఫిల్టర్లతో పనిచేసే ఎయిర్ ప్యూరిఫయర్ దాదాపు 800 చదరపు అడుగుల మేరకు పరిసరాల్లోని గాలిని స్వచ్ఛంగా మారుస్తుంది. ఇందులోని శక్తిమంతమైన అల్ట్రావయొలెట్ లైట్ రోగకారక సూక్ష్మజీవులను ఇట్టే నాశనం చేస్తుంది. ఇందులోని ఫిల్టర్లు ఆరు నుంచి ఎనిమిది నెలల వరకు మన్నుతాయి. ఆ తర్వాత వాటిని మార్చేసుకుంటే చాలు, ఇది యథాప్రకారం పనిచేస్తుంది. -
అంతరించనున్న అరటి
లాస్ ఏంజెలిస్: మరో ఐదు, పదేళ్లలో అరటి పంట అంతరించనుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మూడు ఫంగస్ల వల్ల ఈ పంటకు పెను ముప్పు పొంచి ఉందని అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీ (యూసీ) పరిశోధకులు చెబుతున్నారు. ఈ ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నట్లు కాస్తంత భరోసా ఇచ్చారు. మూడు ఫంగస్లలో రెండింటి వల్ల మాత్రం తీవ్ర ముప్పు వాటిల్లనుందని డేవిస్లోని యూసీకి చెందిన శాస్త్రవేత్త అయనీస్ స్ట్రెగి యోపోలోస్ చెప్పారు. తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న ఫంగస్ వల్ల మరో ఐదు పదేళ్లలో.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అరటి పంట తుడిచిపెట్టుకొని పోతుందన్నారు. -
ఫార్మర్స్ లంగ్...
మెడిక్షనరీ ‘వ్యవసాయదారుల ఊపిరితిత్తి’ అని రైతుల పేరిట ఉన్న ఈ ఆరోగ్య సమస్య కేవలం రైతులకే కాదు... ఎవరికైనా రావచ్చు. గాదెల్లోనూ, గరిసెల్లోనూ ధాన్యం నిల్వ చేసినప్పుడు, ఆ గింజల మీద ఉండే తేమపై పెరిగే థెర్మోయాక్టినోమైసిటిస్ అనే ఫంగస్ కారణంగా ఇది వస్తుంది. ఈ వ్యాధి న్యుమోనియాను కలిగించే ఊపిరితిత్తులను దెబ్బతీస్తుంది. అయితే వృత్తిరీత్యా ఇది వ్యవసాయదారులకూ, ఆ వృత్తితో సంబంధం ఉన్నవారికి ఇది వచ్చే అవకాశాలు ఎక్కువ. కాబట్టి దీనికి ఫార్మర్స్ లంగ్ అని పేరు. చెరుకుపంటపై నుంచి వచ్చే ధూళిని పీల్చేవారిలోనూ ఇది వచ్చే అవకాశాలు ఎక్కువ. -
ఫంగస్ ముసుగులో క్యాట్ఫిష్ !
= తీరగ్రామాల్లో భారీ చెరువులు = దొడ్డిదారిలో సాగు = ఇతర రాష్ట్రాలకు ఎగుమతి కోడూరు, న్యూస్లైన్ : ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి, నిషేధాజ్ఞలు ఉల్లంఘించి పర్యావరణానికి పెను ముప్పు కలిగించడమే కాకుండా ప్రజారోగ్యాన్ని హరించివేసే క్యాట్ఫిష్ను సాగుచేస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. కోడూరు మండల పరిధిలోని తీరప్రాంత గ్రామాల్లో ఈ సాగు యథేచ్ఛగా సాగుతోంది. మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో విరివిగా వినియోగించే ఫంగస్ చేప ముసుగులో క్యాట్ఫిష్ను జోరుగా సాగు చేస్తున్నారు. ఈ రెండు జాతుల చేపలు ఒకే రకమైన రూపాన్ని కలిగి ఉండి ఆక్వా రంగంపై అంతగా అవగాహన లేని సామాన్య ప్రజానీకం గుర్తించలేనంతగా ఉండడమే దీనికి కారణంగా తెలుస్తుంది. సముద్రతీర ప్రాంతమైన మందపాకల-చింతకోళ్ళ గ్రామాల మధ్య మాగాణి పొలాల్లో ఏవిధమైన ప్రభుత్వ అనుమతులు లేకుండా క్యాట్ఫిష్ సాగు చేసి... అధికారులు కళ్లుకప్పి అక్రమంగా తర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన రైతులు సుమారు 25 నుంచి 30 ఎకరాల్లో భారీ చెరువులను తవ్వి గుట్టుచప్పుడు కాకుండా క్యాట్ఫిష్ సాగు చేస్తున్నట్లు సమాచారం. మంగళవారం ఒక్కరోజే సంబంధిత రైతు సుమారు నాలుగు నుంచి ఐదు భారీ వాహనాల ద్వారా క్యాట్ఫిష్ను ఉత్తరప్రదేశ్కు తరలించారని సమాచారం. చెరువుల సాగుకు అనుమతులు లభించిన రైతులూ చేపల సాగు పేరుతో క్యాట్ఫిష్ను సాగుచే స్తూ పర్యావరణానికి ముప్పు తెస్తున్నారని తీర ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి క్యాట్ఫిష్ సాగును అరికట్టి,దొడ్డి దారిలో చేస్తున్న రైతులపై కఠిన చర్యలు తీసుకుని ప్రజారోగ్యాన్ని కాపాడాలని పలువురు కోరుతున్నారు. సాగు విషయం తెలియదు : మత్స్యశాఖ ఏడీఏ చెన్ను నాగబాబు ఈ విషయమై మత్స్యశాఖ అవనిగడ్డ ఏడీవో చెన్ను నాగబాబును వివరణ కోరగా తీరప్రాంతాల్లో క్యాట్ఫిష్ సాగుచేస్తున్న సంగతి తమకు దృష్టికి రాలేదన్నారు. క్యాట్ఫిష్ సాగుపై ప్రభుత్వ నిషేధం ఉందని, నిబంధనలు అతిక్రమించి సాగుచేసిన వారిపై తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. సాగు చేసిన వారు ఎంతటివారైనా ఉపేక్షించేదిలేదని ఆయన హెచ్చరించారు.