HCL Tech
-
హైదరాబాద్లో హెచ్సీఎల్ టెక్ మరో జీడీసీ..
ప్రముఖ ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ (HCLTech) హైదరాబాద్లో మరో గ్లోబల్ డెలివరీ సెంటర్ను (GDC) తెరిచింది. హైటెక్ సిటీలో ఏర్పాటైన ఈ గ్లోబల్ డెలివరీ సెంటర్ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. నగరంలో హెచ్సీఎల్ టెక్ సంస్థకు ఇది ఐదో గ్లోబల్ డెలివరీ సెంటర్. ఈ అత్యాధునిక కేంద్రంలో 5,000 మంది ఉద్యోగులు పని చేసుకునేందుకు వెసులుబాటు ఉంది.హైదరాబాద్లో హెచ్సీఎల్ టెక్ తాజాగా ఏర్పాటు చేసిన గ్లోబల్ డెలివరీ సెంటర్ 3,20,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఇది ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నుండి గోల్డ్ సర్టిఫికేషన్ పొందింది. ఈ కేంద్రం ద్వారా 5,000 ఉద్యోగాలు లభిస్తాయని, ప్రముఖ టెక్ గమ్యస్థానంగా హైదరాబాద్ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుందని అంచనా.2007 నుండి హెచ్సీఎల్ టెక్ సంస్థకు హైదరాబాద్ వ్యూహాత్మక ప్రదేశంగా ఉంది. నగరంలో ఈ సంస్థకు 10,000 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. కొత్త కేంద్రం గ్లోబల్ కెపాసిటీ సెంటర్లకు మద్దతు ఇస్తుంది. ఫైనాన్స్, మాన్యుఫాక్చరింగ్, హెల్త్కేర్ వంటి రంగాలలో అధునాతన పరిష్కారాలను అందిస్తుంది.గ్లోబల్ ఏఐ హబ్ గా తెలంగాణట్రిలియన్ డాలర్ల ఎకానమీగా, గ్లోబల్ ఏఐ హబ్ గా తెలంగాణ శరవేగంగా రూపాంతరం చెందుతోందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్కిల్డ్ వర్క్ ఫోర్స్ పట్ల రాష్ట్రానికి ఉన్న నిబద్ధతను ఆయన నొక్కి చెప్పారు. తెలంగాణ 2.0 గ్రోత్ విజన్ ద్వారా వృద్ధిని వేగవంతం చేయడానికి రాష్ట్రం కట్టుబడి ఉందని రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు పునరుద్ఘాటించారు.హెచ్ సీఎల్ టెక్ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ సి.విజయకుమార్ కొత్త కేంద్రంపై హర్షం వ్యక్తం చేస్తూ.. ‘కృత్రిమ మేధ నేతృత్వంలోని సాంకేతిక పరిజ్ఞానంలో ఉత్తేజకరమైన దశలో మనం ఉన్నాం. మా క్లయింట్లకు ఈ పరిష్కారాలను అందించడానికి మా గ్లోబల్ నెట్వర్క్లో హైదరాబాద్ ఒక వ్యూహాత్మక స్థానం. ఇక్కడి గ్లోబల్ కెపాసిటీ సెంటర్ల పురోగతికి కృషి చేస్తాం’ అన్నారు. -
అత్యంత విలువైన ఐటీ బ్రాండ్లు
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా దేశీ టెక్నాలజీ సంస్థలకు పెరుగుతున్న ప్రాధాన్యానికి నిదర్శనంగా దిగ్గజాలు టీసీఎస్(TCS), ఇన్ఫోసిస్(Infosys), హెచ్సీఎల్ టెక్నాలజీస్(HCL Tech), విప్రో(Wipro), టెక్ మహీంద్రా(Tech Mahindra) ప్రపంచంలోనే అత్యంత విలువైన ఐటీ సర్వీసుల బ్రాండ్ల జాబితాలో ప్రముఖంగా చోటు దక్కించుకున్నాయి. 2025కి గాను టాప్ 25 సంస్థలతో బ్రాండ్ వేల్యుయేషన్ కన్సల్టెన్సీ సంస్థ బ్రాండ్ ఫైనాన్స్ రూపొందించిన నివేదికలో వరుసగా నాలుగో సంవత్సరంలోనూ టీసీఎస్ రెండో స్థానంలో, ఇన్ఫోసిస్ మూడో స్థానంలో నిల్చాయి. ఇందులో యాక్సెంచర్ వరుసగా ఏడో ఏడాది అగ్రస్థానంలో కొనసాగింది.టీసీఎస్ బ్రాండ్ విలువ 11 శాతం పెరిగి 21.3 బిలియన్ డాలర్లకు చేరగా, ఇన్ఫోసిస్ బ్రాండ్ విలువ 15 శాతం పెరిగి 16.3 బిలియన్ డాలర్లకు చేరింది. అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఐటీ సేవల బ్రాండుగా హెచ్సీఎల్ టెక్నాలజీస్ నిల్చింది. కంపెనీ బ్రాండు విలువ 17 శాతం పెరిగి 8.9 బిలియన్ డాలర్లుగా ఉంది. అటు విప్రో, టెక్ మహీంద్రా, హెక్సావేర్ మొదలైనవి కూడా లిస్టులో చోటు దక్కించుకున్నాయి. దేశాలపరంగా చూస్తే మొత్తం బ్రాండ్ వేల్యూలో 40 శాతం వాటాతో అమెరికా అగ్రస్థానంలో 36 శాతం వాటాతో భారత్ రెండో స్థానంలో ఉన్నాయి.ఇదీ చదవండి: ట్రిలియనీర్లు వచ్చేస్తున్నారహో!కోలుకుంటున్న మార్కెట్ ..ద్రవ్యోల్బణం, అధిక వడ్డీ రేట్ల కారణంగా 2023 ఆఖర్లో, 2024 తొలినాళ్లలో కార్పొరేట్లు వ్యయాలను తగ్గించుకున్నాయని, అదే సమయంలో కృత్రిమ మేథ సంబంధిత సర్వీసులకు డిమాండ్ పెరిగిందని బ్రాండ్ ఫైనాన్స్ తెలిపింది. అమెరికా మార్కెట్ క్రమంగా పుంజుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్న నేపథ్యంలో భారతీయ ఐటీ సంస్థలకు ప్రయోజనాలు చేకూరగలవని పేర్కొంది. 2025లో వడ్డీ రేట్లు తగ్గి, కార్పొరేట్లు ఖర్చు చేయడం పెరగడంతో పాటు కొత్త టెక్నాలజీలకు డిమాండ్ నెలకొనడం వల్ల ఐటీ సంస్థలు లబ్ధి పొందవచ్చని బ్రాండ్ ఫైనాన్స్ తెలిపింది. అత్యంత విలువైన బ్రాండ్లన్నీ కూడా మారుతున్న పరిశ్రమ ట్రెండ్స్కి అనుగుణంగా కొత్త ఆవిష్కరణలు, వ్యూహాత్మక ప్రాజెక్టులపై దృష్టి పెడుతున్నాయని వివరించింది. -
హెచ్సీఎల్ నుంచి డేటా ట్రస్ట్ షీల్డ్
న్యూఢిల్లీ: ఐటీ రంగ సంస్థ హెచ్సీఎల్టెక్ తాజాగా యూఎస్కు చెందిన చిప్ తయారీ దిగ్గజం ఇంటెల్ సహకారంతో డేటా ట్రస్ట్ షీల్డ్ పేరుతో ఎంటర్ప్రైస్ డేటా సెక్యూరిటీ సర్వీసులను ప్రారంభించింది. క్లౌడ్ వ్యవస్థలో సున్నిత సమాచార రక్షణను ఇది మెరుగుపరుస్తుందని కంపెనీ తెలిపింది.ఇంటెల్ ట్రస్ట్ డొమైన్ ఎక్స్టెన్షన్స్ (ఇంటెల్ టీడీఎక్స్), ఇంటెల్ ట్రస్ట్ అథారిటీ వంటి విశ్వసనీయ సాధనాలను ఉపయోగించడం ద్వారా క్లౌడ్ కార్యకలాపాల సమయంలో సున్నిత సమాచారాన్ని భద్రపరచడానికి డేటా ట్రస్ట్ షీల్డ్ రూపొందించినట్టు వివరించింది. ఈ సొల్యూషన్ గూగుల్ క్లౌడ్లో పరీక్షించామని, భవిష్యత్తులో ఇతర భారీ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్లతో అనుసంధానిస్తామని కంపెనీ తెలిపింది.ఇదీ చదవండి: రూ.5 లక్షల కోట్ల ఐటీ కంపెనీ.. వారసురాలికి గ్రీన్సిగ్నల్ఈ సేవలు డేటా భద్రతలో ఒక ప్రధాన ముందడుగు అని, అధిక స్థాయి రక్షణను అందిస్తుందని హెచ్సీఎల్టెక్ ఈవీపీ ఆనంద్ స్వామి వివరించారు. ఇంటెల్ అధునాతన సాంకేతికతను ఉపయోగించడం ద్వారా ఈ సొల్యూషన్ డిజిటల్ ఆస్తులను సురక్షితం చేస్తుందని, క్లౌడ్ వ్యవస్థపై విశ్వాసం పెంచుతుందని అన్నారు. -
రూ.5 లక్షల కోట్ల ఐటీ కంపెనీ.. వారసురాలికి గ్రీన్సిగ్నల్
న్యూఢిల్లీ: ఐటీ సేవల దిగ్గజం హెచ్సీఎల్ గ్రూప్ ప్రమోటర్ రోష్నీ నాడార్ మల్హోత్రాకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఓపెన్ ఆఫర్ అంశంపై వెసులుబాటును కల్పించింది. గ్రూప్ సంస్థలలో అదనపు వాటా కొనుగోలు ప్రతిపాదనల నేపథ్యంలో సెబీ తాజా నిర్ణయాన్ని తీసుకుంది. ఇందుకు రోష్నీ నాడార్ చేసుకున్న అభ్యర్ధనకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఎందుకంటే.. గ్రూప్ కంపెనీలు హెచ్సీఎల్ టెక్నాలజీస్, హెచ్సీఎల్ ఇన్ఫోసిస్టమ్స్లలో రోష్నీ నాడార్ వాటాను పెంచుకునేందుకు ప్రతిపాదించారు. దీంతో టేకోవర్ మార్గదర్శకాల ప్రకారం సాధారణ వాటాదారులకు ఓపెన్ ఆఫర్ ప్రకటించవలసి ఉంటుంది. అయితే ఇందుకు మినహాయింపును కోరుతూ సెప్టెంబర్ 30న విడిగా సెబీకి దరఖాస్తు చేశారు. కుటుంబ వాటాల మార్పిడిలో భాగంగా వాటాల కొనుగోలు ప్రతిపాదనలు చేయడంతో సెబీ మినహాయింపునకు సానుకూలంగా స్పందించింది.రెండు కంపెనీలలోనూ నిలకడైన యాజమాన్యాన్ని కొనసాగించే యోచనతో అదనపు వాటా కొనుగోలుకి తెరతీయనున్నట్లు దరఖాస్తులలో నాడార్ పేర్కొన్నారు. తద్వారా తండ్రి శివ నాడార్ నుంచి బహుమతి రూపేణా రెండు కంపెనీలలోనూ 47 శాతం వాటాను అందుకోనున్నారు. దీంతో హెచ్సీఎల్ టెక్నాలజీస్, హెచ్సీఎల్ ఇన్ఫొసిస్టమ్స్ ప్రమోటర్లు హెచ్సీఎల్ కార్పొరేషన్, వామ సుందరి ఇన్వెస్ట్మెంట్స్(ఢిల్లీ) పీవీటీ లిమిటెడ్ నుంచి వాటాలు లభించనున్నాయి.ప్రస్తుతం రెండు ప్రమోటర్ సంస్థలలోనూ రోష్నీ నాడార్ 10.33 శాతం చొప్పున వాటాను కలిగి ఉన్నారు. వెరసి హెచ్సీఎల్కార్పొరేషన్, వామ సుందరి ఇన్వెస్ట్మెంట్స్లో రోష్నీ నాడార్ వాటా 57.33 శాతానికి చేరనుంది. అయితే ఈ లావాదేవీల తదుపరి హెచ్సీఎల్ టెక్నాలజీస్, హెచ్సీఎల్ ఇన్ఫోసిస్టమ్స్లలో ప్రమోటర్ల వాటాలు యథాతథంగా అంటే 60.82 శాతం, 62.89 శాతం చొప్పున కొనసాగనున్నాయి. -
ఏడాదికి రూ.84.16 కోట్లు.. ఇండియాలో అధిక వేతనం తీసుకునే సీఈఓ
2023-24 ఆర్థిక సంవత్సరానికి హెచ్సీఎల్ టెక్నాలజీస్ సీఈఓ సీ విజయకుమార్ అత్యధిక వేతనం పొందుతున్న సీఈఓగా నిలిచారు. ఈయన మొత్తం జీతం సుమారు 10.06 మిలియన్ డాలర్లు.. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం దాదాపు 84.16 కోట్లు. ఈ విషయాన్ని కంపెనీ నివేదికలో వెల్లడించింది. దీంతో ఈయన ఈ ఏడాది భారతీయ ఐటీ కంపెనీల సీఈఓలలో అత్యధిక వేతనం పొందిన వ్యక్తిగా నిలిచారు.హెచ్సీఎల్ టెక్ యాన్యువల్ రిపోర్ట్ 2023-24 ప్రకారం.. విజయకుమార్ వేతనం గత ఏడాది కంటే 190.75 శాతం పెరిగినట్లు తెలుస్తోంది. ఈయన మొత్తం ప్యాకేజీలో 16.39 కోట్లు (1.96 మిలియన్ డాలర్లు) బేసిక్ శాలరీ కాగా.. పర్ఫామెన్స్ లింక్డ్ బోనస్ 1.14 మిలియన్ డాలర్లు లేదా రూ. 9.53 కోట్లు, లాంగ్ టర్మ్ ఇంటెన్సివ్ రూ. 2.36 మిలియన్ డాలర్లు (రూ. 19.74 కోట్లు). ఇతరత్రా ప్రయోజనాల కింద కూడా భారీ మొత్తంలోనే లభిస్తుంది. విజయకుమార్ వేతనం.. కంపెనీలో పనిచేసే సగటు ఉద్యోగుల జీతం కంటే 707.6 రెట్లు ఎక్కువని తెలుస్తోంది.ఇతర కంపెనీల సీఈఓల వేతనాల విషయానికి వస్తే.. ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ రూ. 66 కోట్లు, విప్రో సీఈఓ శ్రీని పల్లియా రూ. 50 కోట్లు, టీసీఎస్ సీఈఓ కే కృతివాసన్ రూ. 25 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. దీన్ని బట్టి చూస్తే దేశంలోని దిగ్గజ కంపెనీలలో పని చేసే సీఈఓలలో ఎక్కువ వేతనం తీసుకునే వ్యక్తిగా విజయకుమార్ నిలిచారు. -
ఐటీ ఫ్రెషర్లకు పండగే.. క్యూ కట్టనున్న కంపెనీలు!
టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్టెక్, విప్రో వంటి పెద్ద ఐటీ సంస్థలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (FY25) గణనీయమైన సంఖ్యలో ఫ్రెషర్లను నియమించుకునే ప్రణాళికలను ప్రకటించాయి. దీంతో భారత ఐటీ రంగం రిక్రూట్మెంట్ ప్రయత్నాలలో గణనీయమైన పునరుద్ధరణను పొందుతోంది. టాప్ కంపెనీలు మొత్తంగా 80,000 మంది ఫ్రెషర్లను నియమించుకోనున్నాయన్న వార్తలు ఐటీ ఫ్రెషర్లలో ఉత్సాహాన్ని నింపుతున్నాయి.ముందంజలో టీసీఎస్ ఆదాయపరంగా భారతదేశపు అతిపెద్ద ఐటీ సేవల సంస్థ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఈ సంవత్సరం 40,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. జూన్ త్రైమాసికంలోనే 5,452 మంది ఉద్యోగులను చేర్చుకుంది. దాని మొత్తం ఉద్యోగుల సంఖ్య 6,06,998కి చేరుకుంది.ఇన్ఫోసిస్ వ్యూహాత్మక నియామకందేశంలోని రెండవ అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ ఈ ఆర్థిక సంవత్సరంలో 20,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని యోచిస్తోంది. ఈ నియామకం ఆన్-క్యాంపస్, ఆఫ్-క్యాంపస్ రిక్రూట్మెంట్ మిశ్రమంగా ఉంటుంది. వరుసగా ఆరు త్రైమాసికాలుగా హెడ్కౌంట్లో క్షీణతను నివేదించినప్పటికీ, ఇన్ఫోసిస్ సీఎఫ్వో జయేష్ సంఘ్రాజ్కా భవిష్యత్ వృద్ధిపై ఆశావాదాన్ని వ్యక్తం చేశారు.తాజా ప్రతిభపై హెచ్సీఎల్టెక్ దృష్టిఈ ఏడాది మొదటి త్రైమాసికంలో 8,080 మంది ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గినప్పటికీ, ఆర్థక సంవత్సరంలో 10,000 మంది ఫ్రెషర్లను నియమించుకునే ప్రణాళికలను హెచ్సీఎల్టెక్ ప్రకటించింది. అభివృద్ధి చెందుతున్న టెక్ ల్యాండ్స్కేప్లో పోటీగా నిలవడానికి ఉత్పాదక ఏఐలో ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడంతో సహా అప్స్కిల్లింగ్ కార్యక్రమాలపై దృష్టి సారించడం ద్వారా తాజా ప్రతిభపై పెట్టుబడి పెట్టడం కొనసాగిస్తోంది.విప్రో క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్విప్రో ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు 10,000 నుంచి 12,000 మంది ఫ్రెషర్లను ఆన్బోర్డ్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఇది ఒక సంవత్సరం విరామం తర్వాత క్యాంపస్ రిక్రూట్మెంట్కు తిరిగి రావడాన్ని సూచిస్తోంది. -
'నో ఆఫీస్.. నో లీవ్స్'.. టెక్ దిగ్గజం కొత్త మంత్రం!
కరోనా వ్యాప్తి తీవ్రతరమైంది సమయంలో చాలా సంస్థలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయం కల్పించాయి. అయితే కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టిన తరువాత కూడా కొంతమంది ఉద్యోగులు ఆఫీసులకు రావడానికి ససేమిరా అంటున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని హెచ్సీఎల్టెక్ కొత్త పాలసీని అందుబాటులో తీసుకురానుంది.ఆఫీసులకు వచ్చినవారికి మాత్రమే లీవ్స్ అందింస్తామని, ఆఫీసులకు రాకుండా లీవ్ తీసుకుంటే శాలరీలో కోతలు ఉంటాయని హెచ్సీఎల్టెక్ వెల్లడించింది. మహమ్మారి తర్వాత ఉద్యోగులను తిరిగి క్యాంపస్కు తీసుకురావడానికి కంపెనీ చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఉద్యోగులు వారానికి మూడు రోజులు, నెలలో కనీసం 12 రోజులు ఆఫీసులో ఉండాలి. హైబ్రిడ్ వర్క్ మోడల్కి మారిన ఐదు నెలల తర్వాత హెచ్సీఎల్టెక్ ఉద్యోగులను వారానికి మూడు రోజులు ఆఫీసుకు తిరిగి రావాలని కోరింది. ఈ విషయాన్ని ఇప్పటికే ఉద్యోగులకు ఈ మెయిల్స్ ద్వారా వెల్లడించాయి. -
భారీగా తగ్గిన హెచ్సీఎల్ ఉద్యోగుల సంఖ్య
జూన్ 30, 2024తో ముగిసిన మొదటి త్రైమాసికంలో భారతదేశంలోని మూడో అతిపెద్ద ఐటీ కంపెనీ హెచ్సీఎల్ టెక్నాలజీ ఉద్యోగుల సంఖ్య 8,080 మంది తగ్గినట్లు సమాచారం. కంపెనీ క్యూ 1 ఫలితాల సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించింది. దీంతో ఉద్యోగుల సంఖ్య క్యూ1లో 2,19,401కి చేరింది.టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను పెంచుకుంటూ పోతుంటే.. హెచ్సీఎల్ మాత్రం ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటూ పోతోంది. గతంలో హెచ్సీఎల్ కంపెనీ ఉద్యోగుల సంఖ్య ఇతర ప్రత్యర్థి కంపెనీల కంటే కొంత ఎక్కువగానే ఉండేదని గణాంకాలు చెబుతున్నాయి.గురువారం టీసీఎస్ ఫలితాలను వెల్లడించిన సమయంలో.. ఉద్యోగుల సంఖ్యను కూడా ప్రకటించింది. మొదటి త్రైమాసికంలో కంపెనీ ఉద్యోగుల సంఖ్య 5452 పెరిగింది. దేంతో టీసీఎస్ హెడ్కౌంట్ 6,06,998కి చేరింది. ఫ్రెషర్స్ నియమాల విషయానికి వస్తే.. గత త్రైమాసికంలో హెచ్సీఎల్ కొత్త నియమాలకు కేవలం 1078 మాత్రమే. అంతకుముందు ఏడాది ఈ సంఖ్య 3096గా ఉండేది. దీన్ని బట్టి చూస్తే కొత్త ఉద్యోగుల నియమాలను కూడా అంతంతమాత్రమే అని తెలుస్తోంది.జూలై 11న జరిగిన క్యూ1 ఎర్నింగ్స్ కాన్ఫరెన్స్లో హెచ్సీఎల్ టెక్నాలజీ.. చీఫ్ పీపుల్ ఆఫీసర్ రామచంద్రన్ సుందరరాజన్ మాట్లాడుతూ.. ఈ త్రైమాసికంలో స్టేట్ స్ట్రీట్తో జరిగిన డివెస్టిచర్ను పరిగణనలోకి తీసుకుని హెడ్కౌంట్ను పరిశీలించాలి. సంస్థ ఎదుర్కొన్న కొన్ని అనిశ్చితుల వల్ల ఉద్యోగులను తొలగించాల్సి వచ్చింది. రాబోయే రోజుల్లో పెట్టుబడులు, నియమాల మీద ద్రుష్టి సారిస్తామని ఆయన అన్నారు. -
టెక్నోట్రీతో హెచ్సీఎల్ టెక్ జత
న్యూఢిల్లీ: ఐటీ సర్వీసుల దిగ్గజం హెచ్సీఎల్ టెక్నాలజీస్ తాజాగా ఫిన్లాండ్ సంస్థ టెక్నోట్రీ సాఫ్ట్వేర్తో చేతులు కలిపింది. తద్వారా గ్లోబల్ టెలికం కంపెనీ(టెల్కో)ల కోసం 5జీ ఆధారిత జనరేటివ్ ఏఐ సొల్యూషన్లను అభివృద్ధి చేయనుంది.టెలికం రంగ దిగ్గజాలకు సేవలందించే టెక్నోట్రీ సహకారంతో క్లయింట్ల అవసరాలకు అనుగుణమైన తదుపరితరం సొల్యూషన్లకు తెరతీయనున్నట్లు తెలియజేసింది. ప్రధానంగా టెల్కోలు, కమ్యూనికేషన్ సర్వీసులందించే సంస్థ(సీఎస్పీ)లకు కొత్త అవకాశాలకు వీలు కల్పించడం, ఆవిష్కరణలకు ఊతమివ్వడం, సస్టెయినబుల్ గ్రోత్కు దన్నునివ్వడం వంటి సేవలను అందించనున్నాయి.తాజా భాగస్వామ్యం ఏఐ ఆధారిత డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్లో హెచ్సీఎల్ టెక్కున్న పట్టు, టెక్నోట్రీకు గల 5జీ ఏఐ ఆధారిత బీఎస్ఎస్ ప్లాట్ఫామ్ సామర్థ్యాలు కలగలసి క్లయింట్లకు పటిష్ట సేవలందించనున్నట్లు హెచ్సీఎల్ టెక్ పేర్కొంది. -
ఐటీ పరిశ్రమకు భారీ షాక్.. ‘70 శాతం ఉద్యోగాలు పోనున్నాయ్’
కృత్రిమ మేధ (ఏఐ) మనిషి జీవితంలో ఎన్నో మార్పులు, సౌకర్యాలు తీసుకొస్తోంది. ఆన్లైన్లో వస్తుసేవల క్రయవిక్రయాలకు తోడ్పడుతోంది. ఓటీటీలో ఏయే సినిమాలు, సిరీస్ చూడవచ్చో సలహాలిస్తోంది. సిరి, అలెక్సాల ద్వారా మాట్లాడుతోంది. వ్యాపారాలు సులభంగా వేగంగా సాగేందుకు ఉపకరిస్తోంది. అదే సమయంలో ఉద్యోగాలకు ఏఐ ఎసరుపెడుతుందని, మనిషి అవసరాన్ని తగ్గించేస్తుందన్న బెరుకు వ్యక్తమవుతోంది. ఏఐ ప్రపంచంలో గొప్ప అవకాశాలతోపాటు అనిశ్చితులూ మన కోసం ఎదురుచూస్తున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రాకతో ముఖ్యంగా ఐటీ పరిశ్రమలో కొలువుల కోతపై ఆందోళన నెలకొంది. మనుషులు చేసే ఉద్యోగాలను ఏఐ రీప్లేస్ చేస్తుందనే భయాలు టెకీల్లో గుబులు రేపుతున్నాయి. ఏఐ టూల్స్తో ఐటీ పరిశ్రమలో సిబ్బంది అవసరాలను 70 శాతం తగ్గించవచ్చని హెచ్సీఎల్ మాజీ సీఈవో వినీత్నాయర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ వార్తా సంస్థతో మాట్లాడుతూ ఏఐ ప్రభావం ఎలా ఉండబోతుందో చర్చించారు. ఈ సందర్భంగా ఆటోమేషన్తో మాస్ లేఆఫ్స్ తప్పదని ఆయన హెచ్చరించారు. ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ను నియమించుకునే బదులు ప్రస్తుత ఉద్యోగుల నైపుణ్యాలను మెరుగుపరచాలని సూచించారు. చాట్జీపీటీ, జెమిని, కోపైలట్ వంటి ఏఐ టూల్స్ రాకతో లేటెస్ట్ టెక్నాలజీ టూల్స్తో సంప్రదాయ ఉద్యోగాలు కనుమరుగవుతాయనే ఆందోళనల మధ్య హెచ్సీఎల్ మాజీ సీఈవో వినీత్ నాయర్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరిచుకున్నాయి. ఏఐ టూల్స్ కారణంగా కంపెనీల హైరింగ్ అవసరాలు 70 శాతం తగ్గుతాయని ఆయన స్పష్టం చేశారు. ఇదీ చదవండి: 2జీ, 3జీ, 4జీ, 5జీ.. తరాల్లో మతులబు ఐటీ ఉద్యోగులు చేపట్టే కోడింగ్, టెస్టింగ్, మెయింటెనెన్స్, ట్రబుల్ టికెట్స్ రెస్పాండింగ్ స్కిల్స్ను ఏఐ చేపడుతుందని చెప్పారు. ఆపై ఈ నైపుణ్యాలన్నీ వాడుకలో లేనివిగా మారతాయని, ఫలితంగా పెద్దసంఖ్యలో లేఆఫ్స్ చూస్తామని నాయర్ హెచ్చరించారు. అయితే ఏఐకి సూచనలు ఇవ్వాలంటే ఉద్యోగులు అవసరం. కాబట్టి ఆ దిశగా వారికి నైపుణ్యాలు నేర్పాలని తెలిపారు. భారత ఐటీ కంపెనీలకు ఏఐ అపార అవకాశాలు కల్పిస్తుందని వివరించారు. -
టీసీఎస్ బాటలో హెచ్సీఎల్ - అయోమయంలో ఐటీ ఉద్యోగులు..
కరోనా మహమ్మారి పూర్తిగా తగ్గుముఖం పట్టిన తరువాత కూడా చాలామందికి ఇంటి నుంచే ఉద్యోగం చేయడానికి సుముఖత చూపుతూ.. ఆఫీసులకు రావడానికి కొంత వెనుకడుగు వేస్తున్నారు. ఈ తరుణంలో టెక్ కంపెనీలన్నీ తమ ఉద్యోగులను ఆఫీసులకు రప్పించే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. ఇప్పటికే టీసీఎస్ కంపెనీ తమ ఉద్యోగులకు ఫైనల్ వార్ణింగ్ ఇచ్చేసింది. ఈ బాటలో ఇప్పుడు హెచ్సీఎల్ అడుగులు వేస్తోంది. హెచ్సీఎల్ టెక్ కంపెనీ ఇప్పుడు తమ ఉద్యోగులను తప్పకుండా వారానికి మూడు రోజులు ఆఫీసులకు రావాలని ఆదేశించింది. హెచ్సీఎల్ ఉద్యోగి ఎవరైనా వారానికి మూడు రోజులు ఆఫీసుకు రాకుంటే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించింది. కొత్త నిబంధనలు 2024 ఫిబ్రవరి 19 నుంచి అమలులోకి వస్తాయని కంపెనీ స్పష్టంగా చేసింది. దీంతో ఉద్యోగులు 19వ తేదీ నుంచి తప్పకుండా వారానికి మూడు రోజులు ఆఫీసుకు వెళ్లాల్సిందే. ఇప్పటికే ఇన్ఫోసిస్, విప్రో వంటి కంపెనీలు తమ ఉద్యోగులను ఆఫీసుల నుంచి పనిచేయాలని ఆదేశించాయి. అన్ని విభాగాల్లోని ఉద్యోగులు హోదాతో సంబంధం లేకుండా ఆఫీసుకు రావాలని హెచ్సీఎల్ టెక్ పీపుల్స్ ఫంక్షన్స్ గ్లోబల్ హెడ్ వికాస్ శర్మ ఆదేశిస్తూ.. ఈ నెల 14న మెయిల్స్ పంపినట్లు సమాచారం. ఉద్యోగులు వారానికి మూడు రోజులు ఆఫీసుకు రాకుంటే జీతం లేకుండా సెలవు తీసుకున్నట్లు (లాస్ ఆఫ్ పే) ప్రకటించే అవకాశం ఉన్నట్లు మేనేజ్మెంట్ హెచ్చరిస్తున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: ఈ స్కిల్ మీలో ఉంటే చాలు.. ఉద్యోగం రెడీ! ఆఫీసులకు రావడమే కాకుండా ఉత్పాదక కూడా పెంచాలని యాజమాన్యం ఆదేశిస్తున్నట్లు సమాచారం. అంటే ఉద్యోగులు రోజుకు సగటున కనీసం 8 గంటలు పనిచేయాలని చెబుతున్నారు. 8 గంటలపాటు ల్యాప్టాప్ యాక్టివిటీ నమోదు కాని సందర్భంలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. -
టెక్ దిగ్గజాల్లో అలజడి.. నాలుగు కంపెనీలలో 50000 మంది
కరోనా మహమ్మారి వ్యాపించినప్పటి నుంచి కూడా ఐటీ కంపెనీలు ప్రతి కూల పరిస్థితులను ఎదుర్కొంటూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే 2023లో వేలమంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. 2024లో కూడా అదే పరిస్థితి నెలకొనే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఇటీవల వెల్లడైన టెక్ కంపెనీల ఫలితాలు కూడా ఆశించిన స్థాయిలో ముందుకు సాగలేదు.. ఉద్యోగుల సంఖ్య కూడా మరింత తగ్గే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇటీవల వెల్లడైన 2023-24 మూడో త్రైమాసికానికి సంబంధించిన ఫలితాలలో టీసీఎస్, హెచ్సీఎల్ సంస్థలు స్వల్ప లాభాలను పొందగా.. విప్రో, ఇన్ఫోసిస్ కంపెనీలు మాత్రం నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ ప్రభావం ఉద్యోగుల మీద కూడా పడే అవకాశం ఉంది. ఈ ఏడాది ప్రారంభంలోనే గూగుల్, అమెజాన్ వంటి కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించడం మొదలెట్టేశాయి. 2023-24 మూడవ త్రైమాసికం నాటికి భారతదేశంలోని టాప్ 4 కంపెనీలలో ఉద్యోగుల సంఖ్య 50,875 తగ్గినట్లు సమాచారం. ఇందులో 10,669 మంది టీసీఎస్, 24182 మంది ఇన్ఫోసిస్, 18510 మంది విప్రో, 2486 మంది హెచ్సీఎల్ టెక్నాలజీస్ ఉద్యోగులు ఉన్నారు. ఇదీ చదవండి: కోట్లు సంపాదించేలా చేసిన ఒక్క ఆలోచన - ఎవరీ నీరజ్ కక్కర్! ఇప్పటి వరకు చాలా ఐటీ కంపెనీలు కొత్త నియామకాలను చేపట్టలేదు. రాబోయే రోజుల్లో క్యాంపస్ ప్లేస్మెంట్లను ప్రారంభించే దిశగా టీసీఎస్ యోచిస్తోంది. ఇన్ఫోసిస్ మాత్రం ఇప్పట్లో ఇంటర్వ్యూలు నిర్వహించే ఆలోచనలో లేనట్లు తెలుస్తోంది. హెచ్సీఎల్ కంపెనీ మాత్రం ఫ్రెషర్లను తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. -
మొన్న విప్రో.. నేడు హెచ్సీఎల్ - ఎందుకిలా?
భారతదేశంలోని అతిపెద్ద ఐటీ కంపెనీలలో ఒకటైన 'హెచ్సీఎల్ టెక్నాలజీ' (HCL Technology) బెంగళూరులోని తన కార్యాలయం ఆస్తులను విక్రయించడానికి సిద్దమైనట్లు సమాచారం. కంపెనీ ఈ కఠిన నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి? అనే వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. హెచ్సీఎల్ కంపెనీ, బెంగళూరు జిగానీ పారిశ్రామిక ప్రాంతంలోని సుమారు 27 ఎకరాల స్పెషల్ ఎకనామిక్ జోన్ క్యాంపస్ విక్రయించాలని చూస్తోంది. ఈ ప్రాపర్టీ విలువ సుమారు రూ. 550 కోట్లు వరకు ఉంటుందని అంచనా. అనవసర ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగానే హెచ్సీఎల్ తన ఆస్తులను విక్రయించాలనుకుంటున్నట్లు కొందరు చెబుతున్నారు. నాన్ కోర్ రియల్ ఎస్టేట్ అసెట్స్ మానిటైజే చేసేందుకు, కార్యకలాపాల్ని క్రమబద్ధీకరించేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: వేగానికి చెక్ పెట్టే గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్ - ఎలా పనిచేస్తుందంటే? హెచ్సీఎల్ టెక్నాలజీస్ చైర్పర్సన్ రోషిణీ నాడార్, కంపెనీని వేగంగా అభివృద్ధి చేయడానికి కావలసిన ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే కొత్త రంగాల్లో అడుగుపెట్టడానికి కూడా యోచిస్తున్నట్లు సమాచారం. కర్ణాటకలో సెమీకండక్టర్ చిప్ తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ఏకంగా 400 మిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులు పెట్టనున్నట్లు సమాచారం. -
భారీ ప్రాజెక్ట్ను దక్కించుకున్న హెచ్సీఎల్ టెక్
ప్రముఖ టెక్నాలజీ సంస్థ హెచ్సీఎల్ టెక్నాలజీస్ (HCL Tech) భారీ ప్రాజెక్ట్ను దక్కించుకుంది. లాటిన్ అమెరికా అతిపెద్ద ఆర్థిక సంస్థలలో ఒకటైన బ్యాంకో డో బ్రెజిల్ (Banco do Brasil) సేల్స్ఫోర్స్ ద్వారా డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, కస్టమర్ రిలేషన్ మేనేజ్మెంట్లను మెరుగుపరిచేందుకు హెసీఎల్ టెక్నాలజీస్ను ఎంచుకున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. సేల్స్ఫోర్స్తో భాగస్వామ్యం ద్వారా హెచ్సీఎల్ టెక్.. బ్యాంకో డో బ్రెజిల్ కస్టమర్ రిలేషన్స్, సర్వీస్ సొల్యూషన్లను మెరుగుపరచనుంది. తమ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వనరులు, డేటా ఇంటిగ్రేషన్, ఇంటెలిజెంట్ గైడ్లైన్స్ను ఉపయోగించి కస్టమర్ సంతృప్తి, ఎంగేజ్మెంట్ను పెంచడంలో సహాయపడుతుంది. లాటిన్ అమెరికా అతిపెద్ద ఆర్థిక సంస్థ లాటిన్ అమెరికా అతిపెద్ద ఆర్థిక సంస్థలలో ఒకటైన బ్యాంకో డో బ్రెజిల్ దాని డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, సేల్స్ఫోర్స్ అమలుకు హెచ్సీఎల్ టెక్ను పోటీ బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా ఎంచుకుంది. (టీసీఎస్లో మరో కొత్త సమస్య! ఆఫీస్కి రావాల్సిందే అన్నారు.. తీరా వెళ్తే..) బ్యాంకో డో బ్రెజిల్ అవసరాలకు అనుగుణంగా సేల్స్ఫోర్స్ సొల్యూషన్స్ను అమలు చేయడానికి హెసీఎల్ టెక్ కస్టమర్ రిలేషన్ మేనేజ్మెంట్ అనుభవం ఉన్న ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయనుంది. అలాగే సంపూర్ణ కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడానికి నాలుగు సేల్స్ఫోర్స్ పరిష్కారాలను ఉపయోగించనుంది. అయితే ఈ భారీ ఒప్పందం విలువ ఎంత అనేది వెల్లడించలేదు. ఇదీ చదవండి: 70 hours work: ఆయనైతే 90 గంటలు పనిచేసేవారు.. భర్తకు అండగా సుధామూర్తి -
ఐటీ ఉద్యోగాల సంక్షోభం: టెకీలకు నిపుణుల సంచలన హెచ్చరికలు
భారతీయ దిగ్గజ ఐటి కంపెనీలు టీసీఎస్) ఇన్ఫోసిస్, హెచ్సిఎల్టెక్ ఈ వారం తమ క్యూ2 ఎఫ్వై24 ఫలితాలను ప్రకటించాయి. లాభాలు, ఆదాయాలు కాస్త మెరుగ్గా ఉన్నప్పటికీ ఈ కంపెనీలన్నింటిలో ప్రధాన ట్రెండ్లో హెడ్కౌంట్ సంఖ్య గణనీయంగా తగ్గడంచర్చకు దారి తీసింది. దీనికి తోడు దాదాపు కొత్త హైరింగ్పై ఆశాజనక అంచనాలను ప్రకటించలేదు. ఇదే ఐటీ ఉద్యోగార్థులను కలవరానికి గురిచేస్తోంది. ప్రస్తుత పరిస్థితిపై నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇంజనీరింగ్ చదువుతున్న వారి ఉద్యోగాలపై అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నారు. వీరంతా లేటెస్ట్ టెక్నాలజీ కోర్సులను నేర్చుకోవడంతోపాటు, కొత్త ఉద్యోగాలు వెతుక్కోవడం మంచిదని సూచిస్తున్నారు. ఒకవైపు ఏఐ విధ్వంసంపై ఆందోళన కొనసాగుతోంది. మరోవైపు జాబ్ మార్కెట్లో అనిశ్చితి వేలాదిమంది లేఆఫ్స్ ఆందోళనలో పడేస్తోంది. ముఖ్యంగా సంక్లిష్ట సమయాల్లో ముందుగా కాంట్రాక్టు ఉద్యోగులపై వేటు పడుతుందని, అత్యధిక రిస్క్ గ్రూపులో వారే ఉంటారని ఇండస్ట్రీ నిపుణుల మాట. (IOC Session తిలకం దిద్ది మరీ స్వాగతం..సర్వం సిద్ధం: నీతా అంబానీ) టీసీఎస్ టీసీఎస్లో త్రైమాసిక ప్రాతిపదికన 6,333 మంది ఉద్యోగుల సంఖ్య నికరంగా క్షీణించింది. జూన్ త్రైమాసికంలో 615,318 గా ఉన్న ఉద్యోగుల సంఖ్య,సెప్టెంబర్ 30 నాటికి 608,985 వద్దకు చేరడం గమనార్హం. వార్షిక ప్రాతిపదికన చూస్తే గత ఏడాది 616,171 ఉద్యోగు 7,186 మంది తగ్గిపోయారు. తమ నియామక లక్ష్యాలను రీకాలిబ్రేషన్ చేయడం దీనికి కారణమని కంపెనీ చీఫ్ హెచ్ఆర్ మిలింద్ లక్కడ్ తెలిపారు. తెలివైన ఫ్రెషర్లను ముందస్తుగా నియమించుకోవడం, సరైన నైపుణ్యాలతో వారికి శిక్షణ ఇవ్వడంలో పెట్టుబడి పెట్టడం అనే తమ వ్యూహం ఫలిస్తోంది. ఆ టాలెంట్ స్ట్రీమ్లోకి రావడంతోపాటు తగ్గిన అట్రిషన్ను తగ్గించి, స్థూల జోడింపులను రీకాలిబ్రేట్ చేయగలిగా మని ఆయన పేర్కొన్నారు. ఉత్పాదకతను పెంచడం, ప్రాజెక్ట్ ఫలితాలను పెంచడమే లక్ష్యమని లక్కాడ్ వివరించారు. ఇన్ఫోసిస్ ఇన్ఫోసిస్ తన హెడ్కౌంట్లో వరుసగా 7,530 మంది ఉద్యోగులు తగ్గిపోయారు. ఇన్ఫోసిస్ త్రైమాసిక ఫలితాల ప్రకారం క్రితం త్రైమాసికంలో కంపెనీలో 3,36,294 మందితో పోలిస్తే సెప్టెంబర్ 2023 నాటికి 3,28,764 మంది ఉన్నారు. గత ఏడాది త్రైమాసికంతో పోల్చినా కూడా ఉద్యోగుల సంఖ్య తగ్గింది. క్యాంపస్లలో మాస్ రిక్రూటింగ్ డ్రైవ్లను నిర్వహించబోని కూడా సీఎఫ్వో నిలంజన్ రాయ్ ఫలితాల విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. కంపెనీ గణనీయ మైన బెంచ్ పరిమాణాన్ని కలిగి ఉందన్నారు. గత ఏడాది 50వేల మంది ఫ్రెషర్లను నియమించుకున్నాం, డిమాండ్ కంటే ముందుగానే నియమించుకున్నాం, ముఖ్యమైన ఫ్రెషర్ బెంచ్ ఇంకా ఉందని ఆయన చెప్పారు. (Infosys: షాకింగ్ న్యూస్ చెప్పిన ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్!) హెచ్సీఎల్టెక్ కొత్త నియమాలను ప్రకటించినప్పటికీ హెచ్సిఎల్టెక్ నికర హెడ్కౌంట్ మాత్రం క్షీణించింది. క్యూ1లో కంపెనీ హెడ్కౌంట్ 2,506 తగ్గా, Q2 FY 24లో 2,299 తగ్గింది. మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,21,139గా ఉంది. ఈ క్షీణత ఇది వరుసగా రెండో త్రైమాసికం. బెంచ్ లేదా శిక్షణలో ఉన్న ఫ్రెషర్లు ప్రాజెక్ట్లలో పెట్టడానికి సిద్ధంగా ఉన్నందున కంపెనీలో హెడ్కౌంట్ తగ్గిందని సీఎండీ విజయకుమార్ వివరించారు.గత 18 నెలల్లో నియమించుకున్న చాలా మంది ఫ్రెషర్లు సిద్ధంగా ఉన్నారు. అందుకే అట్రిషన్ను బ్యాక్ఫిల్ చేయలేదు. ఈ కారణంగానే సీక్వెన్షియల్ ప్రాతిపదికన 1 శాతం తగ్గిందని చెప్పారు. సెక్టార్ వ్యూ మూడు ప్రధాన ఐటీ కంపెనీలు తమ ఫలితాలను విడుదల చేశాయి.ఫైనాన్షియల్తో పాటు, నియామకాల విషయానికి వస్తే Q2 త్రైమాసికంలో స్వల్పంగా తగ్గాయి.సంవత్సరం క్రితం త్రైమాసికంలో టీసీఎస్ 9,840 మందిని నియమించుకుంది; ఇన్ఫోసిస్ 10,032 మందిని నియమించుకుంది. HCLTech 8,382 మందిని నియమించుకుంది. ఈ మూడు కంపెనీల సంయుక్త హెడ్కౌంట్ వృద్ధి 28,254గా ఉంది. అదే సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో, మొత్తం మూడు కంపెనీల నికర ఉద్యోగుల చేరిక 16,162 వద్ద ప్రతికూలంగా ఉంది. -
ఫ్రెషర్స్కు గుడ్న్యూస్: 10,000 ఉద్యోగాలు ప్రకటించిన ఐటీ సంస్థ
న్యూఢిల్లీ: ఐటీ సేవల దిగ్గజం హెచ్సీఎల్ టెక్నాలజీస్ ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జూలై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 10 శాతం పుంజుకుని రూ. 3,833 కోట్లను తాకింది. గతేడాది (2022–23) ఇదే కాలంలో రూ. 3,487 కోట్ల నికర లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 8 శాతం వృద్ధితో రూ. 26,672 కోట్లకు చేరింది. గత క్యూ2లో రూ. 24,686 కోట్ల టర్నోవర్ నమోదైంది. వాటాదారులకు షేరుకి రూ. 12 చొప్పున మధ్యంతర డివిడెండును ప్రకటించింది. కొత్త కాంట్రాక్టులు 67 శాతం జంప్చేసి కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా 4 బిలియన్ డాలర్లను తాకినట్లు వెల్లడించారు. ఇతర విశేషాలు... ఈ ఏడాది తొలి ఆరు నెలల పనితీరు నేపథ్యంలో పూర్తి ఏడాదికి ఆదాయ అంచనాలను 5–6 శాతానికి తగ్గించింది. తొలుత 6–8 శాతం వృద్ధి అంచనాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ చివరికి సిబ్బంది సంఖ్య 1% తగ్గి 2,21,139కు చేరింది. ఈ ఏడాది 10,000 మంది ఫ్రెషర్స్కు ఉద్యోగాలివ్వనున్నట్లు కంపెనీ సీపీవో రామచంద్రన్ సుందరరాజన్ వెల్లడించారు. గతేడాది 27,000 మంది ఫ్రెషర్స్కు ఉపాధి కల్పించినట్లు ప్రస్తావించారు. సాక్షి టీవీ వాట్సాప్ ఛానెల్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి -
అత్యధిక వేతనాలు అందుకుంటున్న టాప్ టెక్ కంపెనీ సీఈవోలు వీరే.. (ఫొటోలు)
-
టాప్ ఐటీ కంపెనీ సీఈవో జీతం ఢమాల్! ఏకంగా 80 శాతం..
HCL Tech CEO Vijayakumar Pay Drops: దేశంలోనే మూడో అతి పెద్ద ఐటీ కంపెనీ హెచ్సీఎల్ టెక్నాలజీస్ లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ సి.విజయకుమార్ వేతనం 2023 ఆర్థిక సంవత్సరంలో భారీగా పడిపోయింది. కంపెనీ వార్షిక నివేదిక ప్రకారం.. సీఈవో విజయకుమార్ 2023 ఆర్థిక సంవత్సరంలో 3.46 మిలియన్ డాలర్లు (రూ. 28.4 కోట్లు) అతి తక్కువ వేతనాన్ని పొందారు. ఇందులో మూల వేతనం 2 మిలియన్ డాలర్లు, పర్ఫామెన్స్ బోనస్ 1.43 మిలియన్ డాలర్లు, ఇతర ప్రయోజనాలు, అలవెన్సులు 0.03 మిలియన్ డాలర్లు ఉన్నాయి. ఇది 2022 ఆర్థిక సంవత్సరంలో ఆయన అందుకున్న 16.5 మిలియన్ డాలర్లు (రూ. 130 కోట్లు) కంటే దాదాపు 80 శాతం తక్కువ గమనార్హం. కారణం ఇదే.. హెచ్సీఎల్ కంపెనీ సీఈవో విజయ్కుమార్ వేతనం ఈ ఏడాది భారీగా తగ్గిపోవడానికి కారణం దీర్ఘకాలిక ప్రోత్సాహకాలు లేదా ఎల్టీఐ లేకపోవడం అని తెలుస్తోంది. కంపెనీ వార్షిక నివేదిక ప్రకారం ఈ దీర్ఘకాలిక ప్రోత్సాహకాలను ఎల్టీఐని ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మైలురాళ్లు లేదా బోర్డు నిర్దేశించిన లక్ష్యాల సాధన ఆధారంగా చెల్లిస్తారు. 2022 ఆర్థిక సంవత్సరంలో విజయకుమార్ ఎల్టీఐ రూపంలో 12.50 మిలియన్ డాలర్లు సంపాదించారు. ఇదీ చదవండి: ఆ బ్యాంకు ఉద్యోగులు ఇక ఇంటికే..! అయితే 2023 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఎల్టీఐని ఆయన 2024లో అందుకోనున్నారు. అయినప్పటికీ సీఈవో విజయకుమార్ 2023లో అందుకున్న జీతం అదే కంపెనీలో మొత్తం ఉద్యోగుల సగటు వేతనం కంటే 253.35 రెట్లు ఎక్కువ. గత మార్చి 31 నాటికి హెచ్సీఎల్ కంపెనీకి చెందిన 60 దేశాల్లోని 210 డెలివరీ కేంద్రాలలో మొత్తం 2,25,944 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇతర కంపెనీల సీఈవోల జీతాలు.. గత ఏడాది వరకు భారతదేశ ఐటీ రంగంలో అత్యధిక వేతనం పొందుతున్న సీఈఓగా ఉన్న విజయకుమార్.. ఈ ఏడాది ఇతర కంపెనీల సీఈవోలతో పోల్చితే చాలా తక్కువ వేతనం పొందారు. 2023 ఆర్థిక సంవత్సరంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ మాజీ సీఈవో రాజేష్ గోపీనాథన్ రూ.29.16 కోట్లు, టెక్ మహీంద్రా అవుట్గోయింగ్ సీఈవో సీపీ గుర్నానీ రూ.30.14 కోట్లు, ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ 56.44 కోట్లు, విప్రో సీఈవో థియరీ డెలాపోర్టే రూ.82 కోట్లు వేతనాలు అందుకున్నట్లు ఆయా కంపెనీల వార్షిక నివేదిక ద్వారా తెలుస్తోంది. -
ఢిల్లీలో అత్యంత సంపన్న మహిళ ఎవరో తెలుసా? నిర్మాత కూడా!
Richest woman Roshni Nadar Malhotra: దేశంలో ప్రధాన నగరాలతో పోలిస్తే దేశ రాజధాని నగరం అంత్యంత ధనవంతులైన భారతీయ మహిళలకు నిలయంగా మారింది. ముంబైతో సహా మరే ఇతర నగరాలకంటే ఢిల్లీలోనే రిచెస్ట్ విమెన్ (ముగ్గురు) ఎక్కువ ఉండటం విశేషం. 2022 కోటక్ ప్రైవేట్ బ్యాంకింగ్ హురున్ ప్రముఖ సంపన్న మహిళల జాబితా ప్రకారం, ఢిల్లీలో అత్యంత సంపన్న భారతీయ మహిళగా టాప్ ర్యాంక్ సాధించారు. హెచ్సిఎల్ టెక్నాలజీస్ చైర్పర్సన్, రోష్నీ నాడార్ మల్హోత్రా దేశవ్యాప్తంగా అత్యంత ధనవంతురాలిగా నిలిచారు. ఆమె నికర విలువ 2022 నాటికి రూ. 84,330 కోట్లు.(ఇషా అంబానీ అంటే అంతే: అన్కట్డైమండ్ నెక్లెస్ ఖరీదు తెలుసా?) భారతదేశంలోని అత్యంత ధనవంతులలో ఒకరైన వ్యాపార దిగ్గజం, హెచ్సీఎల్ ఫౌండర్ శివ్ నాడార్ ఏకైక కుమార్తె రోష్నీ. దాదాపు రూ. 3,00,000 కోట్ల మార్కెట్ క్యాప్తో ఐటీ రంగంలో మూడవ అతిపెద్ద కంపెనీ హెచ్సిఎల్ టెక్నాలజీస్కు మల్హోత్రా నాయకత్వం వహిస్తున్నారు. కంపెనీ అన్ని వ్యూహాత్మక నిర్ణయాలకు ఆమెదే బాధ్యత. ఆమె నాయకత్వంలోనే హెచ్సిఎల్ కంపెనీ రూ13,740 కోట్ల విలువైన ఏడు ఐబీఎం ఉత్పత్తుల కొనుగోలు చేసింది. ఇది కంపెనీ చరిత్రలో అతిపెద్దది. ఆమె సంపద సంవత్సరానికి 54శాతం పెరిగింది. (పెరిగిన బంగారం ధరలు, వెండి కూడా పైపైకే) ఢిల్లీలో పుట్టిన పెరిగిన రోష్నీ వసంత్ వ్యాలీ స్కూల్లో చదువుకున్నారు. నార్త్వెస్ట్రన్ విశ్వవిద్యాలయం నుండి రేడియో/టీవీ/ఫిల్మ్పై దృష్టి సారించి కమ్యూనికేషన్లో గ్రాడ్యుయేషన్ చేశారు. 1976లో ఆమె తండ్రి శివ్ నాడార్చే స్థాపించిన్ హెచ్సీసఘెల్ ఎదగడంలో ప్రధాన పాత్ర పోషించారు. మల్హోత్రా జూలై 2020లో తన తండ్రి వారసత్వంగా హెచ్సిఎల్ చైర్పర్సన్ పాత్రను తీసుకున్నారు. 2017-2018, 2019 సంవత్సరాల్లో ఫోర్బ్స్ జాబితాలో ప్రపంచంలోని 100 మంది అత్యంత శక్తివంతమైన మహిళగా చోటు సంపాదించుకున్నారు. కాగా కేవలం వ్యాపారవేత్తగానేకాదు రోష్ని నాడార్ శివ నాడార్ ఫౌండేషన్ ట్రస్టీ కూడా. భారతదేశంలోని కొన్ని ఉన్నత కళాశాలలు, పాఠశాలలను స్థాపించారు. అంతేకాదు మల్హోత్రా వన్యప్రాణుల సంరక్షకురాలు. 2018లో బాలల చిత్రం 'హల్కా' ను నిర్మించారు. 2019లో "ఆన్ ది బ్రింక్" అనే టీవీ సిరీస్ని రూపొందించారు. దేశంలోని అత్యంత ప్రమాదకరమైన జాతుల దుస్థితిపై తీసిన సిరీస్ 2022లో ఉత్తమ భారతీయ జాతీయ చలనచిత్ర అవార్డును కూడా గెలుచుకుంది.రోష్నీ భర్త శిఖర్ మల్హోత్రా హెచ్సీఎల్ కంపెనీలు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు.ఈ దంపతులకు ఇద్దరు మగ పిల్లలు. -
హెచ్సీఎల్ చేతికి జర్మన్ కంపెనీ: 279 మిలియన్ డాలర్ల డీల్
ముంబై: దేశీయ మూడో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ హెచ్సీఎల్ టెక్ జర్మన్ ఆటోమోటివ్ ఇంజనీరింగ్ సేవల సంస్థ ఎసాప్ గ్రూప్లో 100 శాతం ఈక్విటీ వాటాను (279.72 మిలియన్ డాలర్లు) కొనుగోలు చేసింది. హెచ్సిఎల్టెక్ యూకే అనుబంధ సంస్థ ద్వారా జరిగే ఈ ఒప్పందం సెప్టెంబర్ 2023 నాటికి ముగియనుంది. ఇది ఇప్పుడు రెగ్యులేటరీ ఆమోదాలకు లోబడి ఉంటుందని సంస్థ గురువారం ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో తెలిపింది. అటానమస్ డ్రైవింగ్, ఇ-మొబిలిటీ, కనెక్టివిటీ రంగాలలో భవిష్యత్తు-ఆధారిత ఆటోమోటివ్ టెక్నాలజీలో తమ పోర్ట్ఫోలియోను బలోపేతం చేయడంలో ఈ డీల్ తోడ్పడుతుందని కంపెనీ భావిస్తోంది. అలాగేఐరోపా, అమెరికా, జపాన్లోని కీలకమైన ఆటోమోటివ్ మార్కెట్స్లో విస్తరణకు ఈ కొనుగోలు సాయ పడుతుందని పేర్కొంది. (పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్:లైసెన్స్ ఉండాల్సిందే!) హెచ్సీఎల్ ఈ ఆర్థిక సంవత్సరం(2023-24) తొలి త్రైమాసికానికి(క్యూ1) ఆసక్తికర ఫలితాల్లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్-జూన్)లో నికర లాభం వార్షికంగా 7 శాతం బలపడి రూ. 3,534 కోట్లను తాకింది. గతేడాది(2022-23) ఇదే కాలంలో రూ. 3,324 కోట్లు ఆర్జించింది. అయితే గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో సాధించిన రూ. 3,983 కోట్లతో పోలిస్తే లాభాలు 11 శాతం క్షీణించాయి. ఇక మొత్తం ఆదాయం 12 శాతం ఎగసి రూ. 26,296 కోట్లకు చేరింది. గతేడాది క్యూ1లో రూ. 23,464 కోట్ల ఆదాయం నమోదైంది. కంపెనీ బోర్డు వాటాదారులకు షేరుకి రూ. 10 చొప్పున మధ్యంతర డివిడెండును ప్రకటించింది. డివిడెండు చెల్లింపునకు ఈ నెల 20 రికార్డ్ డేట్గా నిర్ణయించింది. ఇతర విశేషాలు కొత్తగా 1,597 మంది ఫ్రెషర్స్కు ఉపాధి క్యూ1లో నికరంగా 2,506 మంది ఉద్యోగులు తగ్గారు. జూన్కల్లా మొత్తం సిబ్బంది సంఖ్య 2,23,438కు చేరింది. ఉద్యోగ వలసల(అట్రిషన్) రేటు 16.3 శాతంగా నమోదైంది. -
భారీ నష్టాల్లో సూచీలు: హెచ్సీఎల్, కోటక్ మహీంద్ర టాప్ లూజర్స్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. బుధవారం ట్రేడింగ్ను ఫ్లాట్గా ప్రారంభించిన సూచీలు ఆ తరువాత మరింత నష్టపోతున్నాయి. సెన్సెక్స్ 450 పాయింట్లకు పైగా నష్టంతో 61500 దిగువన ట్రేడవుతుండగా, 130 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ 18,150 స్థాయిని కోల్పోయింది. ఐటీ , ఫైనాన్షియల్ షేర్లలో నష్టాలు ప్రభావితం చేస్తున్నాయి. నష్టాలు మరింత కొనసాగుతున్నాయి. (టీ స్టాల్ కోసం ఐఏఎస్ డ్రీమ్ను వదిలేశాడు: ఏకంగా ఏడాదికి రూ. 150 కోట్లు) హీరో మోటోకార్ప్, ఇండస్ ఇండ్ బ్యాంక్, బీపీసీఎల్, భారతి ఎయిర్టెల్ బాగా లాభపడుతుండగా హెచ్సిఎల్ టెక్, కోటక్ బ్యాంక్ టాప్, ఇన్ఫోసిస్, టీసీఎస్, టైటన్ టాప్ లూజర్స్గా ఉన్నాయి. అదానీ హిండెన్బర్ వివాదంలో సెబీ అప్పీల్ను స్వీకరించాలని సుప్రీంకోర్టు నిర్ణయించిన నేపథ్యంల నేటి (బుధవారం)సెషన్లో అదానీ గ్రూప్ స్టాక్స్పై ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగుతున్నాయి. -
సంక్షోభ సమయంలో హెచ్సీఎల్ టెక్ గుడ్న్యూస్
సాక్షి, ముంబై: గ్లోబల్గా ఐటీ రంగంలో కొనసాగుతున్న తొలగింపుల మధ్య, భారతీయ ఐటీ మేజర్ చల్లటి కబురు చెప్పింది. కొంతమంది ఉద్యోగులను తీసుకోవాలని నిర్ణయించినట్టు హెచ్సీఎల్ టెక్ తాజాగా ప్రకించింది. రాబోయే రెండేళ్లలో రొమేనియాలో 1,000 మంది ఉద్యోగులను నియమించు కోనున్నట్లు ప్రకటించింది. రొమేనియాలో తన కార్యకలాపాలను విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రముఖ రోమేనియన్ విశ్వవిద్యాలయాలతో భాగస్వామ్యం ద్వారా మూడో వంతు చోటు కల్పించనుంది. హెచ్సీఎల్టెక్గత ఐదేళ్లుగా రొమేనియాలో పనిచేస్తోంది.ఈ నేపథ్యంలోనే గ్లోబల్ క్లయింట్లకు సేవలందించేలా ఇప్పటికే దేశంలో దాదాపు 1,000 మంది ఉద్యోగులుండగా, మరో వెయ్యిమందిని చేర్చుకోనుంది. ఐటీ సేవల్లో వృద్ధిని కొనసాగించేందుకు స్థానిక ప్రతిభావంతులకు మరిన్ని అవకాశాలను సృష్టించేందుకు కంపెనీ బుకారెస్ట్, ఇయాసిలో ఉద్యోగులను పెంచుకుంది. తమకు రొమేనియా కీలకమైన మార్కెట్ అని అందుకే మరింత మెరుగైన సేవలందించేలా వర్క్ఫోర్స్ను పెంచుకుంటు న్నామని ఐడీసీ అసోసియేట్ కన్సల్టెంట్ అలెగ్జాండ్రా సిమియన్ వెల్లడించారు. (హయ్యస్ట్ సాలరీతో మైక్రోసాఫ్ట్లో జాబ్ కొట్టేసిన అవని మల్హోత్రా) రొమేనియాలో స్థానిక ప్రతిభావంతులకు సాంకేతికతలో వృత్తిని కొనసాగించేందుకు అవకాశాలను సృష్టించేందుకు పెట్టుబడులు పెడుతున్నామని అక్కడి కంట్రీ లీడ్ ఇలియాన్ పదురారు అన్నారు. ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం, ఎంట్రీ లెవల్లోవారిని నియమించుకోవడానికి కూడా సహాయపడుతుందని పేర్కొన్నారు. (ఎంజీ బుజ్జి ఈవీ: స్మార్ట్ కాంపాక్ట్ కామెట్ వచ్చేస్తోంది..150 కి.మీ. రేంజ్లో) కాగా గూగుల్, అమెజాన్ , మెటా గత ఏడాది చివర్లో భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించినసంగతి తెలిసిందే. గూగుల్ 12వేలు, మెటా, అమెజాన్లు వరుసగా 21వేలు, 27వేల మంది ఉద్యోగాలపై వేటు వేశాయి. -
హెచ్సీఎల్ టెక్ క్యూ3 భళా
న్యూఢిల్లీ: ఐటీ సేవల దిగ్గజం హెచ్సీఎల్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికం(క్యూ3)లో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 19 శాతం ఎగసి రూ. 4,096 కోట్లను తాకింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 3,442 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 20 శాతం పుంజుకుని రూ. 26,700 కోట్లకు చేరింది. గత క్యూ3లో రూ. 22,331 కోట్ల టర్నోవర్ నమోదైంది. వాటాదారులకు షేరుకి రూ. 10 చొప్పున నాలుగో మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. ఇందుకు రికార్డ్ డేట్ ఈ నెల 20. డీల్స్ ప్లస్ క్యూ3లో హెచ్సీఎల్ టెక్నాలజీస్ నికరంగా 2,945 మంది ఉద్యోగులను జత చేసుకుంది. దీంతో మొత్తం సిబ్బంది సంఖ్య 2,22,270కు చేరింది. ఈ కాలంలో 17 భారీ డీల్స్ను పొందింది. కొత్త డీల్స్ విలువ గత క్యూ3తో పోలిస్తే 10% అధికంగా 234.7 కోట్ల డాలర్లను తాకినట్లు కంపెనీ వెల్లడించింది. క్యూ2తో పోలిస్తే ఉద్యోగ వలసల(అట్రిషన్) రేటు 23.8% నుంచి 21.7 శాతానికి తగ్గినట్లు తెలియజేసింది. ఫలితాల నేపథ్యంలో హెచ్సీఎల్ టెక్ షేరు 1.7 శాతం బలపడి రూ. 1,073 వద్ద ముగిసింది. -
భారతీయులేనా పనిమంతులు.. మేం పనికి రామా? టీసీఎస్పై అమెరికన్ల ఆగ్రహం!
దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీస్ (టీసీఎస్) చిక్కుల్లో పడింది. ఉద్యోగుల్ని నియమించుకునే విషయంలో వివక్ష చూపుతుందంటూ ఆ సంస్థ మాజీ ఉద్యోగి కోర్టులో పరువు నష్టం దావా వేశాడు. గతవారం (డిసెంబర్7)న టీసీఎస్ మాజీ ఉద్యోగి కాట్జ్ అమెరికా న్యూజెర్సీ జిల్లా కోర్టును ఆశ్రయించారు. అమెరికాలో ఉద్యోగుల నియామకంలో స్థానికులపై వివక్ష చూపిస్తోందని ఆరోపిస్తూ దాఖలు చేసిన క్లాస్ యాక్షన్ దావాలో పేర్కొన్నారు. స్థానికంగా ఉద్యోగాలు ఇచ్చేందుకు సౌత్ ఏషియన్, భారతీయుల్ని మాత్రమే ఎంపిక చేసుకుంటుందని, స్థానికుల పట్ల నిర్లక్ష్యం వహిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. టీసీఎస్ కావాలనే ఉద్దేశపూర్వకంగా యునైటెడ్ స్టేట్స్లో దాదాపు 70శాతం దక్షిణాసియా ఉద్యోగులను (ప్రధానంగా భారత్ నుండి) నియమించారనేది ప్రధాన ఆరోపణ భారతీయులేనా పనిమంతులు ఆఫీస్ వర్క్ విషయంలో టీసీఎస్ భారతీయులు, అమెరికన్లు మధ్య వ్యత్యాసం చూస్తుందని కోర్టులో వాదించారు. యూఎస్కి చెందిన ఐటీ పరిశ్రమలో కేవలం 12శాతం నుండి 13 శాతం మంది మాత్రమే దక్షిణాసియాకు చెందినవారు ఉంటే.. అమెరికాకు చెందిన టీసీఎస్ వర్క్ఫోర్స్లో దాదాపు 70శాతం దక్షిణాసియాకు చెందిన వారు ఉన్నారని అన్నారు. వర్క్ వీసాల (హెచ్1 బీ) ద్వారా యూఎస్కు వచ్చిన వారిలో భారతీయులు ఎక్కువగా ఉన్నారని కోర్టులో దావా వేసిన టీసీఎస్ మాజీ ఉద్యోగి కాట్జ్ వెల్లడించారు. 9 ఏళ్ల పాటు ఉద్యోగం 9 సంవత్సరాలకు పైగా టీసీఎస్లో పనిచేసిన కాట్జ్, వివిధ ప్రాజెక్టులకు ఉద్యోగులను కేటాయించే హెచ్ఆర్ విభాగం నుంచి సరైన సహాయం లేకపోవడం,సంస్థలో సరైన అవకాశాలు లభించకపోవడంతో తనను తొలగించారని పేర్కొన్నారు. కాబట్టి టీసీఎస్ చట్టవిరుద్ధమైన నియామకాలు చేపట్టకుండా నిరోధించాలని, వివక్ష లేని నియామక పద్ధతులను అవలంబించాలని ఫిర్యాదుదారు అభ్యర్థించారు. జాబ్ నుంచి తొలగించినందుకు నష్టపరిహారం కావాలని కోర్టును కోరాడు. టీసీఎస్కు అనుకూలంగా గతంలో టీసీఎస్ ఇదే తరహా వివాదంలో చిక్కుకుంది. 2019లో ముగ్గురు మాజీ ఉద్యోగులు దాఖలు చేసిన ఇదే విధమైన వ్యాజ్యంపై కాలిఫోర్నియా జిల్లా కోర్టు టీసీఎస్కు అనుకూలంగా తీర్పునిచ్చింది. భారతీయ ఐటి సంస్థ యుఎస్ కార్యాలయాల్లో అమెరికన్లకు బదులుగా భారతీయులతో పనిచేయడానికి ఇష్టపడుతుందన్న వాదనలను జ్యూరీ తిరస్కరించింది. టీసీఎస్తో పాటు ఇతర టెక్ కంపెనీలు సైతం టీసీఎస్తో పాటు ఇన్ఫోసిస్,హెచ్సిఎల్టెక్, విప్రో వంటి ఇతర భారత్కు చెందిన ఐటీ కంపెనీలు అమెరికాలో వివక్షతతో కూడిన నియామకాలు చేపడుతున్నాయంటూ ఉద్యోగులు కోర్టులను ఆశ్రయించిన ఘటనలు గతంలో చోటు చేసుకున్నాయి. -
అంచనాలు మించి అదరగొట్టిన హెచ్సీఎల్ టెక్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఐటీ సర్వీసుల దిగ్గజం హెచ్సీఎల్ టెక్నాలజీస్ (హెచ్సీఎల్టెక్) అంచనాలకు మించి లాభాలను ప్రకటించింది. క్యూ2లో లాభం 7 శాతం వృద్ధి చెంది రూ. 3,489 కోట్లకు చేరింది. గతేడాది సెప్టెంబర్ త్రైమాసికంలో ఇది రూ. 3,259 కోట్లు. ఇక ఆదాయం 19.5 శాతం పెరిగి రూ. 24,686 కోట్లకు చేరింది. సీక్వెన్షియల్గా చూస్తే ఆదాయం 5 శాతం, లాభం 6 శాతం పెరిగాయి. జూన్ త్రైమాసికంతో పోలిస్తే క్యూ2లో లాభం 2.7 శాతం, ఆదాయం 3.4 శాతం పెరగవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి. కొత్త ఆర్డర్ల బుకింగ్ పటిష్టంగా ఉందని, భవిష్యత్ వృద్ధికి గణనీయంగా ఊతమివ్వగలదని సంస్థ సీఈవో సి. విజయకుమార్ ధీమా వ్యక్తం చేశారు. షేరుకు రూ. 10 చొప్పున కంపెనీ మధ్యంతర డివిడెండు ప్రకటించింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఆదాయ గైడెన్స్ను 13.5–14.5 శాతానికి పెంచింది. సమీక్షాకాలంలో కొత్తగా 8,359 మంది ఉద్యోగులు చేరారు. దీంతో మొత్తం సిబ్బంది సంఖ్య 2,19,325కి చేరింది. ఇందులో 10,339 మంది ఫ్రెషర్స్ ఉన్నారు. ఐటీ సేవల విభాగంలో అట్రిషన్ రేటు (ఉద్యోగుల వలసలు) 23.8 శాతంగా ఉంది. ఫలితాల నేపథ్యంలో గురువారం నాటి మార్కెట్లో హెచ్సీఎల్ షేరు 3 శాతం ఎగిసింది. -
టెక్ దిగ్గజం హెచ్సీఎల్ బంపరాఫర్
ప్రముఖ టెక్ దిగ్గజం హెచ్సీఎల్ సంస్థ శుభవార్త చెప్పింది. హెచ్సీఎల్ టెక్ 18,000 మంది టెక్, కన్సల్టింగ్ నిపుణులకు గూగుల్ క్లౌడ్ సాంకేతికతపై శిక్షణ ఇవ్వనుంది. గూగుల్ క్లౌడ్ భాగస్వామిగా ఉన్న హెచ్సీఎల్ టెక్ ఎంటర్ప్రైస్ క్లౌడ్ను విస్తృతం చేసేందుకు 2019లో గూగుల్ క్లౌడ్ ఎకోసిస్టమ్ యూనిట్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. -
హెచ్సీఎల్ గ్రూప్ చేతికి గువి
న్యూఢిల్లీ: టెక్నికల్ కోర్సులను అందించే వెర్నాక్యులర్ ఎడ్యుటెక్ ఫ్లాట్ ఫామ్ గువి(జీయూవీఐ)లో మెజారిటీ వాటాను కొనుగోలు చేసినట్లు ఐటీ సేవల దిగ్గజం హెచ్సీఎల్ గ్రూప్ తాజాగా పేర్కొంది. ఐతే డీల్ విలువను వెల్లడించలేదు. ఐఐటీ మద్రాస్, ఐఐఎం అహ్మదాబాద్ మద్దతుతో ఏర్పాటైన కంపెనీ వెబ్ డెవలప్మెంట్, ఏఐ మాడ్యూల్, ఎస్క్యూఎల్ తదితర పలు సాంకేతిక కోర్సులను అందిస్తోంది. పారిశ్రామిక నిపుణుల ద్వారా రూపొందించిన విభిన్న కోర్సులను సైతం వెర్నాక్యులర్ లాంగ్వేజీలలో అందిస్తోంది. విద్యార్ధులు, యూనివర్శిటీలు, ఉద్యోగులకు అనువైన(టైలర్మేడ్) కోర్సులను సైతం రూపొందిస్తోంది. తాజా పెట్టుబడి ద్వారా దేశ, విదేశాలలో టెక్ వృత్తి నిపుణులను సృష్టించడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు హెచ్సీఎల్ టెక్ తెలియజేసింది. -
భారత్లో అత్యంత సంపన్న మహిళ.. 'రోష్ని నాడార్' ఆస్తి ఎంతో తెలుసా?
ప్రముఖ బ్యాంకింగ్ దిగ్గజం కొటక్ మహీంద్రా - హురున్ ఇండియా సంస్థలు సంయుక్తంగా భారత్లోనే అత్యంత సంపన్నులైన 100 మంది మహిళల జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో రోష్ని నాడార్, ఫల్గుణి నాయర్లు వరుస స్థానాల్ని దక్కించుకున్నారు. ♦ సంపన్నుల జాబితాలో హెచ్సీఎల్ టెక్నాలజీస్ చైర్ పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రా నికర సంపద 54 శాతం పెరిగి రూ.84,330కోట్లతో తొలిస్థానాన్ని కైవసం చేసుకున్నారు. ♦ బ్యాంకింగ్ రంగం నుంచి అనూహ్యంగా నైకా పేరుతో కాస్మోటిక్స్ రంగంలో రాణిస్తున్న ఫల్గుణి నాయర్ రూ.57,520 కోట్లతో రెండో స్థానంలో నిలిచారు. ఏడాదిలో ఆమె వెల్త్ 963 శాతం పెరిగినట్లు విడుదలైన నివేదిక పేర్కొంది. ♦ బయోకాన్ ఛైర్ పర్సన్ కిరణ్ మంజుదార్ షా వెల్త్ 21శాతం తగ్గి రూ.29,030 కోట్లతో మూడవ స్థానంలో నిలిచారు. హైదరాబాద్లో 12మంది మహిళలు మహిళా సంపన్నుల జాబితాలో అత్యధికంగా ఢిల్లీ నుంచి 25 మంది, ముంబై నుంచి 21మంది ,హైదరాబాద్ నుంచి 12 మంది ఉన్నారు. భారతదేశంలోని టాప్ - 100 మంది ధనవంతులైన మహిళలలో ఫార్మాస్యూటికల్స్ రంగం నుంచి 12 మంది, హెల్త్కేర్ నుంచి 11 మంది, కన్స్యూమర్ గూడ్స్ రంగం నుంచి 9 మంది మహిళలున్నారు. హైదరాబాద్లో దివీస్ లాబోరేటరీస్ డైరక్టర్ నీలిమా రూ.28,180కోట్లతో తొలిస్థానంలో నిలిచారు. ఆ తర్వాత రూ.5,530కోట్లతో బయోలాజికల్ ఇ.లిమిటెడ్ ఎండీ మహిమా దాట్ల, రూ.2,740కోట్లతో శోభన కామినేని తర్వాతి స్థానాల్లో ఉన్నారు. చివరిగా భోపాల్ జెట్సెట్గోకు చెందిన 33ఏళ్ల కనికా తెక్రివాల్ 50 శాతం సంపదతో రూ.420 కోట్లతో జాబితాలో అత్యంత పిన్న వయస్కురాలిగా నిలిచారు. సంస్థల్లో ఉన్నత స్థాయిలో.. సంపన్నుల జాబితాలో ఆయా సంస్థల్లో ఉన్నత స్థానాల్లో విధులు నిర్వహించిన మహిళలు సైతం ఉన్నారు. వారిలో మాజీ పెప్సికో సీఈవో ఇంద్రా నూయి రూ. 5,040 కోట్లు, హెచ్డీఎఫ్సీ మేనేజింగ్ డైరెక్టర్గా రేణు సుద్ కర్నాడ్ రూ. 870 కోట్లు, కోటక్ మహీంద్రా బ్యాంక్ ప్రెసిడెంట్ శాంతి ఏకాంబరం రూ.320 కోట్లతో వరుస స్థానాల్ని కైవసం చేసుకున్నారు. -
దేశంలో అత్యధిక వేతనం పొందే ఐటీ కంపెనీ సీఈవో ఎవరో తెలుసా!
కోవిడ్ కారణంగా అన్నీ రంగాలు కుదేలయ్యాయి. కానీ ఐటీ రంగం మాత్రం అందుకు భిన్నంగా ఎన్నడూ లేని విధంగా కార్యకలాపాల్ని నిర్వహించాయి. భారీ లాభాల్ని గడించాయి. అందుకే దిగ్గజ ఐటీ కంపెనీలు ఉద్యోగులకు, సీఈవోలకు కళ్లు చెదిరేలా వేతనాల్ని అందిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు మన దేశానికి చెందిన ఏ ఐటీ కంపెనీ సీఈవో అత్యధిక వేతనం పొందుతున్నారో తెలుసా? ఇంతకీ ఆయన పేరేంటీ? ఆ సంస్థ ఏంటో తెలుసుకోవాలని ఉందా? నిన్న మొన్నటి వరకు మన దేశానికి చెందిన ఐటీ కంపెనీలో అత్యధిక వేతనం పొందిన సీఈవోలో జాబితాలో ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ నిలిచారు. ఆయన ఏడాదికి రూ.71కోట్ల వేతనం పొందుతున్నట్లు ఈ ఏడాది మేనెలలో ఆ కంపెనీ వార్షిక ఫలితాల విడుదల సందర్భంగా తెలిపింది. తాజాగా సలీల్ పరేఖ్ కంటే అత్యధికంగా హెచ్సీఎల్ టెక్నాలజీ యూఎస్ ఆధారిత సీఈవో సి.విజయ్ కుమార్ రూ.123.13కోట్ల శాలరీ పొందినట్లు ఆ సంస్థ విడుదల చేసిన వార్షిక ఫలితాల నివేదిక పేర్కొంది. అయితే సీఈవో విజయ్ కుమార్ రూ.123.13కోట్లను శాలరీ రూపంలో ఇవ్వలేదని, కొంత మొత్తాన్ని లాంగ్ టర్మ్ ఇన్సెన్టీవ్స్ -(ఎల్టీఐ (స్టాక్స్) రూపంలో అందించినట్లు హెచ్సీఎల్ యాజమాన్యం తెలిపింది. బేసిక్ యాన్యువల్ శాలరీ ఎంతంటే? హెచ్సీఎల్ టెక్నాలజీ వార్షిక ఫలితాల్ని విడుదల చేసింది. ఈ సందర్భంగా ఈ ఏడాది మార్చి 31 వరకు ఆ సంస్థ సీఈవో సి.విజయ్ కుమార్కు ఎంత వేతనం చెల్లిస్తుందో చెప్పే ప్రయత్నం చేసింది. తమ సంస్థ సీఈవో బేసిక్ యాన్యువల్ శాలరీ 2మిలియన్ డాలర్లు ఉండగా, సంస్థకు లాభాల్ని తెచ్చినందుకు ప్రోత్సహకాల కింద మరో 2 మిలియన్ డాలర్లు, బోనస్లు ఇతర అలవెన్స్లు 0.02 మిలియన్ డాలర్లు చెల్లించినట్లు వెల్లడించింది. మొత్తంగా ఎల్టీఐ 12.50 మిలియన్ డాలర్లను కలుపుకొని విజయ్ కుమార్ వేతనం 16.52 మిలియన్ డాలర్లుగా ఉందని చెప్పింది. 2021-2022లో సీఈవోల శాలరీ ఎంతంటే 2021-2022లో మనదేశానికి చెందిన సీఈవోలు అత్యధిక వేతనం తీసుకోవడంలో సరికొత్త రికార్డ్లను సృష్టిస్తున్నారు. 2021-2022లో ఏడాదికి ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ శాలరీ రూ.79.75కోట్లు,హెచ్సీఎల్ సీఈవో సి.విజయ్ కుమార్ శాలరీ రూ.123.13కోట్లు, టీసీఎస్ సీఈవో రాజేష్ గోపీనాథన్ వార్షిక వేతనం రూ. 25.76 కోట్లు, విప్రో పారిస్ ఆధారిత సీఈవో వేతనం రూ. 64.34 కోట్లు. హెచ్సిఎల్ టెక్ సిఇఓ రూ.32.21 కోట్లు టెక్ మహీంద్రా సీఈవో రూ.22 కోట్ల వేతనం అందుకుంటున్నారు. -
ఈ తరహా ఉద్యోగుల కోసం వేలకోట్ల ఖర్చు, పోటీపడుతున్న ఐటీ కంపెనీలు!
కరోనా మహమ్మారికి కారణంగా టెక్నాలజీ వినియోగం పెరిగింది.దీంతో ఆ రంగంలో పనిచేసే ఉద్యోగులకు సైతం డిమాండ్ ఏర్పడింది. అయితే తమకు అర్హులైన ఉద్యోగుల్ని ఎంపిక చేయడం టెక్ సంస్థలకు కత్తిమీద సాములాగా తయారైంది. అందుకే వేలకోట్లు ఖర్చు చేసి మరీ స్టాఫింగ్ ఏజెన్సీల సాయంతో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగుల్ని నియమించుకుంటున్నాయి. మార్కెట్లో ఉన్న డిజిటల్ స్కిల్ కొరతను అధికమిస్తున్నాయి. దీంతో టెక్ మార్కెట్లో కాంట్రాక్ట్ ఉద్యోగులకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోతున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. ప్రపంచ దేశాలకు చెందిన దిగ్గజ టెక్ కంపెనీలు స్టాఫింగ్ ఏజెన్సీల సాయంతో ఉద్యోగల్ని (సబ్ కాంట్రాక్టర్స్ను) నియమించుకుంటున్నాయి. స్టాఫింగ్ ఏజెన్సీలు సైతం వాళ్ల పద్దతిలో సెలక్ట్ చేసుకున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు శాలరీ, ఇన్స్యూరెన్స్ కవరేజ్తో పాటు ఇతర బెన్ఫిట్స్ను అందిస్తున్నాయి. అయితే ఈ తరహా కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని నియమించుకునేందుకు ఐటీ దిగ్గజాలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెసీఎల్'లు పోటీ పడుతున్నాయి. అందుకోసం వేలకోట్లు ఖర్చు చేస్తున్నాయి. సాధారణ ఉద్యోగుల నియామకానికి సమానంగా కాంట్రాక్ట్ పద్దతిలో ఉద్యోగుల్ని రిక్రూట్ చేసుకుంటున్నాయి. ఇలా ఈఏడాది ఫైనాన్షియల్ ఇయర్లో టీసీఎస్ 34.2శాతం వృద్ధితో కాంట్రాక్ట్ ఉద్యోగులపై రూ.16,975కోట్లు ఖర్చు చేస్తుండగా ఇన్ఫోసిస్ 77.9శాతం వృద్ధితో రూ.12,607కోట్లు ఖర్చు చేసింది. అదే సమయంలో విప్రో 30శాతం వృద్ధితో రూ.10,858 కోట్లు ఖర్చు చేయగా..23శాతం వృద్ధితో హెచ్సీఎల్ ఖర్చు చేసినట్లు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. పర్మినెంట్ చేస్తున్నాయి సంస్థలు కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని నియమించుకోవడం వల్ల డిమాండ్కు అవసరమయ్యే డిజిటల్ స్కిల్స్ను ఉపయోగించుకోవడంతో పాటు, స్కిలున్న ఉద్యోగుల్ని గుర్తించడం స్టాఫింగ్ ఏజెన్సీలకు సులభం అవుతుంది.తద్వారా సంస్థకు వస్తున్న ప్రాజెక్ట్లను తక్కువ సమయంలో పూర్తి చేయడం, ఐటీ సంస్థల్ని కుదిపేస్తున్న అట్రిషన్ రేట్ను తగ్గించుకునేందుకు సంస్థలు ట్రై-బై-అప్రోచ్ పద్దతిని అవలంభిస్తున్నాయని టెక్ అడ్వైజరీ సంస్థ క్యాటలిన్క్స్ పార్టనర్ రామ్ కుమార్ రామ మూర్తి తెలిపారు. ట్రై-బై-అప్రోచ్ పద్దతి అంటే కాంట్రాక్ట్ పద్దతిలో ఉద్యోగులు నియమించుకొని ప్రాజెక్ట్లు పూర్తి చేస్తున్నాయి. అవసరం అనుకున్నప్పుడు ఆ కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని సంస్థలు సాధారణ ఉద్యోగులుగా ఎంపిక చేసుకుంటున్నాయి. చదవండి👉సాఫ్ట్వేర్ ఉద్యోగులకు బంపరాఫర్, ఎన్ని సెలవులు కావాలంటే అన్నీ తీసుకోండి! -
ఉద్యోగులకు గుడ్న్యూస్.. ఐటీ కంపెనీల కీలక నిర్ణయం!
కరోనా మహమ్మారి ముచ్చటగా మూడోసారి కూడా కోరలు చాస్తోంది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా భారీగా కేసులు నమోదవుతున్నాయి. భారత్లో రోజుకు రెండు లక్షల కేసులు రావడం గమనార్హం. దేశంలో కూడా ఓమిక్రాన్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండంతో ఈ కొత్త సంవత్సరంలో కూడా ఐటీ ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ ఇంటి నుంచే పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దేశవ్యాప్తంగా అనేక కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని మళ్లీ ప్రారంభించాయి. ఈ ఏడాది చివరి వరకు ఉద్యోగులు ఇంటి నుంచి పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మేజర్ కాగ్నిజెంట్ నుంచి ప్రధాన ఈ-కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్కార్ట్ వరకు ఉద్యోగులను ఇంటి నుంచి పని చేయలని అభ్యర్థించాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్)తో సహా చాలా ఐటీ సంస్థలు జనవరి నుంచి 50-70 శాతం సిబ్బందితో ఆఫీస్ ఓపెన్ చేయలని ఇంతకు ముందు నిర్ణయించాయి. అయితే, కొత్త కోవిడ్-19 వేరియంట్ ఓమిక్రాన్ రాకెట్ వేగంతో పెరుగుతుండటంతో దేశ రాజధానితో సహా వివిధ రాష్ట్రాల్లో హైబ్రిడ్ వర్కింగ్ మోడల్ను అమలు చేస్తున్నాయి. ఢిల్లీ జిల్లా విపత్తు నిర్వహణ అథారిటీ(డీడీఎమ్ఏ) జనవరి 11న విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం.. అన్ని ప్రైవేటు ఆఫీసులు మూసివేయాలి. కార్యాలయాల్లో కేవలం అత్యవసరమైన విధులకు మాత్రమే కంపెనీలు పనిచేయాలని డీడీఎమ్ఏ సూచించింది. మిగిలిన వారికి రిమోట్ వర్క్ సదుపాయాన్ని ఇవ్వాలని స్పష్టం చేసింది. ఒకే బాటలో టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్.. దేశంలోని అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) గత నెలలో తన ఉద్యోగులలో 90 శాతం మంది ఇంటి నుంచి పనిచేస్తున్నారని తెలిపింది. మా ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, కుటుంబాలు, క్లయింట్ల ఆరోగ్యం & భద్రతను దృష్టిలో ఉంచుకొని అందరినీ ఇంటి నుంచి పనిచేయాలని హెచ్సీఎల్ సూచించింది. ఉద్యోగులను తిరిగి కార్యాలయానికి పిలవడానికి ముందు కోవిడ్-19 వేరియెంట్ల విజృంభిస్తుండటంతో హైబ్రిడ్ వర్కింగ్ మోడల్ కొనసాగించాలని కోరుకుంటున్నట్లు హెచ్సిఎల్ టెక్నాలజీస్ పేర్కొంది. దేశంలో మారుతున్న కోవిడ్-19 పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది కూడా దాదాపు వర్క్ ఫ్రమ్ హోం చేయాల్సి ఉంటుందని ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రిచర్డ్ లోబో ఎకనామిక్ టైమ్స్ కు చెప్పారు. పరిస్థితులు సద్దుమణిగి, ఇన్ఫెక్షన్ రేట్లు తగ్గి, వ్యాక్సినేషన్ పుంజుకున్న తర్వాత బహుశా అప్పుడు కార్యాలయాలకు రావాల్సి ఉంటుందని తను స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం కేంద్ర ప్రభుత్వం ఇంతకు ముందు తన ఉద్యోగులలో 50 శాతం మంది సెక్రటరీ స్థాయికి దిగువన గల ఉద్యోగులను ఇంటి నుంచి పని చేయడానికి అనుమతించింది. అంగవైకల్యం ఉన్న వ్యక్తులు, గర్భిణీ మహిళా ఉద్యోగులకు కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదు అని తెలిపింది. కార్యాలయంలో భారీగా రద్దీ ఉండకుండా టైమింగ్స్ మార్చినట్లు స్పష్టం చేసింది. కార్యాలయంలో సామాజిక దూరం పాటించాలని, మాస్క్ తప్పకుండా ధరించాలని కోవిడ్ నియమాలను తప్పనిసరి చేసింది. -
నిరుద్యోగులకు గుడ్న్యూస్..!
Indian IT Services to hire about 450,000 people in H2FY22 UnearthInsight: నిరుద్యోగులకు గుడ్న్యూస్..! వచ్చే ఏడాది ఐటీ కంపెనీల్లో కొలువుల జాతర మొదలుకానుంది. కోవిడ్-19 ఉదృత్తి తగ్గడంతో ఐటీ కంపెనీలు భారీ సంఖ్యలో నియామకాలను చేపట్టనున్నట్లు మార్కెట్ ఇంటెలిజెన్స్ సంస్థ అన్ఎర్త్ ఇన్సైట్ ఒక నివేదికలో పేర్కొంది. వచ్చే ఏడాది మార్చి నాటికి ఐటీ కంపెనీలు సుమారు 4.5 లక్షల నియామకాలు చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఐటీ ఉద్యోగుల అట్రిషన్ రేట్ కూడా అధికంగానే ఉంది. దీంతో వారి స్థానంలో సుమారు 1.75 లక్షల ఉద్యోగాలను ఐటీ కంపెనీలు భర్తీ చేయనున్నట్లు అన్ఎర్త్ ఇన్సైట్ వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో భారత్లోని టాప్-30 కంపెనీలు ఇప్పటికే 2.5 లక్షల ఫ్రెషర్స్కు అవకాశాలను కల్పించినట్లు అన్ఎర్త్ ఇన్సైట్ పేర్కొంది. వీటిలో ఫ్రెషర్లను నియమించిన టాప్ కంపెనీలలో టీసీఎస్ 77వేలు, ఇన్ఫోసిస్ 45వేలు, కాగ్నిజెంట్ 45వేలు,హెచ్సీఎల్ టెక్ 22వేల ఉద్యోగాలను కల్పించాయి. భారత టెక్ కంపెనీలు ముఖ్యంగా ఉద్యోగుల నైపుణ్యాలను పెంచే ప్రోగ్రామ్పై దృష్టిసారించినట్లుగా తెలుస్తోంది. చదవండి: ఉద్యోగుల కోసం క్యాబిన్లు, ఇకపై ట్రైన్లలో ఆఫీస్ వర్క్ చేసుకోవచ్చు అట్రిషన్ రేట్ కూడా ఎక్కువే...! FY22లో అట్రిషన్ రేట్ 17-19 శాతంగా ఉండగా..అది వచ్చే FY23లో 16-18 శాతం ఉంటుందని అన్ఎర్త్ ఇన్సైట్ అభిప్రాయపడింది. కాగా ఐటీ కంపెనీలు వీరి స్ధానాల్లో కొత్త నియాకాలను భర్తీ చేసే అవకాశం లేకపోలేదని తన నివేదికలో పేర్కొంది. క్లౌడ్ సర్వీసులకే అధిక ప్రాధాన్యం..! పలు దిగ్గజ ఐటీ కంపెనీలు క్లౌడ్ సర్వీస్లపై ఎక్కువగా ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. 2030 నాటికి క్లౌడ్ ఆధారిత సర్వీసుల విలువ ఏకంగా 80-100 బిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉన్నట్లు అన్ఎర్త్ ఇన్సైట్ వెల్లడించింది. క్లౌడ్ ఇండస్ట్రీ, సెక్యూరిటీలో చాలా బలమైన రెండంకెల వృద్ధిని నమోదు చేసిన యాక్సెంచర్ వంటి కంపెనీలు భవిష్యత్తులో క్లౌడ్ ఆధారిత సేవలకు నాయకత్వం వహించనున్నట్లు పేర్కొంది. ఫ్రెంచ్ ఐటీ దిగ్గజం క్యాప్జెమిని కూడా ప్రాథమికంగా డిజిటల్, క్లౌడ్ సేవలపై పనిచేయనున్నట్లు తెలుస్తోంది. హెచ్సీఎల్ టెక్నాలజీస్... అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఎడబ్ల్యుఎస్) బిజినెస్ యూనిట్ కోసం ఏకంగా పదివేల నియామకాలను చేపట్టనున్నట్లు తెలుస్తోంది. చదవండి: వ్యాక్సినేషన్ మస్ట్! నో చెప్తున్న ఉద్యోగులు.. వర్క్ఫ్రమ్హోం పొడగింపునకు డిమాండ్! -
టెక్ దిగ్గజం బోనస్ బొనాంజా : పండగే
సాక్షి, ముంబై: టెక్ మేజర్ హెచ్సీఎల్ టెక్నాలజీస్ (హెచ్సీఎల్) తన ఉద్యోగులకు తీపికబురు అందించింది. అంచనాలకు మించిన త్రైమాసిక లాభాలను సాధించిన సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉన్న 1.5 లక్షల మంది ఉద్యోగులకు భారీ ప్రత్యేక బోనస్ బొనాంజా ప్రకటించింది. సుమారు 700 కోట్ల రూపాయల విలువైన వన్టైమ్ స్పెషల్ బోనస్ను అందిస్తున్నట్టు వెల్లడించింది. కోవిడ్-19 మహమ్మారి సంక్షోభ సమయంలో కూడా తమ ప్రతీ ఉద్యోగి అపారమైన నిబద్ధతతో సేవలందించారని ఇదే సంస్థ వృద్ధికి దోహదపడిందని సంస్థ పేర్కొంది. అంతేకాదు ఉద్యోగులే తమకు అత్యంత విలువైన ఆస్తి అని కంపెనీ ప్రకటించడం విశేషం. 2020 జనవరి-డిసెంబర్ మధ్యకాలంలో తొలిసారి 10 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని అధిగమించిన తరువాత హెచ్సీఎల్ ఈ బంపర్ఆఫర్ ప్రకటించింది. సుమారు 90 మిలియన్ డాలర్లు (రూ. 650 కోట్లకు పైగా) ప్రత్యేక బోనస్ను ఫిబ్రవరిలో ఉద్యోగులకు చెల్లించనుంది. ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ సర్వీసు ఉన్న ఉద్యోగులందరికీ ఈ బోనస్ అందుతుందని, ఇది పది రోజుల జీతానికి సమానమని హెచ్సీఎల్ టెక్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా సంస్థలోని ప్రతీ ఉద్యోగికి హెచ్సీఎల్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ వీవీ అప్పారావు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. కాగా హెచ్సీఎల్ టెక్నాలజీస్ 2020 డిసెంబర్ త్రైమాసికంలో సంవత్సరానికి నికర లాభం 31.1 శాతం ఎగిసి 3,982 కోట్ల రూపాయలుగా నమోదైంది. త్రైమాసిక ప్రాతిపదికన, హెచ్సిఎల్ లాభం 26.7 శాతం పెరిగింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను ఈక్విటీ షేరుకు రూ .4 చొప్పున మధ్యంతర డివిడెండ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
9 వేల మంది ఫ్రెషర్లకు ఉద్యోగాలు
సాక్షి, ముంబై: ఐటీ దిగ్గజం హెచ్సీఎల్ టెక్నాలజీస్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా వైరస్ మహమ్మారినుంచి కోలుకుని లాభాల బాట పడుతున్న ఐటీ కంపెనీలు ఉద్యోగులకు ఊరటనిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా హెచ్సీఎల్ టెక్ నిలిచింది. దశలవారీగా వివిధ స్థాయిల్లో ఉద్యోగులకు వేతనాల పెంపును అమలు చేయనున్నట్లు హెచ్సీఎల్ టెక్ సీఈవో సీ విజయ్ కుమార్ తెలిపారు. అలాగే 9 వేల మంది ఫ్రెషర్లను ఉద్యోగాల్లోకి తీసుకుంటామని వెల్లడించింది. ఆదాయాలు, నికర లాభాలు రెండింటిలో పెరుగుదల కారణంగా మొత్తం 1.5 లక్షల మంది ఉద్యోగులకు జీతం పెంపును ప్రకటించింది. జూలై సెప్టెంబర్ త్రైమాసికంలో మెరుగైన ఫలితాలను ప్రకటించిన హెచ్సీఎల్ ఈ రానున్న ఆరు నెలల కాలంలో 9వేల మందిని తీసుకుంటామని తెలిపింది. అలాగే తమ వాటాదారులకు ఒక్కో షేరుపై రూ.4 మధ్యంతర డివిడెండ్ చెల్లించనున్నట్లు హెచ్సీఎల్ ప్రకటించింది. ఆట్రిషన్ (ఉద్యోగుల వలస) 12.2 శాతంగా నమోదయింది. గత ఏడాది భారత్లోని సిబ్బందికి 6 శాతం వేతనాలు, విదేశాల్లోని సిబ్బందికి 2.5 శాతం వేతనాలు పెంచింది. మరోవైపు గత నెలలో హెచ్సీఎల్ టెక్నాలజీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్లో ఐటీసీని దాటి 10వ స్థానానికి ఎగబాకిన సంగతి తెలిసిందే. కాగా హెచ్సీఎల్ లో 1,53,085 మంది ఉద్యోగులు ఉన్నారు. -
‘స్వగ్రామం నుంచే సాఫ్ట్వేర్’ మోడల్గా ఏపీ
సాక్షి, అమరావతి: ‘స్వగ్రామం నుంచే సాఫ్ట్వేర్’ విధులు నిర్వర్తించే వ్యవస్థగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిలబెట్టనున్నట్లు ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. స్టార్టప్లకు ఏపీ చిరునామాగా మారనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. గురువారం ప్రఖ్యాత ఐటీ కంపెనీ 'హెచ్సీఎల్ టెక్నాలజీస్' చైర్పర్సన్ రోష్ని నాడర్ మల్హోత్రాతో మంత్రి మేకపాటి ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగనన్మోహన్రెడ్డి ఆలోచన ప్రకారం విశాఖపట్నంలో అత్యున్నత స్థాయి నైపుణ్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా ఐటీ హబ్గా తీర్చిదిద్దనున్నట్లు మంత్రి మేకపాటి పేర్కొన్నారు. ఐటీ వృద్ధితో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ తరహా అత్యాధునిక కోర్సులకు చిరునామాగా ఏర్పాటు చేయనున్న స్కిల్ యూనివర్శిటీలో తోడ్పాటునందించాలని మంత్రి కోరడంతో హెచ్ల్సీఎల్ చైర్పర్సన్ సానుకూలంగా స్పందించడమే కాక ఆసక్తి చూపారు. (చదవండి: నైపుణ్యమే యువత భవితకు ఆయుధం) ఇతర రాష్ట్రాలలో స్టార్టప్ల ఏర్పాటు ఖర్చుతో కూడుకున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అన్ని రకాలుగా అంకురాల ఏర్పాటుకు అనుకూలమని మంత్రి మేకపాటి పేర్కొన్నారు. ఏపీలో చాలా తక్కువ ఖర్చుకే హబ్ల ఏర్పాటుకు అవసరమైన భూములు, ప్రతిభగల యువత పుష్కలంగా ఉందన్నారు. ప్రస్తుతం హెచ్సీఎల్ సంస్థ చేపడుతున్న 'టెక్ బీ' కార్యక్రమం ద్వారా ఇంటర్ చదివిన యువతకు 18 ఏళ్లు నిండేసరికే ఉద్యోగాలు పొందేలా వివిధ కోర్సులు నేర్పడం, శిక్షణ అందించడం, ప్లేస్ మెంట్ల ద్వారా ఉద్యోగాలివ్వడం వంటి అంశాలను మంత్రి మేకపాటికి ఛైర్ పర్సన్ రోష్ని వివరించారు. పదవతరగతి పూర్తి చేసిన బాలికలకు కూడా ఇదే తరహా కార్యక్రమం ద్వారా స్వశక్తితో నిలిచేలా చేయడానికి యత్నిస్తున్న హెచ్సీఎల్ను మంత్రి మేకపాటి అభినందించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో హెచ్సీఎల్ కార్పొరేషన్ సీఈవో శివశంకర్ కూడా పాల్గొన్నారు. -
ఐటీ క్వీన్.. రోష్ని!
న్యూఢిల్లీ: భారత ఐటీ రంగంలో కొత్త క్వీన్ అరంగేట్రం చేసింది. పురుషాధిక్యత అధికంగా ఉన్న ఐటీ రంగంలో తొలిసారిగా ఒక ఐటీ కంపెనీ పగ్గాలు ఒక మహిళ చేతికి వచ్చాయి. దిగ్గజ ఐటీ కంపెనీ హెచ్సీఎల్ టెక్నాలజీస్కు చైర్పర్సన్గా రోష్ని నాడార్ మల్హోత్ర నియమితులయ్యారు. హెచ్సీఎల్ టెక్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ స్థానంలో ఆయ న ఏకైక సంతానం, రోష్ని నాడార్ చైర్పర్సన్ బాధ్యతలను శుక్రవారమే స్వీకరించారు. కాగా కంపెనీ ఎమ్డీ(చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్)గా శివ్ నాడార్ కొనసాగుతారు. దేశంలోనే అత్యధిక సంపద ఉన్న మహిళగా రికార్డులకు ఎక్కిన ఈమె. స్టాక్మార్కెట్లో లిస్టైన ఐటీ కంపెనీ చైర్పర్సన్గా పగ్గాలు చేపట్టిన తొలి మహిళ అనే ఘనతను కూడా సాధించారు. శాస్త్రీయ సంగీతంలో శిక్షణ: శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందిన రోష్ని నాడార్ 2013లోనే హెచ్సీఎల్ టెక్నాలజీస్ వైస్ చైర్పర్సన్గా నియమితులయ్యారు. హెచ్సీఎల్ గ్రూప్ హోల్డింగ్ కంపెనీగా వ్యవహరిస్తున్న హెచ్సీఎల్ కార్పొరేషన్ సీఈఓగా ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 27 ఏళ్ల వయస్సుకే సీఈఓ వసంత్ వ్యాలీ స్కూల్లో పాఠశాల విద్య అభ్యసించిన రోష్ని నాడార్ ఢిల్లీలో కమ్యూనికేషన్స్ విభాగంలో డిగ్రీ చదివారు. కెల్లాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి ఎమ్బీఏ పట్టా పొందారు. 2009లో హెచ్సీఎల్ కార్ప్లో చేరారు. ఏడాదిలోనే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎదిగారు. 27 ఏళ్ల వయస్సుకే సీఈఓ అయ్యారు. మహిళా కుబేరుల్లో టాప్ రోష్ని నాడార్ 2010లో హెచ్సీఎల్ హెల్త్కేర్ వైస్ చైర్మన్ శిఖర్ మల్హోత్రను వివాహమాడారు. వారికి ఆర్మాన్, జాహాన్... ఇద్దరు కుమారులు. హురున్ సంస్థ తాజా కుబేరుల జాబితాలో రూ.36,800 కోట్ల సంపదతో రోష్ని నాడార్ భారత్లోనే అత్యధిక సంపద గల మహిళగా అగ్రస్థానంలో నిలిచారు. -
ఎఫ్పీఐలను మెప్పిస్తున్న ఐటీ షేర్లు
దేశీయ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగ షేర్లపై విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐ) సానుకూల వైఖరినే కలిగి ఉన్నారు. ఎఫ్పీఐలు ఆర్థిక సంవత్సరపు తొలి త్రైమాసికంలో జరిపిన క్రయ, విక్రయాల గణాంకాలను పరిశీలిస్తే ఈ విషయం అవగతం అవుతుంది. ఈ క్యూ1లో వారు టీసీఎస్, ఎల్అండ్ టెక్నాలజీస్, ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ షేర్లకు కొనుగోలు చేశారు. హెచ్సీఎల్, విప్రో కంపెనీల షేర్లను విక్రయించారు. అలాగే మైండ్ట్రీ, పర్సిస్టెంట్ సిస్టమ్స్, ఈ కార్లెక్స్ సర్వీసెస్, సోనాటా సాఫ్ట్వేర్, ఎన్ఐఐటీ టెక్నాలజీస్ కంపెనీల్లో 2శాతం వరకు తమ వాటాలను తగ్గించుకున్నాయి. ఇన్ఫోసిస్కు షేర్ల విషయంలో ఎఫ్పీఐల వైఖరీ ఎలా ఉందో అనే విషయం నేడు(క్యూ1 ఫలితాలు విడుదల)తెలిస్తోంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి బీఎస్ఈ ఐటీ ఇండెక్స్ 6.7శాతం లాభపడింది. అయితే బీఎస్ఈలో సెన్సెక్స్ మాత్రం 10.9శాతం నష్టపోయింది. ఇదే క్యూ1లో టీసీఎస్లో ఇన్వెస్టర్లు 0.11శాతం వాటాకు సమానమైన ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశారు. ఫలితంగా కంపెనీలో ఎఫ్పీఐల మొత్తం వాటా 15.85శాతానికి చేరుకుంది. ఇదే తొలి త్రైమాసికంలో మ్యూచువల్ ఫండ్స్ టీసీఎస్లో తమ వాటాను 2.55శాతం నుంచి 2.51శాతానికి తగ్గించుకున్నారు. ఎల్అండ్టీ ఇన్ఫోటెక్, ఎల్అండ్టీ టెక్నాలజీ సర్వీసెస్ రంగాల్లో ఎఫ్పీఐల వాటా జీవితకాల గరిష్టాన్ని అందుకుంది. లాక్డౌన్ విధింపుతో వ్యవస్థ అంతా స్తంభించుకుపోయింది. అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా టెక్నాలజీ రంగం మిగతా అన్ని రంగాల కంటే ఎక్కువ లాభపడింది. ఈ అంశం ఇన్వెస్టర్లను ఆకర్షించగలిగింది. క్లౌడ్ కంప్యూటింగ్, నెట్వర్కింగ్లో అవకాశాలు కొంతమందికి కొత్త అవకాశాలను అందించాయి. ఇప్పటివరకు ఐటీ షేర్లు బాగుందని ఇక ముందు ఈ రంగ షేర్ల ఎంపిక పట్ల జాగ్రత అవసరం. యూఎస్ అమెరికా ఆర్థిక వ్యవస్థలు రికవరీకి మరింత సమయం పడుతుందనే అంచనాలు ఉన్నాయి. ఇది ఐటీ కంపెనీల ఖర్చు, డిమాండ్ ప్రభావితం చేయగలవు.’’ అని ఈక్వినామిక్స్ రీసెర్చ్ ఫౌండ్ జి జొక్కాలింగం తెలిపారు. -
ఇంటర్ పాసైన వారికి హెచ్సీఎల్ గుడ్ న్యూస్
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ టెక్ సేవల సంస్థ హిందుస్థాన్ కంప్యూటర్స్ లిమిటెడ్ (హెచ్సీఎల్) టెక్నాలజీస్ టెక్ బీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఆధునిక టెక్నాలజీలో శిక్షణ ఇవ్వనుంది. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న ఈ ‘‘టెక్ బీ’’ కార్యక్రమాన్ని వివిధ రాష్ట్రాల్లో ఏర్పాటు చేయనున్నట్లు గురువారం ప్రకటించింది. ఉత్తరప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్టుగా టెక్బీ కార్యక్రమాన్ని రెండేళ్ల క్రితం చేపట్టామని హెచ్సీఎల్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శివశంకర్ వెల్లడించారు.ఇక్కడ మంచి ఫలితాలను సాధించామని చెప్పారు. ఈ టెక్బీ ప్రోగ్రాం ద్వారా విద్యార్థులు త్వరగా ఉద్యోగాల్లో చేరడంతోపాటు, ఆర్థిక స్వావలంబన సాధించాలని, తద్వారా ట్రెండ్ సెట్టర్స్గా నిలవాలని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం 700 మంది విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి తమ కంపెనీలో ఉద్యోగులయ్యారని వెల్లడించారు. ఈ నేపథ్యంలో దక్షిణాన తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోదృష్టిపెట్టనున్నామని, ఉత్తరాన హర్యానా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మహారాష్ట్రల్లో ఏర్పాటు చేస్తామని ఆమె తెలిపారు. ఈ రాష్ట్రాలలో తమ అభివృద్ధి కేంద్రాలు ఉన్నాయని, అందుకే ఈ టెక్ బీ కేంద్రాలని ప్రారంభించాల్సిన అవసరం ఉందని భావిస్తున్నామన్నారు. అయితే ఈ ప్రోగ్రాంలో చేరాలంటే ఇంటర్మీడియట్లో తప్పనిసరిగా మాథ్స్ ఒక సబ్జెక్టుగా కలిగి 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థుల ఈ ఎంపిక ఉంటుంది. ఇలా ఎంపికైన విద్యార్థులకు నెలకు రూ.10వేల స్టైపెండ్ ఇస్తామని ఆమె చెప్పారు. ఈ ప్రోగ్రామ్ కాల పరిమితి ఒక సంవత్సరం. ఫీజు రూ.2లక్షలు. అయితే దీనికి లోన్ సదుపాయం ఉంది. ఉద్యోగం వచ్చిన తరువాత ఈమొత్తాన్ని ఈఎంఐ ద్వారా చెల్లించవచ్చు. అలాగే ఇక్కడ శిక్షణపూర్తి చేసుకున్న విద్యార్థులకు 2.5 లక్షల రూపాయల వార్షిక వేతనంతో ఉద్యోగావకాశాలుకల్పిస్తామని శివశంకర్ ప్రకటించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫండమెంటల్స్, సాఫ్ట్వేర్ టూల్స్, లైఫ్స్కిల్స్ తదితర అంశాలపై ఈ టెక్ బీ ప్రోగ్రాంలో విద్యార్థులకు శిక్షణ ఉంటుంది. అలాగే ఈ శిక్షణ అనంతరం బిట్స్ పిలానీ, శస్త్ర (ఎస్ఏఎస్టీఆర్ఏ)లాంటి ప్రముఖ యూనివర్సిటీలకు చెందిన ఉన్నత విద్యా కోర్సుల్లో చేరవచ్చన్నారు. -
హెచ్సీఎల్ టెక్ లాభం 2,550 కోట్లు
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం హెచ్సీఎల్ టెక్నాలజీస్ గత ఆర్థిక సంవత్సరం(2018–19) మార్చి క్వార్టర్లో రూ.2,550 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్)సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017–18) ఇదే క్వార్టర్లో రూ.2,230 కోట్ల నికర లాభం వచ్చిందని హెచ్సీఎల్ టెక్నాలజీస్ తెలిపింది. ఆదాయం రూ.13,178 కోట్ల నుంచి 21% వృద్ధితో రూ.15,990 కోట్లకు పెరిగిందని హెచ్సీఎల్ టెక్నాలజీస్ ప్రెసిడెంట్, సీఈఓ సి. విజయ్కుమార్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం 14–16 శాతం రేంజ్లో వృద్ధి చెందగలదన్న అంచనాలున్నాయని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 1,000 కోట్ల డాలర్ల(రూ.70,258 కోట్లు) ఆదాయం సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామన్నారు. ఒక్కో షేర్కు రూ.2 మధ్యంతర డివిడెండ్ను ఇవ్వనున్నామని తెలిపారు. డిమాండ్ జోరుగానే.... ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2018–19లో నికర లాభం 16 శాతం వృద్ధితో రూ.10,120 కోట్లకు, ఆదాయం 19% వృద్ధితో రూ.60,427 కోట్లకు పెరిగాయని విజయ్కుమార్ పేర్కొన్నారు. స్థిర కరెన్సీ ప్రాతిపదికగా చూస్తే, గత ఆర్థిక సంవత్సరంలో 12% ఆదాయ వృద్ధిని సాధించామని, అంచనాలను అందుకున్నామని వివరించారు. డాలర్ల పరంగా చూస్తే, నికర లాభం 6% వృద్ధితో 36.4 కోట్ల డాలర్లకు, ఆదాయం 12% వృద్ధి తో 220 కోట్ల డాలర్లకు పెరిగాయని వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తమకే కాకుండా, ఐటీ పరిశ్రమకు కూడా ఉత్తమ సంవత్సరం కానున్నదని పేర్కొన్నారు. టెక్నాలజీ సర్వీసులు, ఉత్పత్తులకు డిమాండ్ జోరుగా ఉండనున్నదని పేర్కొన్నారు. ఇక గత క్యూ4లో స్థూలంగా 14,249 మందికి ఉద్యోగాలిచ్చామని, మొత్తం ఉద్యోగుల సంఖ్య ఈ ఏడాది మార్చినాటికి 1,37,965కు పెరిగిందని విజయకుమార్ వివరించారు. ఏడాది కాలంలో ఆట్రీషన్ రేటు (ఉద్యోగుల వలస) 17.7%గా ఉందని పేర్కొన్నారు. మార్కెట్ ముగిసిన తర్వాత ఫలితాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బీఎస్ఈలో హెచ్సీఎల్ టెక్నాలజీస్ షేర్ ఫ్లాట్గా రూ.1,132 వద్ద ముగిసింది. -
ప్రముఖ ఐటీ సంస్థలో 30వేల ఉద్యోగాలు
సాక్షి,ముంబై: దేశీయ నాలుగవ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ హెచ్సీఎల్ టెక్ శుభవార్త చెప్పింది. ఈ ఏడాది భారీ సంఖ్యలో ఉద్యోగులను నియమించు కోనున్నట్టు తెలిపింది. ముఖ్యంగా స్టాక్ (అబ్స్ట్రాక్ట్ డేటా) ఇంజనీర్లను నియమించుకుంటామని తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరానికి అంచనా వేసిన గైడెన్స్ ప్రకారం వృద్ధిరేటును సాధించేందుకు 25-30వేల వరకు ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంటామరని హెచ్సీఎల్ హెచ్ఆర్ విభాగం ముఖ్య అధికారి వి అప్పారావు ఒక మీడియా ఇంటర్వ్యూలో తెలిపారు. అలాగే అమెరికాలో స్థానికులకు 65శాతం ప్రాధాన్యత నిచ్చిన నేపథ్యంలో డిపెండెన్స్ వీసాలు బాగా తగ్గాయన్నారు. దీంతోపాటు వీసాల జారీ అస్యంగా కారణంగా హెచ్1బీ , ఎల్1బీ వీసాల సంఖ్య క్షీణించిందని అప్పారావు వెల్లడించారు. ఈ ఏడాది 640హెచ్1బీ వీసాలకు దరఖాస్తు చేయగా 400మందికి అనుమతి లభించినట్టు తెలిపారు. సెప్టెంబరు 30నాటి కంపెనీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 12875 ఉండగా క్యూ2లో అదనంగా మరో 3754మంది చేరారని కంపెనీ ఫలితాల సందర్భంగా వివరించింది. -
10% తగ్గిన హెచ్సీఎల్ టెక్ లాభం
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం హెచ్సీఎల్ టెక్నాలజీస్ నికర లాభం (కన్సాలిడేటెడ్) గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో 10 శాతం తగ్గింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2016–17) క్యూ4లో రూ.2,474 కోట్లుగా ఉన్న నికర లాభం గత క్యూ4లో రూ.2,230 కోట్లకు తగ్గిందని హెచ్సీఎల్ టెక్నాలజీస్ తెలిపింది. 2016–17 క్యూ4లో పన్ను రివర్సల్ ప్రయోజనం లభించిందని.. అందుకే ఆ క్వార్టర్లో రూ.2,474 కోట్ల మేర నికర లాభం వచ్చిందని సంస్థ ప్రెసిడెంట్, సీఈఓ సి. విజయ్కుమార్ చెప్పారు. సీక్వెన్షియల్గా చూస్తే, నికర లాభం 8 శాతం వృద్ధి చెందిందన్నారు. మొత్తం ఆదాయం రూ.13,183 కోట్ల నుంచి 2 శాతం వృద్ధితో రూ.13,480 కోట్లకు పెరిగింది. డాలర్ల పరంగా చూస్తే ఆదాయం 2.5 శాతం వృద్ధితో 204 కోట్ల డాలర్లకు ఎగసింది. ఇబిటా 9 శాతం వృద్ధితో (సీక్వెన్షియల్గా) రూ.3,305 కోట్లకు పెరగ్గా, నిర్వహణ లాభ మార్జిన్ 18.4 శాతం నుంచి 19.6 శాతానికి వృద్ధి చెందింది. ఒక్కో షేర్కు రూ.2 మధ్యంతర డివిడెండ్ను ఇవ్వనున్నట్లు కంపెనీ ప్రకటించింది. అంచనాలు అందుకున్నాం... పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, నికర లాభం 1 శాతం వృద్ధితో రూ.8,722 కోట్లకు, మొత్తం ఆదాయం 6 శాతం వృద్ధితో రూ.51,786 కోట్లకు పెరిగాయి. నిలకడ కరెన్సీ పరంగా చూస్తే, ఆదాయం 11 శాతం వృద్ధితో 780 కోట్ల డాలర్లకు పెరిగింది. ఇబిటా మార్జిన్ 19.7 శాతం చొప్పున వృద్ధి చెందిందని, అంచనాలను అందుకున్నామని విజయ్కుమార్ చెప్పారు. తదుపరి తరం డిజిటల్ సర్వీసుల విభాగంపై 10 కోట్ల డాలర్లు ఇన్వెస్ట్ చేశామని, డిజిటల్ సర్వీసులు, ఐపీ విభాగాలు కలిసి 42 శాతం వృద్ధి చెందాయని, మొత్తం ఆదాయంలో వీటి వాటా 23 శాతమని పేర్కొన్నారు. డిజిటల్ జోరు... గత ఆర్థిక సంవత్సంలోనూ, క్యూ4లోనూ మంచి పనితీరు కనబరిచామని విజయ్ కుమార్ సంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని విభాగాలు మంచి వృద్ధిని సాధించాయని, కొత్త క్లయింట్ల సంఖ్య జోరుగా పెరిగిందని, ఆదాయాలు బాగా పెరిగాయని తెలియజేశారు. డిజిటల్ సర్వీసుల జోరుతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మంచి డీల్స్ సాధించగలమన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి అంచనాలు 9.5–11.5 శాతం రేంజ్లో ఉండగలవని అంచనా వేశారు. నిర్వహణ మార్జిన్లు 19.5–20.5 శాతం రేంజ్లో ఉండొచ్చన్నారు. కార్యకలాపాలను మరింత పటిష్టం చేసుకునే ప్రయత్నాల్లో భాగంగా జర్మనీ, కెనడా, దక్షిణాఫ్రికా దేశాల్లోని కంపెనీలను కొనుగోలు చేయనున్నామని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 25 కోట్ల డాలర్ల మేర పెట్టుబడులు పెట్టనున్నామని, నాగ్పూర్, లక్నో, మదురైల కార్యాలయాల విస్తరణకు, విదేశాల్లో విస్తరణకు కూడా ఈ నిధులు వినియోగిస్తామని కంపెనీ సీఎఫ్ఓ అనిల్ చనన చెప్పారు. వేతనాల పెంపు ఈ ఏడాది మార్చి నాటికి మొత్తం ఉద్యోగుల సంఖ్య 1.2 లక్షలుగా ఉందని, ఆట్రిషన్ రేటు (ఉద్యోగులు ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారడం) 15.5 శాతంగా ఉందని విజయ్ కుమార్ తెలిపారు. జూలై క్వార్టర్ నుంచి ఉద్యోగుల వేతనాలు పెంచనున్నామని, ఎంత మేర పెంచాలనే విషయమై ప్రస్తుతం కసరత్తు జరుగుతోందని వివరించారు. 5 శాతం తగ్గిన షేర్ ధర.. నికర లాభం 10 శాతం తగ్గడంతో హెచ్సీఎల్ టెక్నాలజీస్ షేర్ 5 శాతం నష్టపోయింది. బీఎస్ఈలో 4.7 శాతం నష్టంతో రూ.1,001 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.7,009 కోట్లు తగ్గి రూ.1,39,371 కోట్లకు పడిపోయింది. -
ఇన్ఫీ బైబ్యాక్ రెడీ..!
► 19న బోర్డు సమావేశంలో నిర్ణయం... ► రూ.13,000 కోట్ల విలువైన షేర్లను తిరిగి కొనుగోలు చేసే అవకాశం ► కంపెనీ చరిత్రలో తొలి బైబ్యాక్... ► భారీగా ఉన్న నగదు నిల్వలను వాటాదారులకు పంచడమే లక్ష్యం ► తాజా ప్రకటనతో 5 శాతం దూసుకెళ్లిన షేరు బెంగళూరు: దేశంలో రెండో అతిపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్.. షేర్ల బైబ్యాక్కు రంగం సిద్ధమైంది. వాటాదారుల నుంచి షేర్లను తిరిగి కొనుగోలు చేసే(బైబ్యాక్) ప్రతిపాదనపై ఈ నెల 19న(శనివారం)బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు కంపెనీ గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఎంతమొత్తంలో బైబ్యాక్ ఉంటుందనేది ఇన్ఫీ వెల్లడించనప్పటికీ.. సుమారు రూ.13,000 కోట్లుగా ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనావేస్తున్నాయి. కంపెనీ వద్దనున్న భారీ నగదు నిల్వలను వాటాదారులకు పంచాలంటూ కొంతమంది ప్రమోటర్లు, ఇతర మాజీ ఎగ్జిక్యూటివ్లు చాన్నాళ్లుగా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డివిడెండ్ లేదా షేర్ల బైబ్యాక్ లేదా రెండింటి రూపంలో వాటాదారులకు దాదాపు రూ.13,000 కోట్లను చెల్లించనున్నట్లు ఇన్ఫోసిస్ ఏప్రిల్లోనే ప్రకటించింది. కాగా, 36 ఏళ్ల ఇన్ఫోసిస్ చరిత్రలో ఇదే తొలి షేర్ల బైబ్యాక్ కానుండటం గమనార్హం. ఇతర దిగ్గజాల బాటలోనే... దేశీ సాఫ్ట్వేర్ అగ్రగామి టీసీఎస్ మొదలు... విప్రో, హెచ్సీఎల్ టెక్, కాగ్నిజెంట్, మైండ్ట్రీ ఇతరత్రా పలు ఐటీ కంపెనీలు ఇటీవల వరుసపెట్టి షేర్ల బైబ్యాక్ను ప్రకటించిన సంగతి తెలిసిందే. టీసీఎస్ రూ.16,000 కోట్ల షేర్లను బైబ్యాక్ చేయగా... కాగ్నిజెట్ 3.4 బిలియన్ డాలర్ల బైబ్యాక్ను చేపట్టింది. ఈ వరుస బైబ్యాక్ల ఒత్తిడితో ఇన్ఫోసిస్ కూడా ఎట్టకేలకు ముహూర్తాన్ని ఖరారు చేసింది. ఈ ఏడాది జూన్ చివరినాటికి ఇన్ఫోసిస్ వద్ద 6 బిలియన్ డాలర్లకు పైగా (సుమారు రూ.39,000 కోట్లు) నగదు నిల్వలు ఉన్నాయి. జూన్లో జరిగిన సర్వసభ్య సమావేశం(ఏజీఎం)లోనే రూ.13,000 కోట్ల నగదు నిల్వల కేటాయింపు ప్రణాళికలపై కసరత్తు చేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. కాగా, బైబ్యాక్కు తమ బోర్డు ఆమోదం తెలిపితే... అమెరికాలో కూడా ఏడీఆర్ ల బైబ్యాక్ కోసం యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్చంజ్ కమిషన్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుందని ఇన్ఫోసిస్ పేర్కొంది. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాతే బైబ్యాక్ చేపట్టేందుకు వీలవుతుందని తెలిపింది. వెంటాడుతున్న అనిశ్చితి...: మార్కెట్ పరిస్థితులు సరిగ్గాలేనప్పుడు షేరు ధరకు పునరుత్తేజం కల్పించడం కోసం, అదేవిధంగా మిగులు నగదును వాటాదారులకు పంచడం కోసం కంపెనీలు ఈ షేర్ల బైబ్యాక్ను ప్రకటిస్తూ ఉంటాయి. మార్కెట్లో ప్రస్తుత ధరతో పోలిస్తే భారీగానే ప్రీమియం రేటును ఆఫర్ చేస్తుంటాయి. వాటాదారుల నుంచి షేర్లను వెనక్కి తీసుకోవడంతో షేర్ల సంఖ్య తగ్గి ఒక్కో షేరుపై రాబడి(ఈపీఎస్) మెరుగుపడేందుకు దోహదం చేస్తుంది. అమెరికా సహా పలు దేశాలు ఇటీవల వీసా నిబంధనలను కఠినతరం చేయడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఐటీకి డిమాండ్ మందగిండచంతో దేశీ సాఫ్ట్వేర్ కంపెనీలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. లాభాలను నిలబెట్టుకోవడం కోసం ఉద్యోగాల కోతలకు కూడా వెనుకాడటం లేదు. ఈ మందగమన పరిస్థితులు కూడా ఐటీ సంస్థల వరుస బైబ్యాక్లకు ఒక కారణంగా పరిశీలకులు పేర్కొంటున్నారు. షేరు రయ్... బైబ్యాక్ ప్రకటన వెలువడటంతో ఇన్ఫోసిస్ షేరు దూసుకుపోయింది. గురువారం బీఎస్ఈలో దాదాపు 5 శాతంపైగానే ఎగబాకి రూ.1,026ను తాకింది. చివరకు 4.5 శాతం లాభంతో రూ.1,021 వద్ద ముగిసింది. ఒక్కరోజులోనే కంపెనీ మార్కెట్ విలువ రూ.10,190 కోట్లు దూసు కెళ్లి రూ.2,34,555 కోట్లకు చేరింది. ప్రమోటర్ల ఒత్తిడితో... ఎన్ఆర్ నారాయణ మూర్తి సహా కొందరు ప్రమోటర్లు కొంతకాలంగా ఇన్ఫోసిస్ యాజమాన్యంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ప్రధానంగా కంపెనీ సీఈఓ విశాల్ సిక్కాతో పాటు ఇతరత్రా కొందరు టాప్ ఎగ్జిక్యూటివ్ల వేతన ప్యాకేజీలను భారీగా పెంచడం, కంపెనీని వీడిపోయిన కొంతమంది ఎగ్జిక్యూటివ్లకు భారీమొత్తంలో వీడ్కోలు ప్యాకేజీలను ఇవ్వడాన్ని ప్రమోటర్లు తీవ్రంగా తప్పుబట్టారు. కంపెనీలో కార్పొరేట్ గవర్నెన్స్ సరిగ్గా లేదంటూ ఆరోపణలు కూడా గుప్పించారు. మరోపక్క, మోహన్దాస్ పాయ్ వంటి ఇతర మాజీ ఎగ్జిక్యూటివ్లు కూడా యాజమాన్య నిర్ణయాలపై నిరసన గళం వినిపిస్తున్నారు. భారీగా ఉన్న నగదు నిల్వలను ఇష్టానుసారం ఖర్చుచేయకుండా వాటాదారులకు పంచాలని, బైబ్యాక్ను ఆఫర్ చేయాలనేది వారి దీర్ఘకాల డిమాండ్. ఈ నేపథ్యంలో ఇన్ఫోసిస్ బైబ్యాక్ ప్రక్రియకు తెరతీసింది. 2014లో తాను ఇన్ఫీ చైర్మన్ పదవినుంచి వైదొలగడం పట్ల ఇప్పుడు చింతిస్తున్నానని.. కొనసాగాలంటూ తన సహచరులు(కో–ఫౌండర్స్) ఇచ్చిన సూచనలను వినిఉండాల్సిందంటూ మూర్తి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కంపెనీలో మళ్లీ ఏదైనా బాధ్యతలను చేపట్టాలని నారాయణమూర్తి భావిస్తే.. పరిశీలించేందుకు తాము సిద్ధమేనంటూ ఇటీవల ఇన్ఫీ సహ–చైర్మన్ రవి వెంకటేశన్ పేర్కొన్నట్లుగా వార్తలు వచ్చాయి. -
హెచ్సీఎల్ లాభం డౌన్..గైడెన్స్ భేష్
ముంబై: ఐటీ మేజర్ , సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ప్రొవైడర్ హెచ్సీఎల్ టెక్నాలజీస్ తొలి త్రైమాసికంలో లాభాలు భారీగా క్షీణించాయి. గురువారం ప్రకటించిన క్వార్టర్ 1 ఫలితాల్లో నికర లాభాలు 11 శాతం పడిపోయాయి. సీక్వెన్షియల్ లాభాలు 6.6 శాతం క్షీణించి రూ.2,171 కోట్లకు పడిపోయాయి. తక్కువ ఆదాయం అధిక పన్ను వ్యయంతో హెచ్సీఎస్ ఫలితాలు ప్రభావితమైనట్టు అంచనా. అయితే బెటర్ ఆపరేషనల్ పెర్ఫామెన్స్ కారణంగా కంపెనీ వృద్ధి క్షీణతకు బ్రేక్ వేసింది. అయితే ఎబిటా మార్జిన్లు 1.6 వృద్ధిని నమోదు చేసి రూ. 2,444 కోట్లను సాధించింది. మార్జిన్లు 20.1 శాతం పుంజుకున్నాయి. వీటిని 19.5 పెరిగి రూ.2383గా ఉంటుందని విశ్లేషకులు అంచనావేశారు. ఈ త్రైమాసికంలో ఆదాయం 0.8 శాతం పెరిగి రూ .12,149 కోట్లకు చేరింది. డాలర్ల ఆదాయం 3.7 శాతం పెరిగి 1,884.2 మిలియన్ డాలర్లకు చేరింది. 2018 ఆర్థిక సం.రం గైడెన్స్ను 10.5-12.5 గా ప్రకటించింది. దీంతో హెచ్సీఎల్ టెక్ 52 వారాల గరిష్ట స్థాయికి చేరింది. హెచ్సీఎల్ కౌంటర్ 4 శాతం పైగా లాభంతో ట్రేడవుతోంది. 1-2-3 పెరుగుదల వ్యూహంలో ముందుకు సాగుతున్నామని హెచ్సీఎల్ టెక్నాలజీస్ సీఈవో విజరుకుమార్ చెప్పారు. డాలర్ పరిధిలో క్వార్టర్ ఆన్ క్వార్టర్ 2.6శాతం, ఇయర్ ఆన్ ఇయర్ 12.2 శాతం రెవెన్యూ వృద్ధిని సాధించామన్నారు. అయితే 2018 ఆర్థిక సంవత్సరంలో మెరుగైన గైడెన్స్ను ప్రకటించడం విశేషం. -
తీపి కబురు చెప్పిన హెచ్సీఎల్ టెక్
ముంబై: ప్రముఖ ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్నాలజీస్ లిమిటెడ్ ఇన్వెస్టర్లకు తీపి కబురును అందించింది. భారీ షేర్ల బై బ్యాక్ చేయనుంది. ఈ మేరకు సంస్థ బోర్డు ఆమోదం తెలిపింది. గరిష్టంగా రూ.3500 కోట్ల విలువైన షేర్ల బై బ్యాక్ చేయనుంది. దేశంలో నాల్గవ అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ షేరు ధర. రూ.1000దగ్గర ఈ బై బ్యాక్ చేపట్టనున్నట్టు మార్కెట్ ఫైలింగ్లో వెల్లడించింది. ఇన్వెస్టర్ల వ్యాల్యూ పెంచేందుకు గాను టీసీఎస్, కాగ్నిజెంట్బాటలో పయనించిన సంస్థ ఈ ఆఫర్ ను ప్రకటించింది. కాగా డిసెంబర్ 31 వరకు కంపెనీ వద్ద సుమారు1,88 5 మిలియన్ల డాలర్ల నిల్వలున్నాయి. ఫిక్స్ డ్ డిపాజిట్లు మరో రూ.10,507 కోట్లున్నాయి. కంపెనీ 1.41 బిలియన్ ఈక్విటీ షేర్లు కలిగి ఉంది. గత 56 వరుస త్రైమాసికాల్లో డివిడెండ్లను చెల్లించింది. టీసిఎస్ తరహలో మెగా బై బ్యాక్ ఆఫర్ చేయకపోయినా బై బ్యాక్ మాత్రం తప్పనిసరి అని గతంలోనే సంస్థ ప్రకటించింది. మరోవైపు టాటా కన్సల్టెన్సీ ,కాగ్నిజెంట్ సంస్థలు షేర్ల బై బ్యాక్ ను ప్రకటించగా, మరో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వచ్చే నెల ప్రకటించే అవకాశం ఉంది. -
అదరగొట్టిన ఐటీ దిగ్గజం
ముంబై: దేశీయ్ నాలగవ అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్నాలజీస్ క్వార్టర్ 3లో మెరుగైన ఫలితాలను సాధించింది. నికర లాభాల్లో 7.8 శాతం పెరుగుదలను నమోదు చేసింది. డిసెంబర్ తో ముగిసిన మూడవ త్రైమాసికంలో రూ. 2,070 కోట్ల లాభాలను సాధించింది. గత ఏడాది లాభాలు రూ.1,920కోట్లగా ఉంది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఆదాయం 14.2 శాతం పెరిగి రూ.11,814 కోట్లను ఆర్జించింది. గత ఏడాది ఇదే క్వార్టర్ లో ఇది రూ.10,341కోట్లగా ఉంది. డాలర్ రూపంలో నికర లాభాలు 5.2 శాతం వృద్ధిని నమోదు చేసి 306 మిలియన్ డాలర్లను రిపోర్ట్ చేసింది. డాలర్ ఆదాయం 11.4శాతం ఎగిసి 1.74 బిలియన్ డార్లను ఆర్జించింది. అలాగే షేర్ కు 6 బోనస్ ప్రకటించింది. నోయిడా ఆధారిత హెచ్ సీఎల్ ఆర్థిక ఫలితాల్లో మార్కెట్ అంచనాలను బీట్ చేసింది. 2017 ఆర్థిక సంవత్సరంలో కూడా ఇదే ఫలితాలను అంచనావే స్తున్నట్టు హెచ్ సీఎల్ టెక్నాలజీస్ ప్రెసిడెంట్, సీఈవో సి.విజయ్ కుమార్ తెలిపారు. హెచ్సిఎల్ టెక్ అన్ని రెవెన్యూ విభాగాల్లో విస్తృత వృద్దిని నమోదు చేసినట్టు తెలిపారు. డిసెంబరు త్రైమాసికంలో రూ 2,214.5 కోట్ల నగదు సమానత వచ్చిందన్నారు. అమెరికా, యూరప్ ఆదాయం వరుసగా 13.6 శాతం 17.6 శాతంగాఉంది. కాగా 8,467 మంది అదనంగా చేరగా... 2016 డిసెంబర్ నాటికి మొత్తం సిబ్బంది సంఖ్య 1,11,092. ఉద్యోగుల వలన 17.9 వద్ద నిలిచింది. మార్కెట్ ఆరంభంలో 2.37 శాతానికిపై గా నష్టపోయిన హెచ్ సీఎల్ షేరు నష్టాలను తగ్గించుకొంది. -
హెచ్సీఎల్ ఫలితాలు భేష్... అమెరికా కంపెనీ కొనుగోలు
ముంబై: దేశంలో నాలుగవ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ హెచ్సీఎల్ టెక్నాలజీస్ శుక్రవారం మెరుగైన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్తో ముగిసిన క్యూ2లో ఉత్సాహకరమైన ఫలితాలను ప్రకటించి ఎనలిస్టుల అంచనాలను అధిగమించింది. 17 శాతం వృద్ధితో రూ. 2,016 కోట్ల నికర లాభాలను నమోదు చేసింది. మొత్తం ఆదాయం కూడా 14 శాతంపైగా పుంజుకుని రూ. 11,519 కోట్లను సాధించింది. డాలర్ రెవెన్యూ కూడా 2 శాతం జంప్ చేసి 1722మిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది.క్యూ2లో నిర్వహణ లాభం(ఇబిటా) రూ. 2318 కోట్లు, ఇబిటా మార్జిన్లు 20.1 శాతంగా నమోదయ్యాయి. దీంతో ప్రస్తుతం హెచ్సీఎల్ టెక్ షేరు 4 శాతం లాభాలతో ట్రేడవుతోంది. మరోవైపు2016-17ఆర్థిక సంవత్సరానికి గాను 12-14 శాతం ఆదాయ వృద్ధి అంచనా(గెడెన్స్)లను యథాతథంగా ఉంచింది. అమెరికాకు చెందిన బట్లర్ అమెరికా ఏరోస్పేస్ సంస్థను కొనుగోలు చేసినట్లు హెచ్సీఎల్ టెక్ వెల్లడించింది. అమెరికా ఏరోస్పేస్, డిఫెన్స్ కస్టమర్లకు ఇంజనీరింగ్ అండ్ డిజైన్ సేవలు అందిస్తున్న ఈ సంస్థ స్వాధీనానికి 8.5 కోట్ల డాలర్లను చెల్లించనున్ననట్టు తెలిపింది. నగదు రూపంలో 85 మిలియన్ డాలర్లను చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. ఈ ఏడాది డిశెంబర్ నాటికి అమెరికా సహా దేశం రెగ్యులేటరీ అనుమతులు పూర్తి కానున్నట్టు పేర్కొంది. ప్రస్తుతం సీవోవోగా బాధ్యతలు నిర్వహిస్తున్న విజయ్కుమార్కు పదోన్నతి కల్పించినట్టు బీఎస్ఈ ఫైలింగ్లో కంపెనీ తెలిపింది. అతణ్ని సీఈవోగా నియమించినట్టు, అక్టోబర్ 20నుంచి ఈ నియామకం అమల్లోకి వచ్చినట్టు ప్రకటించింది. -
లాభాల బూమ్తో హెచ్సీఎల్ షేర్లు జంప్
దేశీయ నాలుగో అతిపెద్ద ఐటీ సర్వీసుల ఎగుమతిదారు హెచ్సీఎల్ టెక్నాలజీస్ అన్ని కొలమానాలో విశ్లేషకుల అంచనాలను అధిగమించింది. బుధవారం ప్రకటించిన 2016-17 జూన్తో ముగిసిన తొలి త్రైమాసిక లాభాల్లో కంపెనీ 6 శాతం ఎగిసి, రూ.2,047 కోట్లగా నమోదుచేసింది. రెవెన్యూలు సైతం 6.3 శాతం పెంచుకుని రూ.11,336 కోట్లగా రికార్డు చేసింది. అయితే హెచ్సీఎల్ కేవలం రూ.1,860 కోట్ల లాభాలను మాత్రమే ఆర్జిస్తుందని విశ్లేషకులు అంచనావేశారు. విశ్లేషకుల అంచనాలు అధిగమించి హెచ్సీఎల్ లాభాలు రికార్డు చేయడంతో, నేటి ట్రేడింగ్లో ఆ కంపెనీ షేర్లు మెరుపులు మెరిపిస్తున్నాయి. 7 శాతం మేర దూసుకెళ్తున్నాయి. డాలర్ రెవెన్యూలోనూ దేశీయ టాప్ ఐటీ కంపెనీలో కెల్లా హెచ్సీఎల్ కంపెనీనే మెరుగైన ప్రదర్శన కనబర్చింది. ఈ కంపెనీ డాలర్ రెవెన్యూలు 6.5 శాతం ఎగిసి, క్వార్టర్ ఆన్ క్వార్టర్కు రూ. 1,691 మిలియన్ డాలర్లుగా రికార్డు అయ్యాయి. రెవెన్యూ, మార్జిన్ గైడెన్స్తో ఆర్థిక సంవత్సరం 2017లో కంపెనీ వృద్ధి అంచనాలను పెంచేసింది. స్థిరమైన కరెన్సీతో రెవెన్యూ వృద్ది 12-14 శాతం ఉంటుందని హెచ్సీఎల్ టెక్ అంచనావేస్తోంది. ఈ వృద్ధి డాలర్లో 11.2 శాతం నుంచి 13.2 శాతం ఉంటుందని పేర్కొంది. ఆపరేటింగ్ మార్జిన్లు 19.5 శాతం నుంచి 20.5 శాతం మధ్యలో ఎగుస్తాయని హెచ్సీఎల్ తెలిపింది. మెరుగైన ఆర్థిక ఫలితాలతో హెచ్సీఎల్ ఒక్క షేరుకు 6 రూపాయల డివిడెంట్ ప్రకటించింది. ఆగస్టు 19 నుంచి ఈ డివిడెంట్ చెల్లించనున్నట్టు తెలిపింది. -
అంచనాలను అందుకోలేని హెచ్ సీఎల్
భారత బహుళ జాతి టెక్నాలజీ సంస్థ హెచ్ సీఎల్ ఈ త్రైమాసింకంలో మార్కెట్ నిపుణుల అంచనాలను అందుకోలేకపోయింది. వారి అంచనాలను తాకలేక జనవరి-మార్చి త్రైమాసికంలో కేవలం 0.3శాతం నికర ఆదాయాలనే నమోదుచేసింది. క్యూ3లో రూ.1,939 కోట్లగా ఉంటాయనుకున్న నికరలాభాలను రూ. 1926 కోట్లగానే కంపెనీ ఫలితాలు చూపించాయి. అంచనాలకు కిందగానే అమ్మకాలను సైతం రూ.10,698 కోట్లగా నమోదుచేశాయి. ఇన్ఫోసిస్, విప్రో కంపెనీల రెవెన్యూ వృద్ధి కంటే తక్కువగా కేవలం 11.6శాతం రెవెన్యూ వృద్దినే హెచ్ సీఎల్ చూపించింది. హెచ్ సీఎల్ గురువారం(నేడు) ఆశించిదగ్గ ఫలితాలను విడుదల చేయకపోవడంతో, మార్కెట్లో ఆ కంపెనీ షేర్లు 5శాతం మేర పడిపోయాయి. బీసీఎస్ ఈ సెన్సెక్స్ లో రూ.799.30 వద్ద నమోదైంది. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ నిఫ్టీ ట్రేడింగ్ లో టాప్ లూజర్ నమోదైన హెచ్ సీఎల్ 1.4 శాతం పడిపోయింది. -
హెచ్సీఎల్ టెక్ లాభం 3% డౌన్
న్యూఢిల్లీ: హెచ్సీఎల్ టెక్నాలజీస్ నికర లాభం(కన్సాలిడేటెడ్) ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 3 శాతం తగ్గింది. నికర లాభం తగ్గినా, రానున్న క్వార్టర్లలో మంచి పనితీరు సాధించగలమన్న ధీమాను హెచ్సీఎల్ టెక్నాలజీస్ వ్యక్తం చేసింది. గత క్యూ2లో రూ.1,873 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.1,823 కోట్లకు తగ్గిందని కంపెనీ సీఎఫ్ఓ అనిల్ చనన చెప్పారు. ఆదాయం(కన్సాలిడేటెడ్) రూ.8,735 కోట్ల నుంచి 16 శాతం వృద్ధితో రూ.10,097 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. డాలర్ ప్రాతిపదికన నికర లాభం 31 కోట్ల డాలర్ల నుంచి 9 శాతం క్షీణించి 28 కోట్ల డాలర్లకు పడిపోయిందని తెలిపారు. ఆదాయం మాత్రం 143 కోట్ల డాలర్ల నుంచి 8 శాతం వృద్ధితో 154 కోట్లకు పెరిగిందని తెలిపారు. గత కొన్ని క్వార్టర్లలో ప్రపంచ వ్యాప్తంగా డెవలప్మెంట్ సెంటర్లు, కొలాబరేషన్ సెంటర్ల ఏర్పాటు కోసం పెట్టుబడులు పెట్టడం, ప్రతిభ గల సీనియర్ ఉద్యోగులను తీసుకోవడం, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, క్లౌడ్ వంటి కొత్త టెక్నాలజీలపై పెట్టుబడుల కారణంగా నికర లాభం తగ్గిందని, వీటి కోసం గత కొన్ని క్వార్టర్లలో రూ.1,300 కోట్లు ఇన్వెస్ట్ చేశామని అనిల్ చెప్పారు. బియాండిజిటల్, నెక్స్ట్-జెన్ ఐటీఓ, ఐఓటీలపై ఇన్వెస్ట్మెంట్స్ రానున్న క్వార్టర్లలో మంచి ఫలితాలనివ్వనున్నాయని వివరించారు. యూరప్లో మంచి డీల్స్ సాధించామని, ఈ ఫలితాలు ఈ ఆర్థిక సంవత్సరం రెండో అర్థభాగంలో కనిపిస్తాయని హెచ్సీఎల్ టెక్నాలజీస్ సీఈఓ అనంత్ గుప్తా చెప్పారు. ఈ క్యూ2లో కంపెనీ 536 మంది ఉద్యోగులను తొల గించింది. దీంతో సిబ్బంది సంఖ్య 1,05,571కు తగ్గింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి నగదు, నగదు సమానమైన నిల్వలు రూ.777 కోట్ల వరకూ ఉన్నాయి. బెంగళూరు కంపెనీ కొనుగోలు బెంగళూరుకు చెందిన కాన్సెప్ట్ టు సిలికాన్ సిస్టమ్స్ ఇంజినీరింగ్ సర్వీసెస్ సంస్థను కొనుగోలు చేశామని, ఫలితంగా సెమి కండక్టర్, ఇండస్ట్రియల్ ఐఓటీ ఇండస్ట్రీలో అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేయడానికి ఈ కొనుగోలు తోడ్పడుతుందని కంపెనీ తెలిపింది. డీల్ విలువ కోటి డాలర్ల కంటే తక్కువగానే ఉందని పేర్కొంది. ఫలితాల నేపథ్యంలో హెచ్సీఎల్ టెక్నాలజీస్ షేర్ 1.23 శాతం వృద్ధితో రూ.852కు పెరిగింది. -
ఐటీ కంపెనీల షేర్లు విలవిల
హైదరాబాద్: భారత స్టాక్ మార్కెట్ లో ఐటీ కంపెనీల షేర్లు భారీగా క్షీణించాయి. మార్కెట్ అంచనాలను అధిగమించలేకపోయిన త్రైమాసిక ఫలితాల కారణంగా టీసీఎస్ నష్టాలకు లోనైంది. అలాగే టీసీఎస్ తో వీలిన వార్తలతో సీఎంసీ కంపెనీ షేరు భారీగా పతనమైంది. టీసీఎస్ 9 శాతానికి పైగా నష్టంతో 236 రూపాయల నష్టంతో 2441 వద్ద, సీఎంసీ 16 శాతం క్షీణించి 1832 రూపాయల వద్ద ముగిసాయి. టీసీఎస్ లో సీఎంసీ విలీనానికి రెండు కంపెనీల డైరెక్టర్లు ఆమోదం తెలిపారు. 1 : 1.26 నిష్పత్తి లేదా 100 సీఎంసీ షేర్లకు 79 టీసీఎస్ షేర్లు ఇవ్వడానికి ఇరు కంపెనీలు అంగీకరించారు. ఐటీ రంగ కంపెనీల షేర్లలో హెచ్ సీఎల్ టెక్ సుమారు 9 శాతంతో 150 రూపాయలు కోల్పోయింది. -
హెచ్సీఎల్ టెక్ బంపర్ ఫలితాలు
న్యూఢిల్లీ: మార్కెట్ అంచనాలను మించుతూ ఐటీ దిగ్గజం హెచ్సీఎల్ టెక్నాలజీస్ అక్టోబర్-డిసెంబర్(క్యూ2)లో భేషైన పనితీరును ప్రదర్శించింది. నికర లాభం 58%పైగా ఎగసి రూ. 1,496 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది ఇదే కాలం(అక్టోబర్-డిసెంబర్’12)లో రూ. 944 కోట్లను మాత్రమే ఆర్జించింది. ఇదే కాలానికి ఆదాయం కూడా 30% జంప్చేసి రూ. 8,184 కోట్లకు చేరింది. గతంలో రూ. 6,278 కోట్ల ఆదాయం నమోదైంది. కంపెనీ జూలై-జూన్ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తుంది. ఈ బాటలో ప్రకటించిన క్యూ2 కన్సాలిడేటెడ్ ఫలితాలివి. కాగా, 2013 జనవరి-డిసెంబర్ కాలంలో మొత్తం 5 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సాధించినట్లు కంపెనీ సీఈవో అనంత్ గుప్తా పేర్కొన్నారు. ఇది కంపెనీ చరిత్రలో తొలిసారి కాగా, యూరో దేశాల నుంచి ఐటీ సేవలకు కనిపించిన డిమాండ్కుతోడు, ఫైనాన్షియల్, ఇన్ఫ్రా, తయారీ విభాగాలలో లభించిన భారీ కాంట్రాక్ట్లు ఉత్తమ పనితీరుకు దోహదపడినట్లు కంపెనీ చైర్మన్ శివ్ నాడార్ పేర్కొన్నారు. 2013లో ఇన్ఫ్రా, తయారీ, ఫైనాన్షియల్ విభాగాలు ఒక్కొక్కటీ 1.5 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని అధిగమించాయని గుప్తా వివరించారు. కాగా, క్యూ2లో డాలర్ల రూపేణా కంపెనీ లాభం 39% పుంజుకుని 24.2 కోట్ల డాలర్లను తాకగా, ఆదాయం 14.5% పెరిగి 132 కోట్ల డాలర్లయ్యింది. క్యూ2లో సహజంగానే పనితీరు మందగిస్తుందని, అయినప్పటికీ నిర్వహణ సామర్థ్యం, వ్య యాల కట్టడి తదితర అంశాల నేపథ్యంలో మంచి పనితీరును చూపగలిగామని కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్(సీఎఫ్వో) అనిల్ చనానా పేర్కొన్నారు. మరిన్ని విశేషాలివీ... సర్వీసుల రంగంలో 15 డీల్స్ను చేజిక్కించుకుంది. ఫార్చ్యూన్ 500 కంపెనీల నుంచి లభించిన ఆర్డర్లలో ఫైనాన్షియల్, తయారీ విభాగాలు 80 శాతం వరకూ వాటాను ఆక్రమిస్తున్నాయి. డిసెంబర్ చివరినాటికి కంపెనీ వద్ద నగదు, తత్సంబంధ నిల్వల విలువ 13.51 కోట్ల డాలర్లుగా నమోదైంది. మొత్తం 844 మంది క్లయింట్లను కలిగి ఉన్న కంపెనీలో సిబ్బంది సంఖ్య 88,332కు చేరింది. స్థూలంగా 7,593 మంది, నికరంగా 1,136 మంది ఉద్యోగులు కొత్తగా జత కలిశారు.