HMPV
-
HMPV వైరస్ కలకలం.. నాలుగేళ్ల బాలుడికి పాజిటివ్
అహ్మదాబాద్: దేశంలో చైనా వైరస్ హెచ్ఎంపీవీ కేసుల సంఖ్య క్రమంలో పెరుగుతోంది. తాజాగా గుజరాత్ నాలుగేళ్ల బాలుడు వైరస్ బారినపడ్డాడు. బాలుడికి హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ (HMPV) సోకింది. ప్రస్తుతం ఆసుపతత్రిలో బాలుడికి చికిత్స జరుగుతున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ పాజిటివ్ కేసుతో గుజరాత్ హెచ్ఎంపీ బాధితుల సంఖ్య ఎనిమిది చేరింది.వివరాల ప్రకారం.. జనవరి 28న అహ్మదాబాద్లోని గోటా ప్రాంతానికి చెందిన నాలుగేళ్ల బాలుడు జ్వరం, దగ్గుతో బాధపడ్డాడు. అనంతరం, బాలుడిని ఎస్జీవీపీ ఆసుపత్రిలో అడ్మిట్ కావడంతో వైద్య పరీక్షలు నిర్వహించారు. దీంతో ఆ బాలుడికి హెచ్ఎంపీవీ సోకిందని అదే రోజున నిర్ధారించినట్లు అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారి తెలిపారు. ఆ బాలుడు ఇటీవల విదేశాల్లో ప్రయాణించినట్లు చెప్పారు. దీంతో, సదరు బాలుడికి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.ఇదిలా ఉండగా.. గుజరాత్లో ఇప్పటి వరకు ఎనిమిది హెచ్ఎంపీవీ కేసులు నమోదయ్యాయి. అహ్మదాబాద్లో ఏడు, సబర్కాంత జిల్లాలో ఒక కేసు వెలుగుచూశాయి. అహ్మదాబాద్లోని ఆసుపత్రుల్లో చేరిన ఆరుగురు రోగులను పూర్తిగా కోలుకున్న తర్వాత డిశ్చార్జ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇక, దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు హెచ్ఎంపీ కేసులు ఇలా ఉన్నాయి. గుజరాత్లో 8, మహారాష్ట్రలో 3, కర్ణాటక 2, తమిళనాడులో 2, అసోంలో ఒక్క కేసు నమోదైంది.అసలేంటీ హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్2001లోనే హ్యూమన్ మెటానిమోవైరస్ (HMPV) డ్రాగన్ దేశం గుర్తించింది. యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం ఇది రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ (RSV)తో పాటు న్యుమోవిరిడే కుటుంబానికి చెందినది. చిన్నపిల్లలు, వృద్ధులలో ఈ వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారికి, వైరస్ తీవ్రత మరింతగా ఉంటుందంటున్నారు వైద్య నిపుణులు.అనారోగ్యం తీవ్రతను బట్టి వ్యాధి తీవ్రత, వ్యవధి మారవచ్చు. సాధారణ ఈ వైరస్ పొదిగే కాలం 3 నుంచి 6 రోజులు ఉంటుంది. హెచ్ఎంపీవీ సంక్రమణ లక్షణాలు బ్రోన్కైటిస్ లేదా న్యుమోనియాకు దారితీస్తాయి. ఎగువ, దిగువ శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే ఇతర వైరస్ల మాదిరిగానే దీని లక్షణాలు ఉంటాయి.హెచ్ఎంపీవీ లక్షణాలుఎగువ శ్వాసకోశ ఇన్ఫెక్షన్, కొన్నిసార్లు న్యుమోనియా, ఆస్తమా వంటి ఇతర శ్వాసకోశ వ్యాధులకు దారితీస్తుంది. లక్షణాలు మరింత ముదిరితే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD)ని అధ్వాన్నంగా మారుస్తుంది. సాధారణ జలుబు మాదిరిగా లక్షణాలు కనిపిస్తాయి.దగ్గుజ్వరంజలుబు,గొంతు నొప్పిఊపిరి ఆడకపోవడంజాగ్రత్తలు ఇలా..హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తికి నిర్దిష్ట యాంటీవైరల్ చికిత్స లేదు. వ్యాక్సిన్ కూడా ఇంతవరకూ అభివృద్ధి చేయలేదు. ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు శానిటైజేషన్, హ్యాండ్ వాష్, సామాజికి దూరం చాలా ముఖ్యం. 20 సెకన్ల పాటు సబ్బు నీటితో తరచుగా చేతులు కడుక్కోవాలి. అనారోగ్యంతో ఉన్న వ్యక్తులతో దూరాన్ని పాటించాలి. వైరస్బారిన పడిన వారు సెల్ఫ్ ఐసోలేషన్ పాటించడం ఉత్తమం. -
మరో నాలుగు హెచ్ఎంపీవీ కేసులు
అహ్మదాబాద్/డిబ్రూగఢ్/పుదుచ్చేరి: దేశంలో మరో నాలుగు హ్యూమన్ మెటాన్యూమోవైరస్(హెచ్ఎంపీవీ) కేసులు బయటపడ్డాయి. గుజరాత్లో రెండు, పుదుచ్చేరి, అస్సాంలలో ఒక్కోటి చొప్పున గుర్తించారు. బాధితుల్లో ముగ్గురు చిన్నారులు కాగా ఒకరు 59 ఏళ్ల వ్యక్తి. తాజాగా నిర్ధారౖణెన కేసులతో కలిపితే గుజరాత్లో వారం వ్యవధిలో ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య ఐదుకు చేరినట్లయింది. అహ్మదాబాద్కు చెందిన 9 నెలల మగ శిశువుకు జలుబు, దగ్గు, శ్వాస తీసుకోవడం కష్టం కావడంతో ఈ నెల 6న ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. ఎలాంటి ప్రయాణ చరిత్ర లేని అతడికి హెచ్ఎంపీవీ సోకినట్లు నిర్ధారణైందని మున్సిపల్ అధికారులు తెలిపారు. అదేవిధంగా, కచ్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి అహ్మదాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడికి హెచ్ఎంపీవీ సోకినట్లు గుర్తించారు. ఈ బాధితుడికి కూడా ఎలాంటి ప్రయాణ చరిత్రా లేదని చెప్పారు. గుజరాత్లో ఈ నెల 6న మొదటి హెచ్ఎంపీవీ కేసు వెలుగులోకి వచ్చింది. అదేవిధంగా, అస్సాంలోని డిబ్రూగఢ్కు చెందిన 10 నెలల చిన్నారికి హెచ్ఎంపీవీ వైరస్ సోకినట్లు తేలింది. జలుబు సంబంధిత లక్షణాలతో నాలుగు రోజులుగా డిబ్రూగఢ్లోని అస్సాం మెడికల్ కాలేజీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు వెల్లడించారు. ఇంకా, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్న మూడేళ్ల చిన్నారికి హెచ్ఎంపీవీ సోకినట్లు వెల్లడైంది. ఆరోగ్యం మెరుగవడంతో ఇతడిని శనివారం డిశ్చార్జి చేశారని అధికారులు చెప్పారు. హెచ్ఎంపీవీ బాధితుల కోసం ప్రత్యేకంగా గొరిమేడులోని ప్రభుత్వ ఆస్పత్రిలో 10 పడకలతో కూడిన ప్రత్యేక ఐసీయూ విభాగాన్ని ఏర్పాటు చేశామన్నారు. -
3 వైరస్ల ముప్పు!
సాక్షి, హైదరాబాద్: దేశంలో సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. ఇటీవల దేశంలోని వివిధ ప్రాంతాల్లో హ్యూమన్ మెటాన్యుమో వైరస్ (హెచ్ఎంపీవీ) కేసులు వెలుగుచూశాయి. ఈ వైరస్ పాతదే అయినప్పటికీ అది సోకితే వచ్చే వ్యాధుల ప్రభావం పిల్లలు, వృద్ధుల్లో అధికంగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చెబుతోంది. చైనాలో హెచ్ఎంపీవీ వ్యాప్తిపై ఈ ఏడాది మొదటివారంలో ఈ సంస్థ అధ్యయనం చేసింది. చైనాతోపాటు, భారత్లో వైరస్ వ్యాప్తి గురించి వివరిస్తూ తాజాగా నివేదిక విడుదల చేసింది. హెచ్ఎంపీవీతోపాటు ఇన్ఫ్లుయెంజా, ఆర్ఎస్వీల వ్యాప్తి కూడా పెరిగినట్లు వెల్లడించింది.పాతవే.. అయినా జాగ్రత్త ముఖ్యం..మనదేశంలో హెచ్ఎంపీవీ 2015 – 2017 మధ్య కాలంలో వ్యాప్తి చెందినట్లు ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. 60 ఏళ్లలోపు వయ సున్న ప్రతి లక్ష మందిలో సగటున 220 మందికి ఈ వైరస్ సోకినట్లు గుర్తించారు. 60–74 ఏళ్ల మధ్య వయస్కుల్లో వైరస్ వ్యాప్తి వేగంగా ఉంది. 80 ఏళ్లకు పైబడిన వారిలో రెట్టింపు స్థాయిలో ఉంది. 2018లో ప్రపంచవ్యాప్తంగా 1.1 కోట్ల హెచ్ఎంపీవీ కేసులు నమోదైనట్లు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది.వీరిలో ఆస్పత్రిలో చేరిన వారి రేటు 5% ఉండగా, మరణాల రేటు ఒకశాతం ఉంది. హెచ్ఎంపీవీతోపాటు ఇన్ఫ్లుయెంజా, ఆర్ఎస్వీలు యువకుల్లో పెద్దగా ప్రభావం చూపవని డబ్ల్యూహెచ్ఓ చెబుతోంది. నాలుగేళ్లలోపు చిన్నారులు, 60 సంవత్సరాలు పైబడినవారిలో వైరస్ వ్యాప్తి వేగంగా ఉందని వెల్లడించింది. 15 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసు వారిలో వైరస్ను తట్టుకునే శక్తి ఎక్కువగా ఉందని పేర్కొంది.న్యుమోనియా ప్రమాదం..హెచ్ఎంపీవీ, ఇన్ఫ్లుయెంజా, ఆర్ఎస్వీ వైరస్లు సోకినప్పుడు అత్యధికుల్లో రోగ నిరోధక శక్తి క్రియాశీలమై వైరస్ను జయిస్తున్నారు. అయితే, ఇన్పేషెంట్ కేటగిరీ రోగుల్లో ఇన్ఫ్లుయెంజా బారిన పడిన వారు 30 శాతం ఉండగా, హెచ్ఎంపీవీతో 6.2 శాతం, ఎడినో వైరస్తో 3.7 శాతం, రినో వైరస్తో 4.9 శాతం ఆసుపత్రుల పాలవుతున్నారని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. శ్వాస, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలున్న వారికి ఈ వైరస్లు హాని తలపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. దీర్ఘకాలంగా దగ్గు, జలుబు ఉన్న వారిలో ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరుతుందని, అది క్రమంగా న్యుమోనియాకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు.జాగ్రత్తలు పాటించాలిచిన్న పిల్లల్లో, వృద్ధుల్లో వైరస్ ప్రభావం అధికంగా ఉండడంతో బయ టి వ్యక్తులతో ఎక్కువగా కలువొద్దు. కోవిడ్– 19 సమయంలో సోషల్ డిస్టెన్స్ పాటించ డంతో వైరస్ వ్యాప్తి తగ్గింది. దీంతో వాటికి సంబంధించిన యాంటిబాడీస్ క్షీణించాయి. ఇప్పుడు వైరస్ వ్యాప్తితో సమస్యలు వస్తు న్నట్లు తెలుస్తోంది. దీర్ఘకాలిక సమస్యలు, శ్వాసకోశ సంబంధిత సమస్యలున్నవారు వైద్యడి సలహా మేరకు ఫ్లూ వ్యాక్సిన్ తీసు కోవడం మంచిదే. – డాక్టర్ కిరణ్ మాదల,క్రిటికల్ కేర్ హెచ్ఓడీ, గాంధీ మెడికల్ కాలేజీ -
గుజరాత్లో మూడు హెచ్ఎంపీవీ కేసులు
హిమ్మత్నగర్: గుజరాత్లో హెచ్ఎంపీవీ కేసు మరొకటి వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలో హెచ్ఎంపీవీ కేసుల సంఖ్య మూడుకు చేరింది. సబర్కాంత జిల్లాకు చెందిన 8 ఏళ్ల బాలుడికి హెచ్ఎంపీవీ పాజిటివ్గా నిర్థారణైందని శుక్రవారం అధికారులు తెలిపారు. ప్రాంతిజ్ తాలూకాలో కార్మికుడి కుటుంబానికి చెందిన బాలుడికి పరీక్ష చేయించారని, అతడి నుంచి మరోసారి బ్లడ్ శాంపిల్స్ సేకరించి ప్రభుత్వ ల్యాబ్కు పంపించామన్నారు. హిమ్మత్నగర్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అతడు వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నాడని, పరిస్థితి నిలకడగా ఉందని కలెక్టర్ రతన్కన్వర్ చెప్పారు. గుజరాత్లో మొదటి కేసు ఈ నెల 6న, రెండో కేసు రెండు రోజుల క్రితం వెలుగులోకి వచ్చాయి. -
తగిన జాగ్రత్తలతో హెచ్ఎంపీవీ దూరం
హైదరాబాద్: హెచ్ఎంపీవీ గురించి భయపడాల్సిన అవసరం లేదని, కాస్త అప్రమత్తంగా ఉంటే సరిపోతుందని అమీర్పేటలోని ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రికి చెందిన ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్టు, ఇంటెన్సివిస్టు డాక్టర్ రత్నబాబు కొల్లాబత్తుల తెలిపారు. ఈ వైరస్ గురించి సర్వత్రా ఆందోళన నెలకొన్న నేపథ్యంలో.. యూసుఫ్గూడలోని పోలీసు బెటాలియన్లో శిక్షణ పొందుతున్న 300 మంది పోలీసులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.“హెచ్ఎంపీవీ అనేది సాధారణంగా అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ లోనే వస్తుంది. గొంతులో ఇబ్బంది ఉండొచ్చు, దగ్గు, జలుబు రావచ్చు. కొద్దిపాటి జ్వరం ఉండే అవకాశం ఉంది. అది బాగా ఎక్కువైతే అప్పుడు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అయ్యి, పిల్లికూతల్లా వచ్చి ఆయాసం రావచ్చు. కొందరిలో బ్రాంకైటిస్, న్యుమోనియా లాంటివి కూడా ఉంటాయి. చాలావరకు ఇది సాధారణంగానే ఉంటుంది. అయితే రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి, చిన్న పిల్లలకు సమస్య ఎక్కువ కావచ్చు. ఒకటి రెండు రోజులైనా తగ్గకపోతే అప్పుడు వైద్యుల వద్దకు వెళ్లి తగిన సూచనలు తీసుకోవాలి. దీని లక్షణాల్లో ప్రధానంగా ముక్కు దిబ్బడ, ముక్కు కారడం, గొంతులో గరగర, ఆయాసం, ఛాతీలో నొప్పి లాంటివి ఉంటాయి. కొందరికి మాత్రం ఒంటిమీద దద్దుర్లు కూడా వస్తాయి.కొత్త వైరస్ కాదుఇదేమీ కొత్తది కాదు.. ఎప్పుడో 2001లోనే నెదర్లాండ్స్లో దీన్ని కనుగొన్నారు. చిన్నపిల్లల్లో చాలావరకు ఇన్ఫెక్షన్లకు ఇది కారణం అవుతుంది. 10-15% మందిలో మాత్రమే దీని లక్షణాలు తీవ్రంగా కనిపిస్తాయి. వ్యాధి ఉన్నవారికి దగ్గరగా ఉన్నవారికి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది 2-5 రోజులే ఉంటాయి. తర్వాత దానంతట అదే తగ్గుతుంది. కొద్దిమందికి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అది ముదిరిపోయి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, న్యుమోనియాలకు దారితీస్తుంది. చాలావరకు దగ్గు, జలుబు లాంటి సాధారణ లక్షణాలే ఉంటాయి. ఇది సాధారణంగా ఒకరి నుంచి మరొకరికే వస్తుంది. లేదా అప్పటికే వ్యాధి ఉన్నవారికి దగ్గరగా వెళ్లినా, దగ్గు.. తుమ్ముల నుంచి వచ్చే తుంపరల ద్వారా సోకుతుంది. అప్పటికే వ్యాధి ఉన్నవారికి షేక్ హ్యాండ్ ఇచ్చినా, కౌగలించుకున్నా, ముద్దుపెట్టుకున్నా కూడా అది వస్తుంది. తలుపు హ్యాండిళ్లు, బొమ్మలు, ఫోన్లు, ఇతర ఉపరితలాలను వ్యాధి ఉన్నవాళ్లు ముట్టుకుని, వాళ్ల తుంపరలు వాటిమీద పడినప్పుడు వేరేవాళ్లు ముట్టుకుంటే అప్పుడు సోకే అవకాశం ఉంది.ఎవరికి రావచ్చుఐదేళ్లలోపు పిల్లలు దీని బారిన పడే అవకాశాలు ఎక్కువ. ఆస్థమా, సీఓపీడీ, దీర్ఘకాలికంగా ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారికి సోకితే దాని తీవ్రత ఎక్కువగా ఉంటుంది. తరచు ఏదో ఒక వ్యాధి బారిన పడుతున్నవారు, కీమోథెరపీ తీసుకుంటున్నవారు, అవయవమార్పిడి చేయించుకున్నవాళ్లు ఈ వైరస్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల బ్రాంకైటిస్, బ్రాంకియోలైటిస్, న్యుమోనియా, చెవిలో ఇన్ఫెక్షన్లు కూడా ఉంటాయి.గుర్తింపు.. చికిత్సకొవిడ్ తరహాలోనే శ్వాబ్ పరీక్ష ద్వారా దీన్ని గుర్తిస్తాం. కొందరికి ఆక్సిజన్ సపోర్ట్ ఇస్తాం. మరికొందరికి ఐవీ ఫ్లూయిడ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. కొంతమందిలో లక్షణాలు తగ్గకపోతే కార్టికో స్టెరాయిడ్స్ అవసరం అవుతాయి. లక్షణాలను బట్టే చికిత్స చేస్తాం తప్ప, దీనికి ప్రత్యేకంగా వైరస్ను తగ్గించే మందులంటూ ఏమీ ఉండవు.తీసుకోవాల్సిన జాగ్రత్తలుచేతులు తరచు సరిగా శుభ్రం చేసుకోవాలి. సబ్బు లేదా శానిటైజర్తో కడుక్కోవాలి. ముక్కు, నోరు, చెవులు.. వీటిని జాగ్రత్తగా కవర్ చేసుకోవాలి. వీలైనంత వరకు తప్పకుండా మాస్క్ వాడాలి. అనారోగ్యం ఉన్నా, లేకపోయినా ఇది మంచిది. అప్పటికే అనారోగ్యంగా ఉన్నవారికి దూరంగా ఉండాలి. కళ్లు, ముక్కు, నోరు.. వీటిని అస్సలు చేతులతో ముట్టుకోకూడదు. ఒకవేళ ముట్టుకోవాల్సి వస్తే, తప్పనిసరిగా ముందే చేతులు శుభ్రం చేసుకోవాలి. ఆహారం, పాత్రలను వేరే ఎవరితోనూ షేర్ చేసుకోవద్దు. డీహైడ్రేషన్ అవుతున్నప్పుడు నీళ్లు, ఇతర ఫ్లూయిడ్స్ ఎక్కువగా తాగుతుండాలి. లక్షణాలు బాగా ఎక్కువ అవుతున్నాయనుకున్నప్పుడు దగ్గరలో ఉన్న వైద్యులను సంప్రదించాలి” అని డాక్టర్ రత్నబాబు వివరించారు.కార్యక్రమంలో ఇంకా ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రి జనరల్ ఫిజిషియన్ డాక్టర్ కళ్యాణి, కమాండెంట్ మురళీకృష్ణ, అడిషనల్ కమాండెంట్ నరేంద్రసింగ్, బెటాలియన్కు చెందిన సివిల్ సర్జన్ డాక్టర్ మహమూద్ తదితరులు పాల్గొన్నారు. -
హెచ్ఎంపీవీ వైరస్ అంత ప్రమాదకరమైనదేమీ కాదు
సుల్తాన్బజార్: హ్యూమన్ మెటాప్యుమో వైరస్ (హెచ్ఎంపీవీ) వైరస్ ఒక ఫ్లూ వంటిదని, సాధారణ నియమాలు పాటిస్తే తగ్గిపోతుందని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ రవీంద్రనాయక్ పేర్కొన్నారు. ఈ వైరస్ చిన్నపాటి లక్షణాలతో వచ్చే వైరస్ అన్నారు. దానిని నియంత్రిస్తే ఎలాంటి ప్రమాదం లేదన్నారు. శ్వాసకోశ వ్యవస్థపై ప్రభావం చూపే ఒక రకమైన వైరస్ అన్నారు. హెచ్ఎంపీవీని మొదట 2001లోనే గుర్తించారని, ఇదేమీ కొత్త వైరస్ కాదన్నారు. అధిక జనాభా ఉన్న ప్రాంతాలలో ఇది సోకుతుందని.. మన రాష్ట్రంలో ఈ లక్షణాలు ఏమీ లేవన్నారు. హెచ్ఎంటీవీ లక్షణాలు తేలికపాటి జలుబు నుంచి తీవ్రమైన శ్వాసకోశ వ్యాధుల వరకు ఉంటాయని రవీంద్ర నాయక్ పేర్కొన్నారు. జ్వరం, దగ్గు, ముక్కుదిబ్బడ, గొంతునొప్పి, శ్వాసలో ఇబ్బందుల్లాంటి సాధారణ లక్షణాలు ఉంటాయని ఆయన వివరించారు. చిన్నపిల్లలు, వృద్ధులు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, దీర్ఘకాలిక గుండె, ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడే వారు కొద్దిగా అప్రమత్తంగా ఉండాలన్నారు. హెచ్ఎంపీవీని గుర్తించడానికి పీసీఆర్ పరీక్ష, యాంటిజెన్ డిటెక్షన్, సిరాలజికల్ పరీక్షలు చేయవచ్చన్నారు. దీని నివారణ కోసం తరచుగా చేతులు కడుక్కోవడం, దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు రుమాలును ఉపయోగించడం, అస్వస్థతగా ఉన్న వారి నుంచి దూరంగా ఉండడం లాంటి జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఇప్పటికే తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ కోవిడ్ కాలంలో అన్ని వసతులు సౌకర్యాలతో సమర్థంగా ఉందన్నారు. ఈ వ్యాధి అంత ప్రమాదకరమైనది కాదని, చలికాలంలో వచ్చే చిన్నపాటి ప్లూగా ఉంటుందని, ప్రజలు భయాందోళనకు గురి కావద్దని రవీంద్ర నాయక్ సూచించారు. -
కొత్త వైరస్ వచ్చేసింది.. మాస్క్ ఈజ్ బ్యాక్ (ఫొటోలు)
-
శ్వాస సంబంధ వ్యాధులపై నిఘా
న్యూఢిల్లీ: శ్వాస సంబంధమైన అన్ని రకాల వ్యాధులపై ఓ కన్నేసి ఉంచాలని, హ్యూమన్ మెటా న్యుమోవైరస్(హెచ్ఎంపీవీ) వ్యాప్తిని నివారించేందుకు ప్రజల్లో అవగాహన పెంచాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది. దేశంలో ఇప్పటికే హెచ్ఎంపీవీ సంబంధిత ఐదు కేసులు బయటపడగా, మంగళవారం మహారాష్ట్రలోని నాగ్పూర్లో రెండు హెచ్ఎంపీవీ అనుమానిత కేసులను వైద్యులు గుర్తించారు. సోమవారం కర్ణాటక, తమిళనాడు, గుజరా త్లలో ఐదుగురు చిన్నారులకు హెచ్ఎంపీవీ పాజిటివ్గా గుర్తించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పరిస్థితిని సునిశితంగా పరిశీలిస్తోందని, ఎలాంటి భయాందోళనలకు ప్రజలు గురి కావాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా భరోసా ఇచ్చారు.చైనాలో ఒక్కసారిగా హెచ్ఎంపీవీ కేసులు పెరగడంతో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి పుణ్య సలిల శ్రీవాస్తవ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులతో వర్చువల్గా సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. ఇప్పటి వరకు అందిన డేటా ప్రకారం చూస్తే ఇన్ఫ్లూయెంజా లైక్ ఇల్నెస్(ఐఎల్ఐ), సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇల్నెస్(ఎస్ఏఆర్ఐ) సహా అన్ని రకాల శ్వాస సంబంధ ఇన్ఫెక్షన్ల కేసుల్లో అనూహ్యమైన పెరుగుదల కనిపించలేదని ఆమె వివరించారు. అదీకాకుండా, ప్రపంచ దేశాల్లో 2021 నుంచే ఈ వ్యాధి ఉన్నందున ప్రజలు భయపడాల్సిన అవసరం కూడా లేదన్నారు. ప్రస్తుత శ్వాసకోశ సంబంధ వ్యాధుల్లో నమోదైన పెరుగుదలపై ఆమె మాట్లాడుతూ.. ఏటా ఈ సీజన్లో ఇలా కేసులు పెరగడం మామూ లేనన్నారు. అయితే, శ్వాస సంబంధమైన అన్ని రకాల వ్యాధుల పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉండాలని ఆమె రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అధికారులను కోరారు. నాగ్పూర్లో రెండు అనుమానాస్పద కేసులు..మహారాష్ట్రలోని నాగ్పూర్లో హెచ్ఎంపీవీ అనుమానాస్పద కేసులు రెండింటిని గుర్తించారు. 7, 14 ఏళ్ల బాధితులిద్దరికీ స్థానిక ప్రైవేట్ ఆస్ప త్రిలో అవుట్ పేషెంట్ విభాగంలో చికిత్స చేసి, ఇంటికి పంపించివేశారు. ఇద్దరూ ఆరోగ్యంగానే ఉన్నారు. అనుమానితుల నుంచి సేకరించిన నమూ నాలను నాగ్పూర్లోని ఎయిమ్స్కు, పుణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించామని జిల్లా కలెక్టర్ విపిన్ ఇటంకర్ చెప్పారు. హెచ్ఎంపీవీ కేసులంటూ వచ్చిన వార్తలు అబద్ధమన్నారు. నాగ్పూర్లో హెచ్ఎంపీవీ కేసులు లేవని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని వెల్లడించారు. -
భయం వద్దు... జాగ్రత్త ముద్దు!
మాస్కులు... చేతుల పరిశుభ్రత... తదితర జాగ్రత్తలు మళ్ళీ బలంగా వినిపిస్తున్నాయి. హ్యూమన్ మెటా న్యూమోవైరస్ (హెచ్ఎంపీవీ) వల్ల చైనాలో వ్యాధిగ్రస్థుల సంఖ్య పెరుగుతున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో, మన దేశంలోనూ కేసులు కొన్ని బయటపడడంతో జనం ఉలిక్కిపడుతున్నారు. ఒక్కసారిగా పాత కరోనా జ్ఞాపకాలు ముప్పిరిగొంటున్నాయి. చైనా వార్తలతో సోమవారం బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) సెన్సెక్స్ 1.5 శాతం పైగా పడిపోవడం గగ్గోలు రేపుతోంది. ఉత్తరాన చైనాకు సమీపంలో ఉన్నందున ప్రజా సంబంధాలు, ఆర్థిక సంబంధాల రీత్యా స్వైన్ఫ్లూ, ఏవియన్ ఫ్లూ, కోవిడ్ల లానే ఇది కూడా వ్యాపించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో శ్వాసకోశ అనారోగ్యాలపై ఓ కన్నేసి ఉంచాలనీ, వేయికళ్ళతో పరిస్థితిని కనిపెట్టాలనీ, ఒకరి నుంచి మరొకరికి హెచ్ఎంపీవీ వ్యాప్తి చెందకుండా నిరోధించేందుకు ప్రజల్లో చైతన్యం తేవాలనీ రాష్ట్రాలకు కేంద్ర సర్కార్ తాజాగా సూచనలు జారీ చేయడం గమనార్హం. హెచ్ఎంపీవీ సహా అలాంటి అనేక ఇతర వైరస్ల వల్ల చైనాలో ఇప్పటికే భారీ సంఖ్యలో శ్వాసకోశ వ్యాధులు ప్రబలాయి. ఆ దేశంలో జనం మాస్కులు ధరించి ఆస్పత్రుల్లో, బయట సంచ రిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో భారత్ సహా ప్రపంచమంతటా ఈ కేసులపై దృష్టి పెరిగింది. హెచ్ఎంపీవీ వైరస్ వ్యవహారం చర్చనీయాంశమైంది. కోవిడ్ సృష్టించిన భయోత్పాతం రీత్యా, వైరస్లు, మహమ్మారుల పేరు చెప్పగానే జనం సహజంగానే బెంబేలెత్తిపోతున్నారు. ప్రజల్లో వ్యక్తమవుతున్న ఈ భయాందోళనలు అర్థం చేసుకోదగినవే. నిజానికి, హెచ్ఎంపీవీ కొత్త వైరస్ ఏమీ కాదు. శాస్త్రవేత్తలు 2001లోనే తొలిసారి దీని జాడ గుర్తించారు. వైరస్ స్వభావం, అది సోకినప్పటి లక్షణాల గురించి అవగాహన కూడా వచ్చింది. అయిదేళ్ళ లోపు చిన్నారులకూ, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికీ, వృద్ధులకూ ఈ వైరస్ సోకే ప్రమాదం అధికం. అందువల్లే, హెచ్ఎంపీవీతో తంటా చాలాకాలంగా ఉన్నదేననీ ఓ వాదన. అసలు మన దగ్గర తాజాగా ఈ కేసులు చాలా గమ్మత్తుగా బయటపడ్డాయి. అంతకంతకూ చలి ముదురుతున్న ఈ శీతకాలంలో శ్వాసకోశ అనారోగ్యాలను పసిగట్టి, వాటిపై నిఘా ఉంచేందుకు ‘ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్’ (ఐసీఎంఆర్) ఎప్పటిలానే చర్యలు చేపట్టింది. ఆ క్రమంలో ఈ వైరస్ బాధిత కేసులు వెలుగులోకి వచ్చాయి. అయితే, దేశంలో శ్వాసకోశ వ్యాధి పీడితుల్లో అనూహ్యమైన పెరుగుదల ఏదీ ఇప్పటికీ కనిపించలేదని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేయడం ఒకింత ఊరటనిస్తోంది. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధమై ఉన్నామన్నది ఆ శాఖ ఆశ్వాసన. ఆ మాటకొస్తే, దేశంలో శ్వాసకోశ, సీజనల్ ఇన్ఫ్లుయెంజా కేసులను క్రమం తప్పకుండా గమనిస్తూ ఉండడం ఆరోగ్య శాఖ అధికారులు నిరంతరం చేసేదే. ఇప్పుడు హెచ్ఎంపీవీ పరిస్థితిపై ఒక్క సారిగా గగ్గోలు రేగడంతో అంతర్జాతీయ సంస్థలతోనూ సంప్రతిస్తున్నట్టు అధికారిక కథనం. కరోనా మొదలు నేటి హెచ్ఎంపీవీ దాకా అన్నీ చైనా కేంద్రంగా వార్తల్లోకి రావడంతో అనేక అనుమానాలు, భయాలు తలెత్తుతున్నాయి. చైనా సర్కార్ మాత్రం పౌరులతో పాటు తమ దేశానికి వచ్చే విదేశీ పర్యాటకుల ఆరోగ్యాన్ని సైతం కాపాడతామంటూ భరోసా ఇస్తోంది. బీజింగ్ ఎన్ని మాటలు చెప్పినా, గత చరిత్ర కారణంగా ప్రపంచ దేశాల్లో ఇప్పటికీ నమ్మకం కుదరడం లేదు. చిత్రమేమిటంటే, ప్రస్తుత ఇన్ఫెక్షన్లపై ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఎలాంటి ప్రకటన, మార్గదర్శకాలు విడుదల చేయనేలేదు. విదేశీ ప్రయాణాలు చేయనివారికి సైతం హెచ్ఎంపీవీ సోకినట్టు వార్తలు రావడంతో, ఇది సీజనల్ సమస్యే తప్ప మరేమీ కాకపోవచ్చనే అభిప్రాయమూ ఉంది. చలికాలంలో ఇన్ఫెక్షన్లు సాధారణమే. అయితే, సరైన సమాచారం లేనప్పుడు పుకార్లు షికార్లు చేసి, లేనిపోని భయాలు సృష్టించి, ఆర్థిక, సామాజిక నష్టానికి దారి తీసే ముప్పుంది. జనవరి 13 నుంచి 45 రోజులు ప్రయాగలోని కుంభమేళాకు 40 కోట్ల పైగా భక్తులు హాజరవు తారని అంచనాలున్న వేళ అప్రమత్తత అవసరం. వైరస్ల విహారానికి ముకుతాడు వేయడం ముఖ్యం. కోవిడ్–19 కాలంలో లానే తరచూ చేతులను సబ్బునీళ్ళతో కడుక్కోవడం, చేతులు కడుక్కోకుండా కళ్ళు–ముక్కు–నోటిని తాకకపోవడం, వ్యాధి లక్షణాలున్న వారితో సన్నిహితంగా మెలగక పోవడం, దగ్గు – తుమ్ములు వచ్చినప్పుడు ముక్కు – నోటికి అడ్డు పెట్టుకోవడం, మాస్కులు ధరించడం ఉత్తమం. అసలు కరోనా, హెచ్ఎంపీవీ లాంటి వాటితో సంబంధం లేకుండా ఈ ఖర్చులేని సర్వసాధారణ జాగ్రత్తలను మన నిత్యజీవితంలో భాగం చేసుకోవడం ఆరోగ్య పరిరక్షణకు మరీ ఉత్తమం. కోవిడ్ అనుభవం ప్రపంచానికి నేర్పిన పాఠం – అప్రమత్తత. దేన్నీ తేలిగ్గా తీసుకోవద్దనీ, ఎట్టి çపరిస్థితుల్లోనూ స్వీయరక్షణ చర్యలను వదిలిపెట్టవద్దనీ తేల్చిచెప్పింది. దేశంలో 78 శాతం మేర చొచ్చుకుపోయిన మొబైల్ ఫోన్లనూ, 65 కోట్ల మందికి పైగా వీక్షకులున్న దూరదర్శన్నూ ప్రజాహిత సమాచార ప్రచారానికి వినియోగించాలి. అంతేకాక, ఇలాంటి వివిధ రకాల వైరస్లు, వ్యాధులకు దేశంలో టెస్టింగ్ సౌకర్యాలను విస్తరించాలి. ఆరోగ్య పరిరక్షణ వ్యవస్థను పటిష్ఠం చేసుకుంటేనే అవాంఛనీయ పరిస్థితుల్ని ఎదుర్కొనే సామర్థ్యం సిద్ధిస్తుంది. వైరస్ల తీవ్రత తక్కువ, ఎక్కువలతో సంబంధం లేకుండా పాలకులు పారిశుద్ధ్యం, స్వచ్ఛమైన గాలి, నీరు, వాతావరణంపై శ్రద్ధ పెట్టడం అవసరం. వ్యాధులు ప్రబలాక చికిత్సకు శ్రమించే కన్నా, వైరస్లను ముందే పసిగట్టి, వాటి విజృంభణను నివారించేందుకు సర్వసన్నద్ధం కావడం అన్ని విధాలా ఉపయుక్తం, శ్రేయస్కరం. -
‘హెచ్ఎంపీవీ’పై కర్ణాటక బీజేపీ హెచ్చరిక
బెంగళూరు:దేశంలో అక్కడక్కడా హెచ్ఎంపీవీ వైరస్ కేసులు నమోదవుతున్నాయి.కర్ణాటకలో సోమవారం(జనవరి6) ఒక్కరోజే రెండు కేసులు నమోదవడంతో అక్కడ ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ స్పందించింది.హెచ్ఎంపీవీ వైరస్ను అంత తేలిగ్గా తీసుకోవద్దని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరింది.కొత్త వైరస్ పట్ల ప్రజలు భయాందోళనకు గురి కావద్దని ఆరోగ్యశాఖ మంత్రి దినేశ్ చెప్పారని,కానీ, వైరస్ ప్రభావం గురించి ఏం తెలియనప్పుడు దానిని తేలికగా తీసుకోవద్దన్నారు.ఈ వైరస్ ఛైనాలో బీభత్సం సృష్టిస్తోందని,అక్కడి చిన్నారులు ఆస్పత్రుల పాలయ్యారన్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రప్రభుత్వాలను అప్రమత్తం చేసిందని ప్రతిపక్షనేత అశోక గుర్తుచేశారు. హెచ్ఎంపీవీ వచ్చిన తర్వాత కాకుండా రాకముందే జాగ్రతలు తీసుకోవాలని సూచించారు. ఈ వైరస్ ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతున్నందున అప్రమత్తంగా ఉండాలన్నారు.హెచ్ఎంపీవీ ఎలా ఎదుర్కోవాలో అవగాహన కల్పించాలన్నారు.ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సిలిండర్ల లభ్యత,ఐసీయూ బెడ్ల వంటి సదుపాయాలపై దృష్టి సారించాలన్నారు. భయపడాల్సిన పనిలేదన్న జేపీ నడ్డా.. కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడుల్లో వైరస్ కేసులు నమోదయ్యాయి. అయితే ఈ వైరస్ కొత్తదేమీ కాదని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి,బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొనడం గమనార్హం.ఈ వైరస్ను 2001లోనే గుర్తించారని చాలా ఏళ్లుగా ఇది ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తిలో ఉందని నడ్డా తెలిపారు. ప్రస్తుత పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆరోగ్యశాఖతో పాటు ఐసీఎంఆర్, ఎన్సీడీసీ నిశితంగా గమనిస్తున్నాయని చెప్పారు. ఇదీ చదవండి: భారత్లో పెరుగుతున్న హెచ్ఎంపీవీ కేసులు -
భారత్లోకి ప్రవేశించిన చైనా వైరస్
-
ముంచుకొస్తున్న హెచ్ఎంపీవీ..నఖ శిఖం పరిశుభ్రంగా ఉందామిలా..!
చాలామంది రోజూ ఉదయం బ్రష్ చేసుకోవడం తర్వాత స్నానం మొదలు దేహ పరిశుభ్రతను చకచకా చేస్తుంటారు. ఈ క్రమంలో దేహమంతా శుభ్రమవుతుందో లేదో చూడరు.ఉదాహరణకు స్నానం సమయంలో చెవుల వెనక భాగంలో... చెవి వెనక భాగం తలతో కనెక్ట్ అయ్యే ప్రాంతంలో, మెడ వెనక, చెవుల ముడతల్లో ఇలాంటి చోట్ల శుభ్రమవుతోందా, కావడం లేదా అన్నది చూడరు. రోజువారీ హైజీన్ పాటించకపోతే అది మరికొన్ని ఆరోగ్య సమస్యలకూ, దేహ / చర్మ సమస్యలకు దారితీయవచ్చు. అందులోనూ మరో మహమ్మారి హెచ్ఎంపీవీ(HMPV) వైరస్ చైనా(China)లో కలకలం సృష్టిస్తోంది. ప్రస్తుతం ఆ వైరస్ కేసులు మనదేశంలో కూడా నమోదవ్వుతున్నాయి. ఈ తరుణంలో చక్కటి జాగ్రత్తలతో మన శరీర పరిశుభ్రత పాటించడం ఎలాగో తెలుసుకోవడం కోసమే ఈ కథనం.దేహ పరిశుభ్రత కోసం పళ్లు తోముకోవడం మొదలుకొని, కాళ్లూ, పాదాల శుభ్రత వరకు ఎలాంటి హైజీన్ పాటించాలో చూద్దాం. పైగా ఇప్పుడు కొత్త కొత్త వైరస్లు వ్యాప్తి చెందుతున్నాయన్న పుకార్లు వ్యాపిస్తున్న తరుణంలో ఆపాదమస్తకం శుభ్రత పాటించడం వంటి వ్యక్తిగత పరిశుభ్రత జాగ్రత్తలతో మరింత మెరుగైన ఆరోగ్యాన్ని పొందడమే కాకుండా, మరెన్నో వ్యాధులను నివారించుకోవచ్చు కూడా.ప్రతిరోజూ మనందరమూ పొద్దున్నే పళ్లను బ్రష్ చేసుకుంటాం. ఇలా బ్రష్ చేసుకునే టైమ్లో ముందువైపునకే ప్రాధాన్యమిస్తాం. కానీ పలువరసలో అన్నివైపులా శుభ్రమయ్యేలా బ్రష్ ఉపయోగించాలి. అలాగే ఆహారం తీసుకున్న ప్రతిసారీ పళ్లను కొద్దిగా నీళ్లతో నోరు పుక్కిలించాలి. నోరు అనేక సూక్ష్మజీవులకు నిలయం. ఆహారం తీసుకున్న ప్రతిసారీ బ్రషింగ్ చేసుకోవడం కుదరదు కాబట్టి... కొద్దిగా నీటిని నోట్లోకి తీసుకుని పుక్కిలిస్తూ నోరంతా శుభ్రం చేసుకోవడం అవసరం. ఆహారం తీసుకున్న తర్వాత నోట్లో బ్యాక్టీరియా పెరిగేందుకు అనువైన వాతావరణం ఏర్పడుతుంది కాబట్టి ఈ పుక్కిలింతల వల్ల అది నోరు శుభ్రమవుతుంది. ఇక ప్రతిరోజూ ఉదయం, రాత్రి నిద్రపోబోయే ముందు బ్రషింగ్ చేసుకోవడం అవసరమన్నది మనందరికీ తెలిసినప్పటికీ చాలా మంది ఈ నియమం పాటించరన్నది తెలిసిందే. బ్రషింగ్ తర్వాత పళ్లపైనా, చిగుర్లపైనా వేలి చివరలతో గుండ్రంగా తిప్పుతూ మసాజ్ చేసుకుంటున్నట్లుగా రాయాలి. దీనివల్ల చిగుర్లకు రక్తప్రసరణ పెరిగి చిగుర్ల వ్యాధులు నివారితమవుతాయి. పొగాకు వంటివి నమలడం, జర్దాపాన్ వంటివి తినడం, ఖైనీ, గుట్కా, పాన్మసాలాల వంటి దురలవాట్లు నోటి దుర్వాసనతో పాటు శారీరకంగా కూడా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. నోటి క్యాన్సర్లు మొదలుకొని ఇతరత్రా అనేక ఆరోగ్య సమస్యలకు తావిస్తాయి. అంతేకాదు... నలుగురిలో మాట్లాడటానికి ఇబ్బందిగా ఉండే వాతావరణాన్ని కలిగిస్తాయి. అలాంటి దురలవాట్లు పూర్తిగా మానేయాలి. మార్కెట్లో దొరికే మౌత్వాష్లతో తరచూ నోరు కడుక్కుంటూ ఉండటం కూడా మంచిదే. ముఖ్యంగా నోటి దుర్వాసనతో బాధపడేవారు తరచూ మౌత్వాష్తో శుభ్రం చేసుకోవడం ఇంకా మంచిది.స్నానం..ప్రతి రోజూ ప్రతివారూ స్నానం చేస్తారు. అయితే చాలామంది దేహం శుభ్రమవుతోందా లేదా అన్నది చూసుకోకుండా యాంత్రికంగా ఈ పని చేస్తుంటారు. ముఖ్యంగా చిన్నారుల్లో (కొందరు పెద్దవాళ్లలనూ) ఈ ధోరణి కనిపిస్తుంది. చాలామంది తమ చెవుల వెనక భాగాలనూ, శరీరంలో మడతపడే చోట్లను శుభ్రం చేసుకునే విషయాన్ని అంతగా పట్టించుకోరు. వాస్తవానికి చర్మం ముడతలు పడే ప్రాంతాలైన కీళ్లు, బాహుమూలాలు, మోకాలి వెనక భాగాలతో పాటు ప్రైవేట్ పార్ట్స్పై కొద్దిగా ఎక్కువగా దృష్టి సారించాల్సిన అవసరముంటుంది. తలస్నానం ఎలాగంటే...: తలస్నానం వారంలో రెండుసార్లు చేయడం మంచిది. తలలో చుండ్రు వంటి సమస్యలు ఉన్నవారు రోజు విడిచి రోజు తలస్నానం చేయడమూ మంచిదే. తలస్నానం చేసే ముందర కొందరు తలకు నూనె రాస్తారు. అందరూ తలకు నూనె రాయాల్సిన అవసరం లేదు. కేవలం పొడిబారినట్లు ఉండే చర్మమూ, వెంట్రుకలు ఉన్నవారు మాత్రమే తలస్నానానికి ముందర నూనెతో మృదువుగా మసాజ్ చేసుకోవాలి. జిడ్డుచర్మం ఉండేవారు తలకు నూనె రాయక΄ోయినా పర్వాలేదు. ఆ తర్వాత అదంతా శుభ్రమయ్యేలా మంచి షాంపూతో స్నానం చేయాలి. మైల్డ్ షాంపూ వాడటమే మేలు. కొందరు మెడికేటెడ్ షాంపూలు వాడతారు. అలాంటివి కేవలం డాక్టర్ సలహా మీద మాత్రమే వాడాలి. మరికొన్ని జాగ్రత్తలు... ఆహ్లాదం కలిగించి అనేక ఆరోగ్య సమస్యలను దూరంపెట్టే స్నానం చేసేటప్పుడు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలివి... స్నానానికి ఉపయోగించే నీళ్లు మరీ చల్లగా లేదా మరీ బాగా వేడిగా ఉండకూడదు. చన్నీటి స్నానం మంచిదనేది కేవలం అపోహ. చల్లటి స్నానం వల్ల సైనస్, ఆస్తమా వంటి సమస్యలు ఉన్నవారికి చల్లటినీళ్ల స్నానం దాన్ని ట్రిగర్ చేసే అవకాశాలెక్కువ. ఇక మరీ బలహీనంగా ఉన్నవాళ్లుగానీ లేదా వృద్ధులుగానీ మరీ ఎక్కువగా చల్లగా ఉండే నీళ్లతో స్నానం కాని, మరీ ఎక్కువ వేడిగా ఉండే నీళ్లతో స్నానం గానీ చేయడం సరికాదు ఒకవేళ తప్పని పరిస్థితుల్లో చల్లటి నీళ్లతో స్నానం చేయాల్సి వస్తే... ఆ స్నానం వ్యవధిని వీలైనంతగా తగ్గించడం మంచిది ఒకవేళ చల్లటి నీళ్లతో స్నానం చేయాల్సి వస్తే... దానికి ముందర వార్మప్గా కాస్తంత వ్యాయామం మంచిది కడుపు నిండా తిన్నవెంటనే స్నానం చేయకూడదు. భోజనం తర్వాత రెండు మూడు గంట తర్వాతే స్నానం చేయడం మంచిది. చన్నీళ్లు లేదా వేణ్ణీళ్లతో గానీ స్నానం తర్వాత తలనొప్పి, జ్వరం వచ్చినట్లుగా అనిపిస్తే అది మీ ఆరోగ్యానికి అంతగా సరిపడదని గుర్తుంచుకుని, ఇలాంటివాళ్లు కేవలం గోరువెచ్చటి నీళ్లతో మాత్రమే స్నానం చేయాలి. చెవులసంరక్షణచెవులను చాలా జాగ్రత్తగా సంరక్షించుకోవాలి. చాలామంది చెవుల వెనక భాగాన్ని శుభ్రం చేసుకోవడం మరచిపోతుంటారు. కానీ స్నానం సమయంలో చెవుల వెనకభాగంతో పాటు... బయటి చెవి (ఎక్స్టర్నల్ ఇయర్ పిన్నా)ను చెవిలోపలివరకూ శుభ్రం చేసుకోవాలి. మన చెవుల్లో వచ్చే గులివి / గుమిలి చెవికి రక్షణ కల్పించడం కోసమే పుడుతుంది. కాబట్టి దాన్ని శుభ్రం చేసుకోడానికి పిన్నీసులు, ఇయర్బడ్స్ లాంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు. చెవి లోపల గువిలి మరీ ఎక్కువగా ఉంటే ‘డీ–వ్యాక్స్’ అనే చుక్కల మందును వేసుకోవాలి. మరీ చెవులు మూసుకుపోయినంతగా గువిలి ఉత్పన్నమవుతుంటే ఈఎన్టీ డాక్టర్(ENT Doctor)ను సంప్రదిస్తే వారే సురక్షితమైన రీతిలో చెవులను శుభ్రం చేస్తారు.ఇయర్బడ్స్ వద్దు : కొందరు ఇయర్ బడ్స్తో తమ చెవులను తరచూ శుభ్రపరుస్తుంటారు. ఏమీ తోచనప్పుడు, ఏ పనీ లేనప్పుడు కూడా చెవుల్లో ఇయర్బడ్ పెట్టుకుని తిప్పేస్తుంటారు. నిజానికి చెవులు తమంతట తామే శుభ్రపరచుకుంటాయి. ప్రకృతి వాటినలా డిజైన్ చేసింది. వాస్తవానికి ఇయర్బడ్స్ వాడినప్పుడు కొన్నిసార్లు గువిలి చెవి లోపలికి ఇంకా లోతుగా వెళ్తుంది. చెవిలోకి ఏదైనా బయటి వస్తువు / పురుగు ప్రవేశించినప్పుడు అడ్డుకుని, చెవిని రక్షించడం కోసమే ఈ గువిలి స్రవిస్తుంటుంది.ఇయర్బడ్స్తో లేదా అగ్గిపుల్లలతో శుభ్రం చేయడం మొదలుపెట్టగానే చెవిలోని గ్రంథులు మరింత ఎక్కువగా గువిలిని స్రవిస్తాయి. దాంతో సమస్య మరింత తీవ్రమవుతుంది. అందుకే చెవులను తరచూ శుభ్రపరచుకునే వారిలోనే గువిలి లేదా వ్యాక్స్ ఎక్కువగా స్రవిస్తుంది. కాబట్టి ఇయర్బడ్స్, అగ్గిపుల్లలు, పుల్లలు, పెన్నులు, పిన్నీసులు వంటి వాటితో చెవులను శుభ్రం చేసుకోకూడదు. పిల్లలూ... పదునైన వస్తువులు : కొంతమంది పిల్లలు తమ తెలిసీ తెలియనిదనంతో గుచ్చుకు΄ోయేలా ఉండే వాడిౖయెన / పదునునైన వస్తువులు చెవుల్లో పెట్టుకుంటారు. ఉదాహరణకు పెన్సిళ్లు, పుల్లలు, పెన్నులు, పిన్నులు వంటివి. వాటితో కర్ణభేరి దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. చెవికి సంబంధించిన ఇన్ఫెక్షన్లు వచ్చే ముప్పు కూడా ఉంటుంది. దాంతో భవిష్యత్తులో వినికిడి సమస్యలు రావచ్చు. అందుకే అలాంటి వస్తువుల నుంచి చిన్నారులను దూరగా ఉంచాలి. నూనె పోయకూడదు : చెవులను శుభ్రం చేయడానికి కొందరు కొబ్బరి నూనె, ఆముదం లాంటివి చెవుల్లో పోస్తుంటారు. అలా ఎంతమాత్రమూ చేయకూడదు. అలా చేయడం వల్ల చెవి ఇన్ఫెక్షన్తో పాటు మరెన్నో సమస్యలు రావచ్చు. ఏవైనా సమస్యలుంటే ఈఎన్టీ వైద్యులతో సరైన చికిత్స తీసుకోవాలి.చర్మ సంరక్షణకోసం... కొంతమందిలో చర్మం పొడిబారడం ఓ సమస్యగా మారుతుంది. ఇలాంటివారు తరచూ మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ రాసుకోవాలి. వేసవికాలంలో ఈ సమస్య పెద్దగా లేక΄ోయినా చలికాలంలో వారిని మరింతగా బాధపెడుతుంటుంది. అందుకే ఆ సీజన్లో తప్పనిసరిగా రాసుకోవాలి. లేకపోతే చర్మం మీద మంట, దురద వస్తాయి. పొడిచర్మం ఉన్నవారి పైచర్మం దోక్కుపోయినప్పుడు... కిందిచర్మం తేలిగ్గా ఇన్ఫెక్షన్(Infection)కు దారితీయవచ్చు. ఎండలోకి వెళ్లేటప్పుడు అది సీజన్ అయినా సరైన ఎస్పీఎఫ్ ఉన్న సన్ స్క్రీన్ రాసుకోవాలి. దీన్ని ప్రతి మూడు గంటలకోమారు రాసుకుంటూ ఉండాలి. వీలైనంత వరకు శరీరమంతా కప్పేలా ఫుల్ స్లీవ్స్ వేసుకోవడం మంచిది. ముఖం మీది చర్మం కూడా కవర్ అయ్యేలా స్కార్ఫ్ ధరించడం మేలు ఇక శరీరంప్లై చర్మం ముడుతలు పడి ఉండే మెడ, భుజాలు, బాహుమూలాల వద్ద, తొడలు, గజ్జల వంటి చోట్ల శుభ్రంగా, పొడిగా ఉంచుకోకపోతే అక్కడ ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. అందుకే స్నానం తర్వాత చర్మం ముడుతలు ఉన్నచోట్ల ప్రత్యేకంగా పూర్తిగా పొడిగా అయ్యేలా టవల్తో తుడుచుకోవాలి.డయాబెటిస్ ఉన్నవారి పాదసంరక్షణకు...ఇవి డయాబెటిస్ ఉన్నవారికే కాకుండా, ఆరోగ్యవంతులు కూడా పాటించడానికి అనువైన నియమాలని గుర్తుంచుకోండి. కాకపోతే డయాబెటిస్ ఉన్నవారికి మరింత మేలు చేస్తాయి. తరచూ తామే స్వయంగా కాలిని పరీక్షించుకుంటూ ఉండాలి. ఇలా చేసే సమయంలో కాలి పైభాగాన్నీ నిశితంగా పరీక్షించుకోవడం వీలవుతుంది. కానీ కిందనుండే పాదం భాగం కనిపించదు కాబట్టి దాన్ని పరిశీలించడానికి పాదాల కింద అద్దం పెట్టి చూసుకోవాలి. అలాగే కాలి వేళ్ల మధ్య భాగాలనూ అంతే నిశితంగా పరీక్షించుకుంటూ ఉండాలి. మొత్తం కాలిభాగంలో ఏ చిన్న పొక్కులాంటిది ఉన్నా దాన్ని విస్మరించకూడదు. భవిష్యత్తులో అది పుండుగా మారే ప్రమాదం ఉంటుంది. డయాబెటిస్ సమస్యతో బాధపడేవారిలో పుండ్లు పడటం వల్ల గ్యాంగ్రీన్ ఏర్పడితే ఒక్కోసారి పూర్తి పాదాన్ని, కాలిని తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పాదాలను ఎప్పుడూ పొడిగా ఉంచుకోవాలి. రోజూ కాళ్లు కడుక్కున్న తర్వాత వెంటనే పూర్తిగా పొడిగా అయ్యేలా తుడుచుకోవాలి. కాలి వేళ్ల మధ్య కూడా పొడిగా ఉండేలా చూసుకోవాలి. ఇలా పొడిబారడం కోసం కాలివేళ్ల మధ్య పౌడర్ రాసుకోవడం మంచిది. మరీ వేడి వస్తువులూ, పదార్థాల నుంచి కాళ్లను దూరంగా ఉంచుకోవాలి. డయాబెటిస్ ఉన్నవారు హాట్ వాటర్ బ్యాగ్తో కాళ్లకు కాపడం పెట్టుకోక΄ోవడమే మంచిది. పాదాలను మృదువుగా ఉంచుకోవాలి. ఇందుకోసం కాళ్లు కడుక్కున్న తర్వాత పొడిగా తుడుచుకొని, ఆ తర్వాత వాజిలైన్ను కాలికీ, వేళ్లకూ మధ్య రుద్దుతూ, ఆ వాజిలైన్ తడిదనం, జిడ్డుదనం పోయేలా పూర్తిగా పొడిబారేంతవరకు మృదువుగా రుద్దాలి. అలా ఎప్పుడూ పొడిగా ఉండేలా చూసుకోవాలి. కాళ్ల మీద పులిపిరి కాయలూ, కాలి కింద ఆనెకాయల్లాంటివి ఏవైనా ఏర్పడితే వెంటనే డాక్టర్కు చూపించుకోవాలి. కాలిగోళ్లను క్రమం తప్పకుండా తొలగించుకోవాలి. ఇలా చేసేటప్పుడు గోళ్లను మరీ లోపలికి కట్ చేసుకోకూడదు. అలాంటప్పుడు ఒక్కోసారి గోరు మూలల్లో రక్తం వచ్చేంతగా గోరు కట్ కావచ్చు. అలా జరిగిన కొందరిలో గోరు లోపలి వైపునకు పెరగవచ్చు. ఇది డయాబెటిస్ రోగుల్లో చాలా ప్రమాదం. కాలికి చెప్పులు, బూట్లు వంటి పాదరక్షలు లేకుండా నడవకూడదు. ఇవి కూడా కాలికి చాలా సౌకర్యంగా ఉండాలి. ఏమాత్రం అసౌకర్యం ఉన్నా ఆ పాదరక్షలు వాడకూడదు. ఎందుకంటే మన సొంత పాదరక్షల వల్ల ఏదైనా చిన్నపాటి గాయం అయినా మళ్లీ అదే గాయం రేగి ఎప్పటికీ మానక΄ోతే అది గ్యాంగ్రీన్గా మారే ప్రమాదం ఉంటుంది. డయాబెటిస్ బాధితుల్లో దీని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇంట్లో కూడా పాదరక్షలు లేకుండా నడవకండి. ప్రత్యేకంగా తడి, తేమలో పనిచేసే మహిళలు (ఆమాటకొస్తే పురుషులు కూడా) స్లిప్పర్స్ వంటివి తొడుక్కునే తమ రోజువారీ ఇంటి పనులు చేసుకోవడం మంచిది. డయాబెటిస్ వ్యాధిగ్రస్తులైతే కనీసం ఏడాదికోసారి ఆర్థోపెడిక్ లేదా మెడికల్ స్పెషలిస్ట్ వంటి కాలి వైద్య నిపుణులకు చూపించుకుంటూ ఉండాలి.చేతుల పరిరక్షణఆహారం తీసుకునే ముందర చేతుల్ని తప్పనిసరిగా శుభ్రంగా కడుక్కోవాలి. ఇక మూత్ర, మల విసర్జన తర్వాత (అంటే వాష్రూమ్కు వెళ్లి వచ్చాక) రెండు చేతులనూ తప్పనిసరిగా శుభ్రంగా కడుక్కోవాలి. దీనికో కారణముంది. వాష్రూమ్ తలుపు తెరిచే సమయంలో ‘నాబ్’ను చాలామంది ముట్టుకుంటారు. వాళ్ల చేతుల్లో ఏవైనా బ్యాక్టీరియల్, వైరల్, ఏకకణజీవుల వంటి పరాన్నజీవులు ఉంటే... వారు ముట్టుకున్న చోటిని మళ్లీ మనం ముట్టుకోవడం వల్ల మనకూ ఆ వైరస్, బ్యాక్టీరియా, ఏకకణజీవులు సంక్రమించవచ్చు. ఇలా జబ్బు ఒకరి నుంచి మరొకరికి వ్యాపించడాన్ని ‘ఫోమైట్ ట్రాన్స్మిషన్’గా చెబుతారు. ఇలా ఈ మార్గంలో వ్యాధులు వ్యాపించే అవకాశం ఉన్నందున వాష్రూమ్కు వెళ్లివచ్చాక తప్పక చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. కాళ్లు / పాదాల శుభ్రత...కాళ్లు లేదా పాదాలకు సమస్య వచ్చినప్పుడు తప్ప వాటి ఉనికినే మనమెవరమూ గుర్తించం. ప్రతిరోజూ పాదాలను పరీక్షించుకుంటూ ఉండటం అవసరం. మరీ ముఖ్యంగా డయాబెటిస్తో బాధపడేవారైతే... రోజూ రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు పాదాలు, మడమలు శుభ్రంగా ఉన్నాయా లేక ఏవైనా పగుళ్లు ఉన్నాయా అన్నది పరీక్షించుకోవాలి. పాదాలపై పుండ్లుగానీ, ఇన్ఫెక్షన్లుగానీ, పగుళ్లుగానీ ఏర్పడకుండా సంరక్షింకుంటూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పాదాలు కడుక్కున్న తర్వాత అవి పూర్తిగా ΄÷డిగా మారేలా తుడుచుకోవాలి. కాలివేళ్ల గోళ్లు తీసుకుంటూ ఉండాలి.గోళ్లను..గోళ్లను క్రమం తప్పకుండా ట్రిమ్ చేసుకోవాలి. అంటే గోరు చివరకంటా కత్తిరించకుండా, కొద్దిపాటి గోరంచు ఉండేలా ఎప్పటికప్పుడు కత్తిరించుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల గోళ్లలో మట్టి చేరదు. ఇలా మట్టిచేరకుండా ఉండేలా జాగ్రత్త తీసుకోవడం వల్ల మనం భోజనం చేసే సమయంలో గోళ్ల ద్వారా ఆహారం కలుషితం కాకుండా ఉంటుంది. (చదవండి: నిజమైన ప్రేమ అంటే ఇది కదా..!) -
భారత్లో పెరుగుతున్న హెచ్ఎంపీవీ కేసులు
న్యూఢిల్లీ: హెచ్ఎంపీవీ(HMPV)కేసులతో పెద్దగా భయపడాల్సిన అవసరం లేదంటున్నప్పటికీ ఈ కేసుల సంఖ్య భారత్లో క్రమేపీ పెరగడం మాత్రం ఆందోళన కల్గిస్తోంది. ఇప్పటివరకూ దేశ వ్యాప్తంగా 8 కేసులు నమోదయ్యాయి. నిన్న(సోమవారం) ఒక్కరోజే నాలుగు కేసులు నమోదు కాగా, నేటి(మంగళవారం) ఉదయానికి ఆ సంఖ్య డబుల్ అయ్యింది. తాజాగా మరో నాలుగు కేసులు చేరడంతో అమ్మో హెచ్ఎంపీవీ ఏం చేస్తుందనే భయం మాత్రం జనాల గుండెల్లో భయం పుట్టిస్తోంది.తాజాగా మహారాష్ట్రలో కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలోని నాగ్పూర్లో మరో రెండు కేసులు నమోదు కావడంతో ఈ కేసుల సంఖ్య భారత్లో ఎనిమిదికి చేరింది. ఇప్పటివరకు కర్ణాటక, గుజరాత్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఈ కేసులు నమోదు కాగా, అది ఇప్పుడు మహారాష్ట్రకు పాకడంతో కాస్త కలవరం ఎక్కువైంది.హెచ్ఎంపీవీపై కర్ణాటక ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలుజనసందడి ప్రదేశాల్లో అనవసరంగా తిరగరాదని, అప్పుడప్పుడు చేతులను సబ్బు, శానిటైజర్తో కడుక్కోవాలని, జ్వరం, దగ్గు, జలుబు ఉన్నవారు బయట తిరగకుండా ఇంట్లోనే ఉండి, చికిత్స పొందాలి.వారు టవల్, దుస్తులను వేరుగా ఉంచుకోవాలి.బహిరంగ స్థలాల్లో తిరిగేటప్పుడు మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోవాలిబహిరంగ స్థలాల్లో ఉమ్మివేయరాదు. జలుబు, దగ్గు ఉంటే సొంత వైద్యం మానుకుని వైద్యులను సంప్రదించి చికిత్స పొందాలి. ఇల్లు, చుట్టు ప్రక్కల ప్రదేశాల్లో కార్యాయాల్లో శుభ్రతను కాపాడుకోవాలి.పోషకాహారాన్ని సేవించాలి, పిల్లలు, వయో వృద్ధుల పట్ల జాగ్రత్త వహించాలి. వైద్య నిపుణులు ఏమంటున్నారంటే..హెచ్ఎంపీవీ విషయంలో జరుగుతున్న ప్రచారం హడలెత్తిస్తోందని... కానీ మరీ అతిగా భయాందోళన అవసరం లేదని వైద్య నిపుణులు అంటున్నారు. గత యాభై, ఆరవై ఏళ్లుగా ఈ వైరస్ వ్యాప్తిలో ఉందని.. ఇది కరోనా(Corona Virus) తరహాలో మహమ్మారిలా మారే ప్రమాదం లేదని వారు చెబుతున్నారు..మాస్కులు, శానిటైజర్లు వంటివి వినియోగించడం, పరిశుభ్రత పాటించడం ద్వారా ఈ వైరస్కు దూరంగా ఉండవచ్చని అంటున్నారు. అలాగని నిర్లక్ష్యం వహించవద్దని, తగిన అప్రమత్తతతో మసలుకోవాలని స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు మాత్రం జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.కేసుల నమోదుతో ఆందోళనచైనా(China)లో హెచ్ఎంపీవీ కేసులు తీవ్రస్థాయిలో నమోదవుతున్నాయన్న ప్రచారం.. దానికితోడు మన దేశంలోనూ ఆరు కేసులు నమోదయ్యాయన్న వార్తలతో జనంలో భయాందోళన వ్యక్తమవుతోంది. బెంగళూరు, మన దేశానికి సంబంధించి వైరస్ వ్యాప్తి అధికంగా లేకపోయినా, పాజిటివ్ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరగకపోయినా.. ప్రసార మాధ్యమాలు, సోషల్ మీడియాలో దీనిపై ఆందోళనకర ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో మరీ భయపడాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వైరస్ లక్షణాలు, ప్రస్తుత పరిస్థితి, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేస్తున్నారు.మహమ్మారిగా మారే ప్రమాదం లేదుఇది కోవిడ్ మాదిరిగా మహమ్మారిగా మారే ప్రమాదం అసలే లేదు. ప్రపంచవ్యాప్తంగా 50, 60 ఏళ్లకుపైగానే ఇది వ్యాప్తిలో ఉంది. దీనివల్ల కేసులు పెరగొచ్చునేమోగానీ తీవ్రత అంత ఉండకపోవచ్చు. మనుషుల్లో యాంటీబాడీస్తోపాటు తగిన మేర రోగ నిరోధక శక్తి ఉంటే ఈ వైరస్ పెద్దగా ప్రభావం చూపదు. సాధారణ ఫ్లూ మాదిరిగానే ఉంటుంది. ఫ్లూ వ్యాక్సిన్ ద్వారా ఈ వైరస్ కేసులు సీరియస్ కాకుండా రక్షణ ఉండవచ్చు. – ప్రొఫెసర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ మెడిసిన్, గాంధీ ఆస్పత్రి -
దేశంలో పెరుగుతున్న HMPV కేసులు
-
ప్రపంచాన్ని వణికిస్తున్న 10 వైరస్లు.. కరోనాకు ముందే..
చైనాలో పుట్టిన హ్యూమన్ మెటా నిమో వైరస్(హెచ్ఎంపీవీ) ఇప్పుడు భారత్ను తాకింది. కరోనాను మరచిపోకముందే హెచ్ఎంపీవీ కేసులు భారత్లో నమోదవుతుండటంతో సర్వత్రా భయాందోళనలు నెలకొన్నాయి. ఈ వైరస్ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అయితే ఈ వైరస్కు ముందే ప్రపంచంలో ఎన్నోవైరస్లు ఉన్నాయి. అవి వివిధ కాలాల్లో జనాలను వణికించాయి. ఈ నేపధ్యంలో ప్రభుత్వాలు ఆ వైరస్ల కట్టడికి పలు చర్యలు చేపట్టాయి.ప్రపంచంలో దాదాపు 3 లక్షల 20 వేల రకాల వైరస్లున్నాయి. ఈ వైరస్లలో అత్యంత ప్రమాదకరమైనవి ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 15 మిలియన్ల మంది ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. కరోనా వైరస్ కంటే ముందు ఏఏ వైరస్లు ప్రపంచాన్ని వణికించాయనే విషయానికొస్తే..రోటా వైరస్రోటా వైరస్ను చైల్డ్ కిల్లర్ వైరస్(Child killer virus) అని కూడా అంటారు. ఇది ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది పిల్లల ప్రాణాలను హరిస్తోంది. ఇది నవజాత శిశువులు, 6 నుండి 8 ఏళ్ల వయసు గల పిల్లలకు ప్రాణాంతకంగా పరిణమిస్తుంది.స్మాల్ పాక్స్దీనిని మశూచి అని అంటారు. ప్రపంచంలోని ఇతర వైరస్లకు మించి 30 నుండి 50 కోట్ల మంది మరణాలకు ఇది కారణంగా నిలిచింది. ఈ వైరస్ పునరుత్పత్తి సంఖ్య 3.5 నుండి 6 మధ్య ఉంటుంది. అంటే ఈ వైరస్ సోకిన వ్యక్తి నుంచి మూడు నుంచి ఆరుగురికి తిరిగి వైరస్ సోకుతుంది. ఈ వైరస్ మరణాల రేటు(Mortality rate) 90 శాతం. అయితే టీకా ద్వారా, ఈ వైరస్ను సమూలంగా నిర్మూలించారు.తట్టుదీనిని మీజిల్స్ అని కూడా అంటారు. ఇది గత 150 ఏళ్లలో దాదాపు 20 కోట్ల మంది ప్రాణాలను బలిగొంది. గతంలో ఈ వ్యాధి ప్రతి ఏటా సుమారు 2 లక్షల మందిని బలితీసుకుంది. అయితే ఈ వైరస్ను వ్యాక్సినేషన్ ద్వారా నియంత్రించారు. మీజిల్స్ వైరస్ సోకిన ఒక వ్యక్తి నుంచి ఈ వైరస్ 18 మందికి సోకే అవకాశముంది.డెంగ్యూదోమల వల్ల డెంగ్యూ వైరస్ వ్యాపిస్తుంది. ఈ వైరస్ను ప్రపంచంలోని 110 దేశాలలో కనుగొన్నారు. ఇది ప్రతి సంవత్సరం సుమారు 10 కోట్ల మందికి సోకుతోంది. వారిలో 20 వేల మంది మరణిస్తున్నారు. ఈ వైరస్ బారిన పడిన వారు తీవ్రమైన అనారోగ్యానికి గురవుతుంటారు.ఎల్లో ఫీవర్(Yellow fever)ఈ వైరస్ సోకిన బాధితుడు తీవ్ర అనారోగ్యానికి గురవుతాడు. బాధితుని ముక్కు, కళ్ళు, నోటి నుంచి రక్తస్రావం జరుగుతుంది. ఈ స్థితికి చేరుకున్న రోగులలో 50 శాతం మంది 7 నుండి 10 రోజుల్లో ప్రాణాలు కోల్పోతారు. ఇప్పటి వరకూ ఎల్లోఫీవర్ ప్రపంచవ్యాప్తంగా రెండు లక్షల మందికి సోకింది. ఈ వైరస్ కారణంగా 30 వేల మంది మృతిచెందారు.ఫ్లూ (ఇన్ఫ్లుఎంజా)ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 5 లక్షల మంది ఫ్లూ కారణంగా మరణిస్తున్నారు. అత్యంత ప్రమాదకరమైన స్పానిష్ ఫ్లూ 10 కోట్ల మందిని బలితీసుకుంది.రేబిస్పురాతన కాలం నుండి రాబిస్ను ప్రమాదకరమైన వ్యాధిగా పరిగణిస్తున్నారు. గబ్బిలం లేదా కుక్క కాటు వల్ల రేబిస్ వచ్చే అవకాశాలున్నాయి. ఈ వ్యాధి కారణంగా ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 60 వేల మంది మరణిస్తున్నారు. రేబిస్ మరణాలు ఎక్కువగా ఆఫ్రికా, ఆగ్నేయాసియాలలో సంభవిస్తున్నాయి.హెపటైటిస్-బీ అండ్ సీహెపటైటిస్ బీ వల్ల ఏటా 7 లక్షల మంది మృతిచెందుతున్నారు. ప్రస్తుతం ఇది అత్యంత ప్రమాదకరమైన వ్యాధులలో ఒకటిగా నిలిచింది. ఈ వైరస్ తొలుత శరీరంలోని కాలేయంపై దాడి చేస్తుంది. దీనికి తగిన చికిత్స అందుబాటులో లేదు. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 3.5 లక్షల మంది హెపటైటిస్ సీ కారణంగా మరణిస్తున్నారు.ఎబోలా- మార్బర్గ్ వైరస్ఎబోలా- మార్బర్గ్ వైరస్లు ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన వైరస్లుగా గుర్తించారు. ఈ వైరస్ల నియంత్రణకు ఇంకా చికిత్స గానీ, వ్యాక్సిన్ను గానీ అభివృద్ధి చేయలేదు. అయితే ఈ వైరస్ల మరణాల రేటు 90 శాతం వరకు ఉంది. ఈ రెండు వైరస్ల లక్షణాలు దాదాపు ఒకేలా ఉంటాయి. వీటి బారిన పడిన బాధితుడు రక్తస్రావ జ్వరం, అవయవ వైఫల్యం లాంటి సమస్యలను ఎదుర్కొంటాడు.హెచ్ఐవీ, ఎయిడ్స్నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నాలుగు కోట్ల మంది హెచ్ఐవి వైరస్తో బాధపడుతున్నారు. ఒక అంచనా ప్రకారం గత 30 ఏళ్లలో ప్రతి సంవత్సరం సుమారు 20 లక్షల మంది ఎయిడ్స్ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటి వరకు దాదాపు 2.5 కోట్ల మంది ఎయిడ్స్ కారణంగా మృతిచెందారు.ఇది కూడా చదవండి: ‘చొరబాట్ల’కు మూడు రూట్లు.. వివిధ రేట్లు.. ఏజెంట్ల మాయాజాలం ఇదే -
మహమ్మారి కాదు మామూలు వైరస్సే
సాక్షి, హైదరాబాద్: ‘హ్యూమన్ మెటా నిమో వైరస్ (హెచ్ఎంపీవీ)’ విషయంలో జరుగుతున్న ప్రచారం హడలెత్తిస్తోందని... కానీ మరీ అతిగా భయాందోళన అవసరం లేదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 50, 60 ఏళ్లుగా ఈ వైరస్ వ్యాప్తిలో ఉందని.. ఇది కరోనా తరహాలో మహమ్మారిలా మారే ప్రమాదం లేదని సూచిస్తున్నారు. మాస్కులు, శానిటైజర్లు వంటివి వినియోగించడం, పరిశుభ్రత పాటించడం ద్వారా ఈ వైరస్కు దూరంగా ఉండవచ్చని చెబుతున్నారు. అలాగని నిర్లక్ష్యం వహించవద్దని, తగిన అప్రమత్తతతో మసలుకోవాలని స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు మాత్రం జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.దేశంలో కేసుల నమోదుతో ఆందోళనచైనాలో హెచ్ఎంపీవీ కేసులు తీవ్రస్థాయిలో నమోదవుతున్నాయన్న ప్రచారం.. దానికితోడు మన దేశంలోనూ ఆరు కేసులు నమోదయ్యాయన్న వార్తలతో జనంలో భయాందోళన వ్యక్తమవుతోంది. బెంగళూరు, చెన్నైలలో రెండు చొప్పున, అహ్మదాబాద్, కోల్కతాలలో ఒక్కో హెచ్ఎంపీవీ కేసు మాత్రమే నమోదయ్యాయి. మన దేశానికి సంబంధించి వైరస్ వ్యాప్తి అధికంగా లేకపోయినా, పాజిటివ్ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరగకపోయినా.. ప్రసార మాధ్యమాలు, సోషల్ మీడియాలో దీనిపై ఆందోళనకర ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో మరీ భయపడాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వైరస్ లక్షణాలు, ప్రస్తుత పరిస్థితి, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేస్తున్నారు.శ్వాస మార్గంలో వృద్ధి చెందే లక్షణంతో..కరోనా వైరస్ తరహాలోనే హెచ్ఎంపీవీ కూడా ‘ఆర్ఎన్ఏ’ రకం వైరస్. అందువల్ల దీనిలోనూ కరోనా తరహాలో జ్వరం, జలుబు, దగ్గు, గొంతునొప్పి, ఒంటి ఒప్పులు తదితర లక్షణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ వైరస్ ప్రధానంగా మనం శ్వాస తీసుకునే మార్గం (రెస్పిరేటరీ ట్రాక్ట్)లోనే వృద్ధి చెందుతుందని... అంటే ఇతర వైరల్ ఇన్ఫెక్షన్ల తరహాలో కొన్నిరోజుల్లో దానంతట అదే తగ్గిపోతుందని వివరిస్తున్నారు. ఇది కలసి వచ్చే అంశమని పేర్కొంటున్నారు. వైరస్ ప్రధానంగా నోటి తుంపరలు, తుమ్ముల ద్వారా వెలువడే తుంపరల ద్వారా వ్యాపిస్తుందని... ఆ తుంపరలు పడిన చోట తాకడం, వైరస్ సోకినవారిని తాకడం ద్వారా ఇతరులకు విస్తరిస్తుందని స్పష్టం చేస్తున్నారు. మాస్కులు, శానిటైజర్ల వాడకం, చేతులను తరచూ శుభ్రం చేసుకోవడం ద్వారా ఈ వైరస్కు దూరంగా ఉండవచ్చని చెబుతున్నారు.ఆందోళన వద్దుకరోనాలా వ్యాప్తి చెందుతూ ఉత్పాతం సృష్టించే లక్షణం హెచ్ఎంపీవీకి చాలా తక్కువ. కరోనా సమయంలోలాగే తుమ్ములు, దగ్గు నుంచి వచ్చే తుంపర్లకు దూరంగా ఉంటూ, చేతులు తరచూ శుభ్రం చేసుకుంటూ, వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ ఉండాలి. మంచి ఆహారం తీసుకుంటూ రోగ నిరోధక శక్తి పెంపొందించుకుంటే ఈ వైరస్ వల్ల ప్రమాదం దాదాపుగా ఉండదు. పైగా ఇప్పుడు అన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థలు అప్రమత్తంగా ఉన్నాయి. ఆందోళన అవసరం లేదు.– డాక్టర్ గురవారెడ్డి, సన్షైన్ హాస్పిటల్స్జాగ్రత్తలతో నివారణ సాధ్యమేచిన్నపాటి ముందు జాగ్రత్తలు పాటిస్తే చాలు హెచ్ఎంపీవీ వైరస్ను దాదాపుగా నివారించవచ్చు. మాస్క్ ధరించాలి. చేతులు శుభ్రపర్చుకుంటూ ఉండాలి. వ్యాధిగ్రస్తుల నుంచి దూరంగా ఉండాలి. చిన్న పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి. వారికి సమయానికి వ్యాక్సిన్లన్నీ ఇప్పించాలి. పెద్దలు, వృద్ధులు జలుబు వంటి లక్షణాలున్నవారి నుంచి దూరంగా ఉండాలి.– డాక్టర్ జయచంద్ర, క్లినికల్ డైరెక్టర్ అండ్ సీనియర్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్చిన్న పిల్లలు, వృద్ధులు జాగ్రత్తచైనాలో హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తి తీవ్రస్థాయికి చేరినట్టు వార్తలు వస్తున్నాయి. ఇది సహజంగానే ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు కారణమైంది. ఈ ఆర్ఎన్ఏ వైరస్ను 2001లో గుర్తించారు. అప్పటి నుంచి ఇది ఏటా చలికాలంలో చిన్న పిల్లలు, వృద్ధుల్లో సీజనల్ వైరల్ అనారోగ్యంగా కొనసాగుతోంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, వృద్ధులకు మాత్రం ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. – జీసీ ఖిల్నానీ, ఢిల్లీ ఎయిమ్స్ పల్మనరీ విభాగం మాజీ హెడ్అతిగా భయాందోళన అనవసరంహెచ్ఎంపీవీ వైరస్ గురించి అతిగా భయాందోళనకు గురికావాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. అయితే బయటికి వెళ్లినప్పుడు, గుంపుల్లోకి వెళ్లినప్పుడు మాస్క్ ధరించడం, చేతులను తరచూ శుభ్రం చేసుకోవడం తదితర జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పటిదాకా వెల్లడైన అంశాల మేరకు ఈ వైరస్ చాలా స్వల్ప లక్షణాలు కలిగి ఉంటుంది. సాధారణ జలుబు మాదిరిగా ముక్కు కారడం, దగ్గు, శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది, గొంతునొప్పి, శ్వాస తీసుకునేప్పుడు ఈల వేసినట్టు శబ్దాలు రావడం, శరీరంపై దద్దుర్లు రావడం వంటి వాటి ద్వారా దీనిని గుర్తించవచ్చు. – డాక్టర్ హరికిషన్ గోనుగుంట్ల, చీఫ్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, యశోద ఆస్పత్రిమహమ్మారిగా మారే ప్రమాదం లేదుఇది కోవిడ్ మాదిరిగా మహమ్మారిగా మారే ప్రమాదం అసలే లేదు. ప్రపంచవ్యాప్తంగా 50, 60 ఏళ్లకుపైగానే ఇది వ్యాప్తిలో ఉంది. దీనివల్ల కేసులు పెరగొచ్చునేమోగానీ తీవ్రత అంత ఉండకపోవచ్చు. మనుషుల్లో యాంటీబాడీస్తోపాటు తగిన మేర రోగ నిరోధక శక్తి ఉంటే ఈ వైరస్ పెద్దగా ప్రభావం చూపదు. సాధారణ ఫ్లూ మాదిరిగానే ఉంటుంది. ఫ్లూ వ్యాక్సిన్ ద్వారా ఈ వైరస్ కేసులు సీరియస్ కాకుండా రక్షణ ఉండవచ్చు. – ప్రొఫెసర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ మెడిసిన్, గాంధీ ఆస్పత్రిహెచ్ఎంపీవీపై నిపుణుల కమిటీ⇒ నియమించిన వైద్య, ఆరోగ్య శాఖ⇒ రాష్ట్రంలో ఇప్పటివరకు ఒక్క కేసూ లేదు⇒ ఎలాంటి భయాందోళనలు వద్దుసాక్షి, అమరావతి: చైనాలో వెలుగు చూసిన హ్యూమన్ మెటా న్యూమో వైరస్ (హెచ్ఎంపీవీ) భారత్లోకి ప్రవేశించింది. గుజరాత్, బెంగళూరుల్లో వైరస్ నిర్ధారణ అయినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సోమవారం ప్రకటించింది. కేరళలోనూ వైరస్ కేసులు వెలుగు చూడటంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మైక్రోబయాలజిస్ట్, పీడియాట్రిక్స్, పల్మనాలజిస్ట్, ప్రివెంటివ్ మెడిసిన్ ప్రొఫెసర్లతో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ నిపుణుల కమిటీని నియమించింది. వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆరోగ్య శాఖ అధికారులతో ఈ అంశంపై సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ కేసులు నమోదు కాలేదని.. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.రాష్ట్రంలో ఐసీఎంఆర్ గుర్తింపు పొందిన ల్యాబ్లు 10, వీఆర్డీఎల్ ల్యాబ్లు 9 సన్నద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అవసరాన్ని బట్టి టెస్టులకు కావాల్సిన కిట్లు, యాంటీవైరల్ మందుల లభ్యతపై అంచనాలు తయారు చేయాలన్నారు. డీఎంఈ, డీహెచ్, సెకండరీ హెల్త్ ఇలా అన్ని విభాగాల అధిపతులు హెచ్ఎంపీవీ లక్షణాలకు సంబంధించిన కేసుల నమోదును క్షుణ్ణంగా పరిశీలించాలని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబుకు సూచించారు. వైరస్ బారినపడకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలపై మార్గదర్శకాలను జారీ చేస్తామన్నారు. అప్రమత్తంగా ఉండండి: సీఎంహెచ్ఎంపీవీ పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం చంద్రబాబు అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలోకి కొత్తగా వచ్చి, వెళ్లే వారిపై దృష్టి పెట్టాలన్నారు. ఎక్కడ అనుమానం ఉన్నా పూర్తిస్థాయి పరీక్షలు జరపాలని ఆదేశించారు. -
‘ఈ వైరస్ ఇప్పటిది కాదు.. 2001లోనే కనుగొన్నారు’
హైదరాబాద్: హ్యూమన్ మెటా న్యూమోవైరస్ (HMPV) వైరస్పై పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని అంటున్నారు తెలంగాణ ఆరోగ్య శాఖామంత్రి దామోదర రాజనర్సింహ(Damodar Raja Narasimha). హెచ్ఎంపీవీ వైరస్ అనేది కొత్త వైరస్ కాదని, 2001లోనే ఈ వైరస్ ఉనికిని గుర్తించినట్లు ఆయన తెలిపారు. నాటి నుంచే ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ వ్యాప్తిలో ఉందన్నారు. ఈ వైరస్ శ్వాసకోశ వ్యవస్థపై స్వల్ప ప్రభావం చూపిస్తుందన్నారు. వ్యాధి సోకిన వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు అతని నోటి నుంచి వచ్చే తుంపర్ల ద్వారా మరొకరికి ఈ వైరస్ వ్యాపిస్తుందన్నారు. చైనాలో ఈ ఏడాది హెచ్ఎంపీవీ కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదుతువున్నట్లు తెలుస్తోందని, ఇతర దేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో దీని తీవ్రత ఎలా ఉందనే పరిస్థితిని సమీక్షిస్తున్నామని దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు.కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులతో మన రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు రెగ్యులర్గా కో-ఆర్డినేట్ చేసుకుంటున్నారని, ఈ వైరస్ విషయంలో ప్రస్తుతానికి భయపడాల్సిన అవసరం లేదని, జాగ్రత్తగా ఉంటే సరిపోతుందన్నారు. రాష్ట్రంలో అన్ని రకాల వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని, ఎటువంటి పరిస్థితిని అయినా ఎదర్కొనేందుకు ప్రభ/త్వం వైద్య పరంగా సంసిద్ధంగా ఉందన్నారు.డిసీజ్ సర్వైలైన్స్ సిస్టమ్ను మరింత బలోపేతం చేయాలని, అన్నిరకాల వనరులతో సిద్ధంగా ఉండాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను, జిల్లా అధికారులను అప్రమత్తం చేయడం జరిగిందన్నారు. సోషల్ మీడియాలో ప్రజలను భయ భ్రాంతులకు గురి చేసేలా నిరాధార తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తే ప్రభుత్వం చాలా సీరియస్గా పరిగణిస్తోందని హెచ్చరించారు దామోదర.కాగా, భారత్లో HMPV ఆందోళన సృష్టిస్తోంది. సోమవారం ఒక్కరోజే నాలుగు కేసులు వెలుగు చూడటం జనాల్లో అలజడి మొదలైంది. భారత్లో ఒక్కరోజే హెచ్ఎమ్పీవీ కేసులు సంఖ్య నాలుగుకి చేరడంతో కలవరం మొదలైంది. తాజాగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఈ వైరస్ కేసు ఒకటి వెలుగు చూసింది. కోల్కతాలో ఐదు నెలల శిశువుకు హెచ్ఎమ్పీవీ పాజిటివ్ వచ్చింది. కర్ణాటక, గుజరాత్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఈ వైరస్ను గుర్తించారు.ఇప్పటికే దీని ప్రభావం చైనా(China)లో అధికంగా ఉంది. అక్కడ వేలాది మంది జలుబు దగ్గ జ్వరం తదితర లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఇది మరో కోవిడ్ విపత్తు అవుతుందా అన్న భయం నెలకొంది. గతంలో కోవిడ్ సృష్టించిన ప్రళయం అంతా ఇంతా కాదు. దాన్ని ప్రజలు ఇంకా మరిచిపోకముందే హెచ్ఎమ్పీవీ విస్తరించడంతో ఒకింత ఆందోళన ఎక్కువైంది. ముందస్తు జాగ్రత్తలపై పలు దేశాలు ఇప్పటికే కీలక సూచనలు చేస్తున్నాయి. ప్రస్తుతానికైతే దీని ప్రభావంపై ఒక అంచనాకు రాలేకపోతున్నా, జా గ్ర త్తలు అవసరమనే విషయం అర్థమవుతోంది. కోవిడ్ సమయంలో ఏవైతే జాగ్ర త్లలు పాటించారో వాటిని తూచా తప్పకుండా పాటిస్తే వైరస్ బారి నుంచి గట్టెక్కే పరిస్థితులు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. -
హెచ్ఎంపీవీ వైరస్..జేపీ నడ్డా కీలక ప్రకటన
సాక్షి,న్యూఢిల్లీ: హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తిపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా కీలక ప్రకటన చేశారు. భయపడాల్సిన పనిలేదని, పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనస్తున్నామని జేపీనడ్డా తెలిపారు. ఈ మేరకు సోమవారం(జనవరి6) ఆయన మీడియాతో మాట్లాడారు.‘హెచ్ఎంపీవీ వైరస్ కొత్తదేమీ కాదు.2001 సంవత్సరంలోనే దీన్ని కనుగొన్నారు. గాలి ద్వారా ఈ వైరస్ సోకుతుంది. శీతాకాలం ప్రారంభంలో ఇది బాగా వ్యాపిస్తుంది. చైనాలో వ్యాపిస్తున్న ఈ వైరస్ను ఎప్పటికప్పుడు గమనిస్తున్నాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ విషయంపై పరిశోధన చేస్తోంది.భారత్లో శ్వాసకోశ సంబంధ సమస్యల తీవ్రత లేదు. ఈ వైరస్పై డైరెక్టర్ జనరల్ హెల్త్ సర్వీసెస్ నేతృత్వంలో జాయింట్ గ్రూప్ సమీక్ష నిర్వహించింది.సమస్య ఎదుర్కోవడానికి యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉంది.ఇదీ చదవండి: హలో.. హెచ్ఎంపీవీ వైరస్తో జాగ్రత్త -
హలో.. హెచ్ఎంపీవీ వైరస్తో జాగ్రత్త
బెంగళూరు: : భారత్లో హ్యూమన్ మెటా న్యూమోవైరస్ (HMPV) ఆందోళన సృష్టిస్తోంది. సోమవారం ఒక్కరోజే నాలుగు కేసులు వెలుగు చూడటం జనాల్లో అలజడి మొదలైంది. కర్ణాటకలో ఇద్దరు చిన్నారులకు ఈ వైరస్ సోకడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో కర్ణాటక(Karnataka) ప్రభుత్వం ముందు జాగ్రత్తగా కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. అవి కరోనా రూల్స్ మాదిరిగానే ఉన్నాయి. నిబంధనలు ఇలా జనసందడి ప్రదేశాల్లో అనవసరంగా తిరగరాదని, అప్పుడప్పుడు చేతులను సబ్బు, శానిటైజర్తో కడుక్కోవాలని, జ్వరం, దగ్గు, జలుబు ఉన్నవారు బయట తిరగకుండా ఇంట్లోనే ఉండి, చికిత్స పొందాలని అందులో తెలిపారు. వారు టవల్, దుస్తులను వేరుగా ఉంచుకోవాలి.బహిరంగ స్థలాల్లో తిరిగేటప్పుడు మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోవాలని కీలక సూచన చేసింది.ఉమ్మివేరాదు. జలుబు, దగ్గు ఉంటే సొంత వైద్యం మానుకుని వైద్యులను సంప్రదించి చికిత్స పొందాలి. ఇల్లు, చుట్టు ప్రక్కల ప్రదేశాల్లో కార్యాయాల్లో శుభ్రతను కాపాడుకోవాలి.పోషకాహారాన్ని సేవించాలి, పిల్లలు, వయో వృద్ధుల పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు. రాష్ట్రంలో గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి డిసెంబర్లో సాధారణ జలుబు, దగ్గు సులుపెరగలేదన్నారు.మెల్లగా విస్తరిస్తున్న హెచ్ఎమ్పీవీదేశంలో హెచ్ఎమ్పీవీ మెల్లగా విస్తరిస్తోంది. భారత్లో ఒక్కరోజే హెచ్ఎమ్పీవీ కేసులు సంఖ్య నాలుగుకి చేరడంతో కలవరం మొదలైంది. తాజాగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఈ వైరస్ కేసు ఒకటి వెలుగు చూసింది. కోల్కతాలో ఐదు నెలల శిశువుకు హెచ్ఎమ్పీవీ పాజిటివ్ వచ్చింది.ఇప్పటికే బెంగళూరులో ఇద్దరు చిన్నారులకు హెచ్ఎమ్పీవీ పాజిటివ్ రాగా, అహ్మదాబాద్లో ఓ చిన్నారికి ఈ వైరస్ సోకింది. దాంతో దేశంలోని రాష్ట్రాలు అప్రమత్తమవుతున్నాయి.భయం వద్దు.. జాగ్రత్తగా ఉండండిచిన్నారుల్లో వైరస్ వ్యాప్తికి హెచ్ఎంపీవీ కొత్త వేరియంట్ ఉండవచ్చునని సూచిస్తున్నప్పటికీ, తమ వద్ద ఇంకా పూర్తి వివరాలు లేవన్నారు కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి దినేష్ గుండూరావుఇదే అంశంపై కేంద్రం మరిన్ని వివరాలు సేకరిస్తోంది. ఈ సందర్భంగా హెచ్ఎంపీవీ వైరస్ కొత్తది కాదని గుర్తించాలి. భయపడొద్దు. ఇది సాధారణంగా దగ్గు, జ్వరం వంటి సాధారణ లక్షణాలను కలిగి ఉంటుంది. తగు జాగ్రత్తలు తీసుకుంటే వైరస్ దానంతట అదే తగ్గుముఖం పడుతుంది’ అని అన్నారు.చైనాలో అధికం..ఇప్పటికే దీని ప్రభావం చైనా(China)లో అధికంగా ఉంది. అక్కడ వేలాది మంది జలుబు దగ్గ జ్వరం తదితర లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఇది మరో కోవిడ్ విపత్తు అవుతుందా అన్న భయం నెలకొంది. గతంలో కోవిడ్ సృష్టించిన ప్రళయం అంతా ఇంతా కాదు. దాన్ని ప్రజలు ఇంకా మరిచిపోకముందే హెచ్ఎమ్పీవీ విస్తరించడంతో ఒకింత ఆందోళన ఎక్కువైంది. ముందస్తు జాగ్రత్తలపై పలు దేశాలు ఇప్పటికే కీలక సూచనలు చేస్తున్నాయి. ప్రస్తుతానికైతే దీని ప్రభావంపై ఒక అంచనాకు రాలేకపోతున్నా, జా గ్ర త్తలు అవసరమనే విషయం అర్థమవుతోంది. కోవిడ్ సమయంలో ఏవైతే జాగ్ర త్లలు పాటించారో వాటిని తూచా తప్పకుండా పాటిస్తే వైరస్ బారి నుంచి గట్టెక్కే పరిస్థితులు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. -
స్టాక్ మార్కెట్కు వైరస్ అటాక్.. కుప్పకూలిన సూచీలు
చైనాలో విజృంభిస్తున్న హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ (HMPV) భారత్లోకి అడుగుపెట్టింది. ఈ వైరస్కు సంబంధించిన రెండు కేసులను ఒకటి కర్ణాటకలో, మరొకటి గుజరాత్లో భారత ప్రభుత్వం నిర్ధారించిన తర్వాత స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులు అప్రమత్తం అయ్యారు. జాగ్రత్త విధానాన్ని ఎంచుకున్నారు. దీంతో అమ్మకాల ఒత్తిడితో దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. దేశీయ బెంచ్మార్క్ ఈక్విటీ సూచీలు బీఎస్ఈ (BSE) సెన్సెక్స్, ఎన్ఎస్ఈ (NSE) నిఫ్టీ 50 వారంలో మొదటి ట్రేడింగ్ సెషన్ను భారీ నష్టాలతో ముగించాయి. కౌంటర్లలో అమ్మకాల ఒత్తిడితో ఒక్కో సూచీ 1 శాతానికి పైగా పడిపోయింది. 30 షేర్ల సెన్సెక్స్ 1,258.12 పాయింట్లు లేదా 1.59 శాతం పతనమై 77,964.99 వద్ద స్థిరపడింది. ఈ రోజు ఈ ఇండెక్స్ 79,532.67 నుంచి 77,781.62 రేంజ్లో ట్రేడవుతోంది.సెన్సెక్స్ను ప్రతిబింబిస్తూ నిఫ్టీ 50 కూడా 388.70 పాయింట్లు లేదా 1.62 శాతం తగ్గి 23,616.05 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 సోమవారం నాడు 24,089.95 గరిష్ట స్థాయిని నమోదు చేయగా, రోజు కనిష్ట స్థాయి 23,551.90గా ఉంది.నిఫ్టీ50లోని 50 స్టాక్లలో 43 స్టాక్లు నష్టాలను చవిచూశాయి. ట్రెంట్, టాటా స్టీల్, బీపీసీఎల్, ఎన్టిపిసి, అదానీ ఎంటర్ప్రైజెస్ 4.60 శాతం వరకు నష్టపోయిన టాప్ లూజర్స్. మరోవైపు అపోలో హాస్పిటల్స్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, టైటాన్ కంపెనీ, హెచ్సిఎల్ టెక్, ఐసిఐసిఐ బ్యాంక్ 1.94 శాతం వరకు లాభాలతో గ్రీన్లో ముగిసిన 7 షేర్లలో ఉన్నాయి.మార్కెట్లలో అస్థిరతను అంచనా వేసే ఫియర్ ఇండెక్స్, ఇండియా VIX, 15.58 శాతం క్షీణించి 15.65 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ స్మాల్క్యాప్ 100, నిఫ్టీ మిడ్క్యాప్ 100 సూచీలు వరుసగా 2.70 శాతం, 3.20 శాతం చొప్పున క్షీణించడంతో విస్తృత మార్కెట్లు కూడా బెంచ్మార్క్లను ప్రతిబింబించాయి.అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి, నిఫ్టీ పిఎస్యు బ్యాంక్ అత్యంత దారుణంగా దెబ్బతింది. 4 శాతం నష్టపోయింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా భారీ నష్టాలను చవిచూశాయి. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ దాదాపు రూ.12 లక్షల కోట్ల మేర క్షీణించి రూ.439 లక్షల కోట్లకు పడిపోయింది.ఉదయం ఇలా..దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Market) సోమవారం ఉదయం ప్రారంభంలో లాభాల్లో ట్రేడయ్యాయి. ఉదయం 9:28 సమయానికి నిఫ్టీ(Nifty) 74 పాయింట్లు లాభపడి 24,082కు చేరింది. సెన్సెక్స్(Sensex) 286 పాయింట్లు ఎగబాకి 79,523 వద్ద ట్రేడయింది. అమెరికా డాలర్ ఇండెక్స్ 108.91 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్(Crude Oil) బ్యారెల్ ధర 76.3 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.6 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 1.26 శాతం లాభపడింది. నాస్డాక్ 1.77 శాతం ఎగబాకింది.దేశీ స్టాక్ మార్కెట్లను ఈ వారం ప్రధానంగా కార్పొరేట్ ఫలితాలు నడిపించనున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సర(2024–25) మూడో త్రైమాసిక ఫలితాల సీజన్ ప్రారంభంకానుంది. దీనికితోడు పారిశ్రామికోత్పత్తి గణాంకాలు సైతం విడుదలకానున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు అక్టోబర్–డిసెంబర్(క్యూ3) ఫలితాలు, ఆర్థిక గణాంకాలపై దృష్టి పెట్టనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఇవికాకుండా ప్రపంచ రాజకీయ, భౌగోళిక అంశాలకూ ప్రాధాన్యత ఉన్నట్లు తెలియజేశారు.ఇదీ చదవండి: మానసిక ఆరోగ్యానికీ బీమా ధీమావారాంతాన(డిసెంబర్ 10న) ప్రభుత్వం నవంబర్ నెలకు పారిశ్రామికోత్పత్తి ఇండెక్స్(ఐఐపీ) గణాంకాలు వెల్లడించనుంది. అక్టోబర్లో ఐఐపీ వార్షికంగా 3.5 శాతం పుంజుకుంది. అంతేకాకుండా డిసెంబర్ నెలకు హెచ్ఎస్బీసీ సర్వీసెస్ పీఎంఐ గణాంకాలు విడుదలకానున్నాయి. వచ్చే నెల మొదట్లో కేంద్ర ప్రభుత్వం సార్వత్రిక బడ్జెట్ను ప్రకటించనుంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
భారత్ లో చైనా వైరస్.. HMPV కలకలం
-
దేశంలో మూడు HMPV కేసులు.. అయినా భయం వద్దు..
బెంగళూరు : చైనాలో పుట్టిన కరోనా వైరస్ తరహాలో హెచ్ఎంపీవీ (hmpv) వైరస్ కోరలు చాస్తోంది. ఇప్పటికే ప్రపంచంలోని పలు దేశాల ప్రజలు ఈ వైరస్ బారిన పడగా.. తాజాగా, భారత్లో మూడు వైరస్ కేసులు నమోదుయ్యాయి. కర్ణాటక రాజధాని బెంగళూరు బాపిస్ట్ ఆస్పత్రిలోని 3, 8 నెలల వయసున్న ఇద్దరు చిన్నారులకు, గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్లో ఒకరికి వైరస్ సోకినట్లు ఐసీఎంఆర్ (icmr) నిర్ధారించింది.వైరస్ కేసుల నమోదుపై కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి కర్నాటక మంత్రి దినేష్ గుండూరావు (dinesh gundu rao) స్పందించారు. భారత్లో రెండు హెచ్ఎంపీవీ వైరస్ కేసులు నమోదయ్యాయని నివేదికలు వెలువడ్డాయి.ఆ రెండు కేసుల్లో ఒక కేసుపై స్పష్టత లేదు. రిపోర్ట్లు సైతం అలాగే ఉన్నాయి. హెచ్ఎంవీపీ అనేది ఇప్పటికే ఉన్న వైరస్. ఇది గత కొనేళ్లుగా వ్యాపిస్తోంది. ఏటా కొంత మంది దీని బారిన పడుతున్నారు. ఇది కొత్త వైరస్ కాదు. ఇక తాజాగా వైరస్ వ్యాప్తి చెందిన చిన్నారి విదేశాల నుంచి ఇక్కడి వచ్చిన దాఖలాలు లేవు. చైనా, మలేషియా, మరే ఇతర దేశంతో సంబంధం లేదు.చైనా నుంచి వచ్చిన రిపోర్ట్లు చిన్నారుల్లో వైరస్ వ్యాప్తికి హెచ్ఎంపీవీ కొత్త వేరియంట్ ఉండవచ్చునని సూచిస్తున్నప్పటికీ, మా వద్ద ఇంకా పూర్తి వివరాలు లేవు. ఇదే అంశంపై కేంద్రం మరిన్ని వివరాలు సేకరిస్తోంది. ఈ సందర్భంగా హెచ్ఎంపీవీ వైరస్ కొత్తది కాదని గుర్తించాలి. భయపడొద్దు. ఇది సాధారణంగా దగ్గు, జ్వరం వంటి సాధారణ లక్షణాలను కలిగి ఉంటుంది. తగు జాగ్రత్తలు తీసుకుంటే వైరస్ దానంతట అదే తగ్గుముఖం పడుతుంది’ అని అన్నారు. After the detection of two hMPV cases in #Karnataka, state Health Minister @dineshgrao said that the report has come out that this is the first case of HMPV in India, which is inaccurate. HMPV is an existing virus that has been circulating for years, and a certain percentage of… pic.twitter.com/1RwELP6hga— South First (@TheSouthfirst) January 6, 2025 -
కుంభమేళాకు కొత్త వైరస్ ముప్పు.. అధికారులు అప్రమత్తం
ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలను బలిగొన్న కరోనా వైరస్ను మరువక ముందే చైనాలో మరో ప్రాణాంతక వైరస్ పుట్టుకొచ్చింది. ఇప్పుడది భారత్నూ తాకింది. తాజాగా కొత్తవైరస్ ఎంపీహెచ్వీకి చెందిన రెండు కేసులు కర్నాటకలో బయటపడ్డాయి. ఈ నేపధ్యంలో ఈనెల 13 నుంచి జరగబోయే కుంభమేళాకు ఈ వైరస్ ముప్పు పొంచివుందనే వార్తలు వినిపిస్తున్నాయి.చైనాలో పుట్టిన ఈ కొత్త వైరస్ను హ్యూమన్ మెటాప్న్యూమో వైరస్(Human metapneumo virus)(హెచ్ఎంపీవీ) అని పిలుస్తారు. చైనాలోని పలు ఆసుపత్రులు ఈ వైరస్ బారిన పడినవారితో నిండిపోయాయి. ఈ వైరస్ సంక్రమణ గత 10 రోజుల్లో 600 రెట్లు పెరిగింది. తాజాగా భారత్లో ఈ వైరస్కు సంబంధించిన రెండు కేసులు నమోదయ్యాయి. ఈ నేపధ్యంలో లక్షలాదిమంది తరలివచ్చే కుంభమేళాపై ఈ వైరస్ ముప్పు పొంచివుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ముప్పును ఎదుర్కోవాలంటే చైనా నుంచి భారత్ వచ్చే వారిపై నిషేధం విధించాలని ఇప్పటికే సాధువులు విజ్ఞప్తి చేశారు. చైనా నుంచి వచ్చే విమానాలను తక్షణమే నిషేధించాలని అఖిల భారతీయ అఖాఢా పరిషత్ అధ్యక్షుడు మహంత్ రవీంద్ర పూరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మరోవైపు కుంభమేళాకు వచ్చే వారి సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే ఈ ముప్పును విస్మరించలేమని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) పేర్కొంది. ఈ నేపధ్యంలోనే కుంభమేళాలో వైరస్ను ఎదుర్కొనేందుకు అవసరమైన పలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు 100 పడకల ఆసుపత్రి(100 bed hospital)ని సిద్ధం చేశారు. వైద్యులు, ఇతర సిబ్బందిని రౌండ్ ది క్లాక్ ఆస్పత్రులలో ఉండేలా చూస్తున్నారు.హెచ్ఎంపీవీ వైరస్ వల్ల ముందుగా శ్వాసకోశ వ్యాధులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ వైరస్ అన్ని వయసుల వారికీ వ్యాపిస్తుంది. అయితే దీని ప్రభావం చిన్న పిల్లలు, వృద్ధులపై ఎక్కువగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. 2019 నవంబర్లో కరోనా వైరస్ పుట్టినప్పుడు, అది ప్రపంచమంతటా పెను సంక్షోభాన్ని సృష్టిస్తుందని ఎవరూ గ్రహించలేదు. నాడు ఈ వైరస్ను దాచేందుకు చైనా తీవ్రంగా ప్రయత్నించింది. అయితే చైనా(China) కుట్ర ప్రపంచానికి తెలిసిపోయింది. 2019 జనవరిలో తొలిసారిగా కరోనా భారతదేశానికి వచ్చింది. తరువాత వైరస్ వ్యాప్తిని అదుపు చేసేందుకు ఆ ఏడాది మార్చిలో దేశంలో లాక్డౌన్ విధించారు. తాజాగా హెచ్ఎంపీవీ వ్యాప్తి దరిమిలా యూపీలోని అలహాబాద్ మెడికల్ అసోసియేషన్.. చైనా నుంచి వచ్చే ప్రయాణీకులందరికీ స్క్రీనింగ్ అవసరమని ప్రభుత్వానికి సూచించింది.ఇది కూడా చదవండి: అధిక ప్లాట్పారంలున్న రైల్వే స్టేషన్లివే.. చర్లపల్లి స్థానం ఎక్కడ? -
బెంగళూరులో ఇద్దరి చిన్నారులకు పాజిటివ్..!
-
HMPV : మళ్లీ మాస్క్ వచ్చేసింది.. నిర్లక్ష్యం వద్దు!
హ్యూమన్మెటాప్ న్యుమో వైరస్(HMPV) భయం లేదు.. ఆందోళన లేదు అనుకుంటూ ఉండగానే మాయదారి వైరస్ మన దేశంలోకి కూడా ప్రవేశించింది.ప్రస్తుతం చైనా దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వైరస్ క్రమంగా ఇండియాతోపలు పలు దేశాల్లోతన ఉనికిని చాటుకుంటోంది. కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మలేషియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భారత్ ఆరోగ్య అధికారులు నొక్కి చెప్పారు. అలా ప్రకటించారో లేదో ఇలా హెచ్ఎంపీవీ వైరస్ తొలి కేసు కర్ణాటక రాజధాని బెంగళూరులో నమోదైంది. ఈవైరస్ బారిన శిశువుకు వైద్యం చేస్తుండగానే మరో చిన్నారికి కూడా ఇలా మూడు కేసులు నమోదు కావడంతో దేశంలో అందోళన మొదలైంది. కొత్తది కాదు మనదేశంలో విస్తరించకుండా ఉండాలేంటే ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. HMPV వైరస్ కొత్తతేదీ కాదు. న్యుమోవిరిడే కుటుంబానికి చెందిన మెటాప్న్యూమోవైరస్ ఒక సాధారణ శ్వాసకోశ వైరస్. శ్వాసకోశ ఇన్ఫెక్షన్ అంటే జలుబుకు కారణమవుతుంది. శీతాకాలంలో సాధారణంగా వచ్చే జలుబు..శ్వాసకోశ సిన్సిటియల్ వైరస్, ఫ్లూ లాంటిదే అంటున్నారు వైద్యులు. సరైన సమయంలో చికిత్స తీసుకుంటే సరిపోతుంది.టీకా లేదుఅయితే ప్రస్తుతానికి దీనికి టీకా అందుబాటులో లేదు కనుక కొన్ని కచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు మాస్క్, శానిటైజేషన్, హ్యాండ్ వాష్, సామాజికి దూరం చాలా ముఖ్యం. 20 సెకన్ల పాటు సబ్బు నీటితో తరచుగా చేతులు కడుక్కోవాలి. అనారోగ్యంతో ఉన్న వ్యక్తులతో దూరాన్ని పాటించాలి. వైరస్బారిన పడిన వారు సెల్ఫ్ ఐసోలేషన్ పాటించడం ఉత్తమం.ఎలా వ్యాపిస్తుందిHMPV సోకిన వ్యక్తిదగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు వచ్చే తుంపరల ద్వారా వ్యాపిస్తుంది. వైరస్-కలుషితమైన వాతావరణాలకు గురికావడం వల్ల కూడా ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందుతుంది.మాస్కే మంత్రం!మాస్క్ కచ్చితంగా ధరించాలిచేతులను శుభ్రంగా కడుక్కోవాలి. సామాజిక దూరాన్ని పాటించాలి.పదే పదే కళ్ళు, ముక్కు , నోటిని తాకడం మానువాలి. అనారోగ్యంగా అనిపిస్తే లేదా దగ్గు, గొంతు నొప్పి లేదా జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే, చికిత్స తీసుకోవాలి.వైరస్ ఇతరులకు వ్యాపించకుండా ఉండేందుకు ఇంట్లోనే ఉండాలిడోర్ నాబ్లు, లైట్ స్విచ్లు , స్మార్ట్ఫోన్లు వంటి కలుషితమైన ఉపరితలాలను క్రమం తప్పకుండా శానిటైజ్ చేయాలి.అనారోగ్యం సంకేతాలను చూపించే వ్యక్తుల నుండి సురక్షితమైన దూరం పాటించాలి.ఈ వైరస్ ఎక్కువగా, పిల్లలు, వృద్ధుల్లో కనిపిస్తోంది కనుక వీరి పట్ల మిగిలిన కుటుంబ సభ్యులు అప్రమత్తంగా ఉండాలి.వేడి నీటిని తాగుతూ, ఆహార పదార్థాలను వేడి వేడిగా తింటూ ఉండాలి.బయటి ఫుడ్కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవాలి.హెచ్ఎంపీవీ లక్షణాలుదగ్గు, జ్వరం. జలుబు,గొంతు నొప్పి, ఊపిరి ఆడకపోవడంఎగువ శ్వాసకోశ ఇన్ఫెక్షన్, కొన్నిసార్లు న్యుమోనియా, ఆస్తమా వంటి ఇతర శ్వాసకోశ వ్యాధులకు దారితీస్తుంది. లక్షణాలు మరింత ముదిరితే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD)గా మారవచ్చు.నోట్: జలుబు, ఫ్లూ లక్షణాలు కనిపిస్తే అందోళన పడకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. లక్షణాలున్నవారు ఐసోలేషన్గా ఉంటే ఇంకా మంచిది. ఇంట్లో చిన్న పిల్లలు, వృద్ధులు ఉన్నవారు మాస్క్, హ్యాండ్ వాష్, స్వీయ శుభ్రత పాటించాలి.