Hypertension
-
మనోళ్లకు బీపీ, షుగర్ ఎక్కువే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజల్లో హైపర్ టెన్షన్ (రక్తపోటు), డయాబెటీస్ మెల్లిటస్ (మధుమేహం) కేసులు ఎక్కువే అని తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. గతేడాది జనవరి–ఆగస్టు మధ్య చేపట్టిన ఇంటింటి సర్వేలో తెలంగాణలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో బీపీ, షుగర్ కేసులు పెరుగుతున్నట్టుగా స్పష్టమైంది. గతంలో చేసిన అధ్యయనంలో వెల్లడైన వివిధ అంశాలను బలపరిచేలా తాజాగా విడుదల చేసిన ‘సెకండ్ రౌండ్ స్క్రీనింగ్, డయాగ్నసిస్ అండ్ ట్రీట్మెంట్ ఆఫ్ హైపర్ టెన్షన్/డయాబెటీస్ మెల్లిటస్, తెలంగాణ స్టేట్’లో అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి. వివిధ జిల్లాల్లోని మారుమూల ప్రాంతాల్లోనూ వ్యవసాయ ఆధారిత ప్రదేశాల్లోనూ బీపీ, షుగర్ కేసులు వెలుగులోకి రావడం.. సర్వే నిర్వహించిన వారిని ఆశ్చర్యచకితులను చేసింది. తమకు హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఉందని తెలియకుండానే తమ రోజువారీ జీవితాలను గడుపుతున్న వారిలో అవగాహన కల్పింపంచి, ఆయా అనారోగ్యాలకు తగిన చికిత్స అందించేందుకు ఉద్దేశించి ఈ సర్వే నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా జీవనశైలి అలవాట్ల కారణంగా ఎదురవుతున్న సమస్యలు, గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య ఉన్న అంతరాలు, తేడాలు గుర్తించేందుకు దీనిని ఎంచుకున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు తమ అనారోగ్య సమస్యలు పెరిగి హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వచ్చి పరీక్షలు నిర్వహించినప్పుడు రక్తపోటు, మధుమేహం బయటపడుతుండడంతో, అన్ని ప్రాంతాల్లో సర్వే నిర్వహించారు. సర్వే చేసింది ఇలా.... రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో 30 ఏళ్లు, ఆపైబడిన టార్గెట్ జనాభాకు సంబంధించి బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్)–5 మార్గదర్శకాలకు అనుగుణంగా ఆయా అంశాల్లో నిర్దేశిత జనాభా శాతానికి అనుగుణంగా రాష్ట్రంలో అధ్యయనం చేశారు. మొత్తంగా చూస్తే...30 ఏళ్లకు పైబడిన టార్గెట్ పాపులేషన్కు సంబంధించి 33 జిల్లాల్లోని 1,68,86,372 మందిని పరీక్షల కోసం గుర్తించారు. ఈ టార్గెట్ జనాభాలోని 1,50,28,690 మందిని (89 శాతం) స్క్రీనింగ్ చేశారు. వీరిలో ఎన్ఎఫ్హెచ్ఎస్–5 ప్రకారం 26 శాతం మందిని అంటే 43,90,457 మందిని పరీక్షించగా 19,31,994 మందికి (అంచనా వేసిన వారిలో 44 శాతం) హైపర్టెన్షన్ కలిగి ఉన్నట్టుగా తేలింది. అదేవిధంగా ఎన్ఎఫ్హెచ్ఎస్–5 ప్రకారం 13శాతం మందిని అంటే 21,95,228 మందిని పరీక్షించగా 10,17,253 మందికి (అంచనా వేసిన వారిలో 46 శాతం) డయాబెటీస్ మెల్లిటస్ కలిగి ఉన్నట్టుగా వెల్లడైంది. ఈ అధ్యయన వివరాలను పరిశీలించినప్పుడు... రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో నిర్వహించిన పరీక్షలకు అనుగుణంగా... వారిలో 46 శాతం మంది షుగర్తో, 44 శాతం మంది బీపీతో బాధపడుతున్నట్టుగా స్పష్టమైంది. ఈ సమాచారానికి అనుగుణంగా చూస్తే...రాష్ట్రంలో మొత్తంగా 10,17, 253 మంది మధుమేహంతో, 19,31,994 అధిక రక్తపోటుతో బాధపడుతున్నట్టుగా డయాగ్నైజ్ అ య్యింది. హైపర్ టెన్షన్, షుగర్లకు సంబంధించి వివిధ జిల్లాల వారీగా గణాంకాలను పరిశీలించినపుడు...రెండింటిలోనూ టాప్–5గా నిలిచిన జిల్లాల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి. -
గ్రామాల్లో పెరుగుతున్న రక్తపోటు, మధుమేహం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని గ్రామాలు, చిన్న చిన్న పట్టణాల్లో కూడా రక్తపోటు, మధుమేహంలాంటి దీర్ఘకాలిక వ్యాధులు పెరుగుతున్నాయి. జీవన విధానంతో పాటు ఆహారపు అలవాట్లలో వచి్చన మార్పులు, ఒత్తిళ్ల నేపథ్యంలో గ్రామాల్లో కూడా నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ (ఎన్సీడీ) బారినపడుతున్న వారి సంఖ్య పెరుగుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. రాష్ట్రంలో ఎన్సీడీ వ్యాధులపై ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన సర్వే వివరాలను ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్.వి.కర్ణన్, ఇతర అధికారులు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు వివరించారు. 30 సంవత్సరాల వయస్సు దాటిన 1.66 కోట్ల మందికి పరీక్షలు జరపగా, 22.94 లక్షల మందికి రక్తపోటు, 11.9 లక్షల మందికి మధుమేహం ఉన్నట్టు గుర్తించినట్లు తెలిపారు. కోఠీలోని టీజీఎంఎస్ఐడీసీ కార్యాలయంలో గురువారం మంత్రి రాజనర్సింహతో జరిగిన ఈ సమావేశంలో సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్వీ కర్ణన్, టీజీఎంఎస్ఐడీసీ ఎండీ హేమంత్, డీఎంఈ వాణి, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, డీహెచ్ రవీందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వ దవాఖానాలలో ఏర్పాటు చేసిన ఎన్సీడీ క్లినిక్లకు బీపీ, షుగర్ వంటి నాన్ కమ్యూనికేబుల్ వ్యాధులతో బాధపడుతున్న రోగులను అనుసంధానం చేయాలని అధికారులకు సూచించారు. ఎన్సీడీ క్లినిక్లలో అందుతున్న వైద్య సేవలపై రోగులకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామాలు, మండలాలు, జిల్లాల వారీగా పేషెంట్ల జాబితాను తయారు చేయాలని మంత్రి ఆదేశించారు. రోగులు క్రమం తప్పకుండా మందులు వాడేలా చూడాలని సూచించారు. బీపీ, షుగర్ పేషెంట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఎన్సీడీ సర్వేను కొనసాగించాలని ఆయన సూచించారు. -
సైలెంట్ కిల్లర్పై హై అలెర్ట్
ఏటా మే నెల 17వ తేదీన ప్రపంచ హైపర్టెన్షన్ డే నిర్వహిస్తారు. 2005వ సంవత్సరంలో ఇది ప్రారంభం అయింది. మనకు తెలియకుండానే మన మనసును కుంగదీసే ఈ అధిక ఒత్తిడి, దాని ద్వారా వచ్చే అధిక రక్తపోటు గురించి అవగాహన కల్పించి దానిని తరిమికొట్టడమే ఈ రోజు ముఖ్య ఉద్దేశం. కాగా ‘మీ రక్తపోటును ఖచ్చితంగా కొలవండి, నియంత్రిం చండి, ఎక్కువ కాలం జీవించండి’ అనే నినాదంతో ఈ ఏడాది హైపర్ టెన్షన్ డేను నిర్వహిస్తున్నారు. సాక్షి, అమరావతి: అత్యధికశాతం గుండెపోటు మరణాలకు, మెదడు, పక్షవాతం, కిడ్నీ సంబంధిత వ్యాధులకు కారణమవుతున్న రక్తపోటును (హైపర్టెన్షన్) సైలెంట్ కిల్లర్గానూ పిలుస్తుంటారు. జీవనశైలికి సంబంధించిన ఈ సమస్య ఒకప్పుడు మధ్యవయస్సు వారు, వృద్ధుల్లో అధికంగా ఉండేది. జంక్ఫుడ్, శ్రమ లేని జీవనశైలి, తగినంత వ్యాయామం లేకపోవడం, ఊబకాయం, ధూమపానం, ఒత్తిడి వెరసి యువత, పిల్లలు సైతం ప్రస్తుతం ఈ సమస్య బారినపడుతున్నారు. చాపకింద నీరులా శరీరానికి ముప్పు తెచ్చిపెడుతున్న హైపర్టెన్షన్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 27.15 శాతం మంది రాష్ట్రంలో 1.96 కోట్ల మంది 30 ఏళ్లు పైబడిన జనాభా ఉంది. కాగా, వీరిలో 27.15 శాతం 53.39 లక్షల మంది హైపర్టెన్షన్తో బాధపడుతున్నట్లు జాతీయ కుటుంబ, ఆరోగ్య సర్వే–5లో అంచనా వేశారు. కాగా, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ సర్వేలో భాగంగా రాష్ట్రంలోని 30 ఏళ్లు పైబడిన వారందరినీ స్క్రీనింగ్ చేసిన వైద్య శాఖ ఇప్పటి వరకు 23.50 లక్షల మందిలో సమస్యను గుర్తించింది. వీరందరికీ ఫ్యామిలీ డాక్టర్, వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ వ్యవస్థల ద్వారా క్రమం తప్పకుండా వైద్య పరీక్షల నిర్వహణ, ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నారు. కళ్ల నుంచి కాళ్ల వరకూ.. పైకి ఎలాంటి లక్షణాలు లేకుండానే లోలోపల తీవ్ర అనర్థాలకు హైపర్టెన్షన్ దారితీస్తుంది. కళ్ల నుంచి కాళ్ల వరకు అన్ని అవయవాలను దెబ్బతీస్తుంది. అధిక రక్తపోటు మూలంగా కళ్లలోని సూక్ష్మ రక్తనాళాలు దెబ్బతిని కంటి చూపు మందగిస్తుంది. గుండె మరింత బలంగా పనిచేయాల్సి రావడంతో గుండె పరిమాణంలో మార్పులు రావచ్చని వైద్యులు చెబుతున్నారు. దీంతో శరీరానికి తగినంత రక్తం సరఫరా అవ్వక గుండె వైఫల్యంకు దారి తీస్తుంది. మెదడులోని రక్తనాళాలు దెబ్బతినడం, బలహీనపడడం, రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడి పక్షవాతం వంటి ఘటనలు సంభవిస్తాయి. మూత్రపిండాల చుట్టూ ఉండే రక్తనాళాలు దెబ్బతినడంతో రక్తాన్ని వడపోసే ప్రక్రియ అస్తవ్యస్తమై, చివరికిది కిడ్నీ వైఫల్యానికి దారితీస్తుంది. బీపీ బారినపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు » ఆహారంలో ఉప్పును తగ్గించాలి. నిల్వ పచ్చళ్లు ఎక్కువగా తినకూడదు. పెరుగు, మజ్జిగలో ఉప్పు కలుపుకోవడం మానేయాలి. » శరీర బరువును అదుపులో ఉంచుకోవాలి. ఒక కిలో బరువు తగ్గినా ఒక ఎంఎంహెచ్జీ రక్తపోటు తగ్గుతుంది. » రోజు అరగంట చొప్పున శారీరక శ్రమ ఉండేలా చూసుకోవాలి. వాకింగ్, జాగింగ్, స్విమ్మింగ్, ఇతర వ్యాయామం చేస్తుండాలి. » ధూమపానం, మద్యపానం వంటి చెడు అలవాట్లు పూర్తిగా విడనాడాలి. పొగతాగడంతో రక్తనాళాలు గట్టిపడే ప్రక్రియ ఎక్కువ అవుతుంది. అదే విధంగా మద్యపానం చేసేవారు 60 ఎంఎల్ కన్నా మించకుండా చూసుకోవాలి. ఒత్తిడే ప్రధాన కారణం బీపీ రెండు రకాలుగా వస్తుంది. ఒకటి వయోభారం రీత్యా, రెండోది షుగర్, థైరాయిడ్, కిడ్నీ సమస్యల కారణంగా వస్తుంది. ఈ మధ్య కాలంలో చిన్న పిల్లల్లో, యువతి, యువకుల్లోను బీపీ కేసులు నమోదు అవుతున్నాయి. ఇంటర్, ఇంజినీరింగ్, ఎంబీబీఎస్ చదివే పిల్లల్లోను ఎక్కువగా బీపీ మేం గమనిస్తున్నాం. ఇందుకు ప్రధాన కారణం ఒత్తిడి. అదే విధంగా పిజ్జా, బర్గర్, ఇతర ఫాస్ట్ ఫుడ్స్ను పిల్లలు, యువత ఎక్కువగా తీసుకోవడం. వీటిల్లో ఉప్పు ఎక్కువగా ఉంటోంది. ఎప్పటికప్పుడు అందరూ బీపీ చెక్ చేయించుకోవాలి. – డాక్టర్ కె.సుధాకర్, ప్రిన్సిపాల్ సిద్ధార్థ వైద్య కళాశాల, విజయవాడ ఏటా చెకప్ చేయించుకోవాలి ఎటువంటి లక్షణాలు లేకున్నా బీపీ వస్తోంది. ఈ క్రమంలో ప్రతి ఒక్కరు ఏటా రక్తపోటు చెకప్ చేయించుకోవాలి. చాపకింద నీరులా విస్తరిస్తూ ఆరోగ్యానికి తీవ్ర నష్టం చేకూరుస్తోంది. అదే విధంగా ఈసీజీ, ఎకో, ట్రెడ్మిల్ టెస్ట్ చేయించుకోవాలి. కొలెస్ట్రాల్ లెవల్ టెస్ట్ చేసుకోవాలి. కొలె్రస్టాల్ గుండెపోటుకు దారితీస్తుంది. మరోవైపు ఒత్తిడిని నియంత్రించుకోవడానికి ప్రయత్నించాలి. ముఖ్యంగా కంటి నిండా నిద్రపోవాలి. – కె.కళ్యాణ చక్రవర్తి, జనరల్ ఫిజిషియన్, గుంటూరు -
లయ తప్పుతున్న గుండె
సాక్షి, అమరావతి: ఇటీవల కాలంలో తరచూ వినిపిస్తున్న మాట.. ‘హార్ట్ ప్రాబ్లమ్’. మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడితో కూడిన జీవనం వెరసి గుండె జబ్బులు ఏటా పెరుగుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లలు సైతం గుండె పోటుతో మరణిస్తున్నారు. దేశంలో ఏటా సంభవిస్తున్న మొత్తం మరణాల్లో 27 శాతం గుండె జబ్బుల వల్లేనని తేలింది. దీంతో ‘గుండె ఘోష’ను ముందే పసిగట్టాలని వైద్యులు సూచిస్తున్నారు. ఛాతీలో నొప్పి, అసౌకర్యం, శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది ఎదురైతే తాత్సారం చేయొద్దని హెచ్చరిస్తున్నారు. ఈ సమస్యలు ఉన్న వారంతా గుండె జబ్బులేనని నిర్ధారణకు రాకుండా.. అవసరమైన పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. అండగా నిలిచిన ఆరోగ్యశ్రీ, ఈసీసీ రాష్ట్రంలో ఏటా గుండె జబ్బులు పెరుగుతున్నాయి. గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారందరికీ ఆరోగ్యశ్రీ అండగా నిలుస్తోంది. 2019–20వ సంవత్సరంలో ఆరోగ్యశ్రీ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా కార్డియాలజీ, కార్డియాక్, కార్డియోథొరాసిక్ సర్జరీ విభాగాల్లో 59,700 చికిత్సలు జరిగాయి. 2022–23 నాటికి ఈ చికిత్సల సంఖ్య ఏకంగా లక్ష దాటింది. అలాగే 2023–24లో కూడా ఈ ఏడాది జనవరి నాటికి 84 వేల మందికి ప్రభుత్వం గుండె జబ్బులకు ఉచితంగా చికిత్సలు చేయించింది. ఏటా పెరుగుతున్న గుండె జబ్బులను పరిగణనలోకి తీసుకుని వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. గుండెపోటు బాధితులకు గోల్డెన్ అవర్లో చికిత్స అందించేందుకు ఎమర్జెన్సీ కార్డియాక్ కేర్(ఈసీసీ) కార్యక్రమాన్ని అమలులోకి తెచ్చింది. ఈ విధానం ద్వారా చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వాస్పత్రుల్లో సైతం ఛాతీనొప్పితో వచ్చే బాధితులకు ఈసీజీ తీసి, కార్డియాలజిస్ట్ల సూచనలతో థ్రాంబోలైసిస్ ఇంజెక్షన్లు చేసి ప్రాణాపాయం నుంచి రక్షిస్తున్నారు. జీవన విధానం మారాలి» 40 ఏళ్లు దాటిన వారు, రిస్క్ ఫ్యాక్టర్స్(బీపీ, షుగర్, ఊబకాయం, ఇతర ఆరోగ్య సమస్యలు) ఉన్నవారు తరచూ జనరల్ చెకప్ చేయించుకోవాలి.» రోజుకు కనీసం 30 నిమిషాలు వాకింగ్, జాగింగ్, స్విమ్మింగ్ వంటివి చేయాలి.» ఆకుకూరలు, చిరుధాన్యాలు, తాజా పళ్లు, కూరగాయలు, గుండె ఆరోగ్యాన్ని పెంచే ఆహారాన్ని తీసుకోవాలి. » రెడ్ మీట్ తినడం తగ్గించాలి. జంక్ ఫుడ్స్కు దూరంగా ఉండాలి.» ధూమపానం, మద్యపానం మానేయాలి.» శరీర బరువు పెరగకుండా జాగ్రత్తలు పాటించాలి.» మానసిక ఒత్తిడి తగ్గించేందుకు యోగా, ధ్యానం చేస్తుండాలి.మనం మారితేనే గుండె పదిలంగతంలో గుండె జబ్బులు వయసు పైబడిన వారికి లేదా వంశపారంపర్యంగా మాత్రమే ఎక్కువగా కనిపించేవి. ప్రస్తుతం అన్ని రకాల వయసు వారిలోనూ గుండె జబ్బులు కనిపిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం మారిన జీవన విధానమే.అధిక మొత్తంలో ఆహారం తీసుకోవడం, అధిక ఒత్తిడికి లోనవ్వడం, శారీరక శ్రమ లేకుండా జీవించడం వంటి విధానాలను మనం వీడాలి. మనం మారినప్పుడే గుండె పదిలంగా ఉంటుంది. అలాగే గుండె జబ్బులకు సంబంధించిన లక్షణాలున్న వారు వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఇప్పటికే సమస్యలున్న వారు క్రమం తప్పకుండా మందులు వాడాలి. – డాక్టర్ ప్రభాకర్రెడ్డి, కార్డియోథొరాసిక్ సర్జరీ విభాగాధిపతి, కర్నూలు జీజీహెచ్ -
హైపర్టెన్షన్కు కారణమేంటి? జీవనశైలిలో మార్పే పరిష్కారమా?
రక్తపోటు బాధితులు తరచూ తమ బీపీని చెక్ చేసుకుంటుండాలి. లేదంటే ఇది దీర్ఘకాలిక వ్యాధులకు దారి తీస్తుంది. మనం ఏదైనా వ్యాధితో బాధపడుతూ వైద్యుని దగ్గరకు వెళ్లినప్పుడు ఆ వైద్యుడు ముందుగా మన రక్తపోటును పరీక్షిస్తారు. ప్రస్తుతం హైపర్టెన్షన్ (అధిక రక్తపోటు) సమస్య దాదాపు అన్ని వయసుల వారిలోనూ కనిపిస్తున్నది.చాలా మంది అధిక రక్తపోటును సాధారణమైనదిగా తీసుకుంటారు. బహుశా ఇది ఎంత ప్రమాదకరమైనదో తెలియకనే ఇలా చేస్తుంటారు. నిజానికి హైపర్టెన్షన్ అనేది ఒక ‘సైలెంట్ కిల్లర్’. ఇది అంతర్గతంగా శరీరానికి ఎంతో హాని కలిగిస్తుంది. రక్తపోటుపై అవగాహన కల్పించేందుకు ఢిల్లీ ఎయిమ్స్ మే 17 నుండి 25 వరకు ‘హైపర్టెన్షన్ వీక్’నిర్వహించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎయిమ్స్ వైద్యులు మాట్లాడుతూ హైపర్టెన్షన్ కేసులు దేశవ్యాప్తంగా పెరుగుతున్నాయని తెలిపారు. ఈ నేపధ్యంలోనే హైపర్టెన్షన్ నుంచి బాధితులకు ఉపశమనం కల్పించేందుకు ఎయిమ్స్ పలు ప్రణాళికలు రూపొందిస్తున్నదని పేర్కొన్నారు.పలు గణాంకాల ప్రకారం భారతదేశంలో దాదాపు 22 కోట్ల మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. అస్తవ్యస్త జీవనశైలే దీనికి ప్రధాన కారణం. ఎయిమ్స్ సీసీఎం విభాగం హెచ్ఓడీ డాక్టర్ కిరణ్ గోస్వామి మాట్లాడుతూ నేటి కాలంలో యువతలో హైపర్టెన్షన్ ఎక్కువగా కనిపిస్తున్నదని, 18 ఏళ్లలోపు పిల్లల్లో కూడా హైపర్టెన్షన్ సమస్య తలెత్తుతున్నదన్నారు.అధిక రక్తపోటుకు ప్రధాన కారణాలు ధూమపానం, పొగాకు వినియోగం, అధికంగా ఉప్పు తీసుకోవడం, శారీరక శ్రమ లేకపోవడం, అధిక బరువు, వేయించిన ఆహారం, ఒత్తిడి కారణంగా రక్తపోటు పెరుగుతోంది. అధిక రక్తపోటు నివారణకు ఆహారంలో పచ్చి కూరగాయలు, శుభ్రమైన పండ్లను చేర్చుకోవాలి. పొగాకు తీసుకోవడం మానివేయాలి. జీవనశైలిలో వ్యాయామం, శారీరక శ్రమలను చేర్చుకోవడం చాలా ముఖ్యం. దీంతో అధిక రక్తపోటును నివారించవచ్చు. దీనితో పాటు 30 ఏళ్లు పైబడిన ప్రతీ ఒక్కరూ రక్తపోటును తరచూ చెక్ చేసుకోవాలి. తద్వారా శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. -
ఓ మదీ మేలుకో..!
గుంటూరు మెడికల్: ఇంట్లో పిల్లలు అదే పనిగా వీడియోగేమ్స్ ఆడుతూ మిగతా పనులను పక్కన పెట్టేస్తున్నారా.. తదేకంగా గంటల తరబడి టీవీలకు అతుక్కుపోయి ఉంటున్నారా.. అయితే వారిని ఓ కంట కనిపెట్టి ఉండాల్సిందే. లేకుంటే చిన్నవయస్సులోనే వారు మానసిక వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉందని మానసిక వ్యాధి నిపుణులు హెచ్చరిస్తున్నారు. గంటలకొద్దీ కంప్యూటర్ ముందు కూర్చుని చాటింగ్లు చేయటం, ఫేస్బుక్లో తలమునకలవుతూ ఉండటం మానసిక వ్యాధులకు కారణమవుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు.సెల్ఫోన్, స్మార్ట్ఫోన్, కంప్యూటర్ వినియోగం బాగా పెరగడం వల్ల మానసిక జబ్బులు ఎక్కువయ్యాయని ఈ–ఎడిక్షన్గా వైద్యులు పేర్కొంటున్నారు. మానసిక వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఏటా మే నెలను ప్రపంచ మానసిక ఆరోగ్య అవగాహన మాసంగా నిర్వహిస్తున్నారు. ఈసందర్భంగా ‘ సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం. జిల్లా వ్యాప్తంగా 35 మంది మానసిక వైద్యనిపుణులు ఉన్నారు. ఒక్కో వైద్యుడి వద్దకు ప్రతిరోజూ 20 మంది వరకు వివిధ రకాల మానసిక సమస్యలతో బాధపడే వారు వస్తున్నారు. గుంటూరు జీజీహెచ్లో రోజూ 100 నుంచి 130 మంది వివిధ రకాల మానసిక సమస్యలతో చికిత్స పొందుతున్నారు. మానసికవ్యాధి లక్షణాలు... చికాకు, కోపం, విసుగు తదితర లక్షణాలు వారానికి పై బడి ఉంటే వారు మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించాలి. తనలో తాను మాట్లాడుకోవటం, ఒంటరిగా తనొక్కడే ఉండి నవ్వుకోవటం, వ్యక్తిగత శ్రద్ధ తీసుకోకపోవటం, చేసిన పనిని పదేపదే చేయాలనుకోవటం, అనవసరమైన ఆలోచల్ని ఆపుకోలేకపోవటం, నిద్రలోపం, బరువుపెరగటం, నిర్ణయాలు తీసుకోవటంలో తీవ్ర జాప్యం చేసి తనమీద ఆధారపడే వారందరిని ఇబ్బందికి గురిచేస్తూ తానూ ఇబ్బందులకు గురికావడం, ఎక్కువ సమయం పనిమీద ఏకాగ్రత లేకుండా కాలక్షేపం చేసే ధోరణిలో ఉండటం, తనకు హాని చేస్తున్నట్లు ఊహించుకుని తగాదాల వరకు వెళ్ళటం, తిరగబడి దాడి చేయటం, వ్యక్తిలో ఉన్న అనుమానాలు ఎన్ని రూపాల్లో నివృత్తి చేసే యత్నం చేసినా ఒప్పుకోకపోవటం తదితర లక్షణాలు మానసిక వ్యాధి సోకిన వారిలో కనిపిస్తాయి. హార్మోన్ల లోపమే కారణం ఒత్తిడి, వ్యసనాలు, మితిమీరిన సెల్ఫోన్, ఎల్రక్టానిక్ పరికరాల వినియోగం వల్ల ప్రస్తుతం మానసిక సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ జబ్బులు వంశపారంపర్యంగానూ అధికంగా వస్తుంటాయి. మెదడులో రసాయనాలు ఊరటంలో మార్పు, మెదడులో గడ్డలు ఏర్పటం, మెదడులో ‘డోపమిన్’ హార్మోన్ లోపం, హార్మోన్ అసమతుల్యం, అసమానత్వం, పుట్టుకతో మెదడు సరిగ్గా ఎదగకపోవటం, ఫిట్స్, నిద్రలేమి వల్ల కూడా మనో వ్యాధులు వస్తాయి. మానసిక వ్యాధులతో ప్రస్తుతం 30 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు వారు ఎక్కువగా బాధపడుతున్నారు. జాగ్రత్తలు తీసుకోవాలి మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఆందోళనకు గురిచేసే విషయాలను పట్టించుకోకూడదు. మద్యం, పొగతాగటం లాంటి వ్యసనాలకు దూరంగా ఉండాలి. ఆరు నుంచి తొమ్మిది గంటలపాటు నిద్రపోవాలి. కుటుంబ సభ్యులందరితో సమయం గడపాలి. రోజూ వ్యాయామం చేయాలి. మానసిక వ్యాధులకు అనేక ఆధునిక మందులు అందుబాటులో ఉన్నాయి. – డాక్టర్ ఇవటూరి శరత్చంద్ర, మానసిక వైద్య నిపుణులు సంఘం రాష్ట్ర కార్యదర్శి, గుంటూరు పిల్లలు, పెద్దలు తేడా లేదు పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ ప్రస్తుతం మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. క్రమశిక్షణ లేని ఆధునిక జీవనశైలే దీనికి కారణం. ప్రతి ఒక్కరూ మానసిక సమస్యలపై అవగాహన కలిగి ఉండాలి. ప్రాథమిక దశలోనే వ్యాధిని గుర్తిస్తే త్వరగా నయం చేసేందుకు అవకాశం ఉంది. మందులతోపాటుగా రోగులకు కౌన్సెలింగ్ చాలా ముఖ్యం. వ్యాధి గ్రస్తులను కుటుంబ సభ్యుల పర్యవేక్షిస్తూ మందులు సక్రమంగా మింగేలా చేస్తే వ్యాధి నుంచి త్వరితగతిన బయటపడతారు. –డాక్టర్ ఐవీఎల్ నరసింహారావు, మానసిక వైద్య నిపుణుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, గుంటూరు నాలుగేళ్లుగా జీజీహెచ్లో మానసిక సమస్యలతో చికిత్స తీసుకున్న వారు ఇలా.. సంవత్సరం రోగుల సంఖ్య 2020 16,529 2021 22,726 2022 28,579 2023 29,371 2024 2,505జీజీహెచ్లో ఉచిత వైద్యం మానసిక వ్యాధులకు జీజీహెచ్లో ఉచిత వైద్య సేవలను అందించటంతోపాటుగా మందులూ పైసా ఖర్చు లేకుండా అందిస్తున్నారు. సోమవారం నుంచి శనివారం వరకు రోజూ 21 నబర్ ఓపీలో వైద్య సేవలు లభిస్తాయి. -
World Hypertension Day 2024 : సైలెంట్ కిల్లర్..పట్టించుకోకపోతే ముప్పే!
పతీ ఏడాది మే 17న ప్రపంచ రక్తపోటు దినోత్సవాన్ని జరుపుకుంటారు. రక్తపోటు స్థాయి సాధారణ స్థాయి కంటే పెరగడాన్నే హైపర్టెన్షన్ అంటారు. ఇది చాలా ప్రాణాంతకమైన వ్యాధి. అధిక రక్తపోటు లేదా హై బీపీను సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారు. ఎందుకంటే ఇది వచ్చిన సంగతి కూడా వ్యక్తులు కనిపెట్టలేకపోవచ్చు. ఈ నేపథ్యంలో హైబీపీ లక్షణాలు, నివారణ మార్గాలను ఒకసారి పరిశీలిద్దాం.వరల్డ్ హైపర్టెన్షన్ డేను 85 జాతీయ రక్తపోటు సంఘాలు లీగ్లతో కూడిన వరల్డ్ హైపర్ టెన్షన్ లీగ్ దీన్ని ప్రారంభించింది. హైపర్టెన్షన్పై అవగాహన పెంచేందుకు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు.హైపర్ టెన్షన్ లక్షణాలుసాధారణంగా హైబీపీ కొన్ని లక్షణాలను చూపిస్తుంది. అయితే రక్తపోటుతో బాధపడుతున్న వ్యక్తులకు ఎటువంటి లక్షణాలు కనిపించవు. కానీ హైపర్టెన్షన్తో బాధపడుతున్న వారు స్ట్రోక్, గుండె జబ్బులు , మూత్రపిండాల రుగ్మతలు వంటి ఇతర ఆరోగ్య పరిస్థితుల ప్రమాదాన్ని కూడా ఎదుర్కొంటారు. అధిక ఒత్తిడి రక్తపోటుకు దారితీయవచ్చు.తీవ్రమైన తలనొప్పి, ఛాతి నొప్పి, గుండె వేగంగా కొట్టుకోవడంతల తిరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందివికారం, వాంతులు అస్పష్టమైన దృష్టి లేదా ఇతర దృష్టి మార్పులుఆందోళన, గందరగోళంచెవుల్లో శబ్దాలు, ముక్కు రక్తస్రావం హైపర్ టెన్షన్ చికిత్స ఆహారంలో ఉప్పును బాగా తగ్గించడం శారీరకంగా చురుగా ఉండటంధూమపానం, మద్యపానాన్ని మానేయడంబరువు ఎక్కువగా ఉంటే తగ్గడంజాగ్రత్తలుకూరగాయలు పండ్లు ఎక్కువ తీసుకోవడంగంటల తరబడి కూర్చోకుండా ఉండటంనడక, పరుగు, ఈత, డ్యాన్స్ లేదా బరువులు ఎత్తడం లాంటి వ్యాయామాలువారానికి కనీసం 150 నిమిషాల ఏరోబిక్ యాక్టివిటీ, లేదా వారానికి 75 నిమిషాల నడక ఉండాలి. ప్రతి వారం 2 లేదా అంతకంటే ఎక్కువ రోజులు వ్యాయామాలు చేయండి. తద్వారా ఊబకాయాన్ని తగ్గించుకోవచ్చు ఆరోగ్య నిపుణులు సూచించిన మందులను తీసుకోవాలి. నోట్ : ఈ లక్షణాలు ఏవైనా కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. రక్తపోటును ముందుగానే గుర్తిస్తే నియంత్రణ సాధ్యమవుతుంది. -
అటెన్షన్ ఉంటే..టెన్షన్ ఎందుకు?
సాక్షి, హైదరాబాద్ : పరీక్షల ఫోబియాతోనే ఇంటర్లో విద్యార్థుల ఉత్తీర్ణత శాతం సగానికి తగ్గుతోంది. హైటెన్షన్కు గురయ్యే విద్యార్థులు 36 శాతం ఉంటుండగా, పరీక్షల షెడ్యూల్ వచ్చాక టెన్షన్కు లోనయ్యేవారు 23 శాతం మంది ఉంటున్నారు. దీనికి సంబంధించి వైద్య, విద్యాశాఖలు రెండేళ్ల అధ్యయనం చేశాయి. మొదటి పరీక్ష కాస్త కష్టంగా ఉన్నా, ఆ ప్రభావం రెండో పరీక్షపై పడుతోందని అధ్యయనంలో వెల్లడైంది. రాష్ట్రంలో ప్రతీ సంవత్సరం ఫస్టియర్ పరీక్షలు 4.09 లక్షల మంది రాస్తున్నారు. సెకండియర్ పరీక్షలు 3.82 లక్షల మంది వరకూ రాస్తున్నారు. వీరిలో సగటున 40 శాతం మంది ఫెయిల్ అవుతున్నారు. దీంతో పరీక్షలు రాసే ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థుల టెన్షన్ దూరం చేసేందుకు ఇంటర్ బోర్డు ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. ప్రిపరేషన్కు ఇదే అదును రెండు నెలల ముందు నుంచే పరీక్షలకు సన్నద్ధమైతే విద్యార్థుల్లో టెన్షన్ ఉండదని ఇంటర్ అధికారులు భావిస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని మూడంచెల విధానం ద్వారా మానసిక ఒత్తిడిని దూరం చేయాలనుకుంటున్నారు. ముందుగా విద్యార్థులను మానసికంగా సన్నద్ధం చేస్తారు. ఒత్తిడికి గురయ్యే విద్యార్థులను గుర్తించి పరీక్షలపై కౌన్సెలింగ్ ఇస్తారు. అవసరమైతే కౌన్సెలింగ్ ఇవ్వడానికి నిపుణులను రప్పించే యోచనలో ఉన్నారు. దీని తర్వాత 60 రోజుల పాటు ముఖ్యమైన పాఠ్యాంశాలపై లెక్చరర్లు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఇందులోనూ విద్యార్థి వెనుకబడి ఉన్న సబ్జెక్టులు, పాఠ్యాంశాలను ఎంపిక చేసుకునే అవకాశాన్ని ప్రిన్సిపల్స్కు ఇస్తారు. మూడో దశలో పరీక్షలపై భయం పోగొట్టేందుకు ఈ 60 రోజులూ పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నారు. దీనివల్ల విద్యార్థుల్లో టెన్షన్ దూరం చేయడం తేలికని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే పరీక్షల టైంటేబుల్ను బోర్డు విడుదల చేసింది. త్వరలో మానసిక ఒత్తిడి తగ్గించేందుకు తీసుకునే చర్యలపైనా జిల్లా ఇంటర్ అధికారులు టైం టేబుల్ ఇవ్వాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ జిల్లాలపై ప్రత్యేక దృష్టి సిలబస్ సకాలంలో పూర్తికాకపోవడం కూడా విద్యార్థుల్లో పరీక్షల టెన్షన్కు ఓ కారణమని అధ్యయనాల్లో తేలింది. దీనివల్ల పరీక్షల్లో ఏమొస్తుందో? ఎలా రాయాలో? అన్న ఆందోళన పరీక్షల సమయంలో పెరుగుతుందని అధ్యయన నివేదికల సారాంశం. ఫెయిల్ అవుతున్న 40 శాతం విద్యార్థుల్లో కనీసం 22 శాతం మంది ఈ తరహా ఆందోళన ఎదుర్కొంటున్నారు. దీనిని పరిగణనలోనికి తీసుకొని కొన్ని జిల్లాలపై ఇంటర్ అధికారులు శ్రద్ధ పెట్టాలని నిర్ణయించారు. ఇంటర్ ఫస్టియర్లో 50 శాతం కన్నా తక్కువ ఫలితాలు కనబరుస్తున్న జగిత్యాల, నిర్మల్, యాదాద్రి, జనగాం, కరీంనగర్, సూర్యాపేట, సిద్దిపేట, మేడ్చల్ వంటి జిల్లాలున్నాయి. సెకండియర్లో మెదక్, నాగర్కర్నూల్, వరంగల్, నారాయణపేట, సూర్యాపేట, హైదరాబాద్, పెద్దపల్లి జిల్లాలున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. కొన్ని ముఖ్యాంశాలు... ♦ ప్రతీ సంవత్సరం పరీక్షలు రాస్తున్న ఇంటర్ విద్యార్థులు – 7 లక్షలకుపైగా ♦ ఫెయిల్ అవుతున్న వారు – 2.5 లక్షల మంది ♦ పరీక్షల ఫోబియా వెంటాడుతున్న విద్యార్థులు – 1.02 లక్షల మంది ♦ పరీక్ష షెడ్యూల్ ఇవ్వగానే భయపడే వారు – 28 వేల మంది ♦ సిలబస్పై టెన్షన్ పడుతున్న విద్యార్థులు – 51 వేల మంది మానసిక ధైర్యం నింపాలి ఈ 60 రోజులూ లెక్చ రర్లది కీలకపాత్ర. పరీక్షల భయం ఉన్న వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేయాలి. వెనుకబడ్డ సబ్జెక్టులపై రివిజన్ చేయించడం ఒక భాగమైతే, వీలైనంత వరకూ పరీక్ష తేలికగా ఉంటుందనే భావన ఏర్పడేలా చూడాలి. దీనివల్ల ఎగ్జామ్ ఫోబియా తగ్గుతుంది. – మాచర్ల రామకృష్ణ గౌడ్, ప్రభుత్వ లెక్చరర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తల్లిదండ్రులదీ కీలకపాత్రే పరీక్షల భయం వెంటాడే విద్యార్థి సైకాలజీని బట్టి అధ్యాపకులు వ్యవహ రించాలి. వారిని ప్రణాళిక బద్ధంగా చదివించే విధా నం అనుసరించాలి. సాధ్యమైనంత వరకూ పరీక్ష వెంటాడుతోందన్న భావనకు దూరం చేయాలి. చదివే ప్రతీ అంశం గుర్తుండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. తల్లిదండ్రులు ర్యాంకులు, మార్కుల కోసం ఒత్తిడి చేయకుండా జాగ్రత్త పడాలి. పరీక్షల పట్ల భయం అనిపిస్తే నిపుణుల చేత కౌన్సెలింగ్ ఇప్పించాలి. – రావులపాటి సతీష్బాబు, మానసిక వైద్య నిపుణుడు స్టడీ అవర్స్ పెడుతున్నాం విద్యార్థుల్లో పరీక్షల భయం పోగొట్టేందుకు 60 రోజుల పాటు ప్రత్యేక కార్య క్రమాలు చేపడుతున్నాం. వెనుకబడ్డ విద్యార్థులను గుర్తించి, స్పెషల్ క్లాసులు నిర్వహించమని ఆదేశాలిచ్చాం. టెన్షన్ పడే విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇవ్వమని ప్రిన్పిపల్స్కు చెప్పాం. అవసరమైతే టెలీ కౌన్సిలింగ్ కూడా ఇప్పించే ప్రయత్నం చేస్తున్నాం. – జయప్రదాబాయ్,ఇంటర్ పరీక్షల విభాగం అధికారిణి -
ఒబెసిటీ, హైబీపీ ఎక్కువే.. పన్నీర్, జంక్ ఫుడ్, నాన్ వెజ్ వల్ల..
సాక్షి, హైదరాబాద్: దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే జీవనశైలి వ్యాధుల సూచికల్లో తెలంగాణ పరిస్థితి అత్యంత పేలవంగా ఉందని తాజా అధ్యయనం తేల్చింది. అలాగే స్థూలకాయం, రక్తపోటు కేసుల సంఖ్య సైతం రాష్ట్రంలోనే ఎక్కువగా నమోదవుతున్నాయని వెల్లడించింది. ‘మెటబాలిక్ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ హెల్త్ రిపోర్ట్ ఆఫ్ ఇండియా: ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్–ఇండియా డయాబెటిస్ (ఐసీఎంఆర్ ఐఎన్డీఐఏబీ) పేరిట లాన్సెట్ రూపొందించిన నివేదిక ప్రకారం రాష్ట్రంలో 25 శాతం మంది సెంట్రల్ ఒబేసిటీ, హైపర్టెన్షన్తో బాధపడుతున్నారు. దేశవ్యాప్తంగా 2008 అక్టోబర్ 18 నుంచి 2020 డిసెంబర్ 17 మధ్య మొత్తం 1,13,043 మంది (గ్రామీణ ప్రాంతాల నుంచి 79,506 పట్టణ ప్రాంతాల నుంచి 33,537 మంది)పై నిర్వహించిన అధ్యయన ఫలితాలను లాన్సెట్ ఇటీవల ప్రచురించింది. ఊబకాయం కేసులలో తెలంగాణ రాష్ట్రం.. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, మణిపూర్, మిజోరం, హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, చండీగఢ్, హరియాణా, ఢిల్లీల సరసన నిలుస్తోంది. దీనికి కారణం ఉదర ఊబకాయం, ట్రైగ్లిజరైడ్స్కు మధ్య దగ్గరి సంబంధం ఉండటమేనని వైద్య నిపుణులు అంటున్నారు. శారీరక శ్రమ లేకపోవడం.. ప్రాసెస్డ్ ఫుడ్ తినడం.. లాన్సెట్ నివేదిక ప్రకారం తెలంగాణ ప్రజల్లో ఊబకాయం, రక్తపోటు, ట్రైగ్లిజరిడెమియా సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ‘ఇది తక్కువస్థాయి శారీరక శ్రమతోపాటు ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తినడం వల్ల పెరుగుతున్న సమస్య. ట్రైగ్లిజరైడ్స్, యూరిక్ యాసిడ్ స్థాయిలు ఎక్కువగా ఉన్న రోగులను ఇప్పుడు తరచుగా చూస్తున్నాం. ఇవి మెటబాలిక్ సిండ్రోమ్ సంకేతాలు. చికిత్స తీసుకోకుంటే గుండె, మూత్రపిండాలపై దీర్ఘకాలిక ప్రభావం చూపుతాయి’’ అని నిజామాబాద్ మెడికల్ కాలేజీకి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కిరణ్ మాదల వివరించారు. హైపర్ టెన్షన్... స్లీప్ అప్నియాలకూ దోహదం.. ‘పన్నీర్, జంక్ ఫుడ్, మాంసాహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల అధికస్థాయి కొలస్ట్రాల్ సమస్యలు వస్తున్నాయి. దీనికితోడు డెస్క్ జాబ్లు సెంట్రల్ ఒబేసిటీకి దారితీస్తున్నాయి. ఊబకాయంతో గుండె జబ్బులు, మధుమేహమే కాకుండా హైబీపీ, స్లీప్ యాప్నియా వంటి ఇతర జబ్బులు కూడా ఎక్కువగా వస్తున్నాయి. రాష్ట్రంలో ఈ సమస్యలకు అధిక మద్యపానం కూడా ఒక ప్రధాన కారణం’ అని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. అలవాట్లను కట్టడి చేస్తేనే.. పొత్తికడుపు ప్రాంతంలో కొవ్వు అధికంగా చేరడాన్నే సెంట్రల్ ఒబేసిటీగా పేర్కొంటారు. పెరిగిన విసరల్ ఫ్యాట్ పోర్టల్ బ్లడ్ సిస్టమ్ ద్వారా సరఫరా అవుతుంది కాబట్టి ఈ ప్రాంతంలోని అదనపు కొవ్వు రక్తప్రవాహంలోకి కొవ్వు నిల్వలను విడుదల చేస్తుందన... ఇది అనారోగ్య సమస్యలను కలిగిస్తుందని వైద్యులు అంటున్నారు. ఈ నేపధ్యంలో వ్యాయామం, శారీరక శ్రమను జీవనశైలిలో భాగం చేసుకోవడంతోపాటు ఆహారపు అలవాట్లను నియంత్రించుకోవడం తప్పనిసరని వారు సూచిస్తున్నారు. -
విజృంభిస్తున్న జంటభూతాలు.. అప్రమత్తం కాకుంటే ప్రమాదమే..
సాక్షి, విజయవాడ: ప్రస్తుతం ఆధునిక జీవన విధానంలో ప్రజలను జంట భూతాలు పీడిస్తున్నాయి. నిండా నాలుగు పదులు దాటకుండానే చాలామంది వీటి బారిన పడి ఇల్లు, వళ్లు గుల్ల చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ప్రజల జీవన శైలి, ఆహార అలవాట్లే దీనికి కారణమని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికైనా అప్రమత్తం కాకుంటే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. ►విద్యాధరపురానికి చెందిన 30 ఏళ్ల సురేష్ ఓ ప్రయివేటు సంస్థలో పనిచేస్తుంటాడు. ఇటీవల విధి నిర్వహణలో తీవ్ర వత్తిడికి గురవుతున్నాడు. ఒకరోజు ఎక్కువ నీరసంగా ఉండటంతో వైద్య పరీక్షలు చేయించుకోగా, అధిక రక్తపోటు ఉన్నట్లు తెలిసింది. అంతేకాదు కిడ్నీల సమస్య కూడా తలెత్తింది. ►నీటిపారుదల శాఖలో పనిచేసే 26 ఏళ్ల వెంకట్కు ఇటీవల ఆకలి ఎక్కువగా ఉండటం, చెమటలు పట్టడంతో వైద్య పరీక్షలు చేయించుకున్నాడు. శరీరంలో అధిక షుగర్ లెవల్స్తో పాటు హెచ్బీఏ1సీ 11కు చేరింది. అదృష్టవశాత్తు ఇంకా అవయవాలపై ప్రభావం చూపలేదు. ►ఇలా వీరిద్దరే కాదు మధుమేహం, రక్తపోటులకు గురై చికిత్సకోసం ప్రభుత్వాస్పత్రికి 30 నుంచి 40 ఏళ్ల మధ్యవారు నిత్యం 10 నుంచి 15 మంది వరకూ వస్తున్నారు. వీరిలో కొందరికి అప్పటికే అవయవాలపై ప్రభావం చూపడంతో ఆయా విభాగాలకు వెళ్లి చికిత్స పొందుతున్నారు. విజయవాడలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో గుండె, కిడ్నీ సమస్యలతో చికిత్స పొందుతున్న వారిలో 80 శాతం మందికి ఈ రెండు వ్యాధులే కారణమని వైద్యులు అంటున్నారు. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన సర్వే ప్రకారం జిల్లాలో 30 సంవత్సరాలు దాటిన వారిలో 13 శాతం మంది మధుమేహులు, 11.5 శాతం మంది బీపీతో బాధపడుతున్నట్లు తేలింది. జంట వ్యాధులకు కారణాలివే... ►కదలిక లేని జీవన విధానం (శరీరానికి వ్యాయామం లేక పోవడం) ►ఆధునిక జీవనశైలిలో వత్తిళ్లు పెరిగిపోవడం ►ఆహారపు అలవాట్లలో మార్పులు ►కార్పోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే జంక్ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం, ►వంశపారంపర్యం(తల్లిదండ్రులకు షుగర్, బీపీలు ఉండటం) అదుపునకు ఏమి చేయాలి ►ప్రతిరోజూ 45 నిమిషాలు, కనీసం వారంలో ఐదు రోజుల పాటు వ్యాయామం, వాకింగ్ లాంటివి తప్పక చేయాలి. ►విధి నిర్వహణలో, జీవితంలో ఎదుర్కొనే వత్తిళ్లను అధిగమించేందుకు యోగా చేయడం మంచిది. ►ఆహారంలో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండేలా చూసుకోవాలి, మాంసాహారం, జంక్ఫుడ్స్ను తగ్గిస్తే మంచిది. ►పీచు పదార్ధాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం, తాజా పళ్లు, తాజా కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా తినాలి. ►శరీరంలో బీపీ, చక్కెర స్థాయిలు, కొలస్ట్రాల్ను అదుపులో ఉంచుకునేలా తరచూ పరీక్షలు చేయించుకోవాలి. ►ప్రతి మనిషి నెలకు 500 గ్రాములకు మించి వంట నూనెలు వాడరాదు. అధికంగా నూనెలు వినియోగించడం చాలా ప్రమాదకరం. ►ఒకే నూనె కాకుండా మార్చి మార్చి వాడటం మంచిది. జీవనశైలిలో మార్పులతోనే... అధిక రక్తపోటుతో తలెత్తే దుష్పలితాలతో ప్రభుత్వాస్పత్రికి వస్తున్న వారి సంఖ్య పెరుగుతున్నారు. ముఖ్యంగా 30 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు వారు సైతం బీపీతో పక్షవాతం వంటి వాటికి గురై చికిత్సకోసం వస్తున్నారు. అదుపులో లేని మధుమేహం, రక్తపోటుకు జీవనశైలిలో మార్పులే కారణం. ఎక్కువసేపు కూర్చుని పనిచేయడం, విధి నిర్వాహణలో వత్తిళ్లు కూడా కారణమే. వ్యాయామం అసలు ఉండటం లేదు. ప్రతిరోజూ కనీసం 45 నిమిషాలు వ్యాయామం చేయాలి. త్వరగా డైజీషన్ అయ్యే అహారం, కార్పోహైడ్రేడ్స్ ఎక్కువుగా ఉండే ఫాస్ట్ఫుడ్ను తీసుకోవడం కూడా రక్తపోటుకు కార ణమే. – డాక్టర్ ఎస్.దుర్గాప్రసాద్, ఫిజీషియన్, ప్రభుత్వాస్పత్రి మధుమేహులు పెరుగుతున్నారు యువతలో మధుమేహులు రోజు రోజుకు పెరుగుతున్నారు. శరీరంలో షుగర్ స్థాయిలో అదుపులో లేకున్నా, యువత మందులు సరిగా వాడక పోవడంతో దాని ప్రభావం కిడ్నీలు, గుండె, కన్ను వంటి అవయవాలపై పడుతుంది. తమ వద్దకు మధుమేహంలో కిడ్నీలు డ్యామేజ్ అయిన మధ్య వయస్సు వారిని చూస్తున్నాం. మధుమేహాన్ని ఆశ్రద్ద చేయడం మంచిది కాదు. ప్రతిరోజూ వ్యాయామం, శ్రమైక జీవన విధానం, సమతుల్య ఆహారంతో పాటు, క్రమం తప్పకుండా మందులు వాడటం ద్వారా మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు ప్రీ డయాబెటీస్ స్టేజ్లో ఉన్న వారు ముందస్తు జాగ్రత్తలతో మేలుకోవాలి. – డాక్టర్ కొండా వేణుగోపాలరెడ్డి, మధుమేహ నిపుణులు -
జంట జబ్బులతో జర భద్రం!
సాక్షి, అమరావతి : ఉరుకులు పరుగుల జీవితం.. నిరంతరం పనిఒత్తిడి.. మారుతున్న ఆహారపు అలవాట్లు.. వెరసి రాష్ట్రంలో చాలామందిని 30 ఏళ్లకే ‘రక్తపోటు, మధుమేహం’ పలకరిస్తున్నాయి. గతంలో పట్టణాలు, నగర వాసుల్లోని 45 నుంచి 50 ఏళ్లు పైబడిన వారిలో ఎక్కువగా ఈ జంట జబ్బుల సమస్య కనిపించేది. ప్రస్తుతం పల్లె, పట్టణం, నగరం అనే తేడాలేకుండా యుక్తవయస్సుల వారూ వీటి బారినపడుతున్నారు. కోనసీమలో అధికం.. ప్రజల్లోని జీవనశైలి జబ్బులను ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స అందించడం ద్వారా వారికి స్వస్థత కల్పించేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఎన్సీడీ–సీడీ సర్వే చేపడుతోంది. అందులో భాగంగా ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా మూడుకోట్ల మందికి పైగా ప్రజలను వైద్య సిబ్బంది స్క్రీనింగ్ చేశారు. వీరిలో 1.87 కోట్ల మంది 30 ఏళ్ల వయస్సు పైబడిన వారిగా ఉన్నారు. ఇందులో 26.35 శాతం అంటే 49,54,106 మందిలో రక్తపోటు, 25.64 శాతం అంటే 48,20,138 మందిలో మధుమేహం ఉన్నట్లు గుర్తించారు. ఇక అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 6,82,189 మందిలో 30 ఏళ్లు పైబడిన వారిని స్క్రీనింగ్ చేయగా అత్యధికంగా 38.02 శాతం మందిలో రక్తపోటు, 35.54 శాతం మందిలో మధుమేహం ఉన్నట్లు గుర్తించారు. ఎన్సీడీ క్లినిక్ల నిర్వహణ జీవనశైలి జబ్బుల నియంత్రణలో భాగంగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఎన్సీడీ క్లినిక్లు నిర్వహిస్తోంది. 17 జిల్లా, 51 ఏరియా ఆస్పత్రులు, 177 సీహెచ్సీల్లో ఈ ఎన్సీడీ క్లినిక్లు ఏర్పాటుచేశారు. అదే విధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ) స్థాయిల్లోను వీటిని నిర్వహిస్తున్నారు. కారణాలివే.. ► ఊబకాయం ► ధూమపానం, మద్యపానం ► తీవ్రఒత్తిడికి లోనవడం ► శారీరక శ్రమ లేకపోవడం ► అతిగా జంక్ఫుడ్ తినడం రక్తపోటు లక్షణాలివే.. తరచూ తలనొప్పి, కళ్లు తిరగడం, కంటి చూపులో మార్పులు, మూర్ఛరావడం జరుగుతుంది. ఎప్పుడూ చికాకుగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఒక్కోసారి ఏదైనా అవయవం దెబ్బతింటే దాని తాలూకు లక్షణాలు బహిర్గతమవుతాయి. కొందరిలో ఎటువంటి లక్షణాలు బయటపడకుండా కూడా ఉంటుంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ► శారీరక శ్రమ ఉండేలా చూసుకోవాలి ► మధుమేహం, రక్తపోటు బాధితులు సక్రమంగా మందులు వేసుకోవాలి. వైద్యులను సంప్రదిస్తూ ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకోవాలి. ► తేలికపాటి వ్యాయామాలు చేయాలి. రోజు అరగంట పాటు నడక ఉత్తమం. ► తాజా ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు తినాలి. జంక్, ఫాస్ట్ ఫుడ్స్ను తినకుండా ఉండటం మంచిది. ► పోస్ట్ కోవిడ్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారు ఖచ్చితంగా బీపీ, షుగర్ పరీక్షలు చేయించుకోవాలి. వాటిని కంట్రోల్లో ఉండేలా చూసుకోవాలి. ► ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా చూసుకోవాలి. ► గర్భిణులు మధుమేహం బారినపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి వారు మ«ధుమేహం పరీక్షలు చేయించుకోవాలి. -
Health Tips: పచ్చళ్లు అతిగా తింటే అనర్థమే! ముఖ్యంగా పురుషులకు..!
What Happens If We Eat Pickles Everyday: వేడి వేడి అన్నంలో ఎర్రెర్రగా ఇంత ఆవకాయో, మాగాయో, ఇతర ఊరగాయ పచ్చళ్లో రోటిపచ్చళ్లో వేసుకుని తింటే వచ్చే రుచే వేరు. అందుకే అందరూ పచ్చళ్లకోసం నాలుక తెంపుకుంటూ ఉంటారు. అయితే రుచిగా ఉందని పచ్చడే పరమాన్నంలా రోజూ తింటూ ఉంటే ముప్పు తప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందులోనూ మహిళల కంటే మగవాళ్లకు ఈ ముప్పు మరికాస్త ఎక్కువ ఉంటుందంటున్నారు. ఇంతకూ ఆ ముప్పు ఎందుకో, ఏమిటో చూద్దాం... తక్కువగా తినండి! నవకాయ పిండి వంటలు చేసి నిండుగా విస్తరిలో వడ్డించినా పచ్చడికోసం వెతుక్కోవడం తెలుగు వారి స్వభావం. అన్నంలోనే కాదు, వేడివేడి ఉప్మా, దోసె, వడ, ఇడ్లీ.. ఇలా ఒకటేమిటి ప్రతిదానినీ పచ్చడితో లాగిస్తుంటారు. పచ్చళ్లు అతిగా తింటే అనర్థాలూ ఎక్కువేనంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేమిటో తెలుసుకుందాం... పచ్చళ్లను తక్కువగా తీసుకునే ప్రయత్నం చేద్దాం. బీపీ అమాంతం పెరిగితే! పచ్చళ్లు ఎక్కువగా తినడం వల్ల అవి నిల్వ ఉండటం కోసం వేసే ఉప్పు వల్ల ముప్పు పొంచి ఉంటుంది. బీపి ఉన్న వారికి అమాంతం పెరిగిపోతే, ఇంతవరకూ ఆ సమస్యే లేని వారికి అధిక రక్తపోటు సమస్య తలెత్తుతుంది. ప్రిజర్వేటివ్స్ వల్ల హైపర్ టెన్షన్ రోగులకు కూడా ప్రమాదకరమే. ముఖ్యంగా మార్కెట్లో కొనుగోలు చేసే పచ్చళ్లలో ప్రిజర్వేటివ్స్ అధికంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. అదేవిధంగా పచ్చళ్లు ఎక్కువగా తింటే కడుపులో పుళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది. పొట్టలో, పేగుల్లో పొంచి ఉండే కొవ్వు.. గుండెజబ్బులు మార్కెట్లో విక్రయించే పచ్చళ్లకు రుచి కోసం నూనె, మసాలా ఎక్కువగా వాడుతారు. ఇవి ఆరోగ్యానికి హాని చేకూరుస్తాయి. ఎక్కువ ఆయిల్ తీసుకోవడం వల్ల.. మసాలాల కారణంగా.. పైల్స్ వచ్చే ప్రమాదం ఉంది. వాటితోపాటు కొలెస్ట్రాల్ వంటి ఇతర అనారోగ్య సమస్యలూ తలెత్తుతాయి. తద్వారా గుండెజబ్బులు కాచుకుని ఉంటాయి. అందువల్ల పచ్చడి అంటే ఎంత ఇష్టం ఉన్నా, పరిమితంగానే పుచ్చుకోవడం మంచిది. మరీ తినాలనిపిస్తే సాధ్యమైనంతవరకూ ఇంట్లో చేసిన పచ్చళ్లను.. అది కూడా నూనె, ఉప్పు, కారం తక్కువ పాళ్లలో కలిపిన వాటిని... అదీ కొద్ది కొద్దిగానే తీసుకోవడం మంచిది. చదవండి: Pachi Batani Health Benefits: పురుషులు పచ్చి బఠానీలు ఎక్కువగా తిన్నారంటే.. Potassium Deficiency Symptoms: పొటాషియం లోపిస్తే జరిగేది ఇదే! వీటిని తింటే మేలు.. -
Health Tips: ఉప్పు, కారంతో పాటు ఆ అలవాట్లూ తగ్గించండి! లేదంటే!
హైపర్ టెన్షన్తో దాదాపు 10 శాతానికి మించి గుండె జబ్బుకు గురవుతున్నట్లు వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి. హైపర్టెన్షన్తో ఉన్నవారిలో పది శాతం మంది పక్షవాతం బారిన పడగా మరో అయిదు శాతం కిడ్నీసమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ టెన్షన్ వల్ల కొందరికీ బ్రెయిన్ స్టోక్ కూడా వచ్చే ప్రమాదముంది. ఇటీవల కాలంలో బ్రెయిన్ స్టోక్, గుండెకు సంబంధించిన కేసులు పెరుగుతున్నాయి. హైపర్టెన్షన్ ఉన్నవారికీ కిడ్నీ రక్తనాళంలో అడ్డంకులు ఏర్పడుతాయి. దీనివల్ల కిడ్నీ దెబ్బతిని పని వేయకుండా పోయే ప్రమాదముంది. అదే విధంగా రక్తనాళాల్లో బ్లాక్లు ఏర్పడడం వల్ల గుండె, బ్రెయిన్ స్ట్రోక్లు వస్తున్నాయి. చిత్రం ఏమిటంటే, చాలామందికి తమకు హైపర్ టెన్షన్ ఉన్నట్లు కూడా తెలియకపోవడం. అయితే హైపర్ టెన్షన్ను గుర్తించగలిగితే దాని వల్ల కలగబోయే ముప్పును నివారించుకోవచ్చు. గుర్తించటం ఎలా? బీపీ తీవ్ర స్థాయికీ పెరిగినప్పుడు ముందు తలదిమ్ము మొదలవుతుంది. తర్వాత వివరీతమైన తలనొప్పి, నిద్రలేమి, చూపు మసక బారటం, విపరీతమైన అలనట, చెవుల్లో రింగుమని శబ్దాలు రావడం, శ్వాన తీనుకోవడంలో ఇబ్బంది, గుండె దడ, తికమక పడటం లక్షణాలు కనిపిస్తాయి. రాకుండా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ►ప్రతిరోజూ తవ్పని నరిగ్గా 30 నుంచి 45 నిమిషాలు నడవాలి ►అస్తమానం కుర్చీకే అతుక్కుని కూర్చోకుండా ప్రతి అరగంటకు ఒకసారి లేచి నాలుగు అడుగులు వేస్తుండాలి. ►నిత్యం వ్యాయామం, యోగా చేయాలి. ►చిన్న చిన్న విషయాలకు టెన్షన్కు గురికావద్దు ►ఉదయం, సాయంత్రాల్లో మంచి వాతావరణంలో చక్కటి సంగీతం వినడం మంచిది. ►టెన్షన్కు గురవుతున్న నమయంలో నచ్చిన వారితో మాట్లాడడం, మనసుకు నచ్చిన పనులు చేయడం వల్ల టెన్షన్ దూరం అవుతుంది. ►ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి. ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఏది తగ్గించాలి? ►ఆహారంలో ఎక్కువగా కూరగాయలు ఉండేలా జూగ్రత్త వహించాలి. ►బత్తాయి, కమలాలు, ద్రాక్ష వంటి పండ్లు ఎక్కువగా తీనుకోవాలి. ►ఆహారంలో పొటాషియం తగిన మోతాదులో ఉండేలా చూసుకోవాలి. ►ఎర్రటి మాంసం, మీగడ, వెన్న, నూనె వంటి వాటికీ దూరంగా ఉండాలి. ►బయటి ఆహార పదార్థాల జోలికి వెళ్లరాదు. ►బరువు పెరగకుండా చూనుకోవాలి. హైపర్టెన్షన్ ఉన్నవారు ఏమి చేయాలి? ►తరచు వైద్యుడి వద్దకు వెళ్లి పరీక్ష చేయించుకోవాలి. ►మందుల వాడకాన్ని ఒకరోజు కూడా నిలిపేయొద్దు. ►ఆరోగ్య పరిస్థితిని బట్టి మందుల వాడకాన్ని మార్చుకోవాలి. ►షుగర్ , గుండె , థైరాయిడ్ పరీక్షలు చేయించుకోవాలి. ►కొలస్ట్రాల్ పెరగకుండా జాగ్రత్త తీసుకోవాలి. ►మద్యపానం, సిగరెట్లను పూర్తిగా మానేయాలి. ►కారం, ఉప్పు తగ్గించాలి. చదవండి👉🏾Vitamin D Deficiency: విటమిన్- డి లోపిస్తే అంతే ఇక..! ఆ హార్మోన్ ఉత్పత్తికి ఇది అవసరం! High Vitamin D Rich Foods: ట్యూనా, సాల్మన్, గుడ్లు, పాలు.. వీటిలో విటమిన్- డి పుష్కలం! -
బీపీ... బీపీ అంటుంటాంగానీ... మనందరికీ బీపీ ఉండి తీరాలి, కాకపోతే
హైబీపీకి సంబంధించిన సందేహాలు కాస్త చిత్రంగా ఉండవచ్చు. నిజానికి అదో అపోహలా అనిపించవచ్చు. కానీ అదే వాస్తవం కావచ్చు. అలాగే మరికొన్ని నిజమనిపించవచ్చు. కానీ అపోహ కావచ్చు. అందుకే అలాంటి కొన్ని సందేహాలూ, సమాధానాలు చూద్దాం. బీపీ... బీపీ అంటుంటాంగానీ... మనందరికీ బీపీ ఉండి తీరాలి. బీపీ అంటే బ్లడ్ ప్రెషర్. తెలుగులో రక్తపోటు. అది ఉండాల్సిందే. కాకపోతే 140/90 కొలతతో ఉండాలి. అది నార్మల్. అంటే బీపీ ఉండాల్సిందేగానీ... ఎంత ఉండాలో అంతే ఉండాలన్నమాట. ఇది పెరిగితే హైబీపీ!! నిజానికి ఇదో జబ్బు కాదు. కానీ ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు కారణమయ్యేలా చేస్తుంది. భారతీయ సమాజంలో ఇంచుమించు కౌమారం దాటి యువదశ దాటినవారిలోని 25 శాతం మందికి హైబీపీ ఉన్నట్లు ఓ అంచనా. ఇది చాలా పెద్ద సంఖ్య. ఇంతమంది హైబీపీ బాధితులు ఉండటం... వారిలో అనేక సందేహాలు, అపోహల కారణంగా మందులు సరిగా తీసుకోకపోవడం వల్ల మెదడు, మూత్రపిండాల వంటి ఎండ్ ఆర్గాన్స్ విఫలమై మృతిచెందడం, పక్షవాతం వంటి కారణాలతో జీవితాంతం వైకల్యాలతో బాధపడటం చాలా సాధారణం. ఈ నెల 17న వరల్డ్ హైపర్టెన్షన్ డే. ఈ సందర్భంగా ఈ అంశంపై అనేక సందేహాలూ, వాటికి సమాధానాలు తెలుసుకుని హై–బీపీ పట్ల అవగాహన పెంచుకుంటే ఎన్నెన్నో జీవితకాలపు వైకల్యాలనూ, మరణాలను నివారించవచ్చు. అందుకు ఉపయోగపడేదే ఈ కథనం. యువకులను మినహాయిస్తే... మధ్యవయసు దాటాక... ఏజ్ పెరుగుతున్న కొద్దీ... నార్మల్ అయిన 120/80 కంటే కొద్దిగా ఎక్కువగానే ఉండటం మామూలే కదా! ఈ అపోహ చాలాకాలం రాజ్యమేలింది. వయసు పెరుగుతున్న కొద్దీ బీపీ కొద్దిగా ఎక్కువే ఉండవచ్చని తొలుత అనుకున్నారు. (వయసు + 100) అంటూ ఓ సూత్రం కూడా ఏర్పాటు చేసుకున్నారు. అంటే ఉదాహరణకు ఓ వ్యక్తి వయసు 60 ఏళ్లు అయితే అతడి పై కొలత 160 వరకు ఉన్నా పర్లేదని అనుకున్నారు. కానీ తాజాగా ఇప్పటి లెక్కలు వేరు. ఇప్పుడు తాజాగా... పద్దెనిమిది దాటిన ఏ వయసువారికైనా బీపీ 140/90 కి పైన ఉంటే అది హైబీపీ కిందే లెక్క. తల్లిదండ్రులకు ఉంటే, పిల్లలకూ హైబీపీ వస్తుందా? తల్లిదండ్రులకు హైబీపీ ఉంటే... పిల్లలకు అది తప్పనిసరిగా వచ్చే జన్యుపరమైన సమస్య కాదు గానీ... తల్లిదండ్రులకూ, రక్తసంబంధీకులకూ, దగ్గరి బంధువులకు అధిక రక్తపోటు ఉన్నప్పుడు... వారి వారసులకు కూడా వచ్చే అవకాశాలు కాస్తంత ఎక్కువే. రక్తపోటు ఉన్నప్పటికీ చాలా చిన్నవయసు వారు మాత్రలు తీసుకోవాల్సిన అవసరం లేదేమో కదా? రక్తపోటు ఉందని తేలాక... అది ఎంత చిన్నవయసు అయినా తప్పనిసరిగా మందులు వాడాల్సిందే. లేకపోతే దీర్ఘకాలంలో కీలకమైన అవయవాలు దెబ్బతిని ప్రాణాపాయం కలిగించే అవకాశాలు ఎక్కువ. చిన్నపిల్లల్లో హైబీపీ ఉండదు కదా? చిన్నపిల్లల్లో, అప్పుడప్పుడే యుక్తవయసుకు వస్తున్న కౌమార బాలల్లో హైబీపీ ఉండకపోవచ్చని అనిపిస్తుంది. కానీ వాళ్లలోనూ కొందరికి హైబీపీ (హైపర్టెన్షన్) ఉండే అవకాశం ఉంది. ఇటీవల చాలా చిన్నపిల్లలు.. అంటే 3 నుంచి 11 ఏళ్ల మధ్య వయసువారు, కౌమారంలోకి వస్తున్న పిల్లలు... అంటే 12 నుంచి 18 ఏళ్ల మధ్యవారిలోనూ హైబీపీ కనిపిస్తోంది. అయితే చిన్నపిల్లల్లో హైబీపీ నిర్ధారణ విషయంలో కొలత చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. పిల్లల్లో బీపీని తెలిపే ఛార్ట్ను ‘సెంటైల్ చార్ట్’ అంటారు. పిల్లల్లో నార్మల్ విలువలు వాళ్ల వయసునూ, జెండర్నూ, వాళ్ల ఎత్తును బట్టి మారుతుంటాయి. అంటే వారిలో కొలత 90 ఉంటే అది బీపీ ఉన్నట్లు కాదు. కొలత విలువ 95 పర్సంటైల్ లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే అది పిల్లల్లో హైబీపీ ఉన్నదనడానికి సూచన. ఆ రీడింగ్ 95–99 ఉంటే హైపర్టెన్షన్ స్టేజ్–1 అని చెప్పవచ్చు. 99 పర్సంటైల్ కంటే ఎక్కువ ఉంటే దాన్ని స్టేజ్–2గా భావించాలి. ఈ దశలూ, తీవ్రతలను బట్టి ఆయా పిల్లలకు ఎలాంటి చికిత్స ఇవ్వాలన్నది నిర్ణయిస్తారు. సుదీర్ఘకాలం పాటు హైబీపీ మందులు వాడితే వాటికి అలవాటు పడి... డ్రగ్ అడిక్షన్ వస్తుందేమో కదా? ఒకసారి హై–బీపీ నిర్ధారణ అయ్యాక... దాన్ని అదుపులో ఉంచేందుకు డాక్టర్లు మందులను సూచిస్తుంటారు. వారి బీపీ తీవ్రతను బట్టి కొందరిలో రెండు, మూడు, నాలుగు... రకాల మందులను డాక్టర్లు వాడమంటారు. తరచూ గమనిస్తూ... మందుల మోతాదును అడ్జెస్ట్ చేస్తుంటారు. జీవనశైలి మార్పులతో బీపీని అదుపులో పెడితే కేవలం రెండులోపు మాత్రలతోనే చాలాకాలం కొనసాగవచ్చు. కానీ బీపీ అదుపులో లేకపోతే మందులూ, మోతాదులు పెరుగుతాయి. హైబీపీ మందులైనా, డయాబెటిస్ మందులైనా సుదీర్ఘకాలం వాడాల్సిందే. అది బాధితుల బీపీ కొలతలను బట్టి ఉంటాయి తప్ప... బీపీ తగ్గినప్పటికీ వాటికే అలవాటు పడటం, మానకుండా ఉండలేకపోవడం వంటివి జరగవు. మందులు వాడుతున్నా... బీపీ నియంత్రణలో ఉండటం లేదు. బహుశా మందుల ప్రభావం తగ్గిపోయిందా? బహుశా బీపీ ఆ మందులకు రెసిస్టెన్స్ పెంచుకుని ఉండవచ్చా? కొంతమంది బీపీ బయటపడ్డాక... మొదటిసారి మాత్రమే డాక్టర్ను కలుస్తారు. అప్పుడు డాక్టర్ రాసిన మందులనే అదేపనిగా ఏళ్ల తరబడి వాడుతుంటారు. కానీ వాటితో బీపీ నిజంగానే అదుపులోకి వచ్చిందా... లేక ఆ డోస్ సరిపోవడం లేదా... ఇలాంటి విషయాలేమీ పట్టించుకోరు. మరికొందరు తొలిసారి మందులు వాడకం మొదలుపెట్టాక... రెండో వారంలోనో లేదా పది రోజుల తర్వాతనో మరోసారి బీపీ చూసుకుని, అది తగ్గడం లేదంటూ ఫిర్యాదు చేస్తారు. ఇవన్నీ సరికాదు. మందుల ప్రభావం తగ్గిపోయిందనే అపోహ కూడా వద్దు. ఒకసారి బీపీ మందులు మొదలుపెట్టాక అవి పనిచేయడం ప్రారంభించి, బీపీ అదుపులోకి రావడానికి కనీసం 3 – 4 వారాలు పట్టవచ్చు. ఇవేవీ చూడకుండానే కొందరు తాము అనుకున్నదే కరెక్ట్ అనే అభిప్రాయానికి వచ్చేస్తారు. ఇది సరికాదు. అందుకే బీపీ మందులు వాడుతున్న వారు డాక్టర్ నిర్దేశించిన ప్రకారం... ఆయా సమయాలకు ఫాలో అప్కు వస్తుండాలి. ఉద్వేగ లక్షణాలు ఉంటే అది హై–బీపీ యేనా? కొంతమంది తాము నర్వస్గా ఉండటం, తలనొప్పి తరచూ వస్తుండటం, చెమటలు పడుతున్నట్లుగా, నిద్రపట్టకుండా, కోపంగా లేదా బాగా ఉద్వేగంగా/ఉద్రిక్తంగా ఉన్నప్పుడు హైబీపీ ఉందనో లేదా ఆ టైమ్లో బీపీ పెరిగి ఉందనో చెబుతుంటారు. అంతేకాదు... కొంతమందికి హాస్పిటల్కు వెళ్లగానే, అక్కడి డాక్టర్లను చూడగానే బీపీ పెరుగుతుంది. అదే ఇంటిదగ్గర లేదా మరోచోట రీడింగ్ తీసినప్పుడు నార్మల్గా ఉంటుంది. ఇలా తెల్లకోట్లలో ఉండే డాక్టర్లను చూసినప్పుడు రక్తపోటు పెరగడాన్ని ‘వైట్ కోట్ సిండ్రోమ్’ అంటారు. ఇలాంటి పరిస్థితుల్లో లేదా పైన చెప్పిన లక్షణాలన్నీ లేదా వాటిలో కొన్ని ఉన్నప్పుడు హైబీపీ ఉన్నట్లేనా అని సందేహ పడుతుంటారు. పై లక్షణాలతోనూ, సహజ భావోద్వేగాలతోనూ రక్తపోటు కొంతమేరకు పెరగవచ్చు. కానీ వాళ్ల భావోద్వేగాలు తగ్గగానే నార్మల్ అవుతుంది. అలాంటి కండిషన్లలో పెరిగేదాన్ని హైబీపీగా పరిగణించరు. అయితే ఓ వ్యక్తిలో పలుమార్లు రీడింగ్ తీశాక కూడా... రక్తపోటు 140/90 అనే విలువకు మించి ఉంటే అప్పుడు మాత్రమే హైబీపీగా పరిగణిస్తారు. సాధారణంగా రక్తపోటుకు సంబంధించిన లక్షణాలేమీ లేకపోతే హైబీపీ లేనట్లేనా? చాలామందికి లక్షణాలేమీ కనిపించకుండానే హైబీపీ ఉండవచ్చు. వారికి హైబీపీ ఉన్నట్లే తెలియకుండానే అది ఏళ్లతరబడి ఉండే అవకాశం ఉంది. రక్తపోటు చాలాకాలంగా చాలా ఎక్కువగా ఉండటం వల్ల మన దేహంలో ఎండ్ ఆర్గాన్స్గా పిలిచే మెదడు, ఊపిరితిత్తులు, మూత్రపిండాల వంటి కీలక అవయవాలు దెబ్బతింటాయి. అలా అవి పూర్తిగా పాడైపోయాక... అప్పుడుగానీ ఆయా అవయవాలు దెబ్బతిన్నందున కనిపించే లక్షణాలు బయటపడవు. హైబీపీ వల్ల దెబ్బతిని, బాధితులను ప్రాణాంతక పరిస్థితులకు నెడుతున్నందునే దీన్ని ‘సైలెంట్ కిల్లర్’ అంటారు. అందువల్ల లక్షణాలు కనిపించనంత మాత్రాన బీపీ లేదని అనుకోవడం సరికాదు. ఒకసారి డాక్టర్ను కలిసి, చెకప్ చేయించుకున్న తర్వాతే నిశ్చింతగా ఉండాలి. కొన్నిసార్లు లక్షణాలు కనిపిస్తుంటాయి. కానీ అవి తాత్కాలికం కావచ్చు. అలాంటిప్పుడు ఒకవేళ బాధితులకు హైబీపీ లేకపోయినా, అది ఉన్నట్టుగా డాక్టర్లు పొరబడే అవకాశాలు లేవా? హైబీపీ వల్ల కొందరిలో తలనొప్పి, తలతిరగడం వంటివి కనిపించవచ్చు. కానీ ప్రతి తలనొప్పీ అధిక రక్తపోటు వల్లనే కాకపోవచ్చు. బీపీ తాలూకు లక్షణాలు అని చెప్పుకునే కండిషన్లు కనిపించినప్పుడు అసలు బీపీని కొలవకుండానే కేవలం లక్షణాలతో ఆ సమస్య ఉందని అనుకోవడం సరికాదు. డాక్టర్లు అలా పొరబడే అవకాశం లేదు. ఎందుకంటే... రక్తపోటు పెరగడం వల్ల మెదడులోని రక్తనాళాల చివరల్లో రక్తం ఒత్తిడి పెరగడం వల్ల తలనొప్పి రావచ్చు. అలాగే కొందరిలో వారి బాడీ పోష్చర్ అకస్మాత్తుగా మారడం వల్ల రక్తపోటు తగ్గవచ్చు. దీన్ని ‘ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్’ అంటారు. అలాంటి సమయాల్లో కొందరికి ముందుకు తూలిపడిపోతామనే ఫీలింగ్ లేదా తలతిరగడం వంటివి కనిపించవచ్చు. బీపీ తగ్గిన ఇలాంటి సందర్భాల్లోనూ బీపీ పెరిగినప్పుడు కనిపించే గిడ్గీనెస్ వంటి లక్షణాలు æ కనిపిస్తాయి. అందువల్ల డాక్టర్లు కేవలం లక్షణాల ఆధారంగా కాకుండా... అనేక మార్లు, అనేక సందర్భాల్లో బీపీని కొలిచిచూస్తారు. ఇలా పరీక్షించినప్పుడు అన్నిసార్లూ కొలత పెరిగి ఉంటే అప్పుడు మాత్రమే దాన్ని హైబీపీగా నిర్ధారణ చేస్తారు. హైబీపీ ఉందని నిర్ధారణ అయ్యింది. డాక్టర్లు మందులు మొదలుపెట్టారు. కొన్నాళ్ల తర్వాత బీపీ అదుపులోకి వచ్చిందనుకోండి. అప్పుడు మందులు మానేయవచ్చా? ఒకసారి హైబీపీ నిర్ధారణ అయి... మందులు మొదలుపెట్టాక వాటి ప్రభావంతో బీపీ అదుపులోకి వస్తుంది. దాంతో బీపీ నియంత్రణలోనే ఉంది కదా అని చాలామంది మళ్లీ మందులు మానేస్తుంటారు. మళ్లీ బీపీ చెక్ చేయించుకోరు. దీని లక్షణాలు బయటకు కనిపించవు కాబట్టి అది పెరిగిన విషయం తెలియదు. అందుకే ఒకవేళ బీపీ నియంత్రణలోకి వచ్చిందని మందులు ఆపేసినా... మాటిమాటికీ బీపీ చెక్ చేయించుకుంటూ ఉండాలి. బీపీ ఏమాత్రం పెరిగినట్లు అనిపించినా వెంటనే డాక్టర్ సలహా తో తగిన మోతాదు నిర్ణయించుకుని, మందులు తిరిగి మొదలుపెట్టాలి. అంతేకాదు... మందులు వాడుతున్నప్పటికీ తరచూ బీపీ చెక్ చేసుకుంటూ ఉండాలి. ప్రస్తుతం మందులు వాడుతున్నప్పటికీ... ఆ మోతాదు సరిపోక బీపీ పెరిగితే... డాక్టర్లు మందులు మార్చడమో లేదా సరైన మోతాదు అందేలా మరో మాత్ర లేదా రెండు మాత్రలు పెంచడమో చేస్తారు. ఈ నేపథ్యంలో బీపీ మందులు వాడుతున్నప్పుడు వాటిని మానేయకపోవడం మంచిది. తరచూ బీపీ చెక్ చేయించుకుంటూ ఉండటం అవసరం. బార్డర్లైన్లో ఉన్నప్పుడు మందులు అవసరం లేదనీ, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ, మంచి జీవనశైలి, ఆరోగ్యకరమైన అలవాట్లతో బీపీని అదుపులో ఉంచుకోవాలంటూ డాక్టర్లు చెబుతారు కదా. మరి ఇప్పుడు కూడా మందులేవీ వాడకుండా మంచి జీవనశైలి అనుసరిస్తే సరిపోదా? ప్రతివారూ ఇలాగే అనుకుంటారు. కానీ జీవనశైలి నియమాలను కరెక్ట్గా పాటించరు. పాటించినా కొద్దికాలం మాత్రమే. లక్షణాలేవీ బయటకు కనిపించని హైబీపీ దీర్ఘకాలికంగా ఏవైనా కీలక అవయవాలపై దుష్ప్రభావం చూపితే... అప్పుడు జరిగే నష్టం... అప్పుడు వైద్యపరీక్షలకూ, చికిత్సకూ పడే ఆర్థికభారం, ఏదైనా ఎండ్ ఆర్గాన్ శాశ్వతంగా దెబ్బతింటే కలిగే నష్టం లాంటివి చాలా జబ్బుభారాన్ని (డిసీజ్ బర్డెన్ను) పెంచుతాయి. వాటికంటే అసలు మనకు భారమే తెలియని రీతిలో, చాలా చవకైన మందులను రోజూ ఒకపూట లేదా రెండు పూటలు తీసుకోవడం మేలు. దానివల్ల సుదీర్ఘకాలం, అన్ని అవయవాలనూ పదిలంగా ఉంచుతూ హాయిగా జీవించవచ్చు. గుండెపోటు, పక్షవాతం లాంటి మరెన్నో అనారోగ్యాలనూ, అనర్థాలను నివారించుకోవచ్చు. ఉప్పు పూర్తిగా మానేయాలా? హైబీపీ అనగానే ఉప్పు వల్ల రక్తపోటు పెరుగుతుందని సాధారణ ప్రజలకు కూడా ఇప్పుడు తెలిసిన విషయం. అయితే తమకు ఎలాంటి అనర్థాలూ జరగకూడదనే ఉద్దేశంతో చాలామంది ఉప్పును పూర్తిగా మానేస్తుంటారు. కానీ మన దేహంలోని చాలా కీలకమైన జీవక్రియలు (ఉదాహరణకు మెదడు నుంచి నాడుల ద్వారా కండరాలకు వచ్చే ఆదేశాలూ, వాటి అమలు వంటివి) ఉప్పు/ఇతర లవణాలలోని అయాన్ల ద్వారానే జరుగుతుంటాయి. ఉప్పు పూర్తిగా మానేసిన కొందరిలో ‘హెపోనేట్రీమియా’ అనే కండిషన్ వచ్చి, ఒక్కోసారి ప్రాణాంతకంగానూ మారవచ్చు. అందుకే ఉప్పును పూర్తిగా మానేయడం కంటే... మునుపు వాడుతున్న దాంట్లో సగం లేదా సగం కంటే తక్కువ వాడటం మంచిది. - డాక్టర్ హరిరామ్ వి, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ -
‘సైలెంట్ కిల్లర్’తో జాగ్రత్త.. భారత్లో 30 శాతం మంది బాధితులు
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత పరిస్థితుల్లో వైద్య నిపుణులు ‘సైలెంట్ కిల్లర్’గా పరిగణిస్తున్న ‘హైపర్ టెన్షన్’ (బీపీ) అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతోంది. దేశంలోని 30 శాతం మంది ‘అధిక రక్తపోటు’తో బాధపడుతున్నారని లాన్సెట్ జర్నల్లో ప్రచురితమైన తాజా అధ్యయనంలో వెల్లడైంది. 1990 నుంచి 2019 వరకు 184 దేశాల్లో 10 కోట్ల మందిపై నిర్వహించిన పరిశోధనలను శాస్త్రవేత్తలు విశ్లేషించిన సందర్భంగా ప్రాధాన్యత సంతరించుకున్న అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఇంపీరియల్ కాలేజీ ఆఫ్ లండన్, భారత్లోని ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు సహా వివిధ దేశాల శాస్త్రవేత్తల సహకారంతో సాగిన ఈ అధ్యయనంలో హైబీపీ వల్ల వచ్చే హార్డ్ ఎటాక్, కిడ్నీ, గుండె జబ్బులకు... ఏటా ప్రపంచవ్యాప్తంగా 85 లక్షల మరణాలకు లంకె ఉన్నట్లు తేలింది. చదవండి: పండగలప్పుడు జరభద్రం! ప్రపంచస్థాయిలో 1990తో పోల్చితే 2019కల్లా బీపీ సమస్యల విషయంలో మహిళలు, పురుషుల సంఖ్య రెట్టింపైనట్లు వెల్లడైంది. బీపీ సమస్యను తగ్గిస్తే 40 శాతం స్ట్రోక్స్, 50 శాతం దాకా హార్ట్ ఫెయిల్యూర్స్ తగ్గుతాయని గతంలోనే కొన్ని అధ్యయనాలు స్పష్టం చేశాయి. బీపీతో ముడిపడిన అనారోగ్య సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై ‘సాక్షి’తో క్రిటికల్ కేర్ నిపుణుడు డాక్టర్ ఎ.నవీన్రెడ్డి, కన్సల్టెంట్ ఫిజీషియన్ డాక్టర్ ప్రభుకుమార్ చల్లగాలి వారి అభిప్రాయాలు పంచుకున్నారు. ముఖ్యాంశాలు వారి మాటల్లోనే... మారిన ఆహారపు అలవాట్లు, జీవనశైలితోనే.. గతంలో 50–60 ఏళ్లు దాటిన వాళ్లలోనే హైబీపీ సమస్యలొచ్చేవి. ఇప్పుడు 25–30 ఏళ్లలోని చాలామంది బీపీ సమస్యను ఎదుర్కొంటున్నారు. వయసుతోపాటు ఒత్తిళ్లు, షుగర్, ఎండోక్రైనాలజీ, కిడ్నీల పరిస్థితి తదితరాలను బట్టి వేగంగా మార్పులు సంభవిస్తున్నాయి. ప్రధానంగా ఆహార అలవాట్లు, జీవనశైలి విధానమే వాటన్నింటిపై ప్రభావం చూపుతోంది. చేస్తున్న ఉద్యోగాలను బట్టి రాత్రి బాగా పొద్దుపోయాక పడుకోవడం, పగటిపూట ఎప్పుడో నిద్రలేవడం, పొగ తాగడం, మద్యపానం, ఫాస్ట్ఫుడ్, జంక్ఫుడ్, శారీరక శ్రమ లేకపోవడంతో ఊబకాయులుగా మారి ఎక్కువ మంది బీపీ బారినపడుతున్నారు. మెదడు, గుండె, కిడ్నీలు, లివర్, కళ్లు ఇలా ప్రతి అవయవంపై బీపీ ప్రభావం చూపుతుంది. జీవనశైలి పద్ధతులను మార్చుకోకుండా బీపీని నియంత్రించలేం. బీపీకి నడక చాలా మంచి మందు. 90 శాతం వరకు కారణాలు లేకుండానే బీపీ వస్తుంది. దీనినే ‘ఎసెన్షియల్ హైపర్ టెన్షన్’ అని పిలుస్తాం. – డా. ఎ.నవీన్రెడ్డి, క్రిటికల్కేర్ నిపుణుడు,నవీన్రెడ్డి హాస్పిటల్ -
అరుదైన సర్జరీ.. ఒక వ్యక్తిలో ఐదు కిడ్నీలు!!
ఆయనకి శరీరంలో ఐదు కిడ్నీలు ఉన్నాయి. యస్.. తనవి రెండు.. దాతలు ఇచ్చినవి మూడు. గతంలో రెండుసార్లు అవయవ మార్పిడి చికిత్సలు నిర్వహించిన వైద్యులు.. ఈమధ్యే విజయవంతంగా మరో కిడ్నీని శరీరంలోకి ఎక్కించారు. ఇంతకు ముందు సర్జరీలు ఫేయిల్ కావడానికి కారణం.. ఆయనకు ఉన్న హైపర్టెన్షన్(అధిక రక్తపోటు) సమస్య. దీంతో మరోసారి ప్రయత్నించిన డాక్టర్లు.. సంక్లిష్టమైన సర్జరీ ద్వారా ఐదో కిడ్నీని విజయవంతంగా అమర్చారు. తద్వారా వైద్య చరిత్రలో అరుదైన ఈ ఘటనకు చెన్నై వైద్యులు కారణం అయ్యారు. తమిళనాడుకు చెందిన 41 ఏళ్ల సదరు వ్యక్తికి ఇదివరకే రెండుసార్లు రెనల్ (మూత్రపిండం)కు సంబంధిచిన సర్జరీలు జరిగాయి. పేషెంట్కు 14 ఏళ్ల వయసు ఉన్నప్పుడు రెండు కిడ్నీలూ ఫెయిల్ అయ్యాయి. దీంతో 1994లో తొలిసారి.. 2005లో రెండోసారి కిడ్నీలను మార్చారు. ఆయనకు ఉన్న అధిక రక్తపోటు సమస్య వల్ల ఈ రెండూ సర్జరీలు విఫలం అయ్యాయి. దీంతో coronary artery disease బారినపడ్డాడు. ఈ పరిస్థితుల్లో మరో కిడ్నీ అమర్చే విషయంపై ఆయనతో చర్చించారు మద్రాస్ మెడికల్ మిషన్ డాక్టర్లు. కానీ, అప్పటికే శరీరంలో నాలుగు కిడ్నీలు ఉండడంతో ఐదవది అమర్చడం సంక్లిష్టంగా మారింది. అయినప్పటికీ పేషెంట్ ఉన్న కండిషన్కి ఆ ఆప్షన్ తప్ప మరొకటి కనిపించలేదు. ఇది చదవండి: పాములే ఇక సైంటిస్టులకు దిక్కు ఎక్కడ అమర్చారంటే.. సాధారణంగా దాతల కిడ్నీలను.. పేషెంట్ల కిడ్నీల పక్కనే ఉన్న నాళాలకు అమరుస్తారు. కానీ, ఈ పేషంట్కు ఇదివరకే నాలుగు అమర్చి ఉన్నాయి. దీంతో స్పేస్ లేకపోవడంతో కొంత ఇబ్బంది పడ్డారు డాక్టర్లు. పైగా ఇంతకు ముందు జరిగిన సర్జరీల వల్ల పేషెంట్ నుంచి యాంటీబాడీస్ రిలీజ్ అయ్యే రిస్క్ ఏర్పడొచ్చు. కాబట్టి, జాగ్రత్తగా కిడ్నీని అమర్చాలని ఫిక్స్ అయ్యారు. చివరకు పొత్తికడుపు కుహరం దగ్గర ఆ కిడ్నీని అమర్చి.. ఇక్కడే గుండెకు సంబంధించిన రక్తనాళాలకు కనెక్ట్ చేశారు. ప్రపంచంలోనే ఇలాంటి సర్జరీలు జరగడం చాలా అరుదు. పాతవి తీయకపోవడానికి కారణం ఇదే కొత్త కిడ్నీ అమర్చేప్పుడు.. పాత కిడ్నీలను ఎందుకు తొలగించలేదని చాలామందికి అనుమానం కలగవచ్చు. ఒకవేళ పాతవి గనుక తొలిగిస్తే.. రక్తస్రావం జరగొచ్చు. అదే టైంలో యాంటీబాడీస్ ఉత్పత్తి అయ్యి.. కొత్త కిడ్నీ అమర్చడానికి పరిస్థితి ప్రతికూలంగా మారొచ్చు. అందుకే ఆ పాత కిడ్నీలను అలాగే వదిలేశారు. ఇక జులై 10న సర్జరీ విజవంతంగా జరగ్గా.. నెల తర్వాత (ఆగస్టు 10న) ఆ పేషెంట్ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. ప్రస్తుతం అతని ఆరోగ్య స్థితి మెరుగ్గా ఉందని, మరికొన్ని నెలలపాటు అతని ఆరోగ్యాన్ని పర్యవేక్షించాలని వైద్యులు నిర్ణయించుకున్నారు. -
ప్రీ–హైపర్టెన్షన్ దశ అంటే..?
ప్రతి వ్యక్తి రక్తనాళాల్లోనూ రక్తం ఒక నిర్దిష్టమైన రీతిలో, కొంత వేగంతో ప్రవహిస్తూ ఉంటుంది. ఆ వేగం కొనసాగాలంటే రక్తనాళాల్లో రక్తం కొంత ఒత్తిడితో ప్రవహించాలి. ఇలా రక్తానికి ఒత్తిడి ఉండాలంటే అది గుండె స్పందనల వల్లనే సాధ్యమవుతుంది. రక్తాన్ని గుండె పంప్ చేసినప్పుడు మంచి రక్తనాళాల్లో (ఆర్టరీస్) లో రక్తం ఎంత పీడనంతో ప్రవహిస్తుందో తెలుసుకునే కొలత (రీడింగ్)ను ‘సిస్టోలిక్ ప్రెషర్’ అంటారు. అలాగే రెండు సిస్టోలిక్ ప్రెషర్స్ మధ్యన రక్తనాళాల్లో రక్త పీడనాన్ని డయాస్టోలిక్ ప్రెషర్ అంటారు. ఇలా రక్తపోటుకు రెండు విలువలు ఉంటాయి. దీన్నే సాధారణంగా 120/80 గా పేర్కొంటుంటారు. ఇది సాధారణ విలువ. ఇక ఇప్పుడు ప్రీ–హైపర్టెన్షన్ అంటే ఏమిటో చూద్దాం. ప్రీ–హైపర్టెన్షన్ సాధారణంగా డాక్టర్ దగ్గరికి రోగి వెళ్లగానే కొలత రక్తపోటును పరిశీలిస్తారు. ఒకవేళ అది 120/80 ఉంటే ఇక దాని గురించి ఆలోచించరు. కానీ ఈ కొలతలు ఎప్పుడూ ఒకేలా ఉండకుండా కొంత మారుతూ ఉండవచ్చు. ఉదాహరణకు సిస్టోలిక్ రక్తపోటు విలువ 120కి బదులుగా 121 నుంచి 139 ఉందనుకోండి. అలాగే కింది విలువ 80కి బదులుగా 81 నుంచి 89 వరకు ఉందనుకోండి. ఆ కొలతలు ఉన్న దశను పూర్తిగా రక్తపోటు ఉన్న దశగా చెప్పడం కుదరదు. అందుకే డాక్టర్లు ఆ దశను ‘ప్రీహైపర్టెన్షన్’ (రక్తపోటు రాబోయే ముందు దశ)గా పేర్కొంటారు. ఈ ‘ప్రీహైపర్టెన్షన్’ దశ భవిష్యత్తులో ‘హైబీపీ’కి దారితీయవచ్చు. వెసులుబాటు ఇదే... ప్రీ–హైపర్టెన్షన్లో రోగి వెంటనే మందులు వాడాల్సిన అవసరం లేదు. ఆ హెచ్చరికలతో అప్రమత్తమై కొన్ని జాగ్రత్త చర్యలను మొదలుపెట్టవచ్చు. అంటే కేవలం మన జీవనశైలిలోని అలవాట్లను చక్కబరచుకోవడం ద్వారా రక్తపోటును అదుపులోకి తెచ్చుకునే వెసులుబాటు మనకు ఉంటుందన్నమాట. చదవండి: ఆరోగ్యకరంగా బరువు తగ్గించుకోండిలా.. వంటలూ వడ్డింపులతో క్యాన్సర్ నివారణ తోడుగా ప్రమాదకరమైన పరిస్థితి కూడా... రక్తపోటు పెరగడం వల్ల ఏర్పడే దీర్ఘకాలిక నష్టాలు మనకు వెంటనే కనిపించవు. పైగా రక్తపోటు పెరిగి ఉందన్న విషయం మొదట్లో అసలు రోగికి తేలియనే తెలియకపోవచ్చు కూడా. అందువల్ల దీనివల్ల జరిగే నష్టం అలా జరుగుతూపోయి ఏవైనా అవయవాలు దెబ్బతిన్న లక్షణాలు బయటపడేవరకు జరిగిన నష్టం మనకు తెలియదు. అప్పుడు మాత్రమే మనకు హైబీపీ ఉన్నట్లు తెలుస్తుంది. ఇదో ప్రమాదకరమైన పరిస్థితి. అందుకే వయసు నలభై దాటిన వారు అప్పుడప్పుడూ తమ బీపీని పరీక్షించుకుంటూ ఉండి, అది పంపించే హెచ్చరికలను పరిశీలించుకుంటూ ఉండటం మేలు. ప్రీ–హైపర్టెన్షన్ దాటి ఇక బీపీ నిర్ధారణ ఇలా... బీపీ ఉన్నట్లుగా నిర్ధారణ కోసం తరచూ రక్తపోటును చెక్ చేసుకుంటూ ఉండాలి. బీపీ ఎక్కువగా ఉన్నట్లు తెలిపే కొలతలు రెండు / మూడు లేదా అంతకంటే ఎక్కువ సార్లు వస్తే దాన్ని హైబీపీగా నిర్ధారణ చేసుకోవాలి. అప్పుడిక ప్రీ–హైపర్టెన్షన్ విషయాన్ని మరచిపోయి... తప్పక బీపీ నియంత్రణ మందులను డాక్టర్ సూచించిన విధంగా వాడాలి. హైబీపీకి కారణాలు ఇక పెరుగుతున్న వయసు, స్థూలకాయం, హైబీపీ ఉన్న కుటుంబచరిత్ర, ఒకే చోట కుదురుగా కూర్చుని పనిచేసే జీవనశైలి, ఆహారంలో ఎప్పుడూ పొటాషియమ్ ఎక్కువగా ఉండేలా ఉప్పు ఎక్కువగా తీసుకోవడం, పొగాకు నమిలే అలవాటు, మద్యం తీసుకోవడం, కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వంటి అనేక అంశాలు హైబీపీకి రిస్క్ ఫ్యాక్టర్లు. మనందరికీ రక్తపోటు లేదా హైపర్టెన్షన్ అంటే తెలుసు. కానీ రక్తపోటు వచ్చేందుకు ముందు మన దేహం కొన్ని హెచ్చరికలు చేస్తుంటుంది. వాటిని జాగ్రత్తగా గమనిస్తే అసలు రక్తపోటును నివారించడమో లేదా మరింత ఆలస్యంగా వచ్చేలా జాగ్రత్తపడటమో చేయవచ్చు. అలా హెచ్చరించే ఆ దశను ‘ప్రీ–హైపర్టెన్షన్’ దశగా చెప్పవచ్చు. ప్రీ హైపర్టెన్షన్ దశలోనే జాగ్రత్త పడితే మనం మనకెన్నో ఆరోగ్య అనర్థాలూ, కిడ్నీ, బ్రెయిన్ లాంటి కీలక అవయవాలు దెబ్బతినే పరిస్థితిని నివారించవచ్చు. ఆ ‘ప్రీ–హైపర్టెన్షన్’ దశపై అవగాహన కోసమే ఈ కథనం. ఈ జాగ్రత్త తీసుకోండి అంతగా హైబీపీ లేకుండా కేవలం ప్రీహైపర్టెన్షన్ ఉన్నప్పుడు... అది ప్రమాదకర దశ కాదని రిలాక్స్ కాకూడదు. అది పంపే హెచ్చరికలను పరిగణనలోకి తీసుకుని అప్రమత్తం కండి. వెంటనే జీవనశైలిలో ఆరోగ్యకరమైన మార్పులు చేసుకోవాలి. ఎందుకంటే అప్పటికీ జాగ్రత్త తీసుకోకపోతే అది గుండెపోటు, పక్షవాతం, మెదడుకు సంబంధించిన ఇతర సమస్యలు, మూత్రపిండాలు దెబ్బతినడం వంటి ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీయవచ్చు. -డాక్టర్ సౌమ్యబొందలపాటి, కన్సల్టెంట్ ఇంటర్నల్ మెడిసిన్ పైల్స్ నివారణ ఇలా : మొలల లక్షణాలు అంతగా బాధించని స్థితినుంచి మేల్కొని కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల వాటిని సమర్థం గా నివారించవచ్చు. పైగా ఇది మంచిది కూడా. దీనివల్ల బాధాకరమైన పరిస్థితులను, చికిత్సను తప్పించుకోవచ్చు. ► మలబద్దకం లేకుండా చూసుకుంటూ విసర్జన సమయాన్ని క్రమబద్ధం చేసుకోవాలి. ∙మలబద్దకం లేకుండా ఉండటం కోసం ఆహారంలో పీచు ఎక్కువగా ఉండే తాజా ఆకుకూరలు, పొట్టుతో ఉన్న ధాన్యంతో చేసిన పదార్థాలు, తాజాపండ్లు ఎక్కువగా తీసుకోవాలి. దీనితో పాటు నీళ్లు పుష్కలంగా తాగాలి. ∙మలబద్దకానికి ఆస్కారం ఇచ్చే పచ్చళ్లు, మసాలాలు, వేపుళ్లు, కారం, బేకరీ ఐటమ్స్ అయిన పిజ్జా, బర్గర్ల వంటి వాటి నుంచి దూరంగా ఉండాలి. ∙చాలాసేపు కూర్చుని చేయాల్సిన వృత్తుల్లో ఉన్నవారు అదేపనిగా కూర్చోకుండా గంటకు ఒకసారి లేచి పదినిమిషాలు తిరిగి మళ్లీ కూర్చోవాలి. -
కరోనా నివారణలో ‘బీపీ మందులు’
లండన్ : ‘బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్’తో బాధ పడుతున్న వారికి కరోనా వైరస్ సోకినట్లయితే ప్రాణాంతకమవుతుందని ఇప్పటికి పలు సర్వేలు వెల్లడించిన విషయం తెల్సిందే. అయితే కరోనా బారిన పడిన ‘హై బ్లడ్ ప్రెషర్’ రోగులకు బ్లడ్ ప్రెషర్ నివారణ మందులను ఇవ్వడం వల్ల వారు అద్భుతంగా కరోనా వైరస్ బారి నుంచి కోలుకున్నారని లండన్లో నిర్వహించిన ఓ తాజా సర్వే తెలియజేస్తోంది. కరోనాతో బాధ పడుతున్న బ్లడ్ ప్రెషర్ రోగులకు రామిప్రిల్, లొసార్టన్ మందులు ఇవ్వగా, వారిలో మూడోవంతు మంది, అంటే 33 శాతం మంది ప్రాణాపాయం నుంచి తప్పించుకొని, కోలుకున్నారని ‘యూనివర్శిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లినా’ పరిశోధకలు జరిపిన అధ్యయనంలో తేలింది. అయితే వారిలో ఎక్కువ శాతం మంది ‘వెంటిలేటర్’ వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే కోలుకున్నారని, వెంటిలేటర్ వరకు వెళ్లిన కరోనా రోగులు కూడా ఈ మందులతోని కోలుకున్నారని పరిశోధకులు తెలిపారు. అయితే బీపీ లేని కరోనా రోగులపై ఈ మందుల ప్రభావం ఎలా ఉంటుందో! ఇంకా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని వారన్నారు. తాము ప్రస్తుతం బీపీ ఉన్న రోగులపై అధ్యయనానికే పరిమితం అయ్యామని వారు చెప్పారు. బ్రిటన్లో బీపీతో బాధపడుతున్న దాదాపు 60 లక్షల మంది ఈ డ్రగ్స్ను వాడుతున్నారు. అమెరికాలో దాదాపు కోటి మంది బీపీతో బాధ పడుతున్నారు. బీపీ రోగులు కరోనా నుంచి కోలుకునేందుకు రామిప్రిల్, లొసార్టన్ మందులు బాగా పని చేస్తున్నట్లు దాదాపు 30 వేల మంది కరోనా రోగులపై యూనివర్శిటీ పరిశోధకులు జరిపిన అధ్యయనంలో తేలింది. చదవండి: పొగాకు అలవాటుకు కరోనా చెక్ -
పక్షవాతం వంశపారంపర్యమా?
నా వయసు 36 ఏళ్లు. మేము ముగ్గురు అన్నదమ్ములం. మా నాన్నగారు నా చిన్నతనంలో పక్షవాతానికి గురయ్యారు. అప్పట్లో సరైన వైద్యసౌకర్యాలు లేకపోవడంతో మంచానపడి పదేళ్లపాటు నరకం అనుభవించి చనిపోయారు. నా పెద్దతమ్ముడికి 29 ఏళ్లు. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ హైదరాబాద్లో ఉంటున్నాడు. నెల్లాళ్ల కిందట ‘బ్రెయిన్స్ట్రోక్’కు గురయ్యాడు. వెంటనే మంచి వైద్యం ఇప్పించడం వల్ల వెంటనే కోలుకున్నాడు. కుడి చేయి, కుడి కాలు ఇంకా స్వాధీనంలోకి రాలేదుగానీ ప్రాణాపాయం లేదనీ, ఫిజియోథెరపీ, మందులు వాడటం వల్ల తొందరలోనే కోలుకుంటాడని వైద్యులు తెలిపారు. ఇప్పుడు నాకూ, మా చిన్న తమ్ముడికి ఒక భయం పట్టుకుంది. నాన్నగారిలా, తమ్ముడిలా మాకూ పక్షవాతం వస్తుందా? ‘బ్రెయిన్స్ట్రోక్’ వంశపారంపర్యంగా వచ్చే జబ్బా? పక్షవాతం గురించి వివరాలను విపులంగా తెలియజేయండి. పక్షవాతం (బ్రెయిన్స్ట్రోక్) వంశపారంపర్యంగా వచ్చే వ్యాధి కాదు. ఈ విషయంలో మీరు ఎలాంటి భయాలూ, ఆందోళనలూ పెట్టుకోకుండా ధైర్యంగా ఉండండి. మీ ఫ్యామిలీ హిస్టరీలో పక్షవాతం ఉంది కాబట్టి బ్రెయిన్స్ట్రోక్కు దారితీసే ఇతర రిస్క్ ఫ్యాక్టర్స్... అంటే అధిక రక్తపోటు, డయాబెటిస్, హైకొలెస్ట్రాల్ వంటి వంశపారంపర్య వ్యాధుల పట్ల మీ కుటుంబ సభ్యులు జాగ్రత్త వహించాలి. మీరు క్రమం తప్పకుండా బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకుని, ఒకవేళ ఏమైనా తేడాలుంటే క్రమం తప్పకుండా మందులు వాడుతూ, ఇతర జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా బ్రెయిన్స్ట్రోక్ ముప్పు నుంచి కాపాడుకోవచ్చు. పరిశోధనల ప్రకారం మహిళల కంటే పురుషుల్లో పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కువ. పక్షవాతంలో రెండు రకాలున్నాయి. ఇస్కిమిక్ స్ట్రోక్ : మెదడు మొత్తానికి నాలుగు రక్తనాళాలు రక్తాన్ని సరఫరా చేస్తాయి. ఇందులో రెండు రక్తనాళాలు మెదడు ఎడమవైపునకూ, రెండు కుడివైపునకూ వెళ్తాయి. ఈ రక్తనాళాల్లో ఎక్కడైనా రక్తం గడ్డకడితే రక్తప్రసరణకు ఆటంకం కలుగుతుంది. దాంతో మెదడుకు రక్తసరఫరా సరిగా జరగక, కణాలు చచ్చుబడిపోయి పక్షవాతం వస్తుంది. దాదాపు 80 శాతం కేసుల్లో ఇదే కారణం. హేమరేజిక్ స్ట్రోక్ : రక్తనాళాల్లో ఏదైనా చిట్లిపోయి, రక్తం బయటకు రావడంతో మెదడులోని కణాలు దెబ్బతింటాయి. ఈ తరహా పక్షవాతం 20 శాతం కేసుల్లో కనిపిస్తుంటుంది. ఈ రెండు కారణాల వల్ల ఎడమవైపు మెదడు భాగాలు దెబ్బతింటే శరీరంలోని కుడివైపున ఉండే అవయవాలు, కుడివైపు మెదడు భాగాలు దెబ్బతింటే ఎడమ వైపున ఉండే అవయవాలు దెబ్బతింటాయి. కారణాలు : పక్షవాతం రావడానికి ప్రధాన కారణాలు అధిక రక్తపోటు. డయాబెటిస్. డ్రగ్స్, అధిక ఒత్తిడి కూడా ఇందుకు కారణాలే. ఇంతకుమునుపు ఇవి అరవై ఏళ్ల వయసులో కనిపించేవి. కానీ ఇప్పుడు మూడు పదుల్లోనే కనిపిస్తున్నాయి. అందుకే పక్షవాతం ఇప్పుడు చాలా చిన్న వయసువారిలోనూ కనిపిస్తోంది. ఎలా గుర్తించాలి : ►మాటలో తేడా రావడం, నత్తినత్తిగా రావడం ►విన్నది అర్థం చేసుకోలేకపోవడం ►మూతి పక్కకి వెళ్లిపోవడం ►ఒకవైపు కాలు, చెయ్యి బలహీనం కావడం ►నడిస్తే అడుగులు తడబడటం... ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సీటీ స్కాన్ చేసి, తక్షణం చికిత్స మొదలుపెట్టాలి. పక్షవాతం వచ్చిన మూడు నుంచి నాలుగున్నర గంటలలోపు చికిత్స అందించగలిగితే శరీరం చచ్చుబడకుండా కాపాడవచ్చు. ఇక ప్రధాన చికిత్స తర్వాత పక్షవాతం నుంచి పూర్తిగా కోలుకోడానికి ఫిజియోథెరపీ చికిత్స కూడా అవసరమవుతుంది. డా. జయదీప్ రాయ్ చౌధురి, సీనియర్ ఫిజీషియన్, యశోద హస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్ -
ఎంత కష్టపడితే అంత సుఖం!
సాక్షి, అమరావతి: ఎంతగా కష్టపడితే అంతగా సుఖపడతారు అనేది జీవితానికే కాదు శరీరానికి సైతం వర్తిస్తుంది. ఆధునిక జీవనశైలి అనారోగ్యాన్ని ఆహ్వానిస్తోంది. నేటితరం మనుషులకు వ్యాయామం అంటే ఏమిటో తెలియకుండా పోతోంది. ఫలితంగా మధుమేహం, హైపర్ టెన్షన్, గుండెపోటు, క్యాన్సర్, బ్రెయిన్ స్ట్రోక్స్ ఇలా ఒకటేమిటి ఎన్నెన్నో నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ (ఎన్సీడీ–అసాంక్రమిక వ్యాధులు) సంక్రమిస్తున్నాయి. ఒకప్పుడు జీవిత చరమాంకంలో వచ్చే మధుమేహం ఇప్పుడు మూడు పదుల వయసులోనే పలుకరిస్తోంది. చాలామంది నలభై ఏళ్ల వయసుకు ముందే గుండెపోటు బారిన పడుతున్నారు. ఇక రక్తపోటు కామన్ డిసీజ్గా (సాధారణ జబ్బు) మారిపోయింది. అధిక రక్తపోటు కారణంగా ఏటా వేలాది మంది పక్షవాతం (పెరాలసిస్) బారిన పడి శాశ్వత వైకల్యానికి గురవుతున్నారు. అసాంక్రమిక వ్యాధుల వల్ల బాధిత కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. అగ్నికి ఆజ్యం పోసినట్టు... శరీరానికి తగిన వ్యాయామం లేక జబ్బులకు గురవుతుండగా, మరోవైపు జంక్ ఫుడ్ వినియోగం పెరుగుతుండడం తీవ్ర అనర్థాలకు దారి తీస్తోంది. జాతీయ పోషకాహార సంస్థ(ఎన్ఐఎన్) సర్వే ప్రకారం.. ఆధునిక యుగంలో చిరుధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలు తీసుకోవడం బాగా తగ్గిపోయింది. దీనివల్ల చిన్నతనం నుంచి రకరకాల జబ్బులు సోకుతున్నాయి. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు నడక ఉండాలని, లేదంటే చాలా జబ్బులు చుట్టుముడతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్ జనాభాలో దాదాపు 20 శాతం మంది మధుమేహ(డయాబెటిస్) బాధితులేనని అంచనా. జీవనశైలి జబ్బులు అమాంతం పెరుగుతుండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియంత్రణ చర్యలు ప్రారంభించింది. ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్తో(ఐసీఎంఆర్) కలిసి పైలెట్ ప్రాజెక్టు కింద విశాఖ, కృష్ణా జిల్లాల్లో హైపర్ టెన్షన్ నియంత్రణ కార్యక్రమాన్ని చేపట్టింది. తర్వాతి దశలో రాష్ట్రవ్యాప్తంగా దీన్ని విస్తరించే అవకాశాలు ఉన్నాయి. -
ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు!
అప్పటివరకూ లేని బీపీ డాక్టర్ దగ్గరకు వెళ్లి పరీక్ష చేయించుకున్నప్పుడు మాత్రమే వస్తోందా? ఇలా మీకు మాత్రమే కాదు.. దేశంలో ప్రతి నలుగురిలో ఒకరికి ఇలాంటి చిత్రమైన అనుభవమే ఎదురవుతోంది. ఇంట్లో, ఆఫీసులో లేదా ఇతర ప్రదేశాల్లో ఉన్నప్పుడు ఉన్న బీపీ.. డాక్టర్ దగ్గరకు వెళ్లేసరికి నార్మల్ అయిపోతోందా? దేశంలో 18 శాతం మందికి ఇలాగే అవుతోంది. ఇంతకీ ఏమిటిది? లేని బీపీ ఉన్నట్లు.. ఉన్న బీపీ లేనట్లు.. సైలెంట్ కిల్లర్గా మారుతున్న హైపర్టెన్షన్ తీరుతెన్నులపై ఇండియా హార్ట్ స్టడీ(ఐహెచ్ఎస్) ఇటీవల దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో 9 నెలలపాటు అధ్యయనం నిర్వహించింది. ఇందులో 1,233 మంది వైద్యులు పాల్గొన్నారు. ఇండియా హార్ట్ స్టడీ ముఖ్య పరిశోధకుడు, బీహెచ్ఎంఆర్సీ చైర్మన్ అండ్ డీన్ అకడమిక్ రీసెర్చ్ డాక్టర్ ఉపేంద్రకౌల్, కార్డియోవాస్క్యులర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మాస్ట్రీచ్ డాక్టర్ విల్లెం వెర్బెక్, అపోలో ఆస్పత్రి కార్డియాలజిస్ట్ డాక్టర్ సునీల్కపూర్, ఉస్మానియా ఆస్పత్రి నెఫ్రాలజిస్ట్ డాక్టర్ మనీషాసహాయ్ల బృందం బుధవారం నగరంలోని ఓ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ వివరాలను విడుదల చేసింది. ‘ఏపీ, తెలంగాణతోపాటు మొత్తం 15 రాష్ట్రాల్లో 23,253 మందికి స్క్రీనింగ్ నిర్వహించాం. వీరిలో 18,918 మంది రక్తపోటును రికార్డు చేశాం. వారంపాటు రోజుకు నాలుగుసార్లు ఇటు క్లినిక్తో పాటు అటు ఇంట్లోనూ టెస్ట్ చేయగా.. ఆసక్తికర ఫలితాలు వెల్లడయ్యాయి’ అని వైద్యులు తెలిపారు. వైట్కోట్.. మాస్క్డ్: అప్పటివరకూ బీపీ లేని వ్యక్తి వైద్యుడి వద్దకు వచ్చినప్పుడు ఆ పరిసరాలు అవి చూసి ఆందోళనకు గురవడంతో పరీక్షలో బీపీ ఉన్నట్లు తేలుతోంది. దీన్ని వైట్కోట్ హైపర్టెన్షన్ అని అంటారు. దీని వల్ల బీపీ ఉన్నట్లుగా భావించి.. వైద్యుడు మందులు రాస్తున్నాడు.. బీపీ లేకున్నా మందులు వాడటం వల్ల రోగుల ఆరోగ్యం దెబ్బతింటోంది.. దేశవ్యాప్తంగా వైట్కోట్ హైపర్టెన్షన్తో బాధపడుతున్నవారి శాతం 23గా ఉండగా.. తెలంగాణలో అది 35.9 శాతంగా ఉన్నట్లు ఈ అధ్యయనం పేర్కొంది. అలాగే ఉన్న బీపీ లేనట్లుగా కనిపించే మాస్్కడ్ హైపర్ టెన్షన్ రాష్ట్రంలో 14.3% మందిలో ఉన్నట్లు తేలింది. సాధారణంగా హృదయ స్పందన రేటు నిమిషానికి 72 ఉండాలి.. అయితే.. భారతీయుల్లో అది 80గా ఉందని వైద్యులు తెలిపారు. ఉదయంతో పోలిస్తే.. సాయంత్రం బీపీ ఎక్కువగా ఉంటోందని చెప్పారు. 41% మందికి తమకు అధిక రక్తపోటు ఉన్న సంగతే తెలియదట.. సరైన వ్యాధి నిర్ధరణ జరగకపోవడం, నిర్లక్ష్యం వంటి వాటి వల్ల గుండెతోపాటు మూత్రపిండాలూ దెబ్బతింటున్నాయని వైద్యులు తెలిపారు. అందుకే బీపీ ఉన్నట్లు సరిగా నిర్ధా రణ కావాలంటే కనీసం వరుసగా నాలుగైదు రోజుల పాటు పరీక్షించుకుని నిర్ధారించుకోవడం ఉత్తమమని వైద్యులు ప్రకటిస్తున్నారు. – సాక్షి, హైదరాబాద్ -
హైపర్ ‘టెన్షన్’
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా హైపర్ టెన్షన్(అధిక రక్తపోటు) బాధితుల సంఖ్య శరవేగంగా పెరుగుతోంది. పట్టణాల నుంచి గ్రామాలకు సైతం విస్తరించిన ఈ జీవనశైలి జబ్బుపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. అధిక రక్తపోటును ప్రాథమిక దశలోనే గుర్తించి నియంత్రించకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని, దీనివల్ల బాధితులు శాశ్వత వైకల్యం బారిన పడుతున్నారని రాష్ట్రాలను హెచ్చరించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 20 కోట్ల మంది హైపర్ టెన్షన్ బాధితులు ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించి, నియంత్రించడానికి రెండేళ్ల క్రితం దేశవ్యాప్తంగా 25 జిల్లాల్లో కేంద్రం పైలెట్ ప్రాజెక్టును చేపట్టింది. తాజాగా దీన్ని మరో 100 జిల్లాలకు విస్తరింపజేస్తున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్లోనూ రెండు జిల్లాలను ఎంపిక చేయనుంది. దేశవ్యాప్తంగా 100 జిల్లాల్లో చేపట్టనున్న స్క్రీనింగ్ పరీక్షలకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సహకారం అందిస్తోంది. హైపర్ టెన్షన్ను సకాలంలో గుర్తించి నియంత్రించకపోతే రానున్న ఐదేళ్లలో మరో ఐదారు కోట్ల మంది దీనిబారినపడే అవకాశం ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ నిపుణులు స్పష్టం చేశారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ రాష్ట్రాలకు లేఖ రాసింది. అధిక రక్తపోటు బాధితులు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఉన్నట్లు వెల్లడించింది. రాష్ట్రాలు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని, 2025 నాటికి ఈ వ్యాధి విస్తరణను కనీసం 25 శాతం అరికట్టాలని సూచించింది. బాధితులకు ప్రభుత్వం తరపున మందులివ్వాలి హైపర్ టెన్షన్ బారిన పడిన వారిలో ఎక్కువ మంది గుండె జబ్బులు, మూత్రపిండాల వైఫల్యం, బ్రెయిన్ స్ట్రోక్కు (పక్షవాతం) గురవుతున్నారని, వారి కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయని తాజాగా రాష్ట్రాలకు రాసిన లేఖలో కేంద్రం పేర్కొంది. హైపర్ టెన్షన్ స్క్రీనింగ్ (నిర్ధారణ) పరీక్షలు అన్ని గ్రామాల్లో నిర్వహించాలని, ఇందుకోసం నర్సులకు, హెల్త్ వర్కర్లకు, ఆశా కార్యకర్తలకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాలని, బాధితులకు ప్రభుత్వం తరఫునే మందులు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ‘హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్’గా మార్చాలని, గ్రామస్థాయిలో అధిక రక్తపోటు బాధితులకు వైద్య సౌకర్యాలు కల్పించాలని తెలియజేసింది. పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యధికం ఆంధ్రప్రదేశ్లో హైపర్ టెన్షన్ బాధితుల సంఖ్య ప్రతిఏటా గణనీయంగా పెరుగుతున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వర్గాల నివేదికలో తేలింది. రాష్ట్రంలో దాదాపు కోటి మంది హైపర్ టెన్షన్ బాధితులు ఉన్నట్లు అంచనా. పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యధికంగా బాధితులు ఉన్నారు. విజయనగరం, శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లోనూ బాధితుల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. హైపర్ టెన్షన్ బాధితులు పెరుగుతున్న కారణంగా గుండెపోటు, పక్షవాతం కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. ప్రాథమిక దశలోనే గుర్తించాలి ‘‘గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు తాము హైపర్ టెన్షన్ బారిన పడినట్లు కూడా తెలియదు. పట్టణాల్లో కూడా చాలామంది తమకు వ్యాధి లక్షణాలు లేవని, ఆరోగ్యంగా ఉన్నామని భావిస్తూ హైపర్ టెన్షన్ పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు. 30 ఏళ్ల వయసు దాటిన వారు విధిగా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. అసాధారణంగా ఉన్నవారికీ గుండెపోటు వచ్చే ప్రమాదం 10 శాతం ఎక్కువ. ప్రాథమిక దశలోనే గుర్తించి, మందులు వాడితే జబ్బును అదుపులో ఉంచుకోవచ్చు’’ – డా.చంద్రశేఖర్, హృద్రోగ నిపుణులు, సూపరింటెండెంట్, కర్నూలు జనరల్ ఆస్పత్రి -
వీటితో అకాల మరణాలకు చెక్
లండన్ : బీపీని అదుపులో ఉంచుకుని ఉప్పు, కొవ్వు పదార్ధాలకు దూరంగా ఉంటే రానున్న 20 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల అకాల మరణాలకు అడ్డుకట్ట వేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. 2040 నాటికి గుండె జబ్బులను ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా పెద్ద ఎత్తున నియంత్రించవచ్చని వారు అంచనా వేస్తున్నారు. ఉప్పు, కొవ్వు పదార్ధాలతో తయారయ్యే ప్రాసెస్డ్ ఆహారాన్ని అధికంగా తీసుకుంటే రక్తపోటు తీవ్రమై గుండె జబ్బులకు దారితీస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. బీపీని చికిత్స ద్వారా నియంత్రించడం వల్ల కోట్లాది మందిని అకాల మృత్యువాత పడకుండా కాపాడవచ్చని పరిశోధకులు పేర్కొంటున్నారు. బీపీకి సరైన చికిత్స ద్వారా 4 కోట్ల మందిని, ఉప్పు వాడకం తగ్గించడం ద్వారా మరో 4 కోట్ల మందిని మరణాల ముప్పు నుంచి తప్పించవచ్చని హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధక బృందం వెల్లడించింది. ఇక కొవ్వు పదార్ధాలకు దూరంగా ఉండటం ద్వారా 2040 నాటికి రెండు కోట్ల మందిని మృత్యువు అంచు నుంచి బయటపడవేయవచ్చని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా పలు అథ్యయనాల్లో వెల్లడైన గణాంకాలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా పరిశోధకులు ఈ అథ్యయనం చేపట్టారు. -
డజనుకు రెండు డజన్ల మేలు
అరటిపండు అన్ని సీజన్లలోనూ దొరుకుతుంది. మిగతా పండ్లతో పోలిస్తే ఒకింత చవక కూడా. ఇందులోని అనేక రకాల పోషకాలతో ఒనగూరే ఆరోగ్య ప్రయోజనాలూ ఎక్కువే. అరటితో ఆరోగ్యానికి కలిగే లాభాల్లో కొన్ని..! ►అరటిపండులో పొటాషియమ్ ఎక్కువ. పొటాషియమ్ అధిక రక్తపోటు (హైబీపీ)ని నియంత్రిస్తుంది. అందుకే హైబీపీ ఉన్నవారికి అరటిపండు చాలా మేలు చేస్తుంది. ఇందులోని పొటాషియమ్ మన మూత్రపిండాల ఆరోగ్య నిర్వహణకు కూడా బాగా తోడ్పడుతుంది ►అరటిపండులో అనేక రకాల ఖనిజలవణాలు ఉంటాయి. ఈ వేసవికాలంలో ఒంట్లో ఖనిజలవణాలు తగ్గి మాటిమాటికీ కండరాలు పట్టేస్తున్న వారు అరటిపండు తింటే మంచిది. అందులోని ఖనిజలవణాల కారణంగా అరటిపండ్లు తింటే ఆ సమస్య తగ్గుతుంది. ఈ కారణం వల్లనే బాగా చెమటను కోల్పోయే ఆటగాళ్లు తాము కోల్పోయే ఖనిజలవణాలను భర్తీ చేసుకోడానికి ఆటమధ్యలో తరచూ అరటిపండు తింటుండటం మనం టెన్నిస్, బ్యాడ్మింటన్ లాంటి ఆటల్లో చూస్తుంటాం. వ్యాయామం తర్వాత రెండు అరటిపండ్లు తింటే వ్యాయామ సమయంలో కోల్పోయిన శక్తి త్వరగా భర్తీ అవుతుంది. అంతేగాక వ్యాయామ అనంతరం మనకు సమకూరే ఆరోగ్యాన్ని చాలాకాలం పాటు పదిలంగా కొనసాగేలా చూస్తుంది ►అరటి పండులోని విటమిన్ సి, విటమిన్ బి6... గుండె ఆరోగ్యాన్ని కాపాడేందుకు దోహదపడతాయి ►ఆస్తమా ఉన్నవారు అరటిపండు తినకూడదనే అభిప్రాయం ఉంది. కానీ అది కేవలం అపోహ మాత్రమే. కాలేజ్ ఆఫ్ లండన్కు చెందిన పరిశోధకుల అధ్యయనం ప్రకారం... చిన్నప్పుడు అరటిపండ్లు పుష్కలంగా తిని పెరిగిన పిల్లల్లో ఆస్తమా వచ్చే అవకాశాలు 34 శాతం తగ్గుతాయని నిరూపణ అయ్యింది ►అరటిపండు జీర్ణశక్తిని పెంచి, ఆహారం తేలిగ్గా జీర్ణమయ్యేలా చూస్తుంది. జీర్ణకోశ వ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ పండ్లు మలబద్దకం లాంటి సమస్యలనూ నివారిస్తాయి ►అరటిపండులోని అమైనో యాసిడ్స్ అద్భుతమైన జ్ఞాపకశక్తికి, మెదడు చురుకుగా పనిచేయడానికి ఉపయోగపడతాయి. -
హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఏమిటి... రాకుండా జాగ్రత్తలేమిటి?
ఈమధ్య ‘హార్ట్ ఫెయిల్యూర్’తో చనిపోయారు అనే వార్తలు తరచూ వింటున్నాం. అసలు హార్ట్ఫెయిల్యూర్ అంటే ఏమిటి? ఎందుకిలా జరుగుతుంది? అసలు హార్ట్ ఫెయిల్యూర్ అయితే మనిషి ఎలా బతుకుతాడు? దీని బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దయచేసి వివరంగా తెలపండి. గుండె మన శరీరంలో ఒక ప్రధానమైన అవయవం. శరీరంలో అవయవాలన్నింటికీ నిరంతరం రక్తం సరఫరా చేస్తుండే ఒక అద్భుతమైన పంపింగ్ మోటార్ ఇది. ఈ రక్తప్రసరణ వల్లనే అన్ని అవయవాలకూ పోషకాలు, ఆక్సిజన్ అందడం మాత్రమే కాకుండా రక్తంలో చేరిన కార్బన్ డై ఆక్సైడ్, శరీరంలోని జీవక్రియల వల్ల ఉత్పన్నమైన ఇతర వ్యర్థపదార్థాల తొలగింపు జరుగుతుంటుంది. ఈ విధంగా దేహంలో ప్రసరణ వ్యవస్థ నిర్వహణలో గుండె కీలకమైన బాధ్యతను నిర్వహిస్తూ ఉంటుంది.ప్రాణవాయువైన ఆక్సిజన్ను గ్రహించడం, కార్బన్ డై ఆక్సైడ్ను బయటకు పంపించే ప్రక్రియను నిర్వహించడంలో ఊపిరితిత్తులతో కలిసి పనిచేస్తుంది. అనేక రకాల పరిస్థితుల్లో గుండె దెబ్బతింటుంది. వీటిలో ముఖ్యమైనది అధికరక్తపోటు (హైపర్టెన్షన్/హైబీపీ), కరోనరీ ఆర్టరీ డిసీజ్, డయాబెటిస్, స్థూలకాయం (ఒబేసిటీ). వీటితో పాటు వాల్వ్లార్ డిసీజ్, వైరల్ ఇన్ఫెక్షన్లు, మితిమీరిన మద్యపానం, పోషకాహార లోపం, కీమో–రేడియేషన్ల (క్యాన్సర్ చికిత్సల్లో) అనంతర స్థితి, వాపు (ఇన్ఫ్లమేటరీ స్టేట్) వల్ల కూడా గుండె దెబ్బతింటుంది.ఈ పరిస్థితులను నివారించడం, ఇందుకు కారణమయ్యే అంశాల నుంచి దూరంగా ఉండటం వల్ల గుండెకు జరిగే నష్టాన్ని చాలావరకు తగ్గించే అవకాశం ఉంటుంది. ఇందుకోసం తొలిదశలోనే వ్యాధిని గమనించడం, దానికి దారితీస్తున్న కారణాలకు దూరంగా ఉండటం వల్ల గుండెకు వాటిల్లబోయే నష్టాన్ని చాలావరకు తగ్గించేందుకు అవకాశం ఉంటుంది. ఇందుకోసం తొలిదశలోనే వ్యాధిని గమనించడం, దానికి దారితీస్తున్న కారణాలను గుర్తించడం ముఖ్యం. ఒకసారి గుండె దెబ్బతింటే మళ్లీ మునపటి స్థితిని పునరుద్ధరించుకునే సామర్థ్యం గుండెకు ఉండదు. అందుకే గుండె దెబ్బతినకుండానే తీసుకునే నివారణ చర్యలు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో చాలా కీలకమైన భూమిక నిర్వహిస్తాయి. లక్షణాలు ఇటు డాక్టర్లు, అటు పేషెంట్లు హార్ట్ఫెయిల్యూర్ లక్షణాలను వెంటనే గుర్తించాలి. కొద్దిపాటి శారీరక శ్రమ చేసినా, పడుకొని ఉన్నా శ్వాస అందకపోవడం, అలసట, కాళ్లవాపు, ఊపిరితిత్తుల్లో ఒత్తిడి ఏర్పడటం, పొట్ట ఉబ్బడం మొదలైనవి హార్ట్ఫెయిల్యూర్ లక్షణాలు. ఇవి కనిపించిన వెంటనే రోగి పరిస్థితిని జాగ్రత్తగా పరిశీలించి, తీవ్రతను అంచనా వేయాల్సి ఉంటుంది. నిర్ధారణ పరీక్షలు పైన పేర్కొన్న లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఈసీజీ, 2–డి ఎకో కార్టియోగ్రఫీ, మరికొన్ని రక్తపరీక్షల ద్వారా హార్ట్ ఫెయిల్యూర్ను డాక్టర్లు నిర్ధారణ చేస్తారు.ఇటీవల మరిన్ని ఆధునిక విధానాలు వాడుకలోకి వచ్చాయి. బయోమార్కర్లను ఉపయోగించి హార్ట్ఫెయిల్యూర్ను గుర్తించడం, వర్గీకరించడం చేయగలుగుతున్నారు. అదేవిధంగా ఇమేజింగ్ పద్ధతులు కూడా చాలా అభివృద్ధి చెందాయి. వీటివల్ల వ్యాధిని వేగంగా, ఖచ్చితంగా నిర్ధారణ చేయగలుగుతున్నారు. వీటిలో 3–డితో కూడిన ఎకోకార్డియోగ్రఫీ వ్యాధి నిర్ధారణ ఖచ్చితత్వాన్ని మెరుగుపరచింది. ఇది గుండెపనితీరు, గుండె కవాటాల పనితీరు, గుండెలోని ఒత్తిడిని అధ్యయనం చేయడానికి సాయపడుతుంది. ఎకో ద్వారా పూర్తిగా నిర్ధారణకు రాలేని సందర్భాల్లో కార్డియాక్ ఎమ్మారై ప్రభావవంతమైన ప్రత్యామ్నాయం. వీటితోపాటు కార్డియాక్ కాథటరైజేషన్, న్యూక్లియార్ స్కాన్ (పెట్, స్పెక్), ఎండోకార్డియల్ బయాప్సీ, టాక్సికాలజీతో రోగనిర్ధారణ చేస్తున్నారు. గుండెను కాపాడుకోవడం ఇలా... మనం ముందుగా మన అధిక రక్తపోటును (హైబీపీని) అదుపులో ఉంచుకోవాలి. అయితే అధిక రక్తపోటు విషయంలో చాలామంది నిర్లక్ష్యంగానో లేదా ఉదాసీనంగానో వ్యవహరిస్తుంటారు. అధిక రక్తపోటును (హైబీపీని) అదుపులో ఉంచడం ద్వారా రక్తనాళాలకు నష్టం జరగకుండా కాపాడుకోవచ్చు. అలా జరగకపోతే గుండె దమనులు తీవ్రంగా దెబ్బతీసి, గుండెకండరాలను మందంగా తయారుచేస్తుంది. దాంతో గుండెకు రక్తాన్ని పంప్ చేసే సామర్థ్యం చాలావరకు తగ్గిపోతుంది. డయాబెటిస్, స్థూలకాయం ఉన్నప్పుడు కూడా దాదాపు ఇలాంటి అంశాలే ప్రత్యక్షంగా, పరోక్షంగా హార్ట్ఫెయిల్యూర్కు దారితీస్తాయి. అందువల్ల గుండె ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి అటు హైబీపీ, డయాబెటిస్ను అదుపులో ఉంచుకోవడం, ఇటు స్థూలకాయాన్ని నివారించుకొని ఎత్తుకు తగిన బరువు ఉండేలా చూసుకోవడం అవసరమవుతుంది. జీవనశైలిలో తగిన మార్పులు చేసుకోవడం ద్వారా గుండెకు నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. రోజుకు కనీసం 30 – 35 నిమిషాల పాటు వ్యాయామం చేయడం, తాజా పండ్లు, కూరగాయలు–ఆకుకూరలతో కూడిన పోషకాహారం తీసుకోవడం, ఆహారంలో ఉప్పు చాలా తక్కువగా తీసుకోవడం వంటి జాగ్రత్తలు తప్పనిసరి. అలాగే వృత్తి, ఉద్యోగం, వ్యాపారాల్లో మానసికంగా, శారీరకంగా ఒత్తిడికి గురికాకుండా చూసుకోవడం అవసరం. ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం, ఆధ్యాత్మికత వంటి ప్రక్రియలు బాగా ఉపయోగపడతాయి. అలాగే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పొగతాగడం వల్ల గుండె మీద తీవ్రమైన భారం పడుతుంది. మద్యం కూడా గుండెకు అనర్థాలను తెచ్చిపెడుతుంది. ఆ అలవాట్లను వెంటనే ఆపేయాలి. ఇక రక్తంలో కొలస్ట్రాల్ ఉంటే దానివల్ల కరొనరీ దమనల్లో ఆటంకాలు ఏర్పడతాయి. అందుకే రక్తంలోని కొలెస్ట్రాల్ను అదుపులో ఉంచుకోవాలి.మొత్తంమీద పూర్తిగా నష్టం జరగకమునుపే క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటూ ఉండటం వల్ల గుండెకు వాటిల్లే నష్టం నివారించడానికి వీలవుతుంది. తద్వారా హార్ట్ఫెయిల్యూర్ రాకుండా కాపాడుకోవచ్చు. అలాగే ఒకసారి గుండెపోటుకు గురైతే ఆలస్యం చేయకుండా గుండెకు రక్తసరఫరాను పునరుద్ధరించడం కూడా చాలా కీలకం. దానివల్ల తక్షణ రక్షణతో పాటు మున్ముందు మరింత నష్టం జరగకుండా చూసుకోడానికి, దీర్ఘకాలంలో దుష్ఫలితాలు ఏర్పడకుండా చూడవచ్చు. డా. రాజశేఖర్ వరద, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ అండ్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్, యశోద హాస్పిటల్స్. సికింద్రాబాద్ -
టెండనైటిస్ తగ్గుతుందా?
నా వయసు 35 ఏళ్లు. నేను క్రీడాకారుణ్ణి కావడంతో అన్ని రకాల ఆటలు బాగా ఆడుతుంటాను. నాకు కొంతకాలంగా చేయి కదిలించినప్పుడు భుజంలో విపరీతమైన నొప్పితో బాధపడుతున్నాను. డాక్టర్ను సంప్రదిస్తే టెండన్స్కి సంబంధించిన వ్యాధి అని చెప్పారు. మందులు వాడుతున్నా సమస్య నుంచి ఉపశమనం లభించడం లేదు. అసలు ఈ సమస్య ఎందుకు కలుగుతుంది? హోమియో చికిత్స ద్వారా దీన్ని పూర్తిగా నయం చేసే అవకాశం ఉందా? సలహా ఇవ్వండి. మీరు వివరంగా తెలిపిన లక్షణాలను బట్టి మీరు టెండినైటిస్ సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీనికి హోమియో ద్వారా పూర్తి పరిష్కారం లభిస్తుంది. సాధారణంగా మన శరీరంలోని కండరాలను ఎముకలతో జతపరిచే తాడు లాంటి కణజాలాన్ని టెండన్స్ అని అంటారు. ఇవి ఫైబ్రస్ కణజాలంతో ఏర్పడతాయి. వీటికి సాగే గుణం ఉండటం వల్ల ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం కలిగి ఉంటాయి. కాబట్టి అవి కండరాలు ముడుచుకునే సమయంలో, ఎముకలు, కీళ్ల కదలికలకు సహకరిస్తాయి. ఏ కారణం చేతనైనా వీటికి హానికలిగితే, కదలికలు ఇబ్బందికరంగా మారి తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి. ఈ టెండన్స్ ఇన్ఫెక్షన్కు గురికావడాన్ని టెండినైటిస్ అంటారు. శరీరంలో ఎక్కడైనా ఏర్పడే ఈ సమస్య... భుజాలలో, మోచేతుల్లో, మణికట్టు, బొటనవేలు మొదటి భాగంలో, తుంటి, మోకాలు, మడమలు వంటి ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఏ వయసు వారిలోనైనా కనిపించే ఈ సమస్య ఎక్కువగా పెద్దవయసు వారిలో (ముఖ్యంగా 40 ఏళ్లు పైబడినవారిలో) కనిపిస్తుంది. ఆ వయసు వారిలో సాధారణంగా టెండాన్స్ సాగేతత్వం, ఒత్తిడిని తట్టుకునే శక్తి తగ్గిపోవడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. కారణాలు వయసు పెరగడం, గాయం కావడం, వృత్తిరీత్యా లేదా హాబీల కారణంగా టెండన్స్పై అధిక ఒత్తిడి కలిగించే ఒక రకమైన కదలికలను ఎక్కువగా కొనసాగించడం. ఉదా: కంప్యూటర్ కీ–బోర్డులు, మౌస్లు ఎక్కువగా వాడటం, కార్పెంటింగ్, పెయింటింగ్ మొదలైనవి. క్రీడల వల్ల : ►పరుగెత్తడం, టెన్నిస్, బాస్కెట్బాల్, గోల్ఫ్, బౌలింగ్ మొదలైనవాటివల్ల. ►డయాబెటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, స్థూలకాయం వంటి ఇబ్బందులతో బాధపడేవారిలో ఈ సమస్యకు గురయ్యే అవకాశం ఉంది. ►కొన్ని ఇన్ఫెక్షన్ల వల్ల కూడా ఈ టెండినైటిస్ సంభవించే అవకాశం ఉంది. లక్షణాలు టెండినైటిస్కి గురైన ప్రదేశంలో నొప్పి, బిగువుగా ఉండటం, ఆ భాగాన్ని కదిలించినప్పుడు నొప్పి అధికమవ్వడం, కొన్ని రకాల శబ్దాలు వినిపించడం, వాపు, చేతితో తాకితే ఆ ప్రదేశం వేడిగా అనిపించడం, ఎర్రగా మారడంవంటి లక్షణాలను గమనించవచ్చు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ►కంప్యూటర్లను, కీబోర్డులను, మౌస్లను సరైన పొజిషన్లో సర్దుబాటు చేసుకోవడం. ►పనిలో కొంత విశ్రాంతి తీసుకోవడం ►వ్యాయామాలు ఒకేసారి అధిక ఒత్తిడికి గురిచేసేలా కాకుండా నెమ్మదిగా ప్రారంభించడం ►క్రీడలలో కోచ్ సలహా మేరకు జాగ్రత్తలు పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి దూరంగా ఉండవచ్చు. చికిత్స జెనెటిక్ కాన్స్టిట్యూషన్ చికిత్స విధానం ద్వారా రోగి మానసిక, శారీరక పరిస్థితులు, తత్వాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స అందించడం ద్వారా రోగి తాలూకు రోగ నిరోధకశక్తిని సరిచేయడం వల్ల ఎలాంటి ఇన్ఫ్లమేషన్ ఉన్నా దానిని నయం చేయడమే కాకుండా టెండన్స్ను దృఢపరచి సమస్యను సమూలంగా దూరం చేయడం జరుగుతుంది. డా‘‘ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ మైగ్రేన్కు చికిత్స ఉందా? నా వయసు 25 ఏళ్లు. నాకు విపరీతమైన తలనొప్పి వస్తోంది. వారంలో ఒకటి, రెండు సార్లు తీవ్రంగా వస్తోంది. ఎన్నో రక్తపరీక్షలు, ఎక్స్–రే, స్కానింగ్ పరీక్షలు చేయించాను. డాక్టర్లు దీన్ని మైగ్రేన్గా నిర్ధారణ చేశారు. జీవితాంతం వస్తుంటుందని చెప్పారు. హోమియోపతిలో దీనికి చికిత్స ఉందా? తరచూ తలనొప్పి వస్తే అశ్రద్ధ చేయకూడదు. నేటి ఆధునికయుగంలో శారీరక, మానసిక ఒత్తిడి, అనిశ్చితి, ఆందోళనలు తలనొప్పికి ముఖ్యమైన కారణాలు. ఇంకా రక్తపోటు, మెదడు కణుతులు, మెదడు రక్తనాళాల్లో రక్తప్రసరణల్లో మార్పులు, సైనసైటిస్ మొదలైన వాటివల్ల తలనొప్పి వచ్చేందుకు ఆస్కారం ఉంది. తలనొప్పి ఏ రకానికి చెందినదో నిర్ధారణ తర్వాత ఖచ్చితమైన చికిత్స చేయడం సులువవుతుంది. మైగ్రేన్ తలనొప్పిని పార్శ్వపు తలనొప్పి అంటారు. మానసిక ఆందోళన, ఒత్తిడి, జరిగిపోయిన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం, డిప్రెషన్, నిద్రలేమి, అధిక ప్రయాణాలు, సూర్యరశ్మి, స్త్రీలలో హార్మోన్ సమస్యల వల్ల ఈ పార్శ్వపు తలనొప్పి వస్తుంటుంది. పురుషులతో పోలిస్తే ఇది స్త్రీలలోనే ఎక్కువ. మైగ్రేన్లో దశలూ, లక్షణాలు సాధారణంగా మైగ్రేన్ వచ్చినప్పుడు 24 గంటల నుంచి 72 గంటలలోపు అదే తగ్గిపోతుంది. ఒకవేళ 72 గంటలకు పైనే ఉంటే దాన్ని స్టేటస్ మైగ్రేన్ అంటారు. దీంతోపాటు వాంతులు కావడం, వెలుతురునూ, శబ్దాలను అస్సలు భరించలేకపోవడం వంటి లక్షణాలూ కనిపిస్తాయి. వ్యాధి నిర్ధారణ రక్తపరీక్షలు, రక్తపోటును పరీక్షించడం, సీటీస్కాన్, ఎంఆర్ఐ పరీక్షల ద్వారా మైగ్రేన్ను నిర్ధారణ చేయవచ్చు. మైగ్రేన్ రావడానికి చాలా అంశాలు దోహదపడతాయి. ఉదాహరణకు మనం తినే ఆహారంలో మార్పులు, మనం ఆలోచించే విధానం, మానసిక ఒత్తిడి, వాతావారణ మార్పులు, నిద్రలేమి, మహిళల్లో రుతుసమస్యలు వంటి కారణాలతో వచ్చినప్పుడు జీవనశైలిలో మార్పులతో దీన్ని కొంతవరకు నివారించవచ్చు. ఇక మానసిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు వ్యాయామం, యోగా, ప్రాణాయామం చేయాలి. చికిత్స మైగ్రేన్ను పూర్తిగా తగ్గించడానికి హోమియోలో మంచి మందులు ఉన్నాయి. శారీరక, మానసిక, కుటుంబ, అనువంవశిక, వాతావరణ, వృత్తిసంబంధమైన కారణాలను అంచనా వేసి, వాటిని అనుగుణంగా మందును ఎంపిక చేయాల్సి ఉంటుంది. వారి జెనెటిక్ కన్స్టిట్యూషన్ సిమిలియమ్ వంటి అంశాలన పరిగణనలోకి తీసుకొని చికిత్స అందిస్తారు. బెల్లడోనా, ఐరిస్, శ్యాంగ్యునేరియా, ఇగ్నీషియా, సెపియా వంటి కొన్ని మందులు మైగ్రేన్కు అద్భుతంగా పనిచేస్తాయి. డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ ఒళ్లంతా తెల్లమచ్చలు... తగ్గేదెలా? నా వయసు 39 ఏళ్లు. నా శరీరమంత తెల్లమచ్చలు వచ్చాయి. మొదట్లో కాస్త చిన్నవిగా ఉండి, ఇప్పుడు క్రమంగా పెద్దవవుతూ అందరూ గమనించేలా ఉంటున్నాయి. ఎంతో మానసిక వేదన అనుభవిస్తున్నాను. నాకు హోమియోలో పరిష్కారం సూచించండి. శరీరానికి చర్మం ఒక కవచం లాంటిది. అన్ని అవయవాలలో చర్మం అతి పెద్దది. ఇందులో చెమట గ్రంథులు, రక్తనాళాలు, నరాలతో పాటు చర్మం చాయకు కారణమైన మెలనోసైట్స్ కూడా ఉంటాయి. ఏప్రాంతంలోనైనా చర్మంలో ఉండే ఈ కణాలు తగ్గినప్పుడు అక్కడ తెల్ల మచ్చలు వస్తాయి. ఈ మచ్చలనే బొల్లి లేదా ల్యూకోడెర్మా అంటారు. ఇప్పుడు మీరు ఇదే సమస్యతో బాధపడుతున్నారు. చర్మం వెలుపల పొరల్లో ఉండే మెలనోసైట్ కణజాలాలు విడుదల చేసే ‘మెలనిన్ అనే ప్రత్యేక పదార్థం, టైరోసినేజ్ అనే ఎంజైమ్ వల్ల సరైన మోతాదులో విడుదల అవుతుంది. బొల్లి వ్యాధిలో ఈ ఎంజైము అనేక కారణాల వల్ల లోపిస్తుంది. దాంతో మెలనిన్ విడుదలకు అంతరాయం ఏర్పడి, చర్మం రంగును కోల్పోతుంది. ►బొల్లి వ్యాధికి ముఖ్యమైన కారణాల్లో మానసిక ఒత్తిడి ఒకటి. ఇది స్త్రీ, పురుషుల తేడా లేకుండా, వయసుతో సంబంధం లేకుండా రావచ్చు. డిప్రైషన్, యాంగై్జటీ న్యూరోసిస్ మొదలైన మానసిక పరిస్థితులు దీనికి దారితీయవచ్చు. ►పోషకాహారలోపం కూడా బొల్లి వ్యాధికి దారితీయవచ్చు. ►జన్యుపరమైన కారణాలతో వంశపారంపర్యంగా కూడా వ్యాధి రావచ్చు. దీర్ఘకాలిక గ్యాస్ట్రిక్ సమస్యలు : ఆహారంలో రాగి, ఇనుము మొదలైన ధాతువులు లోపించడం వల్ల విటమిన్లు, ప్రోటీన్ల వంటి పోషకాహార లోపం వల్ల గానీ, అమీబియాసిస్, బద్దెపురుగుల వంటి పరాన్నజీవుల వల్లగానీ తెల్లమచ్చలు కనిపించవచ్చు. ►మందులు, రసాయనాలు దుష్ఫలితాలు, క్వినోన్స్, క్లోరోక్విన్, యాంటీబయాటిక్స్ వంటి పరిశ్రమల్లో పనిచేయడం లేదా వాటిని సరైన మోతాదులో వాడకపోవడం వల్ల కూడా బొల్లి వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ►కొన్ని ఎండోక్రైన్ గ్రంథులు స్రవించే హర్మోన్స్ లోపాలు, డయాబెటిస్లో వంటి వ్యాధులలో తెల్లమచ్చలు ఎక్కువగా కనిపించే వీలుంది. ►వ్యాధి నిరోధక శక్తి (ఇమ్యూనిటీ) తగ్గడం, మన వ్యాధి నిరోధకత మనకే ముప్పుగా పరిణమించే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వల్ల మన సొంతకణాలే మనపై దాడి చేయడం వల్ల కూడా బొల్లి సోకే అవకాశం ఉంది. లక్షణాలు మొదట చిన్న చిన్న మచ్చలుగా ఏర్పడి, ఆ తర్వాత శరీరం అంతటా వ్యాపిస్తాయి. చివరకు తెలుపు రంగులోకి మారతాయి. చర్మం పలుచబడినట్లు అవుతుంది. కొన్నిసార్లు ఎండవేడిని తట్టుకోలేరు. జుట్టు రంగుమారడం, రాలిపోవడం, వంటి లక్షణాలు ఉంటాయి. ఈ మచ్చలు ముఖ్యంగా చేతులు, పెదవులు, కాల్ల మీద రావచ్చు. ఇవి పెరగవచ్చు లేదా అని పరిమాణంలో ఉండిపోవచ్చు. చికిత్స తెల్లమచ్చలకు హోమియోలో మంచి చికిత్స అందుబాటులో ఉంది. తూజా, నైట్రిక్ యాసిడ్, నేట్రమ్మ్యూరియాటికమ్, ఆర్సెనికమ్ ఆల్బమ్, లాపిస్ అల్బా, రస్టాక్స్ వంటి మందులతో తెల్లమచ్చలకు సమర్థంగా చికిత్సను అందించవచ్చు. డాక్టర్ టి.కిరణ్కుమార్, డైరెక్టర్, పాజిటివ్ హోమియోపతి, విజయవాడ, వైజాగ్ -
రక్తపోటు, మధుమేహం ఉందా? కిడ్నీ పరీక్షలు తప్పనిసరి
మన శరీరంలో మూత్రపిండా(కిడ్నీ)లను చాలా సంక్లిష్టమైన, కీలకమైన అవయవాలుగా చెప్పుకోవచ్చు. అవి శరీరంలో విషతుల్యమైన పదార్థాలను మూత్రం ద్వారా వడపోసి బయటకు విసర్జిస్తాయి. అంతేకాదు... కీలకమైన హార్మోన్లు, ఎంజైములను కూడా విడుదల చేస్తుంటాయి. చిక్కుడుగింజ ఆకృతిలో ఉండే మూత్రపిండాల్లో ఎడమవైపుది కొంచెం పెద్దగా ఉండి, కుడివైపు దానికంటే కాస్త ఎగువన ఉంటుంది. దాదాపు 150 గ్రాముల వరకు బరువుండే మూత్రపిండాలు 11–14 సెంమీ. పొడవు, 6 సెం.మీ. వెడల్పు, 4 సెం.మీ. మందంగా ఉంటాయి. రక్తంలోని వ్యర్థాలను తొలగించడంతో పాటు రక్తపోటును నియంత్రించడంలోనూ కిడ్నీలది ప్రధాన పాత్ర. అందుకే బీపీ ఎక్కువగా ఉంటే కిడ్నీ పరీక్షలను కూడా పూర్తిగా చేయించుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా అధిక రక్తపోటు, మధుమేహం తో బాధపడేవారికి మూత్రపిండాలు వైఫల్యం చెందే ప్రమాదం ఎక్కువ. కాబట్టి ఎప్పటికప్పుడు కిడ్నీ ఫంక్షన్ టెస్ట్లు చేయించుకుంటూ ఉండటం తప్పనిసరి. మూత్రపిండాలకు సంబంధించి నాలుగు రకాల సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. 1. కిడ్నీ ఇన్ఫెక్షన్స్ 2. కిడ్నీ స్టోన్స్ 3. కిడ్నీ ఫెయిల్యూర్ 4. కిడ్నీ ట్యూమర్స్ అండ్ క్యాన్సర్స్ మహిళల్లో ఎక్కువగా కనిపించే బ్యాక్టీరియల్ యూరినరీ ఇన్ఫెక్షన్లు మూత్రపిండాల వరకు పాకి అక్కడా ఇన్ఫెక్షన్లను కలగజేస్తుంటాయి. యాంటీబయాటిక్ కోర్సులతో ఈ సమస్య తొలగిపోతుంది. పురుషులలో ఎక్కువగా కనిపించే మూత్రపిండాలలోని రాళ్లలో ఇసుకరేణువు పరిమాణం మొదలుకొని గోల్ఫ్బాల్ సైజువరకూ ఉంటాయి. వీటిలో కొన్ని రకాలు అంత ప్రమాదకరం కాకపోయినా తీవ్రమైన నొప్పిని, బాధను కలిగిస్తాయి. సైజును బట్టి అనేకరకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అధిక బరువు, స్మోకింగ్, ఆల్కహాల్, రక్తపోటు, షుగర్లెవల్స్ అదుపులో లేకపోవడం వల్ల ఆ దుష్ప్రభావాలు మూత్రపిండాల మీద పడి అది కిడ్నీ ఫెయిల్యూర్ సమస్యకు దారితీయవచ్చు. మూత్రపిండాలు ఫెయిల్ అయనప్పుడు మాత్రమే లక్షణాలు బయటపడుతుంటాయి. అందుకే దీన్ని ఒక సైలెంట్ డిసీజ్గా చెప్పుకోవచ్చు. కిడ్నీ ఫెయిల్యూర్కు డయాలసిస్, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చికిత్స పద్ధతులు అనుసరించడం తప్పనిసరి కావచ్చు.పుట్టుకతో వచ్చే మూత్రపిండాల్లో కణుతులు, పిల్లలకు స్నానం చేయించేటప్పుడు లేదా డాక్టర్ దగ్గరికి చెకప్స్కు తీసుకెళ్లినప్పుడు బయటపడుతూ ఉంటాయి. కణితి పరిమాణం బట్టి మూత్రంలో రక్తం, కడుపునొప్పి, జ్వరం, ఆకలి–బరువు తగ్గడం, అజీర్ణం, అధికరక్తపోటు వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. నెఫ్రోబ్లాస్టోమా లేదా విల్మ్స్ ట్యూమర్గా చెప్పుకునే మూత్రపిండాల్లో కణుతులు పిల్లల్లో 4, 5 ఏళ్ల వయసులో బయటపడుతూ ఉంటాయి. వీటిని పూర్తిగా నయం చేయడం సాధ్యమే. రీనల్సెల్ కార్సినోమా (ఆర్సీసీ): ఈ రకం కణితి పెద్ద వయసు వారిలో కనిపిస్తూ ఉంటుంది. ఊపిరితిత్తులకు, ఇతర భాగాలకు వ్యాపించే గుణం ఈ క్యాన్సర్కు ఎక్కువ. ఒక్కొక్కసారి ఇలా ఇతర చోట్లకు పాకిన (మెటాస్టాసిస్ అయిన) భాగాల ద్వారా కూడా ఈ క్యాన్సర్ను గుర్తించడం జరుగుతూంటుంది. ఒక్కోసారి రెండు మూత్రపిండాలలో కూడా ఈ కణుతులు ఉండవచ్చు. అనేక సబ్–టైప్లలో ఉండే ఈ క్యాన్సర్... ఇతర కిడ్నీ సంబంధిత పరీక్షలలో, అల్ట్రాసౌండ్ వంటి పరీక్షలలో కనుగొనడం కూడా జరుగుతూ ఉంటుంది. వయసు పైబడే కొద్దీ ఈ క్యాన్సర్ పెరిగే అవకాశం ఎక్కువ. అయితే స్మోకింగ్ చేసేవారిలో చిన్నవయసు వారిలోనూ ఈ క్యాన్సర్ నమోదువుతున్నట్లు అధ్యయనాలు తెలుపుతున్నాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో ఈ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. స్మోకింగ్, ఆల్కహాల్, అధికబరువు వంటి వాటితో పాటు జీన్మ్యుటేషన్స్ ఈ క్యాన్సర్కు ప్రధాన కారణాలు. క్యాన్సర్ లక్షణాలు కనిపించినప్పుడు ఫిజికల్ ఎగ్జామ్, బ్లడ్ టెస్ట్లు, యూరినరీ టెస్టులు, ఎక్స్రే, అల్ట్రాసౌండ్, సీటీ, ఎమ్మారై, క్యాల్షియమ్ లెవల్స్ తెలిపే పరీక్షలతో పాటు, ఒక్కోసారి ఈ క్యాన్సర్ బయటపడే సమయానికి అది ఊపిరితిత్తులకు, ఎముకలు పాకి ఉండవచ్చు. కాబట్టి చెస్ట్ ఎక్స్రే, బోన్ స్కాన్స్ కూడా చేయిస్తూ ఉండాలి. కిడ్నీని మొత్తంగా తీసివేసే సర్జరీతో పాటు క్యాన్సర్ రకాన్ని బట్టి కీమో, రేడియో థెరపీలను ఇవ్వడం జరుగుతుంది. ఇటీవల కిడ్నీలను లాపరోస్కోపిక్ పద్ధతిలో కూడా తొలగించడం జరుగుతోంది. క్యాన్సర్ కాని కణుతుల్లో కూడా సైజును బట్టి రకరకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఈ కణుతులు ఎక్కువగా ఉన్నా, మూత్రపిండాలలో అవి చాలా పెద్దగా ఉన్న సందర్భాల్లో కూడా కిడ్నీని తొలగించడం జరుగుతుంది. సర్జరీ తర్వాత కిడ్నీ ట్యూమర్ స్టేజ్ మీద ఆధారపడి సర్జరీని 3 రకాలుగా చేస్తుంటారు. రాడికల్ నెఫ్రోక్టమీ: ఎక్కువగా చేసే ఈ సర్జరీలో మూత్రపిండంతో పాటు అడ్రినల్ గ్లాండ్స్, లింఫ్ నాళాలను, టిష్యూలను మొత్తంగా తీసివేయడం జరుగుతుంది. కణితి పరిమాణం ఎక్కువగా ఉన్నప్పుడు ఈ సర్జరీ చేస్తారు. సింపుల్ నెఫ్రొక్టమీ స్టేజ్–1: కిడ్నీ క్యాన్సర్కు ఒక మూత్రపిండాన్ని మాత్రం తీసివేయడం జరుగుతుంటుంది. పార్షియల్ నెఫ్రోక్టమీ: పుట్టుకతో ఒకే ఒక మూత్రపిండం ఉండి, దానిలో కణితి కనిపించినప్పుడు, కణితి ఉన్నంత మేరకే దాన్ని తీసేవేయడం జరుగుతుంది. ఒక్కోసారి రెండు మూత్రపిండాలలోనూ కణుతులు ఏర్పడినప్పుడు కూడా మూత్రపిండాలను ఇలా కణితి ఉన్న మేరకు మాత్రమే తీసివేయడం జరుగుతూ ఉంటుంది. క్యాన్సర్ను తొలిదశలోనే గుర్తించి ఒక్క మూత్రపిండాన్ని మాత్రమే తీసివేసినప్పుడు సర్జరీ అయిన కొద్దిరోజుల్లోనే వారు సాధారణం జీవితాన్ని గడపగలుగుతారు. రెండు మూత్రపిండాలను తీసివేశాక, రెండోది సరిగా పనిచేయకపోతే... వారు క్రమం తప్పకుండా డయాలసిస్ చేయించుకుంటూ, వీలైనంత త్వరగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవడం అవసరం. చికిత్స ముగిశాక కూడా ఫాలో అప్ కేర్ తప్పనిసరి. సీటీస్కాన్, చెస్ట్ ఎక్స్రే వంటి టెస్ట్లు క్రమం తప్పకుండా చేయించుకోవాలి. మూత్రంలో రక్తం కనిపిస్తే అశ్రద్ధ చేయకుండా ఉండటంతో పాటు స్మోకింగ్, ఆల్కహాల్ లాంటి విషాలకు దూరంగా ఉంటే మూత్రపిండాలను కొంతవరకైనా కాపాడుకోగలం. Dr. Ch. Mohana Vamsy Chief Surgical Oncologist Omega Hospitals, Hyderabad Ph: 98480 11421, Kurnool 08518273001 -
కిడ్నీపై దుష్ప్రభావం పడిందంటున్నారు
నాకు గతంలో లూపస్ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. అయితే కొంతకాలం కిందట మూత్రపరీక్ష చేయించినప్పుడు లూపస్ కారణంగా నా కిడ్నీలపై దుష్ప్రభావం పడి, లూపస్ నెఫ్రైటిస్ వచ్చినట్లు చెప్పారు. దయచేసి ఈ వ్యాధి గురించి విపులంగా వివరించి, నాకు తగిన సలహా ఇవ్వగలరు. మన శరీరంలో మూత్రపిండాలు (కిడ్నీలు) అత్యంత ప్రధానమైన అవయవాలు. అవి అధిక రక్తపోటును నియంత్రించడం, తగినన్ని లవణాలనూ, ఖనిజాలనూ రక్తంలో నిర్వహితమయ్యేలా చూడటం, ఎర్రరక్తకణాలను తయారు చేయడం, ఎముకకు బలాన్ని చేకూర్చడం వంటి అత్యంత కీలకమైన కార్యకలాపాలను నిర్వహిస్తుంటాయి. అంతేకాదు... రక్తంలోని విషపూరితమైన పదార్థాలను వడపోసి మూత్రం ద్వారా విసర్జితమయ్యేలా చూస్తాయి. మూత్రపిండాల సాధారణ వడపోత కార్యకలాపాలలో ఎర్రరక్తకణాలుగానీ, ప్రోటీన్లు గానీ బయటకు పోవు. అయితే ఏ కారణంగానైనా కిడ్నీల పనితీరు దెబ్బతింటే ఎర్రరక్తకణాలూ, ప్రోటీన్లు బయటకు పోతూ, హానికరమైన విషపదార్థాలు శరీరంలోనే ఉండిపోతాయి. ఇలా కిడ్నీ ఫెయిల్యూర్కు దారితీసే అంశాలు చాలానే ఉంటాయి. వాటిల్లో ముఖ్యంగా పేర్కొనవలసింది ‘లూపస్ నెఫ్రైటిస్’ లూపస్ నెఫ్రైటిస్ లక్షణాలు అదుపు తప్పిన రోగనిరోధక శక్తి ప్రభావం కిడ్నీల మీద పడినప్పుడు ‘లూపస్ నెఫ్రైటిస్’ వ్యాధి వస్తుంది. లూపస్ లక్షణాలు మొదలైన రెండు లేదా మూడేళ్ల తర్వాత కిడ్నీపై దాని దుష్ప్రభావం పడుతుంది. కొన్నిసార్లు లూపస్ ప్రారంభదశలోనే నేరుగా కిడ్నీపై ప్రభావం పడవచ్చు కూడా. ఈ వ్యాధి ప్రారంభదశలో పైకి ఎలాంటి లక్షణాలూ కనిపించవు. తరచూ కాళ్ల వాపు, ముఖంలో వాపు, కనురెప్పలు బరువుగా ఉండటం, మూత్రంలో అధికంగా నురుగు కనిపించడం, కొన్నిసార్లు మూత్రంలో ఎరుపు, అధిక రక్తపోటు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఎవరిలో ఎక్కువగా కనిపిస్తుందంటేలూపస్ ఉన్న వ్యక్తుల్లో 60 శాతం మందిలోనూ, చిన్నపిల్లల్లో దాదాపు మూడింట రెండు వంతుల మందిలో దాని ప్రభావం కిడ్నీ మీద పడుతుంది. దీని తీవ్రత మహిళల్లో కంటే పురుషుల్లో ఎక్కువ. గుర్తించడం ఎలా సాధ్యమైనంత వరకు తొలిదశలోనే గుర్తించడం వల్ల రోగికి ఎంతో మేలు చేకూరేందుకు అవకాశం ఉంది. దీని లక్షణాలు నిర్దుష్టంగా పైకి కనిపించవు కాబట్టి ఎస్ఎల్ఈ (సిస్టమిక్ లూపస్ ఎరిథమెటోసిస్) వ్యాధి నిర్ధారణ అయినప్పటి నుంచే తరచూ మూత్రపరీక్ష చేయించుకుంటూ ఉండాలి. మూత్రంలో ప్రోటీన్లు, ఎర్రరక్తకణాలు, తెల్లరక్తకణాలు ఎక్కువగా ఉన్నట్లయితే మూత్రపిండాల బయాప్సీ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. వ్యాధి ఏ స్థాయిలో ఉందన్న విషయం బయాప్సీ ద్వారా తెలుస్తుంది. దాన్ని బట్టి అవసరమైన చికిత్సను రుమటాలజిస్టులు సూచిస్తారు. లూపస్ నెఫ్రైటిస్ వల్ల కలిగే నష్టాలు లూపస్ నెఫ్రైటిస్ రెండు కిడ్నీల మీద కూడా సమానంగా ప్రభావం చూపుతుంది. ఎంత మెరుగైన చికిత్స తీసుకున్నప్పటికీ దాదాపు 10 నుంచి 20 శాతం మందిలో కిడ్నీల పై ఒక పొర ఏర్పడి, కిడ్నీలు శాశ్వతంగా పాడైపోతాయి. దాంతో ఒంట్లో నీరు పేరుకుపోవడం, రక్తహీనత, అధికరక్తపోటు వంటి అనర్థాలు ఏర్పడతాయి. అలాంటివారికి దీర్ఘకాలికంగా డయాలసిస్, కిడ్నీ మార్పిడి అవసరం. అంతేకాదు... ఈ జబ్బు ఉన్నవారు తేలిగ్గా అంటువ్యాధులకు గురవుతుంటారు. క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగానే ఉంటుంది. అందుకే లూపస్ వ్యాధి నిర్ధారణ జరగగానే వెంటనే రుమటాలజిస్టుల పర్యవేక్షణలో కిడ్నీలపై ఆ వ్యాధి ప్రభావాన్ని తరచూ పరీక్షించుకుంటూ ఉండాలి. చికిత్స విధానాలు ఎస్ఎల్ఈకి శాశ్వతమైన చికిత్స అందుబాటులో లేదు. అయితే జబ్బు ప్రభావం కిడ్నీ మీద పడుతున్నప్పుడు సరైన సమయంలో మందులు మొదలుపెట్టాలి. దానివల్ల సమస్య ముదరకుండా జాగ్రత్త తీసుకోవచ్చు. దీనికోసం ఇమ్యూనోసప్రసెంట్స్ మందులను వాడాల్సి ఉంటుంది. ఇవి అదుపుతప్పిన రక్షణ వ్యవస్థను సరైన దారిలో పెట్టి కిడ్నీ ఫెయిల్ కాకుండా కాపాడతాయి. కీళ్లవాతానికి మందులు వాడినా ప్రయోజనం లేదు... నా వయసు 45 ఏళ్లు. గత పన్నెండేళ్లుగా కీళ్లవాతంతో బాధపడుతున్నాను. ఎన్నో రకాల మందులు వేసుకున్నా ఫలితం కనిపించలేదు. ఈ వ్యాధి కారణంగా బాధ చాలా తీవ్రంగా ఉంది. నొప్పులు భరించలేకుండా ఉన్నాను. ఈ సమస్యకు మంచి పరిష్కారాలు ఏవైనా ఉంటే వివరంగా చెప్పండి. కీళ్లవాతం సమస్య చాలా తీవ్రమైనది. దీని కారణంగా అనేకమంది కాళ్లు, చేతులు వంకర్లుపోయి, ఇంకొకరి సహాయం లేకుండా కదలలేని పరిస్థితుల్లో ఉండటం చాలా సాధారణంగా కనిపించే అంశం. కీళ్లవాతపు జబ్బులపై సరైన అవగాహన లేకపోవడంతో దీన్ని నిర్లక్ష్యం చేసి, వ్యాధిని ముదరబెట్టుకొని, చివరకు మృత్యువు బారిన పడుతుంటారు. ఆధునిక వైద్యం అందుబాటులోకి రాకముందు మూలికలు, పూతమందుల వంటి చాలా పరిమితమైన చికిత్స మాత్రమే ఉండేది. గతంలో తీవ్రమైన ఆటోఇమ్యూన్ వ్యాధులతో బాధపడేవారిలో జబ్బులు తగ్గడం ఒకింత తక్కువ. అలాగే మరణాలు ఎక్కువగా ఉండేవి. కానీ ఇటీవల ఈ వ్యాధులకు సైతం సరికొత్త చికిత్స విధానాలు అందుబాటులోకి రావడం వల్ల పరిస్థితిలో గణనీయమైన మార్పు వచ్చింది. ఇరవయ్యో శతాబ్దం మొదటిభాగంలో మెథోట్రెగ్జేట్, సైక్లోఫాస్ఫమైడ్ అనే మందులు అందుబాటులోకి రావడంతో ఈ వ్యాధులతో బాధపడేవారి సంఖ్య తగ్గింది. ఈ మందులు ప్రాథమిక చికిత్సగా మారాయి. కానీ గత దశాబ్దంలో ఈ సమస్యకు అనేక కొత్త మందులు అందుబాటులోకి వచ్చాయి. వీటిని ‘బయోలజిక్స్’ అంటారు. కీళ్లవాతం వంటి సమస్యలకు ప్రాథమిక స్థాయిలో నొప్పినివారణ మందులు (పెయిన్కిల్లర్స్), చిన్న చిన్న మోతాదుల్లో స్టెరాయిడ్స్ వాడటం తప్పనిసరి. వీటితో పాటు వ్యాధి తీవ్రతను బట్టి ‘డీఎమ్ఆర్డీఎస్’ (డిసీజ్ మాడిఫైయింగ్ యాంటీ రుమాటిక్ డ్రగ్స్) మందులను సూచిస్తారు. ఇవి లోపలి నుంచి పనిచేస్తాయి. అయితే చికిత్స మొదలుపెట్టిన వెంటనే పెద్దగా మార్పు కనిపించదు. అలాగే ఈ మందులు క్యాన్సర్కి వాడేలాంటివనే అపోహ ఉంది. దాంతో బాధ తీవ్రంగా ఉన్నప్పటికీ కొంత మంది చికిత్సను మధ్యలోనే వదిలేస్తారు. నెమ్మదిగా పనిచేసినప్పటికీ వీటి వల్ల మంచి మెరుగదలే ఉంటుంది. అయితే 20% నుంచి 30% మందిలో ఎన్ని మందులు వేసుకున్నా పెద్దగా ప్రయోజనం ఉండదు. బయోలజిక్స్ గురించి... సాధారణ మందులతో పెద్దగా ప్రయోజనం లేని సందర్భాల్లో బయోలజిక్స్ మందులు సమర్థంగా పనిచేసే అవకాశాలున్నాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్, లూపస్, స్క్లీరోడెర్మా, యాంకైలోజింగ్ స్పాండిలోసిస్ వంటి అనేక రకాల ఆటోఇమ్యూన్ వ్యాధులలో ఈ బయోలజిక్స్ మందుల వల్ల వ్యాధి తీవ్రత తగ్గడమే కాకుండా ఈ కారణంగా సంభవించే మరణాలూ బాగా తగ్గుతాయి. ఇక మధ్యలోనే చికిత్స మానేసిన రోగుల్లో... వ్యాధి ముదరడం వల్ల బాధల తీవ్రత పెరుగుతుంది. ఇలాంటి రోగులకు స్మాల్ మాలెక్యూల్స్, స్టెమ్సెల్ థెరపీ వంటి మరింత ఆధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఇవి మరింత సమర్థమైన ప్రత్యామ్నాయ చికిత్సలు. అయితే ఈ ఆధునిక చికిత్సా విధానాలను విచ్చలవిడిగా వాడటం సరికాదు. రోగి పరిస్థితిని బట్టి, వారిలోని వ్యాధి తీవ్రతను బట్టి, ఈ చికిత్సావిధానాల వల్ల కలిగే ప్రయోజనాలూ, నష్టాలను దృష్టిలో పెట్టుకొని చాలా విచక్షణతో వాడాల్సి ఉంటుంది. అందుకే రుమటాజిస్టులు ఈ మందుల వల్ల కలిగే లాభనష్టాల నిష్పత్తిని బేరీజు వేసుకొని, సరైన అంచనాకు వచ్చి ఈ మందులను సూచిస్తారు. కాబట్టి మీరు పై అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని నిపుణులైన రుమటాలజిస్టును సంప్రదించండి. దాంతో మీ ఇబ్బందులు తొలగి, మీ జీవనశైలి మరింత మెరుగవుతుంది. డాక్టర్ విజయ ప్రసన్న పరిమి సీనియర్ కన్సల్టెంట్ రుమటాలజిస్ట్, సిటీ న్యూరో సెంటర్, రోడ్ నెం. 12, బంజారాహిల్స్, హైదరాబాద్. -
సేఫ్ కిడ్నీ
నేడు వరల్డ్ కిడ్నీ డే అర్థంచేసుకోకపోతే... కిడ్నీ ఒక పెద్ద పజిల్ అర్థం చేసుకుంటే... చాలా సేఫ్ ఇల్లూడ్చకపోతే ఆ ఇల్లెలా ఉంటుందో అందరికీ తెలుసు. ఇల్లూడ్చే బాధ్యతలాగే... మన ఒళ్లూడ్చే పని చేస్తుంది కిడ్నీ. మన ఒంట్లోని ప్రతి రక్తబ్బొట్టునూ శుభ్రంగా కడుగుతుంది. అలా బుద్ధిగా రక్తం మొత్తాన్ని శుద్ధి చేస్తుంది. ఒంటి లోపల ఒళ్లూడ్చీ, కడిగే ఈ కీలకవయవాలు నడుములోపల ఇరువైపులా సగం వంచిన బాణచాపాల్లా ఉంటాయి. సురక్షాత్మక రక్షణ కవచాల్లా ఉంటాయి. బక్కెట్ల కొద్దీ మాలిన్యాలను వెలికి తీస్తుంటాయి. అలా అవి మన రక్షణ బాధ్యత తీసుకున్నప్పుడు వాటిని కాపాడుకునే బాధ్యత మనమూ తీసుకోవాలి కదా. అదెలాగో తెలుసుకునేందుకే ఈ ప్రత్యేక కథనం. మీ దేహానికి మీరే దేవదేవుడు. మీ ఒళ్లే మీ కొవెల. మీ దేహాలయపు గర్భగుడి లోపల ద్వారపాలకుల్లా మిమ్మల్ని నిరంతరం రక్షించేందుకు మీకు ఇరుపక్కలా ఉంటాయి రెండు కిడ్నీలు. మీ దేహక్రియలూ, మీ జీవక్రియల మాలిన్యాలతో వచ్చే అనేక గండాలను కడిగిపారేసే ఆ రక్షకులే మీ మూత్రపిండాలు. కేవలం రక్షించే పనేనా... కిడ్నీ అంటే కేవలం రక్తంలోని మలినాలను మాత్రం కడిగేసే హౌజ్కీపింగ్ పని మాత్రమే చేస్తాయని అనుకుంటున్నారా? కాదు... దేహానికి మాస్టర్కెమిస్ట్లు అవి. ఎర్ర రక్తకణాల ఉత్పాదనలోనూ వాటా తీసుకుంటాయి. ఒంట్లో నీటిసరఫరాను నియంత్రిస్తాయి. మీ దేహమే ఒక దేశమైతే అందులోని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ బాధ్యత అంతా కిడ్నీలదే. ఆ చీపురు పేరే నెఫ్రాన్... ఒంట్లోని ప్రతి రక్తపు బొట్టునూ కడిగేయడానికి పనిచేసే కిడ్నీలోని చీపురు లాంటి దాన్ని ‘నెఫ్రాన్’ అంటారు. అలాంటి పది లక్షల చీపుర్లు నిరంతరం, అనునిత్యం పనిచేస్తూ ఒంట్లోంచి కసవును ఊడ్చేస్తుంటాయి. జీవక్రియల వల్ల వెలువడ్డ అడుసును కడిగేస్తుంటాయి. ఈ కిడ్నీ నెఫ్రాన్ అనే చీపురులో సన్నటి తీగలుగా చుట్టుకునే ఉండే చీపురుపుల్ల పొడవెంతో తెలుసా? అక్షరాలా 105 కిలోమీటర్లు. మూత్రపిండాల్లోని నెఫ్రాన్లు తొండాలతో తోడినట్లుగా మలినాలను తోడేసి దేహ గండాలను తొలగిస్తాయి. అలాంటి నెఫ్రాన్లు పది లక్షలు విలక్షణంగా పనిచేస్తూ దేహాన్ని లక్షణంగా ఉంచుతాయి. అలా నిస్వార్థంగా వ్యర్థాలను బయటకు నెట్టే అర్ధవంతమైన పనిని అనునిత్యం చేస్తూ ఉంటాయవి. మనలో ఉండి... మల్టీ టాస్కింగ్ ఒంటిని శుభ్రం చేసే ఒక్క పనిని ప్రధానంగా పెట్టుకోకుండా, అనుబంధంగా కొనరు పనులెన్నో కోరి చేస్తుంటాయవి. ఉదాహరణకు ∙ఒంట్లో నీళ్ల పాళ్లను ఎప్పుడూ సమంగా ఉంచడం. ∙రక్తపోటును అదుపులో పెట్టడం ∙మూలుగ ఇండస్ట్రీలో ఉత్పత్తి అయ్యే ఎర్రరక్తకణాల తయారీకి అనుబంధ పరిశ్రమలాగా సహాయపడటం ∙చర్మం, ఎముకలు... ఇలా దేహం మొత్తంలో ‘డి‘ విటమిన్ ఉత్పత్తి జరిగేలా ప్రేరేపించడం. ∙అంతేకాదు... సోడియమ్, పోటాషియమ్ పీహెచ్ పాళ్లను సరిచూస్తాయి. ఇవి కిడ్నీ చేసే పనుల్లో కొన్ని మాత్రమే. మనలో ఇలా మల్టీ టాస్కింగ్ చేసే కిడ్నీ సేఫ్గా ఉంచడం మన కర్తవ్యం కదా. మరి వాటి రక్షణకు ప్రతికూలంగా పనిచేసే అంశాలనూ ముందుగా తెలుసుకుందాం. మన రక్షణ కోసం ఆ రెండూ... ఆ రెండింటి శత్రువులు మరిరెండూ... మన దేహాన్ని కాపాడటం కోసం రెండు మూత్రపిండాలు పనిచేస్తుంటాయి కదా. మరి ఆ ఇద్దరి వెనకా నిత్యం చెరో ఇద్దరు శత్రువులూ పొంచి ఉంటారు. మొదటిది డయాబెటిస్... ఆ రెండింటిలో మొదటిది డయాబెటిస్. రెండోది అధిక రక్తపోటు (హైబీపీ). నూరుమంది కిడ్నీ బాధితులను తీసుకుంటే అందులో 40 శాతం మంది డయాబెటిస్తో కిడ్నీలను చెడగొట్టుకున్నవారే. రెండోది హైబీపీ... మరో 30 శాతం మంది హైబీపీలను నియంత్రణలో ఉంచుకోకపోవడం వల్ల కిడ్నీలను దెబ్బతీసుకున్నవారే. అందుకే ఈ రెండు సమస్యలను నియంత్రణలో ఉంచుకోగలిగితే కిడ్నీలు దెబ్బతినకుండా చూసుకోవడం చాలా సులభం. చక్కెర చేటు... రక్తపోటు వేటు... ప్రపంచంలోనే చక్కెరవ్యాధిగ్రస్తుల విషయంలో మనదేశం అగ్రస్థానంలో ఉంది. ఐదుగురు సభ్యులున్న ప్రతి కుటుంబంలోనూ ఇద్దరు చక్కెర వ్యాధిగ్రస్తులున్నారని ఒక అంచనా.చిన్నతనంలోనే వచ్చే (టైప్–1) డయాబెటిస్ బాధితుల్లో 10–30 శాతం మంది, పెద్దయ్యాక వచ్చే (టైప్–2) డయాబెటిస్ బాధితుల్లో 40 శాతం మంది మూత్రపిండాల బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి డయాబెటిస్ ఉందంటే అటు గుండెజబ్బులు వచ్చే అవకాశాలతో పాటు, కిడ్నీలు పాడయ్యే అవకాశాలూ ఉన్నాయని గుర్తుంచుకోవాలి.ఇక ఆధునిక జీవనశైలిలోని ఆహారపు అలవాట్లు, తీవ్రమైన ఒత్తిడితో కూడిన వృత్తులు వంటివి మన రక్తపోటు (హైబీపీ) సమస్యను తీవ్రతరం చేస్తున్నాయి. దాంతో హైబీపీ కారణంగా దెబ్బతినే ప్రధాన అవయవాల్లో కిడ్నీ ప్రధానమైనది. ఆ రెండింటి నుంచి కిడ్నీల రక్షణ ఎలాగంటే... కిడ్నీలు మన రక్తంలోని వ్యర్థాలను వడగడుతుంటాయి కదా. ఈ క్రమంలో వ్యర్థాలను సేకరించి శరీరానికి హాని చేసేవాటిని బయటకు పంపే కీలక బాధ్యతను నిర్వహిస్తుంటాయి. ఒకసారి మూత్రపిండం పనితీరు మందగించి విఫలం కావడం ఆరంభమైందంటే దాన్ని పూర్తిగా నార్మల్కు రావడం చాలా కష్టం. అదేగాని పూర్తిగా విఫలమైతే ఇక నిత్యం కృత్రిమంగానే రక్తాన్ని శుద్ధి చేసుకుంటూ ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ ప్రక్రియనే డయాలసిస్ అంటారు. ఆర్థికంగానూ కుంగదీసే అంశమది... డయాలసిస్ ప్రక్రియ కుటుంబాలపై ఎంతో ఆర్థిక భారాన్ని మోపుతుంది. ఎంత కాదన్నా ప్రతి నెల ఐదారువేల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. పాడైపోయిన మూత్రపిండానికి చికిత్స తీసుకుంటూ ఉన్నా అది పూర్తిగా సమర్థంగా మారదు. క్రమంగా గుండెజబ్బులు, అవయవాలు దెబ్బతినడం వంటివి మొదలవుతాయి. పోనీ... దెబ్బతిన్న మూత్రపిండాన్ని మార్పిడి చేయించుకోవాలన్నా కిడ్నీ దాతలు దొరకడం కష్టం. ఆపరేషనే పెద్ద ప్రయత్నం అనుకుంటే... ఇక ఆ తర్వాత జీవితాంతం వేసుకోవాల్సిన మందులకూ చాలా ఎక్కువగా ఖర్చవుతుంది. ఇలా మూత్రపిండాల వ్యాధి ఉన్నవారి కుటుంబానికి అటు డయాలసిస్ కోసం, ఇటు మందుల కోసం ఆర్థికంగా ఎంతో ఖర్చు అవుతుంటుంది. సరే... ఖర్చును ఎలాగోలా భరిద్దామనే అనుకున్నా మందులతో ఇతర సమస్యలు, దుష్ప్రభావాలు, ఇబ్బందులు కలుగుతాయి. ఈ అన్ని అంశాల సమగ్ర ఫలితాలతో మీ జీవనప్రమాణాలు, ఆయుర్దాయం తగ్గవచ్చు. అందుకే కిడ్నీలు దెబ్బతినకుండా ముందునుంచే జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైన మంచిది, అది అవసరం కూడా. కీలకమైన కిడ్నీలను కాపాడుకోవాలంటే... డయాబెటిస్, అధిక రక్తపోటు ఉన్నవారు కచ్చితంగా వాటిని నియంత్రణలో ఉంచుకోవాలి. చక్కెరవ్యాధిగ్రస్తులు ప్రతి మూడు నెలలకోసారి క్రమం తప్పకుండా హెచ్బీఏ1సీ అనే పరీక్షను మూడు నెలలకు ఒకసారి చేయిస్తూ దాని ఫలితం 6.5 కంటే తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఏమీ తినకముందు షుగర్ 100 ఎంజీ/డీఎల్ లోపల ఉండాలి. తిన్న తర్వాత 160 ఎంజీ/డీఎల్ ఉండేలా చూసుకోవాలి. రక్తపోటు ఉన్నవారు తమ బీపీని నిత్యం 130/80 ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. రక్తంలో కొలెస్ట్రాల్ పాళ్లు పెరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ∙మన ఆహారంలో ఉప్పును పరిమితం చేసుకోవాలి. బేకరీ ఐటమ్స్, పచ్చళ్లు, అప్పడాలు, నిల్వ ఉండే ఆహారాన్ని తీసుకోకూడదు. ∙మూత్ర విసర్జన సమయంలో మూత్రంలో సుద్దలా పోతున్నట్లు అనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి. కిడ్నీల పరిరక్షణకు తేలికైన పరీక్షలు... చిన్నప్పుడే వచ్చిన (టైప్–1) డయాబెటిస్ బాధితులు, ఆ వ్యాధి బారిన పడిన ఐదేళ్ల నుంచి ప్రతి ఏటా కిడ్నీ పరీక్షలు చేయించుకోవాలి. అలాగే పెద్దయ్యాక వచ్చిన (టైప్–2) డయాబెటిస్ బాధితులు దాన్ని గుర్తించిన తక్షణమే కిడ్నీ పనితీరును తెలుసుకునే పరీక్షను చేయించుకోవాలి. ఆ తర్వాతినుంచి ప్రతి ఏడాది ఒక్కసారైనా క్రమం తప్పకుండా కిడ్నీ పరీక్ష చేయించుకుంటూనే ఉండాలి. దీనివల్ల కిడ్నీ సమస్యలేవైనా తలెత్తుతున్నాయా అన్న విషయాన్ని గుర్తించి దానికి అనుగుణంగా చికిత్స తీసుకోవచ్చు. ఆ తేలికైన పరీక్షలివి... ►మూత్రంలో ఆల్బుమిన్ : ఇది ఒక రకం ప్రోటీన్. మూత్రంలో సుద్దలా పోతుందంటే కిడ్నీల వడపోత సామర్త్యం తగ్గినట్లే. అందుకే మధుమేహ బాధితులు ప్రతిఏటా మూత్రంలో ఆల్బుమిన్ పరీక్ష చేయించుకోవాల్సిందే. దీని ద్వారా కిడ్నీ సమస్యను గుర్తించవచ్చు. ►రక్తంలో సీరమ్ క్రియాటినిన్ : మన కిడ్నీల వడపోత సామర్థ్యం ఎలా ఉందో చెప్పేందుకు ఈ పరీక్ష కీలకం. దీని ఆధారంగానే కిడ్నీల వడపోత సామర్థ్యాన్ని (ఎస్టిమేటెడ్ గ్లోమెరూలార్ ఫిల్టరేషన్ రేట్ – ఈజీఎఫ్ఆర్)ను లెక్కించి, కిడ్నీ సమస్య తలెత్తే అవకాశం ఎంత ఉందని అంచనా వేస్తారు. సాధారణంగా ఇది 110 మి.లీ. ఉంటుంది. ఇది 60 మి.లీ. కంటే తక్కువగా ఉంటే మూత్రపిండాల సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువ. అలాగే కేవలం సీరమ్ క్రియాటినిన్ అనే పరీక్ష మాత్రమే సరిపోదు. ఎందుకంటే కిడ్నీలు 50 శాతం దెబ్బతినేవరకూ రక్తపరీక్షలో సీరమ్ క్రియాటినిన్ పెరిగినట్లుగా తెలిసే అవకాశం లేదు. కాబట్టి ‘ఈజీఎఫ్ఆర్’ను చూసుకోవడం ముఖ్యం. సీరమ్ క్రియాటినిన్ను పరీక్షించి, రోగి వయసు, బరువు, ఎత్తు వంటి కొన్ని ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుని వాటి ఆధారంగా ‘ఈజీఆర్ఎఫ్’ను లెక్కిస్తారు. డాక్టర్ ఊర్మిళ ఆనంద్ సీనియర్ నెఫ్రాలజిస్ట్ అండ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఫిజీషియన్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
ప్రెగ్నెన్సీ టైమ్ పరీక్షల్లో బయటపడుతుంది
గర్భిణుల్లో... కొంతమంది మహిళలకు గర్భం దాల్చకముందే హైబీపీ ఉంటుంది. మరికొంతమందిలో గర్భం దాల్చిన 20వ వారంలో ఇది కనిపిస్తుంది. (ఒకవేళ 20వ వారం కంటే ముందే హైబీపీ ఉందంటే... వారికి అంతకు ముందే అధిక రక్తపోటు ఉందనీ, దాన్ని మొదట గుర్తించలేదనీ అర్థం. అంటే 20వ వారం కంటే ముందే రక్తపోటు ఉందంటే అది దీర్ఘకాలిక బీపీ అని, గర్భవతి అయ్యాక చేసే రక్తపరీక్షల్లో అది బయటపడిందని అనుకోవచ్చు. గర్భవతులకు ముప్పు ఉంటే అది మరెన్నో వైద్యసమస్యలకు కారణం కావచ్చు. ఒకవేళ అప్పటికే హైబీపీ ఉన్న మహిళలు గర్భం దాల్చాలని అనుకున్నప్పుడు వాళ్లు వాడే మందుల గురించి డాక్టర్ను సంప్రదించి, ప్రెగ్నెన్సీ ప్లానింగ్ విషయంలో డాక్టర్ దగ్గరి నుంచి తగిన సలహాలు తీసుకున్న తర్వాత ముందుకెళ్లాలి. కొన్ని మందులను గర్భం ధరించిన సమయంలో అస్సలు తీసుకోకూడదు. ఉదాహరణకు ఆంజియోటెన్సిన్ రిసెప్టార్ బ్లాకర్స్, మూత్రం ఎక్కువగా అయ్యేలా చేసే డై-యూరెటిక్స్ వంటివి. అవి పిండానికి హాని చేకూర్చవచ్చు. గర్భవతుల్లో వచ్చే హైబీపీ... గర్భవతుల్లో వచ్చే హైబీపీని ‘జెస్టేషనల్ హైబీపీ’ అంటారు. గర్భం దాల్చిన 20వ వారంలో హైబీపీ కనిపిస్తే దాన్ని ‘ప్రీ అక్లాంప్సియా’ అంటారు. అంతకు మునుపు రక్తపోటు ఉన్న కొంతమంది మహిళల్లో ... గర్భం దాల్చాక మళ్లీ అది కనిపించవచ్చు. ప్రీ-అక్లాంప్సియా ఉన్న మహిళలకు ప్రసవమైన ఆరు వారాల తర్వాత ఆ కండిషన్ తగ్గి మళ్లీ మామూలు కావచ్చు. అక్లాంప్సియా: ఇది ప్రీ-అక్లాంప్సియా కండిషన్ తర్వాత వచ్చే సమస్య. అక్లాంప్సియా సమస్య ఉన్నవారిలో అది ఫిట్స్కు దారితీయవచ్చు. ఇది చాలా తీవ్రమైన సమస్య. అందుకోసమే సమస్య ప్రీ-అక్లాంప్సియా దశలో ఉన్నప్పుడే చికిత్స తీసుకొని అది అక్లాంప్సియా వరకు పోకుండా జాగ్రత్త పడాలి. కారణాలు: గర్భవతుల్లో హైబీపీకి లేదా ప్రీ-అక్లాంప్సియాకు సరైన కారణాలు ఇంకా తెలియదు. నిజానికి గర్భధారణకూ, బీపీ పెరగడానికి ఏదో సంబంధం ఉన్నట్లు వైద్య నిపుణుల పరిశీలనలో తెలిసింది. ప్లాసెంటా పెరుగుదలతో ఏర్పడే కొత్త రక్తనాళాలు అభివృద్ధి చెందడంతోనే సమస్య వస్తుందని నిపుణుల అభిప్రాయం. అయితే ప్రీ-అక్లాంప్సియా సమస్య ఉన్నప్పుడే గుర్తించి, తగిన చికిత్స తీసుకోవాలి. లేకపోతే అది పిండానికి ఆక్సిజన్, పోషకాలు అందడంపై దుష్ర్పభావం చూపవచ్చు. గర్భధారణ సమయంలో హైబీపీతో సమస్యలు {పీ-అక్లాంప్సియా సమస్య వల్ల కాబోయే తల్లికి పక్షవాతం రావచ్చు. మూత్రపిండాలకు, కాలేయానికి సమస్య రావచ్చు. రక్తం గడ్డకట్టే అవకాశాలు ఉండవచ్చు. కడుపులోని బిడ్డకు... బిడ్డ ఎదుగుదలలో సమస్య నెలలు నిండకముందే ప్రసవం మృతశిశువు పుట్టే అవకాశం గర్భవతుల్లో బీపీ ఉన్నట్లు తెలియడం ఎలా? భరించలేనంత తలనొప్పి కళ్లు సరిగా కనిపించకపోవడంమసకబారినట్లుగా ఉండటం పొట్టనొప్పి (ముఖ్యంగా పొట్ట పైభా గంలో ఎదుర్రొమ్ము ఎముకల కింద, కుడివైపున నొప్పిగా ఉంటుంది.వేవిళ్లు కాకుండా ఆ తర్వాత కూడా వాంతులుకడుపులోని బిడ్డ కదలికలు సరిగా లేకపోవడం.గర్భం దాల్చిన కొంతమందిలో ముఖం ఉబ్బడం, కాళ్లు-చేతుల వాపు చాలా సాధారణం. అయితే ప్రీ-అక్లాంప్సియా ఉంటే అది పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తుంది. అలాంటి సమయంలో డాక్టరును తప్పక సంప్రదించాలి. డాక్టర్ భాగ్యలక్ష్మిసీనియర్ గైనకాలజిస్ట్, అండ్ అబ్స్టెట్రీషియన్,యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
క్యాజువల్గా చెక్ చేసినప్పుడు తెలుస్తుంది
పిల్లల్లో... వయసు పైబడ్డవారిలో, పెద్దవారిలో హైబీపీ ఉన్నట్లు వినడం సాధారణమే. అయితే మారిన జీవనశైలితో ఇటీవల చిన్నపిల్లల్లోనూ హైబీపీ కనిపిస్తోంది. పిల్లల్లో హైబీపీ కండిషన్ రెండు విధాలుగా ఉండవచ్చు. మొదటిదాన్ని ప్రైమరీ హైపర్టెన్షన్ అంటారు. ఇలా హైపర్టెన్షన్ పెరగడానికి నిర్దిష్టమైన కారణమేమీటో తెలియనప్పుడు దాన్ని ప్రైమరీ అంటారు. ఇక బీపీ పెరగడానికి నిర్దిష్టమైన కారణం ఉన్న కండిషన్ను సెకండరీ హైపర్టెన్షన్ అంటారు. బీపీ రావడానికి అనేక కారణాలు ఉండవచ్చు. పిల్లలకు స్థూలకాయం ఉండటం, క్యాల్షియమ్ జీవక్రియల్లో మార్పులు, కుటుంబ చరిత్రలో ఎవరికైనా బీపీ ఉండటం, రెనిన్ హార్మోన్లో మార్పుల వంటివి ప్రైమరీ హైపర్టెన్షన్కు కారణం కావచ్చు. అయితే పిల్లల్లో హైపర్టెన్షన్ ఉంటే 95% నుంచి 99% మందిలో సెకండరీ హైపర్టెన్షనే అయి ఉండవచ్చు. అంటే ఇతర అవయవ సంబంధమైన వ్యాధులు (ఉదాహరణకు మూత్రపిండాల సమస్య, ఇతర మందులు, విషపదార్థాలుతీసుకోవడం, మెదడుకు సంబంధించిన రుగ్మతలు, గుండెజబ్బులు, గ్రంథులకు సంబంధించిన సమస్యలు, రక్తనాళాల సమస్యలు) ఉన్నప్పుడు చిన్నపిల్లల్లో బీపీ ఎక్కువగా కనిపిస్తుంది. చిన్నపిల్లల్లో బీపీ ఉందని నిర్ధరించడం చాలా జాగరూకతతో చేయాలి. సరైన ఉపకరణాలతో, సరైన పద్ధతిలో, ఒకటి రెండుసార్లు పరీక్ష చేసి సెంటైల్ చార్ట్ (బీపీ కొలతలను బట్టి ఏది ఎంత తీవ్రమైనతో తెలిపే చార్ట్) ప్రకారం సరిగ్గా నిర్ధారణ చేయడం చాలా ప్రధానం. ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవారి పిల్లల విషయంలో మరింత నిశితంగా పరీక్ష చేయాలి. మూడేళ్లు దాటిన పిల్లలకు బీపీ తప్పనిసరిగా చూడాలి. సెంటైల్ చార్ట్లో 90వ పర్సంటైల్ ఉంటే బీపీ ఉన్నట్లు కాదు. అయితే ఈ రీడింగ్ వచ్చిన పిల్లలకు తప్పనిసరిగా ప్రతి ఆరునెలలకు ఒకసారి పరీక్ష చేయించాలి. రీడింగ్ 95-99 ఉంటే ఆ పిల్లలకు హైపర్టెన్షన్ స్టేజ్-1 అని చెప్పవచ్చు. 99 పర్సంటైల్ కంటే ఎక్కువ ఉంటే దాన్ని స్టేజ్-2గా పరిగణించవచ్చు. ఈ తీవ్రతలను బట్టి అంటే... స్టేజ్-1, స్టేజ్-2లను పరిగణనలోకి తీసుకునే ఏ తీవ్రత ఉన్న పిల్లలకు ఎలాంటి చికిత్స అన్నది నిర్ధారణ చేస్తారు. సాధారణంగా స్కూల్లో ఎన్సీసీ, స్పోర్ట్స్ వంటి వాటిల్లో పాల్గొనే పిల్లలను వైద్యులు పరీక్షించినప్పుడే వాళ్లలో బీపీ ఉన్నట్లు గుర్తించడం జరుగుతుంది. ఎందుకంటే సాధారణంగా పిల్లల్లో హైబీపీ ఉన్నా దాని లక్షణాలు పెద్దగా బయటకు కనిపించకపోవచ్చు. బీపీ చాలా ఎక్కువగా ఉన్నప్పుడు కొన్ని లక్షణాలతో అది బయటపడుతుంది. అవి... పెరుగుదలలో మార్పులు, తరచూ తలనొప్పి రావడం, కళ్లు తిరగడం, రక్తస్రావం, కంటిచూపులో మార్పులు, ఫిట్స్ రావడం, పిల్లలు చికాకుగా ఉండటం వంటి కొన్ని లక్షణాలను బీపీ ఎక్కుగా ఉన్న పిల్లల్లో చూడవచ్చు. ఇక నిర్దిష్ట కారణం (సెకండరీ కాజెస్)తో వచ్చే హైపర్టెన్షన్లో బీపీ వచ్చిన కారణాన్ని గుర్తించి దానికి చికిత్స చేయాల్సి ఉంటుంది. పిల్లల్లో ప్రైమరీ హైపర్టెన్షన్ నివారణకు... స్థూలకాయం (ఒబేసిటీ) తగ్గేలా చూడటం కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండే ఆహారం తగ్గించడం నూనె పదార్థాలు, ఉప్పు తగ్గించడం ఏరోబిక్స్ వంటి ఆటల్లో పిల్లలు పాల్గొనేలా చూడటం...ఈ జాగ్రత్తలతో చాలావరకు తగ్గించవచ్చు. స్టేజ్-1లో ఉన్న పిల్లలకు సైతం మందులు లేకుండానే పైన పేర్కొన్న జాగ్రత్తలతో నివారించడం సాధ్యమే. డా. రమేశ్బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్ రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ, హైదరాబాద్ -
కిడ్నీ మార్పిడితో కొత్త జీవితం
మన శరీరంలోని అవయవాల్లో మూత్రపిండాలు (కిడ్నీస్) ప్రధానమైనవి. ఇవి మన శరీరంలో రక్తాన్ని శుద్ధి చేసి, మలిన పదార్థాలను మూత్రం ద్వారా బయటకు పంపిస్తాయి. నీటి సమతుల్యతను కాపాడటంతో పాటు రక్తపోటును కూడా నియంత్రిస్తాయి. ఇవి చెడిపోతే శరీరంలో రక్తశుద్ధి ప్రక్రియ కుంటుపడిపోయి రక్తం కలుషితం అవుతుంది. దాంతో ప్రాణాలకే ప్రమాదం. అలాంటి సమయంలో కిడ్నీ మార్పిడి ఒక్కటే శాశ్వత పరిష్కారం. చికిత్స: దీర్ఘకాలిక కిడ్నీల వైఫల్యం ఉన్నప్పుడు కిడ్నీ పనితీరును మెరుగుపరిచేందుకు వైద్యులను క్రమం తప్పకుండా కలుస్తూ వారు సూచించిన చికిత్స తీసుకోవాలి. బీపీ ఉంటే దాన్ని అదుపులో పెట్టుకోవాలి. మంచి పోషకాహారాన్ని తీసుకుంటూ ఉండాలి. మూత్రపిండాలు వాటి సామర్థ్యాన్ని పూర్తిగా కోల్పోతే శరీరంలో రక్తాన్ని శుద్ధి చేసే ప్రక్రియ పూర్తిగా కుంటుపడుతుంది. అలాంటప్పుడు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేయాల్సి వస్తుంది. ఈ స్థితిలో ఉన్న రోగులకు డయాలసిస్ గానీ లేదా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ గానీ చేయాల్సి వస్తుంది. డయాలసిస్ ఎప్పుడు చేయించుకోవాలి: పేషెంట్కి ఆగకుండా వాంతులు అవుతుండటం, నీరసంగా ఉండటం, ఆకలి తక్కువగా ఉండటం, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది కలుగుతుండటం వంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు డయాలసిస్ అత్యవసరమని భావించవచ్చు. అంతేకాకుండా కొందరు పేషెంట్లలో ఇలాంటి లక్షణాలు లేకపోయినప్పటికీ వారికి నిర్వహించిన పరీక్షల్లో సీరమ్ క్రియాటినైన్ 8 ఎంజీ కంటే ఎక్కువగా, యూరియా 150కి పైగా ఉన్నట్లు తేలితే పేషెంట్ ఆరోగ్య పరిస్థితి దిగజారకుండా డయాలసిస్ నిర్వహించాల్సి ఉంటుంది. కానీ వైద్యుల సూచనలు, సలహాల మేరకే ఈ ప్రక్రియ చేపట్టాలి. అయితే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్కు మించిన మంచి ప్రత్యామ్నాయం లేదని చెప్పవచ్చు. దాదాపు 25 శాతం మంది రోగులు డయాలసిస్ చేయించుకున్నప్పటికీ, వివిధ సైడ్ ఎఫెక్ట్స్తో చనిపోతున్నారు. డయాలసిస్లో ఉన్నప్పుడు పేషెంట్ గుండె విఫలం కావడం లేదా తీవ్రమైన ఇన్ఫెక్షన్స్ లాంటి ఇతరత్రా కారణాల వల్ల తమ ప్రాణాలను కోల్పోతున్నారు. డయాలసిస్ రకాలు... హీమో డయాలసిస్: ఇది యంత్రం ద్వారా రక్తాన్ని శుద్ధి చేసే పద్ధతి. కృత్రిమ కిడ్నీ ద్వారా యంత్రం సహాయంతో రక్తాన్ని శుద్ధి చేస్తారు. పెరిటోనియల్ డయాలసిస్: ఇది ఇంట్లోనే చేసుకునే డయాలసిస్. కిడ్నీ మార్పిడి ఎప్పుడు? కిడ్నీ వంద శాతం పాడైనప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ ఉత్తమమైన మార్గం. అయితే ఇది అందరికీ సాధ్యపడదు. దీనికి దాత అవసరం. లైవ్ డోనార్ (బతికి ఉన్న వారి నుంచి కిడ్నీ సేకరించడం), కెడావర్ డోనార్ (చనిపోయిన వ్యక్తి నుంచి కిడ్నీ సేకరించడం) ప్రక్రియ ద్వారా కిడ్నీని సేకరిస్తారు. లైవ్ డోనార్లో రక్తసంబంధీకులు మాత్రమే కిడ్నీని దానం చేయాలి. అలాగే దాత బ్లడ్ గ్రూపు స్వీకర్త బ్లడ్ గ్రూపుతో కలవాల్సి ఉంటుంది. కిడ్నీ దానం చేసేవారికి అధిక రక్తపోటు, డయాబెటిస్, గుండెజబ్బులు, మెదడు జబ్బులు, కాలేయ వ్యాధులైన హెపటైటిస్-బి, సి లాంటివి ఉండకూడదు. ఒకవేళ రక్తసంబంధీకుల బ్లడ్ గ్రూపులు కలవకపోతే స్వాప్ లేదా ఏబీఓ ఇన్కంపాటబుల్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రక్రియలు అందుబాటులో ఉన్నాయి. అయితే కిడ్నీ లభించేవరకు డయాలసిస్ తప్పనిసరి. స్వాప్ ట్రాన్స్ప్లాంటేషన్ కిడ్నీ మార్పిడి అవసరమైన వారి రక్త సంబంధీకులు కిడ్నీ దానం చేయాలనుకున్నప్పటికీ బ్లడ్గ్రూపులు కలవకపోవడం వల్ల కొన్నిసార్లు అది సాధ్యపడదు. ఇలాంటి సందర్భాల్లో అదే సమస్యతో బాధపడుతున్న మరొకరికి చెందిన రక్తసంబంధీకులు కిడ్నీని దానం చేయాలని అనుకుంటే... పరస్పరం ఒకరి దాతలు మరొకరికి కిడ్నీలు దానం చేసుకొని... కిడ్నీ మార్పిడి చేయించుకునే ప్రక్రియను స్వాప్ రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్ (ఇచ్చిపుచ్చుకోవడం) అంటారు. ఈ విధానంలో వీరి కిడ్నీ మరొకరి బంధువుకూ, వారి కిడ్నీ వీరి బంధువుకూ అమర్చుతారు. బ్లడ్ గ్రూపులు కలవకపోయినా కిడ్నీ మార్పిడి అందివస్తున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, వైద్యులలో పెరుగుతున్న నైపుణ్యాలతో ప్రస్తుతం బ్లడ్గ్రూపులు కలవకపోయినా కూడా కిడ్నీ మార్పిడి చేయగలుగుతున్నారు. ఏబీఓ ఇన్ కంపాటబుల్ ట్రాన్స్ప్లాంటేషన్ అనే అత్యాధునిక వైద్య ప్రక్రియ ద్వారా దాత, స్వీకర్త... ఈ ఇద్దరూ వేర్వేరు బ్లడ్గ్రూపులు కలిగి ఉన్నా... కిడ్నీ మార్పిడి చేయడం వీలవుతుంది. ఈ ప్రక్రియలో ప్రత్యేకమైన ప్లాస్మాఫెరసిస్ పద్ధతిని అనుసరించి వేర్వేరు బ్లడ్గ్రూపుల్లోని యాంటిజెన్ కలిసేలా చేస్తారు. దాత, స్వీకర్తల బ్లడ్ గ్రూపులు కలవకపోయినప్పటికీ ఏబీఓ ఇన్కంపాటబుల్ ట్రాన్స్ప్లాంటేషన్ విధానంలో కిడ్నీ మార్పిడి చేసుకున్న వారు కూడా కంపాటబుల్ కిడ్నీ మార్పిడి మాదిరిగానే మెరుగైన ఫలితాలు పొందుతున్నారు. కిడ్నీ దానం సురక్షితమా? కిడ్నీ దానం హానికరం కానేకాదు. ఒక కిడ్నీ పాడైనప్పటికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరో కిడ్నీతో కూడా జీవిత కాలాన్ని హాయిగా కొనసాగించవచ్చు. దైనందిన జీవితానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. యథావిధిగా ఉద్యోగాలు చేసుకోవచ్చు. డ్రైవింగ్, వ్యాయామంతో పాటు ఆటల పోటీల్లోనూ పాల్గొనవచ్చు. మిలిటరీ ఉద్యోగాలు కూడా నిరభ్యంతరంగా కొనసాగించుకోవచ్చు. కిడ్నీ దానం చేసే దాతకు భవిష్యత్తులో ఎలాంటి ఆరోగ్య సమస్యలూ ఉండవు. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జరీకి అత్యాధునికమైన ’ల్యాపరోస్కోపిక్’ వైద్య విధానం అవలంబిస్తారు. ఒక కిడ్నీ దానం చేయడం వల్ల దాతకు ఎలాంటి నష్టం లేదని నిర్ధారణ చేసిన తర్వాతనే కిడ్నీ మార్పిడి చేస్తారు. లక్షణాలు కాళ్ల వాపులు ముఖం వాచినట్లు ఉండటం ఆకలి తగ్గడం ఆగకుండా వాంతులు కావడం నీరసంగా ఉండటం ఆయాసం రావడం ఎక్కువ సార్లు మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావడం (ప్రధానంగా రాత్రివేళల్లో) మూత్రం తక్కువగా రావడం కొన్ని సందర్భాల్లో మూత్రంలో రక్తం పడటం ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది కలగడం అపస్మారక స్థితికి చేరుకోవడం. కిడ్నీ చెడిపోవడానికి కారణాలు డయాబెటిస్ అధిక రక్తపోటు మూత్రనాళ ఇన్ఫెక్షన్స్ను నిర్లక్ష్యం చేయడం కిడ్నీలో రాళ్ల సమస్య వంశపారంపర్యంగా (2 నుంచి 5 శాతం మందిలో). -
ఎన్నికల విధుల్లో హెడ్ కానిస్టేబుల్ మృతి
నారాయణఖేడ్ /పెద్దశంకరంపేట/పటాన్చెరు టౌన్:ఉప ఎన్నికల విధుల్లో పాల్గొన్న హెడ్ కానిస్టేబుల్ హీరాసింగ్ రక్తపోటుకు గురై మరణించాడు. నారాయణఖేడ్ మండలం కొండాపూర్ పోలింగ్ కేంద్రం వద్ద పటన్చెరు పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేసే హీరాసింగ్ శనివారం ఎన్నికల విధులు నిర్వర్తించారు. మధ్యాహ్నం సమయంలో ఆయన తీవ్రమైన రక్తపోటుతో పాటు ఛాతీలో నొప్పితో బాధపడుతూ కుప్పకూలాడు. తోటి సిబ్బంది వెంటనే ఆయనను ఖేడ్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇక్కడ ప్రథమ చికిత్స అనంతరం హైదరాబాద్కు తరలించారు. దీంతో మార్గమధ్య లో సంగారెడ్డి సమీపంలోకి వెళ్లగానే మరణించాడు. ఈ యన భౌతికకాయాన్ని సంగారెడ్డి ఆస్పత్రిలో ఉంచారు. హెడ్కానిస్టేబుల్ మృతి విషయం ఎన్నికల కమిషన్కు నివేదించామని, ప్రభుత్వం ద్వారా కుటుంబానికి సహా యం అందేలా చూస్తామని కలెక్టర్ రోనాల్డ్రాస్ తెలిపా రు. మృతుడు హీరాసింగ్ది పెద్దశంకరంపేట మండలం కోలపల్లి గ్రామం. ఆయనకు భార్య, కూతురు ఉన్నారు. హీరాసింగ్ కుటుంబాన్ని ఆదుకుంటాం: కలెక్టర్ విధినిర్వహణలో ప్రాణాలు విడిచిన హీరాసింగ్ (48) కుటుంబాన్ని జిల్లా కలెక్టర్ రోనాల్డ్రాస్, జిల్లా ఎస్పీ సుమతి, అడిషనల్ ఎస్పీ సురేందర్రెడ్డి శనివారం రాత్రి పరామర్శించారు. మృతదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళలర్పించారు. ఎన్నికల విధులు పూర్తయ్యాయనే సంతోషంలో ఉన్న తమను హెడ్కానిస్టేబుల్ మృతి చెం దాడన్న వార్త కలిచివేసిందన్నారు. అయన కుటుం బాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకుంటామన్నారు. హీరాసింగ్ భార్య ప్రతిభ, కుమార్తె హారికలను ఓదార్చారు. వీరి వెంట మెదక్ డీఎస్పీ రాజారత్నం, అడిషనల్ డీఎస్పీ వెంకన్న, సీఐలు నాగయ్య, లింగేశ్వర్, పేట ఎస్ఐ మహేష్గౌడ్ తదితరులున్నారు. హెడ్ కానిస్టేబుల్ మృతితో విషాదం ఖేడ్ ఉప ఎన్నికల్లో భాగంగా శనివారం నారాయణఖేడ్లో పోలింగ్ బందోబస్తు నిర్వహిస్తూ హెడ్ కానిస్టేబుల్ హీరాసింగ్ మృతిచెందిన ఘటన విషాదాన్ని నిం పింది. 1959 బ్యాచ్లో ఉద్యోగం పొందిన హీరాసింగ్ ఆయా పోలీస్ స్టేషన్లలో పని చేశారు. ప్రస్తుతం కొంత కాలంగా పటాన్చెరు పీఎస్లో విధులు నిర్వహిస్తున్నారు. పటాన్చెరులోని జేపీ కాలనీలో నివాసముంటున్నారు. ఆయనకు భార్య ప్రతిభాబాయి, పదోతరగతి చదువుతోన్న కూతురు హారిక ఉన్నారు. హీరాసింగ్ మృతి పట్ల పోలీసు అధికారుల సంఘం నాయకుడు ఆసిఫ్ సంతాపం ప్రకటించారు. స్థానిక పోలీసులు సంతాపం వ్యక్తం చేశారు. -
గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్
భయపడాల్సిన అవసరం ఏమీ లేదు నా వయసు 56. నేను గత 5 సంవత్సరాల నుండి డయాబెటిస్, హైపర్టెన్షన్తో బాధపడుతున్నాను. గత 20 రోజుల నుండి భోజనం చేస్తుంటే ఛాతీలో నొప్పి వస్తోంది. ఎందువల్ల నొప్పి వస్తోందో అర్థం కావడంలేదు. నాకు సరైన సలహా ఇవ్వగలరు. - వెంకటేశ్వర్, నిర్మల్ భోజనం చేస్తున్నప్పుడు గానీ, ద్రవ పదార్థాలు తీసుకున్నప్పుడు కానీ ఛాతీలో నొప్పి రావడాన్ని ‘బడైనోఫెజిమా’ అంటారు. మీరు డయాబెటిస్తో బాధపడుతున్నారు కాబట్టి ఆహార వాహికకు సంబంధించిన ఇన్ఫెక్షన్ వల్ల నొప్పి వచ్చే అవకాశం ఉంది. మీలో డయాబెటిస్ని నియంత్రించకపోతే ‘కాన్డిడా’ అనే ఫంగస్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఒకసారి ఎండోస్కోపీ పరీక్ష చేయించుకోండి. తరువాత దానికి సంబంధించిన మందులు వాడి, డయాబెటిస్ను నియంత్రణలో పెట్టుకుంటే మీకు మంచి ఫలితం లభిస్తుంది. నా వయస్సు 48 సంవత్సరాలు. ఐదు సంవత్సరాల క్రితం నాకు లాప్రోస్కోపీ పద్ధతి ద్వారా ఆపరేషన్ చేసి, పిత్తాశయాన్ని తొలగించారు. ఇప్పుడు అదే స్థానంలో మూడు నెలల నుండి నొప్పి వస్తోంది. ఎందుకు ఇలా జరుగుతున్నది? నొప్పి తగ్గే మార్గం చెప్పగలరు? - రమణ, విశాఖపట్నం సాధారణంగా కాలేయంలో తయారయ్యే పైత్య రసం చిన్నచిన్న నాళాల ద్వారా వచ్చి పిత్తాశయంలో కేంద్రీకరించబడుతుంది. పిత్తాశయం నుండి సిబిడి అనే గొట్టం ద్వారా చిన్నప్రేవులోకి చేరుతుంది. అయితే పిత్తాశయాన్ని తొలగించిన తరువాత మీకు నొప్పి కలగడానికి అనేక కారణాలు ఉండవచ్చు. మీరు ముందుగా అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్షను చేయించుకుని, సిబిడి గొట్టంలో రాళ్లు ఇంకా ఏమైనా ఉన్నాయా లేవా అనే విషయం నిర్ధారణ చేసుకోవాలి. ఎండోస్కోపీ పరీక్ష చేయించుకుని అల్సర్కు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉన్నాయేమో తెలుసుకోవాలి. రెండు పరీక్షలు నార్మల్గా ఉన్నట్లయితే భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు ఒకసారి గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ను కలిసి తగిన పరీక్షలు చేయించుకోండి. మా పాప వయసు 9 సంవత్సరాలు. మల విసర్జనలో ఎలాంటి సమస్య లేదు. కానీ అప్పుడప్పుడు మలంలో రక్తం పడుతోంది. వీటికి మీరు తగిన సలహా, సూచన ఇవ్వగలరని ప్రార్థన. - రాజేశ్వరి, రాయచోటి మీరు తెలిపిన వివరాలను బట్టి చూస్తే అవి పెద్ద ప్రేవులో కంతులు ఉన్నాయనిపిస్తోంది. వీటిని పాలిప్స్ అంటారు. ఈ కంతులు ఉండడం వల్ల అప్పుడప్పుడు మలంలో రక్తం వచ్చే అవకాశం ఉంది. ఇలా మలంతో రక్తం పోవడంవల్ల మీ పాపకి ఎనీమియాకు దారితీసే అవకాశం ఉంది. కాబట్టి పాపకు సిగ్మా ఎండోస్కోపీ చేయించండి.ఒకవేళ పాలిప్స్ ఏమైనా ఉన్నట్లయితే ఎండోస్కోపీ ద్వారా తొలగించవచ్చు. ఈ చికిత్స వల్ల పాపకు ఉన్న సమస్య తొలగిపోతుంది. మీరు వెంటనే దగ్గరలో ఉన్న గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ను కలిసి చికిత్స మొదలుపెట్టండి. -
జనరల్ హెల్త్ కౌన్సెలింగ్
అకస్మాత్తుగా మెలకువ వస్తోంది..? నా వయస్సు 78 ఏళ్లు. ఇంతకు ముందులాగా గాఢనిద్ర పట్టడం లేదు. అర్ధరాత్రుళ్లు అకస్మాత్తుగా నిద్రలోంచి లేస్తున్నాను. చాలాసేపు నిద్రపట్టక అలాగే కూర్చుంటున్నాను. నా సమస్యకు తగిన పరిష్కారం చూపండి. - రాఘవేంద్రప్రసాద్, గుంటూరు నిజానికి చాలామందిలో వయసు పెరుగుతున్న కొద్దీ నిద్రపోయే వ్యవధి తగ్గుతుంది. అయితే మీరు అకస్మాత్తుగా నిద్రలోంచి ఉలిక్కిపడి లేస్తున్నారని చెబుతున్నారు. బహుశా దీనికి కారణం మీలోని అంతర్గత మానసిక ఆందోళన కావచ్చు. ఇక మీ వయసు 78 ఏళ్లు అంటున్నారు కాబట్టి మీరు ఒకసారి పూర్తిస్థాయి వైద్యపరీక్షలు చేయించుకోండి. ఒక్కోసారి అధిక రక్తపోటు (హైబీపీ), సెరిబ్రల్ సర్క్యులేషన్ (మెదడుకు రక్తప్రసరణ) సరిగా లేకపోవడం వల్ల కూడా ఇలాంటి లక్షణాలు కనిపించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా వీలైనంత త్వరగా వైద్యనిపుణులకు చూపించండి. నాకు 28 ఏళ్లు. తరచూ వెన్నెముక, నడుం భాగాల్లో నొప్పి వస్తోంది. నోట్లో పెదవులపై, దవడలపై, నాలుక కింది భాగంలో తరచూ పొక్కులు వస్తున్నాయి. ఎప్పుడూ జ్వరం వచ్చిన ఫీలింగ్ ఉంటోంది. నా సమస్యకు కారణం ఏమిటి? దీనికి తగిన పరిష్కారం చెప్పండి. - ఎల్. దొరబాబు, మచిలీపట్నం మీరు వివరించిన లక్షణాలను బట్టి ప్రధానంగా మీ కీళ్లనొప్పులు, వెన్నెముక, మెడ, తుంటి భాగాల్లో ఉండటం, పెదవులపైనా, దవడలపైనా పొక్కులు, జ్వరంగా ఉండటం వంటివి చూస్తుంటే... మీకు కీళ్లవాతం (సీరోనెగెటివ్ ఆర్థోపతి) వంటి వ్యాధులు ఉండవచ్చునేమో అనిపిస్తోంది. ఇక కొన్ని సందర్భాల్లో విటమిన్ బి-12 లోపాల వల్ల కూడా మీరు చెప్పిన లక్షణాలు కనిపిస్తాయి. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మొదట మీరు దీనికి సంబంధించిన పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. ఇందులో విటమిన్-బి 12 లోపాలు లేవని నిర్ధారణ అయి, మీకు కీళ్లవాతానికి సంబంధించిన వ్యాధులు ఉన్నట్లు తెలిస్తే దానికి తగిన మందులు కొంతకాలం పాటు వాడాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మానసికంగా ఒత్తిడి, డిప్రెషన్ వంటివి ఉన్న సమయంలోనూ మీరు చెబుతున్న లక్షణాలు బాగా తీవ్రమవుతుంటాయి. కాబట్టి మీకు అలాంటి ఒత్తిళ్లు ఏవైనా ఉంటే వాటికి పరిష్కారాలు కనుగొని ప్రశాంతంగా ఉండాల్సిన అవసరం ఉంది. దీన్ని అధిగమించడానికి యోగా వంటి మార్గాలను అనుసరించండి. మీరు ఒకసారి జనరల్ ఫిజీషియన్ను కలిసి వారి సలహా మేరకు అవసరమైన పరీక్షలు, చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం. -
నివారణ - నియంత్రణ మార్గాలకు హైబీప్రిపేర్డ్...
మనకు తెలియకుండానే ముప్పు తెచ్చిపెట్టే జీవనశైలి వ్యాధుల్లో (లైఫ్స్టైల్ డిసీజ్లో) హైబీపీ లేదా హైపర్టెన్షన్ ఒకటి. ఇది ఉన్నట్లే తెలియదు లేదా ఒక్కోసారి అది కొన్ని అవయవాలకు చేయాల్సిన కీడు చేసిన తర్వాత గానీ బయటపడదు. దాంతో కీలక అవయవాలు దెబ్బతిని ఒక్కోసారి చాలా ప్రమాదకరమైన పరిస్థితి రావచ్చు. అందుకే దీన్ని సెలైంట్ కిల్లర్ అంటుంటారు. ఇటీవల దీని విస్తృతి పెరుగుతున్న నేపథ్యంలో చాలా సులువుగా దీన్ని నివారించుకోవడం, ఉంటే నియంత్రించుకోవడం ఎలాగో తెలుసుకుందాం. మన శరీరంలో రక్తం గుండె నుంచి రక్తనాళాల ద్వారా అన్ని అవయవాలకూ ప్రవహిస్తుంటుంది. ఇలా జరగాలంటే రక్తనాళాల్లో అది కొంత ఒత్తిడితో వెళ్తుండాలి. ఒత్తిడినే ‘బ్లడ్ ప్రెషర్’ (బీపీ) అంటారు. సాధారణ బీపీ కొలత 120 / 80 ఉండాలన్నది అందరికీ తెలిసిన విషయమే. ఇందులో మొదటి విలువను సిస్టోలిక్ బీపీ అని, రెండో విలువను డయాస్టోలిక్ బీపీ అని అంటారు. పదిహేను నుంచి నలభై ఏళ్ల వరకు వయసున్న వారిని చాలామందిని పరిశీలించాక ఈ ప్రామాణిక విలువను నిర్ధారణ చేశారు. చిన్నపిల్లల్లో ఈ విలువ మరికాస్త తక్కువగా ఉంటుంది. మహిళల్లో బీపీ ఒకింత తక్కువగా అంటే... 110 / 70 ఉంటుంది. ఇక 45 ఏళ్లు దాటాక వయసును బట్టి బీపీ పెరుగుతూ ఉండవచ్చు. ఉండాల్సిన ప్రామాణిక విలువ కంటే బ్లడ్ప్రషర్ ఎక్కువ ఉంటే దాన్ని హైబీపీ లేదా హైపర్టెన్షన్ అని అంటారు. లక్షణాలు : హైబీపీ ఉన్నా దాని లక్షణాలు పెద్దగా బయటకు కనిపించకపోవచ్చు. బీపీ చాలా ఎక్కువగా ఉన్నప్పుడు కొన్ని లక్షణాలతో అది బయటపడవచ్చు. ఆ లక్షణాలివి... తరచూ తలనొప్పి రావడం కళ్లు తిరగడం కంటిచూపులో మార్పులు ఫిట్స్ రావడం ఎప్పుడూ చికాకుగా ఉన్నట్లు అనిపిస్తుండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఒక్కోసారి ఏదైనా అవయవం దెబ్బతింటే దాని తాలూకు లక్షణాలు బహిర్గతమవుతాయి. నివారణ / నియంత్రణ : అధిక రక్తపోటు (హైబీపీ) ఉన్నవాళ్లు ఆహార నియువూలు తప్పనిసరిగా పాటించాల్సి వుంది. హైబీపీకి ఇప్పుడు అవుల్లో ఉన్న ఆహార నియువూవళిని ‘డ్యాష్’ అంటారు. ‘డయుటరీ అప్రోచ్ టు స్టాప్ హైపర్టెన్షన్’ అన్న ఇంగ్లిష్ పదాల సంక్షిప్తరూపమే ఈ డ్యాష్. ఈ నియమాలు బీపీని నివారించుకోవాలనుకుంటున్న వారు కూడా పాటించవచ్చు. ఎందుకంటే ఇవే నివారణకూ తోడ్పడతాయి. ఇవన్నీ ఆరోగ్యకరమైన జీవనశైలిలో భాగమే. - హైపర్టెన్షన్ ఉన్నవాళ్లు లేదా దాన్ని నివారించుకోవాలనుకున్నవారు తాజా పండ్లు, కూరగాయులు, ఆకుకూరలు పుష్కలంగా తీసుకోవాలి. ఉదాహరణకు అరటిపండు వంటి పండ్లలో పొటాషియుమ్ పాళ్లు ఎక్కువ కాబట్టి అలాంటి పండ్లు తీసుకోవడం వల్ల బీపీ తగ్గుతుంది లేదా నివారితమవుతుంది. - ఇక క్యాల్షియుమ్కు కూడా బీపీని నివారించే / నియంత్రించే గుణం ఉంది. అరుుతే ఇందుకోసం కొవ్వు పాళ్లు (వెన్నపాళ్లు) తక్కువగా ఉన్న పాలూ, పాల ఉత్పాదనలు తీసుకోవాల్సి ఉంటుంది. - హైపర్టెన్షన్ నివారించుకోవాలనుకుంటున్నవారితో పాటు అది ఉన్న వారు ఆహారంలో ఉప్పు (సోడియుం) పాళ్లను గణనీయంగా తగ్గించాలి. ఇందుకోసం ఉప్పు (సోడియమ్) పాళ్లు ఎక్కువగా ఉండే ఆహారాలైన నిల్వ ఉంచిన ఆహారాలు (ప్రిజర్వ్డ్ ఫుడ్స్), బేకరీ ఐటమ్స్, పచ్చళ్లు, అప్పడాలు (పాపడ్), క్యాన్డ్ ఫుడ్స్ పూర్తిగా తగ్గించాలి. సాధారణంగా ఆవకాయలు / పచ్చళ్లు ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి అవసరానికి మించి కాస్త ఎక్కువగానే ఉప్పు వేస్తుంటారు. లేకపోతే ఆవకాయ / పచ్చడి చెడిపోతుందని అంటుండటం మనం వింటూనే ఉంటాం. అందుకే కాస్త పాత బడ్డ తర్వాత ఆవకాయ / పచ్చళ్లు రుచి తగ్గి, ఉప్పగా అనిపిస్తుంటాయి. అందుకే పాత ఆవకాయలనూ, పాత పచ్చళ్లను (నిల్వ పచ్చళ్లను) అస్సలు ఉపయోగించకూడదు. - శరీర బరువు పెరుగుతున్న కొద్దీ లేదా వ్యక్తులు లావెక్కుతున్న కొద్దీ అన్ని కణాలకూ రక్తసరఫరా జరగడానికి రక్తం వేగంగా ప్రవహించాల్సి వస్తుంటుంది. దాంతో స్థూలకాయులకు హైబీపీ వచ్చే అవకాశాలు ఎక్కువ. అందుకే ఎత్తును లేదా బీఎమ్ఐని చూసుకొని, ఎత్తుకు తగ్గ బరువుండేలాగా ఎప్పుడూ మన బరువును నియంత్రించుకుంటూ ఉండాలి. - మంచి పోషకాలు ఉండే ఆహారం తినడం వల్ల అంటే పొట్టుతో ఉండే అన్ని రకాల తృణధాన్యాలు, ఆకుపచ్చటి ఆకుకూరలు, కొవ్వు తక్కువగా ఉండే ఆహారంతో బరువు తగ్గడంతో పాటు సాధారణ ఆరోగ్యమూ బాగుంటుంది. కాబట్టి ఇది పరోక్షంగా బీపీ నివారణకు తోడ్పడే అంశం. - క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల బరువు పెరగరు. బరువు పెరగడం, స్థూలకాయం రావడం వంటి అంశాలు హై-బీపీ వచ్చేందుకు రిస్క్ ఫ్యాక్టర్ అన్న విషయం తెలిసిందే. వ్యాయామం మన శరీరంలో కొవ్వు పేరుకోకుండానూ, బరువు పెరగకుండానూ చేసి, పరోక్షంగా హై-బీపీని నివారిస్తుంది. - ఆల్కహాల్ అలవాటును పూర్తిగా మానేయాలి. ఆల్కహాల్ తాగగానే రక్తప్రసరణ వేగంలో తక్షణం మార్పు వస్తుంది. కొంత వేగంగానే పెరుగుతుంది. అందుకే ఈ అలవాటును పూర్తిగా మానేయాలి. - పొగతాగే అలవాటు వల్ల కూడా ఎన్నో అనర్థాలతో పాటు పొగలో ఉండే నికోటిన్ ఒక ఉత్ప్రేరకంగా పనిచేస్తుందన్న విషయం తెలిసిందే. ఉత్ప్రేరకాలన్నీ రక్తప్రసరణ వేగాన్ని పెంచేవే. కాబట్టి బీపీ ఉన్నవారూ, దాన్ని నివారించుకోవాలనుకునే వారు ఈ దురలవాటు నుంచి పూర్తిగా దూరంగా ఉండాలి. - ఆధునిక నగర జీవితంలోనూ, మన వృత్తులలోనూ నిత్యం పెరుగుతున్న ఒత్తిడి రక్తపోటును చాలా ఎక్కువగా పెంచుతుంటుంది. అందుకే రక్తపోటును నివారించుకోవాలనుకునేవారు తప్పనిసరిగా ఒత్తిడిని అదుపులో ఉంచుకోవాలి. ఇందుకోసం యోగా, ప్రాణాయామ వంటి ప్రక్రియలతో పాటు తమకు ఇష్టమైన అభిరుచులలో (హాబీలలో) కృషిచేస్తూ ఆనందంగా, ఆహ్లాదంగా ఉండాలి. మనం నివారణ కోసం (లేదా అప్పటికే బీపీ ఉన్నవారు నియంత్రణ కోసం) అనుసరించే ఈ మార్గాలన్నీ ఆరోగ్యకరమైన జీవనశైలిలో భాగమే. కాబట్టి మంచి జీవనశైలిని అనుసరిస్తే బీపీని అదుపులో ఉంచుకోవడం లేదా నివారించుకోవడం చాలా సులభం. హైబీపీ... తీవ్రత వర్గీకరణ ఎప్పుడూ 120 / 80 ఉండాల్సిన రక్తపోటులో మార్పు వచ్చి అది 140 / 90 కంటే ఎక్కువ ఉంటే దాన్ని హైబీపీగా చెప్పవచ్చు. - మైల్డ్ హైబీపీ : 140 / 90 నుంచి 150 / 90 కొలతలు ఉంటే దాన్ని మైల్డ్ హైబీపీ అనుకోవచ్చు. - మోడరేట్ హైబీపీ : 160 /90 లేదా 160 / 100 నుంచి 170 / 100 లేదా 180 / 100 వరకు విలువలు ఉంటే దాన్ని ఒక మోస్తరు హై-బీపీ (మోడరేట్ హైబీపీ)గా చెప్పవచ్చు. - సివియర్ హైబీపీ : 190 / 100 నుంచి 190 / 110 వరకు ఉంటే దాన్ని తీవ్రమైన హైబీపీ (సివియర్ హైబీపీ) అని పేర్కొనవచ్చు. - యాగ్జిలరేటెడ్ హైపర్టెన్షన్ : 200 / 120 నుంచి 210 / 120 ఉంటే దాన్ని మరింత తీవ్రమైన హైబీపీ (యాగ్జిలరేటెడ్ హైపర్టెన్షన్) అని చెప్పవచ్చు. -
హై బీపీ కౌన్సెలింగ్
నేను గత ఐదేళ్లుగా హైబీపీతో బాధపడుతున్నాను. ఇటీవల ఒకసారి బీపీ చెక్ చేయించుకోడానికి డాక్టర్గారిని కలిస్తే ఆయన కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ కూడా చేయించుకొమ్మని సలహా ఇచ్చారు. నాకు లక్షణాలేమీ లేకపోయినా ఎందుకిలా చేశారు? వివరించగలరు. - శ్రీనాథ్, కరీంనగర్ దీర్ఘకాలంగా హైబీపీతో బాధపడుతున్నవారిలో కొన్నిసార్లు రక్తపోటులో హెచ్చుతగ్గులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇలా రక్తపోటు హెచ్చుతగ్గులు ఉన్నవారిలోనూ, దీర్ఘకాలంగా హైబీపీతో బాధపడుతున్నవారిలోనూ ఎండ్ ఆర్గాన్స్ అనే కీలకమైన శరీర అంతర్గత అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. మెదడు, కాలేయం, మూత్రపిండాల వంటి వాటిని ఎండ్ ఆర్గాన్స్గా పరిగణించవచ్చు. ఎందుకంటే రక్తం ఇక్కడివరకు చేరి మళ్లీ వెనక్కు తిరుగుతుంది. ఇలాంటి కీలకమైన అవయవాలు హైబీపీ దుష్ర్పభావాల వల్ల దెబ్బతినే అవకాశాలు ఎక్కువ. పైగా కిడ్నీ, కాలేయం వంటి అవయవాలు చాలావరకు దెబ్బతిన్న తర్వాత గాని వాటికి సంబంధించిన లక్షణాలేవీ బయటపడవు. అందుకే వాటిని ముందే తెలుసుకోగలిగితే రాబోయే ముప్పును సమర్థంగా నివారించవచ్చు. ఈ కారణం వల్లనే హైబీపీ ఉన్నవారిలో తరచూ కీలక అవయవాలైన కాలేయం పనితీరు పరీక్షలనూ, కిడ్నీ పనితీరును తెలుసుకునేందుకు దోహదపడే గ్లోమెరులార్ ఫిల్టరేషన్ రేట్, క్రియాటినిన్ వంటి పరీక్షలనూ చేయిస్తుంటారు డాక్టర్లు. మీరు డాక్టర్ ఇచ్చిన సలహా పాటించండి. డాక్టర్ సుధీంద్ర ఊటూరి, కన్సల్టెంట్ లైఫ్స్టైల్ అండ్ రీహ్యాబిలిటేషన్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
హై బీపీ కౌన్సెలింగ్
నా వయసు 35 ఏళ్లు. గతంలో బాగా ఎక్సర్సైజ్ చేసేవాణ్ణి. ఆ తర్వాత కూడా , కుదరనప్పుడు ఆపడం వంటివి చేసినా కొంతకొంత గ్యాప్స్ తర్వాత ఎక్సర్సైజు చేయడం మొదలుపెట్టేవాణ్ణి. అయితే ఇటీవల నాకు బీపీ ఉన్నట్లుగా డాక్టర్లు నిర్ధారణ చేశారు. ఇప్పుడు నేను ఎక్సర్సైజ్లు చేయవచ్చా? - ఆనంద్, హైదరాబాద్ మీరు మీ హైపర్టెన్షన్కు మందులు వాడుతున్నారో లేదో మీ లేఖలో రాయలేదు. హైబీపీతో బాధపడేవాళ్లు కూడా ఎక్సర్సైజ్ చేయవచ్చు. కాకపోతే కొన్ని నియమాలు పాటించాలి. మిగతావారిలా హైబీపీ ఉన్నవాళ్లు పరగడునే ఎక్సర్సైజ్ చేయకూడదు. ఏదైనా తిని, ఆ తర్వాత బీపీ మందులు వేసుకున్న తర్వాతే ఎక్సర్సైజ్లు మొదలుపెట్టాలి. అప్పుడే బీపీ విలువలు ఎక్కువ, తక్కువలు కాకుండా ఉంటాయి. ఇక హైబీపీ ఉన్నవారు ఎక్సర్సైజ్ చేసేప్పుడు తప్పనిసరిగా వార్మ్అప్ వ్యాయామాలు చేశాకే అసలు వ్యాయామాలు చేయాలి. ఆ తర్వాత క్రమంగా కూల్డౌన్ ఎక్సర్సైజ్లూ చేయాలి. కొంతగ్యాప్ తర్వాత మొదలుపెట్టేవారైతే నేరుగా ఒకేసారి ఎక్సర్సైజ్లు మొదలుపెట్టకూడదు. మొదటివారం 15 నిమిషాలు, రెండోవారం 30 నిమిషాలు, ఆ తర్వాతి వారం 45 నిమిషాలు ఓ మోస్తరు వేగంతో నడక వంటి వ్యాయామాలు చేయాలి. రోజుకు 45 నిమిషాల పాటు ఓ మోస్తరు వేగంతో నడవడం అనేది హైబీపీ ఉన్నవారికి ఉత్తమమైన వ్యాయామ ప్రక్రియ. ఇక బీపీ ఉన్నవారు ఉదయం వేళలలో వ్యాయామం చేయడం మంచిది. డాక్టర్ సుధీంద్ర ఊటూరి, కన్సల్టెంట్ లైఫ్స్టైల్ అండ్ రీహ్యాబిలిటీషన్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
రక్త పోటు... హెల్త్కి చేటు
ఇటీవల మన మారుతున్న జీవనశైలి, మనం అనుభవిస్తున్న వృత్తిపరమైన, వ్యక్తిగతమైన ఉద్వేగాలు, మనం తింటున్న ఆహారం... ఇవన్నీ కలగలసి మనకు తెలియకుండానే రక్తపోటును పెంచేస్తున్నాయి. సిస్టోలిక్, డయాస్టోలిక్ రక్తపోటు రూపంలో మనకు ఉండాల్సిన బీపీ కొలత 120/80 మాత్రమే. కానీ అనేక అంశాలు దీన్ని ప్రభావితం చేస్తుండటంతో మనకు రక్తపోటు పెరుగుతుంది. కానీ ఆ విషయమే మనకు తెలియదు. దాంతో రక్తపోటు మన దేహంలోని అవయవాన్నైనా దెబ్బతీయవచ్చు. మెదడునూ, నాడీవ్యవస్థనూ, కళ్లను, గుండెనూ, మూత్రపిండాలను... ఇలా చాప కింది నీరులా అది దేన్ని దెబ్బతీసినా ఆ పరిణామాలు మాత్రం చాలా ప్రమాదకరంగా ఉంటాయి. నేడు ప్రపంచ హైపర్టెన్షన్ దినం సందర్భంగా మనం అలాంటి పరిస్థితిని తెచ్చుకోకుండా ఉండటం ఎలాగో చూద్దాం రండి! దేశంలో రక్తపోటు తీవ్రతను గమనించారా? ఇటీవలే ‘పబ్మెడ్’లో ప్రచురితమైన వివరాల ప్రకారం 33 శాతం మంది నగరవాసులూ, 25 శాతం మంది పల్లెవాసులూ హైబీపీతో బాధపడుతున్నారు. కానీ చిత్రమేమిటంటే... ఈ సంఖ్యలోనూ తాము రక్తపోటుతో బాధపడుతున్నా తమకు ఆ కండిషన్ తెలిసిన వారు చాలా తక్కువ. అంటే పల్లెల్లో రక్తపోటుతో బాధపడుతున్నవారిలో 25 శాతం మందికి తమకు హైబీపీ ఉందని తెలిస్తే, పట్టణాల్లో అవగాహన ఒకింత ఎక్కువ కావడం వల్ల అది 38 శాతం. అయినా మిగతావాళ్లందరికీ తామెంత ప్రమాద స్థితిలో ఉన్నారో తెలియనే తెలియదు. ఒత్తిడే ప్రథమ శత్రువు... హైబీపీ రావడానికి ప్రధాన కారణం... మనం జీవితంలో అనుభవించే ఒత్తిడే. ఇటీవల ఒత్తిడి మన దైనందిన జీవితంలో ఒక భాగం అయిపోయింది. అది వృత్తిపరమైనదే అయినా, కుటుంబపరమైన కారణంగా ఉద్వేగభరితమే అయినా, మానసిక-శారీరకమైన అన్ని కారణాలూ హైబీపీ వైపునకే దారితీస్తున్నాయి. ఫలితంగా గుండెజబ్బులూ, పక్షవాతాలూ, మూత్రపిండాలు పనికిరాకుండా పోవడం, చివరగా ఒక దశలో మృత్యువు... ఇలా అన్ని అనర్థాలకూ హైబీపీ కారణమవుతోంది. హైబీపీని అనుమానిస్తుంటే ఈ పరీక్షలు చేయించుకోండి... పూర్తిస్థాయి మూత్ర పరీక్ష ( కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్) హీమోగ్లోబిన్ పాళ్లు రక్తంలో పొటాషియమ్ స్థాయి బ్లడ్ యూరియా అండ్ క్రియాటిన్ లెవెల్స్ ఈసీజీ కిడ్నీ సైజ్ను తెలుసుకునేందుకు అల్ట్రాసౌండ్ స్కాన్ ఆఫ్ అబ్డామిన్ పరీక్ష రక్తంలో చక్కెర పాళ్లు తెలుసుకునే రాండమ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ పరీక్ష మరికొన్ని ప్రత్యేక పరీక్షలు : అత్యధిక రక్తపోటు వల్ల మూత్రపిండాలకు ఏదైనా ప్రమాదం జరిగిందేమో తెలుసుకోడానికి మరికొన్ని ప్రత్యేక పరీక్షలు అవసరం. అవి... 24 గంటలలో మూత్రంలో పోయే ప్రోటీన్లు, క్రియాటిన్ పాళ్లు తెలుసుకునే పరీక్ష (మూత్రంలో పోయే ప్రోటీన్ల సంఖ్యను ఇటీవల కేవలం ఒక శాంపుల్తోనే తెలుసుకునే పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి) కిడ్నీ బయాప్సీ మూత్రపిండాల్లోని రక్తనాళాల పరిస్థితిని తెలుసుకునేందుకు డాప్లర్ అల్ట్రాసౌండ్ స్కాన్ బ్లడ్ గ్యాస్ అనాలిసిస్ రీనల్ యాంజియోగ్రామ్. ప్రత్యేక పరీక్షలు ఎవరికి అవసరం ఈ పరీక్షలన్నీ అందరికీ అవసరం కాకపోవచ్చు. కానీ తరచూ బీపీ చెక్ చేయించుకుంటున్నప్పుడు ఎప్పుడూ అది 120 / 80 కంటే ఎక్కువే ఉంటున్నవారికీ కుటుంబ చరిత్రలో రక్తపోటు వల్ల మూత్రపిండాలు దెబ్బతిన్న వారికి డయాబెటిస్ పేషెంట్లు అందరికీ కాళ్లలో, పాదాల్లో వాపు వస్తున్నవారికీ రక్తపోటు అదుపు చేయడానికి రోజూ రెండు కంటే ఎక్కువ మందులు ఉపయోగిస్తున్నవారికీ ముప్ఫయి ఏళ్ల వయసు రాకముందే రక్తపోటు వచ్చిన వారికి, రక్తపోటు కనుగొని ఐదేళ్లు దాటిన వారికి తీవ్రమైన తలనొప్పి వస్తున్నవారు, రక్తపోటు పెరగడం వల్ల గుండెదడ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడే వారికి పైన పేర్కొన్న పరీక్షలు అవసరం. రక్తపోటు నివారణ ఇలా... ఒత్తిడిని గణనీయంగా తగ్గించుకోండి రోజూ 7-8 గంటల పాటు నిద్రపోండి ఆహారంలో ఉప్పు పాళ్లను గణనీయంగా తగ్గించండి ఉప్పు ఎక్కువగా ఉండే పచ్చళ్లు, అప్పడాలు, ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు ఉప్పు ఎక్కువగా వాడే బేకరీ ఫుడ్స్కు దూరంగా ఉండండి డాక్టర్ సలహా లేకుండా ఎలాంటి టాబ్లెట్లూ (ఓవర్ ద కౌంటర్ తీసుకుని) వాడకండి. రక్తపోటు వల్ల వచ్చే అనర్థాలు గుండెపోటు రావడం, గుండె ఫెయిల్యూర్ కిడ్నీ దెబ్బతినడం పక్షవాతం ఆయుఃప్రమాణం (లైఫ్ స్పాన్) తగ్గడం కిడ్నీ దెబ్బతింటే డయాలసిస్ వంటివి చాలా ఖర్చుతో కూడిన ప్రక్రియలు కావడంతో పాటు దాత దొరకడమూ చాలా కష్టం. పై అంశాలను అన్నింటినీ దృష్టిలో ఉంచుకుని రక్తపోటు ఉన్నవారు తమ హైబీపీని అదుపులో ఉంచుకోడానికీ, ఆరోగ్యాన్ని కాపాడుకోడానికి మంచి జీవనశైలిని పాటించాల్సిన అవసరం ఉంది. ఆహారంతోనే రక్తపోటు నియంత్రణ ‘డ్యాష్’ అధిక రక్తపోటు (హైబీపీ) ఉన్నవాళ్లు ఆహార నియువూలు తప్పనిసరిగా పాటించాల్సింది. హైబీపీకి ఇప్పుడు అవుల్లో ఉన్న ఆహార నియువూవళిని ’డ్యాష్’ అంటారు. ‘డయుటరీ అప్రోచ్ టు స్టాప్ హైపర్టెన్షన్’ అన్న వూటలకు సంక్షిప్తరూపమే ఈ డ్యాష్. హైపర్టెన్షన్ ఉన్నవాళ్లకు పళ్లు, కూరగాయులు, ఆకుకూరలు పుష్కలంగా ఇవ్వాలి. వాటిలో పొటాషియుమ్ పాళ్లు ఎక్కువ కాబట్టి ఆ ఆహారం తీసుకోవడం ప్రధానం. అలాగే వాళ్లకు క్యాల్షియుం కూడా అవసరం. అరుుతే ఇందుకోసం వాళ్లు కొవ్వు పాళ్లు (వెన్నపాళ్లు) తక్కువగా ఉన్న పాలూ, పాల ఉత్పాదనలు తీసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు ఉప్పు పాళ్లను తగ్గించాలి. బరువు పెరక్కుండా చూసుకోవాలి. హై బీపీ ఉంటే దాన్ని నియుంత్రించుకోవడం కోసం జీవన విధానంలోనూ (లైఫ్స్టైల్లో) వూర్పులు విధిగా పాటించాల్సి ఉంటుంది. అంటే... ఉప్పుతో పాటు సోడియుం పాళ్లు ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలైన నిల్వ ఆహారం (ప్రిజర్వ్డ్ ఫుడ్స్), బేకరీ ఐటమ్స్, పచ్చళ్లు, అప్పడాలు (పాపడ్), క్యాన్డ్ ఫుడ్స్ పూర్తిగా తగ్గించాలి. అలాగే తాజాపళ్లు, పొట్టు ఉన్న తృణధాన్యాలు మీ ఆహారంలో ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఆల్కహాల్ తీసుకోవడం పూర్తిగా ఆపేయూలి. బరువు పెరగకుండా శారీరక కార్యకలాపాలు (ఫిజికల్ యూక్టివిటీస్) ఉండేలా చూసుకోవాలి. డాక్టర్ పి. రాజేంద్రకుమార్ జైన్ డెరైక్టర్ అండ్ సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
బీట్రూట్ రసంతో బీపీ దూరం..
బీట్రూట్ తరచుగా వాడే కూరగాయల్లో ఒకటి. దీనిని వండి తినడం కంటే, నేరుగా తినడమే మేలని నిపుణులు చెబుతున్నారు. పచ్చిముక్కలను తినడం కష్టమనుకుంటే, చక్కగా జ్యూస్ తయారు చేసుకొని తాగొచ్చు. బీట్రూట్ రసం తాగడం వల్ల రక్తపోటు అదుపులోకి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ ఎనిమిది ఔన్సుల చొప్పున బీట్రూట్ రసం తాగిన వారిలో రక్తపోటు గణనీయంగా అదుపులోకి వచ్చినట్లు ‘హైపర్ టెన్షన్’ జర్నల్ ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో తేలింది. బీట్రూట్లో ఉండే నైట్రేట్లు రక్తనాళాలను వ్యాకోచింపజేస్తాయని, వాటి ఫలితంగానే రక్తపోటు క్రమంగా అదుపులోకి వస్తుందని నిపుణులు వివరిస్తున్నారు. -
శుక్రకణం నాణ్యతా ఆరోగ్యానికి సూచనే!
శుక్రకణం నాణ్యత కూడా ఒక వ్యక్తి సాధారణ ఆరోగ్యానికి మంచి సూచన అంటున్నారు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు. శుక్రకణం ఎంత నాణ్యంగా ఉంటే ఆ వ్యక్తి ఆరోగ్యం కూడా అంత మెరుగ్గా ఉందనడానికి ఒక తార్కాణమని పేర్కొనవచ్చు అంటున్నారు. ముప్ఫయి ఏళ్లు మొదలుకొని యాభై ఏళ్ల వయసు గల దాదాపు పదివేల మందిపై నిర్వహించిన పరీక్షల్లో ఈ విషయం తేటతెల్లమైందని చెబుతున్నారా అధ్యయనవేత్తలు. వీర్యపరీక్ష నిర్వహించినప్పుడు దాని పరిమాణం, చిక్కదనం, అందులోని శుక్రకణాల కదలికల్లో చురుకుదనం వంటి అనేక అంశాలను పరిఘణనలోకి తీసుకుని పరిశీలించి చూశారు. వంధ్యత్వంతో బాధపడుతూ వచ్చిన కొందరికి నిర్వహించిన వీర్యపరీక్షల్లో వారి శుక్రకణాల్లో కదలికలేకపోవడం అనే ఒకే ఒక సమస్య కాకుండా... పైకి కనిపించని మరికొన్ని ఆరోగ్య సమస్యలూ ఉన్నట్లు గుర్తించారు పరిశోధకులు. ముఖ్యంగా హైపర్టెన్షన్ (హైబీపీ), పెరిఫెరల్ వాస్కులార్, సెరిబ్రోవాస్కులార్ వంటి వ్యాధులు, గుండెజబ్బులతో పాటు చర్మవ్యాధులు ఉండవచ్చునని తెలుసుకున్నారు. అంటే లోపల ఏవైనా తెలియని వ్యాధులు ఉన్నవారిలో శుక్రకణాల నాణ్యతలోనూ తేడాలు కనిపిస్తాయనీ, దీన్ని బట్టి ఒక వ్యక్తి సాధారణ ఆరోగ్యానికీ, అతడి శుక్రకణాల ఆరోగ్యానికీ సంబంధం ఉందని పేర్కొంటున్నారీ అధ్యయనవేత్తలు. -
మేకపాటికి స్వల్ప అస్వస్థత
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి స్వల్పంగా అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు బీపీ పెరగడంతో ఢిల్లీలోని రాం మనోహర్ లోహియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేశారు. కొద్దిపాటి చికిత్స అనంతరం రాజమోహనరెడ్డి కోలుకున్నారు. దాంతో ఆయనను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. హుదూద్ తుపానుపై చర్చించాల్సిందిగా లోక్సభలో బుధవారం ఆయన సావధాన తీర్మానం నోటీసు ఇవ్వనున్నారు. -
బోర్డర్లైన్ డిజార్డర్స్... హెచ్చరించే జబ్బులు... తప్పించుకోగల ముప్పులు!!
మనిషి శరీర ఉష్ణోగ్రత 98.4 ఫారన్హీట్ డిగ్రీలు ఉండాలి. అంతకంటే ఏ ఒకటో రెండో డిగ్రీలు ఎక్కువైనా అది జ్వరమే గానీ... ప్రమాదకరం కాదు. కానీ ఒకవేళ ఆ ఉష్ణోగ్రత 102 ఫారిన్హీట్ దాటితే..? అలాగే మనలోని షుగర్ పాళ్లు పరగడుపున ఎప్పుడూ 90 - 100 లోపు ఉండాలి. ఒకవేళ ఆ సంఖ్య 126 చేరేప్పటివరకూ రోగికి మందులతో అవసరం లేకుండా... శారీరక వ్యాయామాలు, ఆహార నియమాలు తదితర పద్ధతులతోనే సరిపెడతారు డాక్టర్లు. అలాగే రక్తపోటు... ఇది సాధారణంగా 120/80 ఉండాలి. నూట ఇరవై వరకు ఉండే పై విలువను సిస్టోలిక్ ప్రెషర్ అంటారు. కింద ఉండే 80 విలువను డయాస్టోలిక్ ప్రెషర్ అంటారు. ఈ విలువల్లో కొద్దిపాటి తేడాలను డాక్టర్లు పరిగణనలోకి తీసుకోరు. ఉదాహరణకు 120 ఉండాల్సిన చోట 130 పెద్ద పెరుగుదల కాబోదు. కానీ... అదేపనిగా ఎప్పుడూ ఆ ప్రెషర్ 140 కంటే పైనే ఉంటుందనుకుందాం. అప్పుడు దానికి కారణాలను పరిగణనలోకి తీసుకుని వైద్యం చేయాల్సిందే. పై ఉదాహరణలను బట్టి తెలుస్తున్న విషయం ఏమిటంటే... శరీర ఆరోగ్యాన్ని సూచించే కొన్ని అంశాల కొలతలు నిర్ణీత ప్రమాణంలో ఉండాలి. దాని కంటే కొంత పెరగడాన్ని తక్షణం పెద్ద ప్రమాదంగా పరిగణించకపోయినా... సమీప భవిష్యత్తులో వచ్చే పెను ప్రమాద హెచ్చరికగా భావించవచ్చు. జబ్బు ఒక్కసారిగా రాకుండా... తాను త్వరలో తీవ్రరూపం దాల్చే ప్రమాదం ఉందని ఇలా హెచ్చరికలు పంపుతుంటుంది. ఇటువంటి దశలో ఉన్న జబ్బులను ‘బార్డర్లైన్ డిజార్డర్స్’గా పేర్కొనవచ్చు. తమ హెచ్చరికలతో భవిష్యత్తు ఆరోగ్యాన్ని అప్రమత్తం చేసే ఆ జబ్బుల గురించి, అవి మరింత ముదరకుండా అవగాహన కోసమే ఈ కథనం. 1- హైపర్టెన్షన్ ప్రతి వ్యక్తి రక్తనాళాల్లోనూ రక్తం కొంత వేగంగా ప్రవహిస్తూ ఉంటుంది. ఈ వేగం ఇలా కొనసాగాలంటే రక్తనాళాల్లో రక్తం కొంత ఒత్తిడితో ప్రవహించాలి. ఇలా రక్తానికి ఒత్తిడి ఉండాలంటే అది గుండె స్పందనల వల్ల సాధ్యమవుతుంది. గుండె స్పందిస్తోంది అంటే... అది ఒకసారి పూర్తిగా ముడుచుకుంటుందని అర్థం. రక్తనాళాల్లోకి రక్తం కొంత ఒత్తిడితో ప్రవహించడానికి గుండె రక్తాన్ని పంప్ చేసినప్పుడు మంచి రక్తనాళాల్లో (ఆర్టరీస్)లో రక్తం ఎంత పీడనంతో ప్రవహిస్తుందో తెలుసుకునే కొలత (రీడింగ్)ను ‘సిస్టోలిక్ ప్రెషర్’ అంటారు. అలాగే రెండు సిస్టోలిక్ ప్రెషర్స్ మధ్యన రక్తనాళాల్లో రక్త పీడనాన్ని డయాస్టోలిక్ ప్రెషర్ అంటారు. ఇలా రక్తపోటుకు రెండు విలువలు ఉంటాయి. దీన్నే సాధారణంగా 120/80 గా పేర్కొంటుంటారు. ఇది సాధారణ విలువ. ప్రీ-హైపర్టెన్షన్: సాధారణంగా వైద్యుడి వద్దకు రోగి వెళ్లగానే చూసేది రక్తపోటు కొలతనే. ఈ కొలత 120/80 ఉంటే అది ప్రమాదరహిత స్థితిగా గుర్తించి ఇక దాని గురించి ఆలోచించరు. కానీ ఈ కొలతలు ఎప్పుడూ ఇదే దశలో ఉండకుండా మారుతూ ఉండవచ్చు. ఉదాహరణకు సిస్టోలిక్ రక్తపోటు విలువ 120కి బదులుగా 121 నుంచి 139 ఉందనుకోండి. అలాగే కింది విలువ 80కి బదులుగా 81 నుంచి 89 వరకు ఉందనుకోండి. ఆ కొలతలు ఉన్న దశను పూర్తిగా రక్తపోటు ఉన్న దశగా చెప్పలేం. అందుకే డాక్టర్లు ఆ దశను ‘ప్రీహైపర్టెన్షన్’ (రక్తపోటు రాబోయే ముందు దశ)గా పేర్కొంటారు. ఈ ‘ప్రీహైపర్టెన్షన్’ దశ భవిష్యత్తులో ప్రమాదకరమైన ‘హైబీపీ’కి దారితీయవచ్చు. వెసులుబాటు ఇదే... ప్రీ-హైపర్టెన్షన్లో ఉండే వెసులుబాటు ఏమిటంటే... రోగి వెంటనే మందులు వాడాల్సిన అవసరం లేదు. జీవనశైలిని చక్కబరచుకుని రక్తపోటును స్వాభావికంగానే అదుపులోకి తెచ్చుకునే నష్టనివారణ చర్యలు ప్రారంభించవచ్చు. తోడుగా ప్రమాదకరమైన పరిస్థితి కూడా... రక్తపోటు పెరగడం వల్ల ఏర్పడే దీర్ఘకాలిక అనర్థాలు వెంటనే కనిపించవు. పైగా రక్తపోటు పెరిగి ఉందన్న విషయం మొదట్లో అసలు రోగికి తెలియకపోవచ్చు కూడా. అందువల్ల దీనివల్ల జరిగే అనర్థాలు కొనసాగుతూ పోతాయి... ఇదో ప్రమాదకరమైన పరిస్థితి. సాధారణంగా హెచ్చరికలు పంపడం మామూలు పరిస్థితుల్లో తెలియకపోవచ్చు. అందుకే బార్డర్లైన్ అనే దశ హైబీపీకి ఉండి, హెచ్చరికలు పంపుతుందిలే అన్న నిర్లక్ష్యం ‘హైబీపీ’ విషయంలో కుదరదు. అందుకే నలభై దాటిన వారు అప్పుడప్పుడూ బీపీని పరీక్షించుకుంటూ ఉండి, అది పంపించే హెచ్చరికలను పరిశీలించుకుంటూ ఉండటం మేలు. హైపర్టెన్షన్ అనర్థాలకు కారణాలు బీపీ క్రమంగా పెరుగుతూ పోతే దీర్ఘకాలంలో జరిగే అనర్థాలు చాలా ఎక్కువే. ఉదాహరణకు రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయే అథెరోస్క్లిరోసిస్, గురక వల్ల మెదడుకు, గుండెకు తగినంత ఆక్సిజన్ అందని స్లీప్ ఆప్నియా, శరీరాన్ని ఉత్తేజ పరిచేందుకు ఉపయోగపడే ఎడ్రినల్ గ్రంథులు మితిమీరి పనిచేయడం, కొన్ని మందులు తీసుకోవడం (ఉదా: గర్భనిరోధకమందులు, జలుబు, నొప్పినివారణ మందుల వంటివి), మాదకద్రవ్యాలు తీసుకోవడం వంటి అనేక అంశాలు రక్తపోటును పెంచేందుకు దోహదపడే విషయాలే. రిస్క్ ఫ్యాక్టర్లు: పెరుగుతున్న వయసు, స్థూలకాయం, హైబీపీ ఉన్న కుటుంబ చరిత్ర, ఒకేచోట కుదురుగా కూర్చుని పనిచేసే జీవనశైలి, ఉప్పు ఎక్కువగా తీసుకోవడం, పొగాకు నమలటం, మద్యం తీసుకోవడం, కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వంటి అనేక అంశాలు హైబీపీకి రిస్క్ ఫ్యాక్టర్లు. నిర్ధారణ: తరచూ రక్తపోటును పరీక్షింపజేసుకుంటూ ఉండాలి. అది తరచు హెచ్చుతగ్గులకు లోనవుతూ ఉంటే దాన్ని హెచ్చరికగా భావించి వెంటనే జాగ్రత్తపడాలి. రెండు లేదా ఎక్కువసార్లు బీపీ అధికంగా ఉంటే... దాన్ని రక్తపోటుగా నిర్ధారణ చేసుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ జాగ్రత్త తీసుకోండి... ప్రీహైపర్టెన్షన్ అన్నది ప్రమాదకర దశ కాదు అని రిలాక్స్ కావద్దు. అది పంపే హెచ్చరికలను పరిగణనలోకి తీసుకుని అప్రమత్తం కండి. వెంటనే జీవనశైలిలో ఆరోగ్యకరమైన మార్పులు చేసుకోండి. ఎందుకంటే అప్పటికీ జాగ్రత్త తీసుకోకపోతే అది గుండెపోటు, పక్షవాతం, దీర్ఘకాలంలో మతిమరపు, మెదడుకు సంబంధించిన సమస్యలు, మూత్రపిండాల సమస్యలను తీసుకురావచ్చు. 2- డయాబెటిస్... మనం ఏ పని చేయాలన్నా రక్తంలోని చక్కెర పాళ్లే ఆ శక్తిని సమకూరుస్తాయి. అయితే మనం ఏ పనీ చేయనప్పుడు రక్తంలోని అవే చక్కెరపాళ్లు మాయమై... భద్రపరచుకునే వ్యవస్థ ఒకటి మన శరీరంలో పనిచేస్తుంటుంది. ఇలా... రక్తంలోని చక్కెర పాళ్లను శరీరం తనంతట తానే నియంత్రించుకునే శక్తి శరీరానికి ఉంటుంది. ఒకవేళ ఈ శక్తి లోపించడం ప్రారంభమైతే...? అదే ప్రీ-డయాబెటిస్ దశ. ప్రీ-డయాబెటిస్ అంటే... శరీరం తనలోని చక్కెర పాళ్లను తనంతట తానే అదుపులోకి తెచ్చుకోలేకపోతోందనే హెచ్చరికలు పంపేందుకు సూచనగా చక్కెర కొలతల్లో కొద్దిపాటి తేడాలు కనిపిస్తాయి. నిజానికి ఆ సమయంలో రక్తంలో చక్కెర విలువలు నార్మల్ కంటే ఎక్కువగా ఉంటాయి. అది నిజంగా ఒక హెచ్చరిక లాంటిదే. ఒకవేళ అప్పటికీ ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోకపోతే భవిష్యత్తులోని పదేళ్ల వ్యవధిలో ఆ వ్యక్తికి డయాబెటిస్ వచ్చే అవకాశాలు 50 శాతం కంటే ఎక్కువ. కాబట్టి ఇది డయాబెటిస్ వచ్చేవారికి ఒక మంచి సూచన లాంటిది. ఈ హెచ్చరిక సమయంలోనే జాగ్రత్తలు తీసుకుంటే దాన్ని టైప్-2 డయాబెటిస్గా మారకుండా ముందుగానే నివారించుకునే అవకాశం ఉందన్నమాట. కారణాలు: డయాబెటిస్కు అనేక కారణాలు ఉండవచ్చు. ఉదాహరణకు... రోజూ ఆరు గంటల కంటే తక్కువగా నిద్రపోవడం లేదా తొమ్మిది గంటల కంటే ఎక్కువ సేపు నిద్రపోవడం, కుటుంబ చరిత్రలో డయాబెటిస్ ఉండటం, శరీరంలో ట్రైగ్లిసరైడ్స్ పాళ్లు 250 మి.గ్రా. కంటే ఎక్కువగా ఉండటం, మంచి కొలెస్ట్రాల్ (హెచ్డీఎల్) పాళ్లు 35 మి.గ్రా. కంటే తక్కువగా ఉండటం, రక్తపోటు, మహిళల్లో గర్భధారణ సమయంలో డయాబెటిస్ రావడం (జెస్టెషనల్ డయాబెటిస్), కడుపులో పిండం బరువు చాలా ఎక్కువగా ఉండటం (4.1 కిలోల కంటే ఎక్కువగా), మహిళకు పీసీఓడి వంటి వ్యాధులు ఉండటం, వయసు 45 ఏళ్ల కంటే అధికంగా ఉండటం వంటివి డయాబెటిస్కు రిస్క్ఫాక్టర్లు. పై కారణాలు ఉన్న పరిస్థితుల్లో రక్తంలోని చక్కెరను అదుపులో ఉంచే హార్మోన్లను స్రవించే పాంక్రియాస్ గ్రంథి సరిగా పనిచేయకపోవచ్చు. అంటే రక్తంలోని చక్కెర పాళ్లను సరిగా అదుపు చేయగలంత ఇన్సులిన్ను ఉత్పత్తి చేయలేకపోవచ్చు. లేదా మన కణాలే ఆ హార్మోన్కు ప్రతిస్పందించడం మానేయవచ్చు. (ఈ కండిషన్నే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు). లేదా ఈ రెండు ప్రక్రియలూ ఏకకాలంలో జరగవచ్చు. నిర్ధారణ: రక్తపరీక్షతో రక్తంలోని చక్కెర పాళ్లను తెలుసుకోవచ్చు. ఆ పరీక్షల తీరుతెన్నులివి... 1) ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ రక్త పరీక్ష: ఇందులో పరగడపున నిర్వహించిన రక్తపరీక్షలో చక్కెర పాళ్లు 100 నుంచి 125 ఎంజీ/డీఎల్ ఉండాలి. ఇది అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ ప్రమాణాల ఆధారంగా. అదే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం 110-125 ఎంజీ/డీఎల్ ఉంటే దాన్ని ప్రీ-డయాబెటిక్ కండిషన్గా... అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని డయాబెటిస్గా పరిగణిస్తారు. 2) గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ (జీటీటీ): నోటి ద్వారా 75 గ్రాముల గ్లూకోజ్ ఇచ్చి, దాని ఆధారంగా నిర్ణీత వ్యవధుల్లో రక్తంలోకి వెలువడే చక్కెర పాళ్లను పరీక్షించి, డయాబెటిస్ వ్యాధి నిర్ధారణ చేస్తారు. ఈ పరీక్షలో గరిష్ట పరిమితి 140-199 ఎంజీ/డీఎల్. 3) హెచ్ బీ ఏ 1 సీ పరీక్ష: ఈ పరీక్ష నిర్వహించినప్పుడు విలువలు 5.7 - 6.4 మధ్య ఉంటే అది నార్మల్గా పరిగణిస్తారు. అంతకంటే ఎక్కువగా ఉంటే మాత్రం దాన్ని తప్పనిసరిగా డయాబెటిస్గా పరిగణించి, తగిన వైద్య చికిత్సలు, సూచనలు, జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ప్రీ-డయాబెటిక్ అని తేలితే ఆ హెచ్చరికలను పరిగణనలోకి తీసుకోండి. తగినట్లుగా జాగ్రత్తలు తీసుకుని, జీవనశైలిలో మార్పులు చేసుకోకపోతే రాబోయే రెండు నుంచి మూడేళ్ల వ్యవధిలో ప్రీ-డయాబెటిస్ ఉన్నవారిలో 25 శాతం మంది, వచ్చే పదేళ్ల వ్యవధిలో ప్రీ-డయాబెటిస్ ఉన్నవారిలో 50 శాతం మంది తప్పనిసరిగా డయాబెటిక్గా మారుతారు. అందుకే ప్రీ-డయాబెటిస్ అనే హెచ్చరిక సూచనలను (వార్మింగ్ సిగ్నల్స్ను) తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకుని, వాకింగ్ లాంటి వ్యాయామాలు మొదలుపెట్టడం వల్ల ప్రయోజనాలే తప్ప నష్టం ఉండదు. దీని వల్ల భవిష్యత్తులో రాబోయే ఎన్నో ఆరోగ్యపరమైన అనర్థాలను, ముప్పులను సమర్థంగా ఎదుర్కోవచ్చు. లక్షణాలు ప్రీ-డయాబెటిస్లో నిత్యం ఆకలిగా అనిపించడం, కారణాలు తెలియకుండా బరువు కోల్పోవడం లేదా బరువు పెరగడం, ఎప్పుడూ నీరసంగా, అలసటగా అనిపించడం, కళ్లు మాటిమాటికీ మసకబారిపోవడం, గాయాలు మానడంలో ఆలస్యం, చిగుర్లకు, మూత్రం, చర్మం లేదా ఏదైనా శరీర భాగాల్లో ఇన్ఫెక్షన్ ఉంటే అది మాటిమాటికీ తిరగబెట్టడం వంటి లక్షణాలు కనిపిస్తుంటే విధిగా రక్తంలో చక్కెర పాళ్ల పరీక్షలు చేయించుకోవాలి. 3- ట్రాన్సియెంట్ ఇస్కిమిక్ అటాక్ (టీఐఏ) ఇది రాబోయే పక్షవాతానికి ఒక ముందస్తు సూచనగా భావించవచ్చు. పక్షవాతం వస్తే ఎలాంటి లక్షణాలు ఉంటాయో, అవి తాత్కాలికంగా కనిపించి పోతాయి. కానీ పక్షవాతం వచ్చినప్పుడు జరిగే ఎలాంటి నష్టాలూ ఈ దశలో ఉండవు. కాబట్టి పక్షవాతం రాబోయే వారికి ఇది ముందస్తు హెచ్చరికలా భావించి, జాగ్రత్త పడటానికి ఒక చక్కని అవకాశం ఇస్తుందీ ‘ట్రాన్సియెంట్ ఇస్కిమిక్ అటాక్ (టీఐఏ) అనే ఈ దశ. ట్రాన్సియెంట్ ఇస్కిమిక్ అటాక్కు కారణాలు: 1) మెదడుకు రక్తాన్ని చేరవేసే మెడ దగ్గర ఉండే రక్తనాళాలు లేదా మెదడులోని రక్తనాళాలు బాగా సన్నబారడం 2) గుండె వద్ద ఉన్న రక్తనాళాల్లోనే రక్తం గడ్డకట్టి, ఆ రక్తపు గడ్డలు రక్తప్రవాహంతో పాటు కొట్టుకుపోయి మెదడు దగ్గర పోగుపడినట్లుగా కావడం వల్ల మెదడుకు తగినంత రక్తసరఫరా జరగకపోవడం. రిస్క్ ఫాక్టర్లు: అధిక రక్తపోటు, డయాబెటిస్ ఉండటం, పొగతాగే అలవాటు, మద్యపానం చాలా ఎక్కువగా తీసుకోవడం, రాత్రివేళల్లో నిద్రలో గురకరావడం (స్లీప్ ఆప్నియా), రక్తంలో కొవ్వు పాళ్లు ఎక్కువగా ఉండటం నిర్ధారణ: రోగి లక్షణాల ఆధారంగా టీఐఏను నిర్ధారణ చేస్తారు. ఒక్కోసారి రోగికి ఐటీఏ లక్షణాలు ఉన్నాయని తెలిశాక... ఎమ్మారై బ్రెయిన్ (యాంజియోగ్రామ్తో పాటు); కెరోటిడ్ డాప్లర్ ఈసీజీ, 2డీ ఎకో, బ్లడ్ కోయాగ్యులేషన్ పారామీటర్స్ పరీక్షలు వంటివి చేస్తారు. వీటివల్ల టీఐఏ ఎందుకు వచ్చిందో తెలియడానికి ఆస్కారం ఉంది. చికిత్స: రోగికి తక్షణ చికిత్సగా రక్తాన్ని పలుచబార్చే ఆస్పిరిన్, క్లోపిడోగ్రెల్, అసిట్రోమ్, స్టాటిన్స్ వంటి మందులతో చికిత్స చేయాలి. ఒకవేళ రక్తనాళాలు సన్నబారడం అనే ప్రక్రియ 70 శాతం కంటే ఎక్కువగా జరిగితే ఈ వ్యాధి విషయంలో స్టెంటింగ్ లేదా ఎండరాక్టమీ వంటి చికిత్స ప్రక్రియలు అవసరమవుతాయి. లక్షణాలు అకస్మాత్తుగా ముఖంలోని ఒకవైపు బలహీనంగా అనిపించవచ్చు. ఒకవైపు చేయి లేదా కాలు బలహీనంగా అనిపించవచ్చు. కాలు, చేయి పడిపోయినట్లుగా ఉండవచ్చు. ఆ తర్వాత మాట సరిగా రాకపోవడం, నిలకడ లేకుండా నడవడం, అకస్మాత్తుగా ఒకటి లేదా రెండు కళ్లూ కనిపించకుండా పోవడం లేదా ఒకే వస్తువు రెండుగా కనిపించడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇవి కొద్దినిమిషాలు మొదలుకొని, గంటలోపే తగ్గిపోతాయి. 4- మినిమల్ కాగ్నిటివ్ ఇంపెయిర్మెంట్ (ఎమ్సీఐ) మీ తెలివితేటలు, జ్ఞాపకశక్తి వంటి మెదడు సామర్థ్యాలు మీరు గుర్తించేటంతగా తగ్గిపోతే దాన్ని ‘మినిమల్ కాగ్నిటివ్ ఇంపెయిర్మెంట్ (ఎమ్సీఐ) రుగ్మతగా భావించవచ్చు. ఒకవేళ ఎవరైనా తమలో ఇలాంటి లక్షణాలను గమనిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. పైన పేర్కొన్న వ్యాధి లక్షణాలు వెన్వెంటనే బయటపడవు. లేదా గుర్తించడానికి వీలుగా ఉండవు. అయితే వాళ్ల కుటుంబ సభ్యులు లేదా మిత్రుల గమనింపు ఆధారంగా వారిలో మిత్రులను గుర్తించడం, పేర్లను గుర్తుపెట్టుకోవడం వంటి విషయాలను పరిగణనలోకి తీసుకుని, అతడి వయసు ఆధారంగా అతడిలోని జ్ఞాపకశక్తిని అంచనా వేయవచ్చు. ఇందులో ఏవైనా తేడాలు వస్తున్నాయని తెలిసిన వెంటనే రోగిని డాక్టర్కు చూపించాలి. నిర్ధారణ: ఈ వ్యాధిని నిర్ధారణ చేయడానికి నిర్ణీత పరీక్ష అంటూ ఏదీ లేకపోయినా రోగి ఆరోగ్య చరిత్ర, అతడి మిత్రుల/కుటుంబ సభ్యుల నుంచి లభ్యమయ్యే సమాచారం, జ్ఞాపకశక్తి, ఏదైనా విషయంలో అతడు ప్రణాళికలు రచించే తీరు, నిర్ణయాత్మక శక్తి, ఆలోచనావిధానం, న్యూరలాజికల్ ఇవాల్యువేషన్/న్యూరోసైకలాజికల్ ఇవాల్యుయేషన్ వంటి ప్రక్రియలతో అతడు నిజంగా ఎంసీఐతో బాధపడుతున్నాడో లేదో నిర్ధారణ చేయవచ్చు. రిస్క్ ఫాక్టర్లు : పెరిగే వయసు, రోగి కుటుంబ సభ్యుల్లో అల్జైమర్స్ వంటి వ్యాధులు ఉండటం, కుటుంబ చరిత్రలో వయసు పెరుగుతున్న కొద్దీ జ్ఞాపకశక్తి లోపించే లక్షణాలు కనిపిస్తుండటం వంటివన్నీ ఎంసీఐకి రిస్క్ ఫాక్టర్లే. లక్షణాలు: ఒకవ్యక్తి పేరును ఒకటికి, రెండుసార్లు గుర్తు తెచ్చుకుంటే గానీ గుర్తురాకపోవడం వంటివి మామూలే. అయితే చాలా కీలకమైన సమాచారం కూడా మరచిపోవచ్చు. గతంలో తేలిగ్గా గుర్తుంచుకున్న అంశాలు, గత పరిచయాలను మరచిపోవడం, గతంలోలా ఆలోచించే సామర్థ్యాన్ని కోల్పోవడం, ఆయా సందర్భాల్లో తగిన నిర్ణయాలు తీసుకోలేకపోవడం, తార్కికమైన రీతిలో స్పందించలేకపోవడం వంటివి తరచు జరుగుతుంటే ఎంసీఐ అనే కండిషన్ ఉందేమోనని అనుమానించాల్సి ఉంటుంది. ఒక్కోసారి ఇవే లక్షణాలు డిప్రెషన్, యాంగ్జైటీ వంటి లక్షణాలు ఉన్నప్పుడూ కనిపించవచ్చు. అందుకే డాక్టర్ను సంప్రదించి తగిన జాగ్రత్త తీసుకోవడం అవసరం. చికిత్స: ఎంసీఐకి నిర్దిష్ట చికిత్స ప్రస్తుతానికి అందుబాటులో లేదు. అయితే దీని వల్ల రాబోయే అనర్థాలను తగ్గించడానికి, గుండెజబ్బుల రిస్క్ వంటి ప్రమాదాలను నివారించడానికి, రోగి పరిస్థితి విషమించకుండా ఆరోగ్యకరమైన వ్యాపకాల్లో ఉంచవచ్చు. రోగితో జ్ఞాపకశక్తి పెరిగే బ్రెయిన్గేమ్స్ ఆడిస్తూ, పుస్తకాలు చదివిస్తూ, సుడోకు వంటి పజిల్స్ చేయిస్తూ ఉంటే పరిస్థితి మెరుగయ్యే అవకాశం ఉంది. ఒకసారి ఎంసీఐ ఉన్నట్లుగా తేలితే ప్రతి ఆరు నెలలకోమారు తప్పనిసరిగా వైద్యపరీక్షలు చేయిస్తుండాలి. ఈ తరహా రోగులకు రివాస్టగ్మైన్, డోనెపెజిల్, గాలాంటమైన్, మెమాంటైన్ వంటి మందుల వాడకాన్ని మొదలుపెట్టాల్సి ఉంటుంది. భవిష్యత్ అనర్థ సూచన రాబోయే జ్ఞాపకశక్తి లేమి (డిమెన్షియా)కి సూచన ఎంసీఐ. భవిష్యత్తులో డిమెన్షియా తీవ్రమైతే రోగికి కలగబోయే అనర్థాలను ముందుగా హెచ్చరించేదే ఈ ఎంసీఐగా భావించవచ్చు. ఒకవేళ ఎంసీఐ అని నిర్ధారణ అయితే ఇందులో ఏడాదికి 6 - 15 శాతం రోగులు డిమెన్షియాకు (తీవ్రమైన జ్ఞాపకశక్తి లోపానికి) గురయ్యేందుకు అవకాశం ఉంది. జీవనశైలి మార్పులతో... జీవనశైలిలో మార్పులే పై అన్ని వ్యాధులకూ ఒక మంచి నివారణ. వ్యాధి ఏదైనా అది ముందస్తు హెచ్చరికలు చేసింది కాబట్టి దాన్ని మరింత ముదరకుండా చూసుకోవడం రోగి బాధ్యత. అందుకే కొన్ని ఆరోగ్యకరమైన జీవనశైలి మార్పులతో పై వ్యాధులన్నింటికీ మరింత ముదరకుండా, మరింత ఎక్కువ కాకుండా తప్పనిసరిగా నివారించుకునే అవకాశం ఉంది. అందుకు చేయాల్సింది కూడా చాలా సులభం. ఆ జాగ్రత్తలు ఏమిటంటే... ఆహారంలో ఇవి ముఖ్యం... హెచ్చరిక చేస్తున్న రోగ లక్షణాలు మనలో ఉన్నాయని తెలుసుకున్న తర్వాత ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. అంటే... ఆహారంలో ఆకుకూరలు, పొట్టు ఉన్న ధాన్యంతో చేసిన పదార్థాలు, కొవ్వు తక్కువగా ఉండేవి తీసుకోవాలి. వంటల్లో ఆలివ్ ఆయిల్ ఉపయోగించడం. వాల్నట్ వంటి ఆరోగ్యకరమైన నట్స్ వాడటం, గ్రీన్ టీ తాగడం వంటివి వ్యాధులు ముదరకుండా చూస్తాయి. మాంసాహారులు కొవ్వు తక్కువగా ఉండే చేపలు, చికెన్ తీసుకోవడం మంచిది. మేలు చేసే ఈ అలవాట్లను అందరూ నిరభ్యంతరంగా అనుసరించవచ్చు. ఆహారంలో ఉప్పు వాడకాన్ని గణనీయంగా తగ్గించాలి. వ్యాయామం తప్పనిసరి... బరువు పెరగకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. ఒకవేళ బరువు పెరుగుతుంటే కారణాలు కనుగొని, దాన్ని నివారించుకోవాలి. రోజూ కనీసం 30 నిమిషాలు నడవడం, ప్రాణాయామం, యోగా, ధ్యానం వంటి ప్రక్రియలను అనుసరించాలి. ధూమపానం, మద్యపానం పూర్తిగా మానేయాలి. - నిర్వహణ: యాసీన్ - మంజులారెడ్డి -
బండి నడుపుతుంటే కళ్లు తిరుగుతున్నాయి!
డాక్టర్ సలహా నా వయసు 44. డ్రైవర్ని. నాకు అప్పుడప్పుడూ సడన్గా కళ్లు తిరుగుతున్నాయి. ఆ తర్వాత చూపు మసకగా కనిపిస్తోంది. అందుకు ఇంగ్లిష్ మందులు వాడుతున్నాను. వాటిని వేసుకున్న మరుసటి రోజు బాగానే ఉంటోంది. వేసుకోని మరుసటి రోజు కళ్లు తిరగడం, మసక వస్తోంది. నాకు తగిన వైద్యాన్ని సూచించగలరు. - రామకృష్ణ, ఏలూరు మీ వయసు, ఉద్యోగంలో ఒత్తిడి దృష్టిలో ఉంచుకుని మీరు చెప్తున్న లక్షణాలను పరిశీలించినట్లయితే... ముందుగా మీరు రక్తపోటు (బి.పి) పరీక్ష చేయించుకోవాల్సి ఉంది. అలాగే మధుమేహం పరీక్షలు కూడా చేయించాలి. మీరు చెప్తున్న లక్షణాలకు మధుమేహంతో నేరుగా సంబంధాలు లేకపోయినప్పటికీ మధుమేహం అనుబంధంగా మరికొన్ని రుగ్మతలు తోడయినప్పుడు ఇలాంటి లక్షణాలే కనిపిస్తాయి. ఉన్నట్లుండి కళ్లు తిరగడాన్ని ఆయుర్వేదంలో అపస్మారకం (ఎపిలెప్సీ)గా పరిగణిస్తారు. బ్రెయిన్ స్కాన్ చేసి ఆ సంబంధిత రుగ్మతలు ఉన్నాయేమోనని నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ లోపుగా మీరు పై లక్షణాలకు ఆయుర్వేదం సూచించిన ప్రాథమిక ఔషథాలను తీసుకోండి. ఔషధం: లఘుసూతశేఖరరసం (మాత్రలు) ఉదయం రెండు రాత్రి రెండు, స్ట్రెస్వీన్ క్యాప్సూల్స్ ఉదయం ఒకటి రాత్రి ఒకటి, అర్జునారిష్ఠ (ద్రావకం) నాలుగు చెంచాలు ఉదయం నాలుగు చెంచాలు రాత్రి సమానంగా నీటిని కలిపి తీసుకోవాలి. ఆహారం: ఈ మందులు వాడుతూ బలవర్ధకమెన ఆహారం తీసుకుంటూ ఉప్పు, నూనెలు తగ్గించాలి. ఖర్జూరం, నువ్వుపప్పు, తాజాపండ్లు తీసుకోవాలి. విహారం: రాత్రివేళ కనీసం ఆరేడు గంటలు నిద్రపోవాలి. ఉదయం, సాయంత్రం ఖాళీ కడుపుతో ఐదు నిమిషాల సేపు ప్రాణాయామం చేయాలి. - డాక్టర్ వి.ఎల్.ఎన్. శాస్త్రి, ఆయుర్వేద నిపుణులు, హైదరాబాద్ -
యాలకులు, అల్లంతో హైబీపీ నియంత్రణ!!
మీకు హైబీపీ ఉందా? ప్రతిరోజూ మందులు మింగలేక బాధపడుతున్నారా? అయితే మరికొద్ది రోజులు ఆగండి. అచ్చంగా మన భారతీయ వంటగదుల్లో ఉపయోగించే కొన్ని రకాల సుగంధ ద్రవ్యాలతో చేసిన మిశ్రమం మీ హైబీపీని తగ్గిస్తుంది. కూరలు, రసం, సాంబారు, పచ్చళ్లలో ఉపయోగించే కొన్ని రకాల సుగంధ ద్రవ్యాలకు బీపీని నియంత్రణలో పెట్టే గుణం ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రధానంగా.. యాలకులు, అల్లం, జీలకర్ర, మిరియాలు, సోయికూర, అతిమధురం, తెల్లకలువ రేకు.. వీటిని తగుపాళ్లలో కలిపి వాడితే బీపీ బాగా అదుపులోకి వస్తుందని చెన్నైలో జరిగిన పరిశోధనలో తేలింది. అయితే.. ముందుగా ఈ ప్రయోగాలను జంతువుల మీద చేశారు. అక్కడ సత్ఫలితాలు వచ్చాయి. వీటన్నింటితో రూపొందించిన 'వెంతమారి చూర్ణం' ఎలుకల్లో రక్తపోటును బాగా తగ్గించిందని శాస్త్రవేత్తలు చెప్పారు. దీంతో మరింత పెద్ద జంతువులపై ఇదే తరహా ఔషధ ప్రయోగాలు చేయాలని చెన్నై శ్రీరామచంద్రా యూనివర్సిటీ వైద్యులు భావిస్తున్నారు. భారతీయులలో ప్రధానంగా పొగతాగడం, మధుమేహం, హైబీపీ, ఊబకాయం.. ఈ నాలుగు రకాల సమస్యలే చాలావరకు వ్యాధులకు కారణంగా కనిపిస్తున్నాయని, వీటిని అరికడితే సగం సమస్య తప్పినట్టేనని పరిశోధనలకు నేతృత్వం వహించిన డాక్టర్ ఎస్.తనికాలచం తెలిపారు. -
ఈ వ్యాధులున్నాయా... ఓ కన్నేయండి..!
అప్పటివరకూ మనకు ఎలాంటి వ్యాధీ లేదనుకుంటాం... ఏదో పరీక్ష చేయించుకోవడానికి వెళితే షుగర్ ఉన్నట్లు తేలుతుంది. అంతే... వెంటనే డాక్టర్ ఎందుకైనా మంచిదంటూ మరికొన్ని పరీక్షలతో పాటు కంటి పరీక్ష విధిగా చేయిస్తారు. అలాగే ఎందుకో అనుకోకుండా రక్తపోటు చూపించుకుంటారు. ఉండాల్సినదాని కంటే అది చాలా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. రెండు, మూడు పరీక్షల తర్వాత... రక్తపోటు ఉన్నట్లుగా నిర్ధారణ అయ్యాక... డాక్టర్లు ముందుగా మూత్రపిండాలనూ, తర్వాత కంటినీ పరీక్షించి అక్కడి రక్తనాళాలు బాగున్నాయా, లేదా అని చూస్తారు. ఇలా... వచ్చిన వ్యాధి గుండెపోటు నుంచి మైగ్రేన్ వంటి తలనొప్పి వరకు ఏదైనప్పటికీ... కంటిపై అది తన దుష్ర్పభావాన్ని చూపవచ్చు. అందుకే, కొన్ని వ్యాధులు ఉన్నవారు విధిగా కన్ను విషయంలోనూ జాగ్రత్త వహించాలి. చాలా మందికి అంతగా తెలియని ఈ విషయాన్ని తెలుసుకునేందుకు ఉపయోగపడుతూ తమ కళ్లను రక్షించుకునేందుకు ఉపకరించేదే ఈ ప్రత్యేక కథనం... మనలో ఎన్నో కణాలుంటాయి. ఆ కణాలన్నీ కలిసి కణజాలంగా ఏర్పడతాయి. ఆయా కణజాలాలు కొన్ని విధులు నిర్వహించడానికి ప్రత్యేకంగా కొన్ని అవయవాలుగా ఏర్పడతాయి. ఆ అవయవాలు ఒక వ్యవస్థలా రూపొంది కొన్ని జీవక్రియలు నిర్వహిస్తుంటాయి. మనకు ఏదైనా వ్యాధి వచ్చిందంటే చాలా సందర్భాల్లో అది ఆ అవయవానికో, ఆ అవయవం నిర్వహించే జీవవ్యవస్థకో పరిమితమవుతుందని అనుకుంటాం. ఉదాహరణకు థైరాయిడ్ అనే అవయవానికి ఏదైనా జబ్బు వస్తే అది థైరాయిడ్కే పరిమితం కాదు. అలాగే రక్తప్రసరణ వ్యవస్థలో ఏదైనా హెచ్చుతగ్గులు ఏర్పడితే అది అంతవరకే తన ప్రభావం చూపదు. కంటి మీదా దాని దుష్ర్పభావం కనిపించవచ్చు. అలా కంటిపై ప్రభావం కనిపించేందుకు ఆస్కారం ఉన్న కొన్ని జబ్బులు, వ్యవస్థలూ, ఆరోగ్య పరిస్థితులు ఉదాహరణకు... డయాబెటిస్ రక్తపోటు థైరాయిడ్ రక్తహీనత (అనీమియా) కొలాజెన్ వాస్క్యులార్ డిసీజ్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ కొన్ని ట్యూమర్లు (గడ్డలు) కొన్ని రకాల ఆనువంశిక (హెరిడిటరీ) వ్యాధులు కొన్ని రకాల మందులు హార్మోన్లలో వచ్చే అసమతౌల్యతలు కొన్ని విటమిన్లు అధికంగా తీసుకోవడం... ఇవన్నీ కంటిపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. అందుకే కొన్ని వ్యాధులున్నవారు, కొన్ని మందులు, విటమిన్ సప్లిమెంట్లు తీసుకునేవారు విధిగా ఆ మందుల వల్ల కంటిపై దుష్ర్పభావం కలుగుతుందా అని అడిగి తెలుసుకోవాలి. అంతేకాదు కొన్ని లక్షణాలేమైనా కనిపించినప్పుడు విధిగా కంటి డాక్టరునూ సంప్రదించాలి. సోరియాసిస్ సోరియాసిస్ వ్యాధిలో చర్మం పొడిబారి పొట్టు రాలుతున్నట్లుగా ఉంటుంది. మన రోగ నిరోధకశక్తి మనకే ప్రతికూలంగా పనిచేయడంతో పాటు మరికొన్ని కారణాలతో వచ్చే ఈ జబ్బులో కన్ను కూడా ప్రభావితమవుతుంది. ఈ జబ్బు ఉన్నవాళ్లలో రెటీనాకూ, తెల్లగుడ్డులో భాగమైన స్ల్కెరా పొరకు మధ్య ఇన్ఫ్లమేషన్ రావడం (యువైటిస్) కార్నియాకు ఇన్ఫ్లమేషన్ రావడం (కెరటైటిస్), కంజెంక్టివా అనే పొరకు ఇన్ఫెక్షన్ రావడం (కంజెంక్టివైటిస్), కన్ను పొడిబారడం (డ్రై ఐ) వంటి లక్షణాలు కనిపించవచ్చు. పాటించాల్సిన జాగ్రత్తలు / చికిత్స... సోరియాసిస్కు ఇప్పుడు గతంలో కంటే అధునాతనమైన చికిత్స ప్రక్రియలే అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు పూవా, గతంలో మాదిరిగా అల్ట్రా వయొలెట్ రేడియేషన్ కిరణాలతో ఇచ్చే చికిత్సలు, ఇమ్యూనో మాడ్యులేటర్స్ అనే ఆధునిక తరహా చికిత్సలు. వీటిని తీసుకుంటూనే ఒకసారి కంటి వైద్యుడిని కూడా సంప్రదించాలి. మియస్థేనియా గ్రేవిస్ ఇది నరాలకు, కండరాలకు వచ్చే జబ్బు. ఈ జబ్బు వల్ల కండరాలు క్రమంగా తమ శక్తిని కోల్పోయి ఒక దశలో పూర్తిగా చచ్చుబడిపోయినట్లుగా మారిపోతాయి. శక్తిహీనంగా తయారవుతాయి. ఈ వ్యాధి వల్ల కలిగే దుష్ర్పభావంతో చూపు కూడా దెబ్బతింటుంది. కంటిపై ఈ వ్యాధి కనబరిచే దుష్ర్పభావాలు... పై కనురెప్ప గాని లేదా కింది కనురెప్పగానీ వ్యక్తి ప్రమేయం లేకుండా దానంతట అదే మూసుకుపోవడం (టోసిస్) ఒకే వస్తువు రెండు వస్తువులుగా కనిపించడం (డిప్లోపియా) పాటించాల్సిన జాగ్రత్తలు / చికిత్స... మియస్థేనియా గ్రేవిస్ జబ్బు ఉన్న వారు దాన్ని నియంత్రించుకునేందుకు... డాక్లర్లు సూచించిన స్టెరాయిడ్స్ క్రమం తప్పకుండా వాడాలి. ఇమ్యూనో మాడ్యులేటర్స్ అనే మందులను వాడాల్సి ఉంటుంది. ఒక్కోసారి శస్త్రచికిత్స అవసరం కావచ్చు. మైగ్రేన్ ఇది ఒక రకం తలనొప్పి. మైగ్రేన్ (పార్శ్వపు తలనొప్పి) ఉన్నవారిలో కంటికి సంబంధించి కనిపించే లక్షణాలు ఏమిటంటే... చూపు మసకగా అనిపించడం ఒక పక్క కన్నుగుడ్డులో తీవ్రమైన నొప్పి తాత్కాలికంగా చూపు తగ్గడం లేదా తాత్కాలికంగా ఏమీ కనిపించకపోవడం కంటి కండరాలకూ, కనురెప్పలకూ తాత్కాలికంగా పక్షవాతం రావడం. పాటించాల్సిన జాగ్రత్తలు / చికిత్స... కొన్ని రకాల అంశాలు మైగ్రేన్ తలనొప్పిని తక్షణం ప్రేరేపిస్తాయి. ఉదా: కొన్ని రకాల సుగంధద్రవ్యాల వాసన లేదా అగరొత్తుల వంటి వాసనలు మైగ్రేన్ను ప్రేరేపించి తక్షణం తలనొప్పి వచ్చేలా చేస్తాయి. ఈ అంశాలను ‘ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్’ అంటారు. తమకు ఏ అంశం వల్ల అది వస్తుందో గుర్తించి, దాని నుంచి దూరంగా ఉండాలి. మైగ్రేన్కు డాక్టర్లు రెండు రకాల చికిత్సలు చేస్తారు. మొదటిది... తక్షణమే నొప్పి తగ్గేందుకు చేసే చికిత్స. రెండోది... దీర్ఘకాలంలో ఈ నొప్పి మళ్లీ మళ్లీ రాకుండా నివారించేందుకిచ్చే మందులతో చేసే చికిత్స. ఈ మందులను క్రమం తప్పకుండా వాడాలి. డయాబెటిస్ ఇటీవల మన సమాజంలో చాలా ఎక్కువగా కనిపిస్తున్న వ్యాధి ఇది. పైగా ఈ వ్యాధి ఉన్నవారిలో కనీసం 20 శాతం మందిలో కంటిపై దాని తాలూకు దుష్ర్పభావం కనిపించే అవకాశం ఉంది. మధుమేహం వల్ల కంటికి వచ్చే వ్యాధులివే... డయాబెటిక్ రెటినోపతి: రెటీనా అనే కంటి వెనక ఉండే తెరపై పడే ప్రతిబింబం నుంచి మెదడుకు సిగ్నల్స్ అందడం వల్లనే మనకు చూపు అనే జ్ఞానం కలుగుతుందన్న విషయం తెలిసిందే. డయాబెటిస్ కారణంగా రక్తనాళాలు మొద్దుబారడం వల్ల రెటీనాకు అందాల్సినంతగా పోషకాలు, ఆక్సిజన్ అందక క్రమంగా రెటీనా తన పనితీరును కోల్పోయే ప్రమాదం ఉంది. దీనివల్ల దృష్టిలోపం కూడా రావచ్చు. అందుకే డయాబెటిస్ ఉన్నవారు క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవాలి. వాటి నరాలు స్పందనలు కోల్పోతున్నాయా అన్న అంశాన్ని పరిశీలించుకుంటూ ఉండాలి. గ్లకోమా: డయాబెటిస్ ఉన్నవారికి కంట్లో నల్లముత్యం లేదా నీటికాసులు అని పిలిచే గ్లకోమా రావచ్చు. కంట్లో ఉండే ఇంట్రా ఆక్యులార్ ఒత్తిడి పెరిగి మనకు కనిపించే దృష్టి విస్తృతి క్రమంగా తగ్గిపోతుంది. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు క్రమం తప్పకుండా గ్లకోమా కండిషన్ ఉత్పన్నమైందా అన్న విషయం తెలుసుకోడానికి కంటి డాక్టర్ చేత పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. క్యాటరాక్ట్: కంట్లోని లెన్స్ పారదర్శకతను కోల్పోయే స్థితిని క్యాటరాక్ట్ అంటారన్న విషయం తెలిసిందే. డయాబెటిస్ ఉన్నవారిలో క్యాటరాక్ట్ వచ్చే అవకాశమూ ఉన్నందున సంబంధిత పరీక్షలూ చేయించుకోవాలి. ఎందుకంటే సాధారణ ఆరోగ్యవంతులతో పోలిస్తే డయాబెటిస్ ఉన్నవాళ్లకు క్యాటరాక్ట్ పదేళ్ల ముందే వస్తుంది. ఆప్టిక్ న్యూరోపతీ: డయాబెటిస్ వల్ల నరాలు మొద్దుబారి తమ చైతన్యాన్ని కోల్పోతాయన్న విషయం తెలిసిందే. మిగతా నరాల విషయం ఎలా ఉన్నా చూపును ప్రసాదించే ఆప్టిక్ నర్వ్ దెబ్బతింటే జీవితం అంధకారమయ్యే ప్రమాదముంది. కాబట్టి, డయాబెటిస్ ఉన్నవారు తప్పనిసరిగా క్రమం తప్పక కంటిపరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. పాటించాల్సిన జాగ్రత్తలు / చికిత్స డయాబెటిస్ ఉన్నవారు రక్తంలో చక్కెరపాళ్లను జాగ్రత్తగా నియంత్రించుకోవాలి క్రమం తప్పకుండా మందులు వాడాలి కంటి డాక్టర్నూ సంప్రదిస్తూ ఉండాలి అవసరాన్ని బట్టి లేజర్ చికిత్స లేదా శస్త్రచికిత్స చేయించుకోవాలి. అధిక రక్తపోటు అధిక రక్తపోటు (హైపర్ టెన్షన్) ఉన్నవారిలో అకస్మాత్తుగా చూపు మసకబారవచ్చు. లేదా చూపు కనిపించకపోవచ్చు. దీనికి అనేక కారణాలుంటాయి. రక్తపోటు కారణంగా... రెటీనాకు సంబంధించిన కేంద్ర రక్తనాళం (సిర) లేదా ఏదైనా రక్తనాళపు శాఖలో రక్తం గడ్డకట్టి అడ్డుపడవచ్చు. రెటీనాకు సంబంధించిన ప్రధాన ధమని లేదా ధమని శాఖలో రక్తం గడ్డకట్టి అడ్డుపవచ్చు. ఆప్టిక్ న్యూరోపతి అనే నరాల సంబంధమైన సమస్య రావచ్చు. కన్నులోని ఒక భాగమైన విట్రియల్ ఛేంబర్లో రక్తస్రావం కావచ్చు గ్లకోమా కూడా రావచ్చు. పాటించాల్సిన జాగ్రత్తలు / చికిత్స... రక్తపోటు ఉన్నవారు బీపీని అదుపులో పెట్టుకోవాలి ఉప్పు, నూనె పదార్థాలు చాలా తక్కువగా తీసుకోవాలి కంటికి సంబంధించిన సమస్య వస్తే మందులు వాడటం లేదా లేజర్ చికిత్స లేదా శస్త్రచికిత్స చేయించుకోవాలి. థైరాయిడ్ సమస్య గొంతు వద్ద ఊపిరితిత్తుల్లోకి గాలి తీసుకెళ్లే నాళం చుట్టూ ఉండే ప్రధాన గ్రంథి థైరాయిడ్. ఇది స్రవించే హార్మోన్ కారణంగా మన శరీరంలోని అనేక జీవక్రియలు సజావుగా జరుగుతాయి. దీనిలో ఏదైనా లోపం ఏర్పడితే దాని దుష్ర్పభావం కంటిపైనా పడవచ్చు. అప్పుడు కనిపించే లక్షణాలివే... కన్నుగుడ్డు బయటకు పొడుచుకు వచ్చినట్లుగా కనిపించడం (ప్రాప్టోసిస్) ఒకే వస్తువు రెండు వస్తువులుగా కనిపించడం (డిప్లోపియా) కంటికి రంగులను చూసే శక్తి క్షీణించడం (డిఫెక్టివ్ కలర్ విజన్) కన్ను పూర్తిగా పొడిబారిపోవడం (డ్రై ఐ) కార్నియాకు సంబంధించిన సమస్యలు రావచ్చు. పాటించాల్సిన జాగ్రత్తలు / చికిత్స... థైరాయిడ్ సమస్య ఉన్నవారు డాక్టర్లు సూచించిన మందులను క్రమం తప్పకుండా వాడాలి అవసరాన్ని బట్టి స్టెరాయిడ్స్ తీసుకోవాలి కొన్ని ఇమ్యునో సప్రెసెంట్స్ వాడాలి అవసరాన్ని బట్టి రేడియోథెరపీ తీసుకోవాల్సిరావచ్చు. తప్పని పరిస్థితుల్లో ఆర్బిటోటమీ అనే శస్త్రచికిత్స చేయించాల్సి రావచ్చు. డిస్లిపిడేమియా రక్తంలో ఉండే కొన్ని రకాల కొవ్వు పదార్థాలు (ఉదా: కొలెస్ట్రాల్, ట్రై గ్లిజరైడ్స్ వంటివి) ఉండాల్సిన పాళ్లలో కాకుండా వేర్వేరు విలువలతో ఉండటం వంటి సమస్యలు రావచ్చు. ఇవన్నీ కంటిచూపును ప్రభావితం చేసే అవకాశం ఉంది. పాటించాల్సిన జాగ్రత్తలు / చికిత్స... కొవ్వులు అతి తక్కువగా ఉండి, పీచు పదార్థాలు చాలా ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు తీసుకోవాలి తమలోని కొవ్వులు దహనం అయ్యేలా వ్యాయాయం చేయాలి కొవ్వులను తగ్గించే మందులను వాడాలి. రక్తహీనత శరీరంలో దాదాపు ఐదు లీటర్ల వరకు రక్తం ఉంటుంది. రక్తంలో ఉండే ఎర్ర రక్తకణాలే శరీరంలోని అన్ని కణాలకూ అవసరమైన ఆక్సిజన్ను మోసుకెళ్తుంటాయి. ఈ ఎర్ర రక్తకణాల సంఖ్య తక్కువగా ఉండే కండిషన్ను రక్తహీనత (ఎనీమియా) అంటారు. కొందరిలో ఎర్రరక్తకణాల సంఖ్య తగినంతగా ఉన్నా ఆక్సిజన్ను మోసుకుపోయే హిమోగ్లోబిన్ తక్కువగా ఉండవచ్చు. ఇలా రక్తహీనత ఉన్నవారిలో ఈ కింది లక్షణాలు కనిపిస్తాయి. రెటీనాపై రక్తస్రావం (రెటినల్ హేమరేజ్) కంటిలోని లెన్స్ పారదర్శకత కోల్పోవడం నరాల సమస్య వంటివి కనిపిస్తాయి. పాటించాల్సిన జాగ్రత్తలు / చికిత్స... ఎనీమియాను తగ్గించే ఐరన్ టాబ్లెట్లు / మందులు వాడడం విటమిన్లు, ఇతర పోషకాలు పుష్కలంగా ఉన్న ఆహారం తీసుకోవడం. గుండెజబ్బులు కొన్ని రకాల గుండెజబ్బులు (కార్డియో వ్యాస్క్యులార్ డిసీజెస్) కూడా కంటిపై తన దుష్ర్పభావాన్ని చూపవచ్చు. దీని వల్ల కింద పేర్కొన్న ఈ లక్షణాలు కనిపించవచ్చు. అకస్మాత్తుగా చూపు కనిపించకపోవడం తాత్కాలికంగా చూపు కోల్పోవడం కంటి చూపునకు దోహదపడే నరానికి (ఆప్టిక్ నర్వ్కు) సంబంధించిన సమస్యలు. పాటించాల్సిన జాగ్రత్తలు / చికిత్స... అసలు సమస్యకు చికిత్స చేయించు కోవ డమే... గుండెజబ్బుల కారణంగా వచ్చే కంటి సమస్యలకు కూడా పరిష్కారం. అలాగే, దీనితో పాటు తరచూ కంటి పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. కొలాజెన్ వ్యాస్క్యులార్ డిసీజెస్ కొలాజెన్ అనేది శరీరంలోని ఒక రకం ప్రోటీన్లతో కూడిన కణజాలం. మన రోగనిరోధక శక్తి మన కణజాలాన్నే శత్రువుగా పరిగణించి కొలాజెన్ అనే మన ప్రొటీన్లపై దాడి చేయడం వల్ల కొన్ని వ్యాధులు వస్తాయి. వాటన్నింటినీ కలిపి కొలాజెన్ వ్యాస్క్యులార్ డిసీజెస్గా అభివర్ణిస్తారు. ఆ వ్యాధులు ఏమిటంటే... సిస్టమిక్ లూపస్ అరిథమెటోసిస్ (ఎస్ఎల్ఈ) కీళ్లనొప్పులు (జాయింట్ పెయిన్స్) రుమటాయిడ్ ఆర్థరైటిస్ వెజెనెర్స్ గ్రాన్యులొమాటోసిస్ వంటి వ్యాధులు అన్నమాట. ఎస్ఎల్ఈ (లూపస్): లూపస్ అంటే ఉల్ఫ్ (తోడేలు) అని అర్థం. ముఖం మీద ముక్కుకు ఇరువైపులా మచ్చతో కనిపించే వ్యాధి తాలూకు ఒక లక్షణం. ఇది శారీరక వ్యవస్థలపై ప్రభావం చూపుతుంది కాబట్టి దీన్ని సిస్టమిక్ లూపస్ అరిథమెటోసస్ (ఎస్ఎల్ఈ) అని చెబుతారు. లక్షణాలు ముక్కుపై నుంచి చెంపల పైన ఇరువైపులా మచ్చల్లా కనిపించే దద్దుర్ల (ర్యాష్) లాగా వస్తుంది. సూర్యకాంతి ప్రతిస్పందన (ఫోటో సెన్సిటివిటీ)తో ఈ ర్యాష్ మరింత పెరగవచ్చు. కాళ్లూ చేతులకు సంబంధించిన రెండు మూడు కీళ్లలో వాపు వస్తుంది. రుమటాయిడ్ జబ్బుల్లోలా లూపస్లో జాయింట్స్ వాపు వచ్చి జాయింట్స్ ఒంగిపోతాయి. అయితే... రుమటిజంలో లాగా ఈ ఒంపు వల్ల శాశ్వత అంగవైకల్యం రాదు. ఇలా కీళ్లు ఒంగిపోవడం అన్నది తాత్కాలికంగానే జరుగుతుంది. కొందరిలో డిప్రెషన్ కనిపించి ఉద్వేగాలకు లోనవుతుంటారు. వీరి సమస్యను మానసికమైన లేదా నరాలకు సంబంధించినదిగా పొరబాటుపడే అవకాశం ఉంది. ఇలాంటి వాళ్లలో ఏఎన్ఏ పరీక్ష నిర్వహించి- లూపస్ వల్ల మెదడుపై ఏదైనా దుష్ర్పభావం పడిందేమో పరీక్షించాలి. కొందరిలో ఫిట్స్ కూడా రావచ్చు. పై వ్యాధి వల్ల కంటికి జరిగే దుష్పరిణామం ఏమిటంటే... అరుదుగా కొందరిలో కళ్లలో రక్తపోటు పెరిగి (హేమరేజిక్ రెటినైటిస్) అంధత్వానికి దారితీయవచ్చు. కొందరిలో కంటి చూపు క్రమంగా తగ్గుతూ ఉండవచ్చు. కొందరిలో జుట్టు రాలిపోవచ్చు. మరికొందరిలో నోటిలో, ముక్కులో పుండ్లు (అల్సర్స్) కూడా రావచ్చు. ఈ అల్సర్స్ వల్ల నొప్పి ఉండదు. వీటన్నింటితో పాటు కళ్లకు సంబంధించి కన్ను పొడిబారడం (డ్రై ఐ), రెటీనాకూ, తెల్లగుడ్డులో భాగమైన స్క్లెరా పొరకు మధ్య ఇన్ఫ్లమేషన్ రావడం (యువైటిస్), స్క్లెరా పొరకు ఇన్ఫ్లమేషన్, కార్నియాకు ఇన్ఫ్లమేషన్ రావడం (కెరటైటిస్) వంటి సమస్యలు రావచ్చు. పిల్లల్లోనూ... పిల్లల్లోనూ లూపస్ రావచ్చు. దీన్ని జువెనైల్ సిస్టమిక్ లూపస్ అని అంటారు. పిల్లల్లో జ్వరం వచ్చి రెండు మూడు కీళ్లలో వాపు రావడం ద్వారా ఇది కనిపిస్తుంది. ఎండను చూడలేక బాధపడుతుండే పిల్లల విషయంలో జువెనైల్ లూపస్ ఉందేమోనని అనుమానించి పరీక్షలు చేయించడం ముఖ్యం. పిల్లల్లో వచ్చినప్పుడు (నియోనేటల్ లూపస్)- పుట్టుకతోనే గుండె కవాటాలలో లోపం (కంజెనిటల్ హార్ట్ బ్లాక్) రావచ్చు. ఇలా పిల్లల్లో లూపస్ వస్తే అది కళ్లపై దుష్ర్పభావం చూపుతుంది కాబట్టి స్కూళ్లకు వెళ్లే వయసు పిల్లల్లో ప్రతి ఆరు నెలలకు ఒకసారి వైద్యపరీక్షలు, కంటి పరీక్షలు (మాక్యులార్ టెస్ట్) చేయించడం మంచిది. పాటించాల్సిన జాగ్రత్తలు / చికిత్స... ప్రధానమైన సమస్యలైన ఎస్ఎల్ఈ, కీళ్లనొప్పులు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి వాటికి చికిత్స తీసుకోవడంతో పాటు కంటికి సంబంధించిన సమస్యలకూ తగిన చికిత్స తీసుకోవాలి. ఇక పిల్లల్లో జువెనైల్ సిస్టమిక్ లూపస్ను గుర్తించడం సాధ్యం కాదు కాబట్టి స్కూల్ పిల్లలందరికీ కంటివైద్యుల ద్వారా తరచూ పరీక్షలు చేయించడం కూడా ఒక మంచి ఆలోచనే. పోషకలోపాలు మనం తీసుకునే ఆహారంలో విటమిన్లు అనే పోషకాలు లోపించడం వల్ల కూడా కంటికి సంబంధించిన కొన్ని సమస్యలు వస్తాయి. అందుకే ఆయా విటమిన్లు పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉండాలి. లేదా అన్ని విటమిన్లూ అందేలా సమతులాహారాన్ని తీసుకోవడం మంచిది. విటమిన్ లోపం- ఏర్పడే సమస్య విటమిన్ ఏ- కన్ను పొడిబారడం, రేచీకటి, అంధత్వం (కార్నియల్ బ్లైండ్నెస్) విటమిన్ బి1- కార్నియల్ అనస్థీషియా, కార్నియల్ డిస్ట్రొఫీ విటమిన్ బి2- చూపు మసక బారడం, ఫొటో ఫోబియా (వెలుగు చూడలేకపోవడం), కంజెంక్టివా పొరపై దురదలు, మంటలు విటమిన్ సి- కంజెంక్టివా పొరలో రక్తస్రావం, కనురెప్పలు, రెటీనా సమస్యలు. విటమిన్ డి- జోన్యులార్ క్యాటరాక్ట్, ఆప్టిక్ నర్వ్ వాపు చివరగా... పైన పేర్కొన్న వ్యాధులేగాక రకరకాల బ్యాక్టీరియా, వైరల్, ఫంగల్, పరాన్నజీవుల కారణంగా వచ్చే అనేక రకాల ఇన్ఫెక్షన్ల వల్ల కూడా కళ్లు ప్రభావితమవుతాయి. ఇందులో అతి ముఖ్యమైనది - ఎయిడ్స్ వల్ల కంటిపై పడే దుష్ర్పభావం. అందుకే ఏదైనా బ్యాక్టీరియల్, వైరల్, ఫంగల్, పరాన్నజీవుల (పారసైటిక్) ఇన్ఫెక్షన్ తర్వాత ఒకసారి కంటి డాక్టర్తో కూడా పరీక్ష చేయించుకోవడం మేలు. - నిర్వహణ: యాసీన్ - మంజులారెడ్డి -
పోషకాలే అయినా... ఎక్కువైతే కష్టం!
ఆహారం- ఆరోగ్యం ఆహారం, ఆరోగ్యం ఒకదానికి ఒకటి అనుసంధానమై ఉంటాయి. ఆరోగ్యంగా ఉండడానికి, అనారోగ్యం పాలవడానికి మనం తీసుకునే ఆహారమే ప్రధాన కారణం. ఆహారాన్ని మితంగా తీసుకుంటూ దానికి తగినట్లుగా వ్యాయామం ఉండేటట్టు జాగ్రత్తపడాలి.అధునాతన జీవనశైలిలో శారీరక శ్రమ తగ్గడం వల్ల ఆహారంలో తీసుకున్న పోషకాలు ఖర్చు కాకుండా నిల్వ చేరుతున్నాయి. కాబట్టి కొవ్వు పదార్థాలను తగ్గించాలి. మన సంప్రదాయ ఆహారపదార్థాలతో శరీరానికి కావలసిన అన్ని పోషకాలూ సమృద్ధిగా అందుతాయి. గింజల పొట్టును తీయకుండా వాడడం వల్ల పూర్తిస్థాయిలో ఆరోగ్యాన్నిచ్చే గుణం మన వంటకాలకు ఉంది. మన తెలుగువారి సంప్రదాయ పిండివంటలన్నీ రుచితోపాటుగా శక్తిని, పోషణను ఇచ్చేవే. తగుమోతాదులో సుగంధద్రవ్యాలు తీసుకోవడం మంచిదే కాని ఉప్పు, నూనెల విషయంలో కచ్చితంగా ఉండాలి. హోటల్లో, ఇతర బయట ఆహారపదార్థాలకు వీలయినంత వరకు దూరంగా ఉండాలి. ఎందుకంటే వాటిలో రుచి మాత్రమే ప్రధానం అన్నట్లుగా నూనె, ఉప్పు ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఇవి శరీరంలోకి వెళ్లే కొద్దీ దీర్ఘకాలంలో హైపర్టెన్షన్, డయాబెటిస్, హార్ట్ఎటాక్లకు దారి తీసే అవకాశం ఎక్కువ.కోలా వంటి శీతల పానీయాలలో ఉండే చక్కెర శరీరంలోకి చేరి కొవ్వుగా రూపాంతరం చెందుతుంది. -
డాక్టర్ రెడ్డీస్ నుంచి ఆప్టిడోజ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అధిక రక్తపోటును సమర్థవంతంగా నియంత్రించే కాంబినేషన్ ట్యాబ్లెట్స్ ‘ఆప్టిడోజ్’ను డాక్టర్ రెడ్డీస్ మార్కెట్లోకి విడుదల చేసింది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా అమ్లోడైపిన్ 2.5 ఎంజీ. టెల్మిసర్టన్ 200ఎంజి, హైడ్రోక్లోరోథిజైడ్ 6.25 ఎంజీ కాంబినేషన్లో ప్రవేశపెట్టిన ఆప్టిడోజ్ పది ట్యాబ్లెట్స్ ధరను రూ.80గా నిర్ణయించినట్లు డాక్టర్ రెడ్డీస్ ఇండియా జనరిక్ హెడ్ అలోక్ సోని తెలిపారు. శుక్రవారం ఆప్టిడోజ్ను లాంఛనంగా మార్కెట్లోకి విడుదల చేసిన అనంతరం సోని మాట్లాడుతూ డాక్టర్ రెడ్డీస్ ఆదాయంలో 25 నుంచి 30% హృదయ సంబంధిత విభాగం నుంచే సమకూరుతున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఈ మూడు కాంబినేషన్లు వాడే వారు మోతాదును బట్టి ట్యాబ్లెట్కు రూ.12 నుంచి రూ.18 వరకు వ్యయం చేయాల్సి వచ్చేదని, కాని ఇప్పుడు మూడు కాంబినేషన్లు కలిపి రూ.8 కే అందిస్తున్నట్లు తెలిపారు. 10 శాతం వృద్ధి: ఈ ఏడాది వ్యాపారంలో 8-10% వృద్ధి నమోదుకావచ్చని అలోక్ తెలిపారు. కొత్త ఔషధ విధానంతో ధరలు తగ్గడం, ఆర్థిక మందగమనం వంటి కారణాలతో ఈ ఏడాది దేశీయ ఫార్మా రంగం ఒత్తిడిని ఎదుర్కొంటోందన్నారు. తప్పనిసరి ఔషధాలపై ధరలను నియంత్రిస్తూ నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథార్టీ తీసుకున్న నిర్ణయం కంపెనీకి చెందిన 15-20 డ్రగ్స్పైపడుతుందని, ఇది ఆదాయంపై 5% వరకు ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు.