Gurukul Schools
-
రేవంత్.. 50 మంది విద్యార్థులు చనిపోయినా చలనం లేదా?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం భవిష్యత్ తరాలకు శాపంగా మారిందని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పదేళ్ల కేసీఆర్ పాలనలో ఎవరెస్ట్ శిఖరమంత ఎత్తు ఎదిగిన గురుకులాలు.. కాంగ్రెస్ పాలనలో అస్తవ్యస్తమై అధ్వాన్న స్థితికి చేరాయన్నారు. ఏడాది పాలనలో 50 మందికి పైగా విద్యార్థులు ఫుడ్ పాయిజన్, ఇతర కారణాలతో మరణించినా కాంగ్రెస్ సర్కారులో కనీస చలనం లేదని ఘాటు విమర్శలు చేశారు.తెలంగాణలో గురుకులాల పరిస్థితిపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ క్రమంలో ట్విట్టర్ వేదికగా కేటీఆర్..‘ఏడాది కాంగ్రెస్ పాలనలో అస్తవ్యస్తమై అధ్వాన్న స్థితికి చేరాయి. నాడు డాక్టర్లు, ఇంజనీర్ వంటి ఉన్నత చదువులు చదివిన విద్యార్థులు.. నేడు సరైన దిశానిర్దేశం లేక దీన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. నాడు గురుకులాల్లో సీటు కోసం పోటీ పడిన విద్యార్థులు.. నేడు గురుకులం పేరు చెబితే డీలా పడిపోతున్నారు. నాడు కడుపునిండా అన్నం తిని-అనుకున్న లక్ష్యాలను సాధిస్తే.. నేడు అన్నమో రామచంద్ర అనే రోజులొచ్చాయి. నాడు 41 వేల సీట్లకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష రాసేందుకు లక్ష 68 వేల దరఖాస్తులు వస్తే.. నేడు 51 వేల సీట్లకు గాను 80 వేల దరఖాస్తులే వచ్చాయి.ఏడాది పాలనలో 50 మందికి పైగా విద్యార్థులు ఫుడ్ పాయిజన్, ఇతర కారణాలతో మరణించినా కాంగ్రెస్ సర్కారులో కనీస చలనం లేదు. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు కనీస పరామర్శ లేకపోగా అంత్యక్రియలకు, పరామర్శకు వెళ్లే ప్రతిపక్షం మీద ఈ ప్రభుత్వం నిర్భందం ప్రయోగిస్తోంది. ఈ సర్కారు నిర్లక్ష్యం తెలంగాణ భవిష్యత్తు అయిన భావితరాలకు శాపం. జాగో తెలంగాణ జాగో!’ అంటూ కామెంట్స్ చేశారు. పదేళ్ల కేసీఆర్ పాలనలోఎవరెస్ట్ శిఖరమంత ఎత్తు ఎదిగిన గురుకులాలుఏడాది కాంగ్రెస్ పాలనలో అస్తవ్యస్తమై అధ్వాన్న స్థితికి చేరాయి.నాడు డాక్టర్లు, ఇంజనీర్ వంటి ఉన్నత చదువులు చదివిన విద్యార్థులు నేడు సరైన దిశానిర్దేశం లేకదీన పరిస్థితి ఎదుర్కొంటున్నారు.నాడు గురుకులాల్లో సీటు కోసం… pic.twitter.com/LLjDPGGcoz— KTR (@KTRBRS) February 16, 2025 -
‘గురి’తప్పిన గురుకులాలు!
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపటం లేదు. ఈ పాఠశాలల ప్రారంభ సమయంలో ఒక్కో సీటుకోసం కనీసం నలుగురు విద్యార్థులు పోడిపడగా, ఇప్పుడు ఇద్దరు కూడా పోటీలో లేకపోవడం గమనార్హం. ఇటీవల గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు అధికం కావటం, వసతుల లేమి కారణంగా వాటిల్లో చేరేందుకు విద్యార్థులు, చేర్పించేందుకు వారి తల్లిదండ్రులు ఆసక్తి చూప టం లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకుల సొసైటీల పరిధిలోని పాఠశాలల్లో 2025–26 విద్యా సంవత్సరంలో ఐదో తరగతి ప్రవేశాలకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ గతేడాది డిసెంబర్లో విడుదల కాగా, గడువు ముగిసేనాటికి దాదాపు 80 వేల మందే దరఖాస్తు చేసుకున్నారు. సీట్లు 51 వేలు.. దరఖాస్తులు 80 వేలు రాష్ట్రంలో ఐదు గురుకుల సొసైటీలున్నాయి. ఇందులో నాలుగు సొసైటీలు సంక్షేమ శాఖలకు అనుబంధంగా కొనసాగుతుండగా.. జనరల్ సొసైటీ పాఠశాల విద్యాశాఖ పరిధిలో ఉంది. ప్రస్తుతం టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్, తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్), మహాత్మ జ్యోతిబాపూలే తెలంగాణ వెనకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్ఈఐఎస్), తెలంగాణ గురు కుల విద్యాసంస్థల సొసైటీ (టీఆర్ఈఐఎస్)లు ఐదోతరగతికి ఉమ్మడిగా ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నాయి. మైనార్టీ గురుకుల సొసైటీ మాత్రం ప్రత్యేకంగా సెట్ నిర్వహించి ప్రవేశాలు చేపడుతోంది. మైనార్టీ సొసైటీలోని పాఠశాలలు మినహా మిగిలిన నాలుగు సొసైటీల్లోని 643 పాఠశాలల్లో ఐదోతరగతిలో 51,924 సీట్లు ఉన్నా యి. వీటిలో ఐదోతరగతి ప్రవేశాలకు గతేడాది డిసెంబర్ 21 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 6 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 80 వేలలోపే దరఖాస్తులు వచ్చాయి. గత ఏడాదితో పోల్చితే ఇవి దాదాపు 40 వేలు తక్కువ. ఈ నెల 23వ తేదీన అర్హత పరీక్ష నిర్వహించేందుకు ఎస్సీ గురుకుల సొసైటీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం నమోదైన దరఖాస్తుల ప్రకారం ఒక్క సీటు కోసం సగటున 1.6 మంది పోటీ పడుతున్నారు. గురుకుల పాఠశాల ప్రవేశం కోసం గతంలో విపరీతమైన డిమాండ్ ఉండేది. ఒక్కో సీటు కోసం సగటున నలుగురు విద్యార్థులు పోటీపడేవారు. గత ఏడాది కాలంగా గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు భారీగా పెరగటమే డిమాండ్ తగ్గటానికి కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
గురుకులాల్లో మార్పు తీసుకొస్తున్నాం: సీఎం రేవంత్
సాక్షి, చిలుకూరు: చదువుపై పెట్టే పెట్టుబడి భవిష్యత్పై పెట్టేదే అని చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ క్రమంలోనే తెలంగాణలోని గురుకులాల్లో మార్పు తీసుకొస్తున్నట్టు సీఎం చెప్పారు. అలాగే, మల్టీ టాలెంటెడ్ స్టూడెంట్స్ ప్రభుత్వ స్కూల్స్ నుంచి ఎందుకు రావడం లేదు?. ఇలా ఎందుకు జరుగుతుందో ప్రభుత్వ టీచర్లు ఆలోచించాలని కోరారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు రంగారెడ్డి జిల్లాలోని చిలుకూరులో హాస్టల్స్, గురుకులాల్లో విద్యార్థులకు కామన్ డైట్ ప్లాన్ ప్రారంభంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ..‘గురుకులాల్లో విద్యార్థులకు సరికొత్త డైట్ ప్లాన్ ఇస్తున్నాం. హాస్టల్స్, గురుకులాల్లో కామన్ డైట్ ప్లాన్ ప్రారంభమైంది. మెస్ మెనూలో బ్రేక్ ఫాస్ట్, లంచ్, స్నాక్స్, డిన్నర్ ఉంటుంది. వారం రోజుల్లో ఐదు రోజులు కోడిగుడ్డు పెట్టాలని నిర్ణయించాం.తెలంగాణలో 26వేల ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. గురుకులాల్లో మార్పు తీసుకొస్తున్నాం. రెసిడెన్షియల్ స్కూల్స్లో విద్యా ప్రమాణాలను పెంచుతాం. ప్రైవేటు పాఠశాలల్లో చదివితేనే రాణిస్తారనే అపోహ ఉండేది. రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే మల్టీ టాలెంటెడ్. 26వేల ప్రభుత్వ పాఠశాలల్లో 11 లక్షల మంది చదువుతుంటే.. తక్కువున్న ప్రైవేటు స్కూల్స్ 33 లక్షల మంది ఎందుకు చదువుతున్నారు?. మల్టీ టాలెంటెడ్ స్టూడెంట్స్ ప్రభుత్వ స్కూల్స్ నుంచి ఎందుకు రావడం లేదు?. ఇలా ఎందుకు జరుగుతుందో ప్రభుత్వ టీచర్లు ఆలోచించాలి. చదువుపై పెట్టే పెట్టుబడి భవిష్యత్పై పెట్టేదే.గురుకులాలు, హాస్టల్స్లో విద్యార్థులు చనిపోతే బాధ్యత ఎవరిది?. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలి. గురుకులాల బాట కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. ప్రతీనెలా పదో తేదీలోపు డైట్ ఛార్జీలు చెల్లిస్తాం’ అంటూ కామెంట్స్ చేశారు. -
విద్యార్థుల ఆహారంపై నిర్లక్ష్యం చేస్తే వేటే: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్ల విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్తో వరుసగా అస్వస్థతకు గురవుతున్న అంశంపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సీరియస్ అయ్యారు. పలుమార్లు హెచ్చరించినా ఇలాంటి ఘటనలు జరగడాన్ని తీవ్రంగా పరిగణించారు. విద్యార్థులను కన్నబిడ్డల్లా చూసుకోవాలని, వారికి అందించే ఆహారం విషయంలో ఏమాత్రం ఏమరుపాటుగా ఉండవద్దని స్పష్టం చేశారు. ఏమాత్రం నిర్లక్ష్యం ఉన్నట్లు తేలినా సదరు అధికారులు, సిబ్బందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. ఈ మేరకు గురువారం ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. తరచూ తనిఖీలు చేయండి ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు పరిశుభ్ర వాతావరణంలో పౌష్టికాహారం అందించే విషయంలో ఎటువంటి అలక్ష్యానికి తావు ఇవ్వొద్దని కలెక్టర్లను సీఎం రేవంత్ ఆదేశించారు. ఫుడ్ పాయిజనింగ్ ఘటనలపై ఇదివరకే పలుమార్లు సమీక్షించానని గుర్తు చేశారు. పలుమార్లు ఆదేశాలు ఇచ్చినా పొరపాట్లు చోటుచేసుకుంటుండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్లు తరచూ పాఠశాలలు, వసతి గృహాలు, గురుకుల పాఠశాలలను తనిఖీ చేయాలని.. ఈ మేరకు నివేదికలను సమర్పించాలని ఆదేశించారు. విద్యార్థులకు ఆహారం అందించే విషయంలో ఉదాసీనంగా వ్యవహరించే అధికారులు, సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అప్రతిష్టపాలు చేసేందుకు కొందరి యత్నాలు విద్యార్థులకు మంచి విద్య అందించాలనే ఉద్దేశంతో వేల సంఖ్యలో ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టామని.. పౌష్టికాహారం అందించేందుకు డైట్ చార్జీలు పెంచామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తాము ఇలా సానుకూల నిర్ణయాలు తీసుకుంటున్నా.. కొందరు ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అటువంటి శక్తుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని, బాధ్యులైన వారిని చట్టప్రకారం శిక్షిస్తామని ప్రకటించారు. వసతి గృహాల్లో ఆహారం విషయంలో కొందరు ఉద్దేశపూర్వకంగా వదంతులు సృష్టిస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల్లో భయాందోళన సృష్టిస్తున్నారని మండిపడ్డారు. అలాంటి వారిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. -
నాయుడుపేట గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్
-
Gurukul Jobs: పూర్తిస్థాయి పీజీటీ, ఆర్ట్ టీచర్ నోటిఫికేషన్లు విడుదల
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యాసంస్థల్లో ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తిస్థాయి ప్రకటనలను తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు (టీఆర్ఈఐఆర్బీ) ఒక్కొక్కటిగా విడుదల చేస్తోంది. ఈ నెల 5న టీఆర్ఈఐఆర్బీ 9,231 ఉద్యోగాల భర్తీకి ఒకేసారి 9 నోటిఫికేషన్లు జారీ చేసింది. పూర్తిస్థాయి నోటిఫికేషన్లను దరఖాస్తు సమయంలో అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొంది. ఇందులో భాగంగా ఈ నెల 17న జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్, లైబ్రేరియన్ కొలువులకు సంబంధించిన రెండు ప్రకటనలను విడుదల చేయగా... తాజాగా పోస్ట్గ్రాడ్యుయేషన్ టీచర్ (పీజీటీ), ఆర్ట్ టీచర్ కొలువులకు సంబంధించిన పూర్తిస్థాయి నోటి ఫికేషన్లు జారీ చేసింది. ప్రస్తుతం ఈ ప్రక టనలన్నీ గురుకుల నియామకాల బోర్డు వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. మరో 5 ప్రకటనలకు సంబంధించిన పూర్తిస్థాయి నోటిఫికేషన్లు ఈ నెల 24న వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు గురుకుల బోర్డు అధికారులు చెబుతున్నారు. 1,276 పీజీటీ పోస్టులు... గురుకుల పాఠశాలల్లో పోస్ట్గ్రాడ్యుయేషన్ టీచర్ పోస్టులు 1,276 ఉన్నాయి. ఇందులో అత్యధికం మహిళలకే రిజర్వ్ కావడం గమనార్హం. బాలికల విద్యాసంస్థల్లో ఉద్యోగాలు వంద శాతం మహిళలకే కేటాయించడంతోపాటు బాలుర విద్యాసంస్థల్లో 33 శాతం పోస్టులను మహిళలకు కేటాయించారు. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా ఈ మేరకు పోస్టుల కేటాయింపులు జరిగాయి. ఈ క్రమంలో 966 పీజీటీ పోస్టులు మహిళలకు రిజర్వ్ కాగా... జనరల్ కేటగిరీలో 310 పోస్టులు వచ్చాయి. పీజీటీలోని మొత్తం పోస్టుల్లో మహిళలకు 75.70 శాతం ఉద్యోగాలు, జనరల్ కేటగిరీలో 24.30 శాతం రిజర్వ్ అయ్యాయి. ఆర్ట్ టీచర్ పోస్టులు 132 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల సొసైటీల పరిధిలో ఆర్ట్ టీచర్ కేటగిరీలో 132 పోస్టుల భర్తీకి గురుకుల నియామకాల బోర్డు ప్రకటన జారీ చేసింది. ఇందులో మహిళలకు 112 పోస్టులు రిజర్వ్ కాగా... జనరల్ కేటగిరీలో 20 పోస్టులు ఉన్నాయి. మోత్తం పోస్టుల్లో మహిళలకు 84.85 శాతం కేటాయింపు కాగా జనరల్ కేటగిరీలో 15.15 శాతం పోస్టులు లభించాయి. -
Telangana: కొత్త గురుకులాలు షురూ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన బీసీ గురుకుల విద్యా సంస్థలు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. 2022–23 విద్యా సంవత్సరానికి గాను ప్రతి జిల్లాకు ఒక బీసీ గురుకుల పాఠశాల, ఉమ్మడి జిల్లా కేంద్రాలతోపాటు డిమాండ్ ఉన్న మరో ఐదు పట్టణ ప్రాంతాల్లో డిగ్రీ కాలేజీలను ప్రభుత్వం మంజూరు చేసింది. యుద్ధప్రాతిపదికన ఈ విద్యా సంస్థలను ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించడంతో బీసీ గురుకుల సొసైటీ ఆగమేఘాల మీద ఏర్పాట్లు చేసింది. అన్ని జిల్లా కేంద్రాల్లో శుక్రవారం బీసీ గురుకుల పాఠశాలలను ప్రారంభించేందుకు సొసైటీ చర్యలు పూర్తి చేసింది. కొత్తగా ప్రారంభించే గురుకుల పాఠశాలల్లో ఈ ఏడాది 5,6,7 తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ తరగతుల్లో ఇప్పటికే అడ్మిషన్లు పూర్తి చేయగా, విద్యార్థులు సైతం రిపోర్టు చేశారు. దీంతో స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు, సంబంధిత అధికారుల ఆధ్వర్యంలో కొత్త గురుకుల పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 295 గురుకుల పాఠశాలలు ఇప్పటివరకు రాష్ట్రంలో 262 గురుకుల పాఠశాలలున్నాయి. క్షేత్రస్థాయిలో బీసీ గురుకులాలకు డిమాండ్ విపరీతంగా ఉండడం... ప్రతి సంవత్సరం అడ్మిషన్లు పూర్తిగా నిండుతుండగా... మరింత మంది ఆశావహులు సొసైటీ కార్యాలయం చుట్టూ తిరుగుతుండడంతో కొత్తగా 33 గురుకుల పాఠశాలలను ప్రభుత్వం మంజూరు చేసింది. దీంతో బీసీ గురుకుల పాఠశాలల సంఖ్య 295కు చేరి అత్యధిక విద్యా సంస్థలతో అతి పెద్ద సొసైటీగా నిలిచింది. వచ్చే వారం నుంచి డిగ్రీ కాలేజీలు షురూ... రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లా కేంద్రాలతో పాటు మరో ఐదు పట్టణ ప్రాంతాల్లో 15 డిగ్రీ కాలేజీలను ప్రభుత్వం మంజూరు చేసింది. రాష్ట్రంలో ఇప్పటివరకు ఒకే ఒక్క బీసీ గురుకుల డిగ్రీ కాలేజీ ఉండగా... ఇప్పుడు వాటి సంఖ్య 16కు చేరనుంది. కొత్తగా ప్రారంభించనున్న డిగ్రీ కాలేజీలకు భవనాలను గుర్తించిన అధికారులు మిగతా ఏర్పాట్లలో బిజీ అయ్యారు. ప్రస్తుతం డిగ్రీ కాలేజీల్లో ప్రత్యేకాధికారులుగా పదవీ విరమణ పొందిన కాలేజీ ప్రిన్స్పాళ్లు, సీనియర్ లెక్చరర్లను ఎంపిక చేసింది. మరోవైపు బోధన సిబ్బందిని గెస్ట్ ఫ్యాకల్టీ పద్ధతిలో ఎంపిక చేస్తోంది.అడ్మిషన్లకు సంబంధించి ఈనెల 15వ తేదీతో దరఖాస్తు గడువు పూర్తి కానుంది. వచ్చే వారంలో అడ్మిషన్లు పూర్తి చేసిన వెంటనే తరగతులు ప్రారంభిస్తామని బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి మల్లయ్యబట్టు ‘సాక్షి’కి వెల్లడించారు. -
తల్లిదండ్రులుంటేనే పిల్లలు ఇంటికి!
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ గురుకులాల్లో దసరా సెలవుల హడావుడి ప్రారంభమైంది. ఈనెల 25 నుంచి వచ్చే నెల 9 వరకు విద్యార్థులకు దసరా సెలవులు ప్రకటించారు. దీంతో పిల్లలంతా వారి తల్లిదండ్రులతో గడిపేందుకు సిద్ధమవుతున్నారు. అయితే విద్యార్థులను ఇళ్లకు పంపించేందుకు గురుకుల సొసైటీలు కొన్ని షరతులు విధించాయి. విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ గురుకుల సొసైటీలు.. ప్రిన్సిపాళ్లకు పలు సూచనలు, హెచ్చరికలు జారీ చేశాయి. పిల్లలను గురుకులం నుంచి ఇంటికి పంపాలంటే తప్పకుండా ఆ విద్యార్థి తల్లి లేదా తండ్రి లేకుంటే సంరక్షకుడు తప్పకుండా రావాల్సి ఉంటుంది. అలా వస్తేనే విద్యార్థులను ఇంటికి అనుమతించాలని గురుకుల సొసైటీలు నిర్ణయం తీసుకున్నాయి. స్నేహితులు, తోబుట్టువులు, ఇతర పరిచయస్తులతో పిల్లలను ఇంటికి అనుమతించవద్దని తేల్చిచెప్పాయి. ప్రిన్సిపాళ్లదే బాధ్యత.. విద్యార్థులను తల్లిదండ్రులు లేదా సంరక్షకులకు కాకుండా ఇతరులకు అప్పగిస్తే తలెత్తే పరిణామాలకు ప్రిన్సిపాళ్లే బాధ్యత వహించాల్సి వస్తుందని సొసైటీ కార్యదర్శులు స్పష్టం చేశారు. బాలికల విషయంలో మరింత కఠినంగా నిబంధనలు పాటించాలని సూచించారు. పిల్లలను అప్పజెప్పే సమయంలో తల్లిదండ్రులు/సంరక్షకులు వచ్చినప్పటికీ వారు సరైన వ్యక్తులేనా అనే విషయాన్ని ధ్రువీకరించుకుని రిజిస్టర్లో ఎంట్రీ చేయాలని స్పష్టం చేశారు. దీంతో పిల్లల అప్పగింతకు కాస్త సమయం పట్టే అవకాశం ఉంటుందని చెపుతున్నారు. తల్లిదండ్రులు సైతం కాస్త ఓర్పుతో ఉండాలని ప్రిన్సిపాళ్లు చెబుతున్నారు. తల్లిదండ్రులకు పిల్లలను అప్పగించే సమయంలో విద్యార్థి చదువు గురించి సైతం వివరించాలని స్పష్టం చేయడంతో టీచర్లు ప్రోగ్రెస్ కార్డులను సిద్ధం చేసుకుంటున్నారు. కాగా, సెలవుల అనంతరం కూడా విద్యార్థులు తిరిగి వచ్చే సమయంలో వివరాలను పరిశీలించి నిర్ధారించుకోవాలని, వెంట తెచ్చుకున్న సరుకులు, సామగ్రిని పూర్తిగా పరిశీలించిన తర్వాతే అనుమతించాలని సొసైటీ కార్యదర్శులు క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. -
ప్రభుత్వ హాస్టళ్లకు ఇంటర్నెట్ సదుపాయం తప్పనిసరి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ వసతి గృహాల్లో నాడు–నేడుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గురుకుల పాఠశాలలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ హాస్టళ్ల పర్యవేక్షణపై సీఎం ఆదేశాలు జారీ చేశారు. గురుకుల పాఠశాలల్లో అకడమిక్ వ్యవహారాల పర్యవేక్షణ స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలోకి తీసుకురావాలన్నారు. మండలాల్లో అకడమిక్ వ్యవహారాలు చూస్తున్న ఎంఈఓకు సంబంధిత మండలంలోని గురుకుల పాఠశాలల అకడమిక్ బాధ్యతలను అప్పగించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. ►గురుకుల పాఠశాలలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ హాస్టళ్ల నిర్వహణపై పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలి. ►మండలాల్లో ఇద్దరు ఎంఈఓల నియామకం ద్వారా ఎలా పర్యవేక్షణ చేస్తున్నామో ఆ తరహాలోనే ఇక్కడ కూడా పర్యవేక్షణ జరగాలి. ►దీనికోసం ఎస్ఓపీలు రూపొందించాలి. ►పర్యవేక్షణకోసం ప్రత్యేక యాప్కూడా రూపొందించాలి. ►మౌలిక సదుపాయాలు, భోజనం నాణ్యత, నిర్వహణ తదితర అంశాలపై క్రమం తప్పకుండా పర్యవేక్షణ చేయాలి. ►గురుకుల పాఠశాలలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వెల్ఫేర్ హాస్టళ్లపై ఈ అధికారులతో పర్యవేక్షణ చేయాలి. ►పర్యవేక్షణ వరకూ వీటిని ఇంటిగ్రేట్ చేయాలి. ►ఒక్కో అధికారికి ప్రత్యేక పరిధిని నిర్ణయించి పర్యవేక్షణ చేయించాలి. ►మండలాల్లో స్కూళ్ల నిర్వహణ, పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా నియమిస్తున్న రెండో ఎంఈవోకు కూడా విధివిధానాలు ఖరారుచేయాలి. ►గురుకుల పాఠశాలలు, వసతి గృహాల్లో నాడు – నేడు కింద చేపట్టనున్న పనులపై ప్రతిపాదనలు వివరించిన అధికారులు. ►టాయిలెట్లు, విద్యుద్దీకరణ, ఫ్యాన్లు, లైట్లు, తాగునీరు, పెయింటింగ్, మరమ్మతులు, ప్రహరీ గోడలు, మస్కిటో ఫ్రూఫింగ్ పనులు. ►సిబ్బందికి, విద్యార్థులకు ఫర్నిచర్ కల్పనలో భాగంగా డెస్క్లు, బంకర్ బెడ్స్, స్టడీ టేబుల్స్, ఛైర్లు, ఆఫీసు టేబుళ్లు, లైబ్రరీ రాక్స్, షూ రాక్స్, డైనింగ్ టేబుల్, గార్బేజ్ బిన్స్. ►కిచెన్ ఆధునీకరణలో భాగంగా స్టోరేజీ రాక్స్, గ్యాస్ స్టౌవ్స్, గ్రైండర్, పూరి మేకింగ్ మెషీన్, ప్రెషర్ కుక్కర్, ఇడ్లీ కుక్కర్, చిమ్నీ, కుకింగ్ వెసల్స్, డస్ట్ బిన్స్. ► 55 ఇంచీల స్మార్ట్ టీవీతో పాటు క్రీడాసామగ్రి, మరియు లైబ్రరీ బుక్స్ ఏర్పాటుకోసం ప్రతిపాదనలు తయారుచేశామన్న అధికారులు. ►గురుకుల పాఠశాలల్లో మూడు విడతలుగా నాడు – నేడు పనులు చేయాలని సీఎం ఆదేశం. ►2 విడతలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టళ్లలో నాడు –నేడు. ►పారిశుద్ధ్యం, పరిశుభ్రతలపైనా దృష్టిపెట్టాలన్న సీఎం. ►డ్రైనేజీని లింక్ చేయడంపైనా దృష్టిపెట్టాలన్న సీఎం. ►హాస్టల్ పిల్లలకు ఇచ్చే కాస్మోటిక్స్ సహా వస్తువులన్నీ నాణ్యతతో ఉండాలన్న సీఎం. ►విద్యాకానుకతో పాటు వీటిని కూడా అందించడానికి చర్యలు తీసుకోవాలన్న సీఎం. ►అన్ని ప్రభుత్వ వసతి గృహాల్లో భోజనంలో నాణ్యత పెంచాలని సీఎం ఆదేశాలు. ►ప్రతిరోజూ ఒక మెనూ ఇవ్వాలి. ►ఈమేరకు ప్రతిపాదనలు తయారుచేసి ఇవ్వాలి. ►గురుకుల పాఠశాలలు, ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టళ్లలో దాదాపు 6 లక్షల మంది విద్యార్థులు. ►ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థులకు పెట్టే భోజనం అత్యంత నాణ్యతతో ఉండాలని స్పష్టంచేశారు. ►హాస్టళ్లలో టాయిలెట్ల నిర్వహణ, అలాగే మౌలిక సదుపాయాల నిర్వహణ బాగుండాలి. ►హాస్టళ్లకు తప్పనిసరిగా ఇంటర్నెట్ సదుపాయం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ►క్రమం తప్పకుండా వైద్యులు హాస్టళ్లకు వెళ్లి, విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులపై పర్యవేక్షణ చేయాలి. ►ఈ పర్యవేక్షణకు ప్రత్యేక యాప్ను కూడా తయారుచేస్తున్నట్టు వెల్లడించిన అధికారులు. ►విలేజ్క్లినిక్స్, స్థానిక పీహెచ్సీలతో ప్రభుత్వ హాస్టళ్లను మ్యాపింగ్ చేయాలి. ►హాస్టళ్ల నిర్వహణలో ఖాళీలను కూడా గుర్తించి, భర్తీచేయాలి. ►పై నిర్ణయాలకు సంబంధించి కార్యాచరణ సిద్ధంచేసి తనకు నివేదించాలని ఆధికారులకు సీఎం ఆదేశం. ఈ సమీక్షా సమావేశానికి ఉపముఖ్యమంత్రి (గిరిజన సంక్షేమశాఖ) పీడిక రాజన్నదొర, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున, బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, సీఎస్ సమీర్ శర్మ, ఆర్ధికశాఖ స్పెషల్ సీఎస్ ఎస్ ఎస్ రావత్, పాఠశాల విద్యాశాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, సాంఘిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
గాడి తప్పిన గురుకులం! ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలనలో బయటపడిన వాస్తవాలు
జ్వరంతో బాధపడుతున్న ఈ విద్యార్థి పేరు విజయ్కుమార్. ఆసిఫాబాద్లోని జ్యోతిబాపూలే బాలుర గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నా ఆస్పత్రికి తీసుకెళ్లలేదని.. హాస్టల్లోనే ట్యాబ్లెట్లు ఇస్తున్నారని చెబుతున్నాడు. తనతోపాటు మరో నలుగురూ జ్వరంతో బాధపడుతున్నారని అంటున్నాడు. ఇలా పిల్లలు అనారోగ్యంతో బాధపడుతున్నా.. ఈ హాస్టల్లో ఏఎన్ఎంలు దిక్కులేరు. రాత్రిపూట తరగతి గదుల్లోనే నిద్రిస్తున్నామని.. మరుగుదొడ్లకు సెప్టిక్ ట్యాంక్ లేక పక్కనే ఉన్న మురికికాల్వ దుర్గంధం వెదజల్లుతోందని విద్యార్థులు వాపోతున్నారు. మెదక్ జిల్లా కొల్చారం సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో కిక్కిరిసి ఉన్న మెస్ గది ఇది. ఇందులో 640 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇదే పాఠశాల భవనంలో ఉన్న మెదక్ డిగ్రీ బాలికల గురుకుల కళాశాలలో మరో 840 మంది విద్యార్థులు ఉన్నారు. దీంతో కిక్కిరిసిపోయిన పరిస్థితి. గురుకుల పాఠశాల విద్యార్థులు తరగతి గదిలోనే బస చేయాల్సి వస్తోంది. విద్యార్థినులు కాలకృత్యాలు తీర్చుకోవడానికి, భోజనానికి లైన్లలో వేచి ఉండాల్సిన దుస్థితి నెలకొంది. సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్ర ప్రభుత్వం గొప్ప లక్ష్యంతో ఏర్పాటు చేసిన సంక్షేమ గురుకులాలు గాడి తప్పాయి. నిర్వహణ లోపంతో కొట్టుమిట్టాడుతున్నాయి. సదుపాయాలు సరిగా లేకపోవడం, సిబ్బంది నిర్లక్ష్యంతో విద్యార్థులు తీవ్రంగా అవస్థలు పడుతున్నారు. పారిశుధ్యలోపం కారణంగా అనారోగ్యాల పాలవుతున్నారు. ఇప్పటికే చాలా గురుకులాల్లో పదుల సంఖ్యలో విద్యార్థులు అనారోగ్యం కారణంగా ఇళ్లకు వెళ్లిపోయినట్టు తెలిసింది. మరోవైపు కొన్నిరోజులుగా రాష్ట్రవ్యాప్తంగా చాలా గురుకులాల్లో విద్యార్థులు అనారోగ్యాల బారినపడుతున్నారు. ఈ నేపథ్యంలో గురుకులాల్లో పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించి ‘సాక్షి’అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినా.. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు మెరుగైన భోజన వసతులు అందించేందుకు 267 ఎస్సీ, 162 ఎస్టీ, 292 బీసీ, 206 మైనారిటీ, 35 విద్యాశాఖ గురుకులాలను ఏర్పాటు చేసింది. ఒక్కో గురుకులంలో 480 మంది చొప్పున.. మొత్తం 4,61,760 మంది విద్యార్థులు చదువుతున్నారు. మొదట్లో గురుకులాలు బాగానే సాగినా తర్వాత గాడితప్పాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చాలా చోట్ల విద్యార్థుల హాస్టళ్లలో పరిస్థితి దారుణంగా ఉంటోంది. పరిశుభ్రత మచ్చుకైనా కానరావడం లేదని.. అధికారులు, సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఏ గురుకులంలో చూసినా ఇదే దుస్థితి ►నల్లగొండ ఎస్ఎల్బీసీలోని అనుముల ఎస్సీ బాలుర గురుకులంలో 480 మంది ఉన్నారు. వారిలో చాలా మంది జ్వరాల బారినపడి ఇళ్లకు వెళ్లినట్టు తోటి విద్యార్థులు చెబుతున్నారు. అన్నం ముద్దగా ఉంటోందని, పురుగులు వస్తున్నాయని, నీళ్ల చారు, పలుచని మజ్జిగతో భోజనం పెడుతున్నారని వాపోతున్నారు. ఉదయం పెట్టే ఉప్మాలోనూ పురుగులు వస్తున్నాయని అంటున్నారు. హాస్టల్ పక్కన రేకుల షెడ్డు కింద అంతా భోజనం చేస్తున్నామని.. చీకట్లో వడ్డిస్తుండటంతో దోమలు, పురుగులు పడుతున్నాయని వాపోతున్నారు. ►నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల ప్రస్తుతం అద్దె భవనంలో కొనసాగుతోంది. అందులోనే హాస్టల్ కూడా నిర్వహిస్తున్నారు. ఇందులో 482 మంది బాలికలు ఉన్నారు. భవనం పక్కన రేకుల షెడ్డులో కిచెన్, భోజనశాల ఉన్నాయి. మెస్ హాల్ పక్కనే మురికి కాల్వ ఉంది. దుర్వాసన, దోమల బెడదతో విద్యార్థినులు తరచూ రోగాల పాలవుతున్నారు. సమీపంలో పొలాలు ఉండటం, ప్రహరీ లేకపోవడంతో విష పురుగులు, పందులు హాస్టల్లోకి వస్తున్నాయి. ►ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గురుకులాలు అరకొర వసతులతో కొనసాగుతున్నాయి. జిల్లాలోని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో గతంలో పార్ట్టైం ఏఎన్ఎంలు పనిచేసేవారు. గిరిజనశాఖ ఇటీవల వారిని తొలగించడంతో విద్యార్థులకు జ్వరమొస్తే చూసే దిక్కులేకుండా పోయింది. సరైన భోజనం పెట్టకపోవడం, అపరిశుభ్రత కారణంగా అనారోగ్యం బారినపడుతున్నామని పలు పాఠశాలల్లోని విద్యార్థినులు వాపోతున్నారు. ►కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణ శివారులోని బోర్నపల్లిలో ఉన్న మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాల చుట్టూ చెట్లు, పొదలతో అపరిశుభ్రంగా ఉంది. మరుగుదొడ్ల వద్ద విద్యుద్దీపాలు లేకపోవడంతో రాత్రిపూట విద్యార్థులు భయపడుతున్నారు. ►రాష్ట్రవ్యాప్తంగా గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారన్న వార్తలు వస్తుండటంతో.. ఆందోళనకు గురైన పలువురు తల్లిదండ్రులు కరీ ంనగర్ పట్టణ శివార్లలోని బొమ్మకల్ జ్యోతిబాపూలే బాలుర గురుకుల పాఠశాలకు వచ్చారు. కొందరు విద్యార్థుల ఆరోగ్యాన్ని వాకబు చేసి వెళ్లగా.. మరికొందరు తమ పిల్లలను ఇళ్లకు తీసుకెళ్లడం కనిపించింది. ►జనగామ జిల్లా జఫర్గఢ్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకులంలో డ్రైనేజీ నీరు పాఠశాల ఆవరణలోనే నిలుస్తోంది. తాగునీటి పైపులైన్లు కూడా లీకవుతున్నాయి. ►మహబూబ్నగర్ జిల్లా గండేడ్ మండలంలోని గిరిజన సంక్షేమ మినీ గురుకుల పాఠశాల విద్యార్థులు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. హాస్టల్లోని బాత్రూం, మరుగుదొడ్లకు తలుపులు సరిగా లేవని వాపోతున్నారు. తరగతి గదుల్లో ఐదు ఫ్యాన్లు ఉంటే నాలుగు పనిచేయడం లేదని.. దోమల బెడద ఎక్కువైందని అంటున్నారు. హాస్టల్ చుట్టూ పొదలు పెరిగాయని, ఇప్పటికే మూడుసార్లు హాస్టల్లోకి పాములు వచ్చాయని విద్యార్థులు చెబుతున్నారు. మహబూబ్నగర్ జిల్లా గండీడ్ జ్యోతిబాపూలే గురుకుల హాస్టల్లో డోర్లు సరిగ్గా లేని మరుగుదొడ్లు. భయంతో అడ్మిషన్ రద్దు చేసుకుని తీసుకెళ్తున్నా.. మా కొడుకు సిద్ధార్థను బొమ్మకల్ గురుకుల పాఠశాలలో సీఈసీ మొదటి సంవత్సరంలో చేర్పించాను. కానీ ఇక్కడ వసతులు సరిగా లేవని, భోజనం మంచిగా లేదని మా కొడుకు ఫోన్ చేసి చెప్పడంతో అడ్మిషన్ రద్దు చేసుకొని తీసుకెళ్తున్నాను. ప్రైవేట్ కాలేజీలో చేర్పించి చదివిస్తాను. – గంగాచారి, విద్యార్థి తండ్రి, కరీంనగర్ -
గురుకుల సీటు... వెరీ హాటు..!
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యా సంస్థల్లో అడ్మిషన్లకు డిమాండ్ ఏమాత్రం తగ్గడం లేదు. పూర్తిస్థాయిలో అడ్మిషన్లు చేపట్టినట్లు సొసైటీలు ప్రకటిస్తున్నా... ‘ఒక్క సీటు’ కావాలంటూ ప్రవేశాల కోసం విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కార్యాలయాలు కిక్కిరిసి పోతున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల పరిధిలోని గురుకుల సొసైటీ పాఠశాలల్లో ఐదోతరగతిలో నూతన అడ్మిషన్ల ప్రక్రియ, బ్యాక్లాగ్ ఖాళీ సీట్ల భర్తీ ప్రక్రియ దాదాపు పూర్తయినట్లు ఆయా సొసైటీలు బహిరంగంగా ప్రకటించాయి. అర్హత పరీక్షల ద్వారా విద్యార్థి సామర్థ్యాన్ని గుర్తించి మెరిట్ ప్రకారం గురుకుల సొసైటీలు అడ్మిషన్లు చేపట్టాయి. కౌన్సెలింగ్ నిర్వహించి అడ్మిషన్లు చేపట్టాయి. అడ్మిషన్లు పూర్తయ్యాయని, సీట్లు లేవని బోర్డులు ఏర్పాటు చేసినప్పటికీ సీట్లు కావాలంటూ విద్యార్థులు, తల్లిదండ్రులు సొసైటీ కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఫిజికల్ రిపోర్టింగే మిగిలింది... రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ గురుకుల సొసైటీలు, విద్యాశాఖకు చెందిన జనరల్ గురుకుల సొసైటీల పరిధిలో 750 గురుకుల పాఠశాలలున్నాయి. వీటిలో ప్రతి సంవత్సరం ఐదో తరగతిలో దాదాపు 50 వేల మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తారు. నాల్గోతరగతి చదివే విద్యార్థులకు రాత పరీక్ష నిర్వహించి, మార్కుల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. రిజర్వేషన్లకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఆన్లైన్ పద్ధతిలో ప్రక్రియ పూర్తి చేస్తారు. 2022–23 విద్యా సంవత్సరంలో ఇదే తరహాలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ, తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ, మహాత్మా జ్యోతిభాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ, తెలంగాణ గురుకుల విద్యా సంస్థల సొసైటీలు ఉమ్మడిగా అర్హత పరీక్ష నిర్వహించాయి. దాదాపు 1.6 లక్షల మంది విద్యార్థులు ఈ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోగా.. ఒక్కో సీటుకు సగటున ముగ్గురు పోటీపడ్డారు. పరీక్ష అనంతరం మెరిట్ ఆధారంగా సొసైటీలు సీట్లు కేటాయించారు. మైనార్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ ప్రత్యేకంగా అర్హత పరీక్ష నిర్వహించి ఆమేరకు అడ్మిషన్లు చేపట్టింది. 6, 7, 8, 9 తరగతుల్లోని బ్యాక్లాగ్ సీట్ల భర్తీకి సైతం సొసైటీల వారీగా పరీక్షలు నిర్వహించారు. అర్హులైన విద్యార్థులకు సీట్లు కేటాయించారు. అన్ని గురుకుల సొసైటీల్లో సీట్ల కేటాయింపులు పూర్తయ్యాయి. ఈ వారాంతంలోగా పాఠశాలల్లో ఆయా విద్యార్థులు ఫిజికల్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. దీంతో ప్రవేశాల ప్రక్రియ దాదాపు ముగిసినట్లే. సీట్లు లేవు... దయచేసి రావొద్దు... ఐదు గురుకుల సొసైటీల పరిధిలో సీట్ల కేటాయింపులు పూర్తయినప్పటికీ విద్యార్థులు, తల్లిదండ్రులు అడ్మిషన్ల కోసం గురుకుల సొసైటీ కార్యదర్శి కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. దీంతో సీట్లు లేవంటూ సొసైటీలు ఇప్పటికే ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశాయి. గిరిజన గురుకుల సొసైటీ, జనరల్ గురుకుల సొసైటీలు కార్యాలయాల వద్ద సూచనలు చేస్తూ పోస్టర్లు అంటించాయి. అయినప్పటికీ సీట్ల కోసం దూరప్రాంతాల నుంచి వచ్చే వారి సంఖ్య తగ్గడం లేదు. సీట్ల కోసం వచ్చే వారిని కార్యాలయాల్లోకి అనుమతించకుండా, వారిని నిలువరించేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేశారు. -
సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలలపై సీఎం జగన్ సమీక్ష
-
పిల్లల భవిష్యత్తే మనకు ముఖ్యం.. అధికారులతో సీఎం జగన్
సాక్షి, అమరావతి: సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. సంక్షేమ హాస్టళ్లకు కొత్తరూపు, సమగ్ర కార్యాచరణకు సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. ఏడాదిలోగా అన్నిరకాల హాస్టళ్లలో నాడు-నేడు కింద పనులు చేపట్టాలన్నారు. స్కూళ్ల నిర్వహణ నిధిలానే హాస్టళ్ల నిర్వహణకూ నిధి ఏర్పాటు చేయాలన్న సీఎం.. హాస్టళ్లలో వైద్యుల సందర్శన తప్పనిసరి అన్నారు. హాస్టళ్ల నిర్వహణా ఖర్చులు, డైట్ ఛార్జీలను పెంచాలని, ప్రతిపాదనలు తయారు చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులపాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు, నాడు–నేడుపై క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ నేతృత్వంలో విస్తృత సమీక్ష జరిగింది. ఈ సమీక్షలో.. ► ఏడాదిలోగా అన్ని గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో నాడు–నేడు కింద అభివృద్ధి పనులు పూర్తి చేయాలి. ► ఏళ్ల తరబడి నిర్లక్ష్యానికి గురైన గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో సమూల మార్పులు చేపట్టాలి. ► స్కూళ్ల నిర్వహణా నిధి తరహాలోనే హస్టళ్ల నిర్వహణకూ నిధి ఏర్పాటు ► ఫ్యామిలీ డాక్టర్ కాన్సెఫ్ట్ కిందకు హాస్టళ్లు, గురుకులాలు ► గురుకులాలు, వసతి గృహాల నిర్వహణా ఖర్చులు, డైట్ ఛార్జీలను పెంచాలని.. సీఎం జగన్ ఆదేశించారు. ఇంకా సీఎం జగన్ ఏమన్నారంటే.. ► బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వెల్ఫేర్ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్ల ఎలా ఉన్నాయన్నదానిపై పరిశీలన స్వయంగా నేనే చేయించాను. ► మనం చేయాల్సింది చాలా ఉంది. దీనిపై ఒక కార్యాచరణ ఉండాలి. ► ఈ ఏడాది మొత్తం అన్ని గురుకులాలు, హాస్టళ్లను నాడు – నేడు కింద యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి చేయాలి. ఈ పనులు మీవి అనుకుని పనిచేయాలి. ► ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ పరిధిలో నాడు – నేడు కింద తొలిదశలో స్కూళ్లను అభివృద్ధి చేశాం. ► మొదటి దశలో చేసిన స్కూళ్లకు సంబంధించి అదనపు తరగతి గదులు నిర్మించే పనికూడా జరుగుతోంది. ► సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలను కూడా ఇదే తరహాలో అభివృద్ధి చేయాలి. ► దశాబ్దాలుగా సంక్షేమ హాస్టళ్లను, గురుకులాలను పట్టించుకునే నాథుడు లేడు. వీటిని ఎవ్వరూ కూడా పట్టించుకునే పాపానపోలేదు. అధికారులుగా వీటి అభివృద్ధి పనుల్లో మీ ముద్ర కనిపించాలి. ► అభివృద్ధి పనులు చేశాక.. వీటి నిర్వహణకూడా బాగా చేసేలా దృష్టిపెట్టాలి. దీనిమీద ప్రత్యేక కార్యాచరణ కూడా సిద్ధంచేయాలి. దీనికోసం ఒక వ్యవస్థ ఉండాలి. సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల సమగ్రాభివృద్ధి... సీఎం జగన్ ► హాస్టళ్ల నిర్వహణకోసం ఇప్పుడున్న మొత్తాన్ని పెంచండి. ► పిల్లలకు పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించడానికి ఎంత కావాలో నిర్ణయించండి: ► మన పిల్లలు ఇవే హాస్టళ్లలో ఉంటే.. ఎలాంటి వసతులు ఉండాలని కోరుకుంటామో.. అలాంటి వసతులే ఉండాలి. ► పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మానవతా దృక్పథంతో అడుగులు ముందుకేయండి. ► స్కూళ్ల మెయింటెనెన్స్ ఫండ్ మాదిరిగానే హాస్టళ్ల మెయింటెనెన్స్ ఫండ్ను కూడా ఏర్పాటు చేయండి: ► ప్రతి హాస్టల్లోనూ తప్పనిసరిగా వార్డెన్లను నియమించాలి : ► హాస్టళ్లలో ఉండాల్సిన కమాటి, కుక్, వాచ్మెన్ల వంటి ఇతర సిబ్బంది కచ్చితంగా ఉండేట్టుగా చర్యలు తీసుకోండి: ► ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్లో.. వైద్యుడు తప్పనిసరిగా హాస్టల్ విద్యార్థుల బాగోగులపై దృష్టిపెట్టాలి. ► డైట్ ఛార్జీలపై పూర్తిగా పరిశీలన చేయాలి. విద్యార్థులకు మంచి ఆహారాన్ని అందించేలా డైట్ ఛార్జీలను పెంచాలి. సమూలంగా డైట్ ఛార్జీలు పరిశీలించి.. ఆమేరకు ప్రతిపాదనలు సిద్ధంచేయాలి. గత ప్రభుత్వం కేవలం ఎన్నికలకు ముందు డైట్ ఛార్జీలను పెంచింది. అప్పటివరకూ హాస్టల్ విద్యార్థుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. మన ప్రభుత్వం అలాంటిది కాదు అని సీఎం జగన్ అధికారుల వద్ద ప్రస్తావించారు. హాస్టళ్లలో నాడు–నేడు అద్దె ప్రాతిపదికన ఉన్న వసతి గృహాలను వెంటనే పరిశీలన చేయాలన్న సీఎం జగన్.. వాటి నిర్వహణను కూడా చేపట్టాలని అధికారులకు సూచించారు. అంతేకాదు.. అలాంటి చోట్ల నాడు – నేడు కింద శాశ్వత భవనాలను నిర్మించాలని ఆదేశించారు. ఇంకా.. ► వచ్చే ఏడాది అద్దె వసతి గృహాల స్థానంలో శాశ్వత భవనాల నిర్మాణం. ► మరోవైపు ప్రస్తుతం ఉన్న హాస్టళ్లను ఉత్తమ స్థాయిలో తీర్చిదిద్దాలి. ► నాడు–నేడు ద్వారా అభివృద్ధి పనులు చేపట్టాలి. ► ప్రతి పనిలోనూ నాణ్యత తప్పనిసరిగా ఉండాలని సీఎం జగన్ ఆదేశించారు. ► అదనంగా కేజీబీవీలు, మోడల్ స్కూళ్లను కూడా చేర్చాలని.. హాస్టళ్లలో ఉంటున్న పిల్లలు తాము అక్కడ ఉన్నందుకు గర్వంగా భావించేలా ఉండాలని సీఎం జగన్, అధికారులతో చెప్పారు. ► ఏడాది లోగా సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లో నాడు–నేడు పనులు పూర్తి కావాలన్న సీఎం జగన్.. దీనికి సంబంధించిన కార్యాచరణను వెంటనే రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగ నాగార్జున, సీఎస్ సమీర్ శర్మ, ఆర్ధికశాఖ స్పెషల్ సీఎస్ ఎస్ ఎస్ రావత్, బీసీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి బి జయలక్ష్మి, సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శి ఎం ఎం నాయక్, మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శి ఏ.ఎండి. ఇంతియాజ్, గిరిజన సంక్షేమశాఖ డైరెక్టర్ ఎం జాహ్నవి ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
ఎస్సై పరీక్ష.. హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోండి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నేతృత్వంలో జరుగుతున్న సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్సై), తదితర సమాన పోస్టుల ప్రిలిమినరీ రాతపరీక్షకు సంబంధించి అభ్యర్థులు శనివారం నుంచి హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 7, ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు జరిగే పరీక్ష కోసం ఆగస్టు 5వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు హాల్టికెట్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం అందుబాటులో ఉంటుందని ఆయన వెల్లడించారు. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారిక వెబ్సైట్ ద్వారా అభ్యర్థులు వారి ఐడీ, పాస్వర్డ్ ద్వారా లాగిన్ అయి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. డౌన్లోడ్ చేసుకున్న హాల్టికెట్ను ప్రింట్ తీసుకోవాలని ఫొటోతో పాటు సెంటర్ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలని పేర్కొన్నారు. హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని 35 పట్టణ ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు శ్రీనివాసరావు తెలిపారు. ప్రింట్ తీసుకున్న హాల్టికెట్ మొదటి పేజీలో ఎడమ భాగంలో అభ్యర్థులు తమ పాస్పోర్ట్ సైజ్ ఫొటోను అతికించాలని, అలా అతికించిన హాల్టికెట్తో వచ్చిన వారినే పరీక్ష కేంద్రానికి అనుమతిస్తామని స్పష్టంచేశారు. పరీక్ష నిబంధనలు ఏమాత్రం ఉల్లంఘించినా అభ్యర్థి పరీక్ష చెల్లదని హెచ్చరించారు. పరీక్ష పత్రం ఇంగ్లిష్–తెలుగు, ఇంగ్లిష్–ఉర్దూ భాషల్లో అందుబాటులో ఉంటుందని శ్రీనివాసరావు తెలిపారు. 11 నుంచి పీజీ ‘ఎంట్రెన్స్’ ఉస్మానియా యూనివర్సిటీ: రాష్ట్రంలోని వివిధ వర్సిటీల్లో పలు పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఆగస్టు 11 నుంచి 22 వరకు ప్రవేశ పరీక్షలను నిర్వహించనున్నట్లు టీఎస్సీపీగేట్–2022 కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి శుక్రవారం ప్రకటనలో తెలిపారు. ఎంఏ అరబిక్, కన్నడ, మరాఠీ, పర్షియన్, థియేటర్ ఆర్ట్స్ కోర్సులకు సీట్ల సంఖ్య కంటే దరఖాస్తులు తక్కువ వచ్చినందున నేరుగా ప్రవేశాలు కల్పించనున్నట్లు చెప్పారు. టైంటెబుల్, ఇతర వివరాలను ఉస్మానియా.ఏసీ.ఇన్ వెబ్సైట్లో చూడవచ్చు. గెస్ట్ లెక్చరర్ల వేతనం పెంపు సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న అతిథి అధ్యాపకుల వేతనాలను ప్రభుత్వం పెంచింది. దీంతో ఒక్కో అధ్యాకుడికి నెలకు రూ.6,480 అదనంగా లభి స్తుంది. ఈమేరకు ప్రభుత్వ కార్యదర్శి రోనాల్డ్ రోస్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్రంలోని 404 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 1,654 మంది గెస్ట్ లెక్చరర్లు పనిచేస్తున్నారు. వీరికి ఇప్పటి వరకు ఒక్కో పీరియడ్కు రూ.300 చొప్పున, నెలకు 72 పీరియడ్లకు (గ రిష్టంగా) రూ.21,600 వేతనం వచ్చేది. ఇప్పు డు 30% పెంచడంతో పీరియడ్కు రూ.390 చొప్పున 72 పీరియడ్లకు రూ.28,080 రానుంది. ఈ పెంపును ప్రభుత్వ జూనియర్ కాలేజీల గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ నేతలు దామెర ప్రభాకర్, దార్ల భాస్కర్, ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి నేతలు మాచర్ల రామకృష్ణ, కొప్పిశెట్టి సురేశ్, పోలూరి మురళి స్వాగతించారు. గురుకుల ఐదో తరగతి ప్రవేశాల గడువు పొడిగింపు సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతిలో సీట్లు పొందిన విద్యార్థులు ఆగస్టు 1వ తేదీలోగా నిర్దేశించిన పాఠశాలలో రిపోర్టు చేయాలని గురుకుల సెట్ కన్వీనర్ రోనాల్డ్రాస్ శుక్రవా రం ప్రకటనలో కోరారు. ఈనెల 29వ తేదీతో రిపోర్ట్ చేయాలని ముందుగా గడువు విధించినప్పటికీ విద్యార్థులు, తల్లిదండ్రుల వినతులను పరిగణించి గడువు తేదీని ఆగస్టు 1 వరకు పొడిగించినట్లు ఆయన స్పష్టం చేశారు. 31న సబ్ ఇంజనీర్ పోస్టులకు పరీక్ష సాక్షి, హైదరాబాద్: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) లో 201 సబ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి పరీక్షను ఈనెల 31న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించనున్నట్లు ఆ సంస్థ సీఎండీ రఘుమారెడ్డి తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇప్పటికే హాల్టికెట్లు పంపిణీ చేశామని, హాల్టికెట్లు అందని వారు సంస్థ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. నేడు, రేపు అగ్రి ఎంసెట్ సాక్షి, హైదరాబాద్: వర్షాల కారణంగా వాయి దాపడిన మెడికల్, అగ్రికల్చర్ ఎంసెట్ శని, ఆదివారాల్లో జరగనుంది. పరీక్షకు మొత్తం 94 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణలో 68, ఏపీలో 18.. మొత్తం 86 పరీక్ష కేంద్రాలను ఎంసెట్ కోసం ఏర్పాటు చేశారు. ఈ పరీక్ష రోజుకు 2 విభాగాలుగా జరుగుతుందని, ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక విడత, సాయంత్రం 3 నుంచి 6 గంటల వరకు రెండో విడత ఉంటుందని ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్థన్ తెలిపారు. వాస్తవానికి ఈ ఎంసెట్ ఈ నెల 14, 15 తేదీల్లో జరగాల్సి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలతో పరీక్షను ఒకరోజు ముందు వాయిదావేశారు. అగ్రికల్చర్ ఎంసెట్ ప్రశ్నపత్రం ‘కీ’ని రెండు రోజుల్లో విడుదల చేస్తామని కన్వీనర్ తెలిపారు. నేడు ఇంజనీరింగ్ ఎంసెట్ ‘కీ’విడుదల ఈ నెల 18 నుంచి 20 వరకూ జరిగిన ఇంజనీరింగ్ ఎంసెట్ ప్రశ్నపత్రం ‘కీ’ని శనివారం విడుదల చేస్తామని ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ ‘సాక్షి’కి తెలిపారు. ఆగస్టు రెండోవారంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్ విభాగాల ఫలితాలను ఒకేసారి ప్రకటించనున్నట్టు స్పష్టం చేశారు. -
ఎక్కడ అనుమతిస్తే.. అక్కడే
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ గురుకుల విద్యా సంస్థలను ఇష్టానుసారంగా నిర్వహించవద్దని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మంజూరైన నియోజకవర్గాల పరిధిలోనే పాఠశాలలను నిర్వహించాలని పేర్కొంది. గురుకుల పాఠశాలలను ఒక చోట మంజూరు చేస్తే మరో ప్రదేశంలో నిర్వహిస్తున్న తీరుపై ప్రభుత్వం ఇటీవల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎస్సీ, బీసీ, మైనార్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీలకు సంబంధించి దాదాపు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి రెండు చొప్పున గురుకులాలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో ఒకటి బాలికలది కాగా, మరొకటి బాలుర గురుకులం. వీటిని సంబంధిత అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోనే నిర్వహించాలి. ఈ మేరకు గురుకుల పాఠశాలల మంజూరు సమయంలోనే ఎక్కడ ఏర్పాటు చేయాలన్నది నిర్దేశిస్తారు. కానీ ప్రస్తుతం మూడువంతుల గురుకుల విద్యా సంస్థలను అనుమతించిన చోట కాకుండా ఇతర ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు. అద్దె భవనాలు దొరక్క.. రాష్ట్రంలో దాదాపు వెయ్యి సంక్షేమ గురుకుల విద్యా సంస్థలు ఉన్నాయి. ఇందులో 820 గురుకుల పాఠశాలలు కాగా, వీటిలో మూడోవంతు పాఠశాలలకు అనుబంధంగా జూనియర్ కాలేజీలు ఉన్నాయి. ఇవికాకుండా డిగ్రీ కాలేజీలు కూడా ఉన్నాయి. ప్రభుత్వం గురుకుల విద్యా సంస్థలను విడతలవారీగా మంజూరు చేయగా.. వాటికి భవనాలను నిర్మించే వరకు అద్దె భవనాల్లో కొనసాగించాలని సూచించింది. దీంతో గురుకుల విద్యా సంస్థల సొసైటీ నిబంధనలకు అనుగుణంగా భవనాలను వెతికినప్పటికీ ప్రభుత్వం మంజూరు చేసిన ప్రాంతాల్లో తగిన భవనాలు లభించక.. మూతబడ్డ ఇంజనీరింగ్ కాలేజీలు, జూనియర్, డిగ్రీ కాలేజీ భవనాలను అద్దెకు తీసుకుని పాఠశాలలు ఏర్పాటు చేశారు. భవనాల లభ్యత ఉన్న చోటనే అద్దెకు తీసుకుని అక్కడే గురుకులాలను ప్రారంభిస్తూ వచ్చారు. ఈ క్రమంలో పెద్ద భవనాలున్న చోట రెండు, మూడు, నాలుగు.. గురుకుల పాఠశాలలను ఒకే క్యాంపస్లో నిర్వహిస్తున్నారు. కొన్ని చోట్ల పాఠశాల మంజూరు చేసిన ప్రాంతం దాటి దాదాపు 30 నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేశారు. ఫిర్యాదులతో.. స్పందించిన సర్కారు అనేక చోట్ల ఆయా నియోజకవర్గాల పరిధి దాటి వీటిని ఏర్పాటు చేయడంతో స్థానికతకు ప్రాధాన్యతమిస్తూ అడ్మిషన్లు తీసుకున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఇబ్బందులు ఎదురవుతుండటాన్ని ఉన్నతాధికారులు గుర్తించారు. శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, స్థానిక సంస్థల ప్రతినిధులు కూడా ఈ అంశంపై ప్రభుత్వానికి ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వాటిని పరిశీలించిన ప్రభుత్వం తాజాగా.. అనుమతించిన ప్రాంతంలోనే గురుకుల పాఠశాలలను నిర్వహించాలని స్పష్టం చేసింది. రెండురోజుల కిందట రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎస్సీ గురుకుల సొసైటీ అధికారులతో సమావేశమై లొకేషన్ల అంశాన్ని చర్చించారు. ప్రభుత్వం ఎక్కడ మంజూరు చేస్తే అక్కడే గురుకులాన్ని నిర్వహించాలని, ఆయా ప్రాంతాల్లో అద్దె భవనాలను గుర్తించి వెంటనే అక్కడికి మార్చాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా ఇతర గురుకుల సొసైటీల్లోనూ ఇదే తరహాలో ఆదేశాలు ఇచ్చేందుకు సంబంధిత శాఖలు సిద్ధమవుతున్నాయని అధికారవర్గాలు తెలిపాయి. -
గురుకులాలపై ‘గురి’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో చదివేందుకు విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి తగ్గట్టే విద్యార్థుల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా.. మరింత అత్యుత్తమ ఫలితాలు సాధించడంపై సాంఘిక సంక్షేమ శాఖ దృష్టి సారించింది. విద్యా బోధనలో పలు సంస్కరణలు తీసుకువచ్చింది. విద్యార్థులకు ఎక్కువ శిక్షణ అవసరమైన బోధన అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ టైమ్ టేబుల్ను మారుస్తోంది. విద్యార్థుల ప్రతిభ ఆధారంగా తరగతులను వర్గీకరించబోతున్నారు. 8వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులకు ప్రతి వారం పరీక్షలు నిర్వహిస్తారు. విద్యార్థులు సాధించే మార్కుల ఆధారంగా గ్రేడ్లు నిర్ణయిస్తారు. ఎంసెట్, నీట్, ఐఐటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు సమగ్ర శిక్షణ ఇవ్వడంతో పాటు.. తగిన మెటీరియల్ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఐఐటీలు, మెడికల్ కాలేజీల్లో మరిన్ని సీట్లు సాధించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇంటర్ సెకండియర్లో ప్రతిభ కలిగిన విద్యార్థులను గుర్తించి.. వారందరినీ ఒక దగ్గరకు చేర్చి ప్రత్యేకంగా ఐఐటీ, నీట్ పరీక్షలకు శిక్షణ అందించనున్నారు. ఎక్కువ మార్కులు సాధించేలా విద్యార్థులను సిద్ధం చేసేందుకు వీలుగా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులు బోధించే అధ్యాపకులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. అన్ని స్థాయిల్లో విద్యా బోధనను పటిష్టపర్చడం ద్వారా విద్యార్థులు మరింత మెరుగైన ఫలితాలు సాధించేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. మేలైన బోధన అందిస్తున్నాం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకులాలపై పేద వర్గాలకు నమ్మకం కుదిరింది. ఈ సందర్భంలో మా వంతు బాధ్యతగా విద్యార్థులకు మరింత మేలైన విద్యా బోధన అందించేందుకు చర్యలు చేపట్టాం. గురుకుల జూనియర్ కాలేజీల్లో గతంలో ఇంటర్ సీట్లు ఖాళీగా మిగిలే పరిస్థితి ఉండేది. ఈ ప్రభుత్వం వచ్చాక ఆ పరిస్థితి మారింది. ఈసారి కూడా పూర్తి స్థాయిలో సీట్లను భర్తీ చేయాలని ఆదేశించాం. రాష్ట్రంలోని కొన్ని గురుకులాల్లో ఉన్న సమస్యలపై కూడా దృష్టి సారించి పరిష్కరిస్తున్నాం. ఇకపై గురుకులాలను సందర్శించి వాటికి మరింత ఊతమిచ్చేలా చర్యలు తీసుకుంటా. – మేరుగ నాగార్జున, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి -
తెలంగాణలో కొత్తగా 33 గురుకులాలు.. 15 డిగ్రీ కాలేజీలు
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన వర్గాల విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఇందులో భాగంగా ప్రతి సంవత్సరం బీసీ విద్యార్థుల కోసం కొత్తగా గురుకుల విద్యాసంస్థల సంఖ్యను పెంచుతున్నట్లు తెలిపారు. కొత్త గురుకులాల ఏర్పాటు, అప్గ్రేడేషన్ తదితర అంశాలపై బుధవారం మంత్రి తన చాంబర్లో బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి జిల్లాలో ఒక గురుకుల పాఠశాలను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇందుకోసం 33 జిల్లాల్లో 33 కొత్త స్కూళ్ల ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది కొత్తగా 4 గురుకుల పాఠశాలలను జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేస్తున్నామని, ఇందుకు సంబంధించిన ఆదేశాలు జారీ చేశామని వెల్లడించారు. వచ్చే ఏడాది మరో 115 స్కూళ్లను జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేయనున్నట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం బీసీ సంక్షేమ శాఖ పరిధిలో ఒక డిగ్రీ కాలేజీ మాత్రమే ఉందని, మరో 15 డిగ్రీ కాలేజీలనుఈ విద్యా సంవత్సరం నుంచే ఏర్పాటు చేయనున్నామని వివరించారు. ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శిని మంత్రి గంగుల ఆదేశించారు. ఈ డిగ్రీ కళాశాలల్లో కోర్సులను వైవిధ్యంగా తీర్చిదిద్దాలని, ఇందుకోసం తెలంగాణ ఉన్నత విద్యామండలి సహకారం తీసుకోవాలని సూచించారు. డిగ్రీ కాలేజీల్లో అందించే ఆరు కోర్సుల్లో మూడు కొత్త వాటిని ప్రవేశపె ట్టాలని, పారిశ్రామిక రంగం అవసరాల మేరకు వాటితో అనుసంధానం చేయా లని చెప్పారు. మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డాటాసైన్స్, క్లౌడ్ టెక్నాలజీ, సాప్, న్యూట్రిషన్ ఫుడ్ టెక్నాలజీ, ఫ్యాషన్ టెక్నాలజీ, టెక్స్ టైల్ టెక్నాలజీ, బీబీఏ, బీకాం కంప్యూటర్స్, ఎంపీసీఎస్, ఎంఎస్సీఎస్ వంటి కోర్సులను కాలేజీల వారీగా ప్రవేశపెట్టాలని సూచించారు. వీటి ద్వారా విద్య పూర్తి చేసుకొనే తరుణంలో గురుకుల సొసైటీ ద్వారానే క్యాంపస్ ప్లేస్మెంట్లు నిర్వహించాలని, ఈ మేరకు కాలేజీల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు. మరో 21 బీసీ స్టడీ సర్కిళ్లు:రాష్ట్రంలో మరో 21 బీసీ స్టడీ సర్కిళ్ల ఏర్పాటుకు కార్యాచరణ రూపొందించాలని మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు. ఆత్మగౌరవ భవనాల నిర్మాణం కోసం ఏకసంఘంగా ఏర్పడిన కులాలకు నిర్మాణ బాధ్యతలు అప్పగిస్తున్నామన్నారు. కొత్తగా మరో ఆరు కులా లు ఏక సంఘంగా ఏర్పడ్డాయని వీటికి ఈ నెల 8న నిర్మాణ అనుమతి పత్రాలు అందజేస్తామని వెల్లడించారు. ఏకసంఘంగా ఏర్పడని వాటిని సైతం త్వరలోనే ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మాణం ప్రారంభిస్తామని తెలిపారు. సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం పాల్గొన్నారు. -
AP: ఆ విద్యార్థులకు అలర్ట్.. 20వ తేదీలోగా చేరాలి..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 38 సాధారణ, 12 మైనారిటీ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశానికి ఎంపికైన విద్యార్థులు ఈ నెల 20వ తేదీలోపు ప్రవేశం పొందాలని ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఆర్.నరసింహారావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. 2022–23 విద్యా సంవత్సరంలో 5వ తరగతి ప్రవేశాలకు సంబంధించిన విద్యార్థుల ఎంపిక జాబితాను ఖరారు చేసినట్లు తెలిపారు. 20వ తేదీ తర్వాత మిగిలిన ఖాళీలను భర్తీ చేస్తామని ప్రకటించారు. చదవండి: ఏపీ వాసులకు వాతావరణ శాఖ గుడ్న్యూస్.. రెండు, మూడు రోజుల్లో.. -
బాలల్లో సంకల్పబలం ఉండాలి
భవానీపురం (విజయవాడ పశ్చిమ): సమాజానికి మంచి చేయాలన్న సంకల్పబలం బాలల్లో ఉండాలని, అందుకోసం కష్టపడి చదువుకుని ఉన్నత స్థితికి చేరుకోవాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి కేవీ ఉష శ్రీచరణ్ ఆకాంక్షించారు. మంగళవారం ఆమె ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని ప్రభుత్వ బాలుర పరిశీలనా గృహాన్ని (జువెనైల్ హోం) సందర్శించారు. గృహంలో ఉన్న బాలలతో మమేకమై వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. విశాలమైన ప్రపంచంలో అనేక అవకాశాలున్నాయని, బెయిల్పై బయటకు వెళ్లిన తర్వాత సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని చెప్పారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. బాలలు పెరిగిన వాతావరణం, అక్కడి పరిస్థితుల ప్రభావంతో జరిగిన చిన్నచిన్న ఘటనల కారణంగా ఇక్కడికి వచ్చారని అన్నారు. వారికి ఇక్కడ ఇస్తున్న కౌన్సెలింగ్తో చాలా మార్పు వచ్చిందన్నారు. బెయిల్ పూచీకత్తు అంశాన్ని జేజేసీ దృష్టికి తీసుకెళ్తా తమకు బెయిల్ మంజూరు అయినప్పటికీ పూచీకత్తు, నగదు జమ చేయలేని పరిస్థితుల్లో తమ తల్లిదండ్రులున్న కారణంగా ఇంకా ఇక్కడే ఉండాల్సి వస్తుందని పలువురు బాలలు మంత్రి ముందు కన్నీటి పర్యంతమయ్యారు. దాంతో చలించిపోయిన ఆమె.. ఈ అంశాన్ని తాను జువెనైల్ జస్టిస్ కమిటీ దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తానని ధైర్యం చెప్పారు. వారిని గురుకుల పాఠశాలలో చేర్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. చైల్డ్ లైన్ 1098 ఏర్పాటు చేసిన బాలల హక్కుల పరిరక్షణ పోస్టర్ను ఆమె ఆవిష్కరించారు. బాలల సంస్కరణల సేవలు జాయింట్ డైరెక్టర్ బీడీవీ ప్రసాదమూర్తి, పరిశీలనా గృహం సూపరింటెండెంట్ టి.మధుసూధనరావు, మహిళా శిశు సంక్షేమ పీడీ ఉమాదేవి పాల్గొన్నారు. -
గురుకులాలపై పటిష్ట పర్యవేక్షణ తప్పనిసరి
సాక్షి, అమరావతి: సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలపై పటిష్ట పర్యవేక్షణ ఉండాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున స్పష్టం చేశారు. ఈ విషయంలో అధికారులు ఉత్సవ విగ్రహాల్లా ఉంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. విద్యాలయాల నిర్వహణలో నిర్లక్ష్యం వహించేవారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అన్ని స్థాయిల్లో నాణ్యతా ప్రమాణాలు పెరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గుంటూరు జిల్లా వెలగపూడిలోని సచివాలయంలో గురువారం సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థపై మంత్రి మేరుగ సమీక్ష నిర్వహించారు. కొన్ని గురుకుల పాఠశాలల్లో అధ్వాన్న పరిస్థితులు ఉన్నట్టు తన దృష్టికి వచ్చిందన్నారు. విద్యా సంస్థల్లో సమస్యలను పరిష్కరించడానికి, నాణ్యతా ప్రమాణాలను పెంచడానికి అధికారులు తరచూ తనిఖీలు చేయాలని సూచించారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా ఫలితాలు సాధించేలా గురుకుల విద్యా సంస్థల టీచర్లు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. విద్యార్థులకు అందించే ఆహారం నాణ్యతతో ఉండాలన్నారు. 6 ఉమ్మడి జిల్లాల్లో రూ.94.3 కోట్లతో క్రీడా ప్రతిభా కేంద్రాలను నిర్మిస్తామన్నారు. విశాఖపట్నం జిల్లా దేవరాపల్లిలో బాలురకు బాక్సింగ్, తూర్పుగోదావరి జిల్లా తునిలో బాలికలకు విలు విద్య, కృష్ణా జిల్లా కృష్ణారావుపాలెంలో బాలురకు అథ్లెటిక్స్, ప్రకాశం జిల్లా పెదపావనిలో బాలికలకు అథ్లెటిక్స్, కర్నూలు జిల్లా జూపాడు బంగ్లాలో బాలురకు కబడ్డీ, వైఎస్సార్ జిల్లా చిన్నచౌక్లో బాలికలకు ఫెన్సింగ్లో శిక్షణ ఇస్తామన్నారు. ఈ సమీక్షలో సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి నాయక్, గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి పావనమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
గురుకులాలు.. డిజిటల్ చదువులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గురుకుల పాఠశాలల్లో డిజిటల్ బోధన పక్కాగా నిర్వహిస్తామని రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. ఇప్పటికే విడతల వారీగా తరగతులను డిజిటలీకరిస్తున్నామని, వచ్చే విద్యా సంవత్సరం(2022–23) పూర్తయ్యే నాటికి అన్ని పాఠశాలల్లో డిజిటల్ బోధనే జరుగుతుందన్నారు. బీసీ గురుకుల సొసైటీ పరిధిలోని 281 గురుకుల పాఠశాలల్లో 1,696 తరగతులు డిజిటలైజ్ అవుతాయన్నారు. శుక్రవారం ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్ఈఐఎస్(మహాత్మ జ్యోతిభా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ) బోర్డు సమావేశం మంత్రి గంగుల అధ్యక్షతన జరిగింది. 2022–23లో సొసైటీ ద్వారా నిర్వహించే కార్యక్రమాలపై ఈ భేటీలో చర్చించారు. గురుకుల పాఠశాలల్లో డిజిటలైజేషన్ 100 శాతం చేయాలన్న నిర్ణయంపై బోర్డు తీర్మానించింది. అలాగే గురుకుల పాఠశాలల్లోని విద్యార్థులకు వేడినీటి వసతి కల్పన కోసం టీఎస్ రెడ్కో ద్వారా సోలార్ వాటర్ హీటర్లు పంపిణీ చేయాలని నిర్ణయించారు. పాఠశాలల నిర్వహణ పక్కగా జరిగేందుకు నిఘా వ్యవస్థను పటిష్టం చేయాలని మంత్రి వాఖ్యానించారు. అకడమిక్ సెల్ను తీర్చిదిద్దాలని, అంతర్గత ఆడిట్ బృందాలను మరింత బలపర్చాలన్నారు. ఇదిలా ఉండగా, ‘గురుకులం.. దూరాభారం’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన వార్తపై మంత్రి స్పందించారు. గురుకులాల నిర్వహణకు తీసుకునే అద్దె భవనాలతో విద్యార్థులకు ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. -
గురుకులం దూరాభారం
ఈ ఫొటోలో కనిపిస్తున్న భవనం మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం అంకుషాపూర్లో ఉంది. టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ (తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ)కు చెందిన మూడు మహిళా డిగ్రీ కాలేజీలు ఈ ఒక్క భవనంలోనే కొనసాగుతున్నాయి. ఈ మూడూ వేర్వేరు ప్రాంతాలకు చెందినవి కావడం గమనార్హం. వాస్తవానికి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, బుద్వేల్, హైదరాబాద్ జిల్లా మహేంద్రహిల్స్లో ప్రభుత్వం వీటిని మంజూరు చేసింది. గురుకుల సొసైటీ మాత్రం ఈ మూడింటినీ ఆయా ప్రాంతాలకు దూరంగా, అంకుషాపూర్లోని ఒక మూతబడ్డ ఇంజనీరింగ్ కాలేజీని అద్దెకు తీసుకుని నిర్వహిస్తోంది. ఈ ఫొటోలోని భవనం శామీర్పేటలో ఉంది. ఇక్కడ జగద్గిరిగుట్ట ఎస్సీ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలను నిర్వహిస్తున్నారు. దీనిని గతేడాది వరకు రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్లో నిర్వహించగా.. అక్కడ అద్దె భవనం విషయంలో నెలకొన్న సమస్యతో గతేడాది సెప్టెంబర్ నుంచి ఇక్కడ నిర్వహిస్తున్నారు. అకస్మాత్తుగా కాలేజీని సుదూర ప్రాంతానికి తరలించడంతో విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఈ భవనంలో సరైన మౌలిక వసతులు లేవు. ప్రధానంగా తాగునీరుతో పాటు వాడుక నీటికి సైతం కటకట ఉండడం, కనీసం స్నానాలు చేసేందుకు వీల్లేకపోవడంతో రెండు నెలల క్రితం విద్యార్థినులు నిరసనలకు దిగారు. విషయం తెలిసిన విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. ఈ క్రమంలో తాత్కాలికంగా వసతులు కల్పించిన సొసైటీ అధికారులు.. ఈ వ్యవహారం రోడ్డెక్కినందుకు కాలేజీలో పనిచేస్తున్న పలువురు అధ్యాపకులు, సిబ్బందిని ఇతర జిల్లాలకు బదిలీ చేశారు. ఇది నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బీసీ బాలికల గురుకుల కళాశాల. జిల్లాలోని కోడేరు గురుకుల పాఠశాలలో హాస్టల్ వసతులు సరిపోక ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులను ఇక్కడికి తరలించారు. బైపీసీలో 40 మంది, సీఈసీలో 40 మంది చొప్పున విద్యార్థులను తరలించడంతో విద్యార్థులు తరగతుల్లో కిక్కిరిసి కూర్చొని పాఠాలు వినాల్సి వస్తోంది. అలాగే అదే పాఠశాల ఆరో తరగతికి చెందిన రెండు సెక్షన్లను వసతులు లేక అధికారులు నాగర్కర్నూల్ పాఠశాలకు తరలించారు. దీంతో కరోనా సమయంలోనూ తరగతి గదుల్లో ఒక్కో బెంచీకి ముగ్గురు, నలుగురు చొప్పున కూర్చుంటున్నారు. మరోవైపు ఇక్కడ హాస్టల్లోనూ రద్దీ పెరిగి ఒకే గదిలో 40 మంది వరకు విద్యార్థులు సర్దుకొని ఉండాల్సి వస్తోంది. అంతేగాకుండా మరుగుదొడ్లు, స్నానాలకు సైతం ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు చెబుతున్నారు. సాక్షి, హైదరాబాద్: కేజీ టు పీజీ వరకు నిర్బంధ ఉచిత విద్య అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం గురుకుల పాఠశాలలు, కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. గత నాలుగేళ్లుగా విరివిగా విద్యా సంస్థలను నెలకొల్పుతూ దీనిని అమలు చేస్తోంది. ఈ విధంగా పెద్ద సంఖ్యలో గురుకుల పాఠశాలలు, కళాశాలలను ఏర్పాటు చేస్తున్నప్పటికీ వాటికి అవసరమైన శాశ్వత భవనాల నిర్మాణంలో, మౌలిక వసతుల కల్పనలో జాప్యం జరుగుతోంది. దీంతో గురుకుల సొసైటీలు ప్రభుత్వం మంజూరు చేసిన ప్రాంతంతో నిమిత్తం లేకుండా ఎక్కడ అద్దె భవనం దొరికితే అక్కడ అన్నట్టుగా వాటిని ప్రారంభిస్తున్నారు. కొత్తవన్నీ అద్దె భవనాల్లోనే... ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ముందు తెలంగాణలో 201 గురుకుల విద్యా సంస్థలున్నాయి. 2014 తర్వాత మరిన్ని గురుకుల విద్యా సంస్థల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా విడతల వారీగా కొత్త పాఠశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో ఇప్పటివరకు 724 కొత్త గురుకుల విద్యా సంస్థలు ప్రారంభమయ్యాయి. తొలుత పాఠశాల స్థాయి వరకే కొనసాగిన ఈ విద్యా సంస్థలు క్రమంగా జూనియర్ కాలేజీ స్థాయికి అప్గ్రేడ్ అయ్యాయి. ఇలా కొత్తగా ఏర్పాటైన వాటిలో 30 శాతం పాఠశాలలు జూనియర్ కాలేజీలుగా మారినట్లు సంక్షేమ శాఖల గణాంకాలు చెబుతున్నాయి. అయితే ప్రభుత్వం శాశ్వత భవనాల దిశగా చర్యలు తీసుకోలేదు. దీంతో కొత్తగా మంజూరైన పాఠశాలలన్నీ అద్దె భవనాల్లోనే ప్రారంభించారు. ప్రభుత్వం మంజూరు చేసిన ప్రాంతంలో అద్దె భవనాలు లభించకపోవడంతో భవనాలు అందుబాటులో ఉన్న చోట వీటిని ప్రారంభించారు. ఈ కారణంగానే ఒకచోట ఉండాల్సిన గురుకుల పాఠశాల ఆ పేరుతో మరో ప్రాంతంలో ఉంటోంది. ఏళ్లు గడుస్తున్నా వీటికి శాశ్వత భవనాలను ప్రభుత్వం మంజూరు చేయకపోవడం... మరోవైపు భవనాల యజమానులతో కుదుర్చుకున్న ఒప్పందాల గడువు ముగియడంతో వాటిని ఎప్పుటికప్పుడు ఇతర ప్రాంతాలు, ఇతర జిల్లాలకు తరలించాల్సి వస్తోంది. శాశ్వత భవనాలు లేక.. అద్దెకు దొరక్క గురుకుల పాఠశాల నిర్వహణకు సగటున 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణం, విశాలమైన మైదానం ఉన్న భవనం అవసరం. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఇంత పెద్ద విస్తీర్ణంలో ఉన్న అద్దె భవనాలు దొరకడం కష్టమే. ఈ క్రమంలో దాదాపు అన్ని సొసైటీలు మూతపడ్డ ఇంజనీరింగ్ కాలేజీలు, ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు, జూనియర్ కాలేజీల భవనాలను గుర్తించి యజమానులతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇంజనీరింగ్ కాలేజీలు మూతబడ్డ చోట ఏర్పాటు చేసిన పాఠశాలలు, కళాశాలలకు భవనం, మైదానం సంతృప్తికరంగా ఉండడంతో ఆ ఒక్కచోటే మూడు, నాలుగు పాఠశాలలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో విద్యార్థుల సంఖ్య భారీగా పెరగడంతో నిర్వహణకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. విద్యార్థుల సంఖ్యకు తగినట్లుగా తాగునీరు, వాడుక నీరు సరఫరాలో సమస్యలు ఎదురవుతున్నాయి. కొన్నిచోట్ల బోధన సిబ్బంది కొరత కూడా ఉంది. భద్రత విషయంలో కూడా సమస్యలు తలెత్తుతున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ఒకరు చెప్పారు. తల్లిదండ్రులు పిల్లల్ని చూడాలంటే వ్యయ ప్రయాసలకోర్చి పదుల కిలోమీటర్ల మేర ప్రయాణం చేసి రావాల్సి వస్తోంది. తనకు నెలకు సగటున వెయ్యి రూపాయలు ఖర్చవుతోందని యాచారంలో ఉన్న శంషాబాద్ గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థి తండ్రి నాగయ్య ‘సాక్షి’తో వాపోయారు. అద్దె భవనాల్లోనే అన్ని సదుపాయాలు శాశ్వత భవనాలు మంజూరయ్యే వరకు అద్దె భవనాల్లో నిర్వహిస్తామని, అంతవరకు అద్దె భవనాల్లోనే అన్ని సదుపాయాలు కల్పిస్తామని సొసైటీ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. పక్కా భవనాలు, మౌలిక వసతులు అత్యవసరం రాష్ట్ర విద్యా వ్యవస్థను మార్చే స్థాయిలో గురుకుల పాఠశాలలు నడుస్తున్నాయి. అయితే వీటికి పక్కాగా భవనాలు నిర్మించి, సరైన విధంగా మౌలిక వసతులు కల్పించాలి. శాశ్వత భవనాల మంజూరు కోసం ప్రభుత్వానికి చాలాసార్లు వినతులు సమర్పించినప్పటికీ ఫలితం లేదు. సరైన వాతావరణం ఉంటేనే విద్యార్థులు చదువుకోగలుగుతారు. ఆ వాతావరణాన్ని ప్రభుత్వమే కల్పించాలి. – ఆర్.కృష్ణయ్య, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఇక్కడి గురుకులం మరెక్కడో ♦రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో మంజూరైన ఎస్సీ గురుకుల పాఠశాలను తొలుత 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇబ్రహీంపట్నంలో ప్రారంభించారు. అక్కడ బిల్డింగ్ సమస్య తలెత్తడంతో అక్కడ్నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న యాచారానికి తరలించారు. ♦ హైదరాబాద్ జిల్లాలో మంజూరైన మైనార్టీ గురుకుల పాఠశాలల్లో చాలావరకు రంగారెడ్డి జిల్లాలో కొనసాగుతున్నాయి. ♦రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తోల్కట్ట వద్ద ఒకేచోట వికారాబాద్ డిగ్రీ కాలేజీ, బంట్వారం, మోమిన్పేట, చేవెళ్ల పాఠశాలలు కొనసాగిస్తున్నారు. ♦నల్లగొండ జిల్లా చండూరు, అనుముల, తిప్పర్తి, నిడమనూరు పాఠశాలల్ని ఆయా ప్రాంతాల్లో అద్దె భవనాల కొరతతో నల్లగొండ టౌన్లోనే నిర్వహిస్తున్నారు. -
ఎస్సీ గురుకుల టీచర్ల ఉద్యమబాట!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్)లో ప్యానల్ ఇన్స్పెక్షన్ దుమారం సృష్టిస్తోంది. బోధన సిబ్బంది పనితీరును మదింపు చేసేందుకు తలపెట్టిన ప్యానల్ ఇన్స్పెక్షన్పై సొసై టీ పరిధిలోని టీచర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ప్రస్తుతానికి ఈ ఇన్స్పెక్షన్లను నిలిపివేయాలని ఉపాధ్యాయ సంఘాలు ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాయి. తాజాగా ఎస్సీ అభివృద్ధి శాఖ మంతి కొప్పుల ఈశ్వర్ను కలసిన ఉపాధ్యాయ సంఘ నేతలకు సానుకూల స్పందన రాకపోవడంతో ఉద్యమబాట పట్టారు. జనవరి రెండో తేదీ నుంచి నల్లబ్యాడ్జీలతో విధులు నిర్వహించాలని నిర్ణయించారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమాన్ని తీవ్రతరంచేయాలని భావిస్తున్నారు. కోవిడ్–19 వ్యాప్తి నేపథ్యంలో బోధన కార్యక్రమాలు గందరగోళంలో పడ్డాయి. జూన్ ఒకటిన ప్రారంభం కావాల్సిన విద్యా సంవత్సరం నెలరోజులు ఆలస్యం కాగా, ప్రత్యక్ష తరగతులు నాలుగు నెలలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. ఈ పరిస్థితుల్లో ఎస్సీ గురుకుల సొసైటీ ఉపాధ్యాయులు ఆందోళనకు దిగుతామనడంతో సొసైటీ పాఠశాలల్లో అలజడి మొదలైంది. ఏమిటి ఈ ప్యానల్ ఇన్స్పెక్షన్.. సాంఘిక సంక్షేమ గురుకులాల సొసైటీ పరిధిలో 268 విద్యా సంస్థలున్నాయి. ఇందులో 30 డిగ్రీ కాలేజీలు ఉండగా.. మిగతా వాటిలో 238 పాఠశాలలు, జూనియర్ కళాశాలలున్నాయి. ఈ విద్యా సంస్థల్లోని బోధన సిబ్బంది పనితీరును పరిశీలించేందుకు ప్రాంతీయ కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కమిటీల్లో నిపుణులను నియమించేందుకు ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శి ఇటీవల పాఠశాల విద్యాశాఖకు లేఖ రాశారు. ఈ కమిటీ సభ్యులు ప్రతి పాఠశాలను అకస్మికంగా సంద ర్శిం చి విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలిస్తారు. సబ్జెక్టుల వారీగా పిల్లల స్థితి, పరీక్షల్లో వచ్చిన మా ర్కు లు, భావ వ్యక్తీకరణ.. తదితర అంశాలపై క్షుణ్ణం గా సమీక్షించి ఆయా సబ్జెక్టు టీచర్లకు మార్కులు వేస్తారు. దీంతో టీచర్ల పనితీరు ఎలా ఉందో స్పష్టమవుతుంది. పనితీరు అధ్వాన్నంగా ఉంటే వారిపై చర్యలకు సిఫారసు చేసే వీలుంటుంది. ఈ విధానం ఇప్పటికే అమల్లో ఉండగా.. తాజాగా కొత్త పద్ధతిలో నిర్వహించేందుకు సొసైటీ కార్యాచరణ రూపొందించింది. ఎందుకు వ్యతిరేకత.. ప్రస్తుతం ప్యానల్ ఇన్స్పెక్షన్ను సాంఘిక సంక్షేమ గురుకులాల్లో మాత్రమే అమలు చేస్తున్నారు. గిరిజన గురుకుల సొసైటీలలో కూడా అమలు చేయాల్సి ఉన్నప్పటికీ పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదని సమాచారం. కాగా, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీలో అమలు చేసే ప్యానల్ ఇన్స్పెక్షన్ ప్రక్రియను ప్రస్తుత విద్యా సం వత్సరానికి మాత్రమే వాయిదా వేయా లని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 2021–22 విద్యా సంవత్సరం జూలైలో ప్రారంభం కాగా, అక్టోబర్ నెలాఖరు వరకు ఆన్లైన్ పద్ధతిలోనే బోధన సాగింది. ఈ నేపథ్యంలో పిల్లల సామర్థ్యాన్ని సాకుగా చూపి ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటారనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో టీఎస్డబ్ల్యూఆర్ఈఐ అధ్యక్ష, కార్యదర్శులు వి.వి.కృష్ణారెడ్డి, ప్రభుదాస్ మంత్రి కొప్పుల ఈశ్వర్ను కలిసి పరిస్థితిని వివరించారు. ఇన్స్పెక్షన్ను ఈ ఏడాది మాత్రమే వాయిదా కోరుతున్నామని ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం అధ్యక్షుడు బాలరాజ్ పేర్కొన్నారు. -
చిన్నారి డాక్టర్లు.. గురుకులాలకు వీళ్లే కేర్టేకర్లు
సాక్షి, హైదరాబాద్: గురుకులంలో ప్రతి తరగతికి ఓ ‘డాక్టర్’! విద్యార్థి ఆరోగ్య స్థితిపై కన్నేసి ఉంచడం, జలుబు, జ్వరం, దగ్గులాంటి స్వల్ప అస్వస్థత అయినా సరే గుర్తించి వెంటనే క్లాస్ టీచర్, పాఠశాల హెల్త్ సూపర్వైజర్ దృష్టికి తీసుకెళ్లడం వీరి కర్తవ్యం. డాక్టర్ అంటే నిజంగా ఎంబీబీఎస్ పట్టా తీసుకున్న అనుభవజ్ఞుడైన డాక్టర్ కాదండోయ్.. గురుకులంలోని ఓ విద్యార్థే. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో.. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) తన పరిధిలోని పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్యాన్ని మరింత శ్రద్ధగా పర్యవేక్షించే క్రమం లో ప్రయోగాత్మకంగా ‘చిన్నారి డాక్టర్’కార్యక్రమా న్ని చేపట్టింది. కోవిడ్ సెకండ్ వేవ్ అనంతరం గురుకుల పాఠశాలల పునఃప్రారంభం తర్వాత ఈ కార్యక్రమాన్ని అమలు చేయగా.. ప్రస్తుతం అది సత్ఫలితాలు ఇస్తున్నట్టు సొసైటీ అధికారులు చెబుతున్నారు. నిత్యం మరింత శ్రద్ధగా..: టీఎస్డబ్ల్యూఆర్ఈఎస్ పరిధిలో 269 గురుకుల పాఠశాలలున్నాయి. ఒక్కో పాఠశాలలో 5నుంచి 10 వరకు తరగతులు, ప్రతి క్లాసుకు రెండు సెక్షన్ల చొప్పున మొత్తం పన్నెండు సెక్షన్లుంటాయి. ఒక్కో గురుకులంలో గరిష్టంగా 480 మంది విద్యార్థులుంటారు. అయితే ఒక పాఠశాలకు ఒక హెల్త్ సూపర్వైజర్ పోస్టును మాత్రమే ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ఒక్కరిపైనే ఎక్కువ భారం పడొద్దని భావించిన అధికారులు సొసైటీకి అనుబంధంగా కొనసాగుతున్న పనేషియా ప్రాజెక్టు సహకారంతో చిన్నారి డాక్టర్ కార్యక్రమాన్ని రూపొందించి అమలు చేస్తున్నారు. చిన్నారి డాక్టర్ కార్యక్రమంతో విద్యార్థుల ఆరోగ్య స్థితిని నిత్యం మరింత శ్రద్ధగా పరిశీలిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అనారోగ్యాన్ని ముం దుగానే గుర్తించి చర్యలు తీసుకుంటున్నందున విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యే అవకా శాలు తక్కువగా ఉంటున్నాయని, కోవిడ్–19 వ్యాప్తి నేపథ్యంలో ఈ ప్రయోగం మరింతగా సత్ఫలితాలనిస్తోందని వివరించారు. త్వరలో కోవిడ్ కట్టడికో బృందం కోవిడ్–19 వ్యాప్తి తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తున్నప్పటికీ పాఠశాలల్లో అక్కడక్కడా పాజిటివ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ప్రతి పాఠశాలకు ఒక కోవిడ్–19 వర్క్ టీమ్ను ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా సొసైటీ విద్యార్థుల ఆరోగ్య స్థితిపై నిఘా వేసి ఉంచే పనేషియా ప్రాజెక్ట్ హెడ్ సామర్ల కిరణ్కుమార్ తాజాగా కోవిడ్–19 వర్క్ టీమ్ ఏర్పాటు కోసం ప్రతిపాదనలు రూపొందించారు. ఒకట్రెండు రోజుల్లో సొసైటీ కార్యదర్శి ఆమోదం పొందిన వెంటనే ప్రతి పాఠశాలలో నలుగురితో ఒక బృందాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందులో పీఈటీతో పాటు ఇద్దరు టీచర్లు, హెల్త్ సూపర్వైజర్ సభ్యులుగా ఉంటారు. విద్యార్థుల్లో కరోనా లక్షణాలు గమనించడం, కోవిడ్ ప్రొటోకాల్ అమలు చేయడం వీరి బాధ్యత అని అధికారులు చెబుతున్నారు. -
గురుకుల పాఠశాలలను ప్రారంభించాలి: కేఎన్వీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల కోసం ఏర్పాటు చేసిన అన్ని రకాల గురుకుల పాఠశాలలను ప్రారంభించాలని కుల నిర్మూలన వేదిక (కేఎన్వీ) అధ్యక్షుడు పాపని నాగరాజు డిమాండ్ చేశారు. అన్ని రకాల విద్యా సంస్థలను ప్రారంభించి కేవలం గురుకుల విద్యా సంస్థలను ప్రారంభించకపోవడంతో బడుగులకు విద్య దూరమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గురుకుల విద్యా సంస్థలకు మాత్రమే కరోనా వస్తుందా అని ఆయన ప్రశ్నించారు. -
‘గురుకుల’ ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
సాక్షి, అమరావతి: ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహిస్తున్న 38 సాధారణ, 12 మైనారిటీ బాలుర గురుకుల పాఠశాలల్లో (రీజనల్ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్) ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఎం.ఆర్.ప్రసన్నకుమార్ శనివారం తెలిపారు. గుంటూరు జిల్లాలోని తాడికొండ, అనంతపురం జిల్లాలోని కొడిగెనహళ్ళితో సహా మిగిలిన పాఠశాలల్లో 2021– 22 విద్యా సంవత్సరానికి 5 వ తరగతిలో (ఇంగ్లిష్ మీడియం) ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ శనివారం నుంచే ప్రారంభంకాగా, ఈనెల 30 వరకు ‘హెచ్టీటీపీఎస్.ఏపీఆర్ఎస్. ఏపీసీఎఫ్ఎస్ఎస్.ఇన్’ అనే వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. జిల్లాలవారీగా కలెక్టరు కార్యాలయంలో లాటరీ పద్ధతి ద్వారా జూలై 14న అర్హులను ఎంపిక చేస్తారు. ప్రవేశానికి అర్హత.. ఓ.సీ, బీ.సీలకు చెందిన విద్యార్థులు 2010 సెప్టెంబర్ 1 నుంచి 2012 ఆగస్టు 31మధ్య పుట్టి ఉండాలి. ∙ఎస్సీ, ఎస్టీలు 2008 సెప్టెంబర్ 1 నుంచి 2012 ఆగస్టు 31 మధ్య పుట్టి ఉండాలి. ∙అభ్యర్థులు జిల్లాలో 2019–20, 2020–21 విద్యాసంవత్సరాల్లో నిరవధికంగా ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 3, 4 తరగతులు చదివి ఉండాలి. ∙ఓసీ, బీసీ విద్యార్థులు తప్పనిసరిగా గ్రామీణ ప్రాంతంలోనే చదివి ఉండాలి. ∙గ్రామీణ, పట్టణ ప్రాంత ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులు పాఠశాలల్లో ప్రవేశానికి అర్హులు. ∙అభ్యర్థి తల్లి, తండ్రి, సంరక్షకుల 2020–21 ఆర్థిక సంవత్సరాదాయం రూ .1,00,000 మించరాదు. -
ఎదురులేని ఏకలవ్యులు!
సాక్షి, అమరావతి: ‘కృషి ఉంటే మనుషులు రుషులవుతారు.. మహా పురుషులవుతారు’ అనే సూక్తిని నిజం చేస్తున్నారు.. గిరిపుత్రులు. క్రీడల్లో అసమాన ప్రతిభ చూపుతూ జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో పతకాలు కొల్లగొడుతున్నారు. గిరిజన గురుకుల విద్యాలయాలు ఇస్తున్న ప్రత్యేక శిక్షణను అందిపుచ్చుకుంటూ పతకాల పంట పండిస్తున్నారు. గిరిజన విద్యార్థులు సహజంగానే కొండకోనల్లో పుట్టి పెరగడం, చిన్ననాటి నుంచి వాటిని ఎక్కిదిగడం వల్ల వారి శరీరం క్రీడలకు అనువుగా ఉంటోంది. ఈ నేపథ్యంలో గిరిజన గురుకుల విద్యాలయాల సంస్థ వారికి మంచి ప్రోత్సాహమందిస్తూ చక్కటి శిక్షణ ఇప్పిస్తోంది. వ్యాయామం నుంచి యోగా వరకు.. ప్రస్తుతం రాష్ట్రంలో 190 గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 51,040 మంది విద్యార్థులు ఉన్నారు. వీరు కాకుండా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 370 ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ప్రతి పాఠశాలలో సుమారు వందమందికిపైగానే విద్యార్థులు ఉన్నారు. ప్రతి గురుకుల, ఆశ్రమ స్కూళ్లకు ఒక ఫిజికల్ డైరెక్టర్ చొప్పున ప్రభుత్వం నియమించింది. వీటిలో పాఠాలతోపాటు క్రీడలపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుండటంతో విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. రోజూ ఉదయం 5.30 నుంచే విద్యార్థుల దినచర్య ప్రారంభమవుతుంది. ఉదయం 6.30 గంటల వరకు వ్యాయామం, తర్వాత యోగా తరగతులు నిర్వహిస్తారు. సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు ఆటల్లో శిక్షణ ఇస్తున్నారు. ఆగస్టు 15, నవంబర్ 14న స్పోర్ట్స్, గేమ్స్ పోటీలను జోనల్, రాష్ట్ర స్థాయిలో నిర్వహించి ప్రతిభావంతులకు బహుమతులు అందిస్తున్నారు. వెయిట్ లిఫ్టింగ్లో గోల్డ్ మెడల్ సాధిస్తా జాతీయ స్థాయి వెయిట్లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ పోటీల్లో బంగారు పతకం నెగ్గాలనే లక్ష్యంతో అరకు స్పోర్ట్స్ స్కూల్లో శిక్షణ తీసుకుంటున్నాను. రాష్ట్ర స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించాను. ఈ నెలలో ఉత్తరప్రదేశ్లో జరిగే పవర్లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొంటున్నా. – నినావత్ నరసింహ నాయక్, వెయిట్లిఫ్టర్ మెరికల్లా తీర్చిదిద్దుతున్నాం.. గిరిజన విద్యార్థులను క్రీడల్లో మెరికల్లా తీర్చిదిద్దుతున్నాం. ఇప్పటికే వారి ప్రతిభ దేశవ్యాప్తంగా వెలుగులోకి వచ్చింది. మరోవైపు చదువుల్లోనూ మంచి ప్రతిభ చూపుతున్నారు. క్రీడల్లో సర్టిఫికెట్లు ఉన్నవారికి ఉద్యోగాల్లో ప్రత్యేక రిజర్వేషన్ ఉంటుంది. – కె శ్రీకాంత్ ప్రభాకర్, కార్యదర్శి, గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ విశాఖపట్నం జిల్లా అరకు స్పోర్ట్స్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్న పవన్ కుమార్ పేద గిరిజన కుటుంబం. జాతీయ స్థాయిలో అండర్–14 జూనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో కాంస్య పతకం గెలుచుకున్న అతడు ఆ తర్వాత తిరుపతిలో నిర్వహించిన నేషనల్ అథ్లెటిక్స్ మీట్లో 100 మీటర్ల పరుగు పందెంలో వెండి పతకాన్ని సాధించి అదరగొట్టాడు. గత నెలలో కేరళలో జరిగిన జాతీయ సౌత్ జోన్ అథ్లెటిక్స్ పోటీల్లో ఏకంగా బంగారు పతకాన్ని ఒడిసిపట్టాడు. స్పోర్ట్స్ స్కూల్లో ఇస్తున్న శిక్షణే తనను ఇక్కడి దాకా తీసుకొచ్చిందని చెబుతున్నాడు. విశాఖ జిల్లా చింతపల్లి మండలం కొత్తూరు బయలుకు చెందిన నందకిశోర్ది పేద గిరిజన వ్యవసాయ కుటుంబం. అరకు క్రీడా పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న అతడు లాంగ్జంప్లో విశేషంగా రాణిస్తున్నాడు. 2019లో కర్ణాటకలో జరిగిన జాతీయ స్థాయి అండర్–14 పోటీల్లో సిల్వర్ మెడల్ సాధించాడు. అలాగే ఈ ఏడాది అసోంలో జరిగిన నేషనల్ గేమ్స్లో సిల్వర్ మెడల్ గెలుచుకున్నాడు. జాతీయ స్థాయి పోటీల్లో బంగారు పతకం సాధించాలన్నదే తన లక్ష్యమని అంటున్నాడు. ప్రత్యేక ఆకర్షణగా అరకు క్రీడా పాఠశాల ప్రభుత్వం విశాఖపట్నం జిల్లా అరకులో ఏర్పాటు చేసిన గురుకుల క్రీడా పాఠశాల ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇక్కడ ప్రస్తుతం ఐదో తరగతి నుంచి పదో తరగతి వరకు 180 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి వారి ఆసక్తిని బట్టి విలువిద్య, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, హ్యాండ్బాల్, వాలీబాల్, ఫుట్బాల్, హాకీ, రగ్బీ, వెయిట్లిఫ్టింగ్లో శిక్షణ ఇస్తున్నారు. ఇందుకోసం మొత్తం ఏడుగురు కోచ్లు ఉన్నారు. ఇద్దరు విద్యార్థులు అంతర్జాతీయ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారు. ప్రస్తుతం 10వ తరగతి వరకే ఉండటం వల్ల అండర్–14లో మాత్రమే విద్యార్థులు పాల్గొంటున్నారు. త్వరలోనే జూనియర్ కాలేజీగా అప్గ్రేడ్ చేసి అండర్–16, అండర్–18లో కూడా పతకాలు సాధించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని స్కూల్ ప్రిన్సిపాల్ పీఎన్ఎన్ మూర్తి తెలిపారు. -
గిరిజన గురుకులాల్లో అక్షర యజ్ఞం
సాక్షి, అమరావతి: గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో అక్షర యజ్ఞం మొదలైంది. గురుకుల సొసైటీ పరిధిలోని గురుకుల పాఠశాలల్లో 45 శాతం మంది విద్యార్థులకు సబ్జెక్టులపై సరైన పట్టు లేదని గురుకుల కార్యదర్శి నిర్వహించిన బేస్లైన్ టెస్ట్లో స్పష్టం కావడంతో దిద్దుబాటు చర్యలు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 190 గిరిజన గురుకుల విద్యాలయాలు ఉండగా వీటిని 9 రకాలుగా విభజించారు. వేర్వేరు గురుకులాల్లో 28,237 మంది బాలురు, 19,149 మంది బాలికలున్నారు. కో ఎడ్యుకేషన్లో 3,664 మంది చదువుతున్నారు. మొత్తంగా చూస్తే గిరిజన గురుకులాల్లో 51,040 మంది విద్యార్థినీ విద్యార్థులున్నారు. మూడు సబ్జెక్టుల్లో తర్ఫీదు.. గురుకుల కార్యదర్శి నిర్వహించిన బేస్లైన్ టెస్ట్లో 20 వేల మందికి పైగా విద్యార్థులు సగటు కంటే తక్కువ విద్యా ప్రమాణాలు కలిగి ఉన్నట్లు వెల్లడైంది. దీంతో విద్యార్థులకు గణితం, ఆంగ్లం, తెలుగులో ప్రమాణాలు పెంపొందించేందుకు 15 రోజుల క్రితం గురుకుల సొసైటీ 50 రోజుల ప్రత్యేక కార్యాచరణను చేపట్టింది. ప్రతి పది రోజులకు ఒక అసెస్మెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. ప్రత్యేక యాప్తో నిత్యం పరిశీలన.. గురుకులాల్లో అక్షర యజ్ఞాన్ని విజయవంతం చేసేందుకు కార్యదర్శి ప్రత్యేక యాప్ను తయారు చేయించారు. రోజూ ఈ యాప్ ద్వారా మూడు సబ్జెక్టుల్లో విద్యార్థులు సాధించిన ప్రగతిని ఉపాధ్యాయుడు వివరించాలి. కార్యదర్శి ప్రతి స్కూలులో విద్యార్థుల ప్రమాణాలను ర్యాండమ్గా పరీక్షించి ఉపాధ్యాయుల పనితీరును అంచనా వేస్తారు. సంబంధిత ఉపాధ్యాయులకు బాధ్యతలు.. విద్యార్థులు మూడు సబ్జెక్టుల్లో మంచి పట్టు సాధించేందుకు సంబంధిత ఉపాధ్యాయులకు బాధ్యతలు అప్పగించారు. 50 రోజుల్లో గణితం, ఇంగ్లిష్, తెలుగులో పరిపూర్ణమైన అవగాహన కల్పించాల్సిన బాధ్యతను ఉపాధ్యాయులకు కేటాయించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే ఉపాధ్యాయులపై కొరడా ఝుళిపించేందుకు సైతం గురుకుల సంస్థ సన్నద్ధమైంది. 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ఈ 50 రోజుల కార్యక్రమంలో ఉన్నారు. వారికి అన్నీ ఒకటే! గురుకులాల్లో చదువుతున్న పీవీటీజీ విద్యార్థులతో పాటు పలు ఏజెన్సీ ఏరియాల్లో పిల్లలు వారి సొంత భాషలో మాట్లాడతారు. ఆ భాషలకు లిపిలేదు. అందువల్ల ఆ భాషలో బోధించే అవకాశం లేదు. వారు తెలుగు, ఇంగ్లిష్, హిందీని పరాయి భాషల మాదిరిగానే భావించే అవకాశం ఉన్నందున దీన్ని అధిగమించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఆత్మహత్యకు పాల్పడ్డ విద్యార్థి లేఖే ప్రేరణ ‘50 రోజుల అక్షర యజ్ఞానికి విశాఖ జిల్లా పాడేరు ఐటీడీఏ పరిధిలోని కొయ్యూరు బాలుర గురుకుల స్కూలు విద్యార్థి ఆత్మహత్య ఘటనే ప్రేరణగా నిలిచింది. స్కూళ్లు ప్రారంభమయ్యే సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డ ఆ విద్యార్థి తనకు తెలుగు రాదని లేఖలో పేర్కొన్నాడు. తనను తల్లిదండ్రులు చదువు రాని వాడు అంటున్నారని, స్నేహితులు గేలి చేస్తున్నారని మనస్థాపం చెందాడు. ఆ విద్యార్థి లేఖ నన్ను కదిలించింది. అందుకే బేస్లైన్ టెస్ట్ నిర్వహిస్తున్నాం. విద్యా ప్రమాణాల విషయంలో ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులే బాధ్యులు. గిరిజన విద్యార్థులు మట్టిలో మాణిక్యాలు. వారిలో పట్టుదల ఎక్కువ. ఉపాధ్యాయులు చొరవ తీసుకుంటే వారు ప్రపంచాన్ని జయిస్తారు’ – కె. శ్రీకాంత్ ప్రభాకర్, కార్యదర్శి, గిరిజన గురుకుల విద్యాలయాల సొసైటీ, తాడేపల్లి -
గురుకుల సెట్ ఫలితాలెప్పుడు?
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యా సంస్థల్లో ఐదో తరగతి అడ్మిషన్ల కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలపై ఉత్కంఠ వీడలేదు. పరీక్ష నిర్వహించి నెల గడిచినా ఫలితాలు వెలువడలేదు. సాధారణంగా గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతి అడ్మిషన్లకు సంబంధించి ఏప్రిల్ నెలాఖరు లేదా మే మొదటివారంలో పరీక్ష నిర్వహించి నెలాఖరు కల్లా ఫలితాలు ప్రకటిస్తారు. జూన్ మొదటి వారంలోగా ఈ ప్రక్రియ పూర్తయ్యేది. కానీ ఈ ఏడాది కరోనా నేపథ్యంలో మార్చి నుంచి విద్యా సంస్థలు మూతబడటం, ఇప్పటికీ వాటిని తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వక పోవడంతో పరీక్ష నిర్వహణలో తీవ్ర జాప్యం జరిగింది. ఈ క్రమంలో పలుమార్లు పరీక్షకు సంబంధించిన దరఖాస్తును పొడిగించిన అధికారులు.. కోవిడ్ తీవ్రత కాస్త సద్దుమణిగిన తర్వాత పరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా నవంబర్ 1న ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకుల పాఠశాలల్లో 50 వేల సీట్లుండగా.. రాష్ట్రవ్యాప్తంగా 1.5 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఈక్రమంలో నవంబర్ రెండో వారంలో ఫలితాలు ప్రకటించి, నెలాఖరు కల్లా అడ్మిషన్లు పూర్తి చేయాలని భావించారు. బోధనపైనా ప్రభావం.. విద్యా సంవత్సరం ప్రారంభమై ఆర్నెల్లు కావొస్తున్నా గురుకుల ఐదో తరగతిలో ఇంకా ప్రవేశాలు జరగకపోవడంతో బోధన ముందుకు సాగడం లేదు. ఇది విద్యార్థుల అభ్యాసనపై ప్రభావం చూపుతుందని ఉపాధ్యాయ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. -
నేటి నుంచి బీసీ గురుకుల స్కూళ్లు, కాలేజీలు ప్రారంభం
సాక్షి, అమరావతి: బీసీ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో 9, 10వ తరగతి, ఇంటర్ విద్యార్థులకు సోమవారం నుంచి తరగతులు ప్రారంభమవుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం పటిష్టమైన రక్షణ చర్యలు చేపట్టింది. ఏ ఒక్కరూ కరోనా వైరస్ బారిన పడకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ముందుగా తల్లిదండ్రుల సమ్మతి లేఖతో విద్యార్థులు గురుకులాలకు రావలసి ఉంటుంది. నాలుగు మాస్కులు వెంట తెచ్చుకోవాలి. గురుకులాల వద్ద విద్యార్థులను థర్మల్ స్కానర్లతో సంస్థ వైద్య బృందం పరీక్షిస్తుంది. కోవిడ్ లక్షణాలు ఉన్నట్లు అనుమానం వస్తే ఆ విద్యార్థిని వెంటనే తిరిగి ఇంటికి çపంపిస్తారు. కాగా క్లాసులు ఉదయం 8:15 నుండి సాయంత్రం 1:30 వరకు జరుగుతాయి. క్యాంపస్, హాస్టల్, డైనింగ్ హాల్, మరుగుదొడ్లు ఇలా ప్రతిచోటా విద్యార్థులు సురక్షిత వాతావరణంలో ఉండేలా చర్యలు తీసుకున్నారు. బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణమోహన్ వివరాలు వెల్లడించారు. ► చేతులు కడుక్కునేందుకు సబ్బు, హ్యాండ్ శానిటైజర్లు ఏర్పాటు. ► అందుబాటులో స్టాఫ్ నర్సులతో కూడిన ఆరోగ్య బృందాలు ► విద్యార్థుల ఆరోగ్యం గురించి తల్లిదండ్రులకు ఎప్పటికప్పుడు సమాచారం. ► ముందుజాగ్రత్త చర్యగా ప్రతి పాఠశాలలో ఐసోలేషన్ రూమ్ / వార్డ్ ఏర్పాటు ► ప్రతి తరగతి గదిలో 16 మందికి మించకుండా విద్యాబోధన. ► ల్యాప్టాప్లు, కంప్యూటర్లు, ట్యాబ్లు, పెన్సిళ్లు, లైబ్రరీ పుస్తకాలు, క్రీడా సామగ్రి వాడకం తాత్కాలికంగా నిలిపివేత. ► వసతి గృహంలో విద్యార్థులు మంచం, తువ్వాళ్లు, దుస్తులు, బూట్లు, సాక్స్లు వంటి తమ వస్తువులు దూరంగా, విడివిడిగా ఉంచుకునేలా ఏర్పాటు. ► మరుగుదొడ్లు, బాత్రూములను రోజుకు మూడుసార్లు శుభ్రం చేయాలి. ► అల్పాహారం, మధ్యాహ్న, రాత్రి భోజనానికి ముందు, ఆ తర్వాత డైనింగ్ హాల్ శుభ్రపరుస్తారు. ► ప్రతి విద్యార్థి తమ సొంత ప్లేట్, గ్లాసు, వాటర్ బాటిల్ తీసుకెళ్లాలి. ► సాధారణ అసెంబ్లీ ఉండదు. విద్యార్థులు ఆటలు ఆడుకునేందుకు అనుమతి లేదు. -
సంక్షేమ హాస్టళ్లు.. మన పిల్లలు చదివేలా ఉండాలి
సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని అన్ని సంక్షేమ హాస్టళ్లలో నాడు–నేడు అమలు చేసి, వాటి పరిస్థితులను సమూలంగా మార్చాలనేది ప్రభుత్వ సంకల్పమని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. మన కొడుకు లేక కూతురు ఆ హాస్టల్లో ఉండి చదివితే, అక్కడ ఎలా ఉండాలని కోరుకుంటామో.. ఆ విధంగా మన సంక్షేమ హాస్టళ్లను మార్చాలని అధికారులను ఆదేశించారు. సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలల్లో నాడు–నేడు అమలుపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో అధికారులు వెల్లడించిన అంశాలు, సీఎం ఆదేశాలు ఇలా ఉన్నాయి. ►నాడు–నేడులో భాగంగా హాస్టళ్లలో పూర్తి వసతులు కల్పిస్తాం. అన్ని హాస్టళ్లలో నాణ్యమైన ఆహారం, పరిశుభ్రత (శానిటేషన్), చక్కటి వాతావరణం, విద్యార్థులకు పుస్తకాలు, దుస్తులు ఉండాలి. బెల్టులు, దుప్పట్లు, అల్మారాలు, మంచాలు, ఇతర కనీస వసతులు కల్పించాలి. ►ముఖ్యంగా పిల్లలకు మంచి పౌష్టికాహారం ఇవ్వాలి. ఆహారంలో అన్ని రకాల పోషకాలు ఉండాలి. మెనూ ‘జగనన్న గోరుముద్ద’ మాదిరిగా ఉండాలి. జగనన్న విద్యా కానుకను హాస్టల్ విద్యార్థులకు కూడా ఇస్తాం. కాబట్టి హాస్టళ్లలో కూడా స్థితిగతులు పూర్తిగా మారాలి. ►పిల్లలకు ఏం కావాలి? ఏం ఇస్తే బాగుంటుంది? వారికి ఏ విధంగా మంచి పౌష్టికాహారం ఇవ్వాలి? అనేదానిపై ఆలోచన చేయాలి. దీనిపై మనం ఏది చెప్పినా, తప్పనిసరిగా అమలు చేయాలి. వీటన్నింటిపై పక్కాగా ప్రణాళిక రూపొందించి వీలైనంత త్వరగా ఆ ప్రక్రియ పూర్తి చేయాలి. (సాకారం కానున్న గిరిజన రైతుల స్వప్నం) 4,472 హాస్టళ్లలో 4,84,862 మంది విద్యార్థులు ►రాష్ట్రంలో సాంఘిక, గిరిజన, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖలకు సంబంధించి బాలురు, బాలికల కోసం మొత్తం 4,772 హాస్టళ్లు ఉండగా, 4,84,862 మంది విద్యార్థులు ఉన్నారని అధికారులు వెల్లడించారు. దాదాపు 4 వేల హాస్టళ్లు సొంత భవనాల్లో ఉన్నాయని తెలిపారు. నాడు–నేడు రెండో దశ కార్యక్రమంలో ఆ హాస్టళ్లలో మార్పులు చేస్తామన్నారు. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అంజాద్బాషా, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పి.విశ్వరూప్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖల అధికారులు పాల్గొన్నారు. (దర్యాప్తు ప్రారంభానికి ముందే స్టే ఎలా ఇస్తారు?) -
గురుకుల పాఠశాలల నిర్వహణకు ఏర్పాట్లు
సాక్షి, అమరావతి: గురుకుల విద్యా సంస్థల్లో క్లాసుల నిర్వహణకు సంబంధించి అధికారులు కొన్ని ప్రతిపాదనలను తయారు చేసి ప్రభుత్వానికి పంపించారు. కోవిడ్–19 వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అన్ని క్లాసులు ఒకేసారి నిర్వహించడం వీలుకాదని అధికారులు ఇటీవల సమావేశమై ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేశారు. ఈ సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి, బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి, గిరిజన సంక్షేమ శాఖ జాయింట్ సెక్రటరీ, ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి పాల్గొన్నారు. వీరు పంపిన సూచనలను ప్రభుత్వం పరిశీలించాల్సి ఉంది. అవేంటంటే.. ► 2020–21 విద్యా సంవత్సరానికి గురుకుల విద్యాలయాల్లో 9, 10, ఇంటర్ తరగతులను మాత్రమే నిర్వహించాలి. ► ప్రతి క్లాసును విద్యార్థుల సంఖ్య ఆధారంగా సెక్షన్లుగా విభజించాలి. ఒక్కో సెక్షన్లో 20 మంది విద్యార్థులు ఉండాలి. ► క్లాసులకు హజరయ్యే వారు చేతులను శుభ్రం చేసుకోవడం కోసం వాష్ బేసిన్ల సంఖ్యను పెంచాలి. ప్రతి విద్యార్థికి 3 మాస్కులు, శానిటైజర్ ఇవ్వాలి. పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న నర్సులకు కోవిడ్–19పై ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. ► విద్యార్థులకు వైద్య చికిత్స అవసరమైనప్పుడు తీసుకెళ్లేందుకు వీలుగా మారుమూల గురుకుల పాఠశాలల వద్ద ఒక వాహనం అందుబాటులో ఉండాలి. ► స్కూళ్ళకు సమీపంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని వైద్యులు నిత్యం అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ► గురుకులాల్లో మిగిలిన తరగతులు చదువుతున్న విద్యార్థులకు ‘విద్యామృతం’ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఆన్లైన్ ద్వారా పాఠాలు బోధించాలి. ► కరోనా వ్యాధిపై ప్రభుత్వం, వైద్య శాఖ సూచనల మేరకు దశల వారీగా మిగిలిన క్లాసుల విద్యార్థులను కూడా గురుకులాలకు పిలిపించాలి. -
గురుకులాలది తలోదారి
బోధన విషయంలో ఒక్కో గురుకులం ఒక్కో విధంగా సాగుతున్నాయి. ఎస్సీ గురుకులాల్లో వీడియోలు రూపొందించి వాట్సాప్ ద్వారా పంపిస్తున్నారు. మైనారిటీ, బీసీ గురుకులాల్లో జూమ్ యాప్ ద్వారా తరగతులు నిర్వహిస్తున్నారు. బాన్సువాడ రూరల్: నలుదిక్కులా కరోనా మేఘాలు కమ్ముకున్న ప్రస్తుత తరుణంలో విద్యార్థుల చదువులు అగమ్యగోచరంగా మారాయి. కరోనా కరుణ చూపే వరకు పాఠశాలల పున:ప్రారంభం కత్తిమీద సాము లాగే తయారైంది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, మేధావులు కూడా ఇప్పటికిప్పుడే పాఠశాలలను పున:ప్రారంభించరాదని సూచించారు. పరీక్షలు నిర్వహిస్తే ఎక్కడ కరోనా విస్తరిస్తుందోననే భయంతో ప్రభుత్వం ఇప్పటికే గతేడాది ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు పరీక్షలు లేకుండానే విద్యార్థులందరిని పాస్ చేసేసింది. ఇదిలా ఉండగా ఈసారి ఇటు విద్యా సంవత్సరం నష్టపోకుండా, అటు విద్యార్థులు చదువులకు దూరం కాకుండా ప్రభుత్వం నష్టనివారణ చర్యలు చేపడుతోంది. మొదట ఆన్లైన్ విద్యాబోధన చేయాలనుకున్న ప్రభుత్వం విద్యార్థులందనికీ వద్ద స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ సౌకర్యం ఉండదని భావించి దూరదర్శన్ ద్వారా విద్యార్థుల స్వీయ అధ్యయానికి అనుమతించింది. దీనిలో భాగంగా తెలంగాణాలో డీడీగిరి చానల్ ద్వారా విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధిస్తున్నారు. గత వారం నుంచి ఈ బోధన ప్రక్రియ ప్రారంభం కాగా విద్యార్థులు ఇంటివద్దనే ఉంటూ పాఠ్యాంశాలను నేర్చుకుంటుంన్నారు. ఒ క్కోచోట.. ఒక్కోరకంగా.. ♦ బోధనలో టీవీ పాఠాలకే ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా సూ చించినప్పటికీ గురుకుల సొసైటీ లు మాత్రం తమకు తోచిన పద్ధతిని అవలంభిస ♦ ఎస్సీ, ఎస్టీ గురుకుల పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ఉపాధ్యాయులు రూపొందించిన వీడియో పాఠాలను వాట్సాప్ ద్వారా చేరవేస్తున్నారు. అలాగే విలేజ్ లర్నింగ్ సర్కిల్స్ పేరుతో ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు, సీనియర్ విద్యార్థులు స్థానికంగా 10నుంచి 15మంది విద్యార్థులను సమీకరించి పాఠాలు బోధిస్తున్నారు. ♦మైనార్టీ గురుకుల పాఠశాలల్లో మాత్రం సొసైటీ రూపొందించిన షెడ్యూల్ ప్రకారం ఉపాధ్యాయులు విద్యార్థులకు జూమ్ యాప్ ద్వారా విద్యాబోధన చేస్తున్నారు. చాలా మంది తల్లిదండ్రుల వద్ద స్మార్టు ఫోన్లు లేకపోవడం సిగ్నల్ సమస్యతో సగానికి పైగా విద్యార్థులు చదువులకు దూరం అవుతున్నారు. ♦ బీసీ గురుకుల పాఠశాలల్లో కేవలం పదో తరగతి విద్యార్థులకు మాత్రమే జూమ్ యాప్ ద్వారా ఆన్లైన్ విద్యాబోధన కొనసాగుతుంది. మిగిలిన క్లాసులకు కూడా ఆన్లైన్ తరగతులను విస్తరించాలని భావిస్తున్నారు. ♦ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మాత్రం దూరదర్శన్ యాదగిరి ఛానల్ ద్వారానే స్వీయ అధ్యయనానికి ఉపాధ్యాయులు పురమాయిస్తున్నారు. డీడీ చానల్లో తరగతుల వేళలు ♦ 1, 2 తరగతుల వారికి ఉదయం 11గంటల నుంచి 12గంటల వరకు.. ♦ 3, 4, 5 తరగతుల వారికి ఉదయం12గంటల నుంచి ఒంటి గంట వరకు.. ♦ 6, 7 తరగతులకు మధ్యాహ్నం 2నుంచి 3గంటల వరకు.. ♦ 8,9 తరగుతల వారికి మధ్యాహ్నం 3 నుంచి 4గంటల వరకు.. ♦ పదో తరగతి విద్యార్థులకు మాత్రం ఉదయం 10నుంచి 11గంటల వరకు అలాగే సాయంత్రం 4నుంచి 5గంటల వరకు 2గంటల పాటు పాఠాలు ప్రసారం కానున్నాయి. -
బడికి రావాలి గురు!
సాక్షి, హైదరాబాద్: గురుకులాల టీచర్లు ఇక బడిబాట పట్టనున్నారు. అయితే, వారు వెళ్లేది పాఠం చెప్పేందుకు కాదు, సరికొత్త పాఠాలు నేర్చుకోవడానికి సుమీ! కరోనా కారణంగా మార్చి 16 నుంచి మూతబడిన గురుకుల పాఠశాలలు నేడు(బుధవారం) తిరిగి తెరుచుకోనున్నాయి. కరోనా వైరస్ తీవ్రంగా ప్రబలుతుండడంతో పాఠశాలల పునఃప్రారంభాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరికొంతకాలం వాయిదా వేసిన విషయం తెలిసిందే. టీచర్లు నైపుణ్యాభివృద్ధి శిక్షణ నిమిత్తం గురుకులాలకు హాజరు కావాలని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ(టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) స్పష్టం చేసింది. ఈ మేరకు బోధన, బోధనేతర సిబ్బందికి ఆదేశాలు జారీచేసింది. అయితే, టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్(గిరిజన), ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్ఈఐఎస్(వెనుకబడిన తరగతులు), టీఎంఆర్ఈఐఎస్(మైనార్టీ) టీచర్లకు మాత్రం ఎలాంటి సమాచారం అందలేదు. ఆన్లైన్ బోధనకు సిద్ధంగా.. ఈ నెల 31 వరకు లాక్డౌన్ అమల్లో ఉండనుంది. మరోవైపు ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు తమ విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాయి. ప్రభుత్వం కూడా ఈ దిశగా యోచిస్తోంది. నైపుణ్యాభివృద్ధి శిక్షణ నిమిత్తం గురుకులాలకు హాజరయ్యే టీచర్లు తమ సబ్జెక్టులపై మూడు నిమిషాల నిడివి గల వీడియోలను రూపొందించాలి. ఈ వీడియోలో గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ జోడించేలా ప్రయత్నించాలి. ప్రతి గురుకులంలో ఉన్న కంప్యూటర్ ల్యాబ్ ఉపయోగించుకొని అవసరమైన ప్రాజెక్టులను రూపొందించాలని సొసైటీ ఆదేశాలు జారీ చేసింది. దీర్ఘకాలిక వ్యాధులు, ఇతర అనారోగ్య సమస్యలున్నవారు, కంటైన్మెంట్ జోన్ పరిధిలోనివారికి విధుల నుంచి మినహాయింపు ఇచ్చింది. కోవిడ్–19 వ్యాప్తి పెరుగుతున్న క్రమంలో విధులకు హాజరుకావాలనడం పట్ల గురుకుల టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
70 మంది విద్యార్థులకు అస్వస్థత
సిద్దిపేట రూరల్: సిద్దిపేట జిల్లాలో మహాత్మా జ్యోతిబా పూలే బాలుర గురుకుల పాఠశాలలో 70 మంది విద్యార్థులు చర్మ సమస్యలతో అస్వస్థతకు గురయ్యారు. ముఖాలపై ఎర్రటి పొక్కులతో చర్మం పొలుసుబారడంతో విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. కాగా 70 మంది పిల్లలు అస్వస్థతకు గురైనప్పటికీ సంబంధిత అధికారులు అటువైపు చూడకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. మిణుగురు పురుగులు కుట్టడంవల్లే విద్యార్థులు అస్వస్థతకు గురై ఉంటారని వైద్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వివరాలు.. నారాయణరావుపేట జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలకు సొంత భవనాన్ని నిర్మిస్తున్ననేపథ్యంలో స్కూల్ను తాత్కా లికంగా సిద్దిపేట శివారులోని ఎల్లంకి కళాశాల లోకి మార్చారు. 5వ తరగతి నుంచి 9వ తరగతివరకు 327 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తూ హాస్టల్లో ఉంటున్నారు. పాఠశాలలో పైఅంతస్తులోని డార్మిటరీ హాల్లో విద్యార్థులు నిద్రించేందుకు ఏర్పాటు చేశారు. కొన్ని రోజులుగా కొందరు విద్యార్థుల మొఖాలపై ఎర్రటి పొక్కులు ఏర్పడ్డాయి. బుధవారం పాఠశాలలో మొత్తంగా 70 మందికిపైగా పొలుసుబారిన చర్మంతో అస్వస్థతకు గురయ్యారు. దీంతో పలువురు తల్లిదండ్రులు తమ పిల్లలను జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు చికిత్స చేసినప్పటికీ ముఖాలపై చర్మం పొలుసుబారడం తగ్గకపోవడంతో పిల్లల అస్వస్థతకు గల కారణంపై సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. వైద్య పరీక్షలు చేయిస్తున్నాం.. మిణుగురు పురుగులతో విద్యార్థులకు చర్మం పొలుసుబారిపోవడంతో వెంటనే వైద్యులకు చూపించాం. పిల్లలు డారి్మటరీ రూంలోని తెరలను తొలగించడంతో పురుగులు వస్తున్నాయి. పూర్తి స్థాయిలో మెష్లు ఏర్పాటు చేసేలా చూసుకుంటాం. –మహబూబ్ అలీ, ప్రిన్సిపాల్ -
హైక్లాస్ గురుకులాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని గురుకుల విద్యాలయాల్లోని విద్యార్థులకు ఎప్పటికప్పుడు కొత్త అంశాలను ఒకేసారి బోధించేందుకు అత్యాధునికమైన వర్చ్యువల్ క్లాస్రూంల వ్యవస్థకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ వర్చ్యువల్ క్లాస్రూంల విధానంలో పాఠ్యాంశాలు బోధించడమే కాకుండా.. వివిధ జిల్లాల్లోని విద్యార్థులతో ప్రజాప్రతినిధులు, అధికారులు నేరుగా మాట్లాడే అవకాశముంటుంది. అలాగే గురుకుల పాఠశాలల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో.. తాడేపల్లిలోని కంట్రోల్ కేంద్రం నుంచే ఎప్పటికప్పుడు తనిఖీ చేసే అవకాశం ఏర్పడింది. 105 గురుకులాల్లో వర్చ్యువల్ క్లాస్రూంలు రాష్ట్రంలో గురుకుల సొసైటీ ఆధ్వర్యంలో మొత్తం 189 విద్యాసంస్థల్ని నిర్వహిస్తుండగా.. ప్రస్తుతం 105 గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో వర్చ్యువల్ క్లాస్ రూంలను ఏర్పాటు చేశారు. గురుకుల సొసైటీ ప్రధాన కార్యాలయం నుంచి వర్చ్యువల్ క్లాస్ రూంలతో మాట్లాడేందుకు స్టూడియో నిర్మించారు. ఈ స్టూడియో నుంచే రాష్ట్రంలోని అన్ని గురుకుల విద్యాసంస్థల్లోని విద్యార్థులకు ఒకేసారి పాఠాలు బోధించడంతో పాటు.. నేరుగా మాట్లాడవచ్చు. రాష్ట్రంలోని విశాఖపట్నం, యర్రగొండపాలెం, కురుపాం, పార్వతీపురం, శ్రీకాళహస్తి, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, తనకల్లు తదితర ప్రాంతాలకు చెందిన విద్యార్థులతో ఇటీవల గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పుష్ప శ్రీవాణి, అధికారులు మాట్లాడారు. వసతులు, విద్యా బోధనపై మంత్రి స్వయంగా విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ విద్యార్థుల రక్షణ, విద్యాసంస్థల నిర్వహణలో ఎలాంటి అవకతవకలు చోటుచేసుకోకుండా పర్యవేక్షణ కోసం రాష్ట్రంలోని గిరిజన విద్యాసంస్థల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఒక్కో పాఠశాలల్లో నాలుగు కెమెరాలు అమర్చినట్లు గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ పి.రంజిత్ బాషా వెల్లడించారు. ఈ కెమెరాల సాయంతో పాఠశాలల్లో విద్యార్థులకు అందించే ఆహారం, ఇతర వసతుల్ని, విద్యార్థుల భద్రతను ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు అవకాశం ఉంటుంది. సీసీ కెమెరాల ఏర్పాటుతో విద్యాసంస్థల్లోని బాలికలకు రక్షణ ఉంటుందని, క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయుల పనితీరు మెరుగుపడే అవకాశముంటుందని రంజిత్ బాషా పేర్కొన్నారు. ఈ కెమెరాలను క్షేత్రస్థాయిలో ఆపేందుకు వీలులేకుండా తాడేపల్లిలోని కమాండ్ కంట్రోల్ యూనిట్ ఎప్పటికప్పుడు నియంత్రిస్తుంది. విద్యాసంస్థల్లోని ఆర్థిక లావాదేవీలు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసేందుకు, టీచర్లు, విద్యార్థుల హాజరును నిర్ధారించుకొని ఆ మేరకు సరుకులు, ఇతర వస్తువులు విడుదల చేయడానికి ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. -
గురుకులాలకు కొత్త రూపు
సాక్షి, అమరావతి: బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాలు విద్యార్థులకు అన్నివిధాలా ఉపయోగపడేలా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అత్యవసరంగా కనీస మౌలిక వసతులు కల్పించడానికి నిధులు కేటాయించింది. టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఇన్నాళ్లుగా సవాలక్ష సమస్యలతో కునారిల్లిన వీటిని అన్ని విధాలా తీర్చిదిద్దేందుకు నూతన ప్రభుత్వం కార్యాచరణను ప్రారంభించింది. మొత్తం 106 బీసీ గురుకుల విద్యాలయాలు ఉంటే అందులో భవనాలు లేక ఇప్పటికీ 20 గురుకుల స్కూళ్లను గత ప్రభుత్వం ప్రారంభించలేదు. 60 గురుకుల స్కూళ్లు ప్రైవేట్ భవనాల్లో నడుపుతున్నారు. ఈ భవనాలు విద్యార్థులు చదువుకోవడానికి అనువుగా లేవు. అన్నింటిలో మొత్తం 27,212 మంది విద్యార్థినీ, విద్యార్థులు కనీస సౌకర్యాలు లేకుండా విద్యాభ్యాసం చేస్తున్నారు. బీసీ విద్యార్థుల దుస్థితిని గుర్తించిన ప్రభుత్వం అత్యవసరంగా మౌలిక వసతులు (బాత్రూములు, మంచినీటి పైపులు, సెప్టిక్ ట్యాంకులు, భవనంలో దెబ్బతిన్న నేలలకు మరమ్మతులు, ఫ్యాన్లు, లైట్ల ఏర్పాటు, విద్యుత్ వైరింగ్, భవనాలకు పెయింట్లు, అదనపు తరగతి గదులు, మరుగుదొడ్లు, డార్మెట్రీలు, ఓపెన్ ఎయిర్ ఆడిటోరియంలు, ల్యాబుల ఏర్పాటు) కల్పించేందుకు రూ.4 కోట్లు మంజూరు చేసింది. కాగా, సాంఘిక, గిరిజన, మైనార్టీ సంక్షేమ గురుకుల విద్యాలయాలు, హాస్టళ్లలో ‘నాడు–నేడు’ కార్యక్రమం కింద వసతులు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. 4 భవనాల నిర్మాణాలు పూర్తి ప్రస్తుతం నాలుగు గురుకుల భవనాల నిర్మాణం పూర్తి కావస్తోంది. గుండుమల (బాలురు), గుండిబండ (బాలికలు), గొనబావి (బాలికలు), ఉదయమాణిక్యం (బాలికలు)ల్లో నిర్మాణాలు తుదిదశకు చేరుకున్నాయి. ప్రతిపాదనలు సిద్ధం రాష్ట్రంలో 26 బీసీ గురుకుల విద్యాలయాలు ప్రభుత్వ భవనాల్లో ఉన్నాయి. బాలికలవి 16, బాలురవి 10. ఈ స్కూళ్లలో వసతుల కోసం రూ.52.63 కోట్లతో గురుకుల విద్యాలయాల సంస్థ ప్రతిపాదనలు తయారుచేసి ప్రభుత్వానికి పంపింది. ఒక్కో భవనానికి రూ. 60 కోట్లు ప్రస్తుతం 60 గురుకులాలు అద్దె భవనాల్లో ఉంటున్నాయి. 52 స్కూళ్ల నిర్మాణానికి స్థలాలు ఇవ్వాల్సిందిగా రెవెన్యూ శాఖను బీసీ గురుకుల సొసైటీ కోరింది. కొత్తగా ఒక్కో భవనానికి రూ.60 కోట్లతో మొత్తం 76 భవనాల నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేసింది. రూ.4,560 కోట్లు అవుతుందని అంచనా. నిధులు సమకూర్చడానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. త్వరలోనే అన్ని సౌకర్యాలు త్వరలోనే బీసీ గురుకుల విద్యాలయాల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. ప్రైవేట్ భవనాల్లో ఉన్న స్కూళ్లలో పూర్తిస్థాయి సౌకర్యాలు లేవు. అయినా విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. కొత్త భవనాల నిర్మాణాలు, స్థల సేకరణ విషయంలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. – ఎ కృష్ణమోహన్, కార్యదర్శి, బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ. గిరిజన విద్యార్థులకు సమకూరిన సదుపాయాలు సీఎం ఆదేశాలతో కదిలిన యంత్రాంగం రాష్ట్రంలోని గిరిజన సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లోని విద్యార్థులకు అన్ని సదుపాయాలు సమకూరాయి. రెండు నెలల క్రితం నిర్వహించిన గిరిజన సంక్షేమ శాఖ సమీక్షలో విద్యార్థులకు సదుపాయాలు కల్పించడంలో విఫలమైతే చర్యలు తప్పవని, రెండు నెలల్లో పూర్తి సదుపాయాలు కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. దీంతో అధికార యంత్రాంగం ఆగమేఘాలపై ఏర్పాట్లు చేసింది. గిరిజన హాస్టల్ విద్యార్థులకు 32,88,499 నోట్ పుస్తకాలు, 98,706 కార్పెట్స్, 8,315 బెడ్షీట్స్, 14,72,146 మీటర్ల యూనిఫామ్ క్లాత్, 90,391 ఉలెన్ దుప్పట్లు, 53,181 ట్రంకు పెట్టెలు, 53,181 ప్లేట్లతోపాటు గ్లాసులు, 4,560 బంక్ బెడ్స్, 2,114 డ్యూయల్ డెస్క్లు సమకూర్చారు. గురుకుల బాలికల హాస్టళ్లకు 375 పొయ్యిలు, 1,119 డీప్ ఫ్రిజ్లు అందించి నూరు శాతం హాస్టళ్లు, గురుకుల విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించారు. గురుకుల విద్యార్థులకు ఏడాదికి నాలుగు జతల బట్టలు ఇవ్వాల్సి ఉండటంతో.. 7.96 లక్షల మీటర్ల క్లాత్, 9.35 లక్షల నోట్ పుస్తకాలు అందించారు. 52 వేల కార్పెట్స్, 25,229 బెడ్ షీట్స్, 52 వేల కండువాలు, 25,949 ఉలెన్ దుప్పట్లు, 51,506 బ్లాక్ షూస్, రెండేసి జతల సాక్స్లు, 51,506 వైట్ షూస్, రెండేసి జతల సాక్స్లు అందించారు. యూనిఫామ్ను మెప్మా సభ్యులతో కుట్టించే కార్యక్రమాన్ని గత ప్రభుత్వం చేపట్టగా.. చాలాచోట్ల ఈ పని పూర్తి కాలేదు. 2019–20వ సంవత్సరానికి సంబంధించి యూనిఫామ్ క్లాత్ను అందజేసి, కుట్టు చార్జీలను సైతం విద్యార్థుల తల్లిదండ్రులకే ఇచ్చారు. -
గురుకులాల్లో స్పెషల్ ప్లాన్
సాక్షి, హైదరాబాద్:పాఠశాలల్లో అత్యుత్తమ ఫలితాల కోసం గురుకుల సొసైటీలు ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తున్నాయి. ఏటా వంద రోజుల ప్రణాళికను అమలు చేస్తున్నప్పటికీ... ఈ సారి వరుస సెలవులు రావడం...ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో తలెత్తిన ఇబ్బందులను అధిగమించేందుకు గురుకుల సొసైటీలు ముం దస్తు చర్యలకు దిగాయి. ఇందులో భాగంగా ప్రత్యేక తరగతుల నిర్వహణ, ప్రతి రోజు పరీ క్షలు నిర్వహిం చేందుకు ఉపక్రమించాయి.ఈ మేరకు కార్యాచరణ సిద్ధం చేసి పాఠశాల ప్రిన్సిపాళ్లకు పం పించాయి. వాస్తవానికి ప్రతి సంవత్సరం నూరు రోజుల ప్రణాళిక పేరిట గురుకుల సొసైటీలు డిసెంబర్ నుంచి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టేవి. కానీ ఈసారి నవంబర్ నుంచే అమలు చేసేం దుకు సిద్ధమయ్యాయి. వరుసగా 24 రోజులు సెలవులు రావడంతో విద్యార్థుల్లో అభ్యసనా కార్యక్రమాలు తగ్గాయి. ఈ నెల 20 నాటికి గురుకులంలో రిపోర్టు చేయాలని సూచించినా... ఆదివారం సాయంత్రానికి చాలా పాఠశాలల్లో విద్యార్థులు రాలేదు.రవాణా సమస్యలే దీనికి కారణమని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో విద్యార్థుల్లో బోధన, అభ్యసన పట్ల శ్రద్ధ తగ్గకుండా ప్రత్యేక ప్రణాళిక అమలు చేయాలని నిర్ణయించాయి. ప్రతిరోజు స్పెషల్ క్లాసులు... నవంబర్ మొదటి వారం నుంచి 8, 9, 10 తరగతులకు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తారు. ఒకే సబ్జెక్టుపైన ఉదయం పూట బోధన, సాయంత్రం పూట అభ్యసన, సందేహాల నివృత్తితో పాటు పరీక్షను నిర్వహిస్తారు. ఇలా వారంలో అన్ని సబ్జెక్టులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుని, విద్యార్థి సామర్థ్యాన్ని అంచనా వేస్తారు. ప్రతి ఆదివారం విద్యార్థుల సామర్థ్యంపై ఉపాధ్యాయులు విశ్లేషించి, తక్కువ సామర్థ్యం ఉన్న వారిపై ప్రత్యేక దృష్టి సారిస్తారు. ఇలాంటి వారు ఎక్కు వ మంది ఉంటే ఒక బృందంగా ఏర్పాటు చేసి ప్రత్యేక బోధన తరగతులు నిర్వహించి, సామర్థ్యాన్ని మెరుగుపర్చేలా వివిధ రకాల కార్యక్రమాలు చేపడతారు. ఈ ప్రణాళికకు అదనంగా పదో తరగతికి మరో కార్యాచరణ అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఆర్సీలకు నివేదికలు... పాఠశాల వారీగా విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసిన తర్వాత ఆ వివరాలను రీజినల్ కో–ఆర్డినేటర్ల(ఆర్సీ)కు సమర్పించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి నిర్దేశిత ప్రొఫార్మాలను గురుకుల సొసైటీ తయారు చేసి ప్రిన్సిపాళ్లకు పంపింది. దాని ఆధారంగా వివరాలను ఆన్లైన్లో ఆర్సీలకు సమర్పిస్తే వాటిని క్రోడీకరించి సొసైటీ కార్యాలయానికి పంపిస్తారు. క్షేత్రస్థాయి నుంచి వచ్చిన నివేదికలను సొసైటీ కార్యాలయాల్లో విశ్లేషించి, తదుపరి కార్యాచరణను రూపొందిస్తారు. -
హౌ గురుకుల వర్క్స్?
సాక్షి, హైదరాబాద్ : విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన సంక్షేమ గురుకుల పాఠశాలల ఖ్యాతిని రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచానికి చాటింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రభుత్వం గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసింది. ప్రతి ఒక్క విద్యార్థికి నిర్బంధ ఉచిత విద్యను అందించాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం.. ప్రతి యేటా వందల సంఖ్యలో గురుకులాలను తెరుస్తూ వచ్చింది. రాష్ట్రంలో 650కి పైగా గురుకుల పాఠశాలలు, మరో 250 రెసిడెన్షియల్ జూనియర్, డిగ్రీ కాలేజీ లు ఉన్నాయి. వీటిల్లో చదువుతున్న విద్యార్థులు ప్రఖ్యాత విద్యా సంస్థల్లో అవకాశాలను అందిపుచ్చుకుంటున్న తీరుపై అమెరికాలోని ప్రముఖ విద్యా సంస్థ అయిన హార్వర్డ్ విశ్వవిద్యాలయ బృందం అధ్యయనం చేయనుంది. ఈ మేరకు సమాచారాన్ని ఈమెయిల్ ద్వారా రాష్ట్ర గురుకుల సొసైటీలకు పంపింది. గురుకుల విద్యా వ్యవస్థపై.. సంక్షేమ గురుకుల పాఠశాలల్లో విద్యా కార్యక్రమాల అమలుపై హార్వర్డ్ యూనివర్సిటీ ప్రతినిధి బృందం అధ్యయనం చేయనుంది. కేవలం రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా గురుకులాల తీరును పరిశీలించనుంది. దీనిలో భాగంగా కొన్ని గురుకుల పాఠశాలలను ఎంపిక చేసుకుని అక్కడ క్షేత్ర స్థాయి పర్యటనలు నిర్వహించి పరిస్థితులను స్వయంగా వీక్షించనుంది. దేశీయ విద్యా వ్యవస్థలో పేద పిల్లలకు ఎలాంటి విద్యనందిస్తున్నారు? ఈ విద్యా కార్యక్రమాల అమలుకు ఎలాంటి కార్యాచరణ రూపొందిస్తున్నారు? ఈ శతాబ్దానికి కావాల్సిన నైపుణ్యాలు, భవిష్యత్తరాలకు ఎలా ఉపయోగపడతాయి? వాటిని ఎలా మార్పులతో అందిస్తున్నారు? తదితర అంశాలను లోతుగా పరిశీలించనుంది. రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో అత్యంత పోషక విలువలున్న ఆహారాన్ని ప్రభు త్వం విద్యార్థులకు అందిస్తోంది. అదేవిధంగా వసతి కోసం కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటోం ది. ఈ క్రమంలో హార్వర్డ్ వర్సిటీ విద్యావ్యవస్థతో పాటు సంక్షేమ గురుకుల పాఠశాలల్లో విద్యా కార్యక్రమాలతో పాటు విద్యేతర కార్యక్రమాలను కూడా అధ్యయనం చేసే అవకాశం ఉంది. త్వరలో ఈ పరిశీలన బృందం రాష్ట్రానికి రానుంది. ఈ మేరకు హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఫెర్నాం డో రీమర్స్ గురుకుల సొసైటీకి లేఖ రాశారు. -
నేటి నుంచి కొత్త బీసీ గురుకులాలు
సాక్షి, హైదరాబాద్: 2019–20 విద్యా సంవత్సరానికి ప్రభుత్వం మంజూరు చేసిన 119 బీసీ గురుకులాలను నేడు (17న) ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ గురుకులాలన్నింటినీ సోమవారం ఏకకాలంలో ప్రారంభించాలని నిర్ణయించింది. వీటి ప్రారంభంతో మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్ఈఐఎస్) పరిధిలో పాఠశాలల సంఖ్య 257కు చేరనుంది. రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఈ ప్రాంతంలో కేవలం 19 బీసీ గురుకుల పాఠశాలలు మాత్రమే ఉండేవి. తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కేజీ టు పీజీ మిషన్ కింద గురుకుల పాఠశాలలను తెరుస్తూ వచ్చింది. ఇందులో భాగంగా 2017–18 విద్యా సంవత్సరంలో 119 గురుకుల పాఠశాలలను మంజూరు చేసింది. అయితే జనాభాలో సగభాగం ఉన్న బీసీలకు ఆ ఏడాది ప్రారంభించిన గురుకులాల సంఖ్య తక్కువే. గురుకులాలకు డిమాండ్ అధికంగా ఉండటం... పాఠశాలల్లో సీట్ల సంఖ్య పరిమితంగా ఉండటంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించిన ప్రభుత్వం గతేడాది మరో 119 గురుకుల పాఠశాలలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటిని 2019–20 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించనున్నట్లు స్పష్టం చేసింది. ఈ క్రమంలో చర్యలు చేపట్టిన బీసీ గురుకుల సొసైటీ యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు పూర్తి చేసింది. సవాళ్లను అధిగమించి... కొత్త గురుకుల పాఠశాలల ఏర్పాటులో ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్ఈఐఎస్ పలు సవాళ్లను ఎదుర్కొం ది. గత మూడేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 400 గురుకులాలను ప్రభుత్వం ప్రారంభించింది. దీంతో కొత్తగా మరో 119 మంజురు చేయగా... వాటి ఏర్పాటుకు భవనాల గుర్తింపు పెను సవాలుగా మారింది. అందుబాటులో ఉన్న దాదాపు అన్ని భవనాలు అప్పటికే గురుకులాల ఏర్పాటు కోసం అద్దెకు తీసుకోవడంతో భవనాల కొరత విపరీతమైంది. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం.. భవనాల లభ్యత లేకపోవడంతో అధికారులు సైతం తలపట్టుకున్నారు. దాదాపు ఏడాది పాటు భవనాల కోసం పరిశీలించారు. పలుచోట్ల యజమానులతో దఫాల వారీగా చర్చలు జరిపి, మరమ్మతులకు ఒప్పించి మొత్తంగా అవసరమైన మేర అద్దె భవనాలను గుర్తించారు. కొన్ని చోట్ల మాత్రం అనువైన భవనాలు లేని కారణంగా ప్రస్తుతమున్న గురుకుల పాఠశాలల్లోనే ఏర్పాట్లకు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో బాల, బాలికల బీసీ గురుకుల పాఠశాలలున్నాయి. 2017–18లో ప్రారంభించిన 119 గురుకులాలను డిమాండ్ను బట్టి బాల బాలికలుగా విభజించినప్పటికీ... తాజాగా ప్రారంభిస్తున్న గురుకులాలతో బ్యాలెన్సింగ్ పద్ధతితో బాలబాలికల పాఠశాలలను ఏర్పాటు చేశారు. మొత్తం 257 బీసీ గురుకులాల్లో 94,800 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. మరో రెండేళ్లలో ఈ విద్యార్థుల సంఖ్య లక్ష దాటనుంది. గురుకులాల్లో జూనియర్ కాలేజీలు సైతం ప్రారంభిస్తే విద్యార్థుల సంఖ్య రెట్టింపు కానుంది. కొత్త గురుకులాల ప్రారంభంతో ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్ఈఐఎస్ అతి పెద్ద గురుకుల సొసైటీగా అవతరించింది. ఇప్పటివరకు 238 గురుకుల పాఠశాలలతో పెద్ద సొసైటీగా ఉన్న సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ (టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) రికార్డును బీసీ గురుకుల సొసైటీ అధిగమించింది. వచ్చే ఐదేళ్లలో అత్యధిక విద్యార్థులున్న విద్యా సంస్థగా బీసీ గురుకుల సొసైటీ రూపుదాల్చనుంది. -
వేల రూపాయల ఫీజులు కట్టలేని పేదలకు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు రాష్ట్రంలోని ప్రతి పేద విద్యార్థికి ఉచిత విద్య అందించ సంకల్పించారని, అందుకే మహాత్మా జ్యోతిరావ్ పూలే బీసీ గురుకులాలు ప్రారంభం కాబోతున్నాయని తెలంగాణ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. వేల రూపాలయల ఫీజులు కట్టలేని పేదలకు ఈ పాఠశాలలు నిర్మించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించినట్లు పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 17న 119 బీసీ గురుకుల పాఠశాలలు ప్రారంభం కాబోతున్నాయని చెప్పారు. మొత్తం 119 గురుకుల పాఠశాలలతో కలుపుకుని మొత్తం 162 గురుకుల పాఠశాలలు అందుబాటులోకి రాబోతున్నాయని తెలిపారు. ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో గురుకుల పాఠశాల ఉందన్నారు. ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలు అన్నీ ప్రజల ముందుకు వస్తున్నాయన్నారు. తెలంగాణ ఏర్పడ్డ నాటికి 19 గురుకుల పాఠశాలలు మాత్రమే ఉన్నాయని, ఇప్పుడు మొత్తం162 పాఠశాలలు ప్రారంభం అయ్యాయన్నారు. ఇంగ్లీష్ విద్య, విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి విద్యార్థి భవిష్యత్తు ప్రగతే లక్ష్యంగా తెలంగాణ ముందుకెళ్తుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ విద్యార్థులకు వరంగా ఉన్నత విద్యను అభ్యసించాలనే ఉద్ధేశ్యంతో ముఖ్యమంత్రి వీటిని ఏర్పాటు చేస్తున్నారని పేర్కొన్నారు. గురుకులాల్లో అడ్మిషన్ కోసం పోటీ పడుతున్నారని, గతంలో సీటు ఇస్తామన్నా వచ్చే వారు కాదన్నారు. సీట్ల పెంపుపైన సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నారని చెప్పారు. -
ఒక టీచర్.. ఒక కలెక్టర్.. ఒక మంచి పని..
కేసముద్రం: పిల్లలకు పాఠాలు బోధించడానికి తరగతి గదుల కోసం ఓ ఉపాధ్యాయుడు ఊరంతా వెతికాడు. ఎక్కడా గదులు లభించకపోవడంతో చెట్టు కిందే వారికి పాఠాలు చెప్పాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రం శివారు బ్రహ్మంగారి తండాలో బుధవారం చోటుచేసుకుంది. 2015లో అధికారులు, తండాపెద్దల చొరవతో తండాలో ఇంగ్లిష్ మీడియం ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేయగా, ఓ ఇంటి యజమాని స్వచ్ఛందంగా 2 గదులు కేటాయించాడు. అప్పటి నుంచి ఆ పాఠశాలను సింగిల్ టీచర్ వెంకటేశ్వర్లు కొనసాగిస్తున్నారు. మొదట్లో 46 మంది ఉండగా.. ప్రస్తుతం వారి సంఖ్య 72కు చేరింది. గతంలో ఇంటిని ఇచ్చిన యజమాని తమ కుటుంబ అవసరాల నిమిత్తం గదులు ఇవ్వలేనని చేతులెత్తేశాడు. దీంతో వెంకటేశ్వర్లు ‘పాఠశాల నిర్వహణకు మీ ఇళ్లు ఇస్తారా’ అంటూ ఊరంతా తిరిగాడు. చివరకు తండాలోని అంగన్వాడీ టీచర్ ముందుకొచ్చినా, సరిపడా స్థలం లేక.. ఓ చెట్టు నీడన పిల్లల్ని కూర్చోబెట్టి పాఠాలు బోధించాడు. సాక్షి, వికారాబాద్: వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఆయేషా మస్రత్ ఖానమ్ మాత్రం తనకూతురు తాబిస్ రైనాను మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలలలో చేర్పించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. కలెక్టర్కు ఒక బాబు, పాప ఉన్నారు. పాప తాబిష్ రైనా ఖమ్మంలోని హార్వెస్ట్ పబ్లిక్ స్కూల్లో నాలుగో తరగతి పూర్తి చేసింది. దీంతో ఐదో తరగతి కోసం ఆమె తన కూతురును వికారాబాద్లోని మైనార్టీ గురుకుల బాలికల పాఠశాల–1 లో డే స్కాలర్గా చేర్పించారు. బుధవారం ఉదయం తన కూతురు తాబిష్ రైనాను పాఠశాలకు పంపించారు. మైనార్టీ గురుకుల పాఠశాలల్లో విద్యాబోధన బాగుందని, అందుకే తన కూతురుని గురుకుల పాఠశాలలో చేర్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ చెప్పారు. కలెక్టర్ కూతురును తమ పాఠశాలలో చేర్పించడం ఎంతో ఆనందంగా ఉందని, పిల్లలు సైతం సంతోషం వ్యక్తం చేశారని మైనార్టీ గురుకుల పాఠశాలల కార్యదర్శి షఫీయుల్లా అన్నారు. -
ప్రతి ఒక్కరి సంక్షేమం ప్రభుత్వ లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: ప్రతి ఒక్కరి సంక్షేమం ప్రభుత్వ లక్ష్యమని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. కేజీ టు పీజీ మిషన్లో భాగంగా తలపెట్టిన గురుకుల పాఠశాలలు అద్భుత ఫలితాలు సాధిస్తున్నాయని, విద్యార్థుల సంఖ్యకు తగినట్లు కొత్త గురుకులాలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వివరించారు. సోమవారం సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. అంతకుముందు బీసీ గురుకుల సొసైటీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 17 నుంచి కొత్తగా 119 గురుకుల పాఠశాలలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన ఏర్పాట్లపై అధికారులతో మాట్లాడారు. గురుకుల బోధన ఉన్నతంగా ఉండాలనేది సీఎం కేసీఆర్ ఆశయమని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు కేవలం 19 బీసీ గురుకులాలు మాత్రమే ఉండేవని, ఇప్పుడు వీటిసంఖ్య 257కు పెరిగిందన్నారు. 2017–18 విద్యా సంవత్సరంలో 119 గురుకుల పాఠశాలలు ప్రారంభించగా 2019– 20 విద్యాసంవత్సరంలో మరో 119 గురుకులాలు అందుబాటులోకి తేనున్నట్లు వెల్లడించారు. అలాగే 19 జూనియర్ కాలేజీలు, ఒక మహిళా డిగ్రీ కాలేజీని ప్రారంభించినట్లు చెప్పారు. కొత్త గురుకులాలకు భవనాలు సిద్ధం కొత్తగా ఏర్పాటయ్యే 119 గురుకుల పాఠశాలలకు భవనాలు సిద్ధం చేశామని మంత్రి ఈశ్వర్ చెప్పారు. ఈ పాఠశాలల్లో 2019–20 విద్యాసంవత్సరంలో 5, 6, 7 తరగతులు ప్రారంభిస్తున్నామని, ఇప్పటికే అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైందన్నారు. ప్రిన్సిపాళ్ల బాధ్యతల విషయంలో పాత స్కూల్లో పనిచేస్తున్నవారికి కొత్త స్కూళ్ల అదనపు బాధ్యతలు ఇచ్చామని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే వరకు ఈ బాధ్యతల్లో కొనసాగాల్సి ఉంటుందని చెప్పారు. కొత్త స్కూళ్లకు 3,689 పోస్టులు ప్రభుత్వం మంజూరు చేసిందని, వీటిని వివిధ దశల్లో భర్తీ చేస్తామన్నారు. అప్పటి వరకు పాత పాఠశాలల నుంచి ఇద్దరు టీచర్ల చొప్పున కొత్త పాఠశాలలకు డిప్యుటేషన్ మీద పంపు తున్నట్లు చెప్పారు. అవసరమున్నచోట పీఈటీ, స్టాఫ్ నర్సులు, బోధనేతర సిబ్బందిని ఔట్ సోర్సింగ్ విధానంలో తీసుకునేలా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు. 98 శాతం పాఠశాలలకు నోటు పుస్తకాలు, పాఠ్యపుస్తకాల సరఫరా పూర్తి అయిందని పేర్కొన్నారు. అన్ని పాఠశాలల ప్రిన్సిపాళ్లకు రూ.2 లక్షలు ప్రొవిజన్స్ కోసం మంజూరు చేశామన్నారు. సమావేశంలో మల్లయ్యభట్టు, వీవీ రమణారెడ్డి, బాలాచారి తదితరులు పాల్గొన్నారు. -
గురుకులాల్లో ‘ సమ్మర్ సమురాయ్’
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యార్థులకు శారీరక దృఢత్వం, మానసికోల్లాసం కోసం ఎస్సీ, ఎస్టీ గురుకుల సొసైటీలు ‘సమ్మర్ సమురాయ్’పేరుతో ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణకు శ్రీకారం చుట్టాయి. వేసవి సెలవుల్లో సమయం వృ«థా చేయకుండా క్రీడలపై దృష్టిని సారించేందుకు సొసైటీ యంత్రాంగం వీటికి రూపకల్పన చేశాయి. దీంతో తల్లిదండ్రులకు భారం కాకుండా ఉపయోగకరంగా ఉంటాయనేది అధికారుల భావన. ఈ శిక్షణల్లో పోటీపరీక్షలకు సన్నద్ధం కావడం, క్రీడా నైపుణ్యాలు, కంప్యూటర్ కోర్సుల్లో శిక్షణ తదితర అంశాలను ప్రాధాన్యంగా తీసుకుని ఈ శిబిరాలను నిర్వహిస్తున్నాయి. వాస్తవానికి 2013 నుంచే 3 చోట్ల ‘సమ్మర్ సమురాయ్’ని అందుబాటులోకి తెచ్చినప్పటికీ దాన్ని విస్తరిస్తూ 2019లో 88 క్యాంపులను ఏర్పాటు చేశారు. తల్లిదండ్రుల కోసం అమ్మానాన్న హల్చల్.. గురుకుల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకే కాకుండా వారి తల్లిదండ్రులకు కూడా అవగాహన సదస్సులు నిర్వహించాలని సొసైటీలు నిర్ణయించాయి. ‘అమ్మా–నాన్న హల్చల్ ’పేరిట నిర్వహించే ఈ కార్యక్రమాల్లో పిల్లల పెంపకం, వారు ఎదుర్కొంటున్న సవాళ్లు, వాటిని అధిగమించే మార్గాలు తదితర వాటిపై అవగాహన కల్పిస్తారు. ఏప్రిల్, మే నెలలో దశల వారీగా ఈ క్యాంపులను నిర్వహిస్తారు. శిబిరాలను ప్రారంభించిన మంత్రి కొప్పుల ఈశ్వర్ ‘సమ్మర్ సమురాయ్’, అమ్మానాన్న హల్చల్ కార్యక్రమాలను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సోమవారం సచివాలయంలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భం గా మంత్రి ఈశ్వర్ మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తమ ప్రభుత్వం రాష్ట్రంలో గురుకులాల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుందన్నారు. అన్ని రకాల వసతులు కల్పిస్తూ ప్రైవేటుకు ధీటుగా తయారు చేసిందన్నారు. ఐదేళ్ల క్రితం కేవలం 3వేల మంది విద్యార్థులతో ఈ శిబిరం ప్రారంభమైందని, ప్రస్తుతం 2లక్షలకు పెరిగిందన్నారు. ఈ క్యాంపుల్లో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు భోజన సౌకర్యాలతో పాటు వసతి కూడా కల్పిస్తోందని, శిక్షణ పొంది న విద్యార్థులు జాతీయ అంతర్జాతీయ పోటీల్లో మెరుగైన ఫలితాలు సాధించినట్లు చెప్పారు. అలాగే విద్యార్థుల తల్లిదండ్రులకు పిల్లల పెంపకంపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ‘అమ్మా–నాన్న హల్ చల్’పేరుతో కార్యక్రమా లు చేపట్టామన్నారు. గురుకుల సొసైటీ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, ఎస్సీ అభివృద్ధిశాఖ సంచాలకులు పి.కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. రెండు లక్షల మంది విద్యార్థులకు... ఈ ఏడాది ఎస్సీ, ఎస్టీ గురుకుల పాఠశాలలకు చెందిన దాదాపు రెండు లక్షల మందికి వేసవి శిబిరాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఇందులో ఎస్సీ గురుకులాలకు చెందిన 1.5లక్షలు, గిరిజన సంక్షేమ గురుకులాలకు చెందిన 50వేల మంది విద్యార్థులున్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి సంబంధిత సెట్(ప్రవేశ పరీక్ష)లకు శిక్షణ ఇస్తారు. క్రీడలపై ఆసక్తి ఉన్నవారికి నిర్దేశిత వాటిలో కోచ్లతో శిక్షణ ఇస్తారు. స్పోకెన్ ఇంగ్లీష్, మొబైల్ యాప్స్, డ్రోన్ తయారీ, మల్టీ మీడియా, లైఫ్ కెరీర్ కోడింగ్, కంప్యూటర్ కోర్సుల్లో నిపుణులతో శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. గుర్రపుస్వారీ, మార్షల్ ఆర్ట్స్, వాటర్ స్పోర్ట్స్, వెయిట్ లిఫ్టింగ్, స్టాక్ మార్కెట్పై అవగాహన, శాస్త్రీయ, పాప్ సంగీతం, స్కేటింగ్ తదితరాల్లోనూ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. -
‘కొత్త’గా గురుకుల బోధన!
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తికావస్తుంది. టీఎస్పీఎస్సీ ద్వారా నియామకాల ప్రక్రియ ఆలస్యమవుతుందన్న కారణంతో ప్రభుత్వం టీఆర్ఈఐఆర్బీ (తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు) ఏర్పాటు చేసింది. గతేడాది జూన్లో అందుబాటులోకి వచ్చిన ఈ బోర్డు ఇప్పటివరకు 3,679 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చింది. ఆర్నెల్లలో నియామకాలు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో గతేడాది జూలై నుంచి వరుసగా నోటిఫికేషన్లు ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యం లో ప్రక్రియ ఆలస్యమైనప్పటికీ వేగం పెంచడంతో నియామకాల అంశం కొలిక్కి వచ్చింది. ఈ నెలాఖరులో అన్ని నోటిఫికేషన్లకు సంబంధించి భర్తీ పూర్తి కానున్నట్లు బోర్డు అధికారులు చెబుతున్నారు. వచ్చే విద్యా ఏడాదికల్లా అన్ని కేటగిరీల్లో భర్తీ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. దీంతో కొత్త విద్యా ఏడాదిలో కొత్త గురువులు పాఠాలను బోధించనున్నారు. పీజీటీ నియామకాలు పూర్తి... నాలుగు కేటగిరీలకు సంబంధించిన పోస్టుల భర్తీలో ఇప్పటికే పీజీటీకి సంబంధించిన నియామకాల ప్రక్రియ దాదాపు పూర్తయింది. అభ్యర్థుల తుది జాబితాను సంబంధిత సొసైటీలకు బోర్డు పంపించింది. తుది జాబితా ఆధారంగా సొసైటీలు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్లు పరిశీలించి నియామక పత్రాలను అందిస్తోంది. టీజీటీ కేటగిరీకి సంబంధించి 1:2 జాబితాను పరిశీలిస్తోంది. టెట్ మార్కుల పరిశీలన కోసం టెట్ డైరెక్టర్కు నివేదిక పంపారు. ఒకట్రెండు రోజుల్లో ఈ వివరాలు వచ్చిన వెంటనే ఎంపిక ప్రక్రియ కొలిక్కి రానుంది. మొత్తంగా నెలాఖరులోగా పూర్తి కానుంది. జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్కు సంబంధించి కూడా 1:2 జాబితా రూపొందిస్తున్నారు. వీలైనంత త్వరితంగా ఈ జాబితాలను ప్రకటించే అవకాశం ఉన్నట్లు ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. పూర్తిస్థాయిలో నియామకాలు జరిగేలా... గురుకుల బోర్డు విడుదల చేసిన నోటిఫికేషన్లకు సంబంధించి పూర్తిస్థాయిలో పోస్టులు భర్తీ చేసేలా అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలో ఒకే అభ్యర్థికి రెండేసి పోస్టులు వస్తే... అతని ప్రాధాన్యత ఆధారంగా అవసరం లేని పోస్టుకు అంగీకార పత్రాన్ని తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా గురుకుల బోర్డు తొలుత పెద్ద పోస్టులను భర్తీ చేస్తోంది. పీజీటీ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు టీజీటీ పోస్టులకు అంగీకార పత్రాలను ఇస్తున్నారు. దాదాపు 125 మంది అంగీకార పత్రాలు ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు అభ్యర్థుల సందేహాలు నివృత్తి చేసేందుకు గురుకుల బోర్డు వెబ్సైట్ ద్వారా అభ్యంతరాలను స్వీకరిస్తోంది. అభ్యంతరాలను వెబ్సైట్లో పొందుపరిచి తక్షణమే రంగంలోకి దిగుతున్న అధికారులు వీలైనంత తక్కువ సమయంలో అభ్యర్థులకు నివృత్తి చేస్తున్నారు. నెలాఖరులోగా టీజీటీ, వెనువెంటనే జేఎల్, డీఎల్ పోస్టుల భర్తీ పూర్తి చేసేలా బోర్డు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. -
మైనారిటీలకు వరం.. గురుకులం..
సాక్షి, సూపర్బజార్(కొత్తగూడెం): సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా మైనారిటీలు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటుకు 2016–17 విద్యా సంవత్సరంలో శ్రీకారం చుట్టింది. భద్రాద్రి జిల్లాలో ఆ ఏడాది రెండు పాఠశాలలను ఏర్పాటు చేసింది. 2017–18లో మరో నాలుగు పాఠశాలలను ప్రారంభించింది. ఈ గురుకులాల్లో 70 శాతం ముస్లిం మైనారిటీలకు, 30 శాతం ఇతరులకు సీట్లు కేటాయిస్తారు. ప్రతి విద్యార్థికి సంవత్సరానికి రూ.1.40 లక్షలు ఖర్చు చేస్తారు. ప్రతి పాఠశాలలో అరబిక్ ట్యూటర్ను కూడా ఏర్పాటు చేశారు. నమాజు చేసుకునేందుకు ప్రతి పాఠశాలలో ప్రత్యేకంగా ఒక గదిని కేటాయించారు. స్పోర్ట్స్ కిట్ సౌకర్యంతో పాటు రెగ్యులర్ పీఈటీలనూ నియమించారు. జిల్లాలోని అశ్వారావుపేట, బూర్గంపాడు, కొత్తగూడెంలో బాలికలకు, ఇల్లందు, భద్రాచలం, కొత్తగూడెంలో బాలుర కోసం పాఠశాలలు ఏర్పాటుచేశారు. భద్రాచలం, కొత్తగూడెం బాలుర పాఠశాలలను కలిపి పాల్వంచలోని శేఖరంబంజరలో ఉన్న కేఎల్ఆర్ భవనంలో కొనసాగిస్తున్నారు. కొత్తగూడెం బాలికలకు నేషనల్ డిగ్రీ కళాశాల భవనాన్ని కేటాయించారు. ఈ రెండింటిఇల్లందు బాలుర పాఠశాలను సింగరేణి భవనంలో, అశ్వారావుపేట బాలికల పాఠశాలను జెడ్పీహెచ్ఎస్ పాత భవనంలో, బూర్గంపాడు బాలికల పాఠశాలను ఐటీడీఏ గిరిజన సంక్షేమ వసతి గృహంలో కొనసాగిస్తున్నారు. జిల్లాలోని ఆరు పాఠశాలల్లో మొత్తం 1600 మంది విద్యనభ్యసించడానికి అవకాశం ఉండగా, ప్రస్తుతం 1400 మంది చదువుతున్నారు. ఏడాదికి ఒక తరగతి చొప్పున అప్గ్రేడ్.. జిల్లాలోని ఆరు పాఠశాలల్లో 627 మంది బాలికలు, 773 మంది బాలురు విద్యనభ్యసిస్తున్నారు. కొత్తగూడెం బాలికల పాఠశాలలో 360, బూర్గంపాడు బాలికల పాఠశాలలో 152, అశ్వారావుపేట బాలికల పాఠశాలలో 115 మంది బాలికలు, మిగితా పాఠశాలల్లో బాలురు చదువుతున్నారు. అయితే ప్రభుత్వ భవనాలు లేకపోవడంతో పాల్వంచలోని కేఎల్ఆర్, కొత్తగూడెంలోని నేషనల్ డిగ్రీ కళాశాల భవనాలకు అద్దె చెల్లించి పాఠశాలలను కొనసాగిస్తున్నారు. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా ఆరు జిల్లాల్లో సొంత భవనాలను నిర్మించా లని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఇందులో హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, ఆసిఫాబాద్, ఆదిలాబా ద్, వికారాబాద్ జిల్లాలకు భవనాలు మంజూరయ్యాయి. భద్రాద్రి జిల్లా రామవరంలో బాలికల పాఠశాల నిర్మాణానికి ఏడెకరాల స్థలాన్ని, అశ్వారావుపేటలో ఐదెకరాలు, ఇల్లెందులో 3.5 ఎకరాలు కేటాయించారు. ఒక్కో పాఠశాల నిర్మాణానికి సుమారు రూ.20 కోట్ల అంచనా వ్యయంగా ప్రతిపాదనలు తయారుచేస్తున్నారు. మల్టీ సెక్టోరియల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (ఎంఎస్డీపీ) పథకం కింద కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయాల్సి ఉంటుంది. ప్రతి పాఠశాలలో వైద్య సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. కొత్తగూడెం బాలికలు, ఇల్లందు బాలుర పాఠశాలల్లో 9వ తరగతి వరకు అవకాశం ఉండగా మిగిలిన పాఠశాలల్లో 5 నుంచి 8వ తరగతి వరకు మాత్రమే విద్యనభ్యసించవచ్చు. ప్రతి సంవత్సరం ఒక్కో తరగతిని అప్గ్రేడ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 2019–20 సంతవ్సరానికి జిల్లాలోని మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ప్రవేశాల కోసం ఈనెల 31 తుది గడువుగా నిర్ణయించారు. 9వ తరగతి ఉన్న పాఠశాలల్లో ఖాళీగా ఉన్న సీట్లను కూడా భర్తీ చేస్తారు. పాఠశాలల్లో సకల సౌకర్యాలు మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో సకల సౌకర్యాలు ఏర్పాటు చేశాం. విద్యార్థులకు నాణ్యమైన చదువుతోపాటు నాణ్యతా సౌకర్యాలను కూడా ఏర్పాటు చేశాం. ప్రతిరోజు ఆటలు, యోగా ఉంటాయి. శీతాకాలంలో వేడినీళ్ల సౌకర్యం కూడా కల్పించాం. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం క్రమం తప్పకుండా మెనూ అందజేస్తున్నాం. – జి.ముత్యం, జిల్లా మైనారిటీ సంక్షేమాధికారి -
ఎస్సీలకు కార్పొరేట్ విద్య!
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యనందించేందుకు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ (బీఏఎస్) కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేయాలని ఎస్సీ అభివృద్ధి శాఖ భావిస్తోంది. ఇదివరకు తెలంగాణ రాష్ట్రంలో పది జిల్లాలు ఉండటంతో జిల్లాకు 100 మంది చొప్పున విద్యార్థులను ఎంపిక చేసి వారికి ఉచితంగా రెసిడెన్షియల్ విద్యను అందిస్తోంది. తాజాగా జిల్లాల సంఖ్య పెరగడంతో ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేసేందుకు ఎస్సీ అభివృద్ధి శాఖ సన్నాహాలు చేస్తోంది. గురుకుల పాఠశాలలు అందుబాటులో ఉన్నప్పటికీ కూడా ఎక్కువ మందికి నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. జిల్లాను యూనిట్గా.. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలు కావడంతో.. జిల్లాను యూనిట్గా తీసుకుని అన్ని జిల్లాలకూ ఈ పథకాన్ని వర్తింపజేయాలని ఎస్సీ అభివృద్ధి శాఖ నిర్ణయించింది. దీంతో లబ్ధిదారుల సంఖ్య 1,000 నుంచి 3,300కు పెరగనుంది. జిల్లా స్థాయిలో బీఏఎస్ లబ్ధిదారుల ఎంపిక, బెస్ట్ అవైలబుల్ స్కూళ్ల ఎంపిక కూడా కలెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఎంపిక చేసిన పాఠశాలల్లో విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించడంతో పాటు ఐదో తరగతి నుంచి పదో తరగతి వరకు రెసిడెన్షియల్ విద్యను కూడా అందిస్తారు. ఫీజులు పెంపు... బీఏఎస్ కింద ఎంపికైన వారిలో ఏడో తరగతిలోపు విద్యార్థులకు రూ. 20 వేలు, ఆపై తరగతుల వారికి రూ. 30 వేల చొప్పున ప్రభుత్వం ఫీజులు చెల్లిస్తుంది. నిర్వహణ భారీగా పెరగడంతో ఫీజులు పెంచాలని ఎస్సీ అభివృద్ధి శాఖ భావిస్తోంది. ప్రస్తు త ఫీజులకు రెట్టింపు ఫీజులిచ్చేలా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వీటిని త్వరలో ప్రభుత్వానికి పంపనుంది. ప్రభుత్వం ఆమోదిస్తే వచ్చే విద్యా సంవత్సరం నుంచే వీటిని అమలు చేయనున్నట్లు ఎస్సీ అభివృద్ధి శాఖ సంచాలకుడు కరుణాకర్ అన్నారు. -
స్వీయ పరీక్షా కేంద్రాలకు స్వస్తి
సాక్షి, హైదరాబాద్: గురుకుల పాఠశాలల్లో స్వీయ పరీక్షా కేంద్రాలకు ప్రభుత్వం స్వస్తి పలకనుంది. ఇకపై ఒక గురుకుల సొసైటీ పరిధిలోని విద్యార్థులు అదే సొసైటీకి చెందిన ఎగ్జామ్ సెంటర్లో పరీక్షలు రాసే వీలుండదు. పరీక్షల నిర్వహణలో మరింత పారదర్శకత కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పరీక్షా కేంద్రాల ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సొసైటీలను ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా 603 గురుకుల పాఠశాలలున్నాయి. వీటిలో ఎస్సీ 232, ఎస్టీ 88, జనరల్ 35, బీసీ 142, మైనారిటీ సంక్షేమ శాఖ పరిధిలో 120 గురుకుల పాఠశాలలున్నాయి. వీటిలో సగానికి పైగా గురుకుల పాఠశాలలు గత రెండు, మూడేళ్ల క్రితమే ప్రారంభం కావడంతో అవి పదో తరగతికి మరో ఏడాదిలో అప్గ్రేడ్ కానున్నాయి. మరో 207 గురుకుల పాఠశాలల్లో పదో తరగతి వరకు నడుస్తుండగా వీటిలో 98 గురుకుల పాఠశాలలు జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ కావడంతో ఇంటర్మీడియట్ కోర్సులను పూర్తి స్థాయిలో నిర్వహిస్తున్నారు. ఈ 207 గురుకుల పాఠశాలలు పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలుగా కొనసాగుతున్నాయి. ఈ కేంద్రాల్లో చాలావరకు అదే సొసైటీకి చెందిన విద్యార్థులు పరీక్షలు రాయాల్సి వస్తోంది. జంబ్లింగ్ విధానాన్ని అనుసరిస్తున్నప్పటికీ పరీక్ష కేంద్రాల దూరం తదితర అంశాలను పరిగణిస్తూ వారికి ఆయా కేంద్రాలను నిర్ధారిస్తున్నారు. ఈ క్రమంలో అవకతవకలు జరుగుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్వీయ పరీక్షా కేంద్రాలు (సెల్ఫ్ సెంటర్లు) రద్దు చేయాలని పరీక్షల విభాగం సూచన చేసింది. దీంతో సెల్ఫ్ సెంటర్లు లేకుండా పరీక్షల నిర్వహణకు సొసైటీలు చర్యలు చేపట్టాయి. ఏటా ఎంత మంది విద్యార్థులు స్వీయ సొసైటీ పరిధిలో పరీక్షలు రాస్తున్నారనే గణాంకాలు తిరగేస్తున్నారు. సంఖ్య అధికంగా ఉంటే భారీ మార్పులు తప్పవని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఫలితాలపై ప్రభావముంటుందా? పదో తరగతి, ఇంటర్ ఫలితాల్లో గురుకుల పాఠశాలలు మెరుగ్గా ఉన్నాయి. ప్రతి సొసైటీ ఫలితాలు రాష్ట్ర ఫలితాల సగటు కంటే ఎక్కువగానే నమోదవుతున్నాయి. గురుకుల విద్యార్థులు ఎక్కువగా అదే సొసైటీకి చెందిన సెంటర్లలో పరీక్షలు రాయడంతో మెరుగైన ఫలితాలు వస్తున్నాయనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో సెల్ఫ్ సెంటర్ల రద్దు చేపడితే ఫలితాలపై ప్రభావం పడే అవకాశముందనే భావన గురుకుల ఉపాధ్యాయ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. -
తరగతి గదే నివాస గది!
రాష్ట్రంలో గిరిజన విద్యార్థులతో ప్రభుత్వం ఆటలాడుకుంటోంది. వారి సంక్షేమాన్ని గాలికొదిలేయడంతో నాణ్యమైన విద్య లభించక గిరిపుత్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో 197 గిరిజన సంక్షేమ హాస్టళ్లను రద్దుచేసి వాటి స్థానంలో రెండేళ్ల క్రితం ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా ఏర్పాటు చేసిన కన్వర్టెడ్ గిరిజన గురుకుల పాఠశాలలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రభుత్వం వీటిపై శీతకన్ను వేయడంతో సౌకర్యాల లేమితో కునారిల్లుతున్నాయి. సాక్షి, అమరావతి: టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో 197 గిరిజన సంక్షేమ హాస్టళ్లను ప్రభుత్వం రద్దు చేసింది. వాటి స్థానంలో గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తామంటూ రెండేళ్ల క్రితం 80 ఎస్టీ గురుకుల పాఠశాలలను ప్రారంభించింది. ఇవి పేరుకు మాత్రమే గిరిజన గురుకుల పాఠశాలలు. వాస్తవానికి అక్కడ గురుకుల విద్యా విధానమే లేదు. వాటిని పరిశీలిస్తే.. సంక్షేమ హాస్టళ్ల కంటే అధ్వానంగా ఉన్నాయి. ఈ 80 గురుకుల పాఠశాలలను ప్రభుత్వం కన్వర్టెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లుగా పిలుస్తోంది. బోర్డుపైనే గురుకులం.. లోపల అధ్వానం గతంలో ఉన్న సంక్షేమ హాస్టల్ భవనాల్లోనే గురుకుల స్కూళ్లు అంటూ కొత్తగా బోర్డులు పెట్టి నడుపుతున్నారు. సంక్షేమ హాస్టల్ అంటే.. విద్యార్థుల వసతి కోసం ఏర్పాటు చేసింది. బయట స్కూళ్లలో బోధిస్తారు. ఇప్పుడు వసతి కోసం ఏర్పాటు చేసిన గదిలోనే ఉపాధ్యాయులు క్లాసులు చెబుతున్నారు. ప్రిన్సిపాల్ మినహా అక్కడ పనిచేసే ఉపాధ్యాయులంతా ఔట్సోర్సింగ్, తాత్కాలిక ప్రాతిపదికపై నియమితులైనవారే. తరగతి గది, పడక గది ఒక్కటే కావడంతో విద్యార్థుల బాధలు వర్ణనాతీతం. ఇబ్బందులెన్నో.. కన్వర్టెడ్ గురుకులాల్లో కొత్తగా వార్డెన్ పోస్టులు వచ్చాయి. హాస్టళ్లు రద్దు కావడంతో వార్డెన్లు నేరుగా తమ సిబ్బంది, విద్యార్థులతో ప్రభుత్వం చెప్పిన మేరకు కన్వర్టెడ్ గురుకులాలకు చేరారు. వార్డెన్లు, సిబ్బంది పిల్లల భోజనం, వసతి సౌకర్యాలను చూస్తారు. ప్రస్తుతం వీరు ఆయా జిల్లాల గిరిజన సంక్షేమ శాఖ అధికారుల పర్యవేక్షణలో పనిచేస్తున్నారు. విద్యార్థులకు బోధించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నుంచి తాత్కాలిక ప్రాతిపదికపై ఉపాధ్యాయులను నియమించింది. అయితే ఉపాధ్యాయులకు వసతి కల్పించకపోవడంతో వారు బయట అద్దె ఇళ్లళ్లో ఉంటున్నారు. విద్యార్థులకు విద్యనందించే బాధ్యత గురుకుల విద్యాలయ సంస్థది కావడం, భోజనం, వసతి సౌకర్యాల బాధ్యత ఆయా జిల్లాల గిరిజన సంక్షేమ అధికారులది కావడంతో వార్డెన్లు, ప్రిన్సిపాళ్ల మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. వీరి మధ్య వివాదాలతో విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నారు. సీఎం మాటకే దిక్కు లేదు సీఎం చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా అనేక సభలు, సమీక్ష సమావేశాల్లో 80 గిరిజన గురుకుల స్కూళ్లకు కొత్తగా భవనాలు మంజూరు చేసినట్లు ప్రకటించారు. త్వరలోనే నిర్మాణాలు మొదలుపెట్టాల్సిందిగా పలుమార్లు అధికారులను ఆదేశించారు. అయితే పరిస్థితి ఎక్కడి వేసిన గొంగడి అక్కడే అనే చందంగా ఉంది. అధికారులను ప్రశ్నిస్తే త్వరలోనే నిర్మాణాలు మొదలవుతాయని, కొత్త భవనాల నిర్మాణానికి ప్రభుత్వం సుముఖంగా ఉందని పాతపాటే పాడుతున్నారు. తరగతి గది, పడక గది ఒక్కటే.. విలీన గురుకులాల్లో మొదటి సంవత్సరం మూడో తరగతి నుంచి ఐదో తరగతి వరకు బోధించారు. గతేడాది ఇక్కడ ఉన్న, బయట నుంచి వచ్చిన అర్హులైన విద్యార్థులతో పాఠశాలల స్థాయిని 6వ తరగతికి పెంచారు. ఇలా ఏటా ఒక్కో తరగతి చొప్పున పదో తరగతి వరకు పెంచుతారు. ఇక రద్దు కాగా మిగిలిన 30 గిరిజన వసతి గృహాల్లో ఉండి చదువుకునే 7, 8, 9, 10 తరగతుల వారికి అక్కడే వసతి కల్పించి, ప్రభుత్వ, పురపాలక, ఎయిడెడ్ పాఠశాలల్లో చదివిస్తున్నారు. వాస్తవానికి వసతి గృహాలను 100 మంది విద్యార్థులకు సరిపోయేలా ఏర్పాటు చేశారు. ఇంతకంటే ఎక్కువ మంది చేరిన చోట పరిస్థితి దారుణంగా ఉంది. మళ్లీ ఈ హాస్టళ్లలోనే గురుకుల పాఠశాలల విద్యార్థులకు 4 గదులు ఇచ్చి మిగిలినవి 7 నుంచి 10 తరగతుల వారికి ఇచ్చి సర్దుకోమంటున్నారు. ఒకరోజైతే పర్వాలేదు. సంవత్సరాల తరబడి సర్దుకోమంటే ఎలా అని విద్యార్థులు వాపోతున్నారు. తెనాలిలోని బాలుర పాఠశాలలోని 54 మంది విద్యార్థులకు 4 గదులు ఇవ్వగా, బాలికల పాఠశాలలో 96 మందికి 4 గదులిచ్చి సరిపెట్టారు. చిలకలూరిపేటలోని బాలుర పాఠశాలలోని 140 మంది 4 గదుల్లో ఉంటున్నారు. ఇక రేపల్లెలోని బాలుర పాఠశాలలో 67 మంది తలదాచుకుంటున్నారు. వీరికి పగలు ఆ గదులలోనే తరగతులు నిర్వహిస్తుండగా రాత్రికి నివాసం కూడా అక్కడే ఉండాల్సిన దుస్థితి. మిగిలిన గదులు వంటకు, ప్రిన్సిపాల్కు, స్టోర్, భోజనశాల, వార్డెన్ గదిగా ఉపయోగిస్తున్నారు. అంటే వీటి కోసం సుమారు 5 గదులు వాడుతున్నారు. ఇంకా మిగిలిన వాటిని 7, 8, 9, 10 తరగతుల విద్యార్థుల వసతికి ఇచ్చారు. గురుకుల పాఠశాల ఉండాల్సింది ఇలా.. గురుకుల విద్యాలయం అంటే అక్కడే విద్యార్థుల విద్యాభ్యాసానికి తరగతి గదులతోపాటు ఉపాధ్యాయులు నివసించేందుకు క్వార్టర్స్ కూడా ఉండాలి. విద్యార్థులకు వసతి కోసం గదులు, భోజనం చేసేందుకు భోజనశాల ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి. కనీసం రెండెకరాల ఆటస్థలం ఉండాలి. మొత్తం 20 నుంచి 25 ఎకరాల స్థలంలో గురుకుల విద్యాలయ భవనం ఉండాలి. కానీ ప్రభుత్వం వీటిలో వేటినీ పట్టించుకోలేదు. గురుకుల స్కూల్ నిర్వహణ తీరుతెన్నులపై ప్రైవేట్ ఏజెన్సీతో ఒక అధ్యయన కమిటీని ప్రభుత్వం నియమించింది. ఇంకా ఈ కమిటీ ప్రభుత్వానికి తన నివేదికను సమర్పించలేదు. 80 స్కూళ్ల తరగతులు గచ్చుమీదే.. గుంటూరు జిల్లా రేపల్లె, స్టువర్టుపురం, తెనాలి, గుంటూరు, చిలకలూరిపేట, నరసరావుపేట, బెల్లంకొండ, కారంపూడి, పిడుగురాళ్ల, రెంటచింతల, వినుకొండ, కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట, ఉయ్యూరు, విస్సన్నపేట, నందిగామ, కొండపల్లి, మైలవరంలతోపాటు ప్రకాశం, చిత్తూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ జిల్లాల్లో 80 గురుకులాలు ఉన్నాయి. వీటిల్లో ఒక్క తరగతి గదిలోనూ విద్యార్థులు కూర్చోవడానికి బెంచీలు ఏర్పాటు చేయకపోవడంతో గచ్చుమీదనే విద్యార్థులు కూర్చోవాల్సిన దుస్థితి. ఏజెన్సీ ప్రాంతంలో హాస్టళ్లను రద్దు చేసి ఏర్పాటు చేసిన 30 ఆశ్రమ పాఠశాలలు మరీ దారుణంగా ఉన్నాయి. వాటికి కనీసం కాపౌండ్ గోడలు కూడా లేవు. దీంతో పాములు, తేళ్లు, ఇతర వన్యజీవులు పాఠశాలల్లోకి ప్రవేశిస్తున్నాయి. ఒకేసారి హాస్టళ్ల రద్దుతో ఇబ్బందులు నిజమే.. గిరిజన సంక్షేమ హాస్టళ్లను ఒకేసారి పూర్తిగా రద్దు చేయడం వల్ల ఇబ్బందులు తలెత్తిన మాట వాస్తవమే. దీనివల్ల విద్యార్థులకు పలు సమస్యలు ఎదురవుతున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులు, గిరిజన సంఘాలు, ఉపాధ్యాయులు సమస్యలను మా దృష్టికి తెచ్చారు. ప్రత్యామ్నాయాలు చూసుకుని గిరిజన సంక్షేమ హాస్టళ్లను రద్దు చేసి ఉంటే బాగుండేదని తర్వాత గుర్తించాం. ఆ దృష్ట్యా అధ్యయన కమిటీని నియమించాం. నివేదిక రాగానే తగిన చర్యలు తీసుకుంటాం. కొత్త భవనాల నిర్మాణాలకు స్థలసేకరణ జరుగుతోంది. త్వరలోనే భవన నిర్మాణాలను చేపడతాం. – ఎస్.ఎస్.రావత్, ముఖ్య కార్యదర్శి, గిరిజన సంక్షేమ శాఖ ఆర్వో ప్లాంటు ఏర్పాటు చేయాలి మా పాఠశాలలో మంచినీటికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఆర్వో ప్లాంటును ఏర్పాటు చేయకపోవటంతో పలువురు విద్యార్థులు జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి ఆర్వో ప్లాంటు ఏర్పాటు చేయాలి. – మల్లా అంజి, పదో తరగతి విద్యార్థి, పీటీజీ పాఠశాల, విజయపురిసౌత్, గుంటూరు జిల్లా ఈ చిత్రం.. కర్నూలు జిల్లా పాణ్యం మండల పరిధిలోని నెరవాడ మెట్ట వద్ద ఉన్న గిరిజన బాలికల గురుకుల పాఠశాల మరుగుదొడ్ల దుస్థితికి నిదర్శనం. ఈ పాఠశాలలో మొత్తం 279 మంది విద్యార్థినులు ఉన్నారు. ఇక్కడ పరిశుభ్రతను గాలికొదిలేశారు. మరుగుదొడ్లు దుర్వాసన వెదజల్లుతున్నాయి. వీటికి తలుపులు కూడా సరిగా లేవు. తరగతి గదుల పక్కనే కుళ్లిన చెత్త దర్శనమిస్తోంది. గదుల నిండా బూజు, చెత్తాచెదారం అధికంగా ఉంది. పిల్లలు అపరిశుభ్రంగా, చిరిగిన వస్త్రాలతోనే తరగతులకు హాజరవుతున్నారు. రెగ్యులర్ ప్రిన్సిపాల్ లేకపోవడంతో విద్యార్థినులను పట్టించుకునేవారు కరువయ్యారు. కొందరు ఉపాధ్యాయులు తరగతులకు గైర్హాజరు అవుతున్నా అడిగేవారే లేరు. ఈ ఫొటోలోని విద్యార్థిని పేరు.. భూమిక. కృష్ణా జిల్లా విస్సన్నపేట మండలం కొండపర్వ గిరిజన గురుకుల పాఠశాలలో చదువుతోంది. విద్యా సంవత్సరం ముగుస్తున్నా ఇప్పటివరకు తనకు స్కూల్ యూనిఫాం, చున్నీ ఇవ్వలేదని వాపోతోంది. పాఠశాలకు ప్రహరీ లేదని, దీంతో పాఠశాల ఆవరణలోకి విష పురుగులు వస్తున్నాయని చెబుతోంది. -
కొత్త గురుకులాలు ఎక్కడ?
సాక్షి, హైదరాబాద్: మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల విద్యాలయాల సొసైటీకి ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన 119 గురుకుల పాఠశాలల ఏర్పాటుపై సందిగ్ధం వీడలేదు. ప్రస్తుతమున్న గురుకులాలు చాలకపోవడం, క్షేత్రస్థాయి నుంచి అత్యధిక డిమాండ్ వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త గా 119 గురుకుల పాఠశాలలను మంజూరు చేసింది. ఈ ఏడాది ఆగస్టులో ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. కానీ వీటిని 2019–20 విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి తేనున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. దీంతో వీటి ఏర్పాటుకు ఏడాది పాటు సమయాన్ని గురుకుల సొసైటీకి ఇచ్చింది. వీటిని ఏయే ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలనే అంశంపై ప్రభుత్వం స్పష్టతనివ్వలేదు. మరో 4 నెలల్లో విద్యా సంవత్సరం ముగియనుంది. వచ్చే ఏడాది మే నెలలోగా భవనాల ఏర్పాటుతో పాటు బోధన, బోధనేతర సిబ్బందిని నియమించు కోవాల్సి ఉంది. ప్రభుత్వం ఇప్పటికీ లొకేషన్లు ఖరారు చేయకపోవడంతో భవనాల పరిశీలన ప్రక్రియే ప్రారంభం కాలేదు. నియోజకవర్గానికో బాలబాలికల గురుకులం తెలంగాణ ఏర్పాటుకు ముందు రాష్ట్రవ్యాప్తంగా కేవలం 23 బీసీ గురుకుల పాఠశాలలు మాత్రమే ఉన్నాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం కేజీ టు పీజీ కార్యక్రమంలో భాగంగా గురుకుల పాఠశాలల ఏర్పాటుకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా 2017–18 విద్యా సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 119 గురుకుల పాఠశాలలను ప్రారంభించింది. నియోజకవర్గానికి ఒకటి చొప్పున వీటిని అందుబాటులోకి తెచ్చింది. ఇందులో కొన్నిచోట్ల బాలుర, కొన్నిచోట్ల బాలికల పాఠశాలలను ఏర్పాటు చేసింది. గురుకుల పాఠశాలలకు భారీ డిమాండ్ రావడంతో కొత్త గురుకులాల్లో సీట్ల సర్దుబాటు యంత్రాంగానికి కష్టంగా మారింది. ఈ క్రమంలో మరిన్ని గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయాలని అన్ని వర్గాల నుంచి ఒత్తిడి వచ్చింది. దీంతో ప్రభుత్వానికి బీసీ సంక్షేమ శాఖ ప్రతిపాదనలు పంపడంతో వాటిని ఆమోదిస్తూ కొత్తగా మరో 119 గురుకులాలను మంజూరు చేసింది. వీటిని ప్రారంభిస్తే నియోజకవర్గానికో బాల, బాలికల గురుకులం అందుబాటులోకి రానుంది. ప్రస్తుత గురుకులాలన్నీ అద్దె భవనాల్లోనే.. ప్రస్తుతం గురుకుల పాఠశాలలన్నీ అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ఒక గురుకుల పాఠశాలకు కనిష్టంగా 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న భవనం, మైదానం ఉన్న వాటిల్లోనే కొనసాగించాలని నిబంధన విధించింది. చాలాచోట్ల సౌకర్యవంతమైన భవనాలు లభించకపోవడం అధికారులకు తలనొప్పిగా మారింది. కొత్త గురుకులాలకు అద్దె భవనాలు లభించడం కష్టంగా మారింది. ప్రారంభ తేదీ ముంచుకొస్తున్నప్పటికీ.. లొకేషన్లపై స్పష్టత లేకపోవడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. -
తిత్లీతో గురుకులాల్లో రూ.2.81 కోట్లు నష్టం
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలోని సాంఘిక సంక్షేమ విభాగంలో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 12 బాలయోగి గురుకుల పాఠశాల్లో తిత్లీ తుఫాన్ వల్ల సుమారు రూ.2.81 కోట్ల నష్టం వాటిల్లిందని గురుకుల పాఠశాలల సమన్వయకర్త వై.యశోదలక్ష్మి కలెక్టర్ ధనంజయరెడ్డికి వివరించారు. మంగళవారం కలెక్టర్ సమావేశ మందిరంలో ఆమె కలిసి గురుకులాల నష్టాల స్థితిగతులను తెలియజేశారు. 10 గురుకుల పాఠశాలల రక్షణ గోడలు పాడయ్యాయని చెప్పారు. చెట్లు పడిపోవడంతో గోడలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. చాలాచోట్ల విద్యుత్ సదుపాయం కూడా లేదన్నారు. కంచిలి, మందస గురుకులాలకు మంగళవారం నాటికీ విద్యుత్ పునరుద్ధరణ కాలేదన్నారు. అనంతరం కలెక్టర్ స్పందిస్తూ పాడైన రక్షణ గోడలు వెంటనే నిర్మించాలని సంబంధింత ఇంజినీరింగ్ సిబ్బందికి ఫోన్లో ఆదేశించారు. విద్యుత్ సరఫరాను తక్షణం పునరుద్ధరించాలని సూచించారు. -
నెల్లూరు గురుకులంలో అమానుషం
నెల్లూరు రూరల్: విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ప్రిన్సిపాల్ విచక్షణ మరచి విద్యార్థులపై వివిధ రూపాల్లో దాడులకు పాల్పడుతున్నాడు. విద్యార్థుల తల్లిదండ్రులు పలుమార్లు వైఖరి మార్చుకోవాలని సూచించినా పట్టించుకోలేదు. చివరకు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రిన్సిపాల్ కటకటాల పాలైన ఘటన నెల్లూరులోని ఎస్టీ బాలుర గురుకుల పాఠశాలలో చోటుచేసుకుంది. సర్వేపల్లికి కేటాయించిన ఎస్టీ బాలుర గురుకుల పాఠశాలలో వసతులు లేకపోవడంతో 2016లో నెల్లూరు పొదలకూరు రోడ్డులోని జెడ్పీ హైస్కూల్ భవనంలో ఏర్పాటు చేశారు. ఇందులో 200 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ విద్యార్థులపై అమానుషంగా ప్రవర్తిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విద్యార్థులను బట్టలు విప్పించి కొట్టడం, తలను గొడకేసి బాధడం, కాళ్లతో తన్నడం, కర్రలతో చేతులు, కాళ్లపై కొట్టడం, దుర్భాషలాడుతున్నారని వారు పోలీసులకు, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. హాస్టల్లోకి మద్యం తీసుకొచ్చి తాగడం, విద్యార్థుల చేత సపర్యలు, ఇంటి పనులు చేయించుకోవడం, ఎదురు తిరిగిన వారిపై దాడి చేసి గాయపరిచేవారని ఆరోపించారు. ఇదే విషయాన్ని తల్లిదండ్రులు ఏపీ యానాది సమాఖ్య సహకారంతో ప్రిన్సిపాల్పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్, ఎస్పీలకు సోమవారం గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశారు. వేదాయపాళెం పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసి, విచారణ చేపట్టాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. సీఐ నరసింహారావు, సిబ్బంది మంగళవారం గురుకులంలో విచారణ చేపట్టారు. ప్రిన్సిపాల్ వెంకటరమణను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. -
‘గురుకుల బోర్డు’కు ప్రత్యేక కార్యాలయం
సాక్షి, హైదరాబాద్: గురుకులాల్లో బోధన, బోధనేతర సిబ్బంది నియామకాల కోసం ఏర్పాటు చేసిన తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామక బోర్డు (టీఆర్ఈఐ–ఆర్బీ)కు ప్రత్యేక కార్యాలయం సిద్ధమవుతోంది. నగరంలోని దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్లో నాలుగో అంతస్తును బోర్డుకు ప్రభుత్వం కేటాయించింది. దీంలో ఇక్కడ మరమ్మతులు శరవేగంగా సాగుతున్నాయి. సొసైటీల్లో సీనియర్ సెక్రటరీ బోర్డుకు కన్వీనర్గా వ్యవహరిస్తారు. మిగతా సెక్రటరీలు సభ్యులుగా కొనసాగుతారు. బోర్డులోని ప్రతిసభ్యుడికి ప్రత్యేక చాంబర్ ఉండేలా కార్యాలయాన్ని సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 18న గురుకుల పాఠశాలల్లో ఖాళీలకు సంబంధించి నోటిఫికేషన్లు వెలువడనున్నట్లు సమాచారం. ఈ మేరకు బోర్డు కసరత్తు చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, విద్యాశాఖ పరిధిలోని గురుకులాల్లో బోధన, బోధనేతర విభాగాల్లో 5,313 పోస్టులకు నోటిఫికేషన్లు వెలువడే అవకాశముంది. పరీక్షల నిర్వహణ, సిలబస్ తదితర అంశాలపై ప్రతిపాదనలు రూపొందించిన బోర్డు ఇటీవల ప్రభుత్వానికి నివేదించింది. ఈ ప్రతిపాదనలకు ఆమోదం లభించగానే.. నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు. -
ఇంటర్ విద్యపై సందిగ్ధం
నిజాంసాగర్: కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో ఇంటర్ చదువులపై విద్యాశాఖ అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీచేయకపోవడంతో సందిగ్ధత నెలకొంది. రెండు, మూడు రోజుల్లో పదోతరగతి ఫలితాలు విడుదల కానున్నారు. పదోతరగతిలో ఉత్తీర్ణులయ్యే కస్తూర్బా విద్యార్థినులు ఇంటర్ చదువులకు ఎటువైపు వెళ్లాలన్న ఆయోమయంలో ఉన్నారు. కస్తూర్బాగాంధీ విద్యాలయాల్లో ఇంటర్ చదువులను ప్రారంభిస్తామని డిప్యూటి సీఎం కడియం శ్రీహరి ప్రకటించారు. కానీ ఇంత వరకు ఆదేశాలు ఇవ్వలేదు. 2009 సంవత్సరంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నిజాంసాగర్, పిట్లం, మద్నూర్, బిచ్కుంద, జుక్కల్, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, లింగంపేట, తడ్వాయి, సదాశివనగర్, గాందారి, బాన్సువాడ, బీర్కూర్, కామారెడ్డి, బిక్కనూర్, మాచారెడ్డి, దొమకొండ మండలాల్లో కస్తూర్బా విద్యాలయాలను ప్రారంభించారు. ఆయా కస్తూర్బా విద్యాలయాల నుంచి ఇప్పటి వరకు 7 బ్యాచ్ల్లో విద్యార్థినులు పదోతరగతి పరీక్షలు రాశారు. పదోతరగతి ఫలితాల్లో మంచి ఫలితాలు రాబట్టారు. దాంతో కస్తూర్బాల్లో విద్యాప్రమాణాల పెంపుపై విద్యాశాఖ అధికారులు దృష్టి సారించారు. ఈ మేరకు కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో ఇంటర్ విద్యను అమలుకు విద్యా శాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కాని స్పష్టమైన ఆదేశాలు జారికాలేదు. గురుకులాల్లోఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ 2018–19 విద్యా సంవత్సరానికి గాను జిల్లాలోని ప్రభుత్వ గురుకులాలతోపాటు ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్మిడియట్లో ప్రవేశానికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. జిల్లాలోని ఆయా మం డలాల్లో ఉన్న ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్మిడియట్ ఆడ్మిషన్ల కోసం విద్యార్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. కాని జిల్లాలోని 17 కస్తూర్బా విద్యాలయాల నుంచి 628 మంది విద్యార్థినులు పదోతగతి పరీక్షలు రాశారు. కస్తూర్బాల్లో ఇంటర్ విద్యను అమలు చేస్తే చాలా మంది చదువుల కొనసాగించడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నారు. ఆదేశాలు రాలేదు– కుంతల, జిల్లా అధికారిణి కసూర్బాగాంధీ విద్యాలయాల్లో ఇంటర్ విద్యబోధన అమలుపై ఇంత వరకు స్పష్టమైన ఆదేశాలు రాలేదు. జిల్లాలోని రెండు విద్యాలయాల్లో మాత్రం ఇంటర్ విద్యను ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇంకా సమాచారం రాలేదు. -
గురుకులాల నియామక బోర్డుకు తుదిరూపు!
సాక్షి, హైదరాబాద్: గురుకుల పాఠశాలల్లో బోధన సిబ్బంది నియామకాలకు సంబంధించి రాష్ట్ర గురుకుల విద్యాలయాల సిబ్బంది నియామక బోర్డు (టీఎస్ఆర్ఈఐఆర్బీ) ఏర్పాటుకు ప్రభుత్వం తుదిమెరుగులు దిద్దుతోంది. గురు కుల పాఠశాలల్లో బోధన సిబ్బంది నియామకా న్ని టీఎస్పీఎస్సీ ద్వారా కాకుండా ప్రత్యేక బోర్డు ద్వారా నిర్వహించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. సోమవారం సీఎం కార్యాలయంలో బోర్డు ఏర్పాటుకు సంబంధించి గురుకుల సొసైటీల కార్యదర్శులు, పలువురు ఉన్నతాధికారుల తో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బోర్డు ఏర్పాటుపై తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై అధికారులు చర్చించారు. బోర్డు కన్వీనర్ నియామకం కొలిక్కి! నియామకాల ప్రక్రియ పారదర్శకంగా, వేగంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం టీఎస్ఆర్ఈఐఆర్బీని ఏర్పాటు చేస్తోంది. బోర్డుకు కన్వీనర్గా ఓ ఐఏఎస్ అధికారిని నియమించాలని నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీ గురుకులాల సొసైటీ కార్యదర్శిగా ఉన్న ప్రవీణ్కుమార్ పేరును ఉన్నతాధికారులు ప్రతిపాదించినట్లు తెలిసింది. దీనిపై సీఎం కూడా సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. బోర్డు ఏర్పాటు ఫైలుకు సీఎం ఇప్పటికే ఆమోదముద్ర వేశారని, స్వల్ప మార్పులు చేసి 3 రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశముందని విశ్వసనీయ సమాచారం. ప్రశ్నపత్రాల తయారీ, సిలబస్ తదితర అంశాలపై జేఎన్టీయూహెచ్కు బాధ్యతలు అప్పగించాలని ప్రభు త్వం భావిస్తోంది. అయితే ఇంకా దీనిపై తుది నిర్ణయం తీసుకోలేదు. మెజారిటీ అధికారులు జేఎన్టీయూహెచ్కు ఇవ్వాలని అభిప్రాయపడినట్లు సమాచారం. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రికి వివరించాక ఆయన నిర్ణయం ఆధారంగా ఖరారు చేసే అవకాశముంది. ప్రస్తుతం గురుకుల పాఠశాలల్లో పూర్తిస్థాయి సిబ్బంది విధులు నిర్వర్తించాలంటే దాదాపు 5 వేల ఖాళీలను భర్తీ చేయాలి. బోర్డు ఏర్పాటైతే ఈ పోస్టులన్నీ భర్తీ చేయొచ్చని, ఈ మేరకు వరుస నోటిఫికేషన్లు వెలువరిచే అవకాశం ఉందని ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’తో అన్నారు. -
బియ్యం లేవట..
ఖమ్మంరూరల్: ఆటలు, నృత్యాలు, హార్స్ రైడింగ్, స్పోకెన్ ఇంగ్లిష్, భావ వ్యక్తీకరణ, వ్యక్తిత్వ వికాసం తదితర అంశాల్లో గురుకుల పాఠశాలల విద్యార్థులకు తర్ఫీదు ఇచ్చేందుకు సొసైటీలు బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. వేసవి శిక్షణ శిబిరాల్లో వారిని మెరికల్లా మారుస్తూ.. సమాజంలో ఉన్నత స్థితికి చేరేలా నిష్ణాతులైన వారిచే ప్రత్యేక శ్రద్ధపెట్టి తీర్చిదిద్దుతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. శిక్షణ పొందుతున్న విద్యార్థులకు భోజనం అందించే విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సంబంధిత అధికారులు, ఉపాధ్యాయులు నానా తంటాలు పడుతున్నారు. బియ్యం కేటాయింపుల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో విద్యనభ్యసించే విద్యార్థులకు ప్రత్యేక శిబిరాల నిర్వహణ తలకు మించిన భారమవుతోంది. శిబిరాల కోసం అవసరమయ్యే బియ్యం కోటా ఇవ్వలేమని పౌరసరఫరాల శాఖ తేల్చి చెప్పడంతో గురుకుల సొసైటీలు ఆందోళన చెందుతున్నాయి. సొసైటీలు ప్రతి సంవత్సరం సమ్మర్ క్యాంపు(వేసవి శిబిరం)లో భాగంగా వివిధ సొసైటీల ఆధ్వర్యంలో నడుస్తున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకుల పాఠశాలల్లో చురుకైన, ఆసక్తి ఉన్న విద్యార్థులను ఎంపిక చేసి.. క్రీడలు, డ్యాన్స్లు, హార్స్ రైడింగ్, స్పోకెన్ ఇంగ్లిష్, భావ వ్యక్తీకరణ, వ్యక్తిత్వ వికాసం వంటి 27 అంశాల్లో శిక్షణ ఇస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు విషయాలపై అవగాహన కల్పిస్తుండటంతో విద్యార్థులకు వసతితోపాటు భోజన సదుపాయం కూడా గురుకుల సొసైటీలు సమకూర్చాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ప్రత్యేకంగా బియ్యం కోటా ఇవ్వాలని పౌరసరఫరాల శాఖను కోరగా.. తాము ఇవ్వలేమని చెప్పడంతో విద్యార్థులకు భోజనం ఎలా అందించాలని సొసైటీలు మల్లగుల్లాలు పడుతున్నాయి. క్యాంపుల్లో 1,200 విద్యార్థులు ఇదిలా ఉండగా.. జిల్లాలో 14 గురుకుల పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ఒక డిగ్రీ కళాశాల ఉంది. డిగ్రీ కళాశాలలో వార్షిక పరీక్షలు నిర్వహిస్తున్నందున అక్కడ వేసవి శిబిరం నిర్వహించే అవకాశం ఉండదు. మిగిలిన 13 గురుకుల పాఠశాలల్లో క్యాంపులు ఏర్పాటు చేయాలని సొసైటీలు భావించినా.. బియ్యం కొరతతో ఏర్పాటు చేయలేకపోతున్నారు. మొత్తం 14 గురుకులాల్లో 5,089 మంది విద్యార్థినీ విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ప్రస్తుతం వేసవి శిబిరాల్లో భాగంగా ఎనిమిది చోట్ల క్యాంపులు నిర్వహిస్తున్నారు. 1,200 విద్యార్థులు శిబిరంలో పాల్గొంటున్నారు. వీరికి వసతితోపాటు భోజనం ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇందుకోసం 7.5 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం ఇవ్వాలని సొసైటీలు ప్రతిపాదనలు చేశాయి. అయితే ప్రత్యేక బియ్యం కోటాపై ప్రభుత్వం కూడా ఎటువంటి సూచనలు చేయలేదని, కోటా విడుదల సాధ్యం కాదని పౌరసరఫరాల శాఖ తేల్చి చెప్పింది. దీంతో సొసైటీలు సర్దుబాటు ప్రయత్నాల్లో తలమునకలయ్యాయి. గత విద్యా సంవత్సరం కేటాయించిన కోటాలో పాఠశాలలవారీగా మిగులు బియ్యం ఏమైనా ఉన్నాయా.. ఇంకా వేరేవిధంగా బియ్యా న్ని ఎలా సమకూర్చుకోవాలనే ప్రయత్నాల్లో అధికారులు నిమగ్నమయ్యారు. అలా మిగిలి ఉన్న బియ్యాన్ని క్యాంపులోని పిల్లలకు సర్దుబాటు చేయాలా.. లేక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలా.. అని ఆలోచిస్తున్నాయి. కాగా.. నెలరోజుల క్యాంపు నిర్వహణకు మొత్తం 7.5 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం ఉన్నట్లు సొసైటీ అధికారులు చెబుతున్నారు. ఇందుకోసం బియ్యం ఇవ్వాలని పౌరసరఫరాల శాఖకు ప్రతిపాదించారు. అయితే బియ్యం పంపిణీ చేస్తేనే విద్యార్థులకు న్యాయం జరుగుతుందని, లేదంటే ఆకలి కేకలు తప్పేట్లు లేదని ఉపాధ్యాయులు అంటున్నారు. -
ప్రైమరీ స్థాయిలో మినీ గురుకులాలు!
సాక్షి, హైదరాబాద్: గురుకుల పాఠశాలల్లో ప్రాథమిక స్థాయి తరగతులను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం గురుకుల పాఠశాలలు ఐదో తరగతి స్థాయి నుంచి మొదలవుతున్నాయి. నాలుగో తరగతి వరకు ప్రభుత్వ లేదా ప్రైవేటు పాఠశాలల్లో చదివిన విద్యార్థులు, గురుకుల ప్రవేశ పరీక్షలు రాసి ఐదో తరగతి నుంచి ఆంగ్లమాధ్యమంలో అడ్మిషన్లు పొందుతున్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటించిన స్కూళ్ల నుంచి వచ్చినవారు, పట్టణ ప్రాంతాల విద్యార్థులు ముందుకు వెళ్తుండగా... గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన విద్యార్థులు మాత్రం మిగిలిన వారితో పోటీ పడలేకపోతున్నారు. ఇది టీచర్లకు కొన్ని ఇబ్బందులు తెస్తోంది. దీంతో ప్రాథమిక స్థాయి నుంచే గురుకుల విద్యను ప్రవేశపెడితే విద్యార్థులు సమాన స్థాయిలో అభివృద్ధి చెందుతారని ప్రభుత్వం భావిస్తోంది. దీనిలో భాగంగానే మినీ గురుకులాల పేరిట కొత్త విద్యా సంస్థల్ని ప్రారంభించాలని యోచిస్తోంది. వీటిని ప్రస్తుత గురుకులాలకు అనుసంధానంగా నిర్వహించాలనే అంశంపై అధికారులు సమాలోచనలు చేస్తున్నారు. 29 మినీ గురుకులాలు ప్రస్తుతం గిరిజన అభివృద్ధి శాఖ పరిధిలో మినీ గురుకులాలను నిర్వహిస్తున్నారు. అక్కడ ప్రాథమిక స్థాయి నుంచే ఆంగ్ల మాధ్యమంలో బోధన చేపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 29 మినీ గురుకులాల్లో 5వేల మంది పిల్లలున్నారు. మినీ గురుకులాల్లో చదివి, అనంతరం సాధారణ గురుకులాల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులు, ఇతరుల కంటే మెరుగ్గా ఉన్నట్లు గిరిజన అభివృద్ధి శాఖ పరిశీలనలో తేలింది. ఈ క్రమంలో వాటి సంఖ్యను పెంచాలని గిరిజన అభివృద్ధి శాఖ యోచిస్తోంది. అన్ని సంక్షేమ శాఖల పరిధిలో వీటిని ఏర్పాటు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఎస్సీ అభివృద్ధి శాఖ సైతం ఈ తరహా పాఠశాలల ఏర్పాటుపై ఇటీవల పంపిన ప్రతిపాదనలపై ప్రభుత్వం సానుకూలంగా ఉంది. కొత్తగా రూపొందించే బడ్జెట్లో మినీ గురుకులాల అంశాన్ని ప్రతిపాదించేందుకు ఆయా సంక్షేమ శాఖ చర్యలు చేపట్టాయి. ప్రభుత్వం నుంచి అనుమతి వస్తే వచ్చే ఏడాది నుంచే మినీ గురుకులాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. -
వసతి.. తరగతి ఒకే గది!
బీసీ గురుకుల పాఠశాలలు ఇరుకు గదులు, అరకొర వసతుల మధ్య కొనసాగుతున్నాయి. సొంత భవనాలు లేకపోవడంతో అద్దె భవనాల్లో తరగతులు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల సంఖ్యకు సరిపడా గదులు లేనందున ఒకే గదిలో వసతి, తరగతులు నడుస్తున్నాయి. ప్రభుత్వం సొంత భవనాలు నిర్మిస్తే ఇక్కట్లు తప్పుతాయని విద్యార్థులు అంటున్నారు. మోర్తాడ్(బాల్కొండ): వెనుకబడిన తరగతుల విద్యార్థుల కోసం 2017–18 విద్యా సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గానికి ఒక గురుకుల పాఠశాలను ప్రారంభించింది. ఇందులో భాగం గా జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకుగాను మూడు బాలుర, రెండు బాలికల గురుకుల పాఠశాలలు ప్రారంభమయ్యాయి. బాలుర కో సం బాల్కొండ నియోజకవర్గానికి సంబంధిం చిన మోర్తాడ్లో, ఆర్మూర్ నియోజకవర్గానికి సంబంధించి ఖుద్వాన్పూర్లో, బోధన్ నియోజకవర్గానికి సంబంధించి ఎడపల్లిలో పాఠశాలలు ఏర్పాటు చేశారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి సంబంధించి బాలికల పాఠశాలను చీమన్పల్లిలో ఏర్పాటుకు నిర్ణయించగా, అనువైన వసతులు లేని కారణంగా ప్రస్తుతం నిజామాబాద్లోని ఒక అద్దె భవనంలో కొనసాగిస్తున్నారు. నిజామాబాద్ అర్బన్ గురుకులకు కంజరలో సొంతభవనం నిర్మిస్తుండగా ప్రస్తుతం నగరంలోని అద్దె భవనంలో కొనసాగిస్తున్నారు. వసతులు కరువు.. బీసీ గురుకుల పాఠశాలలకు సొంత భవనాలు లేకపోవడంతో వినియోగంలో లేని వసతి గృహాలు, అద్దె భవనాల్లో తరగతులు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా గదులు లేకపోవడం, మూత్రశాలలు, మరుగుదొడ్లు, నీటి సౌకర్యం ఆశించిన మేర లేకపోవడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ప్రతి పాఠశాలలో ఐదు, ఆరు, ఏడు తరగతులలో విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చారు. ఒక్కో తరగతికి రెండు సెక్షన్లను కేటాయించగా, ఒక్కో తరగతిలో 80 సీట్లను భర్తీ చేశారు. అంటే ఒక గురుకుల పాఠశాలలో మూడు తరగతులకు కలిపి 240 సీట్లను భర్తీ చేశారు. ⇔ మోర్తాడ్లోని పాఠశాలకు వినియోగంలో లేని బీసీ విద్యార్థి వసతి గృహాన్ని కేటాయించారు. అయితే ఈ వసతిగృహంలో వందమంది విద్యార్థులు ఉండడానికి మాత్రమే వీలుంది. కానీ 240 మంది విద్యార్థులను ఉండడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఆరు గదుల్లోనే వసతితో పాటు, తరగతులు నిర్వహిస్తున్నారు. అంతేగాకుండా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మరుగుదొడ్లు, మూత్రశాలలు, నీటివసతి సరిపోక విద్యార్థులు రోగాల బారిన పడుతున్నారు. ⇔ ఖుద్వాన్పూర్ పాఠశాలలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అయితే ఇక్కడ వసతికి ఇబ్బంది ఉన్నా.. వసతి గృహం ఎదురుగా ఉన్న ఉన్నత పాఠశాలలో తరగతులు నిర్వహిస్తున్నారు. ⇔ ఎడపల్లి పాఠశాలలో విద్యార్థులు ఉండలేక ఇంటిముఖం పడుతున్నారు. దీంతో వచ్చే విద్యా సంవత్సరం ఈ పాఠశాలను బోధన్కు తరలించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ⇔ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి సంబంధించి పాఠశాలను చీమన్పల్లికి తరలించడానికి సన్నాహాలు చేస్తున్నారు. చీమన్పల్లిలోని ఒక ప్రైవేటు భవనాన్ని అద్దెకు తీసుకుని విద్యార్థినులకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించినట్లు అధికారులు చెబుతున్నారు. చీమన్పల్లిలో గురుకుల పాఠశాల నిర్వహణ కోసం రూ.30 లక్షల వరకు ఖర్చు చేసి సౌకర్యాలను మెరుగుపరిచారు. ఒక్క చీమన్పల్లి పాఠశాలకు సంబంధించి సమస్య పరిష్కారం అయినా మిగిలిన పాఠశాల పరిస్థితి మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. పెరుగనున్న విద్యార్థుల సంఖ్య.. ఈ విద్యా సంవత్సరానికి గాను ఒక్కో పాఠశాలలో 240 మంది విద్యార్థులు ఉండగా, వచ్చే ఏడాది మరో తరగతి పెరుగనుంది. ఇప్పుడు ఏడో తరగతిలో ఉన్న విద్యార్థులు వచ్చే సంవత్సరం ఎనిమిదో తరగతిలో చేరనున్నారు. అలాగే మిగిలిన రెండు తరగతుల విద్యార్థులు పై తరగతులకు ప్రమోట్ కానున్నారు. దీంతో ఐదో తరగతిలో కొత్తగా విద్యార్థులు చేరడానికి అవకాశం ఉంది. అంటే మరో 80 మంది విద్యార్థుల సంఖ్య పెరగనుంది. ఇప్పుడు 240 మంది విద్యార్థులకు వసతి కల్పించడానికి ఇబ్బందులు ఉండగా విద్యార్థుల సంఖ్య మరింత పెరిగితే కష్టాలు తప్పేలా లేవనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. క్రీడలకూ దూరం.. బీసీ గురుకుల పాఠశాలల విద్యార్థులు క్రీడలకూ దూరమవుతున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న పాఠశాలల్లో అనువైన క్రీడా స్థలం లేకపోవడంతో ఆటలకు సమయం కేటాయించలేకపోతున్నారు. విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు ఎంతో ముఖ్యం. క్రీడాకారులు తయారు కావడానికి పాఠశాలల్లోనే పునాదులు ఏర్పడతాయి. అయితే గురుకుల పాఠశాలల్లోని విద్యార్థుల పరిస్థితి భిన్నంగా తయారైంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గురుకుల పాఠశాలలకు స్థల సేకరణ పూర్తి చేసి సొంత భవనాల నిర్మాణం వేగంగా చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇబ్బందులు తొలగించడానికి కృషి చేస్తున్నాం.. బీసీ గురుకుల పాఠశాలల్లోని విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. కొత్తగా ప్రారంభించిన పాఠశాలలకు అనువైన భవనాలు దొరకడం కష్టమే. సొంత భవనాలు నిర్మించే వరకు కొంత ఇబ్బంది తప్పదు. అయితే ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో విద్యార్థులకు సౌకర్యాలను మెరుగుపరచడానికి కృషి చేస్తున్నాం. – గోపిచంద్, బీసీ గురుకుల పాఠశాలల కన్వీనర్ సరైన సౌకర్యాలు లేవు.. గురుకుల పాఠశాలలో సరైన వసతి కల్పించడం లేదు. నీటి సమస్య తీవ్రంగా ఉంది. అలాగే మరుగుదొడ్లు, మూత్రశాలల సంఖ్య తక్కువగా ఉంది. చదువుకోవడం, నిద్రపోవడం ఒక్కటే చోట కావడం, సామగ్రి కూడా గదుల్లోనే ఉంచడంతో ఇబ్బందిగా ఉంది. – విజయ్కుమార్, విద్యార్థి, మోర్తాడ్ కొత్త భవనాలను నిర్మించాలి బీసీ గురుకుల పాఠశాలలకు కొత్త భవనాలను వెంటనే నిర్మించాలి. స్థలం లేక ఎలాంటి ఆటలు ఆడలేకపోతున్నాం. ప్రభుత్వం స్థల సేకరణ చేసి కొత్త భవనాలను నిర్మిస్తేనే మాకు ప్రయోజనం కలుగుతుంది. ఇరుకు గదుల్లో చదవాలంటే ఇబ్బందిగా ఉంటోంది. – అచ్యుత్, విద్యార్థి, మోర్తాడ్ -
గురుకులాల్లో ‘భారత్ దర్శన్’
సాక్షి, హైదరాబాద్: విద్యార్థులు పాఠశాలలకే పరిమితం కాకుండా, వారిలో విషయ పరిజ్ఞానం, వికాసం, సృజనాత్మకత పెంపొందించేందుకు గురుకుల సొసైటీ ఓ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వివిధ ప్రదేశాలను సందర్శించి వాటిపై అవగాహన పెంచుకునే విధంగా దీన్ని రూపొందించింది. ఇందులో భాగంగా ‘భారత్ దర్శన్’పేరిట దేశంలోని ప్రఖ్యాత ప్రాంతాలు, ప్రముఖ స్థలాలకు విద్యార్థులను తీసుకెళ్లేలా ప్రణాళికలు రచించింది. ఈ మేరకు ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రాధాన్యత క్రమంలో అవకాశం కల్పించనుంది. 9వ తరగతి నుంచి డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు దీన్ని అమలు చేస్తోంది. అవగాహన.. విశ్లేషణ.. రాష్ట్రంలో ఉన్న సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకులాల్లో 1.35 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో విశాల దృక్పథాన్ని అలవర్చాలనే ఉద్దేశంతో గురుకుల సొసైటీలు భారత్ దర్శన్ కార్యక్రమాన్ని తీసుకొచ్చాయి. దీని ద్వారా మెరిట్ విద్యార్థులను బృందాలుగా విభజించి, సొసైటీ సొంత ఖర్చుతో నిర్దేశిత ప్రాంతానికి తీసుకెళ్తారు. విద్యార్థులు అక్కడున్న సామాజిక పరిస్థితులు, ప్రాంతీయ అంశాలను పరిశీలించి, వాటిపై ప్రాజెక్టు రిపోర్టు సమర్పించాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టుకు ప్రత్యేకంగా మార్కులుండనప్పటికీ.. దీని వల్ల విద్యార్థుల్లో పరిశీలన, సృజనాత్మకత పెరుగుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఏటా 400 మందికి అవకాశం.. ఈ కార్యక్రమం ద్వారా ఏటా 400 మంది విద్యార్థులకు అవకాశం కల్పించాలని గురుకుల సొసైటీలు నిర్ణయించాయి. ఎస్సీ, ఎస్టీ గురుకుల సొసైటీ ద్వారా 200 చొప్పున ఈసారి పంపేందుకు ఏర్పాట్లు చేసింది. ఇటీవల 50 మంది విద్యార్థుల బృందం తమిళనాడు (చెన్నై సమీప ప్రాంతాలు) పర్యటనకు వెళ్లి వచ్చింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్–ఒడిశా, కర్ణాటక–కేరళ, మహారాష్ట్ర, రాజస్తాన్–గుజరాత్ రాష్ట్రాలకు మిగతా విద్యార్థులను పంపనున్నట్లు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల సొసైటీ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ తెలిపారు. డిగ్రీ గురుకులాల్లో ప్రత్యేక సబ్జెక్టు... రాష్ట్ర సామాజిక పరిస్థితులపై విద్యార్థులకు అవగాహన ఉండాలని గురుకుల సొసైటీ భావిస్తోంది. ఈ మేరకు ‘అండర్స్టాండింగ్ తెలంగాణ’పేరిట గురుకుల డిగ్రీ రెసిడెన్షియల్ కాలేజీల్లో ప్రత్యేక సబ్జెక్టును పాఠ్యాంశంగా ప్రవేశపెట్టనుంది. ఈ కోర్సులో భాగంగా క్షేత్రస్థాయిలో పర్యటించి, అవగాహన పెంచుకొని పరీక్షలు రాయాల్సి ఉంటుంది. త్వరలో ఈ కోర్సును ప్రవేశపెడతామని సొసైటీ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ వెల్లడించారు. -
గురుకుల పాఠశాలల్లో 324 సీట్లు భర్తీ
డిచ్పల్లి(నిజామాబాద్ రూరల్): ఉమ్మడి జిల్లా(నిజామాబాద్, కామారెడ్డి)కు సంబంధించి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 6 నుంచి 9వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి బుధవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. రెండు జిల్లాల గురుకుల విద్యాలయాల సంస్థ రీజనల్ కోఆర్డినేటర్ తులసీదాస్ నేతృత్వంలో మండలంలోని ధర్మారం(బి) గురుకుల పాఠశాలలో కౌన్సెలింగ్ జరిగింది. రెండు జిల్లాల్లోని బాలురు, బాలికల గురుకుల పాఠశాలల్లో 324 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించినట్లు రీజనల్ కోఆర్డినేటర్ తెలిపారు. ప్రవేశం పొందిన విద్యార్థులు ఆయా పాఠశాలల్లో ఈనెల 8వ తేదీ లోగా చేరాలన్నారు. ఆ తర్వాత ఏమైనా ఖాళీలు ఉంటే మలి విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నా రు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల కోఆర్డినేటర్లు సరోజినిదేవి, ఉమాదేవి, వివిధ పాఠశాలల ప్రిన్సిపాల్స్ సింధు, సంగీత, సత్యనారాయణ, కృతమూర్తి, రాజ్యలక్ష్మి, అసిస్టెంట్లు ప్రమోద్, నీరజ, చక్రపాణి, రాజేశ్వర్ పాల్గొన్నారు. కౌన్సిలింగ్కు భారీ సంఖ్యలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు తరలి వచ్చారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కౌన్సెలింగ్ కొనసాగింది. -
హోరాహోరీగా క్రీడాపోటీలు
డక్కిలి: డక్కిలి గురుకుల పాఠశాల, కళాశాల క్రీడా ప్రాంగణంలో బుధవారం గుంటూరు జోనల్ స్థాయి మూడో జోన్ గురుకుల పాఠశాల, కళాశాలల పోటీలు హోరాహోరీగా సాగాయి. పలు క్రీడా పోటీల్లో విద్యార్థులు పోటాపోటీగా ఆడారు. ఉదయం 7 నుంచి 11 గంటలు వరకు పోటీలు జరిగాయి. అనంతరం వర్షం జోరుగా కురవడంతో సాయంత్రం ప్రారంభమైన క్రీడా పోటీలు రాత్రి ఏడు గంటలు వరుకు సాగాయి. సీనియర్ హైజంప్ విభాగంలో సుప్రియ (నాగులపాళెం, ప్రకాశం జిల్లా), దీపిక (నాగులపాళెం, ప్రకాశం జిల్లా), రేవతి (పుదూరు) గెలుపొందారు. ట్రిపుల్ జంప్ విభాగంలో సుప్రజ (అద్దంకి, ప్రకాశం జిల్లా), తనుజా (సంగం), సంధ్య (ముత్తుకూరు), వాలీబాల్ సీనియర్స్ విభాగంలో కండలేరు – అమరావతి మధ్య జరిగిన పోరులో అమరావతి విజయం సాధించింది. నాగార్జునసాగర్–సూళ్లూరుపేట మధ్య జరిగిన పోటీల్లో నాగార్జునసాగర్ గెలిచింది. వినుకొండ – కొత్తకోడూరు జరిగిన మధ్య పోటీల్లో వినుకొండ విజయం పొందింది. పెద్దపావని – చీమకుర్తి మధ్య జరిగిన పోటీల్లో పెద్దపావని జట్టు గెలుపొందింది. ఖోఖో జూనియర్స్ విభాగంలో ఉప్పలపాడు – ఆర్కేపురం మధ్య జరిగిన పోటీల్లో ఆర్కేపురం గెలిచింది. సీనియర్స్ ఖోఖో విభాగంలో ముత్తుకూరు – నాగార్జునసాగర్ మధ్య జరిగిన పోటీల్లో నాగార్జునసాగర్ గెలుపొందింది. త్రోబాల్ జూనియర్ విభాగంలో కండలేరు – అమరావతి మధ్య జరిగిన పోటీల్లో కండలేరు జట్టు గెలుపొందింది. నాగార్జునసాగర్ – రాచర్ల మధ్య జరిగిన పోటీల్లో నాగార్జునసాగర్ గెలుపొందింది. పెద్దపావని – పుదూరు మధ్య జరిగిన పోటీల్లో పుదూరు జట్టు గెలుపొందింది. వినుకొండ – నాగార్జునసాగర్ మధ్య జరిగిన పోటీల్లో వినుకొండ గెలుచింది. సింగరాయకొండ – సంగం మధ్య జరిగిన పోటీల్లో సంగం గెలుపొందింది. బోగోలు – కండలేరు జట్ల మధ్య జరిగిన పోటీల్లో కండలేరు జట్టు విజయం సాధించింది. కబడ్డీ జూనియర్స్ విభాగంలో డక్కిలి – బోగోలు మధ్య జరిగిన పోటీల్లో డక్కిలి జట్టు గెలిచింది. సూళ్లూరుపేట – బుచ్చిరెడ్డిపాళెం జట్ల మధ్య జరిగిన పోటీల్లో సూళ్లూరుపేట జట్టు గెలిచింది. ఉప్పలపాడు – అమరావతి జట్ల మధ్య జరిగిన పోటీల్లో ఉప్పలపాడు గెలిచింది. పుదూరు–కొండెపి జట్ల మధ్య జరిగిన పోటీల్లో పుదూరు జట్టు గెలిచింది. కబడ్డీ సీనియర్స్ విభాగంలో రాచర్ల – బాపట్ల జట్ల మధ్య జరిగిన పోటీల్లో బాపట్ల జట్టు విజయం సాధించింది. సూళ్లూరుపేట – నాగులపాళెం జట్ల మధ్య జరిగిన పోటీల్లో సూళ్లూరుపేట జట్టు విజయం సాధించింది. -
కేజీ టు పీజీకి గురుకులాలే పునాది!
► రాష్ట్రంలో గురుకులాల సంఖ్య పెంచుతాం: సీఎం కేసీఆర్ ► వచ్చే ఏడాది 119 బీసీ, 89 మైనారిటీ గురుకులాలు ► ఒక్కో విద్యార్థికి రూ.84 వేల ఖర్చుతో విద్య, వసతి, ఆహారం సాక్షి, హైదరాబాద్: రాబోయే రోజుల్లో గురుకుల విద్యాలయాల సంఖ్యను విరివిగా పెంచుకుంటూ వెళతామని.. కేజీ టు పీజీ ఉచిత విద్య విధానానికి అది పునాది వంటిదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు తెలిపారు. భావితరానికి మంచి విద్యను అందించడం ద్వారానే పేదల జీవితాల్లో గుణాత్మక మార్పు వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఆ లక్ష్య సాధన కోసమే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల కోసం జనాభా దామాషా ప్రకారం గురుకుల విద్యాలయాలు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో గురుకుల విద్య విస్తరణపై శనివారం హైదరాబాద్లోని క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్షించారు. మంచి విద్య అందించడం ద్వారానే పేదల జీవితాలు బాగుపడతాయని తాను బలంగా నమ్ముతున్నానని ఈ సందర్భంగా కేసీఆర్ చెప్పారు. ఒక్కో విద్యార్థిపై దాదాపు రూ.84 వేల ఖర్చుతో మంచి విద్య, వసతి, ఆహారం అందిస్తున్నామన్నారు. వచ్చే ఏడాదిలో బీసీల కోసం నియోజకవర్గానికి ఒకటి చొప్పున 119 గురుకులాలు ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. కావాల్సినన్ని ఏర్పాటు చేస్తాం.. మైనారిటీ వర్గాలకు దేశంలో ఎక్కడా లేనివిధంగా ఈ ఏడాది 71 మైనారిటీ గురుకుల పాఠశాలలు ప్రారంభించామని తెలిపా రు. వచ్చే విద్యా సంవత్సరం మరో 89 విద్యాలయాలు ప్రారంభిస్తామని కేసీఆర్ చెప్పారు. హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల్లో మైనారిటీల జనాభా, స్థలాల అందుబాటు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని మరిన్ని గురుకులాలు మంజూరు చేయడానికి కూడా సిద్ధమని పేర్కొన్నారు. మైనారిటీల జనాభా ఎక్కువగా ఉన్న చోట ఒక బాలికల, ఒక బాలుర గురుకులంతోనే సరిపెట్టకుండా ఎన్ని అవసరమైతే అన్ని స్థాపించాలని అధికారులకు సూచించారు. 2016–17లో 71 మైనారిటీ గురుకులాల ద్వారా 17 వేల మందికి విద్య అందుతున్నదని, దీని కోసం రూ.143.21 కోట్లు వెచ్చిస్తున్నామని తెలిపారు. 160 గురుకులాల ద్వారా వచ్చే ఐదేళ్లలో లక్ష మంది విద్యార్థులకు మంచి విద్య అందుతుందని పేర్కొన్నారు. గురుకుల విద్యాలయాలకు సొంత భవనాలు, ఇతర మౌలిక సదుపాయాల కోసం మరో రూ.3 వేల కోట్లు వెచ్చిస్తామని చెప్పారు. ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మండలి విప్ పల్లా రాజేశ్వర్రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్రెడ్డి, ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి, ఎంపీలు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, బాల్క సుమన్, ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్రావు, బాబూమోహన్, గణేశ్గుప్తా, సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి భూపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గురుకుల టీచర్ల భర్తీకి రెండంచెల పరీక్ష
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ గురుకుల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 2,444 పోస్టుల భర్తీలో అమలు చేయాల్సిన పరీక్షల విధానాన్ని ప్రభుత్వం ఖరారు చేసింది. టీఎస్పీఎస్సీ మొదటిసారిగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీని చేపడుతుండడంలో కొత్త విధానాన్ని రూపొందించింది. రెండంచెల విధానంలో (ప్రిలిమినరీ, మెయిన్) ఈ పరీక్షలను నిర్వహించాలని స్పష్టం చేసింది. అన్ని పోస్టులకు నిర్వహించే పరీక్షల్లో ఆబ్జెక్టివ్ విధానాన్ని అనుసరించాలని పేర్కొంది. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ), పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ), ప్రిన్సిపల్ పోస్టులకు రెండంచెల్లో పరీక్షలను నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నా.. మొదటి పరీక్షకు ప్రిలిమినరీ అనే పేరు మాత్రం పెట్టలేదు. అదే జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్ పోస్టులకు నిర్వహించే పరీక్షలకు మాత్రం ప్రిలిమినరీ (స్క్రీనింగ్ టెస్టు) పరీక్ష, మెయిన్ పరీక్ష నిర్వహిస్తామని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మ గురువారం జీవో 229 జారీ చేశారు. ప్రిన్సిపల్, జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్ పోస్టుల భర్తీలో 30 మార్కులతో ఇంటర్వ్యూ/డెమాన్స్ట్రేషన్/ముఖాముఖి ఉం టుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పోస్టు ల భర్తీకి డిస్క్రిప్టివ్ విధానం అమల్లోకి తెచ్చే ఆలోచనలు జరిగినా, ఆబ్జెక్టివ్ విధానంలోనే పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం ఓకే చెప్పింది. ఇదీ పేపర్ల విధానం టీచర్ పోస్టులకు.. ►మొదటి పరీక్షలో ఒక పేపరు ఉంటుంది. పేపరు-1: జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్, బేసిక్ ప్రొఫీషియెన్సీ ఇన్ ఇంగ్లిష్ అంశాల్లో ప్రశ్నలు ఉంటాయి. 150 ప్రశ్నలతో 150 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. 150 నిమిషాల సమయం ఇస్తారు. ► రెండో పరీక్షను మెయిన్ ఎగ్జామినేషన్గా 300 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. పేపరు-1: ఈ పరీక్షను 150 మార్కులకు నిర్వహిస్తారు. పెడగాజీ/స్కూల్ మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అంశాల్లో ప్రశ్నలు ఉంటాయి. 150 ప్రశ్నలు, 150 మార్కులు, 150 నిమిషాలు. పేపరు-2: సంబంధిత సబ్జెక్టులో నిర్వహిస్తారు. 150 ప్రశ్నలు, 150 మార్కులు, 150 నిమిషాలు. ప్రిన్సిపల్ పోస్టులకు.. ► మొదటి పరీక్షలో ఒక పేపరు ఉంటుంది. పేపరు-1: జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్, బేసిక్ ప్రొఫీషియెన్సీ ఇన్ ఇంగ్లిష్ అంశాల్లో ప్రశ్నలు ఉంటాయి. 150 ప్రశ్నలతో 150 మార్కులకు నిర్వహిస్తారు. 150 నిమిషాల సమయం ఇస్తారు. ► రెండో పరీక్షను మెయిన్ ఎగ్జామినేషన్గా నిర్వహిస్తారు. రెండు పేపర్లు ఉంటాయి. పేపరు-1: పెడగాజీ, స్కూల్ మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అంశాల్లో ప్రశ్నలు ఉంటాయి. 150 ప్రశ్నలు, 150 మార్కులు, 150 నిమిషాలు. పేపరు-2: రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్ వర్క్, స్కూల్ ఆర్గనైజేషన్, టీచర్ ఎంపవర్మెంట్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అంశాల్లో ప్రశ్నలుంటాయి. 150 ప్రశ్నలు, 150 మార్కులు, 150 నిమిషాలు. అదనంగా 30 మార్కులకు ఇంటర్వ్యూ/డెమాన్స్ట్రేషన్/ముఖాముఖి ఉంటుంది. జూనియర్ లెక్చరర్ పోస్టులకు.. ►ప్రిలిమినరీ పేరుతో మొదటి పరీక్ష ఉంటుంది. పేపరు-1: జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్, బేసిక్ ప్రొఫీషియెన్సీ ఇన్ ఇంగ్లిష్ అంశాల్లో ప్రశ్నలు ఉంటాయి. 150 ప్రశ్నలతో 150 మార్కులకు నిర్వహిస్తారు. 150 నిమిషాల సమయం ఇస్తారు. ►రెండో పరీక్షను మెయిన్ ఎగ్జామినేషన్గా నిర్వహిస్తారు. ఇందులో 2 పేపర్లు ఉంటాయి. పేపరు-1: పెడగాజీ, స్కూల్ మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అంశాల్లో ప్రశ్నలు ఉంటాయి. 100 ప్రశ్నలు, 100 మార్కులు ఉంటాయి. 90 నిమిషాల సమయం ఇస్తారు. పేపరు-2: సంబంధిత సబ్జెక్టులో ఉంటుంది. 200 మార్కులకు 200 ప్రశ్నలతో నిర్వహిస్తారు. 180 నిమిషాల సమయం ఇస్తారు. అదనంగా ఇంటర్వ్యూ/డెమాన్స్ట్రేషన్/ముఖాముఖి 30 మార్కులకు ఉంటుంది. డిగ్రీ లెక్చరర్, ఫిజికల్ డెరైక్టర్ పోస్టులకు ► ప్రిలిమినరీ (స్క్రీనింగ్ టెస్టు) పేరుతో మొదటి పరీక్ష ఉంటుంది. పేపరు-1: జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్, బేసిక్ ప్రొఫీషియెన్సీ ఇన్ ఇంగ్లిష్ అంశాల్లో ప్రశ్నలు ఉంటాయి. 150 ప్రశ్నలతో 150 మార్కులకు నిర్వహిస్తారు. ► రెండో పరీక్షను మెయిన్ ఎగ్జామినేషన్గా నిర్వహిస్తారు. ఒక పేపరు ఉంటుంది. పేపరు-1: సంబంధిత సబ్జెక్టులో ఉంటుంది. 300 మార్కులకు నిర్వహిస్తారు. 150 ప్రశ్నలకు 150 నిమిషాల సమయం ఉంటుంది. అదనంగా ఇంటర్వ్యూ/డెమాన్స్ట్రేషన్/ముఖాముఖి 30 మార్కులకు ఉంటుంది. ఆర్ట్, క్రాఫ్ట్ తదితర స్పెషల్ టీచర్లకు పేపరు-1గా ఒక పేపరు ఉంటుంది. ఇందులో జనరల్ స్టడీస్, సంబంధిత సబ్జెక్టులో జ్ఞానంపై 200 మార్కులకు 200 ప్రశ్నలతో పరీక్ష నిర్వహిస్తారు. 180 నిమిషాల సమయం ఇస్తారు. -
ఎన్నో తీర్మానాలు.. మరెన్నో చర్చలు...
* ఆసక్తికరంగా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం * రాష్ట్రానికి ‘ఎన్టీఆర్ నవ్యాంధ్రప్రదేశ్’గా నామకరణం చేయాలని తీర్మానం * జెడ్పీ పాఠశాలలను గురుకుల పాఠశాలలుగా మార్చేందుకు నిర్ణయం * నిధులు, విధులు లేని జెడ్పీటీసీ వ్యవస్థను రద్దుచేస్తారా.. * లేకుంటే గౌరవం కల్పిస్తారా చెప్పాలంటూ చర్చ ఆద్యంతం ఆసక్తికర చర్చలు.. పలు తీర్మానాలు.. వాటిని ప్రభుత్వానికి పంపాలని నిర్ణయూలు... ఇవీ.. స్థానిక పాత జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నిర్వహించిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం విశేషాలు. మాజీ ఎమ్మెల్సీ దాచూరి రామిరెడ్డికి నివాళులర్పించడంతో పాటు పలు కీలక అంశాలపై జెడ్పీ సమావేశంలో చర్చించారు. ఆ వివరాలివీ.. - ఒంగోలు రాష్ట్రానికి ‘ఎన్టీఆర్ నవ్యాంధ్రప్రదేశ్’గా నామకరణం చేయాలి... రాష్ట్రానికి ‘ఎన్టీఆర్ నవ్యాంధ్రప్రదేశ్’గా నామకరణం చేయాలని జెడ్పీ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. జెడ్పీటీసీ సభ్యురాలు నాగజ్యోతి ఈ విషయూన్ని ప్రతిపాదించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ తెలుగుజాతి వైభవాన్ని చాటిచెప్పిన ఎన్టీఆర్ పేరును రాష్ట్రానికి పెట్టాలని తాము కూడా సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామన్నారు. కొండపి ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి మాట్లాడుతూ ఎన్టీఆర్ పేరుతో అనేక పథకాలు ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. రాష్ట్రానికి కూడా తప్పకుండా ఆయన పేరు పెట్టాలని పేర్కొన్నారు. జెడ్పీ చైర్మన్ ఈదర హరిబాబు మాట్లాడుతూ పథకాలకు పేరుపెడితే ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఆ పేరు మారుతుంటుందని, అదే రాష్ట్రానికి పెడితే చిరస్థాయిగా ఉండిపోతుందని అన్నారు. మార్కాపురం ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రానికి ఎన్టీఆర్ పేరు పెట్టేందుకు తాము వ్యతిరేకం కాదన్నారు. అయితే, ఎన్టీఆర్ పేరుకన్నా చంద్రన్న పేరునే పథకాలకు ఎక్కువగా పెట్టారని, ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ పేరు పెట్టేందుకు చంద్రబాబు ఎంతవరకు ముందుకు వస్తారనేది తమకు అనుమానంగా ఉందని పేర్కొన్నారు. అందువల్ల ఈ ప్రతిపాదనను చంద్రబాబు ద్వారానే కేంద్రానికి పంపాలని విజ్ఞప్తి చేశారు. దీంతో రాష్ట్రానికి ఎన్టీఆర్ నవ్యాంధ్రాప్రదేశ్గా పేరుపెట్టాలని సభ ఏకగ్రీవంగా తీర్మానించింది. జెడ్పీ పాఠశాలలను జెడ్పీ గురుకుల పాఠశాలలుగా మార్చాలి... జిల్లాలో జెడ్పీ ఉన్నత పాఠశాలలు 380 ఉన్నాయని, వాటిలో 90 శాతం మంది విద్యార్థులు ఎస్సీ, ఎస్టీలేనని చైర్మన్ ఈదర హరిబాబు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పాఠశాల ఒక ప్రాంతంలో, హాస్టళ్లు మరో ప్రాంతంలో ఉండటం వల్ల ప్రభుత్వానికి, విద్యార్థులకు భారంగా మారుతుందన్నారు. చాలాచోట్ల సరిపడినంత స్థలం కూడా లేకపోవడంతో హాస్టళ్ల నిర్మాణాలకు కూడా ఆటంకాలు ఏర్పడుతున్నాయన్నారు. తాము ప్రతిపాదించే విధానాల ప్రకారం ప్రతి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కేవలం ఐదారు చుట్టుపక్కల గ్రామాలకు కేంద్రంగా ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో ఆ పాఠశాల ఆవరణలోనే హాస్టళ్ల నిర్మాణం కూడా చేపడితే ఆ గ్రామాల్లోని విద్యార్థులు డేస్కాలర్లుగా, ఇతర గ్రామాల విద్యార్థులు రెసిడెన్షియల్గా ఉంటారన్నారు. కేవలం 5 నుంచి 6 కిలోమీటర్ల దూరంలోనే తమ గ్రామాలుండటం వల్ల విద్యార్థులు సెలవురోజుల్లో ఇంటికి వెళ్లడానికి వీలవుతుందన్నారు. ఇందుకోసం జెడ్పీ పాఠశాలలను జెడ్పీ గురుకుల పాఠశాలలుగా మార్చాలన్నారు. దీనిపై కూడా సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలని నిర్ణరుుంచింది. డీసీసీబీని ఆర్సీఎస్ టార్గెట్ చేస్తోంది : ఈదర మోహన్ రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా ప్రకాశం జిల్లా సహకార కేంద్ర బ్యాంకును నిర్వీర్యం చేయాలనే కక్షతో రిజిస్ట్రార్ ఆఫ్ కో ఆపరేటివ్ సొసైటీస్ (ఆర్సీఎస్) వ్యవహరిస్తున్నారని జిల్లా పరిషత్ చైర్మన్ అనుమతితో పీడీసీసీబీ చైర్మన్ ఈదర మోహన్బాబు సభలో ప్రస్తావించారు. సొసైటీలకు సంబంధించిన మిగులు షేరు ధనాన్ని వెంటనే సొసైటీలకు జమచేయాలని ఆదేశించారని, దీన్ని కేవలం బ్యాంకుకు మాత్రమే రాతపూర్వకంగా పంపారని పేర్కొన్నారు. ఇటీవల కరువు కాలంలో రైతులకు సత్వరంగా రుణాలందించేందుకు మూలధనం లేకుండా కూడా రుణాలు మంజూరుచేశామన్నారు. అయితే, ఆప్కాబ్ ఆదేశాలతో రైతుల వద్దనుంచి తిరిగి 3 శాతం మూలధనాన్ని వసూలు చేశామన్నారు. కానీ, తాజాగా ఆర్సీఎస్ నుంచి వచ్చిన ఆదేశాలతో బ్యాంకుపై రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు. కక్షపూరితంగా వ్యవహరిస్తూ బ్యాంకును దెబ్బతీయాలని చూస్తున్న ఆర్సీఎస్పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని మోహన్బాబు కోరారు. ఆ మేరకు సమావేశం కూడా తీర్మానించింది. జెడ్పీటీసీ వ్యవస్థను రద్దుచేయండి... జెడ్పీటీసీ సభ్యులైన తాము కేవలం ఉత్సవ విగ్రహాలుగా మారామని, ఇటువంటి వ్యవస్థ అవసరం లేదనుకుంటే రద్దుచేసి ప్రభుత్వం వ్యయాన్ని తగ్గించుకోవచ్చని పొదిలి జెడ్పీటీసీ సభ్యుడు సాయిరాజేశ్వరరావు సభలో చర్చలేపారు. పంచాయతీ సర్పంచ్ అనుమతి లేకుండా గ్రామంలో ఏమీ చేయలేకపోతున్నామన్నారు. జెడ్పీ నిధులతో అభివృద్ధి పనులు చేస్తున్నా.. ఆ వివరాలు కూడా తమకు తెలియడంలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. చివరకు తాము కూర్చునేందుకు ఎంపీడీవో కార్యాలయంలో కుర్చీ కూడా ఉండటం లేదన్నారు. దీనిపై పలువురు జెడ్పీటీసీ సభ్యులు స్పందిస్తూ ఎంపీపీల ద్వారానే జెడ్పీ చైర్మన్ను ఎన్నుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే బెటరని, జెడ్పీటీసీ వ్యవస్థను రద్దుచేయాలని డిమాండ్ చేశారు. జెడ్పీటీసీ సభ్యులకు ఏడాదికి కనీసం రూ.10 లక్షల జెడ్పీ నిధులు కేటాయించాలన్నారు. వ్యవస్థను రద్దుచేయడంగానీ, విధులు, నిధులు కల్పించడంగానీ చేయూలని తీర్మానిస్తూ ప్రభుత్వానికి పంపాలని నిర్ణయించారు. ‘ఏసీ’కి నోటీసులు, విచారణకు కమిటీ... పర్చూరు మండలంలో దేవాలయ భూములకు సంబంధించిన కుంభకోణంపై సమాధానం ఇవ్వాలని దేవాదాయశాఖ సహాయ కమిషనర్ను జెడ్పీ చైర్మన్ అడిగారు. అయితే, కమిషనర్కు బదులుగా సమావేశానికి సూపరింటెండెంట్ రావడంపై చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషనర్ ఎందుకు రాలేదని ప్రశ్నించగా, క్యాంపునకు వెళ్లారని సూపరింటెండెంట్ బదులిచ్చారు. క్యాంపు ఎక్కడ అని ప్రశ్నిస్తే.. తనకు తెలియదంటూ సూపరింటెండెంట్ నీళ్లు నమలడంపై చైర్మన్ మండిపడ్డారు. కుంభకోణంపై విచారణకు జెడ్పీ నుంచి కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు. పాఠశాలల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి... జిల్లా పరిషత్ పాఠశాలలు, వాటిలో ఆటస్థలాలను అభివృద్ధి చేసేందుకు సమావేశంలో ప్రతిపాదించి తీర్మానించారు. సీసీ రోడ్ల నిర్మాణం ద్వారా భూతాపాన్ని పెంచడం కంటే నీరు-చెట్టు పథకం, ఎంజీ ఎన్ఆర్ఈజీఎస్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని డ్వామా పీడీ పోలప్ప పేర్కొన్నారు. రోటరీ క్లబ్ చిలకలూరిపేట ప్రధాన కార్యదర్శి రత్నప్రభాకర్ మాట్లాడుతూ ప్రకాశం జిల్లా పరిషత్ స్కూళ్లలో 14 వేల బెంచీలు, 190 ఆర్వో ప్లాంట్లు, 660 మరుగుదొడ్లు, 100 లైబ్రరీలు నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. రాబోయే మూడు నెలల్లో జిల్లాలోని జెడ్పీ పాఠశాలలకు 3,800 బెంచీలు అందజేస్తామని పేర్కొన్నారు. ఆర్అండ్బీలో అక్రమాలపై విచారణకు ఆదేశం జిల్లాలోని రోడ్లు, భవనాల శాఖ (ఆర్అండ్బీ)లో అక్రమాలపై విచారణకు ఆదేశిస్తున్నట్లు జెడ్పీ చైర్మన్ ఈదర హరిబాబు ప్రకటించారు. అందుకోసం సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం కూడా చేశారు. జిల్లాలో రూ.100 కోట్ల పనులకు సంబంధించి అక్రమాలు జరిగాయంటూ సాక్షి దినపత్రికలో ఆధారాలతో సహా కథనాలు ప్రచురితమయ్యాయి. దీనిపై ఆర్అండ్బీ అధికారులను ఈదర ప్రశ్నించారు. ఆర్అండ్బీ ఎస్ఈ సమావేశానికి ఎందుకు రాలేదని, టెండర్లు పిలిచినా ఎందుకు ఓపెన్ చేయలేదని, ఎమ్మెల్యేలు తెరవవద్దంటే టెండర్ కవర్లు ఓపెన్ చేయరా..? అని ప్రశ్నించారు. గత నెల 22వ తేదీ టెండర్లు తెరిచామంటూ ఆర్అండ్బీ అధికారులు సమావేశంలో ప్రకటించారు. మరి ఎందుకు బయటపెట్టలేదని చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగిల్ టెండర్ వేస్తే ఓపెన్ చేస్తారా..? ముగ్గురునలుగురు కలిసి ఒక పనికి టెండర్ వేస్తే ఓపెన్ చేయరా..? అంటే కాంట్రాక్టర్లు సిండికేట్ కావడానికి మీరే సహకరిస్తున్నారా..? అంటూ జెడ్పీ చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై విచారణకు ఆదేశిస్తున్నామని చెప్పడంతో సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. -
ఇంటర్లో తగ్గిన ఉత్తీర్ణత
- ఫలితాల్లో వెనుకబడిన తేగాడ ఆదర్శ, తాళ్లపాలెం గురుకులం - పూర్తిస్థాయిలో అధ్యాపకులు లేక అవస్థలు - నిరాశ వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు కశింకోట: మండలంలోని ప్రభుత్వ ఆదర్శ, గురుకుల పాఠశాలలు ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షల్లో ఆశించిన ఫలితాలు సాధించలేకపోతున్నాయి. వీటిలో కనీసం యాభై ఉత్తీర్ణత లభింలేదు. ఇక్కడ నిర్వహిస్తున్న ఆంగ్ల మాద్యమం కోర్సులకు సంబంధించి అవసరమైన అధ్యాపకులు లేకపోవడమే కారణమని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు. మండలంలో తేగాడలో రెండేళ్ల క్రితం ప్రారంభించిన ఆదర్శ పాఠశాలలో నాలుగు గ్రూపులతో ఇంటర్మీడియెట్ నిర్వహిస్తున్నారు. ఇదే పాఠశాల నుంచి ఈ ఏడాఇ 57 మంది ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలకు హాజరుకాగా, 26 మంది మాత్రమే పాసయ్యారు. 46 శాతం ఉత్తీర్ణత లభించింది. బైపీసీలో 14 మందికి ఐదుగురు మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ఇక సీఈసీ గ్రూపులో ఉత్తీర్ణత దారుణం. 17 మందికి ఇద్దరు మత్రమే పాసయ్యారు. ఎంఈసీ గ్రూపులో కూడా 8 మందికి ఇద్దరు మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ఎంపీసీ గ్రూపులో పెదపాటి జానకి 389 మార్కులు, మంత్రి సాయికుమార్కు 369 మార్కులు రావడం అక్కడి ప్రమాణాలకు అద్దం పడుతున్నాయి. ఇక్కడ కెమిస్ట్రీ అధ్యాపకుడు లేకపోవడం, తెలుగు మాధ్యమంలో మొదటి నుంచి చదివి వచ్చిన విద్యార్థులు ఒక్కసారిగా ఆంగ్ల మాధ్యమంలో మారి పరీక్షలు రాయడం తదితర కారణాల వల్ల ఆశించిన ఫలితాలు రావడం లేదు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. గురుకుల పాఠశాలలోనూ... మండలంలోని తాళ్లపాలెం సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలోని ఇంటర్మీడియట్ ఫలితాలు కూడా ఆశాజనకంగా లేవు. ఈ ఏడాది సుమారు 40 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ఇక్కడ ఎంఈసీ, సీఈసీ గ్రూపులను ఈ విద్యా సంవత్సరంలోనే ఆంగ్ల మాధ్యమం కొత్తగా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఆంగ్లం, ఎకనామిక్స్ సబ్జెక్టులకు తప్ప మిగిలిన సబ్జెక్టులకు కాంట్రాక్టు ఉపాధ్యాయులతో నెట్టుకొచ్చారు. దీంతోపాటు విద్యార్థులు ఎక్కువ మంది తెలుగు మాధ్యమం నుంచి వ చ్చిన వారు కావడం వల్ల ఉత్తీర్ణత శాతం తగ్గడానికి కారణంగా తెలుస్తోంది. అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో ఉపాధ్యాయ సిబ్బందిని నియమించి విద్యా ప్రమాణాలు పెంపొందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.