IPO market
-
ఐపీవోకు ఆరు కంపెనీలు రెడీ
కొత్త క్యాలండర్ ఏడాదిలోనూ ప్రైమరీ మార్కెట్ల దూకుడు కొనసాగనుంది. తాజాగా ఆరు కంపెనీల పబ్లిక్ ఇష్యూలకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ(SEBI) పచ్చ జెండా ఊపింది. జాబితాలో ఐటీ సర్వీసుల కంపెనీ హెక్సావేర్ టెక్నాలజీస్తోపాటు.. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు విక్రన్ ఇంజినీరింగ్, అజాక్స్ ఇంజినీరింగ్, పీఎంఈఏ సోలార్ టెక్ సొల్యూషన్స్, ఆల్ టైమ్ ప్లాస్టిక్స్, స్కోడా ట్యూబ్స్ చేరాయి. ఈ ఆరు కంపెనీలు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టింగ్ కోసం 2024 సెప్టెంబర్-డిసెంబర్ మధ్య ప్రాస్పెక్టస్లను దాఖలు చేశాయి. తద్వారా ఉమ్మడిగా రూ.10,000 కోట్లు సమీకరించనున్నాయి. వివరాలు చూద్దాం..కార్లయిల్ మద్దతుతో..డిజిటల్, ఐటీ సొల్యూషన్ల కంపెనీ హెక్సావేర్ టెక్నాలజీస్ ఐపీవో(IPO)లో భాగంగా రూ. 9,950 కోట్ల విలువైన షేర్లను విక్రయానికి ఉంచనుంది. ప్రమోటర్ సంస్థ సీఏ మ్యాగ్నమ్ హోల్డింగ్స్ వీటిని ఆఫర్ చేయనుంది. హెక్సావేర్లో పీఈ దిగ్గజం కార్లయిల్ గ్రూప్ సంస్థ సీఏకు ప్రస్తుతం 95.03 శాతం వాటా ఉంది. కంపెనీ ఫైనాన్షియల్, హెల్త్కేర్, తయారీ, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ తదితర రంగాలకు ఐటీ సర్వీసులు సమకూర్చుతోంది. గత ప్రమోటర్ బేరింగ్ పీఈ ఏషియా 2020లో హెక్సావేర్ను స్టాక్ ఎక్స్చేంజీల నుంచి డీలిస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తదుపరి ఏడాది కాలంలో బేరింగ్ వాటాను కార్లయిల్ గ్రూప్ కొనుగోలు చేసింది. గతేడాది(2023–24) హెక్సావేర్ రూ.10,380 కోట్ల ఆదాయం, రూ.997 కోట్ల నికర లాభం ఆర్జించింది. స్టెయిన్లెస్ స్టీల్ గుజరాత్ కంపెనీ స్కోడా ట్యూబ్స్ ఐపీవోలో భాగంగా రూ.275 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. సంస్థ ప్రధానంగా ఆయిల్, గ్యాస్, కెమికల్స్, ఫెర్టిలైజర్స్, విద్యుత్ తదితర రంగాలలో కార్యకలాపాలు నిర్వహించే ఈపీసీ, ఇండ్రస్టియల్ కంపెనీలకు స్టెయిన్లెస్ స్టీల్ ట్యూబ్స్, పైపులను తయారు చేసి అందిస్తోంది. ఈపీసీ కంపెనీమౌలిక రంగ ఈపీసీ సంస్థ విక్రన్ ఇంజినీరింగ్ ఐపీవోలో భాగంగా రూ.900 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ.100 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్ విక్రయానికి ఉంచనున్నారు. కంపెనీలో సుప్రసిద్ధ ఇన్వెస్టర్ ఆశిష్ కొచాలియాకు సైతం పెట్టుబడులున్నాయి. టర్న్కీ పద్ధతిలో డిజైన్, సప్లై, ఇన్స్టలేషన్, టెస్టింగ్, కమిషనింగ్ తదితర ఎండ్ టు ఎండ్ ఈపీసీ సర్వీసులదిస్తోంది. సోలార్ టెక్ఐపీవోలో భాగంగా పీఎంఈఏ సోలార్ టెక్ సొల్యూషన్స్ రూ.600 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 1.12 కోట్ల షేర్లను ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. 2006లో ఏర్పాటైన కంపెనీ ప్రధానంగా సోలార్ ట్రాకింగ్ మౌంటింగ్ సిస్టమ్స్, ఎక్విప్మెంట్ తయారీలో ఉంది. మాడ్యూల్ మౌంటింగ్ అసెంబ్లీలో 16 గిగావాట్ల వార్షిక స్థాపిత సామర్థ్యాన్ని కలిగి ఉంది. కన్జూమర్ ప్రొడక్ట్స్కస్టమర్ల కోసం కన్జూమర్వేర్ ప్రొడక్టులు తయారు చేసే ఆల్ టైమ్ ప్లాస్టిక్స్ ఐపీవోలో భాగంగా రూ. 350 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 52.5 లక్షల షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. వైట్లేబుల్ కన్జూమర్వేర్ ప్రొడక్టుల తయారీ కంపెనీ క్లయింట్ల సొంత బ్రాండ్లను రూపొందించి అందిస్తోంది. కస్టమర్ల జాబితాలో గ్లోబల్ దిగ్గజాలు ఐకియా, ఏఎస్డీఏ స్టోర్స్, టెస్కో పీఎల్సీ, మైఖేల్స్ స్టోర్స్తోపాటు దేశీయంగా స్పెన్సర్స్ రిటైల్ తదితరాలున్నాయి.ఇదీ చదవండి: అత్యంత విలువైన ఐటీ బ్రాండ్లుకాంక్రీట్ ఎక్విప్మెంట్పీఈ దిగ్గజం కేదారా క్యాపిటల్కు పెట్టుబడులున్న అజాక్స్ ఇంజినీరింగ్ కాంక్రీట్ ఎక్విప్మెంట్ తయారీలో కార్యకలాపాలు విస్తరించింది. ఐపీవోలో భాగంగా 2.28 కోట్ల ఈక్విటీ షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. కేదారా క్యాపిటల్ 74.37 లక్షల షేర్లను ఆఫర్ చేయనుంది. -
తొలిరోజే ఫుల్ సబ్స్క్రైబ్ అయిన ఐపీవో
ఫార్మా రంగానికి ప్రత్యేక ఇంజినీరింగ్ పరికరాలను తయారు చేస్తున్న హైదరాబాద్ కంపెనీ స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ ఐపీవో(IPO) తొలిరోజు 13.32 రెట్లు సబ్స్క్రైబ్ అయింది. ఆఫర్లో 2.08 కోట్ల షేర్లకు గాను 27.75 కోట్ల షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. గ్రే మార్కెట్లో షేర్లు రూ.97 ప్రీమియంతో ట్రేడయ్యాయి. సేల్ను ప్రారంభించిన నిమిషాల్లోనే పూర్తిగా సబ్స్క్రైబ్(Subscribe) కావడం విశేషం.బిడ్డింగ్ రౌండ్లో ముందున్న నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (NII) విభాగం 25.43 రెట్లు, రిటైల్(Retail) ఇన్వెస్టర్స్ 14.46, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ కొనుగోలుదారుల (QIB) విభాగం 1.82 రెట్లు సబ్స్రైబ్ అయింది. షేర్లను జనవరి 13న బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో లిస్ట్ చేయనున్నారు. ఇష్యూ జనవరి 8న ముగుస్తుంది. ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ.133–140 మధ్య నిర్ణయించారు. ఐపీవోలో భాగంగా రూ.210 కోట్ల విలువైన తాజా షేర్లను జారీ చేస్తారు. 1.42 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ కింద ప్రమోటర్లు విక్రయిస్తారు. ఇన్వెస్టర్లు కనీసం 107 ఈక్విటీ షేర్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి కంపెనీ రూ.123 కోట్లు అందుకుంది.ఇదీ చదవండి: ఇంటి భోజనం మరింత భారం!క్వాడ్రంట్ ఫ్యూచర్కు యాంకర్ నిధులురైల్వే సిగ్నలింగ్, రక్షణ(కవచ్) వ్యవస్థలకు సేవలందించే కంపెనీ క్వాడ్రంట్ ఫ్యూచర్ టెక్ యాంకర్ ఇన్వెస్టర్లకు 45 లక్షల షేర్లను విక్రయించింది. తద్వారా దాదాపు రూ.131 కోట్లు అందుకుంది. ఎంఎఫ్ సంస్థలు వైట్ఓక్ క్యాపిటల్, కొటక్, ఎల్ఐసీ, బీవోఐసహా సిటీగ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ మారిషస్ తదితర 22 సంస్థలు ఇన్వెస్ట్ చేశాయి. షేరుకి రూ.290 ధరలో షేర్లను జారీ చేయనుంది. రూ.275–290 ధరల శ్రేణిలో నేడు ప్రారంభంకానున్న ఇష్యూ 9న ముగియనుంది. ఐపీవోలో భాగంగా రూ.290 కోట్ల విలువైన షేర్లను కొత్తగా జారీ చేయనుంది. నిధులను ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ వ్యవస్థ అభివృద్ధి, రుణ చెల్లింపులు తదితరాలకు వినియోగించనుంది. -
ఐపీవో బాటలో మరో కంపెనీ
స్టీల్ తయారీలో సమీకృత కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఏవన్ స్టీల్స్ ఇండియా పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల(Cpaital Market) నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా పత్రాలు దాఖలు చేసింది. వాటిలోని వివరాల ప్రకారం ఐపీవో(IPO) కింద రూ.600 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. మరో రూ.50 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు సందీప్ కుమార్, సునీల్ జలాన్, క్రిషన్ కుమార్ జలన్ ఆఫర్ చేయనున్నారు. తద్వారా మొత్తం రూ.650 కోట్లు అందుకునే యోచనలో కంపెనీ ఉంది.ప్రస్తుతం కంపెనీలో ప్రమోటర్ల వాటా 85.56 శాతంగా నమోదైంది. ఈక్విటీ జారీ నిధులను కంపెనీ అనుబంధ సంస్థ వినయ స్టీల్స్లో పెట్టుబడులకు వినియోగించనుంది. సంస్థ విస్తరణకు వీలైన మెషీనరీ కొనుగోలు, సొంత అవసరాల కోసం సోలార్ ఎనర్జీ(Solar Energy)ని సమకూర్చుకోవడం తదితరాలు చేపట్టనుంది. దాంతోపాటు మరికొన్ని నిధులను రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది.ఇదీ చదవండి: 1,673 కోట్ల యూపీఐ లావాదేవీలుఆంధ్రప్రదేశ్లోనూ..బెంగళూరు కంపెనీ ఏవన్ స్టీల్స్ ఇండియా విభిన్న ప్రొడక్టుల పోర్ట్ఫోలియోను కలిగి ఉంది. ముడిస్టీల్ సామర్థ్యంరీత్యా దక్షిణాదిలోని టాప్–5 కంపెనీలలో ఒకటిగా నిలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని యూనిట్తోపాటు కర్ణాటకలో మరో 5 ప్లాంట్లను నిర్వహిస్తోంది. ప్రధానంగా స్టీల్ తయారీలో వినియోగించే లాంగ్, ఫ్లాట్ స్టీల్ ప్రొడక్టులుసహా ఇండ్రస్టియల్ ప్రొడక్టులను తయారు చేస్తోంది. 2024 జూన్30కల్లా వార్షికంగా 14.97 లక్షల మెట్రిక్ టన్నుల ఫినిష్డ్ ప్రొడక్టుల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఎంఎస్పీ స్టీల్ అండ్ పవర్, బాలాజీ ఇండస్ట్రీస్, శ్యామ్ మెటాలిక్స్ అండ్ ఎనర్జీతో పోటీ పడుతోంది. -
రూ.3,395 కోట్ల ఐపీవోకు రంగం సిద్ధం
బెంగళూరుకు చెందిన సీఆర్డీఎం(కాంట్రాక్ట్ రీసెర్చ్, డెవలప్మెంట్, మాన్యుఫాక్చరింగ్) సేవలందిస్తున్న యాంథెమ్ బయోసైన్సెస్ తాజాగా ఐపీవో(IPO) ద్వారా రూ.3,395 కోట్లు సమీకరించనుంది. దీనికి సంబంధించిన ముసాయిదా ప్రాస్పెక్టస్ను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ(SEBI)కి సమర్పించింది. ఈ ఇష్యూ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (OFS) విధానంలో ఉండనుంది. ప్రమోటర్లు గణేష్ సాంబశివం, రవీంద్ర చంద్రప్పతో పాటు ఇతర ఇన్వెస్టర్లు, వాటాదారులు షేర్లను విక్రయించనున్నారు.ఇదీ చదవండి: ‘బీ-రెడీ’లో మంచి స్కోర్ రావాలంటే కష్టమే..ఇష్యూ పూర్తిగా ఓఎఫ్ఎస్ విధానంలో ఉంటుంది. సమీకరించిన నిధులన్నీ విక్రయదార్లకు చెందుతాయి. 2006లో ఏర్పాటైన యాంథెమ్ సంస్థ బెంగళూరు కేంద్రంగా కాంట్రాక్ట్ రీసెర్చ్, డెవలప్మెంట్, తయారీ సంస్థగా (CRDMO) కార్యకలాపాలు సాగిస్తోంది. కర్ణాటకలో రెండు ప్లాంట్లు ఉన్నాయి. నిర్మాణంలో ఉన్న మూడో యూనిట్ 2025 ప్రథమార్ధంలో అందుబాటులోకి రానుంది. కంపెనీ గత ఆర్థిక సంవత్సరం రూ.1,419 కోట్ల ఆదాయంపై రూ.367 కోట్ల లాభం నమోదు చేసింది. -
ఐపీఓకు సిద్ధమవుతున్న మరిన్ని కంపెనీలు
ఐపీఓల పర్వం కొనసాగుతున్న తరుణంలో కొత్తగా మరికొన్ని కంపెనీలు నిధులు సమీకరణకు పూనుకుంటున్నాయి. ఇండిక్యూబ్ స్పేసెస్ లిమిటెడ్ అనే వర్క్ ప్లేస్ సొల్యూషన్స్ కంపెనీ ఐపీఓ ద్వారా రూ.850 కోట్లు నిధులు సమీకరించడానికి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) వద్ద ముసాయిదా పత్రాలను(డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్-DRHP)దాఖలు చేసింది. ఇందుకు సెబీ(SEBI) అనుమతిస్తే ఐపీఓకు వెళ్లేందుకు మార్గం సుగమమవుతుంది.ఐపీఓ ద్వారా రూ.750 కోట్లు, మరో రూ.100 కోట్లు ప్రమోటర్లు ఆఫర్ ఫర్ సేల్ ద్వారా నిధులు సమీకరించనున్నారు. ఇలా వచ్చిన నిధులను మూలధన వ్యయాలకు వెచ్చించనున్నట్లు కంపెనీ తెలిపింది. కొత్త కేంద్రాల ఏర్పాటుకు రూ.462.6 కోట్లు, రుణాలను తిరిగి చెల్లించేందుకు రూ.100 కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు పేర్కొంది. మిగిలిన మొత్తాన్ని సాధారణ కార్పొరేట్ అవసరాలకు ఉపయోగిస్తామని స్పష్టం చేసింది.ఇదీ చదవండి: ట్యాక్సీ సేవల యాప్స్పై విచారణకు ఆదేశంఇండో ఫామ్ ఎక్విప్మెంట్ లిమిటెడ్ఇండో ఫామ్ ఎక్విప్మెంట్ లిమిటెడ్ ఐపీఓ(IPO)కు రానున్నట్లు ప్రకటించింది. తాజా ఇష్యూ ద్వారా రూ.260.15 కోట్ల నిధులను సమీకరిచనున్నట్లు తెలిపింది. ఈ ఇష్యూ 2024 డిసెంబర్ 31 మంగళవారం ప్రారంభం కానుంది. ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ.204 నుంచి రూ.215 మధ్య ఉంటుంది. ఇందులో 86 లక్షల షేర్లతో ఐపీఓ ద్వారా రూ.184.9 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ ద్వారా రూ.75.25 కోట్ల విలువైన 35 లక్షల షేర్లను విక్రయించనున్నారు. రిటైల్ ఇన్వెస్టర్లు 69 షేర్లకు కనీస పెట్టుబడి రూ.14,835 కలిగి ఉండాలని తెలిపింది. స్మాల్ నాన్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (SNII) 966 షేర్లకు కనీస పెట్టుబడి రూ.2,07,690 అవసరం అవుతుంది. బిగ్ నాన్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (BNII) 4,692 షేర్లకు కనీస పెట్టుబడి రూ.10,08,780 కలిగి ఉండాలి. బీఎస్ఈ, ఎన్ఎస్ఈ రెండింటిలోనూ లిస్టింగ్ తేదీ జనవరి 7, 2025గా నిర్ణయించారు. ఐపీఓ జనవరి 2న ముగియనుండగా, తుది కేటాయింపు 2025 జనవరి 3న జరగనుంది. -
ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ రూ.1,000 కోట్లు సమీకరణ
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహన తయారీ కంపెనీ గ్రీవ్స్(Greaves) ఎలక్ట్రిక్ మొబిలిటీ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ(SEBI)కి ముసాయిదా ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. వీటి ప్రకారం రూ.1,000 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది.మరో 18.9 కోట్ల షేర్లను ప్రమోటర్ సంస్థ, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. వెరసి ప్రమోటర్ గ్రీవ్స్ కాటన్ 5.1 కోట్ల షేర్లను, ఏఎల్జే గ్రీన్ మొబిలిటీ సొల్యూషన్స్ డీఎంసీసీ 13.8 కోట్ల షేర్లను ఆఫర్ చేయనున్నాయి. కంపెనీ యాంపియర్ బ్రాండుతో ఎలక్ట్రిక్ స్కూటర్లు(EV Scooters), మరో బ్రాండుతో త్రిచక్ర ఈవీలను రూపొందిస్తోంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ.375 కోట్లు బెంగళూరు టెక్నాలజీ కేంద్రంలో ప్రొడక్ట్, సాంకేతిక అభివృద్ధికి, రూ.83 కోట్లు సొంత బ్యాటరీ అసెంబ్లీ సామర్థ్యాలకు, రూ.38 కోట్లు ఎంఎల్ఆర్ ఆటో తయారీ సామర్థ్య పెంపునకు, బెస్ట్వే ఏజెన్సీస్ ప్రయివేట్ తయారీ విస్తరణకు మరో రూ.20 కోట్లు చొప్పున వెచ్చించనుంది.ఇదీ చదవండి: గగనతలంలో 1.42 కోట్ల మందికంపెనీ తెలంగాణ(తూప్రాన్), తమిళనాడు(రాణీపేట్), ఉత్తరప్రదేశ్(గ్రేటర్ నోయిడా)లలో తయారీ యూనిట్లను కలిగి ఉంది. గతేడాది(2023–24) రూ.612 కోట్ల ఆదాయం సాధించింది. -
ఐపీఓ గురించి తెలుసుకోండి..
స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి రెండు రకాల మార్గాలు అందుబాటులో ఉంటాయి. ఒకటి..కంపెనీలు పబ్లిక్ ఇష్యూకు వచ్చినప్పుడు వాటికి దరఖాస్తు చేయడం ద్వారా షేర్లను కొనుగోలు చేయడం. అలాకాకుండా మార్కెట్లో నేరుగా షేర్లను కొనుగోలు చేయడం రెండోది.పబ్లిక్ ఇష్యూ విషయానికొస్తే...పబ్లిక్ ఇష్యూనే ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్(ఐపీఓ) అని కూడా వ్యవహరిస్తారు. సాధారణంగా కంపెనీలు తమ ఎదుగుదల క్రమంలో నిధులు అవసరమై ప్రజల నుంచి వాటిని సమీకరించాలనే ఉద్దేశంతో షేర్లను జారీ చేయడం ద్వారా మొట్టమొదటిసారి ఐపీఓకు వస్తాయి. ఇలా ఐపీఓకి వచ్చే కంపెనీలు ముందుగా లీడ్ మేనేజర్లను నియమించుకుంటాయి. వీరు ఆ కంపెనీ ఐపీఓ వ్యవహారాలు సజావుగా పూర్తయ్యేలా చూస్తారు. కంపెనీలు ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులను కంపెనీలు విస్తరణ, మూలధన అవసరాలు, అప్పులు తీర్చడం కోసం వాడుకుంటాయి. ఐపీఓ తర్వాత సంస్థలు వాటాదారులకు జవాబుదారీగా నిలవాల్సి ఉంటుంది.పబ్లిక్ ఇష్యూకి వచ్చే కంపెనీలు తమ షేర్లకు ఒక ముఖవిలువ (ఫేస్వాల్యూ) నిర్ధారిస్తాయి. అప్పటికి ఆ కంపెనీస్థాయి, అది చేస్తున్న వ్యాపారం, మార్కెట్లో దాని ఉత్పత్తులకు ఉండే డిమాండ్ వంటి విభిన్న అంశాలను దృష్టిలో ఉంచుకుని సంస్థకు ఒక విలువను నిర్ధారిస్తాయి. కంపెనీ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎన్ని షేర్లు జారీ చేయాలో (కంపెనీలో ఎంత వాటా అమ్మకానికి పెట్టాలో) నిర్ణయించుకుంటాయి. దానికి అనుగుణంగా సెబీని సంప్రదించి తమ ప్రతిపాదనలు సమర్పిస్తాయి. ఒకసారి సెబీ ఇష్యూకి క్లియరెన్స్ ఇచ్చి, ఎక్స్ఛేంజీల ఆమోదం పొందిన తర్వాత మార్కెట్లోకి ప్రవేశిస్తాయి. సాధారణంగా 3-5 రోజులపాటు ఇష్యూ అందుబాటులో ఉంటుంది. వివిధ సందర్భాలు, ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని 10 రోజులలోపు ఇష్యూ పూర్తి చేయవచ్చు.ఇన్వెస్టర్లు పరిగణించాల్సిన విషయాలు..1. ఇష్యూ లాట్ సైజ్ 2. ఇష్యూధర.. అంటే కంపెనీ ఒక్కో లాట్కు ఎన్ని షేర్లు ఆఫర్ చేస్తుంది.. ఎంత ధరకు ఆఫర్ చేస్తుంది అనే వివరాలు. ఒక్కో రిటైల్ ఇన్వెస్టర్ (సాధారణ ఇన్వెస్టర్లు) ఒక్కొక్కరు రూ.2 లక్షల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.ఉదా: x అనే కంపెనీ రూ.100-120 ధరల శ్రేణితో ఇష్యూకి వచ్చింది అనుకుందాం. సాధారణంగా గరిష్ట ధరకే షేర్ల కేటాయింపు జరుగుతూ ఉంటుంది కాబట్టి రూ.120 పరిగణనలోకి తీసుకుందాం. అలాగే 100 షేర్లను ఒక లాట్గా నిర్ధారించి జారీ చేస్తుంది అనుకుంటే మనం రిటైల్ ఇన్వెస్టర్లం కాబట్టి రూ.120 గరిష్ట ధరకు మనకు షేర్లు అలాట్ అవ్వాలంటే గరిష్టంగా 16 లాట్ల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే మార్కెట్లో ఆ ఇష్యూకి ఉండే డిమాండ్, దానికి అనుగుణంగా సబ్స్క్రిప్షన్ ఏ స్థాయిలో జరిగింది అనే దాన్ని దృష్టిలో ఉంచుకుని మనకు షేర్ల అలాట్మెంట్ జరుగుతుంది. 10 రెట్లు, 20 రెట్లు.. ఇలా సబ్స్రైబ్ అయితే మనకు కేటాయించే లాట్ల సంఖ్య తగ్గిపోతుంది. ఒక్కోసారి ఒకటే లాట్ అలాట్ కావొచ్చు. ఒక్కోసారి అది కూడా కాకపోవచ్చు.షేర్లు అలాంట్ అవ్వాలంటే..మీరు దరఖాస్తు చేసుకోవాలనుకునే కంపెనీ ఇష్యూకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని తెలిసి, ఎలాగైనా కొన్ని షేర్లు మీకు అలాట్ అవ్వాలంటే మీ కుటుంబీకులు, బంధువులు, స్నేహితులు ప్యాన్ వివరాలతో ఇలా వివిధ అకౌంట్లతో దరఖాస్తు చేసుకోవచ్చు. దాంతో షేర్లు అలాట్ అయ్యే అవకాశం పెరుగుతుంది. అంతే తప్పా మీపేరుపైనే ఒకటి కంటే ఎక్కవ లాట్ల కోసం దరఖాస్తు చేసుకోకూడదు. అలా చేస్తే మొదటికే మోసం జరుగుతుంది. అధికమొత్తంలో షేర్లు అలాట్ అవ్వకపోగా, కనీసం ఒక లాట్కూడా వచ్చే అవకాశం ఉండదని గుర్తుంచుకోవాలి.రిస్కులులేవా..?ఇష్యూ పూర్తయిన మూడు రోజుల తర్వాత బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో సదరు కంపెనీ షేర్లు లిస్ట్ అవుతాయి. ఐపీఓకి దరఖాస్తు చేయడం వల్ల రిస్కులు, ప్రయోజనాలూ ఉంటాయి. ఐపీఓలో అలాట్ అయినా షేర్లు లిస్టింగ్ రోజున పడిపోతే ఆ నష్టాన్ని భరించడంకానీ, వాటిని కొనసాగించడంగానీ చేయాల్సి ఉంటుంది. అదే లాభాల్లో ట్రేడ్ అవుతుంటే మంచి ప్రయోజనం పొందవచ్చు.ఇదీ చదవండి: క్రెడిట్ కార్డ్.. గీత దాటొద్దు..!త్వరలో ఐపీఓకి రానున్న కంపెనీలు..వెంటివ్ హాస్పిటాలిటీ లిమిటెడ్ఇష్యూ ప్రారంభం 20 డిసెంబర్ఇష్యూ ముగింపు 24 డిసెంబర్ మమతా మెషినరీ లిమిటెడ్ఇష్యూ ప్రారంభం 19 డిసెంబర్ఇష్యూ ముగింపు 23 డిసెంబర్ట్రాన్స్రైల్ లైటింగ్ లిమిటెట్ఇష్యూ ప్రారంభం 19 డిసెంబర్ఇష్యూ ముగింపు 23 డిసెంబర్-బెహరా శ్రీనివాసరావుస్టాక్ మార్కెట్, నిపుణులు -
లాజిస్టిక్స్ ఐపీవోకు స్పందన ఎలా ఉందంటే..
ట్రక్ ఆపరేటర్లకు డిజిటల్ ప్లాట్ఫామ్ సేవలందించే జింకా లాజిస్టిక్స్ సొల్యూషన్స్ పబ్లిక్ ఇష్యూకి అంతంతమాత్రమే స్పందన లభించింది. ఐపీవో దరఖాస్తు చివరి రోజు సోమవారానికల్లా 1.9 రెట్లు అధికంగా సబ్స్క్రయిబ్ అయ్యింది. కంపెనీ 2.25 కోట్ల షేర్లు ఆఫర్ చేయగా.. 4.19 కోట్ల షేర్ల కోసం బిడ్స్ దాఖలయ్యాయి. క్విబ్ విభాగంలో 2.76 రెట్లు బిడ్స్ నమోదుకాగా.. రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి 1.65 రెట్లు దరఖాస్తులు లభించాయి. సంస్థాగతేతర ఇన్వెస్టర్ల విభాగంలో 24 శాతానికే దరఖాస్తులు అందాయి.ఇష్యూలో భాగంగా యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.501 కోట్లు సమకూర్చుకున్న సంగతి తెలిసిందే. వెరసి షేరుకి రూ.259–273 ధరలో చేపట్టిన ఇష్యూ ద్వారా కంపెనీ రూ.1,115 కోట్లు సమీకరించింది. ఐపీవో ద్వారా ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్లు రూ.565 కోట్ల విలువైన 2.06 కోట్ల షేర్లను విక్రయించగా.. రూ.550 కోట్ల విలువైన ఈక్విటీని కంపెనీ కొత్తగా జారీ చేసింది. ఈ నిధుల్లో రూ.200 కోట్లు మార్కెటింగ్కు, రూ.140 కోట్లు బ్లాక్బక్ ఫిన్సర్వ్ మూలధన పెట్టుబడులకు వినియోగించనుంది.ఇదీ చదవండి: గోల్డ్ ఈటీఎఫ్లు కళకళఏరిస్ఇన్ఫ్రా ఐపీవోకు రెడీనిర్మాణ రంగ మెటీరియల్స్ ప్రొక్యూర్మెంట్లో టెక్నాలజీ ఆధారిత బీ2బీ సేవలందించే ఏరిస్ఇన్ఫ్రా సొల్యూషన్స్ పబ్లిక్ ఇష్యూకి క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఇష్యూలో భాగంగా కంపెనీ రూ. 600 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వెరసి ఐపీవో ద్వారా రూ. 600 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఐపీవో చేపట్టేందుకు వీలుగా ఈ ఏడాది ఆగస్ట్లో సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసిన కంపెనీ తాజాగా అనుమతులు పొందింది. కాగా.. ఇష్యూ నిధులను వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు, అనుబంధ సంస్థ బిల్డ్మెక్స్ ఇన్ఫ్రాలో పెట్టుబడులకు, రుణ చెల్లింపులకు, ఇతర కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. -
ఐపీఓకు సిద్ధమవుతున్న కంపెనీలివే..
రెనెవబుల్ ఎనర్జీ కంపెనీ ఏసీఎంఈ (ఆక్మే) సోలార్ హోల్డింగ్స్ పబ్లిక్ ఇష్యూ రేపు(6న) ప్రారంభంకానుంది. 8న ముగియనున్న ఇష్యూకి రూ.275–289 ధరల శ్రేణిని ప్రకటించింది. ఇష్యూలో భాగంగా రూ.2,395 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ.505 కోట్ల విలువైన షేర్లను ఆక్మే క్లీన్టెక్ సొల్యూషన్స్ విక్రయానికి ఉంచనుంది. వెరసి ఐపీవో ద్వారా రూ.2,900 కోట్లు సమీకరించనుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు నేడు(5న) షేర్లను కేటాయించనుంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ.1,795 కోట్లు రుణ చెల్లింపులకు వినియోగించనుంది. సోలార్ పవర్ ప్రాజెక్టుల కంపెనీ సమీకృత పునరుత్పాదక ఇంధన సంస్థగా ఆవిర్భవించింది. 2024 జూన్కల్లా నిర్వహణలోని 28 ప్రాజెక్టులను కలిగి ఉంది. వీటిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాజస్తాన్లలోనే 18 ప్రాజెక్టులున్నాయి. ప్రస్తుత సామర్థ్యం 1,320 మెగావాట్లుకాగా.. 1,650 మెగావాట్లు నిర్మాణంలో ఉన్నాయి. గతేడాది రూ. 1,319 కోట్ల ఆదాయం, రూ. 698 కోట్ల నికర లాభం సాధించింది.ధర శ్రేణి: రూ. 275–289రిటైల్ ఇన్వెస్టర్లకు కనీస లాట్: 51 షేర్లు లిస్టింగ్: 13ననివా బూపాఆరోగ్య బీమా రంగ కంపెనీ నివా బూపా హెల్త్ ఇన్సూరెన్స్ పబ్లిక్ ఇష్యూ గురువారం(7న) ప్రారంభంకానుంది. 11న ముగియనున్న ఇష్యూకి రూ.70–74 ధరల శ్రేణిని ప్రకటించింది. ఇష్యూలో భాగంగా రూ.800 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ.1,400 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. వెరసి ఐపీవో ద్వారా రూ.2,200 కోట్లు సమీకరించనుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు రేపు(6న) షేర్లను కేటాయించనుంది. కంపెనీ ప్రమోటర్లలో 62.19 శాతం వాటాగల బూపా సింగపూర్ హోల్డింగ్స్ రూ.350 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ చేయనుంది. 26.8 శాతం వాటా కలిగిన ఫెటల్ టోన్ ఎల్ఎల్పీ రూ.1,050 కోట్ల విలువైన వాటాను విక్రయించనుంది. ఈక్విటీ జారీ నిధులను మూలధన పటిష్టతకు వినియోగించనుంది. దేశీ మార్కెట్లో స్టార్ హెల్త్ తదుపరి స్టాండెలోన్ కంపెనీగా లిస్ట్కానుంది. గతేడాది మొత్తం ప్రీమియం ఆదాయం 38 శాతం జంప్చేసి రూ.5,608 కోట్లకు చేరింది. రూ.82 కోట్ల నికర లాభం ఆర్జించింది.ధర శ్రేణి: రూ. 70–74 రిటైల్ ఇన్వెస్టర్లకు కనీస లాట్: 200 షేర్లు లిస్టింగ్: 14నఇదీ చదవండి: బేర్ ఎటాక్..!కార్దేఖోఆటో క్లాసిఫైడ్స్ పోర్టల్ కార్దేఖో పబ్లిక్ ఇష్యూ సన్నాహాలు ప్రారంభించింది. సంస్థ సహవ్యవస్థాపకుడు అమిత్ జైన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్లను నియమించేందుకు చర్చలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఐపీవో ద్వారా రూ.4,000 కోట్లు సమకూర్చుకునే ప్రణాళికల్లో ఉంది. దీంతో 2021 ఆగస్ట్లో వెలువడిన కార్ట్రేడ్ టెక్ లిమిటెడ్ ఐపీవో తదుపరి రెండో ఆటో క్లాసిఫైడ్ లిస్టెడ్ సంస్థగా కార్దేఖో నిలవనుంది. -
కారణం చెప్పకుండా ఐపీవో ఉపసంహరణ
న్యూఢిల్లీ: ఆటో విడిభాగాల సంస్థ హీరో మోటార్స్ కంపెనీ(హెచ్ఎంసీ) పబ్లిక్ ఇష్యూ ప్రతిపాదన నుంచి వెనక్కు తగ్గింది. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి దాఖలు చేసిన ముసాయిదా ప్రాస్పెక్టస్ను తాజాగా ఉపసంహరించుకుంది. ఐపీవో ద్వారా రూ.900 కోట్లు సమీకరించాలని తొలుత భావించింది. ఇందుకు అనుగుణంగా సెబీకి ఆగస్ట్లో ప్రాథమిక పత్రాలను దాఖలు చేసింది. దీనిలో భాగంగా రూ.500 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయడంతోపాటు.. మరో రూ.400 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ చేసేందుకు ప్రమోటర్లు ఆసక్తి చూపారు. అయితే కారణం వెల్లడించకుండానే ప్రాస్పెక్టస్ను వెనక్కి తీసుకుంటున్నట్లు కంపెనీ తాజాగా తెలియజేసింది. ఐపీవోలో ఓపీ ముంజాల్ హోల్డింగ్స్ రూ.250 కోట్లు, హీరో సైకిల్స్, భాగ్యోదయ్ ఇన్వెస్ట్మెంట్స్ రూ.75 కోట్లు చొప్పున షేర్లను ఆఫర్ చేయాలని భావించాయి. కంపెనీ ప్రధానంగా ఆటోమోటివ్ దిగ్గజాలకు హైఇంజినీర్డ్ పవర్ట్రయిన్ సొల్యూషన్ల తయారీ, సరఫరాలో ఉంది.ఇదీ చదవండి: కస్టమర్ల నుంచి 10 వేల ఫిర్యాదులుసురక్షా డయాగ్నోస్టిక్ రెడీసమీకృత డయాగ్నోస్టిక్ సేవల కంపెనీ సురక్షా డయాగ్నోస్టిక్ పబ్లిక్ ఇష్యూకి రానుంది. ఇందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టింగ్కు వీలుగా జులైలోనే ప్రాథమిక పత్రాలను సెబీకి దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా 1.92 కోట్ల ఈక్విటీ షేర్లను కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. కంపెనీ జులైలో చేపట్టేందుకు సన్నాహాలు ప్రారంభించింది. ముసాయిదా ప్రాస్పెక్టస్ ప్రకారం ఐపీవో నిధులు కంపెనీ ప్రమోటర్లు, వాటాదారులకు అందనున్నాయి. వెరసి కంపెనీకి ఐపీవో నిధులు లభించవు. కంపెనీ పాథాలజీ, రేడియాలజీ టెస్టింగ్, మెడికల్ కన్సల్టేషన్ సర్వీసులు అందిస్తోంది. -
14 ఏళ్లలో సెప్టెంబర్ బిజీ..బిజీ
పద్నాలుగేళ్ల తర్వాత ఈ నెల(సెప్టెంబర్) సరికొత్త రికార్డుకు వేదిక కానుంది. రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) వివరాల ప్రకారం సెప్టెంబర్లో ఇప్పటివరకూ 28 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలను చేపట్టాయి. మెయిన్ బోర్డ్, ఎస్ఎంఈలు కలిపి ఇప్పటికే 28 కంపెనీలు లిస్టింగ్కు తెరతీశాయి.ఫైనాన్షియల్ మార్కెట్లు వృద్ధిలో ఉన్నట్లు ఆర్థిక వ్యవస్థపై రూపొందించిన సెప్టెంబర్ బులెటిన్లో ఆర్బీఐ పేర్కొంది. ప్రైమరీ ఈక్విటీ మార్కెట్లో చిన్న, మధ్యతరహా సంస్థలు(ఎస్ఎంఈలు)సహా భారీ సందడి నెలకొన్నట్లు తెలియజేసింది. వెరసి 14 ఏళ్ల తరువాత ఈ సెప్టెంబర్ అత్యంత రద్దీగా మారినట్లు వ్యాఖ్యానించింది. దేశీ మ్యూచువల్ ఫండ్స్ తదితర ఇన్వెస్టర్ల ద్వారా ఇష్యూలు భారీస్థాయిలో సబ్స్క్రైబ్ అవుతున్నట్లు వివరించింది. ఇదీ చదవండి: నూనెల ధర ఎందుకు పెరిగింది?క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ పరిశీలన ప్రకారం ఐపీవోల్లో లభించిన షేర్లలో 54 శాతాన్ని ఇన్వెస్టర్లు లిస్టయిన వారం రోజుల్లోనే విక్రయించారు. 2024లో ఐపీవోల ద్వారా నిధుల సమీకరణ జోరు చూపుతున్నట్లు ఆర్బీఐ నివేదిక పేర్కొంది. ఈ బాటలో తొలి అర్ధభాగానికల్లా ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ఐపీవోలు వెలువడిన దేశంగా భారత్ నిలిచినట్లు తెలియజేసింది. ఇందుకు ఎస్ఎంఈలు ప్రధానంగా దోహదపడినట్లు వెల్లడించింది. -
సమీప భవిష్యత్తులో రూ.1.48 లక్షలకోట్ల షేర్లపై ప్రభావం..!
రానున్న 4 నెలల్లో రూ.1.48 లక్షల కోట్ల విలువైన 66 కంపెనీల షేర్లకు లాకిన్ గడువు ముగియనుంది. దీంతో ఈ షేర్లలో అమ్మకాల ఒత్తిడి ఎదురుకావొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో భారీగా కంపెనీలు స్టాక్మార్కెట్లో లిస్ట్ అయ్యాయి. అయితే సెబీ నిబంధనల ప్రకారం యాంకర్ ఇన్వెస్టర్లు కంపెనీలో పెట్టుబడిపెట్టిన 90 రోజుల వరకు తమ షేర్లను అమ్మేందుకు వీలుండదు. ఆ లాకిన్ గడువు ముగిసిన తర్వాత వాటిని ఈక్విటీ మార్కెట్లో విక్రయించవచ్చు. గడిచిన కొద్దిరోజుల్లో టాటా టెక్నాలజీస్ వంటి ప్రముఖ కంపెనీలు సైతం ఐపీఓగా మార్కెట్లో లిస్ట్ అయ్యాయి. ఆ ఒక్క కంపెనీ అనే కాకుండా మార్కెట్లో పేరున్న చాలా కంపెనీలు మంచి లిస్టింగ్గేయిన్స్తో స్టాక్మార్కెట్లో లిస్ట్అయ్యాయి. ఆ లాభాలంతా 90 రోజుల తర్వాత యాంకర్ ఇన్వెస్టర్ల పొందే వీలుంది. ఇదీ చదవండి: తగ్గనున్న పారుబాకీలు.. అధిక ఎన్పీఏలు ఉన్న రంగాలివే.. లాకిన్ గడువు పూర్తికానున్న షేర్లలో టాటా టెక్నాలజీస్, హోనాసా కన్జూమర్, సెల్లో వరల్డ్, జనస్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఉన్నాయి. ఏప్రిల్ 1న గ్లోబల్ సర్ఫేసెస్, సాయి సిల్క్స్, జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్లాటినం ఇండస్ట్రీస్, ఎక్సికామ్ టెక్నాలజీస్ షేర్ల లాకిన్ ముగియనుంది. రానున్న 4 నెలల్లో దాదాపు 66 కంపెనీల లాకిన్ ముగుస్తుంది. దాంతో సుమారు రూ.1.48 లక్షలకోట్ల విలువైన షేర్లపై ప్రభావం పడనుంది. -
కొత్త ఏడాది మొదలవనున్న పబ్లిక్ ఇష్యూలు..
కొద్ది నెలలుగా దుమ్ము రేపుతున్న ప్రైమరీ మార్కెట్ ప్రభావంతో మూడు కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు సిద్ధపడుతున్నాయి. ఇందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి రెండు కంపెనీలు ముసాయిదా ప్రాస్పెక్టస్లను దాఖలు చేశాయి. సోలార్ ఈపీసీ కంపెనీ రేస్ పవర్ ఇన్ఫ్రా, సమీకృత ఐటీ సొల్యూషన్లు అందించే ఎస్కోనెట్ టెక్నాలజీస్ తాజాగా సెబీని ఆశ్రయించాయి. ఈ బాటలో ఇన్సులేటెడ్ వైర్లు, స్ట్రిప్స్ తయారీ కంపెనీ డివైన్ పవర్ ఎనర్జీ సైతం స్టాక్ ఎక్ఛ్సెంజీలలో లిస్టింగ్పై కన్నేసింది. ఆ వివరాలు చూద్దాం.. రేస్ పవర్ ఇన్ఫ్రా సోలార్ ఈపీసీ కంపెనీ రేస్ పవర్ ఇన్ఫ్రా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్కు సన్నాహాలు చేస్తోంది. ఇందుకు ఐపీవోను చేపట్టనుంది. ప్రాస్పెక్టస్ ప్రకారం పబ్లిక్ ఇష్యూలో భాగంగా రూ. 300 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 29.95 లక్షల షేర్లను ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. ఐపీవోకంటే ముందుగానే షేర్ల జారీ లేదా ప్రమోటర్లు 14.97 లక్షల షేర్లను ఆఫర్ చేయడం ద్వారా రూ. 45 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. ఇది జరిగితే ఆమేర ఈక్విటీ జారీ తగ్గనుంది. ఈక్విటీ జారీ నిధులను వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. షేర్లు ఎన్ఎస్ఈ, బీఎస్ఈలలో లిస్ట్కానున్నాయి. కంపెనీ ప్రధానంగా సోలార్ విభాగంలో ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్(ఈపీసీ) సరీ్వసులను అందిస్తోంది. 1,207 మెగావాట్ల పీక్ పవర్ ప్రాజెక్టుల అభివృద్ధి ద్వారా కంపెనీ దేశీయంగా సోలార్ విభాగంలోని లీడింగ్ కంపెనీలలో ఒకటిగా నిలుస్తోంది. గతేడాది(2022–23) మొత్తం ఆదాయం రూ. 891 కోట్లకు చేరగా.. నికర లాభం రూ. 131 కోట్లను అధిగమించింది. ఎస్కోనెట్ టెక్నాలజీస్ ఐటీ రంగంలో సమీకృత సరీ్వసులందిస్తున్న ఎస్కోనెట్ టెక్నాలజీస్ ఐపీవో ద్వారా నిధుల సమీకరణ ప్రణాళికలకు తెరతీసింది. దీనిలో భాగంగా రూ. 10 ముఖ విలువగల 33,60,000 షేర్లను కొత్తగా జారీ చేయనుంది. ఎన్ఎస్ఈ ఎమర్జ్ ప్లాట్ఫామ్ ద్వారా కంపెనీ లిస్ట్కానుంది. ఈక్విటీ జారీ నిధులను వర్కింగ్ క్యాపిటల్ అవసరాలతోపాటు.. పూర్తి అనుబంధ సంస్థ జీక్లౌడ్ సరీ్వసెస్ విస్తరణ వ్యయాలకు వినియోగించనుంది. అంతేకాకుండా మరికొన్ని నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకూ వెచి్చంచనున్నట్లు ప్రాస్పెక్టస్లో పేర్కొంది. 2012లో ఏర్పాటైన కంపెనీ హైఎండ్ సూపర్ కంప్యూటింగ్ సొల్యూషన్స్, డేటా సెంటర్ సౌకర్యాలు, స్టోరేజీ సర్వర్లు, నెట్వర్క్ సెక్యూరిటీ, డేటా ప్రొటెక్షన్ తదితరాలను సమకూర్చుతోంది. గ్లోబల్ దిగ్గజాలు ఏఎండీ, అమెజాన్ వెబ్ సరీ్వసెస్, సిస్కో, డెల్ టెక్నాలజీస్, హెచ్పీ, మైక్రోసాఫ్ట్, ఎన్విడియా సాంకేతిక భాగస్వాములుగా వ్యవహరిస్తున్నట్లు ప్రాస్పెక్టస్లో పేర్కొంది. రక్షణ శాఖ, నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్, ఐఐటీ, భారత్ ఎలక్ట్రానిక్స్ తదితరాలు క్లయింట్లుగా ఉన్నట్లు తెలియజేసింది. డివైన్ పవర్ ఎనర్జీ ఇన్సులేటెడ్ వైర్లు, స్ట్రిప్స్ తయారీ కంపెనీ డివైన్ పవర్ ఎనర్జీ పబ్లిక్ ఇష్యూ సన్నాహాల్లో ఉంది. తద్వారా సమకూర్చుకున్న నిధులతో సామర్థ్య విస్తరణ చేపట్టాలని ప్రణాళికలు వేసింది. తాజా పెట్టుబడుల వినియోగంతో 2026కల్లా రూ. 400 కోట్ల టర్నోవర్ను సాధించాలని ఆశిస్తోంది. వెరసి ఈ ఫిబ్రవరి లేదా మార్చికల్లా ఐపీవో చేపట్టే ప్రణాళికల్లో ఉంది. ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకునే లక్ష్యంతో సాగుతోంది. దీంతో 2025కల్లా ఆదాయాన్ని రెట్టింపునకు పెంచుకోవాలని చూస్తోంది. ప్రస్తుత రూ. 150 కోట్ల టర్నోవర్ను తొలుత రూ. 300 కోట్లకు, ఆపై రూ. 400 కోట్లకు పెంచుకునే ప్రణాళికలు అమలు చేయనుంది. కంపెనీ పేపర్ కవర్డ్, డబుల్ కాటన్ కవర్డ్ కండక్టర్లు, ఫైబర్గ్లాస్ ఇన్సులేషన్, సూపర్ ఎనామిల్డ్ ఇన్సులేషన్లను రూపొందిస్తోంది. వీటిని ప్రధానంగా ట్రాన్స్ఫార్మర్లు, మోటార్లు తదితర ఎలక్ట్రికల్ పరికరాలలో వినియోగిస్తారు. ఘజియాబాద్లో 40,000 చదరపు అడుగులలో విస్తరించిన తయారీ యూనిట్ ద్వారా రూపొందించిన ప్రొడక్టులను టాటా పవర్, బీఎస్ఈఎస్సహా పలు ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థలకు అందిస్తోంది. నాల్కో, బాల్కో, హిండాల్కో నుంచి ముడిసరుకులను పొందుతోంది. -
ఈ ఏడాది దుమ్మురేపిన టాప్ ఐపీవోలు ఇవే..
కంపెనీ స్థాపించి దాన్ని స్టాక్మార్కెట్లో లిస్ట్ చేయాలంటే 20 ఏళ్ల కింద పెద్ద సాహసంతో కూడిన వ్యవహారం. కానీ పెరుగుతున్న సాంకేతికత, నైపుణ్యాల అభివృద్ధితో మంచి బిజినెస్ మోడల్ ఐడియా ఉంటే ప్రస్తుతం కోటీశ్వరులుగా మారొచ్చు. మంచి కంపెనీని స్థాపించి ఆర్థికంగా ఎదుగుతూ, వారిని నమ్ముకున్న ముదుపర్లను సైతం ఎదిగేలా చేయొచ్చని చాలా మంది నిరూపిస్తున్నారు. అయితే 2023లో అలాంటి మంచి బిజినెస్ మోడల్ ఐడియాతో మార్కెట్లో లిస్ట్అయి ఇన్వెస్టర్లకు మెరుగైన రాబడులను అందించిన కొన్ని టాప్ ఐపీఓల గురించి తెలుసుకుందాం. ఈ ఏడాది మార్కెట్లోకి వచ్చిన అనేక ఐపీవోలు మంచి లాభాలను అందించి మల్టీబ్యాగర్లుగా నిలిచాయి. అందులో అధిక రాబడులను అందించిన టాప్ ఐపీవోల జాబితాలో.. ఐఆర్ఈడీఏ, సియెట్ డీఎల్ఎం, టాటా టెక్నాలజీస్, సెన్కో గోల్డ్ వంటి కంపెనీలు చోటు దక్కించుకున్నాయి. ఈ క్రమంలో తక్కువ కాలంలోనే మంచి లాభాలను అందించాయి. ఇన్వెస్టర్లకు అధిక లాభాలు మిగిల్చిన ఐపీఓ లిస్ట్లో టాప్లో ఇండియన్ రెన్యూవెబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ లిమిటెడ్(ఐఆర్ఈడీఏ) నిలిచింది. నవంబర్లో ఈ కంపెనీ రూ.32 ఇష్యూ ధరతో ఐపీఓగా మార్కెట్లోకి వచ్చింది. ప్రస్తుతం రూ.109 వద్ద ఈ కంపెనీ షేర్ ట్రేడవుతోంది. పెట్టుబడిదారులకు ఊహించని రాబడులను అందించిన ఐపీవోగా ఈ ఏడాది సియెంట్ టీఎల్ఎం నిలిచింది. జూలై 10న మార్కెట్లో లిస్టింగ్ సమయంలో 58 శాతానికి పైగా రాబడిని అందించింది. ఆ తర్వాత సైతం ఐపీవో తన పెట్టుబడిదారులకు 145 శాతానికి పైగా రాబడిని ఇచ్చింది. ఐపీవో ఇష్యూ ధర రూ.265గా ఉండగా.. స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.778.90గా ఉంది. ఇదీ చదవండి: ఉంటుందో..? ఊడుతుందో..? ఇక మంచి రాబడులను అందించిన జాబితాలో టాటా టెక్నాలజీస్ ఐపీవో మూడో స్థానంలో నిలిచింది. ఐపీవో 140 శాతం ప్రీమియం ధరకు లిస్టింగ్ గెయిన్స్తో బీఎస్ఈలో రూ.1199.95 వద్ద మార్కెట్లోని అడుగుపెట్టింది. తరువాతి స్థానంలో సెన్కో గోల్డ్ నిలిచింది. జులైలో ఈ కంపెనీ ఐపీగా లిస్ట్ అయింది. వాస్తవానికి కంపెనీ షేర్ల ప్రైస్ బ్యాండ్ రూ.301-రూ.317గా ఉంది. అయితే ప్రస్తుతం కంపెనీ రూ.725 వద్ద ట్రేడవుతుంది. -
వెలవెలబోతున్న ఐపీవో మార్కెట్
న్యూఢిల్లీ: ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) మార్కెట్లో సందడి కనిపించడం లేదు. జనవరి నెలలో కేవలం 12 ఐపీవోలు రాగా, ఇవి ఇన్వెస్టర్ల నుంచి రూ.478 కోట్ల పెట్టుబడులు సమీకరించాయి. ఇందులోనూ రూ.323 కోట్లు కేవలం రెండు కంపెనీలు మెయిన్బోర్డ్ రూపంలో సమీకరించినవి కావడం గమనించొచ్చు. 10 ఎస్ఎంఈ కంపెనీలు కలసి రూ.155 కోట్లను సమీకరించాయి. గత డిసెంబర్లో ఐపీవోల ద్వారా కంపెనీలు సమీకరించిన మొత్తం రూ.5,120 కోట్లుగా ఉంది. ‘‘నిఫ్టీ గరిష్ట స్థాయి నుంచి 10 శాతం పడిపోవడంతో సెంటిమెంట్ ప్రతికూలంగా మారింది. ఐపీవోలకు ఇది అనుకూల సమయం కాదు. అయినప్పటికీ ఆకర్షణీయమైన ధరతో వచ్చే ఐపీవోలకు ఇన్వెస్టర్ల నుంచి ఆదరణ ఉంటుంది’’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్కుమార్ తెలిపారు. 2022లో రూ.57,000 కోట్లు గతేడాది మొత్తం మీద 38 కంపెనీలు ఐపీవో రూపంలో రూ.57,000 కోట్లను సమీకరించాయి. ఇందులో రూ.20,557 కోట్లు ఒక్క ఎల్ఐసీ ఐపీవోకి సంబంధించినవి కావడం గమనించొచ్చు. 2021లో 63 కంపెనీలు కలసి సమీకరించిన రూ.1.2 లక్షల కోట్లతో పోలిస్తే గతేడాది గణనీయంగా తగ్గడాన్ని గమనించొచ్చు. ఎల్ఐసీ ఐపీవో లేకుంటే నిధుల సమీకరణ గణాంకాలు మరింత తక్కువగా ఉండేవి. గతేడాది నుంచి ఈక్విటీ మార్కెట్లు అస్థిరతలను ఎదుర్కొంటూనే ఉన్నాయి. ఇక ఈ ఏడాది జనవరిలో రైట్స్ ఇష్యూ ద్వారా కంపెనీలు రూ.644 కోట్లు, క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ ప్లేస్మెంట్ (క్యూఐపీ) రూపంలో రూ.829 కోట్లు రాబట్టాయి. -
నేడే ఎల్ఐసీ ఐపీవో ..స్వల్ప నష్టాల్లో స్టాక్ మార్కెట్లు!
దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్నాయి. జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు దేశీ సూచీలపై ప్రభావం చూపుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దీంతో బుధవారం ఉదయం 9.30గంటలకు సెన్సెక్స్ 29 పాయింట్లు నష్టపోయి 56946 పాయింట్లు, నిఫ్టీ 14పాయింట్లు నష్టపోయి 17054 పాయింట్ల వద్ద ట్రేడింగ్ను కొనసాగిస్తుంది. ఇక బ్రిటానియా,ఎన్టీపీసీ,ఓఎన్జీసీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, యూపీఎల్, ఇన్ఫోసిస్,టాటా స్టీల్, బీపీసీఎల్, విప్రో, టాటామోటార్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా..అపోలో హాస్పిటల్, టైటాన్ కంపెనీ, భారతీ ఎయిర్టెల్, హిందాల్కో, సన్ ఫార్మా, దివిస్ ల్యాబ్స్, శ్రీ సిమెంట్, కిప్లా, ఎంఅండ్ ఎం, ఏషియన్ పెయింట్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఎల్ఐసీ ఐపీవో ప్రారంభం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఎల్ఐసీ ఐపీవో రానే వచ్చింది. నేటి నుంచే ఐపీఓకు ధరఖాస్తు చేసుకోవచ్చు. మే 9 వరకు అందుబాటులో ఉంటుండగా.. పాలసీ దార్లు, ఇన్వెస్టర్లు ఐపీవో ధరఖాస్తు చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఎల్ఐసీ ఐపీవో ధర రూ.902 నుంచి రూ.949 మధ్యలో ఉండగా.. పాలసీదార్లకు రూ.60, రీటైలర్లు,ఉద్యోగులకు రూ.45 చొప్పున డిస్కౌంట్లు ఇస్తున్నారు. -
ఎల్ఐసీ ఐపీఓలో పాల్గొనాలని అనుకుంటున్నారా? మీ పాన్ ను ఇలా అప్డేట్ చేయండి!
రాబోయే పబ్లిక్ ఇష్యూలో (ఐపీఓ) షేర్లను కొనుగోలు చేసేందుకు ఎల్ఐసీ పాలసీదారులు ఫిబ్రవరి 28లోగా తమ పర్మనెంట్ అకౌంటు నంబరు (పాన్) వివరాలను.. పాలసీ రికార్డులో అప్డేట్ చేసుకోవాల్సి రానుంది. ఇదే విషయాన్ని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ఫిబ్రవరి 13న ఎల్ఐసీ దాఖలు చేసిన ముసాయిదా ప్రాస్పెక్టస్లో సంస్థ ఈ విషయం పేర్కొంది. అయితే ఇప్పుడు మనం ఎల్ఐసీ పాలసీ లో పాన్ నెంబర్ను ఎలా అప్ డేట్ చేయాలో తెలుసుకుందాం. ► కార్పొరేషన్ వెబ్సైట్ www.licindia.in లేదా https://licindia.in/Home/Online-PAN-Registrationని సందర్శించండి ►మీ పాలసీ నంబర్, పాన్, పుట్టిన తేదీ, ఇ-మెయిల్ ఐడిని సిద్ధంగా ఉంచుకోండి, మీ పాన్ను అప్డేట్ చేస్తున్నప్పుడు నింపాల్సిన అవసరం ఉంది. ►మీరు పై లింక్ని ఉపయోగించి మీ అన్ని LIC పాలసీల రికార్డులను అప్డేట్ చేయవచ్చు. ►మీరు కార్పొరేషన్ వెబ్సైట్ www.licindia.in లేదా https://linkpan.licindia.in/UIDSeedingWebApp/getPolicyPANStatusని సందర్శించడం ద్వారా మీ పాలసీలో మీ పాన్ అప్డేట్ అఅయ్యిందా లేదా అని తెలుసుకోవచ్చు. ► ప్రత్యామ్నాయంగా, మీరు మీ ఎల్ఐసీ ఏజెంట్ని కూడా సంప్రదించవచ్చు. -
ఐపీవోకు ఉవ్విళ్లూరుతున్న ఎల్ఐసీ! అంతలోనే భారీ షాక్!!
న్యూఢిల్లీ: జీవిత బీమా కంపెనీల కొత్త బిజినెస్ ప్రీమియం ఆదాయం 2022 జనవరిలో 2.65 శాతం పెరిగి, రూ.21,957 కోట్లకు చేరింది. రెగ్యులేటర్– ఐఆర్డీఏఐ (ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా) తాజా గణాంకాలను పరిశీలిస్తే.. ► దేశంలోకి మొత్తం 24 జీవిత బీమా కంపెనీలు 2022 జనవరిలో రూ.21,390 కోట్ల కొత్త బిజినెస్ ప్రీమియంను వసూలు చేశాయి. ► ఈ రంగంలో దిగ్గజ ప్రభుత్వ రంగ సంస్థ– లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) కొత్త ప్రీమియం ఆదాయం 2 శాతం. 5పడిపోయి రూ.12,936.28 కోట్లకు చేరింది. 2021 ఇదే నెల్లో ఎల్ఐసీ కొత్త ప్రీమియం ఆదాయం రూ.13,144 కోట్లు. ► ఇక 23 ప్రైవేటు రంగ కంపెనీల కొత్త ప్రీమియం 9.39 శాతం ఎగసి, రూ.8,246.06 కోట్ల నుంచి రూ. 9,020.75 కోట్లకు చేరింది. ► మొత్తం మార్కెట్లో ఎల్ఐసీ వాటా 61.15 శాతంగా ఉంది. వివిధ కారణాలతో రద్దయిన (ల్యాప్స్డ్) పాలసీలను పునరుద్ధరించుకోవడానికి ఎల్ఐసీ ప్రకటించిన ప్రత్యేక ఆఫర్ ఈ నెల 7వ తేదీ నుంచి మార్చి 27వ తేదీ వరకూ అమలవుతుంది. హెల్త్, మైక్రో ఇన్సూరెన్స్ పాలసీలపైనా లేట్ ఫీజులో రాయితీ ఈ ఆఫర్లో ప్రత్యేకత. ఇక పబ్లిక్ ఇష్యూకు రావడానికి కూడా ఎల్ఐసీ సంసిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. -
ఐపీవో బాటలో స్నాప్డీల్
న్యూఢిల్లీ: ఈకామర్స్ ప్లాట్ఫామ్ స్నాప్డీల్ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఇందుకు అనుమతించమంటూ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి తాజాగా ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. ఇటీవల ఇంటర్నెట్ ఆధారిత బిజినెస్లు నిర్వహించే పలు కంపెనీలు స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యేందుకు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో స్నాప్డీల్ నిధుల సమీకరణకు ప్రాధాన్యత ఏర్పడినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఐపీవోలో భాగంగా కంపెనీ రూ. 1,250 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా కంపెనీలో ఇప్పటికే ఇన్వెస్ట్చేసిన సంస్థలు మరో 3.07 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనున్నాయి. లిస్టింగ్ ద్వారా కంపెనీ విలువ 1.5–1.7 బిలియన్ డాలర్ల(రూ. 12,750 కోట్లు)కు చేరవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తాజా ఈక్విటీ జారీ నిధులను ఇతర కంపెనీల కొనుగోళ్లు, లాజిస్టిక్స్ విస్తరణ, సాంకేతిక మౌలిక సదుపాయాలను మెరుగుపరచుకోవడం తదితరాలకు వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్లో స్నాప్డీల్ పేర్కొంది. ఇటీవల ఇంటర్నెట్ ఆధారిత దిగ్గజాలు జొమాటో, నైకా, పాలసీబజార్, పేటీఎమ్ పబ్లిక్ ఇష్యూల ద్వారా నిధులను సమీకరించి స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్ను పొందిన విషయం విదితమే . మ్యాప్మైఇండియా లాభాల లిస్టింగ్ ఢిల్లీ: డిజిటల్ మ్యాపింగ్ కంపెనీ మ్యాప్మైఇండియా షేరు తొలిరోజు ఇన్వెస్టర్లకు లాభాలను పంచింది. బీఎస్ఈలో ఇష్యూ ధర 1,033తో పోలిస్తే 53 శాతం ప్రీమియంతో రూ.1,581 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో రూ.1,587 వద్ద గరిష్టాన్ని.., రూ.1,395 వద్ద కనిష్టాన్ని నమోదు చేసింది. చివరి గంట లాభాల స్వీకరణతో 35% లాభంతో రూ.1,394 వద్ద నిలిచింది. మార్కెట్ ముగిసే సరికి కంపెనీ విలువ రూ.7,425 కోట్లుగా నమోదైంది. -
Paytm IPO: తొలి రోజే పేటిఎమ్ మదుపర్లకు భారీ షాక్!
ఇండియాలోనే అతి పెద్ద ఐపీవోగా పేటీఎం ఇటీవల ప్రజల ముందుకు వచ్చిన సంగతి మనకు తేలిసిందే. సుమారు రూ.18,300 కోట్లను సేకరించడం లక్ష్యంగా పబ్లిక్ ఇష్యూకి వచ్చింది. ఐపీవోలో రికార్డు సృష్టించిన పేటీఎం షేర్లు తొలిరోజు లిస్టింగ్ సందర్భంగా ఢమాల్ అన్నాయి. పేటీఎం షేర్లు ఇష్యూ ప్రైస్గా రూ.2150గా మార్కెట్లోకి ఎంటరైంది. లిస్టింగ్ సందర్భంగా పేటీఎం ఒక్క షేర్ ధర రూ.1950గా మొదలైంది. అయితే కేవలం గంటల వ్యవధిలోనే షేర్ల ధర వేగంగా క్షీణించింది. అరంగేట్రంలోనే స్టాక్ 27 శాతం పడిపోవడంతో రూ.38 వేల కోట్ల పేటిఎమ్ పెట్టుబడిదారుల సంపద తుడిచిపెట్టుకుపోయింది. బీఎస్ఈలో ఐపీవో ధర రూ.2,150తో పోలిస్తే పేటీఎం షేరు విలువ 27.25% లేదా రూ.585.85 నుంచి రూ.1,564కు పడిపోయింది. ప్రారంభ ధర రూ.1,950తో పోలిస్తే స్టాక్ 19.99% తక్కువగా ముగిసింది. నేటి సెషన్ ముగిసే సమయానికి సంస్థ మార్కెట్ క్యాప్ రూ.1.01 లక్షల కోట్లకు పడిపోయింది. లిస్టింగ్ సమయంలో పేటిఎమ్ మార్కెట్ క్యాప్ రూ.1.39 లక్షల కోట్లుగా ఉంది. ప్రారంభ ధర రూ.1,955తో పోలిస్తే స్టాక్ 20% తక్కువగా ముగిసింది. ఎన్ఎస్ఈలో షేరు 27.44% తక్కువగా రూ.1,560 వద్ద ముగిసింది. సంస్థ మార్కెట్ క్యాప్ రూ.1.01 లక్షల కోట్లుగా ఉంది. ప్రారంభ ధర రూ.1,950తో పోలిస్తే స్టాక్ 20% తక్కువగా ముగిసింది. (చదవండి: యాపిల్ బంపర్ ఆఫర్..! ఇకపై మీఫోన్లను మీరే బాగు చేసుకోవచ్చు..!) పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ 4.83 కోట్ల షేర్లను పబ్లిక్ ఇష్యూలో విక్రయానికి ఉంచగా, స్టాక్ ఎక్సే్చంజీల గణాంకాల ప్రకారం 9.14 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చాయి. దీంతో వారికి కేటాయించిన షేర్లకు 2.79 రెట్లు బిడ్లు వచ్చాయి. క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ బయర్స్(క్యూఐబీ)కు 2.63 కోట్ల షేర్లను కేటాయించగా, 7.36 కోట్ల షేర్లకు బిడ్స్ వచ్చాయి. ఇక రిటైల్ ఇన్వెస్టర్లకు 87 లక్షల షేర్లు ఆఫర్ చేయగా ఈ విభాగం 1.66 రెట్లు సబ్స్క్రైబ్ అయ్యింది. ఇప్పటిదాకా దేశీయంగా అత్యంత భారీ ఐపీవోగా కోల్ ఇండియా పబ్లిక్ ఇష్యూనే ఉంది. కోల్ ఇండియా దాదాపు దశాబ్దం క్రితం రూ. 15,000 కోట్లు సమీకరించింది. ప్రస్తుతం పేటీఎం ఐపీవో విలువ దాన్ని మించి ఏకంగా రూ. 18,300 కోట్లుగా ఉంది. పబ్లిక్ ఇష్యూలో భాగంగా రూ. 1.39 లక్షల కోట్ల వేల్యుయేషన్తో.. షేరు ధర శ్రేణి రూ. 2,080-2,150గా కంపెనీ నిర్ణయించింది. (చదవండి: పన్ను చెల్లింపుదారులకు తీపికబురు) -
స్టాక్ మార్కెట్, ఇకపైనా టెక్ కంపెనీల ఐపీవోల జోరు
న్యూఢిల్లీ: ఇటీవల పబ్లిక్ ఇష్యూల బాట పట్టిన వృద్ధి ఆధారిత టెక్ కంపెనీలు ఇకపైనా మరింత జోరు చూపనున్నట్లు అజయ్ త్యాగి పేర్కొన్నారు. గత 18 నెలల్లో ఐపీవోల ద్వారా ఈ సంస్థలు రూ. 15,000 కోట్లు సమీకరించినట్లు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్మన్ త్యాగి తెలియజేశారు. ఈ బాటలో ఇకపైన మరో రూ. 30,000 కోట్లు సమకూర్చుకునేందుకు వృద్ధి ఆధారిత టెక్ కంపెనీలు క్యూ కడుతున్నట్లు వెల్లడించారు. ఇటీవల దాఖలైన ప్రాస్పెక్టస్లు ఈ విషయాలను స్పష్టం చేస్తున్నట్లు తెలియజేశారు. దేశీ స్టార్టప్ వ్యవస్థలో యూనికార్న్లుగా ఆవిర్భవిస్తున్న కంపెనీలు పెరుగుతున్నట్లు పేర్కొన్నారు. బిలియన్ డాలర్(సుమారు రూ. 7,400 కోట్లు) విలువను అందుకున్న స్టార్టప్లను యూనికార్న్లుగా వ్యవహరించే సంగతి తెలిసిందే. దేశ ఆర్థిక వ్యవస్థలో పుట్టుకొస్తున్న కొత్త తరం టెక్ కంపెనీలు స్టార్టప్ వ్యవస్థ పటిష్టతకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. పలు కంపెనీలు ప్రత్యేకతలు కలిగిన బిజినెస్ మోడళ్లపై దృష్టిపెడుతున్నాయని చెప్పారు. వెనువెంటనే లాభాలు అందుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వకుండా వేగవంత వృద్ధిని అందుకునే ప్రణాళికలు అమలు చేస్తున్నాయని ప్రశంసించారు. పారిశ్రామిక సమాఖ్య సీఐఐ నిర్వహించిన ఒక సదస్సులో స్టార్టప్లకు సంబంధించి త్యాగి పలు విషయాలను ప్రస్తావించారు. ఈక్విటీకి దన్ను ఇటీవల విజయవంతమైన పబ్లిక్ ఆఫరింగ్స్కుతోడు మరిన్ని కంపెనీలు లిస్టింగ్ బాటలో సాగనుండటంతో ఈక్విటీ మార్కెట్లు మరింత విస్తరించే వీలున్నట్లు త్యాగి పేర్కొన్నారు. టెక్ స్టార్టప్ల నుంచి తొలిసారిగా జొమాటో పబ్లిక్ ఇష్యూకి వచ్చి సక్సెస్ సాధించిన విషయం విదితమే. జొమాటో లిస్టింగ్తో టెక్నాలజీ ఆధారిత స్టార్టప్లు అనేకం సెబీ వద్ద ప్రాస్పెక్టస్లను దాఖలు చేసేందుకు క్యూ కడుతున్నాయి. ఈ జాబితాలో పేటీఎమ్, పాలసీబజార్, మొబిక్విక్, నైకా తదితరాలున్నాయి. కొద్ది కాలంగా ఐపీవో మార్కెట్లో బూమ్ నెలకొన్నట్లు త్యాగి పేర్కొన్నారు. దీంతో 2020–21లో ప్రైమరీ మార్కెట్ ద్వారా రూ. 46,000 కోట్ల పెట్టుబడులు సమకూరిన విషయాన్ని ప్రస్తావించారు. అంతక్రితం ఏడాది సమీకరించిన రూ. 21,000 కోట్లతో పోలిస్తే ఇవి రెట్టింపుకాగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) ఈ స్పీడ్ మరింత పెరగనుంది. తొలి ఐదు నెలల్లో(ఏప్రిల్–ఆగస్ట్)నే దాదాపు గతేడాది సమీకరించిన నిధులను అందుకోవడం గమనార్హం! వెరసి ప్రైమరీ మార్కెట్ చరిత్రలో అత్యధిక పెట్టుబడులను సమకూర్చుకున్న ఏడాదిగా 2022 నిలిచే వీలున్నట్లు త్యాగి పేర్కొన్నారు. మరింత పెరగాలి.. ఐపీవోలకు నిర్ణయించే ధరల శ్రేణి అంశంలో సంస్కరణలు తీసుకువచ్చే యోచనలో ఉన్నట్లు త్యాగి వెల్లడించారు. ప్రస్తుతం ఐపీవో మార్కెట్ ధర నిర్ణయంలో సెకండరీ మార్కెట్తోపోలిస్తే పారదర్శకత తక్కువేనని వ్యాఖ్యానించారు. భారీగా దాఖలయ్యే ఈ డాక్యుమెంట్లలో పలు టెక్నికల్ అంశాల ప్రస్తావన ఉంటుందని, రిటైల్ ఇన్వెస్టర్లు వీటిని చదివి, అర్ధం చేసుకోవడం సవాలేనన్నారు. చదవండి: జొమాటో ప్రస్థానం.. పిజ్జా డెలివరీపై అసంతృప్తితో -
ఆగస్టులో ఐపీవో స్పీడ్ డౌన్
న్యూఢిల్లీ: ఇటీవల కాలంలో దూకుడు చూపుతూ వచ్చిన ప్రైమరీ మార్కెట్ గత నెలలో కొంతమేర మందగించింది. అయితే ఇదే సమయంలో సెకండరీ మార్కెట్లు రేసు గుర్రాల్లా దౌడు తీశాయి. ప్రామాణిక ఇండెక్సులు సెన్సెక్స్, నిఫ్టీ సరికొత్త గరిష్టాలకు చేరడం ద్వారా రికార్డులు నెలకొల్పాయి. ఒక్క ఆగస్ట్ నెలలోనే 9 శాతం పురోగమించాయి. సెన్సెక్స్ 57,000, నిఫ్టీ 17,000 పాయింట్ల మైలురాళ్లను అధిగమించాయి. ఈ జోష్తో 10 కంపెనీలు విజయవంతంగా పబ్లిక్ ఇష్యూలను పూర్తి చేసుకున్నాయి. తద్వారా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యాయి. అయితే లిస్టింగ్లో సగం కంపెనీలు ఇన్వెస్టర్లను నిరాశపరచాయి. వివరాలు ఎలా ఉన్నాయంటే.. స్పందన సైతం గత కేలండర్ ఏడాది(2020)లో అటు ఇన్వెస్టర్ల స్పందనలోనూ.. ఇటు లిస్టింగ్ లాభాల్లోనూ జోరు చూపిన ఐపీవోలు ఈ ఏడాది(2021)లోనూ ఇదే ట్రెండ్ను కొనసాగించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22)ను పరిగణిస్తే ఏప్రిల్ నుంచి 20 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలను చేపట్టాయి. రూ. 45,000 కోట్లను సమీకరించాయి. వీటిలో ఆగస్ట్లోనే 10 కంపెనీలు ఐపీవోలు పూర్తి చేసుకున్నాయి. అయితే గత నెలకల్లా ఐపీవోల స్పీడ్కు బ్రేక్ పడింది. ఇష్యూలకు ఇన్వెస్టర్ల నుంచి ఆసక్తి తగ్గింది. దీంతో ఇష్యూ ధరతో పోలిస్తే సగం కంపెనీలు నీరసంగా లిస్టయ్యాయి. ఇందుకు వెల్లువెత్తుతున్న ఇష్యూలు, నాణ్యమైన ఆఫర్లు కరవుకావడం వంటి అంశాలు కారణమైనట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ తెలియజేశారు. దీనికితోడు మిడ్, స్మాల్ క్యాప్స్లో భారీ ఒడిదొడుకులు నమోదుకావడం ప్రభావం చూపినట్లు విశ్లేషించారు. ఆగస్ట్లో మిడ్ క్యాప్ 3.3 శాతం పుంజుకోగా.. స్మాల్ క్యాప్ 0.5 శాతమే బలపడింది. జాబితా ఇదీ ఆగస్ట్లో గ్లెన్మార్క్ లైఫ్ సైన్సెస్, రోలెక్స్ రింగ్స్, ఎగ్జారో టైల్స్, విండ్లాస్ బయోటెక్, క్రిస్నా డయాగ్నోస్టిక్స్, దేవయాని ఇంటర్నేషనల్, కార్ట్రేడ్ టెక్, నువోకో విస్టాస్ కార్పొరేషన్, కెమ్ప్లాస్ట్ సన్మార్, ఆప్టస్ వేల్యూ హౌసింగ్ ఫైనాన్స్ ఇండియా ఐపీవోలను పూర్తి చేసుకుని లిస్టింగ్ సాధించాయి. వీటిలో ఐదు కంపెనీలే ఇన్వెస్టర్లకు హుషారునిచ్చాయి. దేవయాని ఇంటర్నేషనల్ 37 శాతం, రోలెక్స్ రింగ్స్ 30 శాతం ప్రీమియంతో లిస్టింగ్ను సాధించాయి. ఈ బాటలో ఎగ్జారో టైల్స్ 10 శాతం, గ్లెన్మార్క్ లైఫ్ 4 శాతం లాభాలతో మాత్రమే లిస్టయ్యాయి. ఇక తొలి రోజు క్రిస్నా 4% బలపడింది. నష్టాలతో.. ఇష్యూ ధరతో పోలిస్తే విండ్లాస్ బయోటెక్ 11 శాతం నష్టంతో లిస్టయ్యింది. ఇక కార్ట్రేడ్ టెక్ 8 శాతం, నువోకో విస్టాస్ 7 శాతం డిస్కౌంట్తో నమోదయ్యాయి. కెమ్ప్లాస్ట్ సన్మార్, ఆప్టస్ వేల్యూ ట్రేడింగ్ రోజున 1 శాతం చొప్పున నష్టాలతో ముగిశాయి. కాగా.. గత నెలలో వచ్చిన అన్ని ఐపీవోలు సక్సెస్ అయినప్పటికీ దేవయాని, రోలెక్స్ రింగ్స్కు మాత్రమే భారీ స్పందన లభించడం గమనార్హం! ఐపీవోకు ఈఎస్డీఎస్ సాఫ్ట్వేర్ న్యూఢిల్లీ: క్లౌడ్ సర్వీసులు, డేటా సెంటిర్ల సంస్థ ఈఎస్డీఎస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ పబ్లిక్ ఇష్యూ చేపట్టే యోచనలో ఉంది. తద్వారా రూ. 1,300 కోట్లు సమకూర్చుకోవాలని ప్రణాళికలు వేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇందుకు వీలుగా ఈ నెలలోనే క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్ను దాఖలు చేయనుంది. 2005లో ప్రారంభమైన కంపెనీ క్లౌడ్ సర్వీసులు, డేటా సెంటర్లతోపాటు.. ప్రొడక్ట్ ఆర్అండ్డీ తదితర సేవలు అందిస్తోంది. కస్టమర్లలో చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్, టాటా క్యాపిటల్, డీసీబీ బ్యాంక్, ముత్తూట్ గ్రూప్, యూనియన్ బ్యాంక్ తదితరాలున్నాయి. ఐపీవోకు తొందర లేదు:ఫోన్పే న్యూఢిల్లీ: ఐపీవోకు వెళ్లేందుకు తొందర లేదని ఫోన్పే సీఈవో సమీర్ నిగమ్ స్పష్టం చేశారు. కంపెనీకి అర్ధవంతం, కారణం ఉన్నప్పుడు మాత్రమే వెళ్తామని అన్నారు. ‘కంపెనీ అయిదేళ్ల క్రితం ప్రారంభమైంది. 30 కోట్ల పైచిలుకు కస్టమర్లు ఉన్నారు. ఆర్థిక సేవల్లోకి లోతుగా చొచ్చుకుపోతున్నాం. మ్యూచువల్ ఫండ్స్, బీమా విభాగాల్లో గణనీయమైన పెరుగుదలను ఫోన్పే నమోదు చేసింది. త్వరలో బీటూబీ అకౌంట్ అగ్రిగేటర్సహా ఇతర సేవల్లోకి అడుగు పెడుతున్నాం. పోటీ కంపెనీ ఐపీవోకు వెళితే నేను లెక్క చేయను’ అని తెలిపారు. రూ.7.47 లక్షల కోట్ల విలువైన 394.13 కోట్ల లావాదేవీ లను జూన్ క్వార్టర్లో ఫోన్పే నమోదు చేసింది. -
రూ.16వేల కోట్ల ఐపీఓ,పేటీఎం కొత్త స్ట్రాటజీ!
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపులు, ఆర్థిక సేవల సంస్థ పేటీఎం తమ ఆన్లైన్ పేమెంట్స్ వ్యాపారాన్ని కొత్త అనుబంధ సంస్థకు బదలాయించాలని భావిస్తోంది. పేటీఎం పేమెంట్స్ సర్వీసెస్ లిమిటెడ్కు దీన్ని బదిలీ చేయడానికి షేర్హోల్డర్ల అనుమతి తీసుకునేందుకు సెప్టెంబర్ 23న అసాధారణ సర్వ సభ్య సమావేశం నిర్వహించనుంది. ఇందుకు సంబంధించి షేర్హోల్డర్లకు ఈజీఎం నోటీసు పంపింది. రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేటీఎం తెలిపింది. కొత్త సంస్థ బుక్ వేల్యు సుమారు రూ. 275–350 కోట్లుగా ఉంటుందని, ఈ నిధులను అయిదేళ్ల పాటు వార్షిక చెల్లింపుల కింద మాతృసంస్థ వన్9 కమ్యూనికేషన్స్కు చెల్లించనున్నట్లు వివరించింది. అక్టోబర్లో రూ. 16,600 కోట్ల పబ్లిక్ ఇష్యూకు వచ్చేందుకు పేటీఎం కసరత్తు చేస్తోంది. -
ఐపీఓకి ఓలా,వేల కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంగా సన్నాహాలు
ట్యాక్సీ సేవల దిగ్గజం ఓలా పబ్లిక్ ఇష్యూ యోచనలో ఉంది. ఇందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్ను దాఖలు చేయనుంది. తద్వారా రూ. 7,000–11,000 కోట్ల మధ్య నిధుల సమీకరణ చేపట్టాలని ఓలా మాతృ సంస్ధ ఏఎన్ఐ టెక్నాలజీస్ భావిస్తోంది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం ఇష్యూ నిర్వహణకు సిటీగ్రూప్, కోటక్ మహీంద్రా బ్యాంక్ తదితర ఎంపిక చేసిన సంస్థలతో చర్చలు చేపట్టింది. ఆస్టిన్ జీఐఎస్లో టెక్మహీంద్రా పెట్టుబడులు న్యూఢిల్లీ: ఆస్టిన్ జీఐఎస్లో 13.8 శాతం వాటాను టెక్ మహీంద్రా తన యూఎస్ సబ్సిడరీ (టెక్మహీంద్రా ఐఎన్సీ) రూపంలో కొనుగోలు చేయనుంది. ఇందుకోసం 1.25 మిలియన్ డాలర్లు (రూ.9.37కోట్లు) ఇన్వెస్ట్ చేయనుంది. ఐవోటీ/5జీ విభాగంలో సేవల విస్తరణకు ఈ కొనుగోలు తోడ్పడనుందని కంపెనీ ప్రకటించింది. -
పెరిగిన రిటైల్ ఇన్వెస్టర్ల వాటా, ఐపీవోలు ఖుషీ
ముంబై: కొద్ది నెలలుగా దూకుడు చూపుతున్న ప్రైమరీ మార్కెట్కు ప్రధానంగా రిటైల్ ఇన్వెస్టర్లు దన్నునిస్తున్నారు. దీంతో పలు కంపెనీల పబ్లిక్ ఇష్యూలకు భారీ స్పందన లభిస్తోంది. ఫలితంగా రికార్డు స్థాయిలో కంపెనీలు ఐపీవోలు చేపట్టేం దుకు సెబీ వద్ద క్యూ కడుతున్నాయి. మరోపక్క లిస్టింగ్లోనూ భారీ లాభాలను సాధిస్తుండటంతో ఇటీవల ప్రైమరీ మార్కెట్లు కళకళలాడుతున్నాయి. తొలిసారి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు ఆసక్తి చూపే రిటైల్ ఇన్వెస్టర్లు లక్షల సంఖ్యలో జత కలుస్తున్నారు. ఇది ఎన్ఎస్ఈ లిస్టెడ్ కంపెనీలలో రిటైలర్ల వాటా సరికొత్త గరిష్టాన్ని తాకేందుకు దోహదం చేసింది. జూన్ చివరికల్లా మార్కెట్ల చరిత్రలోనే తొలిసారి రిటైల్ ఇన్వెస్టర్ల వాటా 7.18 శాతానికి ఎగసింది. ప్రైమ్ డేటాబేస్ వివరాల ప్రకారం ఈ వాటా విలువ రూ. 16.18 లక్షల కోట్లు! 40 కొత్త లిస్టింగ్స్ ఈ ఏడాది ఇప్పటివరకూ 40 కంపెనీలు ఐపీవోల ద్వారా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్ను సాధించాయి. తద్వారా రూ. 68,000 కోట్లు సమకూర్చుకున్నాయి. వీటిలో పలు ఇష్యూలకు 100 రెట్లు, ఆపై సబ్స్క్రిప్షన్ లభించడం విశేషం. మరిన్ని కంపెనీలు నిధుల సమీకరణకు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో ఇకపైనా ప్రైమరీ మార్కెట్ మరింత జోరు చూపనుంది. వెరసి మరో రూ. 75,000 కోట్ల విలువైన ఇష్యూలు మార్కెట్లను పలకరించనున్నట్లు నిపుణులు చెబుతున్నారు. దీంతో ఈ ఏడాది 100 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలను పూర్తిచేసుకునే వీలున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇందువల్లనే ఇటీవల ఒక బులెటిన్లో ఆర్బీఐ.. 2021ను ఐపీవో నామసంవత్సరంగా పేర్కొన్నట్లు తెలియజేశారు. చదవండి : దేవుడా..! ఓ మంచి దేవుడా అడగకుండానే అన్ని ఇచ్చావ్ మార్చిలో మహాజోరు ఎన్ఎస్డీఎల్ గణాంకాల ప్రకారం 2020 మార్చిలో 3 కోట్లమంది రిటైల్ ఇన్వెస్టర్లు కొత్తగా డీమ్యాట్ ఖాతాలను తెరిచారు. ఈ బాటలో 2021 జూన్ చివరికల్లా వీటి సంఖ్య 8 కోట్లకు చేరింది. గతేడాది మార్చిలో 35 శాతం పతనమైన మార్కెట్ తదుపరి బౌన్స్బ్యాక్ను సాధించింది. ఈ జనవరిలో 50,000 పాయింట్ల మైలురాయికి చేరిన సెన్సెక్స్ సరికొత్త చరిత్రను లిఖిస్తూ తాజాగా ఇంట్రాడేలో 56,000 పాయింట్ల మార్క్ను అందుకుంది. రిటైల్ స్పీడ్ ఇటీవలే లిస్టయిన దేవయాని ఇంటర్నేషనల్ ఐపీవోకు రిటైలర్ల నుంచి 40 రెట్లు, క్రిస్నా డయాగ్నోస్టిక్స్కు 42 రెట్లు అధికంగా దరఖాస్తులు లభించాయి. ఈ బాటలో చిన్న ఇష్యూ అయిన తత్వ చింతన్కు మరింత అధికంగా 59 రెట్లు ఎక్కువగా బిడ్స్ లభించాయి. అయితే క్లీన్ సైన్స్ టెక్నాలజీకి 9 రెట్లు, భారీ ఇష్యూ జొమాటోకు 7.5 రెట్లు అధికంగా మాత్రమే రిటైలర్లు దరఖాస్తు చేయడం గమనార్హం! ప్రీమియంతో.. కొత్త రిటైల్ ఇన్వెస్టర్లు మార్కెట్లోకి డైరెక్టుగా ప్రవేశిస్తున్నట్లు ట్రస్ట్ప్లస్ వెల్త్ సీఈవో సమీర్ కౌల్ తెలియజేశారు. ఇందువల్లనే ఇటీవల పలు ఐపీవోలు భారీగా సక్సెస్ అవుతున్నట్లు వివరించారు. గ్లెన్మార్క్ లైఫ్ సైన్స్ ఇష్యూకి 3.9 మిలియన్ దరఖాస్తులు లభించాయి. దీంతో గతంలో 4.2 మిలియన్లతో రికార్డు నెలకొల్పిన రిలయన్స్ పవర్ తదుపరి నిలిచింది. అయితే ఆర్పవర్కు రిటైల్ విభాగంలో 83 రెట్లు స్పందన లభించగా.. గ్లెన్మార్క్ 15 రెట్లు మాత్రమే సాధించింది. భారీ లిక్విడిటీ పరిస్థితులు ఇందుకు దోహదం చేస్తున్నట్లు ఐఐఎఫ్ఎల్ వెల్త్ ఈక్విటీ బ్రోకింగ్ హెడ్ అరుణ్ జైన్ తెలియజేశారు. డిమాండ్, సరఫరా మధ్య వ్యత్యాసం కారణంగా పలు కంపెనీలు భారీ లాభాలతో లిస్టవుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ప్రధానంగా తత్వ చింతన్, జొమా టో, జీఆర్ ఇన్ఫ్రా 97–78 శాతం మధ్య ప్రీమియంతో లిస్టయిన విషయాన్ని ప్రస్తావించారు. -
అప్పుడు సూపర్ హిట్, ఇప్పుడు జొమాటోకు పెరిగిన నష్టాలు
న్యూఢిల్లీ: ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ జొమాటో లిమిటెడ్ ఈ ఏడాది(2021–22) తొలి క్వార్టర్లో నిరుత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర నష్టం మూడు రెట్లుపైగా ఎగసి రూ. 361 కోట్లకు చేరింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 100 కోట్ల నష్టం మాత్రమే ప్రకటించింది. అయితే మొత్తం ఆదాయం రూ. 266 కోట్ల నుంచి రూ. 844 కోట్లకు జంప్చేసింది. ఇక మొత్తం వ్యయాలు సైతం రూ. 383 కోట్ల నుంచి రూ. 1,260 కోట్లకు పెరిగాయి. ఈ క్యూ1లో గ్రోఫర్స్ ఇండియా లో 9.25%, హ్యాండ్స్ఆన్ ట్రేడ్స్ ప్రైవేట్ లిమిటెడ్లో 9.27% చొప్పున వాటాల కొనుగోలుకి తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందుకు గ్రోఫర్స్ ఇండియా ప్రయివేట్, హ్యాండ్స్ఆన్ ట్రేడ్స్ ప్రైవేట్, గ్రోఫర్స్ ఇంటర్నేషనల్ తదితరాలతో డీల్ కుదుర్చుకున్నట్లు జొమాటో వెల్లడించింది. ఫలితాల నేపథ్యంలో జొమాటో షేరు ఎన్ఎస్ఈలో 4.3 శాతం పతనమై రూ. 125 వద్ద ముగిసింది. కాగా, ఇటీవల ఐపీవో లిస్టింగ్ లో జొమాటో సూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఎవరూ ఊహించని విధంగా జొమాటో ఐపీఓలో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు మొగ్గుచూపడంతో .. సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.లక్ష కోట్ల మార్కును టచ్ చేసి సరికొత్త రికార్డ్ లను క్రియేట్ చేసింది. సబ్స్క్రిప్షన్స్ సైతం గత 13 ఏళ్లల్లో రూ.5,000 కన్నా ఎక్కువగా వచ్చిన ఐపీఓల్లో 38.25 రెట్లు సబ్స్క్రైబ్ అయిన మొదటి ఐపీఓ జొమాటో నిలిచింది. కానీ క్యూ1 ఫలితాల్లో జొమాటో ఆశించిన స్థాయిలో లాభాలు రాబట్టుకోలేకపోయింది. నికర నష్టం మూడు రెట్లుపైగా ఎగసి రూ. 361 కోట్లకు చేరడంపై ఇన్వెస్టర్లు, అటు మార్కెట్ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: బ్యాంకులకు ఆర్బీఐ భారీ షాక్, ఆ ఏటీఎంలలో డబ్బులు లేకుంటే ఫైన్ -
దేవుడా.! ఓ మంచి దేవుడా అడగకుండానే వేల కోట్లు ఇచ్చావ్
దేవుడా..! ఓ మంచి దేవుడా అడగకుండానే అన్ని ఇచ్చావ్. వేలకోట్ల ఆస్తి ఇచ్చావ్. వారెన్ బఫ్ఫెట్ ఆఫ్ ఇండియాను చేశావ్. ఇప్పుడు నేను అడగకుండా ఇచ్చే ధనం వద్దు.. నేను దానం చేసే గుణం ఇవ్వు' అని కోరుకుంటున్నారు. రాకేశ్ జున్జున్వాలా పరిచయం అక్కర్లేని పేరు. దలాల్ స్ట్రీట్ లో ఆయన పట్టిందల్లా బంగారమే. తండ్రి దగ్గర అరువుగా తీసుకున్న రూ. 5000లతో బాంబే స్టాక్ మార్కెట్లో అడుగుపెట్టి 36 ఏళ్లలోనే 34 వేల కోట్లు సంపాదించాడు. అయితే ఇప్పుడు ఆయన సంపాదించిన ఆస్తిలో కొద్ది మొత్తాన్ని దానం చేసేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల ప్రముఖ ఫైనాన్షియల్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..నేను ఇప్పుడు దేవుడిని సంపదను ఇవ్వమని కోరుకోవడం లేదు. కానీ సంపాదించిన ఆస్తిని దానం చేసే గుణాన్ని ఇవ్వమని వేడుకుంటున్నా. అన్ని సహకరిస్తే త్వరలో రూ.400 నుంచి రూ.500కోట్ల క్యాపిటల్ ఫండ్ తో ఎన్జీఓని ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. అంతేకాదు కరోనా కారణంగా దేశంలో తలెత్తిన ఆర్ధిక మాద్యంపై స్పందించారు. గతంలో తలెత్తిన ఆర్ధిక సంక్షోభం కంటే .. కరోనా సృష్టించిన ఆర్ధిక సంక్షోభం పెద్దది కాదని, రాబోయే రోజుల్లో దేశ ఆర్ధిక వ్యవస్థ 10శాతం పుంజుకుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఐపీఓకి స్టార్ హెల్త్ ఇన్స్యూరెన్స్ రాకేశ్ జున్జున్వాలా స్టార్ హెల్త్లో వాటాదారులుగా ఉన్నారు. చెన్నైకి చెందిన వి.జగన్నాథన్ యూనైటెడ్ ఇండియా ఇన్స్యూరెన్స్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. అయితే 2006లో వి.జగన్నాథన్ చెన్నైలో స్టార్ హెల్త్ ఇన్స్యూరెన్స్ను ప్రారంభించి మెడిక్లయిమ్,యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్తో అనతికాలంలో ప్రజాదారణ పొందారు. దీంతో బిగ్ బుల్ రాకేశ్ 2018 ఆగస్ట్ నెలలో వెస్ట్బ్రిడ్జ్ క్యాపిటల్, మాడిసన్ క్యాపిటల్ తో కలిసి స్టార్ హెల్త్ ఇన్స్యూరెన్స్ 90 శాతం వాటాను కొనుగోలు చేశారు. ప్రస్తుతం పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) కోసం దరఖాస్తు దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ.2,000 కోట్ల విలువ చేసే తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. చదవండి: హింట్ ఇచ్చేసిందిగా, ఇండియన్ రోడ్లపై టెస్లా చక్కర్లు -
దూకుడుమీదున్న మార్కెట్లు, ఐపీఓ బాటలో మొబిక్విక్
న్యూఢిల్లీ: కొద్ది నెలలుగా ప్రైమరీ మార్కెట్లు చూపుతున్న దూకుడు నేపథ్యంలో తాజాగా డిజిటల్ చెల్లింపుల స్టార్టప్ వన్ మొబిక్విక్ సిస్టమ్స్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుమతించమంటూ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. తద్వారా రూ. 1,900 కోట్లు సమకూర్చుకోవాలని భావిస్తోంది. -
జొమాటోకు సెబీ గ్రీన్సిగ్నల్
న్యూఢిల్లీ: పుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ జొమాటో పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు తాజాగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఐపీవో ద్వారా రూ. 8,250 కోట్ల సమీకరణకు అనుమతించమంటూ ఏప్రిల్లోనే జొమాటో సెబీకి ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ.7,500 కోట్ల విలువైన ఈక్విటీని కంపెనీ తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా ఇన్ఫో ఎడ్జ్ ఇండియా మరో రూ.750 కోట్ల విలువైన్ షేర్లను ఆఫర్ చేయనుంది. ఈక్విటీ జారీ ద్వారా సమీకరించనున్న నిధులను కంపేనీల కొనుగోళ్లు, విస్తరణ, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్లో జోమటో పేర్కొంది. కొత్త కాలంగా ఆన్లైన్ పుడ్ డెలివరీ సంస్థలు భారీ స్థాయిలో పురోగమిస్తున్న విషయం విదితమే. వెరసి 2019-20లో జొమాటో ఆదాయం రెట్టింపునకు ఎగసి 89.4 కోట్ల డాలర్లు(రూ. 2900కోట్టు)ను తాకింది. అయితే రూ. 2,200 కోట్ల నిర్వహణ(ఇబిటా) నష్టాలు నమోదయ్యాయి. కాగా ఈ ఫిబ్రవరిలో టైగర్ గ్లోబల్స్ కోరా తదితర ఇన్వెస్ట్మెంట్ సంస్థల నుంచి 25 కోట్ల డాలర్లు(రూ.1800 కోట్లు) సమీకరించింది. దీంతో జొమాటో విలువ 5.4 బిలియన్ డాలర్లకు చేరింది. -
ఐపీఓకి మరో మూడు కంపెనీలు, కళకళలాడుతున్న మార్కెట్లు
న్యూఢిల్లీ: సెకండరీ మార్కెట్ల జోరుతో గత కొంత కాలంగా పలు కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు క్యూ కడుతున్నాయి. దీంతో ఇటీవల ప్రైమరీ మార్కెట్లు సైతం కళకళలాడుతున్నాయి. తాజాగా మరో మూడు కంపెనీలు ఇన్వెస్టర్లను పలుకరించనున్నాయి. ఇందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి తాజాగా అనుమతిని పొందాయి. ఈ జాబితాలో క్లీన్సైన్స్ అండ్ టెక్నాలజీ, శ్రీరామ్ ప్రాపర్టీస్, జీఆర్ ఇన్ఫ్రాప్రాజెక్ట్స్ చేరాయి. వివరాలు ఇలా.. పబ్లిక్ ఇష్యూకి అనుమతించమంటూ ఏప్రిల్లోనే మూడు కంపెనీలు సెబీకి ప్రాస్పెక్టస్లను దాఖలు చేశాయి. స్పెషాలిటీ కెమికల్స్ తయారీ సంస్థ క్లీన్సైన్స్కు ఈ నెల 12న, రియల్టీ సంస్థ శ్రీరామ్ ప్రాపర్టీస్కు 15న, మౌలిక సదుపాయాల కంపెనీ జీఆర్ ఇన్ఫ్రాకు 16న సెబీ దాదాపు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. కాగా.. ఐపీవో ద్వారా క్లీన్సైన్స్ రూ. 1,400 కోట్ల సమీకరణకు ప్రణాళికలు వేసింది. ఆఫర్లో భాగంగా ప్రమోటర్లు, కంపెనీలో ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన సంస్థలు, వాటాదారులు ఈక్విటీని విక్రయించనున్నారు. పెర్ఫార్మెన్స్, ఎఫ్ఎంసీజీ కెమికల్స్, ఫార్మాస్యూటికల్ ఇంటర్మీడియెట్స్ తదితరాలను రూపొందిస్తోంది. రూ. 800 కోట్లకు సై పబ్లిక్ ఇష్యూ ద్వారా బెంగళూరు సంస్థ శ్రీరామ్ ప్రాపర్టీస్ రూ. 800 కోట్లను సమకూర్చుకోవాలని చూస్తోంది. ఇష్యూలో భాగంగా కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన సంస్థలు రూ. 550 కోట్ల ఈక్విటీని విక్రయానికి ఉంచనున్నాయి. దీనికి అదనంగా రూ. 250 కోట్ల విలువైన షేర్లను కంపెనీ తాజాగా జారీ చేయనుంది. జాబితాలో టీపీజీ క్యాపిటల్, టాటా క్యాపిటల్, వాల్టన్ స్ట్రీట్ క్యాపిటల్ తదితర సంస్థలున్నాయి. కంపెనీ ఈక్విటీలో 58 శాతం వా టా వరకూ కలిగి ఉన్నాయి. దీంతో ఐపీవో నిధుల లో ప్రధాన భాగం పెట్టుబడి సంస్థలకు చేరనున్నా యి. షేర్ల జారీ నిధులను రుణ చెల్లింపులు, కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. కంపెనీ ప్ర ధానంగా దక్షిణాదిలో పలు ప్రాజెక్టులు చేపట్టింది. రూ. 1,000 కోట్ల అంచనా ఉదయ్పూర్ ఈపీసీ కంపెనీ జీఆర్ ఇన్ఫ్రాప్రాజెక్ట్స్ ఐపీవో ద్వారా రూ. 800–1,000 కోట్లు సమీకరించాలని ప్రణాళికలు వేసింది. ఆఫర్లో భాగంగా ప్రమోటర్లు, కంపెనీలో ఇన్వెస్ట్చేసిన సంస్థలు 1.15 కోట్ల షేర్లకుపైగా విక్రయానికి ఉంచనున్నాయి. వాటాలు విక్రయించనున్న సంస్థలలో లోకేష్ బిల్డర్స్, జాసమ్రిత్ ప్రెమిసెస్, ఫ్యాషన్స్, క్రియేషన్స్, ఇండియా బిజినెస్ ఎక్సలెంట్ ఫండ్ తదితరాలున్నాయి. జాతీయ రహదారి ప్రాజెక్టులు చేపట్టే ఈ సంస్థ ఇటీవల రైల్వే రంగ ప్రాజెక్టులలోకీ ప్రవేశించింది. చదవండి: ఇండియన్ బ్యాంక్ షేర్ల అమ్మకం,రూ.4వేల కోట్లు సమీకరణే లక్ష్యం -
2020: ఐపీవో నామ సంవత్సరం
ముంబై, సాక్షి: ఈ కేలండర్ ఏడాది(2020)ని ఐపీవో నామ సంవత్సరంగా పేర్కొనవచ్చునంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. ఈ ఏడాది ఇప్పటివరకూ 15 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలను చేపట్టాయి. తద్వారా రూ. 30,000 కోట్లకుపైగా సమీకరించాయి. 2019లో ప్రైమరీ మార్కెట్ ద్వారా కంపెనీలు సమకూర్చుకున్న నిధులు రూ. 20,300 కోట్లు. వీటితో పోలిస్తే ప్రస్తుత ఏడాది ఇప్పటికే 50 శాతానికిపైగా ఫండ్స్ను కంపెనీలు సమీకరించగలిగాయి. అంతేకాకుండా 14 కంపెనీలూ ప్రస్తుతం ఐపీవో ధరలతో పోలిస్తే లాభాలతో ట్రేడవుతుండటం విశేషం! వెరసి 2020ను ఐపీవో ఏడాదిగా నిపుణులు పేర్కొంటున్నారు. నిజానికి కోవిడ్-19 సంక్షోభం నుంచి మార్కెట్లు ఫీనిక్స్లా పుంజుకోవడం విశేషమని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. మార్చి కనిష్టాల నుంచి ఎన్ఎస్ఈ నిఫ్టీ 79 శాతం దూసుకెళ్లడం విశేషం! కాగా.. కొత్త సంవత్సరం(2021)లోనూ ప్రైమరీ మార్కెట్ ఇదేవిధంగా కళకళలాడే వీలున్నట్లు కొటక్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ భావిస్తోంది. ఇందుకు ప్రధానంగా బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూని చేపట్టనుండటాన్ని ప్రస్తావిస్తోంది. కొత్త ఏడాదిలో ఐపీవోకు రాగల కంపెనీలలో కళ్యాణ్ జ్యువెలర్స్(రూ. 1750 కోట్లు), ఇండిగో పెయింట్స్(రూ. 1,000 కోట్లు), స్టవ్ క్రాఫ్ట్, సంహి హోటల్స్, ఏజీజే సురేంద్ర పార్క్ హోటల్స్, జొమాటో తదితరాలున్నాయి. ఎల్ఐసీకాకుండా 30 కంపెనీలు సుమారు రూ. 30,000 కోట్లను సమీకరించే ప్రణాళికల్లో ఉన్నాయి. ఎల్ఐసీ భారీ ఇష్యూకావడంతో రూ. 50,000 కోట్లకు మించి నిధుల సమీకరణకు వీలున్నట్లు కొటక్ ఇన్వెస్ట్మెంట్ అంచనా వేస్తోంది. (వచ్చే వారం మార్కెట్ల పయనమెటు?) బెక్టర్స్ ఫుడ్ రికార్డ్ ఈ ఏడాది 15వ కంపెనీగా గురువారమే ఐపీవో పూర్తిచేసుకున్న బెర్టర్స్ ఫుడ్ గత ఐదేళ్లలోలేని విధంగా 198 రెట్లు అధిక బిడ్స్ను పొందింది. ఇంతక్రితం 2018లో అపోలో మైక్రోసిస్టమ్స్ మాత్రమే ఇంతకంటే అధికంగా 248 రెట్లు అధిక సబ్స్క్రిప్షన్ను సాధించింది. వెరసి బెక్టర్స్ ఫుడ్ రెండో ర్యాంకులో నిలిచింది. ఇక ట్రేడింగ్ ప్రారంభం రోజు లాభాలకు వస్తే.. కెమ్కాన్ స్పెషాలిటీ కెమికల్స్ రెట్టింపునకుపైగా లాభంతో రూ. 731 వద్ద లిస్టయ్యింది. ఐపీవో ధర రూ. 340 మాత్రమే. ఇదేవిధంగా హ్యాపియెస్ట్ మైండ్స్ ఐపీవో ధర రూ. 166కాగా.. రూ. 351 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. ఈ బాటలో రూ. 350 ధరలో ఐపీవోకు వచ్చిన రూట్ మొబైల్ రూ. 708 వద్ద లిస్టయ్యింది. బర్గర్ కింగ్ పబ్లిక్ ఇష్యూ ధర రూ. 60కాగా.. 115 వద్ద లిస్టయ్యింది. రోజారీ బయోటెక్ ఐపీవో ధర రూ. 425తో పోలిస్తే రూ. 670 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. కాగా.. ఈ ఏడాది 16వ కంపెనీగా వచ్చే వారం నుంచీ ఆంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్ సెల్ పబ్లిక్ ఇష్యూ ప్రారంభంకానుంది. (బెక్టర్స్ ఫుడ్ విజయం వెనుక మహిళ) వెనకడుగులో ఈ ఏడాది ఐపీవోకు వచ్చిన కంపెనీలలో ఇష్యూ ధర కంటే దిగువన లిస్టయిన కంపెనీల జాబితా చూస్తే.. ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, యూటీఐ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ, ఏంజెల్ బ్రోకింగ్, ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్స్ చోటు చేసుకున్నాయి. కాగా.. ప్రస్తుతం ఈ కంపెనీలన్నీ లాభాల బాట పట్టడం గమనార్హం. ఇక ఐపీవో ధరను మించి లాభాలతో లిస్టయిన కంపెనీలలో బర్గర్ కింగ్, గ్లాండ్ ఫార్మా, లిఖిత ఫైనాన్స్, మజ్గావ్ డాక్ షిప్బిల్డర్స్, కంప్యూటర్ ఏజ్ మేనేజ్మెంట్, కెమ్కాన్ స్పెషాలిటీ, రూట్ మొబైల్, హ్యాపియెస్ట్ మైండ్స్, మైండ్స్పేస్ బిజినెస్ పార్క్స్, రోజారీ బయోటెక్ నిలుస్తున్నాయి. -
ఆంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్.. ఐపీవోకు రెడీ
ముంబై, సాక్షి: కొద్ది రోజులుగా ప్రైమరీ మార్కెట్ కళకళలాడుతుండటంతో తాజాగా మరో కంపెనీ ఐపీవో బాట పట్టింది. మునిసిపల్ సోలిడ్ వేస్ట్(ఎంఎస్డబ్ల్యూ) విభాగంలో కార్యకలాపాలు కలిగిన ఆంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. సోమవారం(21) నుంచి ప్రారంభంకానున్న ఇష్యూ బుధవారం(23న) ముగియనుంది. ఇష్యూకి ధరల శ్రేణి రూ. 313-315కాగా.. తద్వారా రూ. 300 కోట్లు సమకూర్చుకోవాలని భావిస్తోంది. దీనిలో భాగంగా రూ. 85 కోట్ల విలువైన షేర్లను తాజాగా జారీ చేయనుంది. 47 షేర్లు ఒక లాట్గా నిర్ణయించింది. ఫలితంగా రిటైల్ ఇన్వెస్టర్లు ఇదే పరిమాణంలో రూ. 2 లక్షల విలువకు మించకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. (బెక్టర్స్ ఫుడ్ విజయం వెనుక మహిళ) రూ. 90 కోట్లు ఇష్యూలో భాగంగా ఆంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్ యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 90 కోట్లను సమీకరించింది. టాటా ఏఐజీ జనరల్, మసాచుసెట్స్ టెక్నాలజీ, 238 ప్లాన్ అసోసియేట్స్, ఎస్బీఐ ఫండ్ తదితర 10 సంస్థలు ఇన్వెస్ట్ చేశాయి. షేరుకి రూ. 315 ధరలో 28.57 లక్షలకుపైగా షేర్లను ఈ సంస్థలకు ఆంటోనే కేటాయించింది. కంపెనీ ఇంతక్రితం ఈ ఏడాది మార్చిలో ఐపీవోకు సన్నాహాలు చేసుకున్నప్పటకీ కోవిడ్-19 కారణంగా మార్కెట్లు నీరసించడంతో వెనకడుగు వేసింది. ఐపీవో నిధులను అనుబంధ సంస్థల ద్వారా పీసీఎంసీ WTE ప్రాజెక్టుకు, రుణ చెల్లింపులకు, సాధారణ కార్పొరేట్ అవసరాలకూ వినియోగించనున్నట్లు ప్రాస్పక్టస్లో పేర్కొంది. కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన మారిషస్కు చెందిన లీడ్స్, టామ్బ్రిడ్జ్, క్యామ్బ్రిడ్జ్, గిల్డ్ఫోర్డ్ పబ్లిక్ ఇష్యూలో వాటాలు విక్రయించనున్నాయి. (30 రోజుల్లో 100 శాతం లాభాలు) కంపెనీ బ్యాక్గ్రౌండ్ వేస్ట్ మేనేజ్మెంట్ సర్వీసెస్ రంగంలో దేశీయంగా గల ఐదు టాప్ కంపెనీలలో ఒకటి ఆంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్ సెల్. మూడు రకాల ప్రాజెక్టులను చేపడుతోంది. మునిసిపల్ సోలిడ్ వేస్ట్, సీఅండ్టీ ప్రాజెక్ట్స్, ఎంఎస్డబ్ల్యూ ప్రాసెసింగ్ ప్రాజెక్టులను నిర్వహిస్తోంది. ప్రధానంగా ఎంఎస్డబ్ల్యూ సర్వీసులలో పూర్తిస్థాయి సేవలను అందిస్తున్నట్లు కంపెనీ చెబుతోంది. వీటిలో సోలిడ్ వేస్ట్ కలెక్షన్, రవాణా, ప్రాసెసింగ్, డిస్పోజల్ సర్వీసులున్నట్లు తెలియజేసింది. మునిసిపాలిటీలకు అత్యధికంగా సర్వీసులు అందిస్తున్నట్లు పేర్కొంది. ల్యాండ్ ఫిల్ నిర్మాణం, నిర్వహణ విభాగంలోనూ కార్యకలాపాలను విస్తరించింది. ఎంఎస్డబ్ల్యూ ఆధారిత డబ్ల్యూటీఈ సర్వీసుల్లో పట్టు సాధించింది. ప్రస్తుతం నవీముంబై, థానే, ఉత్తర ఢిల్లీ, మంగళూరు మునిసిపల్ తదితర 25 ప్రాజెక్టులను చేపట్టింది. 18 ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. వీటిలో 12 ప్రాజెక్టులు ఎంఎస్డబ్ల్యూ సీఅండ్టీ విభాగంలోనివే. 1147 వాహనాలను కలిగి ఉంది. 969 వాహనాలకు జీపీఎస్ను అనుసంధానించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్థభాగంలో రూ. 207 కోట్ల ఆదాయం, రూ. 29 కోట్ల నికర లాభం ఆర్జించింది. కుటుంబ సభ్యులు, ప్రమోటర్లకు 24.73 శాతం వాటా ఉంది. -
బర్గర్ కింగ్ ఐపీవో ధర రూ. 59-60
న్యూఢిల్లీ, సాక్షి: అంతర్జాతీయ ఫాస్ట్ఫుడ్(QSR) చైన్ల దిగ్గజం బర్గర్ కింగ్ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. డిసెంబర్ 2న(బుధవారం) ప్రారంభంకానున్న ఇష్యూ 4న(శుక్రవారం) ముగియనుంది. ఐపీవోకు ధరల శ్రేణి రూ. 59-60. ఇష్యూలో భాగంగా ప్రమోటర్ సంస్థ క్యూఎస్ఆర్ ఏసియా పీటీఈ 6 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచుతోంది. వీటికి జతగా మరో రూ. 450 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. తద్వారా రూ. 810 కోట్లను సమకూర్చుకోవాలని భావిస్తోంది. ఇష్యూ నిధులను బర్గర్ కింగ్ రెస్టారెంట్స్ పేరుతో కొత్త కంపెనీ ఏర్పాటుకు వినియోగించనున్నట్లు మాతృ సంస్థ ప్రాస్పెక్టస్లో పేర్కొంది. అంతేకాకుండా సాధారణ కార్పొరేట్ అవసరాలకూ వినియోగించనుంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 250 షేర్లకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇంతకంటే అధికంగా కావాలనుకుంటే ఇదే గుణిజాల్లో రూ. 2 లక్షల విలువ మించకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. కంపెనీ బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్ట్ కానుంది. ఐదేళ్లలో.. గ్లోబల్ క్యూఎస్ఆర్ చైన్ సంస్థ బర్గర్ కింగ్ దేశీయంగా ఐదేళ్లక్రితం ఏర్పాటైంది. ఈ ఐదేళ్లలో రెస్టారెంట్ల ఏర్పాటురీత్యా వేగంగా వృద్ధి చెందుతూ వచ్చింది. మాస్టర్ ఫ్రాంచైజీ ఒప్పందాల ద్వారా బర్గర్ కింగ్ బ్రాండును దేశీయంగా విస్తరిస్తోంది. అంతర్జాతీయంగా బర్గర్ బ్రాండ్లలో నెట్వర్క్ రీత్యా ఈ కంపెనీ రెండో ర్యాంకులో నిలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 18,000 రెస్టారెంట్లు కలిగి ఉంది. 2020 సెప్టెంబర్కల్లా దేశీయంగా 261 రెస్టారెంట్లను ఏర్పాటు చేసింది. ఫ్రాంచైజీలతో కలిపి దేశవ్యాప్తంగా 57 పట్టణాలలో విస్తరించింది. 2017లో రూ. 233 కోట్లుగా నమోదైన ఆదాయం 2019కల్లా రూ. 633 కోట్లకు జంప్చేసింది. ఇదే సమయంలో నష్టాలు రూ. 72 కోట్ల నుంచి రూ. 38 కోట్లకు తగ్గాయి. కాగా.. దేశీయంగా లిస్టయిన ప్రత్యర్ధి సంస్థ జూబిలెంట్ ఫుడ్వర్క్స్ స్థాయిలో బర్గర్ కింగ్కు ప్రీమియం విలువ లభించకపోవచ్చని ఏంజెల్ బ్రోకింగ్ సహచర ఈక్విటీ విశ్లేషకులు కేశవ్ లహోటీ ఐపీవో సందర్భంగా అంచనా వేశారు. జూబిలెంట్.. లాభాలు సాధిస్తున్నకంపెనీ కావడంతోపాటు పిజ్జా బ్రాండు దేశీయంగా వినియోగదారులను బాగా ఆకట్టుకుంటున్నట్లు అభిప్రాయపడ్డారు. -
ఐపీవోలకు తొందరపడుతున్న కంపెనీలు
ముంబై: ఇటీవల భారీ లాభాలతో్ దూసుకెళుతున్న దేశీ స్టాక్ మార్కెట్లు పలు కంపెనీలను ఆకర్షిస్తున్నాయి. దీంతో పబ్లిక్ ఇష్యూల ద్వారా నిధులు సమీకరించేందుకు ఆసక్తిని ప్రదర్శిస్తున్నాయి. తద్వారా స్టాక్ ఎక్స్ఛేంజీలలో మెరుగైన లిస్టింగ్ను సాధించాలని చూస్తున్నట్లు మార్కెట్ వర్గాలు తెలియజేశాయి. ఐపీవోలు చేపట్టేందుకు ఇటీవల పలు కంపెనీలు సెబీవద్ద ప్రాస్పెక్టస్ను దాఖలు చేశాయి. జాబితాలో రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, బర్గర్ కింగ్, బ్రూక్ఫీల్డ్ ఇండియా ఆర్ఈఐటీ, హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ కంపెనీ, కళ్యాణ్ జ్యువెలర్స్ తదితరాలున్నాయి. పలు కంపెనీలకు మార్కెట్ల నియంత్రణ సంస్థ నుంచి అనుమతులు లభించడంతో రానున్న ఆరు వారాల్లోగా ఐపీవో మార్కెట్ జోరందుకునే వీలున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. బుధవారమే(11న) చైనీస్ మాతృ సంస్థ ఫోజన్ ఫార్మాకు చెందిన గ్లాండ్ ఫార్మా పబ్లిక్ ఇష్యూ ముగిసిన విషయం విదితమే. భారీ ర్యాలీ ఈ నెలలో మార్కెట్ల ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ ఏకంగా 10 శాతం ర్యాలీ చేసింది. ఇందుకు కేవలం 8 ట్రేడింగ్ సెషన్లు మాత్రమే తీసుకోవడం విశేషం. ఇటీవల మార్కెట్లు జోరు చూపడంతో మార్చి కనిష్టాల నుంచి 70 శాతం పురోగమించింది. అమెరికాలో జో బైడెన్ విజయం సాధించడం, ఫైజర్ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ కోవిడ్-19 కట్టడిలో సఫలమైనట్లు వెలువడిన వార్తలు ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటుకు బలాన్నిచ్చాయి. వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు అమలు చేస్తున్న సహాయక ప్యాకేజీలు, చౌక వడ్డీ రేట్ల కారణంగా లిక్విడిటీ భారీగా పెరిగింది. ప్రధానంగా ఇటీవల దేశీ స్టాక్స్లో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) భారీగా ఇన్వెస్ట్ చేస్తుండటం ప్రభావాన్ని చూపుతున్నట్లు నిపుణులు తెలియజేశారు. ఈ నెలలో ఇప్పటివరకూ ఎఫ్పీఐలు నగదు విభాగంలోనే రూ. 20,000 కోట్లకుపైగా విలువైన స్టాక్స్ కొనుగోలు చేయడం గమనార్హం! మరోవైపు ఆర్థిక వ్యవస్థ రికవరీ బాట పట్టిన సంకేతాలు సైతం ఇన్వెస్టర్లకు హుషారునిస్తున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. వెరసి సెప్టెంబర్లోనే 8 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలు చేపట్టాయి! -
ఇకపై కన్జూమర్ గూడ్స్, సిమెంట్ స్పీడ్
కేంద్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాలు, గ్రామీణ గృహ నిర్మాణంపై దృష్టి పెట్టడంతో కన్జూమర్ డ్యురబుల్స్, సిమెంట్ రంగాలకు డిమాండ్ పెరిగే వీలున్నట్లు ఒక ఇంటర్వ్యూలో ఏంజెల్ బ్రోకింగ్ ఈక్విటీ వ్యూహకర్త జ్యోతి రాయ్ పేర్కొన్నారు. ఇంకా మార్కెట్లు, ఐపీవోలు, కంపెనీలపట్ల పలు అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వివరాలు చూద్దాం.. మార్కెట్లు బలపడొచ్చు మార్కెట్లు తగ్గినప్పుడల్లా కొనుగోళ్లు చేపట్టవచ్చని భావిస్తున్నాం. గత నెలలో తయారీ రంగ పీఎంఐ 2012 జనవరి తదుపరి 56.8కు చేరింది. ఇది ఆర్థిక రికవరీని సూచిస్తోంది. ప్రభుత్వం అన్లాక్లో భాగంగా పలు నిబంధనలు సడలించడంతో కొద్ది నెలలపాటు సెంటిమెంటు బలపడే వీలుంది. అయితే ఆర్థిక వ్యవస్థను తిరిగి ఓపెన్ చేయడం ద్వారా కోవిడ్-19 కేసులు పెరిగే వీలుంది. ఇదే విధంగా కోవిడ్-19 కట్టడికి వ్యాక్సిన్ ఆలస్యంకావచ్చు. యూఎస్ ప్రభుత్వం సహాయక ప్యాకేజీపై వెనకడుగు వేయవచ్చు. ఇలాంటి అంశాలు మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపే వీలుంది. ఐపీవోల జోరు గత మూడు నెలల్లోనే 10 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలు చేపట్టాయి. దీంతో రానున్న కాలంలో ప్రైమరీ మార్కెట్ వెలుగులో నిలవనుంది. ఇందుకు జోరుమీదున్న స్టాక్ మార్కెట్లు సహకరించనున్నాయి. ఇటీవల ర్యాలీ బాటలో సాగుతున్న స్పెషాలిటీ కెమికల్స్ రంగం స్వల్ప కాలంలో అంత జోరు చూపకపోవచ్చు. పలు కంపెనీల షేర్ల ధరలు భారీగా లాభపడటమే దీనికి కారణం. అయితే దీర్ఘకాలంలో ఈ రంగంపట్ల సానుకూలంగా ఉన్నాం. ఈ రంగంలో అతుల్, పీఐ ఇండస్ట్రీస్, గలాక్సీ సర్ఫక్టాంట్స్ను పరిశీలించవచ్చు. క్యూ2పై అంచనాలు ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై- సెప్టెంబర్)లో ఆటో, సిమెంట్, ఐటీ, ఫార్మా, కెమికల్స్ రంగాలు పటిష్ట పనితీరు చూపే అవకాశముంది. వివిధ కంపెనీలు ప్రకటించే భవిష్యత్ ఆర్జన అంచనాలపై ఇన్వెస్టర్లు దృష్టి సారించే వీలుంది. ప్రస్తుతం పండుగల సీజన్ కారణంగా స్వల్ప కాలంలో డిమాండ్ పుంజుకోవచ్చు. -
ఏంజెల్ బ్రోకింగ్.. వీక్ లిస్టింగ్
దేశంలో నాలుగో పెద్ద బ్రోకింగ్ సేవల కంపెనీ ఏంజెల్ బ్రోకింగ్.. ఇన్వెస్టర్లను నిరాశపరుస్తూ స్టాక్ ఎక్స్ఛేంజీలలో డిస్కౌంట్లో లిస్టయ్యింది. ఐపీవో ధర రూ. 306తో పోలిస్తే ఎన్ఎస్ఈలో 10 శాతం నష్టంతో రూ. 275 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. తదుపరి రూ. 297 వద్ద గరిష్టాన్ని తాకగా.. రూ. 257 వద్ద కనిష్టానికీ చేరింది. ప్రస్తుతం రూ. 17 నష్టంతో రూ. 289 వద్ద కదులుతోంది. రూ. 600 కోట్లు గత నెల 24న ముగిసిన పబ్లిక్ ఇష్యూలో భాగంగా ఏంజెల్ బ్రోకింగ్ యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 180 కోట్లు సమకూర్చుకుంది. షేరుకి రూ. 306 ధరలో 58.8 లక్షల షేర్లను 12 సంస్థలకు కేటాయింంచింది. ఏంజెల్ బ్రోకింగ్లో ఇన్వెస్ట్ చేసిన యాంకర్ సంస్థలలో గోల్డ్మన్ శాక్స్ ఇండియా, మెక్వారీ ఫండ్ సొల్యూషన్స్, ఇన్వెస్కో ట్రస్టీ, మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ తదితరాలున్నాయి. వెరసి ఐపీవో ద్వారా రూ. 600 కోట్లు సమకూర్చుకుంది. బ్యాక్గ్రౌండ్.. టెక్నాలజీ ఆధారిత ఫైనాన్షియల్ సర్వీసులను ఏంజెల్ బ్రోకింగ్ అందిస్తోంది. ప్రధానంగా బ్రోకింగ్, అడ్వయజరీ, మార్జిన్ ఫండింగ్, షేర్ల తనఖాపై రుణాలు తదితరాలను క్లయింట్లకు సమకూర్చుతోంది. 7.7 లక్షల మంది యాక్టివ్ కస్టమర్లను కలిగి ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. 6.3 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. క్లయింట్ల రీత్యా దేశంలోనే నాలుగో పెద్ద బ్రోకింగ్ సంస్థగా ఏంజెల్ నిలుస్తోంది. జూన్కల్లా కంపెనీ నెట్వర్త్ రూ. 639 కోట్లను అధిగమించింది. ఏంజెల్ బ్రోకింగ్.. ఈ ఏడాది అంటే 2020లో పబ్లిక్ ఇష్యూకి వచ్చిన 8వ కంపెనీ కావడం గమనార్హం! -
హ్యాపీయెస్ట్ మైండ్స్ ఐపీవో.. భలే రెస్పాన్స్
డిజిటల్ టెక్నాలజీ ఆధారిత సాఫ్ట్వేర్ సేవలందించే హ్యాపీయెస్ట్ మైండ్స్ పబ్లిక్ ఇష్యూ నేడు(9న) ముగియనుంది. సోమవారం ప్రారంభమైన ఇష్యూ నేటి మధ్యాహ్నానికల్లా 34 రెట్లు అధికంగా సబ్స్క్రయిబ్ అయ్యింది. ఇష్యూలో భాగంగా 2.3 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా.. 79.44 కోట్ల షేర్లకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. రిటైల్ విభాగంలో 50 రెట్లు, సంపన్న వర్గాల నుంచి 80 రెట్లు అధికంగా స్పందన లభించగా.. అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి 6 రెట్లు అధికంగా సబ్స్క్రిప్షన్ లభించింది. ఇతర వివరాలు.. హ్యాపీయెస్ట్ మైండ్స్ ఇష్యూకి ధరల శ్రేణి రూ. 165-166కాగా.. రూ. 702 కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. షేరు ముఖ విలువ రూ. 2కాగా.. రిటైల్ ఇన్వెస్టర్లకు ఒక్కో లాట్ 90 షేర్లుగా నిర్ణయించారు. ఇంతకంటే అధికంగా కావాలనుకుంటే.. రూ. 2 లక్షలకు మించకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇష్యూలో భాగంగా కంపెనీ తొలినాళ్లలో ఇన్వెస్ట్ చేసిన జేపీ మోర్గాన్ ఇన్వెస్ట్మెంట్కు చెందిన సీఎండీబీ-2 తమకున్న 19.4 శాతం వాటా(2.72 కోట్ల షేర్లకుపైగా) విక్రయించనుంది. ప్రమోటర్ అశోక్ సూతా 84.14 లక్షల షేర్లను విక్రయించనున్నారు. ఐటీ సర్వీసుల రంగం నుంచి ఇంతక్రితం 2016లో ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ పబ్లిక్ ఇష్యూ చేపట్టిన విషయం విదితమే. యాంకర్ నిధులు ఐపీవోలో భాగంగా హ్యాపీయెస్ట్ మైండ్స్.. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 316 కోట్లను సమీకరించింది. షేరుకి రూ. 166 ధరలో 1.9 కోట్ల షేర్లను జారీ చేసింది. సింగపూర్ సావరిన్ వెల్త్ ఫండ్, జీఐసీ పీటీఈ, ఎవెండస్ క్యాపిటల్, ఐఐఎఫ్ఎల్ అసెట్ మేనేజ్మెంట్ తదితర 25 సంస్థలు ఇన్వెస్ట్ చేశాయి. కాగా.. హ్యాపీయెస్ట్ మైండ్స్ ఇష్యూకి అనధికార(గ్రే) మార్కెట్లో 50 శాతం ప్రీమియం పలుకుతున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. బ్యాక్గ్రౌండ్.. దేశీ సాఫ్ట్వేర్ రంగంలో అత్యంత అనుభవశాలి అయిన అశోక్ సూతా 2011లో హ్యాపీయెస్ట్ మైండ్స్ను ఏర్పాటు చేశారు. 2000లో పబ్లిక్ ఇష్యూకి వచ్చిన సాఫ్ట్వేర్ సేవల మధ్యస్థాయి కంపెనీ మైండ్ట్రీకి సైతం సూతా సహవ్యవస్థాపకుడుగా వ్యవహరించారు. ఐటీ దిగ్గజం విప్రోలో 1984-99 మధ్య కాలంలో పలు హోదాలలో సేవలందించారు. క్లౌడ్, సెక్యూరిటీ, అనలిటిక్స్ విభాగాలలో సాఫ్ట్వేర్ సేవలు అందిస్తున్న హ్యాపీయెస్ట్ మైండ్స్ గత ఆర్థిక సంవత్సరం(2019-20)లో రూ. 714 కోట్ల ఆదాయం ఆర్జించింది. గత మూడేళ్లలో సగటున 20.8 శాతం వార్షిక వృద్ధిని సాధించింది. డిజిటల్ టెక్నాలజీస్ ద్వారానే 97 శాతం ఆదాయం ఆర్జిస్తున్నట్లు సూతా పేర్కొన్నారు. డిజిటల్ బిజినెస్ సర్వీసెస్, ప్రొడక్ట్ ఇంజినీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ అండ్ సెక్యూరిటీ సర్వీసుల పేరుతో మూడు ప్రధాన విభాగాలను కంపెనీ నిర్వహిస్తోంది. -
హ్యాపియెస్ట్ మైండ్ ఐపీఓ ఈ నెల 7 నుంచి...
సాక్షి, న్యూఢిల్లీ: ఐటీ సేవల కంపెనీ హ్యాపియెస్ట్ మైండ్స్ టెక్నాలజీస్ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) ఈ నెల 7 నుంచి మొదలు కానున్నది. ఈ నెల 9వ తేదీన ముగిసే ఈ ఐపీఓకు ప్రైస్బ్యాండ్ను రూ.165–166 గా కంపెనీ నిర్ణయించింది. ఐపీఓలో భాగంగా రూ.110 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీ చేస్తారు. వీటితో పాటు ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) కింద 3.56 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయిస్తారు. మొత్తం మీద ఐపీఓ సైజు రూ.750–800 కోట్ల రేంజ్లో ఉంటుందని అంచనా. కనీసం 90 ఈక్విటీ షేర్లకు (మార్కెట్ లాట్) దరఖాస్తు చేయాలి. ఈ నెల 17వ తేదీన స్టాక్ మార్కెట్లో ఈ కంపెనీ షేర్లు లిస్టవుతాయి. ఈ ఐపీఓకు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా ఐసీఐసీఐ సెక్యూరిటీస్, నొముర ఫైనాన్షియల్ అడ్వైజరీ అండ్ సెక్యూరిటీస్(ఇండియా) వ్యవహరిస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరం రూ.714 కోట్ల ఆదాయం ఆర్జించామని, కంపెనీలో 2,600 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని కంపెనీ తెలిపింది. చదవండి: ఒప్పో ఎఫ్ 17 సిరీస్ స్మార్ట్ ఫోన్లు లాంచ్ -
సోమవారం నుంచి మైండ్స్పేస్ రీట్ ఐపీవో
కె.రహేజా గ్రూప్నకు చెందిన కంపెనీ మైండ్స్పేస్ బిజినెస్ పార్క్స్ ఆర్ఈఐటీ(రీట్) పబ్లిక్ ఇష్యూ ఈ నెల 27న ప్రారంభమై 29న ముగియనుంది. ఇష్యూ ధర రూ. 274-275కాగా.. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 200 యూనిట్లకు బిడ్స్ దాఖలు చేయవలసి ఉంటుంది. యూనిట్లను బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో లిస్ట్చేయనుంది. ఇష్యూ ద్వారా రూ. 4,500 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. పబ్లిక్ ఇష్యూలో భాగంగా ఇప్పటికే మైండ్స్పేస్లో ఇన్వెస్ట్ చేసిన సంస్థలు రూ. 3,500 కోట్ల విలువైన యూనిట్లను విక్రయానికి ఉంచగా.. మరో రూ. 1,000 కోట్ల విలువైన యూనిట్లను కంపెనీ తాజాగా జారీ చేయనుంది. 2019 మార్చిలో ఎంబసీ ఆఫీస్ పార్క్స్ తదుపరి వస్తున్న రెండో రీట్ ఇష్యూ ఇది. ఎంబసీ ఆఫీస్ రీట్ ద్వారా రూ. 4,750 కోట్లు సమీకరించిన విషయం విదితమే. 75 శాతం ఐపీవోలో భాగంగా సంస్థాగత ఇన్వెస్టర్లకు 75 శాతం(9.2 కోట్ల యూనిట్లు), సంపన్న వర్గాలు, రిటైలర్లకు మిగిలిన 25 శాతం(3.07 కోట్ల యూనిట్లు) చొప్పున విక్రయించనున్నట్లు ఆఫర్ డాక్యుమెంట్లో మైండ్స్పేస్ బిజినెస్ తెలియజేసింది. కాగా.. వ్యూహాత్మక సంస్థలు, యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి తాజాగా రూ. 2,644 కోట్లు సమీకరించింది. ఒక్కో యూనిట్ను రూ. 275 ధరలో యూనిట్లను జారీ చేసింది. ఇన్వెస్ట్ చేసిన సంస్థలలో సింగపూర్ సావరిన్ ఫండ్ జీఐసీ, ఫిడిలిటీ గ్రూప్, క్యాపిటల్ గ్రూప్ తదితరాలున్నాయి. దీంతో ఐపీవో యూనిట్లలో 58.74 శాతాన్ని విక్రయించినట్లయ్యింది. ఫలితంగా ఐపీవో ద్వారా మిగిలిన రూ. 1856 కోట్లు సమీకరించనున్నట్లు తెలుస్తోంది. బ్యాక్గ్రౌండ్ మైండ్స్పేస్ బిజినెస్ పార్క్స్ ఏర్పాటులో ప్రమోటర్లు రహేజా గ్రూప్తోపాటు పీఈ దిగ్గజం బ్లాక్స్టోన్ సైతం ఇన్వెస్ట్ చేసింది. కాగా.. ఐపీవో నిధులను రుణ చెల్లింపులు, కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్లో పేర్కొంది. సెబీ వద్ద రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ సంస్థగా రిజిస్టర్ అయిన మైండ్స్పేస్ బిజినెస్ పార్క్స్.. మొత్తం 295 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ ప్రాపర్టీలను కలిగి ఉంది. మరో 28 లక్షల చదరపు అడుగులను అభివృద్ధి చేస్తోంది. ముంబై, పుణే, చెన్నై, హైదరాబాద్లలో రియల్టీ ఆస్తులను నిర్వహిస్తోంది. కంపెనీ పోర్ట్ఫోలియో, ఫెసిలిటీ మేనేజ్మెంట్ విభాగాల మార్కెట్ విలువను 2020 మార్చికల్లా రూ. 23,675 కోట్లుగా మదింపు చేసినట్లు ప్రాస్పెక్టస్లో తెలియజేసింది. కంపెనీ ప్రధానంగా లీజుల(అద్దెలు) రూపంలో ఆదాయాన్ని పొందుతుంటుంది. యూనిట్ హొల్డర్లకు డివిడెండ్ల రూపంలో ఆదాయం లభిస్తుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
రోజారీ బయోటెక్ ఐపీవోకు యాంకర్ నిధులు
కోవిడ్-19 సవాళ్ల నేపథ్యంలోనూ ఐపీవోకు వస్తున్న రోజారీ బయోటెక్ తాజాగా యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి నిధులు సమీకరించింది. వారాంతాన 15 యాంకర్ ఇన్వెస్టర్ సంస్థలకు 35 లక్షలకుపైగా షేర్లు కేటాయించడం ద్వారా రూ. 149 కోట్లు సమకూర్చుకుంది. అబుదభి ఇన్వెస్ట్మెంట్, హెచ్డీఎఫ్సీ ఎంఎఫ్, యాక్సిస్ ఎంఎఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఎంఎఫ్, ఎస్బీఐ ఎంఎఫ్, సుందరం ఎంఎఫ్, గోల్డ్మన్ శాక్స్ తదితర సంస్థలు షేరుకి రూ. 425 ధరలో ఇన్వెస్ట్ చేశాయి. రూ. 2 ముఖ విలువతో వస్తున్న రోజారీ బయోటెక్ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 13న(సోమవారం) ప్రారంభమై 15న(బుధవారం) ముగియనుంది. ఇష్యూకి ధరల శ్రేణి షేరుకి రూ. 423-425. గ్లాండ్ ఫార్మా సైతం మార్చి 16న ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్స్ స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయ్యాక పబ్లిక్ ఇష్యూలు నిలిచిపోయాయని విశ్లేషకులు పేర్కొన్నారు. అయితే రోజారీ బయోటెక్ ఇందుకు తిరిగి శ్రీకారం చుడుతోంది. కాగా.. హెల్త్కేర్ రంగ కంపెనీ గ్లాండ్ ఫార్మా సైతం తాజాగా ఐపీవో ప్రణాళికలు ప్రకటించింది. రూ. 6,000 కోట్ల సమీకరణకు అనుమతించమంటూ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి దరఖాస్తు చేసింది. కోవిడ్-19 కారణంగా ఇటీవల పలు కంపెనీలు ఐపీవోలు చేపట్టేందుకు వెనుకాడుతున్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఐపీవో ద్వారా ఎస్బీఐ కార్డ్స్ రూ. 10,000 కోట్లు సమీకరించిన విషయం విదితమే. 35 షేర్లకు. పబ్లిక్ ఇష్యూ ద్వారా రోజారీ బయోటెక్ రూ. 494-496 కోట్లు సమీకరించాలని ఆశిస్తోంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 35 షేర్లకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇంతకంటే అధికంగా కావాలనుకుంటే రూ. 2 లక్షల విలువ మించకుండా ఏకమొత్తంగా దరఖాస్తు చేయవచ్చు. ఐపీవో నిధులను ప్రధానంగా రుణ చెల్లింపులతోపాటు.. వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు వినియోగించనున్నట్లు కంపెనీ ప్రాస్పెక్టస్లో పేర్కొంది. ఇష్యూలో భాగంగా 1.05 కోట్ల షేర్లతోపాటు తాజాగా రూ. 50 కోట్ల విలువైన ఈక్విటీని జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇష్యూ విజయవంతంగా పూర్తయితే.. ఈ నెల(జులై) 23కల్లా రోజారీ బయోటెక్ స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయ్యే వీలున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. 3 విభాగాలలో రోజారీ బయోటెక్ ప్రధానంగా మూడు విభాగాలలో కార్యకలాపాలు విస్తరించింది. గృహ పరిశుభ్రత, వ్యక్తిగత సంరక్షణ(హోమ్, పెర్సనల్ కేర్) ప్రొడక్టులతోపాటు.. పెర్ఫార్మెన్స్ కెమికల్స్నూ తయారు చేస్తోంది. టెక్స్టైల్ స్పెషాలిటీ కెమికల్స్ను రూపొందిస్తోంది. అంతేకాకుండా జంతు సంరక్షణ, బలవర్ధక ఉత్పత్తులు(యానిమల్ హెల్త్, న్యూట్రిషన్ ప్రొడక్ట్స్)ను తయారు చేస్తోంది. కంపెనీ ఉత్పత్తులను సబ్బులు, డిటర్జెంట్లు, పెయింట్లు, టైల్స్, పేపర్, టెక్స్టైల్స్ తదితర రంగాలలో వినియోగిస్తున్నట్లు పరిశ్రమవర్గాలు వివరించాయి. కంపెనీకి హెచ్యూఎల్, ఐఎఫ్బీ ఇండస్ట్రీస్, అరవింద్ తదితర దిగ్గజ కంపెనీలు కీలక కస్టమర్లుగా నిలుస్తున్నాయి. అయితే కంపెనీ కార్యకలాపాలు కలిగిన రంగాలలో ఆర్తి ఇండస్ట్రీస్, గలాక్సీ సర్ఫెక్టాంట్స్, వినతీ ఆర్గానిక్స్ తదితర లిస్టెడ్ కంపెనీలు ప్రధాన ప్రత్యర్దులుగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. 2020లో ఇలా గతేడాది(2019-20)లో రోజారీ బయోటెక్ రూ. 604 కోట్ల ఆదాయం సాధించింది. ఇబిటా రూ. 104 కోట్లను అధిగమించగా.. నికర లాభం రూ. 65 కోట్లను తాకింది. కంపెనీ ఉత్పత్తులను గృహ, వ్యక్తిగత సంరక్షణ ప్రొడక్టుల తయారీలో వినియోగిస్తున్నందున నిత్యావసర కేటగిరీలోకి చేరుతుందని యాక్సిస్ క్యాపిటల్ పేర్కొంది. దీంతో సిల్వస్సాలోని ప్లాంటు కోవిడ్-19 లాక్డవున్లోనూ తయారీని కొనసాగించినట్లు తెలియజేసింది. -
స్టెర్లింగ్ విల్సన్ - 8 రోజుల్లో 45% అప్
ఇటీవల ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్న సోలార్ విద్యుత్ ప్రాజెక్టుల ఈపీసీ కంపెనీ స్టెర్లింగ్ అండ్ విల్సన్ సోలార్ కౌంటర్కు డిమాండ్ కొనసాగుతోంది. దీంతో ఎన్ఎస్ఈలో ఈ షేరు ప్రస్తుతం 5 శాతం అప్పర్ సర్క్యూట్ను తాకి రూ. 230 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 215 ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. గత 8 రోజుల్లో ఈ కౌంటర్ 44 శాతం ర్యాలీ చేయడం గమనార్హం! షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ కంపెనీ ఈ షేరు 2019 ఆగస్ట్లో లిస్టయ్యింది. షేరుకి రూ. 780 ధరలో పబ్లిక్ ఇష్యూ చేపట్టడం ద్వారా రూ. 3100 కోట్లు సమీకరించింది. ఇన్వెస్టర్ల రక్షణ నిమిత్తం స్టాక్ ఎక్స్ఛేంజీలు ఏర్పాటు చేసిన ఏఎస్ఎంలో భాగంగా ఈ కౌంటర్కు 5 శాతం సర్క్యూట్ బ్రేకర్ను విధించినట్లు నిపుణులు పేర్కొన్నారు. రూ. 750 కోట్ల ప్రాజెక్ట్ యూఎస్ అనుబంధ సంస్థ ద్వారా అమెరికాలో అతిపెద్ద సోలార్ ప్రాజెక్ట్ ఏర్పాటుకు కాంట్రాక్ట్ పొందినట్లు గత వారాంతాన స్టెర్లింగ్ అండ్ విల్సన్ సోలార్ వెల్లడించింది. 9.9 కోట్ల డాలర్ల( దాదాపు రూ. 750 కోట్లు) విలువైన ఈ ఆర్డర్లో భాగంగా 194 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టును ఏర్పాటు చేయవలసి ఉన్నట్లు కంపెనీ తెలియజేసింది. 2020 నవంబర్ నుంచి ఏడాది కాలంలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయవలసి ఉన్నట్లు వివరించింది. కాగా.. 2020 మార్చికల్లా కంపెనీ ఆర్డర్బుక్ విలువ వార్షిక ప్రాతిపదికన 15 శాతం పుంజుకుని రూ. 9048 కోట్లకు చేరింది. -
చుక్ చుక్ బండి.. దుమ్మురేపింది!
ఐఆర్సీటీసీ: 4 నెలలు... 5 రెట్లు ఐఆర్సీటీసీ... భారతీయ రైల్వేకు చెందిన ఈ కంపెనీ షేరు జోరైన లాభాలతో దూసుకుపోతోంది. గత ఏడాది అక్టోబర్లో స్టాక్ మార్కెట్లో అరంగేట్రం చేసిన ఈ షేర్... ఇన్వెస్టర్లకు కళ్లు చెదిరే లాభాలను పంచింది. నాలుగు నెలల్లోనే ఐదు రెట్లు పెరిగింది. ఈ కంపెనీ ఐపీఓకు వచ్చినప్పుడూ, లిస్టింగ్లోనూ, ఆ తర్వాత ట్రేడింగ్లోనూ రికార్డ్ల మీద రికార్డ్లు సృష్టిస్తూ సాగిపోతోంది. ఈ రికార్డ్లకు, లాభాల పరుగుకు కారణాలు, షేరు భవిష్యత్తుపై నిపుణుల అంచనాలు తదితర విశేషాలు సాక్షి బిజినెస్ పాఠకుల కోసం... ప్రస్తుతం ఐఆర్సీటీసీ(ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) 4 విభాగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఆన్లైన్లో టికెట్లు విక్రయించడం, రైల్వే కేటరింగ్ సర్వీసులు నిర్వహించడం, టూరిజం సర్వీసులు నిర్వహణ, రైల్ నీర్ బ్రాండ్ కింద ప్యాకేజ్డ్ వాటర్ను విక్రయించడం. టూరిజం సర్వీసులు కాకుండా మిగిలిన మూడు విభాగాల్లో ఈ కంపెనీదే గుత్తాధిపత్యం. ఇక రైల్వేయేతర కేటరింగ్ సర్వీసులు, ఈ–కేటరింగ్, బడ్జెట్ హోటళ్ల రంగంలోకి కూడా విస్తరిస్తోంది. ఈ బుధవారమే ఈ కంపెనీ క్యూ3 ఫలితాలను వెల్లడించింది. నికర లాభం మూడు రెట్లు ఎగసి రూ.206 కోట్లకు చేరగా, మొత్తం ఆదాయం 62 శాతం వృద్ధితో రూ.454 కోట్లకు చేరింది. ఒక్కో షేర్కు రూ.10 డివిడెండ్ను ఇవ్వనుంది. దీనికి రికార్డ్ డేట్గా ఈ నెల 25ను నిర్ణయించింది. ఆర్థిక ఫలితాలు అదరగొట్టడంతో ఐఆర్సీటీసీ షేర్ జోరుగా పెరిగింది. గురువారం ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.1,609ను తాకింది. చివరకు 11% లాభంతో రూ.1,580 వద్ద ముగిసింది. ఇష్యూ ధరతో పోలిస్తే ఐఆర్సీటీసీ షేర్ ధర 400 శాతం పెరగ్గా, ఈ కాలంలో సెన్సెక్స్ 9 శాతమే లాభపడింది. ఐపీఓ... అదిరిపోయే ఆరంభం... గత ఏడాది సెప్టెంబర్ 30, అక్టోబర్ 3ల మధ్య వచ్చిన ఐఆర్సీటీసీ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) 112 రెట్లు ఓవర్ సబ్స్క్రైబయింది. ఇప్పటివరకూ ఒక ప్రభుత్వ రంగ సంస్థ ఐపీఓ ఈ స్థాయిలో ఓవర్ సబ్స్క్రైబ్ కావడం ఇదే మొదటిసారి. రూ.320 ఇష్యూ ధరతో ఐపీఓకు వచ్చిన ఈ కంపెనీ షేరు దాదాపు రెట్టింపు ధరకు రూ.626 వద్ద అక్టోబర్ 14న స్టాక్ మార్కెట్లో లిస్టయింది. లిస్టింగ్ రోజునే రూ.744 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకి రూ.729 వద్ద ముగిసింది. లిస్టింగ్లోనూ ఈ షేర్ రికార్డ్లే సృష్టించింది. ఒక ప్రభుత్వ రంగ సంస్థకు ఈ స్థాయిలో లిస్టింగ్ లాభాలు రావడం కూడా ఇదే మొదటిసారి. ఐపీఓలో షేర్లు దక్కని వాళ్లు జోరుగా ఈ షేర్లు కొన్నారు. ఆ ఒక్కరోజే రూ.3,500 కోట్ల షేర్లు చేతులు మారాయి. ఇటీవల కాలంలో మంచి లాభాలు గడించిన ఐపీఓ ఇదే. 23వ స్థానం...: అత్యంత విలువైన ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రస్తుతం ఈ కంపెనీ 23వ స్థానంలో ఉంది. మార్కెట్ క్యాప్ రూ.25,279 కోట్లు. స్టాక్ మార్కెట్లో అరంగేట్రం చేసినప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి టాప్50లో కూడా ఈ షేర్ లేదు. ఇప్పుడు ఆయిల్ ఇండియా, భెల్, భారత్ ఎలక్ట్రానిక్స్, న్యూ ఇండియా ఎష్యూరెన్స్ కంపెనీలను దాటేసింది. తేజస్తో మరింత దూకుడు.. ఈ కంపెనీ తొలి తేజస్ రైలును లక్నో– ఢిల్లీ మార్గంలో ప్రవేశపెట్టింది. ఈ ఏడాది జనవరి 16న రెండో తేజస్ రైలును అహ్మదాబాద్ – ముంబై సెంట్రల్కు ప్రారంభించింది. ఆ రోజే ఈ షేర్ నాలుగంకెల ధరకు చేరింది. ఇక మూడో తేజస్ రైలును త్వరలోనే ఇండోర్– వారణాసి మధ్య నడిపించనుంది. తేజస్ రైళ్ల దూకుడుతో ఈ షేర్ ధర మరింత జోరుగా పెరగనుంది. షేరు ధర ఎందుకు పెరుగుతోందంటే.. ఈ కంపెనీ బిజినెస్ మోడల్ వినూత్నంగా ఉండటం వల్ల షేర్ విలువ మదింపు చేయడం కొంచెం కష్టమేనన్నది నిపుణుల మాట. ఆన్లైన్ టికెట్ల విక్రయం, రైల్వే కేటరింగ్ సర్వీసుల్లో గుత్తాధిపత్యం ఈ కంపెనీదే. అసెట్– లైట్ బిజినెస్ మోడల్ను అనుసరిస్తున్న ఈ కంపెనీ ఫ్లోటింగ్ షేర్లు (ట్రేడింగ్కు అందుబాటులో ఉన్న షేర్ల సంఖ్య) చాలా తక్కువగా ఉండటం వల్ల డిమాండ్ అంతకంతకూ పెరుగుతోంది. ధర కూడా పెరిగిపోతూనే ఉంది. ఇటీవలే కేటరింగ్ ఉత్పత్తుల ధరలను పెంచింది. మార్జిన్లు అధికంగా ఉండే తేజస్ రైళ్లను మూడు రూట్లలో నడుపుతోంది. మరిన్ని తేజస్ రైళ్లను తెచ్చే యోచనలో ఉంది. బిజినెస్ మోడల్ నిలకడగా ఉండటం, డివిడెండ్ చెల్లింపులు బాగుండటం (గత మూడేళ్లలో సగటున 50% డివిడెండ్ ఇచ్చింది), రూ.1,100 కోట్ల మేర పుష్కలంగా నగదు నిల్వలు.. ఇవన్నీ సానుకూలాంశాలు. దీర్ఘకాలిక ఇన్వెస్ట్మెంట్స్కు ఉత్తమ షేరుగా విశ్లేషకులు చెబుతున్నారు. మూడేళ్లలో అమ్మకాలు 23%, లాభం 49% చొప్పున చక్రగతిన వృద్ధి చెందగలవని అంచనా. బహుపరాక్.. ఈ షేర్ ధర జోరుగా పెరుగుతోంది. అయితే డెలివరి అయ్యే షేర్ల నిష్పత్తి 11–13 శాతమే ఉంది. డే ట్రేడింగ్ బాగా జరుగుతోందనడానికి ఇది నిదర్శనమన్నది నిపుణుల మాట. మొమెంటమ్ గేమ్ ఆడాలనుకుంటే ఇన్వెస్టర్ల చేతులు కాలవచ్చని వారు హెచ్చరిస్తున్నారు. మరోవైపు కంపెనీ వేల్యుయేషన్లు భారీగా పెరిగాయని, కంపెనీ షేరు ధర ఈపీఎస్కు 80 రెట్ల వద్ద ట్రేడవుతోందని, ఒకింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇంటర్నెట్ ఆధారిత కార్యకలాపాలు నిర్వహించే ప్రైవేట్ కంపెనీలకు ఈ విలువ సమంజసమైనదే. అయితే ఒక ప్రభుత్వ రంగ కంపెనీకి మాత్రం ఈ విలువ చాలా అధికమన్నది వారి విశ్లేషణ. అధిక వేల్యుయేషన్లు ఉండటంతోపాటు, భవిష్యత్తులో ఈ కంపెనీలో మరోవిడత వాటా విక్రయానికి కూడా అవకాశం ఉందని, ఈ రెండూ ప్రతికూలాంశాలని వారంటున్నారు. అయితే మరింత వాటా విక్రయానికి మరో ఏడాది సమయం ఉంది. -
ఐపీవోకు క్యూ కట్టిన మూడు డజన్ల కంపెనీలు
న్యూఢిల్లీ: ఐపీవో మార్కెట్ మరోసారి వేడెక్కబోతోంది. ఏకంగా మూడు డజన్ల కంపెనీలు ప్రజల నుంచి రూ.35,000 కోట్ల మేర నిధుల సమీకరణకు సిద్ధంగా ఉన్నాయి. వ్యాపార, ప్రాజెక్టుల విస్తరణ, మూలధన అవసరాల కోసం ప్రధానంగా ఎక్కవ కంపెనీలు ఐపీవోకు రానున్నట్టు సెబీ వద్ద దాఖలు చేసిన పత్రాల ఆధారంగా తెలుస్తోంది. వీటిలో ప్రభుత్వరంగం నుంచి ఆరు కంపెనీలు కూడా ఉండడం గమనార్హం. అవి ఇండియన్ రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ, రైల్ వికాస్ నిగమ్, ఇర్కాన్ ఇంటర్నేషనల్, రైట్స్, గార్డెన్ రీచ్ షిప్బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్, మజ్గాన్ డాక్. స్టాక్ ఎక్సేంజ్లలో లిస్ట్ చేయడం ద్వారా బ్రాండ్ విలువను పెంచుకోవడం, వాటాదారులకు లిక్విడిటీని పెంచడం ఐపీవో ఉద్దేశ్యంగా తెలుస్తోంది. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా చెప్పుకోతగ్గ స్థాయిలో నిధుల సమీకరణ ఉంటుందని, మార్కెట్లో రుణాల లభ్యత తక్కువగా ఉండడం, అన్ని రంగాల్లో నిధుల వినియోగం మెరుగుపడడం కారణాలుగా ఈక్విరస్ క్యాపిటల్ డైరెక్టర్ మునిష్ అగర్వాల్ పేర్కొన్నారు. ఇక, ఇప్పటికే ఐపీవోకు సెబీ నుంచి అనుమతి సంపాదించిన కంపెనీల్లో బార్బెక్యూ నేషన్ హాస్పిటాలిటీ, టీసీఎన్ఎస్ క్లాథింగ్ కంపెనీ, నజారా టెక్నాలజీస్, దేవీ సీఫుడ్స్ సహా డజను కంపెనీలున్నాయి. రూట్ మొబైల్, క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ్, సెంబ్కార్ప్ ఎనర్జీ ఇండియా, ఫ్లెమింగో ట్రావెల్ రిటైల్, లోధా డెవలపర్స్ సెబీ అనుమతి కోసం వేచి చూస్తున్నాయి. ఇవన్నీ కలసి సుమారు రూ.35,000 కోట్లు సమీకరించాలనుకుంటున్నాయి. గతేడాది 36 కంపెనీలు ఐపీవో ద్వారా సుమారు రూ.67,000 కోట్లకు పైగా నిధుల్ని సమీకరించాయి. -
ఈ ఏడాది జోరుగా ఐపీఓ మార్కెట్
న్యూఢిల్లీ: భారత ఐపీఓ మార్కెట్ ఈ ఏడాది జోరుగా ఉంది. ఈ ఏడాది 83 కంపెనీలు ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) ద్వారా 380 కోట్ల డాలర్ల నిధులు సమీకరించాయి. ఇన్వెస్టర్ల విశ్వాసం అధికంగా ఉండడం, నిబంధనల్లో సంస్కరణల కారణంగా ఈ ఏడాది ఐపీఓ మార్కెట్ జోరుగా ఉందని ఎర్నస్ట్ అండ్ యంగ్(ఈవై) తాజా నివేదిక పేర్కొంది. మదుపు వాతావరణంలో మార్పులు కొనసాగుతుండడం, జీఎస్టీ అమలుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు, సానుకూల రాజకీయ పరిస్థితులు, ఆర్థిక సెంటిమెంట్ బలపడడం, వ్యాపార విశ్వాసం మెరుగుపడడం, ద్రవ్యోల్బణ ఒత్తిడులు తగ్గడం, విదేశీప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం నిలకడగా ఉండడం.. వీటన్నింటి ఫలితంగా వచ్చే ఏడాది ఐపీఓ మార్కెట్ మరింత జోరుగా ఉండనున్నదని ఈ నివేదిక వివరించింది. ఈవై గ్లోబల్ ఐపీఓ ట్రెండ్స్: 2016 (క్యూ4) పేరుతో ఎర్నస్ట్ యంగ్ రూపొందించిన నివేదిక ప్రకారం.. ఈ ఏడాది అక్టోబర్–డిసెంబర్ క్వార్టర్లో ఐపీఓల పనితీరు జోరుగా ఉంది. అంతర్జాతీయంగా చూస్తే, ఐపీఓ మార్కెట్ సమస్యాత్మకంగానే ఉంది. రాజకీయ, ఆర్థిక అనితులే దీనికి కారణం. ఫలితంగా ఈ ఏడాది ఇప్పటివరకూ ఐపీఓల సంఖ్య 16 శాతం తగ్గి 1,055కు పడిపోయింది. ఈ ఐపీఓల ద్వారా సమీకరించిన నిధులు గత ఏడాది నిధులతో పోల్చితే 33 శాతం తగ్గి 13,250 కోట్ల డాలర్లకు పడిపోయాయి. రంగాల వారీగా చూస్తే, పారిశ్రామిక, టెక్నాలజీ, ఫార్మా రంగాల్లో అత్యధికంగా ఐపీఓలు వచ్చాయి. -
పబ్లిక్ ఇష్యూలు ఊరిస్తాయ్..!
• ప్రాస్పెక్టస్ చూశాకే పెట్టుబడి పెట్టాలి • రికమండేషన్లపై ఆధారపడితే అంతే గతి • రిస్కుల నుంచి అప్పుల వరకూ అన్నీ ప్రాస్పెక్టస్లో • ఐపీవో రంగు తేల్చటానికి కొన్ని అంశాలు చాలు.. • ధర సహేతుకమా? భవిష్యత్తు బంగారమేనా? కూడా చెప్పొచ్చు ఐపీవో మార్కెట్ మంచి జోరుమీద ఉంది. పేరున్న కంపెనీ, వినూత్న వ్యాపారంతో కూడిన కంపెనీ ఇష్యూ అయితే ఇన్వెస్టర్ల నుంచి ఎన్నో రెట్ల స్పందన ఉంటోంది. లిస్టింగ్తోనే మదుపరులను మురిపించి స్వల్ప కాలంలోనే మంచి రిటర్నులందించిన ఐపీవోలు గత రెండేళ్లలో రెండంకెల స్థాయిలో ఉన్నాయి కూడా. కాకపోతే అదే సమయంలో ఇన్వెస్టర్లను నష్టాల పాల్జేసిన ఇష్యూలూ ఉన్నాయ్. నిజానికి ఏ కంపెనీ ఐపీవోకైనా దరఖాస్తు చేసే ముందు... చాలా అంశాలు చూడాలి. ఇవన్నీ వదిలేసి రికమండేషన్లపై ఆధారపడడం అన్ని వేళలా మంచిది కాదు. అందుకే... ఐపీవో నుంచి మంచి ఫలితాలను రాబట్టుకునేందుకు అనుసరించాలన్సిన సూత్రాలేంటో చూద్దాం. ఐపీవోకు వచ్చే ప్రతి కంపెనీ విధిగా సమగ్ర వివరాలతో కూడిన పత్రాన్ని (ప్రాస్పెక్టస్) ఇన్వెస్టర్ల కోసం అందుబాటులో ఉంచాలి. చాలా మందికి ఐపీవోలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న ఆసక్తి ఈ ప్రాస్పెక్టస్ను చూసేందుకుండదు. నిజానికి ఈ ప్రాస్పెక్టస్ కూడా అంత సరళంగా ఏమీ ఉండదు. 500–600 పేజీలుంటుంది. అయినప్పటికీ కొన్ని కీలక అంశాలను స్పృశించడం ద్వారా ఆ ఐపీవోలో ఇన్వెస్ట్ చేయాలా, వద్దా అన్న నిర్ణయానికి సులభంగానే రావచ్చు. ఇంటర్నల్ రిస్క్స్.. కొత్తగా నిధుల సేకరణకు ఐపీవోకు వస్తున్న కంపెనీ లు తమ వ్యాపారం, సవాళ్ల విషయంలో వాస్తవాలను పూసగుచ్చినట్టు వివరించాల్సి ఉంటుంది. ఈ అంశా న్ని సెబీ సైతం పరిశీలనగా చూస్తుంది. అందుకే ఐపీవోకు వచ్చే కంపెనీలు తమ వ్యాపారానికి పొంచి ఉన్న సవాళ్లు, ప్రతి రిస్క్ను ‘రిస్క్ ఫ్యాక్టర్స్’ కాలమ్లో సాధ్యమైనంత వివరంగా ఇస్తాయి. కంపెనీ అంతర్గత సవాళ్లు (ఇంటర్నల్ రిస్క్స్) అనేవి ఆ కంపెనీకి మాత్రమే పరిమితం. వెలుపలి సవాళ్లు అనేవి సాధారణమైనవి. ఇటీవల ముగిసిన వరుణ్ బెవరేజెస్ ఐపీవో గుర్తుండే ఉంటుంది. ఈ కంపెనీ తన ప్రాస్పెక్టస్ చిట్టాలో అంతర్గత సవాళ్లను చాలా స్పష్టంగా పేర్కొంది. పెప్సీకో ఇండియాకు వరుణ్ బెవరేజెస్ దేశీయ తయారీ భాగస్వామి. పెప్సీకో ఇండియాతో వరుణ్ బెవరేజెస్కు ఉన్న అనుబంధం 17 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలకే పరిమితం. అలాగే, ఈ ఒప్పందం కాల వ్యవధి కూడా పదేళ్ల వరకే. అంటే 2022తో పూర్తవుతుంది. పైగా ఈ ఫ్రాంచైజీ ఒప్పందం వరుణ్ బెవరేజెస్ సొంతం కాదు. నోటీసు జారీ చేసిన తేదీ నుంచి 12 నెలల తర్వాత ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకునే హక్కులు పెప్సీకో ఇండియాకు ఉన్నాయి. వీటన్నిం టినీ ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేసే మదుపరులు చాలా జాగ్రత్తగా పరిగణనలోకి తీసు కోవాలి. అందుకేనేమో వరుణ్ బెవరేజెస్ ఐపీవోకు స్పందన అం తంత మాత్రంగానే వచ్చింది. అధిక ధరలో ఉందా..? పబ్లిక్ ఆఫర్లో భాగంగా ఒక్కో షేరు ధరను చాలా ఎక్కువగా నిర్ణయించారా? అన్నది తెలుసుకోవడం అవసరం. ముఖ విలువకు ఎన్ని రెట్లు అధికంగా నిర్ణయించారు? కంపెనీలో పెద్ద షేర్ హోల్డర్లుగా ఉన్న వారు లోగడ ఏ ధరకు కొనుగోలు చేశారన్న వివరాలు ఇందుకు కీలకంగా పరిగణించవచ్చు. గతంలో షేర్ల కొనుగోళ్ల వివరాలు ‘కేపిటల్ స్ట్రక్చర్’ అనే సెక్షన్లో ‘బిల్డ్ అప్ ఆఫ్ ప్రమోటర్ హోల్డింగ్స్’ అనే విభాగంలో ఉంటాయి. ఇటీవలి ఐపీవోకు వచ్చిన ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రాస్పెక్టస్లో ఆ కంపెనీ గతంలో ఇన్వెస్టర్లకు ఏ ధరకు షేర్లను కేటాయించిందన్న వివరాలను పేర్కొంది. 2015 డిసెంబర్, 2016 మార్చిలో అజీమ్ ప్రేమ్జీకి చెందిన ప్రేమ్జీ ఇన్వెస్ట్కు, సింగపూర్కు చెందిన టెమసెక్ హోల్డింగ్స్కు ఒక్కో షేరును రూ.226.30కు కేటాయించింది. తాజాగా ఐపీవోలో ఒక్కో షేరును రూ.334కు విక్రయించింది. అంటే ఈ ధరకంటే 33 శాతం తక్కువకే గతంలో ఇన్వెస్టర్లు కొనుగోలు చేసినట్టు అర్థమవుతోంది. ఇష్యూ ధరకు ఆధారం... ఇన్వెస్టర్ల చేతులు కాల్చిన ఐపీవోల గురించి కూడా తెలిసే ఉంటుంది. ఆయా కంపెనీలు వ్యాపార పరంగా సమస్యలు ఎదుర్కోవడం వల్లే ఇలా జరిగిందనుకోవడానికి లేదు. షేర్లను అధిక ధరలో కొనుగోలు చేయడం ఇందుకు ప్రధాన కారణం. ప్రతి కంపెనీ తన ప్రాస్పెక్టస్లో ఇష్యూ ధర ఖరారుకు ఆధారంగా కొన్ని వివరాలు ఇస్తుంటాయి. కొన్ని సరళంగా ఇస్తే... మరికొన్ని చాంతాడంత సమాచారాన్ని ఇస్తాయి. ‘అందుకే బేసిస్ ఆఫ్ ఇష్యూ ప్రైస్’ విభాగాన్ని తప్పకుండా చూడాలి. అంత తీరిక లేకుంటే కనీసం ఇష్యూకు వస్తున్న కంపెనీ తాజా ఈపీఎస్ (ఒక్కో షేరు వారీ ఆర్జన) ఎంతుందన్నది, బుక్వేల్యూ వివరాలు తెలుసుకున్నా అంచనాకు రావచ్చు. సంబంధిత రంగం గురించి కూడా ఎక్కువ వృద్ధికి అవకాశమున్న బ్యాంకింగ్ వంటి రంగాల గురించి ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన శ్రమ ఉండదు. కానీ, పబ్లిక్ ఇష్యూకు వస్తున్న కంపెనీ పెద్దగా తెలియని రంగంలో పనిచేస్తుందనుకోండి. అప్పుడెలా..? ‘ఇండస్ట్రీ ఓవర్ వ్యూ’ సెక్షన్ ఈ విధమైన సందేహాలను తీర్చే విభాగం. కంపెనీ పనిచేస్తున్న రంగానికి సంబంధించి వృద్ధికి అవకాశాలు, ఇతర ముఖ్యమైన సమాచారం ఈ విభాగంలో ఉంటుంది. ఇన్వెస్ట్ చేయాలా? వద్దా అన్నది నిర్ణయించుకోవడానికి ఇది కీలకంగా ఉపకరిస్తుంది. ఇటీవల ఐపీవోకు వచ్చిన గ్రీన్ సిగ్నల్ బయో ఫార్మా ప్రాస్పెక్టస్ చూస్తే ఈ విషయం తెలుస్తుంది. ఈ కంపెనీ బీసీజీ వ్యాక్సిన్ను తయారు చేస్తోంది. వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం కోసం ప్రభుత్వం బీసీజీ వ్యాక్సిన్లను కేవలం రెండు కంపెనీల నుంచే సేకరిస్తుండగా... అందులో గ్రీన్సిగ్నల్ బయో ఫార్మా ఒకటి. మరొకటి సెరమ్ ఇనిస్టిట్యూట్. ప్రపంచ ఆరోగ్య సంస్థకు బీసీజీ టీకాల సరఫరాకు అర్హత సాధించిన కంపెనీల్లోనూ గ్రీన్ సిగ్నల్ కూడా ఒకటని కంపెనీ ఐపీవో పత్రాల్లో పేర్కొంది. మర్చంట్ బ్యాంకర్ ట్రాక్ రికార్డు చివరగా మర్చంట్ బ్యాంకర్ల ట్రాక్ రికార్డు కూడా ఐపీవో ఇన్వెస్ట్మెంట్కు కీలకమైనది. ‘అదర్ రెగ్యులేటరీ డిస్క్లోజర్స్’ అనే విభాగంలో మర్చంట్ బ్యాంకర్ల సమాచారం ఉంటుంది. సదరు మర్చంట్ బ్యాంకర్ అంతకుముందు ఏడాది కాలంలో నిర్వహించిన ఐపీవోల షేర్ల ధరల పనితీరు ఎలా ఉందన్న సమాచారం ఇక్కడ లభిస్తుంది. -
ఐపీఓ మార్కెట్ జోరు..
♦ సెబీ సంస్కరణలతో జోష్ ♦ ఐపీఓకు రానున్న 30కి పైగా కంపెనీలు ♦ రూ.20,000 కోట్ల సమీకరణ అంచనా న్యూఢిల్లీ : ఈ ఏడాది ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)లు జోరుగా ఉన్నాయి. ఒడిదుడుకులున్నా స్టాక్ మార్కెట్ పుంజుకుంటుండటం, మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ, ఐపీఓకు సంబంధించి పలు సంస్కరణలను తీసుకురావడం ఐపీఓ మార్కెట్కు మరింత జోష్నిస్తోంది. దాదాపు 30కు పైగా కంపెనీలు ఐపీఓల ద్వారా రూ.20,000 కోట్లకు పైగా నిధులు సమీకరణకు క్యూలో ఉన్నాయి. వరుసలో దిగ్గజ సంస్థలు... జీవీకే గ్రూప్కు చెందిన విమానాశ్రయాల వ్యాపార విభాగం, జీవీకే ఎయిర్పోర్ట్ డెవలపర్స్ ఐపీఓకు వస్తోంది. ఈ ఐపీఓ ద్వారా రూ.3,000 కోట్ల నిధులు సమీకరించాలని ఈ గ్రూప్ యోచిస్తోంది. బయోకాన్కు చెందిన సింజిన్ ఇంటర్నేషనల్ ఐపీఓ ద్వారా రూ.600 కోట్లు సమీకరించడానికి సెబీ ఆమోదం పొందింది. రూ.2,500 కోట్లు సమీకరించాలని భావిస్తున్న విమానయాన సంస్థ ఇండిగో ఈ వారంలోనే ఐపీఓ సంబంధిత ముసాయిదా పత్రాలను సెబీకి దాఖలు చేయనున్నది. కేఫ్ కాఫీ డే, మ్యాట్రిక్స్ సెల్యులర్ ఇప్పటికే ఈ పత్రాలను దాఖలు చేశాయి. 20 ఐపీఓలకు సెబీ ఆమోదం ఈ ఏడాది ఇప్పటివరకూ దాదాపు 19 కంపెనీలు ఐపీఓల కోసం సెబీకి సంబంధిత ముసాయిదా పత్రాలను దాఖలు చేశాయి. గత ఏడాదిలో పెండింగ్లో ఉన్న వాటిని కూడా పరిగణనలోకి తీసుకొని సెబీ ఇప్పటివరకూ 20 కంపెనీల ఐపీఓలకు అనుమతిచ్చింది. కాగా ప్రస్తుతం సెబీ వద్ద ఐదు కంపెనీల ఐపీఓల ప్రతిపాదనలే పెండింగ్లో ఉన్నాయని సమా చారం. ఈ ఏడాది ఇప్పటివరకూ ఎనిమిది కంపెనీలు ఐపీఓకు వచ్చాయి. ఈ కంపెనీలు రూ.4,000 కోట్ల వరకూ నిధులు సమీకరించాయి. గత ఏడాదిలో ఆరు కంపెనీలే ఐపీఓకు వచ్చాయి. రూ.1,528 కోట్ల నిధులు సమీకరించాయి. ఐపీఓల కోసం సెబీ వద్ద దరఖాస్తు చేసుకున్న వాటిల్లో ఎక్కువ భాగం మధ్య సైజు కంపెనీలే. ఐపీఓల ద్వారా ఇవి రూ.200 కోట్ల నుంచి రూ.3,000 కోట్లు సమీకరించనున్నాయి. సెబీ తాజా సంస్కరణలు... ఇటీవలనే సెబీ ఐపీఓలకు సంబంధించి పలు సంస్కరణలను తెస్తోంది. గతంలో 12 రోజులుగా ఉన్న లిస్టింగ్ కాలాన్ని సగానికి... ఆరు రోజులకు తగ్గించింది. ఇన్వెస్టర్లు ఐపీఓ చెల్లింపులకు ఎలాంటి చెక్కులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆస్బా(అప్లికేషన్ సపోర్టెడ్ బై బ్లాక్డ్ అమౌంట్) అన్ని రకాల ఇన్వెస్టర్లకు తప్పనిసరి చేసింది. త్వరలో ఇ (ఎలక్ట్రాన్) ఐపీఓలకు సంబంధించిన సంస్కరణలు తేనున్నది. తాజా సంస్కరణల వల్ల ఐపీఓల్లో ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్లకు వ్యయప్రయాసలు బాగా తగ్గుతాయి. ఐపీఓ ప్రక్రియ మరింత సజావుగా సాగుతుందని బీఎస్ఈ పేర్కొంది. ఈ తాజా సంస్కరణల నుంచి ప్రయోజనం పొందడానికి పలు కంపెనీలు ఐపీఓ బాట పడుతున్నాయి. కాగా, ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో లావాదేవీలు జరిపే రిటైల్ ఇన్వెస్టర్ల సంఖ్య 2 కోట్ల వరకూ ఉంటుందని, ఏడాది కాలం నుంచి స్టాక్ మార్కెట్లో బుల్ రన్ జరుగుతున్నా, ఈ సంఖ్యలో పెద్దగా మార్పు లేదని నిపుణులంటున్నారు. సెబీ సం స్కరణల ప్రభావంతో ఐపీఓల్లో ఇన్వెస్ట్ చేసే రిటైల్ ఇన్వెస్టర్ల సంఖ్య 25% పెరుగుతుందని అంచనా. ఫండమెంటల్స్ బాగా ఉంటేనే... భారత ప్రైమరీ మార్కెట్పై కంపెనీలు, ఇన్వెస్టర్లకు ఆసక్తి పెరుగుతోందని నిపుణులంటున్నారు. ఈక్విటీల జారీకి ప్రస్తుతం పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ అజయ్ సరాఫ్ చెప్పారు. అయితే పటిష్టమైన ఫండమెంటల్స్ ఉన్న కంపెనీలు, సరైన ధర ఉన్న ఐపీఓలకు మంచి ఆదరణ ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. -
మళ్లీ ఐపీవోలవైపు కంపెనీల చూపు
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్లు లాభాలతో దూసుకెళుతున్న నేపథ్యంలో దేశీ కంపెనీలు పబ్లిక్ ఇష్యూలను చేపట్టేందుకు క్యూకట్టే అవకాశముంది. ఎన్డీఏ నేతృత్వంలో కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటుకానున్న కారణంగా ఇన్వెస్టర్లు దేశీ స్టాక్స్లో పెట్టుబడులను కుమ్మరిస్తున్నారు. వెరసి మార్కెట్ల ప్రామాణిక సూచీ సెన్సెక్స్ 24,000 పాయింట్లను అధిగమించి కొత్త రికార్డును నెలకొల్పింది. దీంతో పలు కంపెనీలు పబ్లిక్ ఇష్యూల ద్వారా నిధుల సమీకరణకు సమాయత్తంకాగలవని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఐపీవోలను నిర్వహించే మర్చంట్ బ్యాంకర్ల సమాచారంమేరకు కనీసం 12 సంస్థలు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వద్ద ప్రాస్పెక్టస్లను దాఖలు చేసినట్లు తెలుస్తోంది. కాగా, ప్రైమ్ డేటాబేస్ నివేదిక ప్రకారం 14 సంస్థలు రూ. 2,796 కోట్ల సమీకరణకు పబ్లిక్ ఇష్యూలను చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. మార్కెట్లు మందగించడంతో గడిచిన ఆర్థిక సంవత్సరం(2013-14)లో ఐపీవోల ద్వారా కంపెనీలు రూ. 1,205 కోట్లను మాత్రమే సమీకరించిన విషయం విదితమే.