kalyanram
-
నార్నే నితిన్, శివానిల నిశ్చితార్థం (ఫొటోలు)
-
ఈ సినిమా నా బిడ్డలాంటిది..ఆ విషయంలో మాత్రమే బాధపడ్డా: డెవిల్ డైరెక్టర్
నందమూరి హీరో కల్యాణ్ రామ్ డెవిల్ చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్నారు. ఈ చిత్రాన్ని నవీన్ మేడారం దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రంలో సంయుక్త హీరోయిన్గా నటించింది. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై నిర్మించగా.. శ్రీకాంత్ విస్సా కథను అందించారు. అయితే ఇప్పటికే పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఈనెల 29న థియేటర్లలో సందడి చేయనుంది. అయితే గతంలో ఈ ప్రాజెక్ట్ నుంచి డైరెక్టర్ నవీన్ తప్పుకుంటున్నట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. అదే సమయంలో దర్శక-నిర్మాతగా అభిషేక్ నామా పేరు తెరపైకి వచ్చింది. తాజాగా ఈ వివాదంపై నవీన్ మేడారం స్పందించారు. ఈ చిత్రానికి తానే దర్శకత్వం వహించినప్పటికీ తనకు క్రెడిట్ దక్కలేదంటూ ఇన్స్టాలో పోస్ట్ పెట్టారు. నవీన్ తన ఇన్స్టాలో రాస్తూ.. 'డెవిల్ చిత్రం కోసం దాదాపు మూడేళ్లు శ్రమించా. స్క్రిప్ట్తో సహా సినిమాలోని ప్రతి అంశాన్ని నా ఆలోచనకు అనుగుణంగా తెరకెక్కించా. ఈ సినిమాను హైదరాబాద్, వైజాగ్, కారైకుడిలో షూట్ చేశాం. చిన్న చిన్న సన్నివేశాలతో సహా దాదాపు 105 రోజులు కష్టపడ్డాం. నేను అనుకున్న విధంగా ఈ చిత్రం తెరకెక్కించా. నాకు కేవలం ప్రాజెక్ట్ మాత్రమే కాదు. ఈ సినిమా నా బిడ్డలాంటిది. ఎవరు ఎన్ని చెప్పినా డెవిల్ నా సినిమానే.' అని రాసుకొచ్చారు. ఇప్పటిదాకా ఎలాంటి పరిస్థితులు వచ్చినా నేను మౌనంగా ఉన్నా. కానీ నా మౌనాన్ని కొందరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. దీనిపై క్లారిటీ ఇచ్చేందుకే ఈ పోస్ట్ పెడుతున్నా. అహంకారం, దురాశతో తీసుకున్న కొన్ని నిర్ణయాల ఫలితంగానే ఈ వివాదం మొదలైంది. ఈ వివాదంలో చిత్రబృందానికి సంబంధించిన ఏ వ్యక్తిపైనా నేను చట్టపరమైన చర్యలు తీసుకోవడం లేదు. దర్శకుడిగా నాకు క్రెడిట్ ఇవ్వలేదనే బాధపడుతున్నా. నా టాలెంట్పై నాకు నమ్మకం ఉంది. నా కెరీర్లో మరింత ముందుకు వెళ్లాలనుకుంటున్నా.' అని పోస్ట్ చేశారు. కల్యాణ్రామ్ ఈ సినిమా కోసం ఎంతో శ్రమించారని.. నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ మూవీ తప్పకుండా బ్లాక్బస్టర్ హిట్ అవుతుందని నమ్ముతున్నా. డిసెంబర్ 29న ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని వీక్షించాలని కోరుకుంటున్నా. మరో కొత్త చిత్రానికి సంతకం చేశా. ఆసక్తికరమైన స్క్రిప్ట్ కోసం పనిచేస్తున్నా. త్వరలోనే వెల్లడిస్తానని నవీన్ రాసుకొచ్చారు. View this post on Instagram A post shared by Naveen Medaram (@naveen_medaram) -
ఎన్టీఆర్ మరియు బాలకృష్ణ గురించి కళ్యాణ్ రామ్..!
-
ఐడీఎఫ్సీ రీజినల్ ఆఫీస్ను ప్రారంభించిన నందమూరి కల్యాణ్ రామ్ (ఫొటోలు)
-
ఆ రెండు సినిమాలతో క్రేజ్.. కేరళ భామకు వరుస ఆఫర్లు..!
భీమ్లా నాయక్, బింబిసార చిత్రాలతో క్రేజ్ సంపాందించుకున్న బ్యూటీ సంయుక్త మీనన్. ఈ భామ కోసం టాలీవుడ్లో వరుస ఆపర్లు క్యూ కడుతున్నాయి. ఈ కేరళ కుట్టి మలయాళం, తమిళం, కన్నడలోనూ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్లో తాజాగా కళ్యాణ్ రామ్ బింబిసార మూవీతో సక్సెస్ అందుకుంది. సోషియో ఫాంటసీ టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిన బింబిసార బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. పవన్ కల్యాణ్ సినిమా భీమ్లా నాయక్లో రానాకు జోడిగా నటించింది ఈ అమ్మడు. (చదవండి: ‘భీమ్లా నాయక్’ టీంపై అలిగిన హీరోయిన్లు?, సంయుక్త మీనన్ క్లారిటీ) ‘బింబిసార’ నందమూరి కల్యాణ్రామ్ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఈ సినిమాలో ఆమె పాత్రకు అంతగా ప్రాధాన్యత లేకున్నా.. ఈ భామకు హిట్ టాక్ సెంటిమెంట్ కలిసి రావడంతో టాలీవుడ్ దర్శక, నిర్మాతలు మొగ్గు చూపుతున్నారు. తెలుగులో మొదట కల్యాణ్ రామ్ బింబిసారలో ఛాన్స్ రాగా.. ఆ సినిమా ఆలస్యం కావడంతో ‘భీమ్లా నాయక్’తో ఎంట్రీ ఇచ్చింది. 2016లో మలయాళం మూవీ ‘పాప్ కార్న్' సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రంలో అంజనా పాత్రకు ఆమెకు మంచి పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత తమిళంలో ‘కలరి’ మూవీతో అభిమానులను పలకరించింది. ఈ సినిమా తర్వాత మలయాళంలో ‘లిల్లీ’ అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. -
ఆ రెండు సినిమాల ఓటీటీ రిలీజ్పై సస్పెన్స్.. స్పందించిన జీ5..!
యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ తాజాగా నటించిన చిత్రం కార్తికేయ 2. ఆగష్టులో విడుదలైన ఈ చిత్రం ఊహించని విజయం సొంతం చేసుకుంది. బాలీవుడ్లో ఈ మూవీకి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాను ఓటీటీలో చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా? అని అప్డేట్ల కోసం వెతుకున్నారు. అయితే ‘కార్తికేయ2’ను సైతం దసరా కానుకగా ఓటీటీలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అంటే అక్టోబరు మొదటివారం స్ట్రీమింగ్కు రావచ్చని అంచనా వేస్తున్నారు. దీనిపై కూడా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. చిన్న చిత్రంగా విడుదలై పాన్ ఇండియా స్థాయిలో రికార్డులు సృష్టించింది. రూ.100 కోట్ల క్లబ్ను దాటేసింది. (చదవండి: మల్టీప్లెక్స్ల్లో 75 రూపాయలకే సినిమా హ్యపీగా చూసేయండి..) ఇక ఎలాంటి అంచనాలు లేకుండా భారీ విజయం సాధించిన మరో చిత్రం 'బింబిసార'. ఈ చిత్రం కల్యాణ్రామ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ఆగస్టులో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా కోసం ఓటీటీలో ఎప్పుడోస్తుందా అని సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ రెండు సినిమాల విడుదలపై జీ5 స్పందించింది. ‘మీ ఉత్సాహానికి సంతోషంగా ఉంది. దయచేసి వేచి ఉండండి. మరిన్ని వివరాలకు మా సోషల్మీడియా ఖాతాలను అనుసరించండి’ అని రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో నడుస్తున్న ప్రచారం చూస్తే కల్యాణ్రామ్ ‘బింబిసార’ సెప్టెంబర్ 23న విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. -
మళ్లీ పుట్టినట్లు అనిపించింది.. ఆ మాటలు వింటే భయమేసేది
‘‘బింబిసార’ రిలీజ్ తర్వాత చాలామంది సినీ ప్రముఖులు ఫోన్ చేసి మాట్లాడుతుంటే నాకు మళ్లీ పుట్టినట్లు అనిపించింది. ఇంత మంచి కథను నాకు ఇచ్చిన వశిష్ఠ్కు ధన్యవాదాలు’’ అని కల్యాణ్ రామ్ అన్నారు. వశిష్ఠ్ దర్శకత్వంలో కల్యాణ్ రామ్ హీరోగా నటించిన చిత్రం ‘బింబిసార’. హరికృష్ణ .కె నిర్మించిన ఈ సినిమా గత శుక్రవారం రిలీజైంది. ఈ చిత్రం సక్సెస్ మీట్లో కల్యాణ్ రామ్ మాట్లాడుతూ– ‘‘ఎంతో నమ్మకంతో సినిమాను పూర్తి చేశాం. కానీ థియేటర్లకు ప్రేక్షకులు రావడం లేదనే కొంతమంది మాటలు వింటే భయమేసేది. అయితే మంచి కంటెంట్ ఉన్న సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని నమ్మాను.. ‘బింబిసార’ విషయంలో అదే నిజమైంది. మా చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు నమస్కరిస్తున్నాను’’ అన్నారు. నిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ–‘‘మేజర్, విక్రమ్’ సినిమాలు మంచి విజయాన్ని చూశాయి. ఆ తర్వాత రెండు నెలల పాటు సినిమాలేవీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ‘బింబిసార, సీతారామం’ ఇండస్ట్రీకి ఊపిరి పోశాయి. తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఇదే ఉత్సాహంతో నేను కూడా ముందుకెళతాను’’ అన్నారు. ‘‘మా సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు వశిష్ఠ్. డిస్ట్రిబ్యూటర్లు శివరాం, ఎల్.వి.ఆర్, హరి, ఎ.ఎం.ఆర్ పాల్గొన్నారు. -
NTR Satha Jayanthi: నివాళులు అర్పించిన లక్ష్మీపార్వతి, జూ.ఎన్టీఆర్
ఎన్టీఆర్ శత జయంతి: నేడు దివంగత మాజీ ముఖ్యమంత్రి, నటుడు నందమూరి తారక రామారావు శత జయంతి. ఆయన జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్లో లక్ష్మీపార్వతి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా లక్ష్మీపార్వతి మాట్లాడుతూ..‘‘స్వచ్ఛమైన రాజకీయాలు నడిపిన వ్యక్తి ఎన్టీఆర్. వెన్నుపోట్ల ద్వారా రాజ్యాన్ని తీసుకురావాలని ఎన్టీఆర్ ఎప్పుడూ అనుకోలేదు. రాబోయే తరాలకు ఎన్టీఆర్ ఆదర్శం’’ అంటూ వ్యాఖ్యానించారు. అంతకుముందు నటులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్రామ్లు కూడా ఎన్టీఆర్కు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అభిమానులు జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. ఇది కూడా చదవండి: ఎన్టీఆర్ శతజయంతి: పదే పదే తలచు తెలుగుజాతి -
ఆ ముద్ర వేయడం సంతోషం
‘‘భావోద్వేగాలను దృష్టిలో పెట్టుకొని రాసే కథలకు ఫలానా హీరోనే చేయాలి అనేది ఉండదు. కథే హీరో. అలాంటి కథని సినిమాగా చేసేటప్పుడు హీరోనే కథను మోసుకుంటూ వెళ్తాడు. మా సినిమా హీరో కల్యాణ్రామ్ ‘ఎంత మంచివాడవురా’ కథకు కావాల్సినంత న్యాయం చేశాడు’’ అని డైరెక్టర్ వేగేశ్న సతీష్ అన్నారు. కల్యాణ్రామ్, మెహరీన్ జంటగా శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో తెరకెక్కిన చిత్రం ‘ఎంత మంచివాడవురా’. ఉమేష్ గుప్త, సుభాష్ గుప్త నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా వేగేశ్న సతీష్ చెప్పిన విశేషాలు... ►ఒకే జోనర్లో సినిమాలు చేసే హీరో ఒక్కసారిగా జోనర్ మారితే ఆ హీరో ఎలా చేశాడు? అనే ఆత్రుత ప్రేక్షకుల్లో ఉంటుంది. కల్యాణ్రామ్ ఎలా చేసుంటాడనే ఆసక్తి ప్రేక్షకుల్లో, ఇండస్ట్రీలో ఉంటుంది. అదే మా సినిమాకు ప్లస్ పాయింట్. మా కథకు అభినయం పరంగా పరిణితి కనబరచే నటుడు కావాలనుకొని ఆయనకు కథ చెప్పాను.. నచ్చటంతో ఈ సినిమా ప్రారంభం అయ్యింది. కథానుగుణంగా ఈ సినిమాలో ఫైట్లు ఉంటాయి.. అవి కూడా చాలా స్టైలిష్గా ఉంటాయి. ►కెరీర్లో నేను చేసిన రెండు సినిమాలతోనే ఫ్యామిలీ దర్శకుడు అనే ముద్ర వేశారు. ఆ బ్రాండ్ నాకు సంతోషాన్నే ఇస్తోంది. ►స్వతహాగా కథా రచయితనైనా ఏ రోజూ రీమేక్ కథలు చేయాలనుకోలేదు. ‘ఆక్సిజన్’ అనే గుజరాతి సినిమా చూసిన మా నిర్మాతలు ఈ సినిమా రీమేక్ చేస్తే బావుంటుందని శివలెంక కృష్ణప్రసాద్గారికి చెప్పారు. ‘సతీష్ వద్దే చాలా కథలు ఉన్నాయి.. రీమేక్ కథ చేస్తాడో? లేదో? డౌటే.. అయినా ఓ సారి అడిగిచూడండి’ అని శివలెంకగారు నిర్మాతలతో అనటంతో నిర్మాతలు నన్ను అడిగారు. సినిమా చూసినప్పుడు ఆ కథలోని హీరో క్యారెక్టర్ నన్ను ఆకర్షించింది. కానీ మిగతా సినిమా మన తెలుగు నేటివిటీకి సరిపోదని చెప్పాను. ఆ తర్వాత నిర్మాతలు పూర్తి స్వేచ్ఛ ఇవ్వటంతో ఈ కథలో మార్పులు చేశాం. సినిమాలో ప్రేక్షకులకు నచ్చే అన్ని అంశాలు ఉన్నాయి. -
గోదావరిలో రిస్క్
కల్యాణ్రామ్, మెహరీన్ జంటగా నటించిన చిత్రం ‘ఎంత మంచివాడవురా’. సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ఆదిత్యా మ్యూజిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్మించిన చిత్రం ఇది. శ్రీదేవి మూవీస్ శివలెంక కృష్ణప్రసాద్ సమర్పిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. జనవరి 15న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ – ‘‘ఈ సినిమాలో నాలుగు పాటలు, నాలుగు ఫైట్లు ఉంటాయి. పాటలను డిసెంబర్లో విడుదల చేస్తాం. ఈ సినిమాకి గోపిసుందర్ సంగీతదర్శకుడు. సీతారామ శాస్త్రి, శ్రీమణి చెరో పాట రాయగా రామజోగయ్య శాస్త్రి రెండు పాటలను రాశారు. క్లైమాక్స్లో వచ్చే ఫైట్ను చాలా రిచ్గా తీశాం. ఈ ఫైట్ను గోదావరి నదిలో ఎంతో రిస్క్తో ఫైట్ మాస్టర్ వెంకట్ తెరకెక్కించారు’’ అన్నారు. -
హీరోకి వచ్చిన కలలన్నీ నాకొచ్చినవే
‘‘దర్శకుడిగా నా ప్రయాణం ఓ కలతో మొదలైంది. ఆ కలతో తీసిన ‘118’ సినిమా విజయం సాధించినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు ప్రముఖ ఛాయాగ్రాహకుడు కేవీ గుహన్. కల్యాణ్రామ్, నివేథా థామస్, శాలిని పాండే హీరో హీరోయిన్లుగా గుహన్ని దర్శకునిగా పరిచయం చేస్తూ మహేశ్ కోనేరు నిర్మించిన ‘118’ ఇటీవల విడుదలైంది. మంచి టాక్తో విజయవంతంగా సాగుతోందన్నారు గుహన్. బుధవారం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ– ‘‘118’లో హీరోకి వచ్చిన కలలు నాకొచ్చినవే. నాకు ఒక పెద్ద రూమ్లో ఒక్కడినే ఉండాలంటే చాలా భయం. కానీ కెమెరామేన్గా అనేక ప్రదేశాలు తిరుగుతుంటాను కాబట్టి తప్పదు. ఓ సినిమా కోసం నేను ఓ హోటల్ రూమ్లో బస చేశాను. రాత్రి నిద్రపోయిన తర్వాత భయంకరమైన కల వచ్చింది. అది నిజంగా జరిగినట్లే అనిపించింది. మర్నాడు ఒంట్లో ఓపిక లేనట్లు నీరసంగా లొకేషన్కి వెళ్లాను. డాన్స్మాస్టర్ ప్రేమ్రక్షిత్ ‘ఏంటి సార్ నీరసంగా ఉన్నారు’ అనడిగితే, ‘కల వచ్చింది’ అని చెప్పాను. కొన్ని కలలు అలానే ఉంటాయి అనుకున్నాం. ఆ కల గురించి ఆ తర్వాత ఆలోచిస్తూనే ఉన్నాను. ఓ రెండేళ్ల తర్వాత అదే హోటల్లో అదే రూమ్లో ఉండాల్సి వచ్చింది. మళ్లీ అదే కలకు కంటిన్యూషన్గా కల రావడంతో ఆశ్చర్యపోయాను. ఓసారి అనుకోకుండా కల్యాణ్రామ్ను కలిసినపుడు ‘ఓ లైన్ ఉంది వింటారా’ అని అడిగితే ‘సరే’ అన్నారు. రెండు గంటలపాటు కథను నెరేట్ చేశాను. ‘మీరు కెమెరామేన్ అయ్యుండి కథని ఇంత బాగా నెరేట్ చేశారు, మనం ఈ సినిమా చేస్తున్నాం’ అన్నారాయన. వారం రోజుల్లో సినిమా స్టార్ట్ అయ్యింది. అంతా ఓ కలలా జరిగిపోయింది. ప్రస్తుతం మేం ఈ సినిమా విజయాన్ని ఆస్వాదిస్తున్నాం. చాలామంది నిర్మాతలు వేరే భాషలో ఈ సినిమా చేయొచ్చు కదా అంటున్నారు. నేను ఇదే కథను ఏ భాషలో కావాలన్నా ఎన్నిసార్లు చేయమన్నా ఆనందంగా చేస్తాను. చేసిన సినిమానే కదా, మళ్లీ ఏం చేస్తాంలే అనుకోను. ఒకవేళ హిందీలో కాని, తమిళ్లో కాని రీమేక్ చేసే అవకాశం వస్తే తెలుగులో నేను చేసిన చిన్న చిన్న తప్పులు కూడా లేకుండా ఇంకా బాగా చేస్తాను. నేను దర్శకత్వం వహించే సినిమాలకు నేనే కెమెరామెన్గా పనిచేస్తే దర్శకునిగా నాకేం కావాలో అలా చేసుకోగలుగుతాను. నాలోని డైరెక్టర్కి, కెమెరామెన్కి క్లాష్ ఉండదు. మంచి అవుట్పుట్ ఇస్తాను. ప్రస్తుతం తమిళ్లో కెమెరామెన్గా చరణ్ దర్శకత్వంలో ఓ సినిమాకు పనిచేస్తున్నా. తెలుగులో దర్శకుడిగా చేద్దామనుకుంటున్నాను’’ అన్నారు. -
ప్రతి అమ్మాయి కనెక్ట్ అయ్యే కథతో...
‘మహానటి’ తర్వాత తెలుగు ప్రేక్షకుల్లో కీర్తీ సురేశ్పై అభిమానం అమాంతం పెరిగింది. ఇప్పుడు ఓ ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాలో నటించనున్నారామె. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్పై నరేంద్ర దర్శకత్వంలో మహేశ్ కోనేరు నిర్మించనున్నారు. ఈ సినిమా ముహూర్తం గురువారం హైదరాబాద్లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత బీవీయస్యన్ ప్రసాద్, దర్శకుడు వెంకీ అట్లూరి కెమెరా స్విచ్చాన్ చేయగా, హీరో కల్యాణ్ రామ్ క్లాప్ ఇచ్చారు. ఫస్ట్ షాట్కి దర్శకుడు హరీష్ శంకర్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా కీర్తీ సురేశ్ మాట్లాడుతూ – ‘‘తెలుగులో ‘మహానటి’ తర్వాత నటిస్తోన్న సినిమా ఇది. ఫీమేల్ ఓరియంటెడ్ చిత్రంలో నటించడం సంతోషంగా ఉంది. ప్రతి అమ్మాయి కనెక్ట్ అయ్యే చిత్రమిది. సినిమా షూటింగ్ ఎక్కువ శాతం అమెరికాలో జరగనుంది. దర్శకుడు నరేంద్ర మంచి కథ సిద్ధం చేశారు. తెలుగు ప్రేక్షకులకు ఇంకా దగ్గరవుతాననే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘2016 నుంచి ఈ కథను తయారు చేస్తున్నాను. అన్ని ఎమోషన్స్ ఇందులో ఉంటాయి. ఈ పాత్రకు కీర్తీగారు తప్ప ఇంకెవరూ సూట్కారు. 75శాతం షూటింగ్ అమెరికాలో జరుగుతుంది. ఫిబ్రవరిలో షూటింగ్ స్టార్ట్ చేస్తాం’’ అన్నారు దర్శకుడు నరేంద్ర. ‘‘మహానటి’తో కీర్తి తెలుగు ప్రేక్షకులకు ఎంతలా కనెక్ట్ అయ్యారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్రతి అమ్మాయి ఏదో సందర్భంలో ఎదుర్కొన్న సంఘటన ఆధారంగా ఈ సినిమా కథ ఉంటుంది. మిగతా నటీనటులను త్వరలో ప్రకటిస్తాం’’ అన్నారు నిర్మాత మహేశ్ కోనేరు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు కల్యాణ్ కోడూరి పాల్గొన్నారు. -
బాగా నటించాడ్రా అంటే చాలు
‘‘కల్యాణ్ అన్నను చూస్తుంటే మూడేళ్ల కిందట నేను పడిన టెన్షన్ ఆయనలో కనిపిస్తోంది. నేను ‘నాన్నకు ప్రేమతో’ సినిమా చేసినప్పుడు.. ముఖ్యంగా ఆ గెటప్ ఛేంజ్ చేసినప్పుడు.. అప్పటి వరకూ నేను చేసిన సినిమాలని దృష్టిలో పెట్టుకుంటే ఈ సినిమాని ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారా? లేదా? అనిపించింది. ప్రతి నటుడూ స్టీరియో టైప్ పాత్రలు, సినిమాలు చేసుకుంటూ వెళుతుంటే ఆ నటుడికే కాదు.. అభిమానులు, ప్రేక్షకులకూ సంతృప్తి ఉండదు’’ అని హీరో ఎన్టీఆర్ అన్నారు. కల్యాణ్రామ్, తమన్నా జంటగా నటించిన చిత్రం ‘నా నువ్వే’. జయేంద్ర దర్శకత్వంలో మహేశ్ కోనేరు సమర్పణలో కిరణ్ ముప్పవరపు, విజయ్ వట్టికూటి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదలవుతోంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్లో నిర్వహించిన ప్రీ–రిలీజ్ వేడుకలో ఎన్టీఆర్ మాట్లాడుతూ– ‘‘ఓ నటుడిగా సినిమా హిట్ అయిందా? లేదా? అన్నదానికంటే ‘బాగా నటించాడ్రా’.. అనే చప్పట్లే ఎంతో ముఖ్యం. కొత్తగా ట్రై చేసినప్పుడు ఈ టెన్షన్లు సర్వసాధారణం. కానీ మీరు (కల్యాణ్రామ్) టెన్షన్ పడాల్సిన పనిలేదు. మన ప్రేక్షక దేవుళ్లది, మన అభిమానులది చాలా పెద్ద హృదయం. జెన్యూన్గా కష్టపడితే ఆ కష్టాన్ని గుర్తించి పెద్ద పీట వేయడం ఈ రోజు తెలుగు చలనచిత్ర పరిశ్రమకి కొత్తేమీ కాదు. అలాంటి కోవకు చెందిన చిత్రాల్లో ‘నా నువ్వే’ కూడా తప్పకుండా నిలుస్తుందని నా నమ్మకం. మీరు పడిన కష్టం, టెన్షన్ వృథా పోదు. ఈ సినిమా రిలీజ్ తర్వాత గంట మాట్లాడతానని అన్న చెప్పారంటే ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారో అర్థమవుతోంది. ఆ కాన్ఫిడెన్స్ యాక్టర్కి అవసరం. జయేంద్ర సార్కి చాలా గట్స్ ఉన్నాయి. ఈ సినిమాని ఓ ఛాలెంజ్లా భావించి చేశారాయన. షరెత్గారి కెరీర్లో ‘నా నువ్వే’ బెస్ట్ ఆల్బమ్ అవుతుంది. అనంత శ్రీరామ్గారు చక్కటి సాహిత్యం అందించారు. ఈ సినిమా నిర్మాతలు విజయ్గారు, కిరణ్గారు, మహేశ్లకు థ్యాంక్స్. ఇలాంటి ఓ ప్రయత్నం చేసేటప్పుడు చాలా దమ్ముండాలి. రిజల్ట్ గురించి మాట్లాడుకోకుండా కథను నమ్మి ఈ సినిమా తీశారు. ఈ చిత్రం అందరి కెరీర్లో.. ముఖ్యంగా మా కల్యాణ్ అన్న కెరీర్లో మైలురాయిగా నిలిచిపోవాలి. ఇంకా ఇలాంటి అద్భుతమైన చిత్రాలు, కొత్త కొత్త ప్రయోగాలు ఆయన చేయాలి. మరిన్ని ప్రయోగాలు చేసే ఎంకరేజ్మెంట్ ఈ సినిమా అన్నకు ఇవ్వాలని కోరుకుంటున్నా’’ అన్నారు. జయేంద్ర మాట్లాడుతూ– ‘‘నిర్మాతలకి లాస్ ఏంజెల్స్లో ‘నా నువ్వే’ కథ చెప్పాను. వెంటనే సినిమా చేద్దామన్నారు. కల్యాణ్రామ్గారు నాపై నమ్మకంతో ఒకే సిట్టింగ్లో కథ ఓకే చేశారు. ఇప్పటి వరకూ ఆయన యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలు చేశారు. ఇది రొమాన్స్ జానర్లో ఉంటుంది. 14న సినిమా చూశాక ప్రేక్షకులు కల్యాణ్రామ్ని ‘వాట్ ఏ లవర్ బోయ్’ అంటారు. గత చిత్రాలకంటే ఈ చిత్రంలో తమన్నా చాలా ఫ్రెష్గా కనిపిస్తారు. ఈ చిత్రంలో రెండు పెద్ద సర్ప్రైజ్లున్నాయి. ఒకటి కల్యాణ్ మేకోవర్, రెండోది తమన్నా పాత్ర. ఇది పూర్తి రొమాంటిక్ ఫిల్మ్ కాదు. యువతరంతో పాటు కుటుంబ సభ్యులందరూ కలసి చూసేలా ఉంటుంది’’ అన్నారు. సమర్పకులు మహేశ్ కోనేరు మాట్లాడుతూ– ‘‘ఇది నా తొలి చిత్రం. ఈ సినిమా ఎక్స్ట్రా స్పెషల్ అని చాలాసార్లు చెప్పా. సపోర్ట్ చేస్తున్న అందరికీ చాలా థ్యాంక్స్. ఈ సినిమాలో కొత్త కల్యాణ్రామ్గారు కనిపిస్తారు. మాస్ హీరోగా ఇప్పటికే మార్క్ తెచ్చుకున్న ఆయన ఈ సినిమాతో క్లాస్ ఆడియన్స్కి మరింత దగ్గరవుతారని చాలా నమ్మకంగా ఉంది’’ అన్నారు. కల్యాణ్ రామ్ మాట్లాడుతూ– ‘‘నా నువ్వే’ చిత్రం పాటలు చాలా పెద్ద హిట్ అయినందుకు వెరీ హ్యాపీ. నా కెరీర్లో వన్నాఫ్ ది బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్ ఇచ్చినందుకు షరెత్ సార్కి థ్యాంక్యూ. ‘నా నువ్వే’ థీమ్ సాంగ్ ఇప్పటికీ రోజుకి పదిసార్లు వింటూ ఉంటాను. జయేంద్రగారు కథ చెప్పినప్పుడు నచ్చింది. అప్పుడు ఆయన్ని ఒక్కటే ప్రశ్న అడిగా. ఈ రోల్కి నేను ఎలా సరిపోతారని మీరు భావిస్తున్నారు? అని. నా కెరీర్లో నేను చాలా కమర్షియల్ సినిమాలు చేశా. ఎక్కువమంది అటువంటి చిత్రాలతోనే నన్ను కలుస్తున్నారు. ఇదొక ఔట్ అండ్ ఔట్ రొమాంటిక్ ఫిల్మ్. నేనెప్పుడూ ఇలాంటి చిత్రం చేయలేదు. అప్పుడు ఆయన నాతో అన్నారు. ‘ఓ రొమాంటిక్ హీరోతో రొమాంటిక్ సినిమా చేయొచ్చు. దట్స్ సింపుల్ అండ్ ఈజీ. కానీ ప్రేక్షకులకు ఏం కొత్తగా ఉంటుంది? కానీ, ఇప్పటి వరకూ మీరు చేయని ఈ రోల్ చేసి ప్రేక్షకులకు నచ్చితే అది నాకు పెద్ద సక్సెస్’ అన్నారు. నాపై ఆయన నమ్మకం చూసి ఈ సినిమా చేశా. నా వద్దకి ఇటువంటి ప్రాజెక్ట్ తీసుకురావడంతో పాటు పెద్ద టెక్నీషియన్స్, పెద్ద హీరోయిన్ని తీసుకొచ్చినందుకు నిర్మాతలకు థ్యాంక్స్. చాలా ఏళ్లుగా నేను కొత్తగా ట్రై చేస్తున్నాను. ప్రేక్షకులు, అభిమానులు ఆదరిస్తున్నారు. నా ఇన్నేళ్ల కెరీర్లో ఇలాంటి సినిమా చేయలేదు. నా ఈ ప్రయత్నాన్ని మీరు మళ్లీ ఆదరిస్తారని కోరుకుంటున్నా. సినిమా విడుదలయ్యాక గంట సేపు మాట్లాడతా. ‘నాన్నకు ప్రేమతో’ సినిమాతో తారక్ టోటల్గా ఛేంజోవర్ అయ్యాడు. నేను కూడా ఇలా ఓ సినిమాకి చేయాలనుకున్నా. ఆ దేవుడు, మా తాతగారు (ఎన్టీఆర్) విని, నాకు ఈ సినిమా ఇచ్చారని నమ్ముతున్నా’’ అన్నారు. చిత్రనిర్మాత కిరణ్, సంగీత దర్శకుడు షరెత్, పాటల రచయిత అనంత శ్రీరామ్, నిర్మాతలు నాగవంశీ, పీడీవీ ప్రసాద్, విజయ్ చిల్లా తదితరులు పాల్గొన్నారు. -
హృదయాన్ని హత్తుకునేలా...
కల్యాణ్ రామ్, తమన్నాలను సరికొత్త డైమన్షన్లో చూపించే చిత్రం ‘నా నువ్వే’. ఇద్దరూ సరికొత్త మేకోవర్లో కనిపిస్తారు. హృదయాన్ని హత్తుకునే బ్యూటిఫుల్ రొమాంటిక్ లవ్స్టోరీ ‘నా నువ్వే’’ అన్నారు చిత్ర నిర్మాతలు కిరణ్ ముప్పవరపు, విజయ్ వటికూటి. కల్యాణ్రామ్, తమన్నా జంటగా దర్శకుడు జయేంద్ర రూపొందించిన రొమాంటిక్ లవ్స్టోరీ ‘నా నువ్వే’. మహేశ్ కోనేరు సమర్పణలో ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్, కూల్ బ్రీజ్ సినిమాస్ నిర్మాణంలో కిరణ్ ముప్పవరపు, విజయ్ వటికూటి నిర్మించారు. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని క్లీన్ ‘యూ’ సర్టిఫికేట్ పొందింది. ఈ సినిమాను జూన్ 14న రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ–‘‘జయేంద్రగారు అద్భుతమైన ఫీల్తో ఈ సినిమాను తెరకెక్కించారు. పీసీ శ్రీరామ్గారు ప్రతీ ఫ్రేమ్ను ఎక్స్ట్రాడినరీగా చూపించారు. శరత్ సంగీతానికి మంచి స్పందని లభిస్తోంది’’ అని అన్నారు. -
కళ్యాణ్రామ్ `నా నువ్వే' ట్రైలర్ రిలీజ్
-
అదే బ్యానర్లో మరో సినిమా
త్వరలో నా నువ్వే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న కల్యాణ్ రామ్.. తన తదుపరి చిత్రాన్ని ఓకే చేశాడు. ఏప్రిల్ 25న కొత్త సినిమా ప్రారంభం కానుంది. ఈ సినిమాను కూడా నా నువ్వే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్లోనే నిర్మించనున్నారు. జల్సా, దూకుడు, ఆగడు లాంటి చిత్రాలకు పనిచేసిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాలో కల్యాణ్ రామ్ సరసన నివేదా థామస్, షాలిని పాండేలు హీరోయిన్లుగా నటించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న నా నువ్వే మేలో రిలీజ్కు రెడీ అవుతోంది. తమన్నా హీరోయిన్గా నటించిన ఈ సినిమా జయేంద్ర దర్శకత్వంలో రూపొందుతోంది. -
అందుకే ‘ఎంఎల్ఎ’ కథ ఎంచుకున్నా
‘‘నా పేరు ఉపేంద్ర రెడ్డి. మా బ్రదర్ పేరు మాధవ్ రెడ్డి. ఆయన రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారు. ఆయన నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. ఆయన లేకుంటే ఇండస్ట్రీలో నేను ఇన్నేళ్లు ఉండేవాణ్ని కాదు. అందుకే నా పేరుకి మా బ్రదర్ పేరు యాడ్ చేసుకుని ఉపేంద్రమాధవ్ అని పెట్టుకున్నా’’ అని ఉపేంద్ర మాధవ్ అన్నారు. కల్యాణ్ రామ్, కాజల్ అగర్వాల్ జంటగా ఆయన దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఎంఎల్ఏ’. టి.జి.విశ్వప్రసాద్ సమర్పణలో కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా ఉపేంద్ర మాధవ్ మాట్లాడుతూ– ‘‘మాది గుంటూరు జిల్లా అమరావతి రోడ్డులోని జొన్నలగడ్డ. దర్శకుడు కావాలనే హైదరాబాద్ వచ్చా. ప్రియదర్శిని రామ్గారి వద్ద ‘మనోడు, టాస్’ చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా, అసోసియేట్ డైరెక్టర్గా చేశా. ఆయన వద్దే యాడ్స్, కార్పొరేట్ ఫిల్మ్స్ చేసేవాణ్ని. నా ఫ్రెండ్ సాయి ద్వారా ‘దూకుడు’ సినిమాలో స్క్రిప్ట్ విభాగంలో అసోసియేట్గా పనిచేసే చాన్స్ వచ్చింది. ‘పాండవులు పాండవులు తుమ్మెద, యాక్షన్ త్రీడీ, బాద్షా, ఆగడు, బ్రూస్లీ’ చిత్రాలకు రచనా విభాగంలో పనిచేశా. ‘బ్రూస్లీ’ తర్వాత సొంతంగా కథలు రాసుకోవడం మొదలుపెట్టా. శ్రీనువైట్లగారితో బాగా ట్రావెల్ అయ్యేవాణ్ని. ఓ కమర్షియల్ సినిమాతోనే లాంచ్ కావాలని ‘ఎంఎల్ఎ’ కథ ఎంచుకున్నా. ‘పటాస్’ సినిమా టైమ్లో అనిల్ రావిపూడి ద్వారా కల్యాణ్రామ్తో పరిచయం అయింది. మంచి కథ తీసుకురా సినిమా చేద్దామన్నారు ఆయన. రెండేళ్ల తర్వాత ‘ఎంఎల్ఎ’ కథ ఆయనకు వినిపించడం, నచ్చడం, సినిమా మొదలవడం జరిగిపోయాయి. ఈ కథ బాగుందని శ్రీనువైట్లగారు కూడా అభినందించారు. సినిమా విడుదలయ్యాక చాలామంది దర్శకులు ఫోన్ చేసి ‘మంచి కథ. బాగా తీశావ్’ అని మెచ్చుకున్నారు. మా సినిమాను ఇంత బాగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు. నా రెండో సినిమా కూడా పీపుల్ మీడియా, బ్లూ ప్లానెట్ బ్యానర్స్లోనే ఉంటుంది’’ అన్నారు. -
ఒక్క సినిమా చేసి వెనక్కి వెళ్లిపోదామనుకున్నా
‘‘కల్యాణ్ రామ్తో పదేళ్ల కిందట ‘లక్ష్మీకళ్యాణం’ సినిమా చేశా. ‘ఎంఎల్ఏ’ చిత్రంలో మళ్లీ తనతో నటించడం నా పాత స్నేహితుణ్ని కలిసినట్లు అనిపించింది. ఎవరి వ్యక్తిగత జీవితాలు, సినిమాలతో బిజీగా ఉన్నాం. ఈ పదేళ్లలో ఓ పబ్లిక్ ఫంక్షన్లో ఇద్దరం కలిశామంతే. మధ్యలో ఎప్పుడూ కలవలేదు’’ అని కాజల్ అగర్వాల్ అన్నారు. కల్యాణ్ రామ్, కాజల్ జంటగా ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఎంఎల్ఏ’. టి.జి.విశ్వప్రసాద్ సమర్పణలో కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి నిర్మించిన ఈ సినిమా ఈ రోజు విడుదలవుతోంది. ఈ సందర్భం గా కాజల్ పంచుకున్న విశేషాలు... ► ఆసక్తికరమైన సినిమాలు చూడాలని ప్రేక్షకులు కోరుకుంటారు. అందుకే.. ఓ నటిగా విభిన్నమైన పాత్రలు చేయాలనుకున్నా. కమర్షియల్ సినిమాలు, కొత్త తరహా సినిమాలను బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నా. ► ‘ఎంఎల్ఏ’లో నాది ఎన్నారై అమ్మాయి పాత్ర. స్ట్రాంగ్ క్యారెక్టర్. నా పాత్రలో ఓ షేడ్ ఉంటుంది. నేనెందుకు అలా చేస్తుంటాననే విషయం ఇంటర్వెల్ వరకూ తెలియదు. దానికి కారణాలేంటి? అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ► ఎంటర్టైనింగ్తో పాటు మంచి మెసేజ్ ఉన్న చిత్రమిది. కొత్తదనం ఉన్న సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నా. నా పాత్రలకు న్యాయం చేయడానికి సిన్సియర్గా కృషి చేస్తున్నాను. నేను చేస్తున్న సినిమాలు, పాత్రల పట్ల చాలా సంతోషంగా ఉన్నా. ► ‘లక్ష్మీ కల్యాణం’ చేసేటప్పుడు ‘ఒక సినిమా చేస్తే చాలు.. మానేసి వెనక్కి వెళ్లిపోయి ఎంబీఏ చదువుకుందామనిపించింది’. కానీ.. జీవితం వేరేలా ఉంటుంది కదా! ఈ ప్రయాణం హ్యాపీగా ఉంది. ఇంత మంచి లైఫ్ ఇచ్చి, వారి ఫ్యామిలీలో నన్ను ఒకరిగా భావించిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ► తెలుగు చిత్ర పరిశ్రమలోనే ‘నాకు లైఫ్’ అని ఐదు సినిమాలు చేసిన తర్వాత అనిపించింది. ‘మగధీర’ సినిమా చేసేటప్పుడు ‘వందశాతం ఇదే నా లైఫ్’ అని అర్థమైంది. ప్రస్తుతం ‘క్వీన్’ రీమేక్ ‘ప్యారిస్ ప్యారిస్’లో నటిస్తున్నా. బెల్లంకొండ సాయి శ్రీనివాస్తో ఓ సినిమా చేస్తున్నా. ‘పక్కా లోకల్’ తర్వాత ఐటమ్ సాంగ్స్లో కనిపించడం లేదేంటని అడుగుతున్నారు. అది ఎప్పుడో ఒకసారి సరదాకి అలా చేస్తుంటాను అంతే. హిందీ సినిమా చేశామంటే ఏదో ఒక హిందీ సినిమా చేయటానికి వెళ్లినట్టు ఉండకూడదు. మంచి రోల్ ఉంటేనే చేస్తాను. నా పాత సినిమాల్ని చూసి ఎప్పుడూ సిగ్గుపడను. అరే ఆ సీన్ ఇలా చేశానేంటి? దాని బదులు ఇంకోలా చేసుంటే బావుండేది కదా అని ఫీల్ అవుతాను.. అంతే. ఆ హీరో ఈ హీరోతో అని కాదు ఇండస్ట్రీలో అందరితో యాక్ట్ చేయాలని ఉంది. చేసిన వాళ్లతో మళ్లీ మళ్లీ యాక్ట్ చేయాలనుంది. కల్యాణ్ రామ్ ఎంత మంచి ‘ఎంఎల్ఏ’ (మంచి లక్షణాలున్న అబ్బాయి) అంటే నేను పదికి ఎనిమిదిన్నర మార్కులు ఇస్తాను. పక్కా ఫ్యామిలీ మ్యాన్. -
కాంబినేషన్ కాదు... కథే ముఖ్యం – కల్యాణ్ రామ్
‘‘కాంబినేషన్ కంటే కథను నమ్మి సినిమాలు తీసే నిర్మాతలంటే ఇష్టం. అలాంటి వారిలో ‘ఎంఎల్ఏ’ చిత్రనిర్మాతలు ముందుంటారు. తప్పకుండా వీరు పెద్ద నిర్మాతలు అవుతారు’’ అన్నారు కల్యాణ్ రామ్. ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో కల్యాణ్ రామ్, కాజల్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘ఎంఎల్ఏ’. టి.జి. విశ్వప్రసాద్ సమర్పణలో కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ–రిలీజ్ ఫంక్షన్లో కల్యాణ్ రామ్ మాట్లాడుతూ–‘‘పటాస్’ కథ విన్నప్పుడు ఎంత ఎగ్జయిట్ అయ్యానో ‘ఎంఎల్ఏ’ కథ విన్నప్పుడూ అంతే ఎగ్జయిట్ అయ్యాను. ఈ సినిమాలో ఉపేంద్ర నన్ను కొత్తగా చూపించాడు. ‘పటాస్, ఇజం’ సినిమాలు చేస్తున్నప్పుడు ఎంత బాగా ఫీలయ్యానో.. ఈ సినిమాకూ అలాగే ఫీలయ్యాను. కొత్త దర్శకుడిని గైడ్ చేయాల్సిన బాధ్యత సినిమాటోగ్రాఫర్ది. దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ది భార్య, భర్తల బంధం. నేను పనిచేసిన కెమెరామెన్స్లో బెస్ట్ కెమెరామెన్ ప్రసాద్ మూరెళ్లగారు. కాజల్తో రెండో చిత్రమిది. ఇప్పటివరకూ నేను పధ్నాలుగు సినిమాలు చేస్తే.. తను 50 సినిమాలు చేసింది. అందుకు కారణం తన డెడికేషన్’’ అన్నారు. ‘‘రియల్ లైఫ్లో ఎవరి బ్యాగ్రౌండ్ లేకుండా ఎమ్మెల్యే అవడం ఎంత కష్టమో నాకు తెలియదు. కానీ, ఎవరి బ్యాగ్రౌండ్ లేకుండా డైరెక్టర్ అవడం ఎంత కష్టమో తెలుసు. ఉపేంద్ర నా దగ్గర చాలా సంవత్సరాలు పనిచేశాడు. ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో తెలుసు. తప్పకుండా సినిమా హిట్ అవుతుంది’’ అన్నారు దర్శకుడు శ్రీను వైట్ల. ‘‘తన బాధ్యతను ఎక్కువగా ప్రేమించే డైరెక్టర్స్లో ఉపేంద్ర ఒకరు. సాలూరి రాజేశ్వరరావు తర్వాత ఆ స్థాయిలో సంగీతం అందించగల మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మగారు’’ అన్నారు బ్రహ్మానందం. ‘‘ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు డి.సురేశ్ బాబు. ‘‘కల్యాణ్ రామ్గారికి ‘ఎంఎల్ఏ’ టైటిల్ చక్కగా యాప్ట్ అవుతుంది’’ అన్నారు దర్శకుడు ఎన్.శంకర్. ‘‘నేనే రాజు నేనే మంత్రి’ సమయంలోనే ఉపేంద్ర ఈ కథ చెప్పారు. నిర్మాతల గురించి ఆలోచించే హీరో కల్యాణ్ రామ్. చేతికి గాయమైనా కమిట్మెంట్తో సినిమాను పూర్తి చేశారు’’ అని కిరణ్ రెడ్డి అన్నారు. ‘‘కథ వినగానే సినిమా చేస్తున్నాం అన్నారు కల్యాణ్ రామ్గారు. ఆయన నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. నేను చెప్పిన బడ్జెట్ కంటే ఎక్కువ అయింది. మణిశర్మగారు పాటలు ఎంత బాగా చేశారో.. రీ–రికార్డింగ్ అంత కంటే బాగా చేశారు’’ అన్నారు ఉపేంద్ర మాధవ్. పోసాని, రవికిషన్, కోన వెంకట్, వీఎన్ ఆదిత్య, రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. -
వర్క్ హార్డ్... సక్సెస్ విల్ ఫాలో
‘‘కొత్త దర్శకులతోనే సినిమాలు చేయాలని అనుకోలేదు. స్క్రిప్ట్లో జెన్యూనిటీ కనిపిస్తే న్యూ డైరెక్టరా? ఎస్టాబ్లిష్డ్ డైరెక్టరా? అని ఆలోచించను. సినిమా చేసేస్తాను’’ అన్నారు కల్యాణ్ రామ్. నూతన దర్శకుడు ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో కల్యాణ్ రామ్, కాజల్ అగర్వాల్ జంటగా రూపొందిన చిత్రం ‘ఎం.ఎల్.ఎ’. బ్లూ ప్లానెట్ ఎంటర్టైన్మెంట్ ఎల్.ఎల్.పి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ పై భరత్ చౌదరి, కిరణ్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం మార్చి 23న విడుదల కానుంది ఈ సందర్భంగా కల్యాణ్ రామ్ చెప్పిన విశేషాలు. ► పోలింగ్ (సినిమా విడుదలను ఉద్దేశించి) దగ్గర పడింది.ఈ పోలింగ్లో విశేషమేంటంటే రిజల్ట్ కూడా అదే రోజు వచ్చేస్తుంది. సినిమా టైటిల్లోనే హీరో క్యారెక్టరైజేషన్ ఉంటుంది. ► సినిమా పొలిటికల్ డ్రామానే బట్ పూర్తిగా పాలిటిక్స్ గురించి మాట్లాడం. లవ్ స్టోరీతో బిగిన్ అయి సెకండ్ హాఫ్ పాలిటిక్స్ వైపు మళ్లుతుంది. కార్పొరేట్ ఎడ్యుకేషన్ గురించి కూడా డిస్కస్ చేశాం. ► ఉపేంద్ర మాధవ్ రైటర్ అవ్వటం వల్ల సినిమాలో డైలాగ్స్ చాలా బాగా వచ్చాయి. సినిమాలో నా డైలాగ్ డిక్షన్ చాలా కొత్తగా ఉంటుంది. ఈ విషయంలో ఉపేంద్ర చాలా పర్టికులర్గా ఉన్నాడు. ► ‘ఏంటి ఇంత చెత్త సినిమా చేశాడు’ అనే రివ్యూ అయితే ఇప్పటివరకు రాలేదు. నా గురించి ఏమైనా బ్యాడ్ రివ్యూలు వస్తే వాటిని అనలైజ్ చేసుకొని వర్కౌట్ చేస్తాను. మై ఫ్యామిలీ ఈజ్ మై బిగ్గెస్ట్ క్రిటిక్. ‘వర్క్ హార్డ్.. సక్సెస్ విల్ ఫాలో’ అనే ఫిలాసఫీని నమ్ముతాను. సక్సెస్ కోసం పరిగెత్తినా కొన్నిసార్లు రాకపోవచ్చు. మనం ఏం చేసినా మనకు సంతృప్తిగా అనిపించాలి. ► సాయిధరమ్ తేజ్, నేను ఓ మల్టీస్టారర్ చేద్దాం అనుకున్నాం. బట్ స్క్రిప్ట్ కుదరకఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. స్క్రిప్ట్ నచ్చితే ఎవరితో అయినా మల్టీస్టారర్ సినిమాలు చేస్తాను. ఈ జులైలో ఒక మల్టీస్టారర్ సినిమా అనౌన్స్ చేయనున్నాం. ► ప్రొడ్యూసర్గా నేనెప్పుడూ హ్యాపీనే. ‘ఈ సినిమా ఎందుకు చేశాను’ అని ప్రొడ్యూసర్గా ఎప్పూడు అనుకోలేదు. ఏంటి ఇంత తలనొప్పి సినిమా చేశాడు? అని ఆడియన్స్ కూడా అనుకోకూడదు. బయట ప్రొడక్షన్స్తో చేసేటప్పుడు అనుకున్న బడ్జెట్లోనే పూర్తి చేయాలని చూస్తాను. ► తారక్, నేను ఎక్కువగా సినిమాల గురించే మాట్లాడుకుంటాం.‘ఎం.ఎల్.ఎ’ ట్రైలర్ చూసి చాలా డిఫరెంట్గా ఉన్నావు, చాలా కాన్ఫిడెంట్గా కూడా కనిపిస్తున్నావు’ అన్నాడు. మా డిస్కషన్లో పాలిటిక్స్ రాదు. ఎక్కవగా కార్లు, గాడ్జెట్స్ గురించి డిస్కస్ చేస్తాం. ► ఈ సినిమాలో ఎం.ఎల్.ఏ పలికిన సంభాషణలు కానీ టైటిల్ కానీ నా ఫ్యూచర్ పాలిటిక్స్ గురించి ఏమీ ఇండికేషన్ ఇస్తున్నట్లు కాదు. ఇది సినిమాలో నా క్యారెక్టర్ మాత్రమే. రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదు. ► నెక్ట్స్ ‘నా నువ్వే’ సినిమా చేస్తున్నాను. ఫుల్ లెంగ్త్ లవ్ స్టోరీ ఫస్ట్ టైమ్ చేస్తున్నాను. నందమూరి కల్యాణ్రామ్ హీరోగా ‘ఉయ్యాల జంపాల, మజ్ను’ చిత్రాల ఫేమ్ విరించి వర్మ దర్శకత్వంలో ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై ‘జెమినీ’ కిరణ్ నిర్మించనున్న సినిమాను ఆదివారం ఉగాది రోజున అధికారికంగా ప్రకటించారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో సినిమా సెట్స్పైకి వెళ్లనుంది. ‘‘ చక్కని కుటంబ నేపథ్యం ఉన్న చిత్రమిది. ఇతర తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం’’ అన్నారు నిర్మాత. -
ఎమ్మెల్యే వినోదం
‘లక్ష్మీ కళ్యాణం’ సినిమా విడుదలైన పదకొండేళ్లకు కల్యాణ్ రామ్, కాజల్ అగర్వాల్ కలిసి నటించిన చిత్రం ‘ఎంఎల్ఎ’. ‘మంచి లక్షణాలున్న అబ్బాయ్’ అన్నది ఉపశీర్షిక. ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో బ్లూ ప్లానెట్ ఎంటర్టైన్మెంట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్పై కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న విడుదలకానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘మా బ్లూ ప్లానెట్ ఎంటర్టైన్మెంట్స్, సురేశ్ ప్రొడక్షన్స్ అసోసియేషన్లో గతేడాది విడుదలైన ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా పెద్ద సక్సెస్ సాధించింది. పీపుల్ మీడియా అసోసియేషన్లో చేసిన ‘ఎంఎల్ఎ’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. ఈరోజు సెన్సార్ కార్యక్రమాలు జరగనున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ నెల 23న సినిమా విడుదల చేస్తాం. మా బ్యానర్లో వచ్చిన ‘నేనే రాజు నేనే మంత్రి’ కంటే ‘ఎంఎల్ఎ’ ఇంకా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘టైటిల్ని చూసి ఇది రాజకీయ నేపథ్యం ఉన్న సినిమా అనుకోవద్దు. పూర్తి స్థాయి వినోదాత్మకంగా ఉంటుంది. తొలిభాగం కార్పొరేట్ నేపథ్యంలో, రెండో భాగం రూరల్ నేపథ్యంలో సాగుతుంది. నాకు ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు, కల్యాణ్రామ్గారికి థ్యాంక్స్’’ అన్నారు ఉపేంద్ర మాధవ్. చిత్రసమర్పకులు విశ్వప్రసాద్, సహ నిర్మాత వివేక్ కూచిభొట్ల పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ. ∙కల్యాణ్ రామ్, కాజల్ -
ప్రయోగాత్మక చిత్రంలో నందమూరి హీరో
ప్రస్తుతం పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఎమ్మెల్యే సినిమాతో పాటు రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న నా నువ్వే సినిమాల షూటింగ్లో బిజీగా ఉన్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. ఒకేసారి షూటింగ్ జరుపుకుంటున్న ఈ రెండు సినిమాలను సమ్మర్ సీజన్లోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాల తరువాత కళ్యాణ్ రామ్ ఓ ప్రయోగాత్మక చిత్రం చేయనున్నాడు. ఇప్పటి వరకు యాక్షన్, రొమాంటిక్ స్టోరీలు మాత్రమే చేసిన కళ్యాణ్ రామ్ త్వరలో థ్రిల్లర్ సినిమా చేసేందుకు అంగీకరించాడు. విజయ్ మద్దలను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ సస్పెన్స్ థ్రిల్లర్ కథతో సినిమా చేసేందుకు కళ్యాణ్ రామ్ అంగీకరించాడట. దర్శకుడు కథ చెప్పిన విదానంతో పాటు కథలోని మలుపుకు కూడా నచ్చటంతో వెంటనే ఈ నందమూరి హీరో ఒకే చెప్పాడు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న సినిమాలు పూర్తయిన వెంటనే కొత్త సినిమాను ప్రారంభించేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు కళ్యాన్ రామ్. జై లవకుశ సినిమాతో నిర్మాతగా ఘనవిజయం సాధించిన ఈ నందమూరి హీరో కథ ఎంపికలో కొత్తదనం చూపిస్తున్నాడు. -
లెట్స్ డూ ట్యాంగో
కత్తి యుద్ధం నేర్చుకోవాలా? గుర్రపు స్వారీ నేర్చుకోవాలా? బస్తీ మే సవాల్.. నేర్చేసుకుంటా అంటూ ‘బాహుబలి’ సినిమా కోసం తమన్నా ఆ రెంటిలో శిక్షణ తీసుకున్నారు. ఇప్పుడు మరో చాలెంజ్కి రెడీ అయ్యారు. అయితే ఈసారి ఫైట్ కోసం కాదండి. సాంగ్ కోసం. తమన్నా ఓ కొత్త డాన్స్ కోసం ప్రాక్టీస్ చేస్తూ తెగ శ్రమిస్తున్నారట. చిన్న చిన్న గాయాలు కూడా చేసుకున్నారట. తమన్నాను ఇంతలా ఇబ్బంది పెడుతున్న డాన్స్ పేరేంటంటే ‘ట్యాంగో’. ఈ ట్యాంగో డాన్స్ ఏంటా అనుకుంటున్నారా? పార్టనర్స్తో కలిసి చేసే డ్యాన్స్ను ట్యాంగో డాన్స్ అంటారు. కొంచెం జిమ్నాస్టిక్స్ టచ్ డ్యాన్స్లో కనిపిస్తుంది. అమెరికన్, యూరోపియన్ కంట్రీస్లో ఈ డాన్స్ బాగా ఫేమస్. ఏ సినిమా కోసం తమ్మూ నేర్చుకుంటున్నారంటే.. కల్యాణ్ రామ్ హీరోగా ‘180’ ఫేమ్ జయేంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘నా నువ్వే’. ఈ సినిమా కోసమే ట్యాంగో డాన్స్ నేర్చుకుంటున్నారు తమన్నా. సినిమాలో వచ్చే ఓ ప్రత్యేకమైన సాంగ్ కోసం నృత్య దర్శకురాలు బృంద ఆధ్వర్యంలో తమన్నా ప్రాక్టీస్ చేస్తున్నారట. ‘‘ట్యాంగో డాన్స్ను తొలిసారి ప్రయత్నిస్తున్నాను. అనుకున్నంత సులువుగా ఏం లేదు. ప్రాక్టీస్లో చిన్న చిన్న గాయాలు కూడా చేసుకున్నాను. కానీ బృందా మాస్టర్ హెల్ప్ వల్ల ఈ డ్యాన్స్ స్టైల్ను నేర్చుకోగలిగాను’’ అని తమన్నా పేర్కొన్నారు. -
వేసవికి నువ్వే
కల్యాణ్రామ్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ప్రముఖ యాడ్ ఫిల్మ్ మేకర్ జయేంద్ర దర్శకత్వంలో కూల్ బ్రీజ్ సినిమాస్ నిర్మాణంలో ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో రూపొందుతోన్న ఈ చిత్రానికి ‘నా.. నువ్వే’ టైటిల్ ఖరారు చేశారు. నిర్మాతలు కిరణ్ ముప్పవరపు, విజయ్ వట్టికూటి మాట్లాడుతూ –‘‘సరికొత్త కథాంశంతో, ఫ్రెష్ లుక్తో జయేంద్రగారు ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ నెలాఖరుకి షూటింగ్ దాదాపు పూర్తవుతుంది. ‘నా.. నువ్వే’ టైటిల్ కరెక్ట్గా సరిపోతుంది. కల్యాణ్ రామ్, తమన్నాల కాంబినేషన్ ఈ చిత్రానికే హైలైట్. పి.సి. శ్రీరామ్గారి కెమెరా వర్క్ ఈ సినిమాకి చాలా పెద్ద ఎసెట్’’ అన్నారు. ‘‘లవ్, యాక్షన్, ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా రూపొందుతోన్న చిత్రమిది. పి.సి. శ్రీరామ్, జయేంద్ర వంటి టాప్ క్వాలిటీ టెక్నికల్ టీమ్తో ఈ చిత్రం నిర్మిస్తున్నాం. వేసవి సెలవుల్లో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని సమర్పకుడు మహేష్ కోనేరు అన్నారు. తనికెళ్ల భరణి, పోసాని కృష్ణ మురళి, ‘వెన్నెల’ కిశోర్, ప్రవీణ్, ‘బిత్తిరి’ సత్తి, ప్రియ, సురేఖవాణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: షరెత్. -
ట్యాప్ గుర్తుకు ఓటేయండి!
ప్రతి ఊరు... ప్రతి ఇల్లు... నియోజకవర్గమంతా చుట్టేస్తున్నారు నందమూరి కల్యాణ్రామ్. ‘ట్యాప్ గుర్తుకు ఓటేయండి’ అని ప్రజల్ని కోరుతున్నారు. ట్యాప్ గుర్తుకు ఓటేయడం ఏంటి? ఆయన ఏదైనా రాజకీయ పార్టీలో చేరారా? లేదా కొత్తగా పార్టీ ఏదైనా ప్రారంభించారా? అని ఏవెవో ఊహించుకోకండి! ఎందుకంటే... ఆయన ఓట్లు వేయమంటున్నది రీల్ లైఫ్లోనే! ఉపేంద్ర మాధవ్ను దర్శకుడిగా పరిచయం చేస్తూ, కల్యాణ్రామ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘ఎమ్మెల్యే’. మంచి లక్షణాలు ఉన్న అబ్బాయి... అనేది ఉపశీర్షిక. ఇటీవలే ఈ సినిమాలో కల్యాణ్రామ్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సన్నివేశాలను చిత్రీకరించినట్టు ఉన్నారు. ‘‘వీరభద్రాపురం నియోజకవర్గ ప్రజలు ట్యాప్ గుర్తుకే ఓట్లు వేసి అత్యంత మెజారిటితో గెలిపించ ప్రార్థన. మీ కల్యాణ్! ట్యాప్ గుర్తుకే మన ఓటు’’ అని రాసిన వాల్ పోస్టర్లు, పాంప్లెట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఈ సినిమాలో కల్యాణ్రామ్ ఎమ్మెల్యేగా నటించబోతున్నారని ప్రేక్షకులు డిసైడ్ అయ్యారు. వీరభద్రాపురం అనే విలేజ్ పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలంలో ఉంది. సో... గోదావరి అందాలను ఈ సినిమాలో చూడొచ్చని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను కిరణ్రెడ్డి, భరత్ చౌదరి నిర్మిస్తున్నారు. -
అల్లుడు... కొడుకు!
ఫొటోలు చూడగానే జగపతిబాబు, కల్యాణ్రామ్ గురించే న్యూస్ అని ఊహిస్తారు. అల్లుడేంటి? కొడుకేంటి? అని కన్ఫ్యూజ్ అయ్యే ఉంటారు. యాక్చువల్లీ కల్యాణ్ రామ్కి జగపతిబాబు బావ. మధ్యలో ఈ బావేంటి అనుకుంటున్నారా? అసలు విషయంలోకి వస్తే... ప్రముఖ నటులు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు బయోపిక్ని తేజ దర్శకత్వంలో బాలకృష్ణ నిర్మించనున్న విషయం తెలిసిందే. తండ్రి ఎన్టీఆర్ పాత్రను బాలకృష్ణ చేయనున్నారు. ప్రీ–ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాలో ఇతర నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఈ నేపథ్యంలో జగపతిబాబు, కల్యాణ్రామ్ పేర్లు తెరపైకొచ్చాయి. ఎన్టీఆర్ తనయుడు, బాలకృష్ణ అన్నయ్య హరికృష్ణ పాత్రకు కల్యాణ్రామ్ను ఎంపిక చేశారనీ, అల్లుడు చంద్రబాబునాయుడు పాత్ర కోసం జగపతిబాబును అనుకుంటున్నారని టాక్. ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణ పాత్రలో అతని తనయుడు కల్యాణ్రామ్ నటిస్తే నందమూరి అభిమానులకు డబుల్ ధమాకానే. అటు బాబాయ్ బాలకృష్ణ, ఇటు అబ్బాయ్ కల్యాణ్రామ్ తమ తండ్రి పాత్రల్లో ఒకే సినిమాలో కనిపిస్తే ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవడం పక్కా. ఈ పాత్రకు కల్యాణ్రామ్ ఫిక్స్. జగపతిబాబు గురించి మాత్రం తెలియాల్సి ఉంది. మరి.. అల్లుడి పాత్రకు జగపతిబాబు ఫైనలైజ్ అవుతారా? వెయిట్ అండ్ సీ. -
స్క్రీన్ టెస్ట్
► సముద్ర దర్శకత్వంలో కల్యాణ్రామ్ నటించిన ‘విజయ దశమి’లో ‘దీపావళి దీపావళి...’ అనే డ్యూయెట్లో కల్యాణ్రామ్తో ఆడి పాడిన హీరోయిన్ గుర్తుందా? ఎ) హన్సిక బి) వేదిక సి) కాజల్ అగర్వాల్ డి) ప్రియమణి ► ‘సంబరాలో సంబరాలు దీపావళి పండగ సంబరాలు..’ అంటూ విజయశాంతితో స్టెప్పులేసిన హీరో ఎవరో చెప్పుకోండి? ఎ) చిరంజీవి బి) బాలకృష్ణ సి) వెంకటేశ్ డి) నాగార్జున ► ‘అలుక మానవా...’ అని నరకాసురుని స్తుతిస్తూ ‘దీపావళి’ సినిమాలో నారద పాత్ర పాట పాడుతుంది. ఆ నారద పాత్ర పోషించిన నటుడెవరు? ఎ) పద్మనాభం బి) హరనాథ్ సి) కాంతారావు డి) రాజనాల ► ‘చీకటి వెలుగుల రంగేళి.. జీవితమే ఒక దీపావళి’ అనే పాటలో ఆడి పాడిన నటుడెవరు? ఎ) శోభన్బాబు బి) కృష్ణ సి) అక్కినేని నాగేశ్వరరావు డి) శ్రీధర్ ► 2007లో వచ్చిన ‘దీపావళి’ అనే సినిమాలో సటించిన హీరో ఎవరు? ఎ) సురేశ్ బి) వరుణ్ సందేశ్ సి) సాయిరామ్ శంకర్ డి) వేణు తొట్టెంపూడి ► ‘స్వప్న ప్రియ స్వప్న’ అని సాగే దీపావళి పాటలో బాలకృష్ణ నటించారు. ఈ సినిమా దర్శకుడెవరు? ఎ) ముత్యాల సుబ్బయ్య బి) కె. రాఘవేంద్రరావుసి) ఎ. కోదండ రామిరెడ్డి డి) బి. గోపాల్ ► 1960లో వచ్చిన ‘దీపావళి’ సినిమాలో నరకాసురుని పాత్రను పోషించిన నటుడెవరు? ఎ) యస్వీ రంగారావు బి) కైకాల సత్యనారాయణ సి) సీయస్ఆర్ డి) ధూళిపాళ ► ‘నా నవ్వే దీపావళి నా పలుకే దీపాంజలి..’ అంటూ ‘నాయకుడు’ సినిమాలోని ఈ పాటలో ఏ హీరో కనిపిస్తారు? ఎ) రజనీకాంత్ బి) కమల్హాసన్ సి) అరవింద్స్వామి డి) మమ్ముట్టి ► దీపావళి అంటే సత్యభామ గుర్తొస్తుంది... ఈ పేరుతో కమల్హాసన్ చేసిన సినిమా ఏంటి? ఎ) సత్యభామ బి) భామనే సత్యభామనే సి) శ్రీకృష్ణ సత్ యడి) సత్యభామనే ► భానుమతితో కలిసి సుహాసిని నటించిన ఓ సినిమాలో ‘ఇన్నాళ్లకొచ్చింది దీపావళి..’ అనే పాట ఉంది. ఆ సినిమా పేరేంటి? ఎ) ముద్దుల కూతురు బి) ముద్దుల మనవరాలు సి) ముద్దుల కోడలు డి) ముద్దుల పాప ► దీపావళి అంటే వెలుతురు పండగ. ‘గోరంత దీపం కొండంత వెలుగు’ అనే పాట రచయిత ఎవరో తెలుసా? ఎ) సి. నారాయణ రెడ్ డిబి) దాశరథి సి) వేటూరి డి) సిరివెన్నెల ► ‘ఇంటింటా దీపావళి ’అనే సినిమాలో హీరోగా ఎవరు నటించారో తెలుసా? ఎ) మురళీమోహన్ బి) మోహన్ సి) చంద్రమోహన్ డి) మోహన్బాబు ► వెలుగుతున్న చిచ్చుబుడ్డి పక్కనే ఎగురుతున్న హీరోయిన్... కాళ్ల పట్టీల నుండి హీరోయిన్ ఇంట్రడక్షన్ మొదలవుతుంది. ఆ బ్యూటీ ఎవరు? ఎ) అమీషాపటేల్ బి) కీర్తిరెడ్ డిసి) రేణూ దేశాయ్ డి) భూమిక ► బ్రహ్మానందం సిగరెట్ అనుకుని నోట్లో సీమ టపాకాయ్ ముట్టించుకునే సినిమా పేరేంటి? ఎ) క్షేమంగా వెళ్లి లాభంగా రండి బి) సందడే సందడి సి) తిరుమల తిరుపతి వెంకటేశ డి) అందరూ దొంగలే ► ‘అల్లరి’ నరేశ్ తన సినిమా పేరును దీపావళి టపాసుతో పెట్టుకున్నారు? ఆ సినిమా పేరేంటి? ఎ) సీమ బాంబ్ బి) సీమ టపాకాయ్ సి) సీమ చక్రం డి) సీమ శాస్త్రి ► ఈ సినిమాలో మంచు లక్ష్మి లాయర్. బాంబ్లాంటి పవర్ఫుల్ క్యారెక్టర్ చేశారు. ఆ సినిమా ఏంటో చెప్పుకోండి చూద్దాం? ఎ) ఆటమ్ బాంబ్ బి) హైడ్రొజన్ చక్రం సి) లక్ష్మీరాకెట్ డి) లక్ష్మీబాంబ్ ► ‘ఇక్కడ నా చిచ్చుబుడ్డి మర్చిపోయాను ఎవరన్నా చూశారా..’ అనే డైలాగ్ని ఏ సినిమాలో జగపతిబాబు చెప్పారో గుర్తొచ్చిందా? ఎ) ఫ్యామిలీ బి) అందగాడు సి) ఫ్యామిలీ సర్కస్ డి) సర్కస్ ఫ్యామిలీ ► ‘దీపావళి అంటే ఫెస్టివల్ ఆఫ్ లైట్స్.. నాట్ ఏ ఫెస్టివల్ ఆఫ్ సౌండ్ అండ్ పొల్యూషన్..’ అని ఏ హీరోయిన్ని ఉద్దేశించి ‘జనతాగ్యారేజ్’ సినిమాలో యన్టీఆర్ అన్నారు? ఎ) నిత్యామీనన్ బి) సమంత సి) త్రిష డి) కాజల్ అగర్వాల్ ► ‘గోపాల గోపాల అలకేలరా... దీపాల వేళాయెఅగుపించరా’ అనే పాటఏ సినిమాలోనిది? ఎ) అత్తారింటికి దారేది బి) ఖలేజా సి) జులాయి డి) అ ఆ ► ‘ఇయ్యాలే అచ్చమైన దీపావళి, ఎయ్యేళ్లు నిత్యమైన దీపావళి’ అనే పాటలో నటించిన దర్శకుడెవరు? ఎ) కోడి రామకృష్ణ బి) ఎ. కోదండరామిరెడ్డి సి) కె. విశ్వనాథ్ డి) దాసరి నారాయణరావు మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే...మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే...మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) బి 2) ఎ 3) సి 4) సి5) డి 6) బి 7) ఎ 8) బి 9) బి 10) బి 11) ఎ 12) సి 13) బి 14) ఎ 15) బి 16) డి17) సి 18) ఎ 19) డి20) డి -
అడవి అందాలు
ఆదిలాబాద్ అడవిని చూశారా! చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. ఇప్పుడు ఆ ఆడవికి మరింత అందం వచ్చింది. మరి.. అందాల కాజల్ అగర్వాల్ ఎంటర్ అయితే అంతే కదా. ఎమ్మెల్యే నందమూరి కల్యాణ్ రామ్ అండ్ హిజ్ గాళ్ఫ్రెండ్ కాజల్, సింగ్ ఎ సాంగ్ అంటూ అక్కడి అడవుల్లో స్టెప్పులేస్తున్నారు. ఈ రోజుల్లో పాటంటే మ్యాగ్జిమమ్ అమెరికా లాంటి ఏ ఫారిన్ కంట్రీ లొకేషన్లోనో... హైదరాబాద్లోని స్టూడియోల్లోని సెట్స్లోనో తీసేస్తున్నారు. ఆదిలాబాద్లో ఫారిన్ లొకేషన్స్ కంటే బ్యూటిఫుల్ ప్లేసులెన్నో ఉన్నాయి. అందుకే ఆటాపాటా అక్కడ ప్లాన్ చేశారు. కల్యాణ్రామ్, కాజల్ జంటగా ఉపేంద్ర మాధవ్ని దర్శకునిగా పరిచయం చేస్తూ సి. భరత్చౌదరి, ఎమ్.వి. కిరణ్రెడ్డి నిర్మిస్తున్న ‘ఎమ్మెల్యే’ చిత్రీకరణ ప్రస్తుతం ఆదిలాబాద్లోని నిర్మల్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. శేఖర్ మాస్టర్ నేతృత్వంలో మణిశర్మ స్వరపరచిన పాటను కల్యాణ్రామ్, కాజల్పై తెరకెక్కిస్తున్నారు. కొత్తేమీ కాదు... ఆదిలాబాద్లో పాటలు తీయడం! ‘రుద్రమదేవి’లోని ‘అవునా... నీవేనా?’ పాటను ఆదిలాబాద్లో కుంతాల వాటర్ ఫాల్స్ దగ్గరే తీశారు. ఇప్పుడీ ‘ఎమ్మెల్యే’! ఇంతకీ ‘ఎమ్మెల్యే’ అంటే ఏంటో తెలుసా? మంచి లక్షణాలున్న అబ్బాయి. -
జై లవకుశ దసరా స్పెషల్
-
రికార్డులు తిరగరాస్తోన్న ‘జై లవ కుశ’
సాక్షి, హైదరాబాద్ : యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారిగా త్రిపాత్రాభినయం చేస్తున్న మూవీ ‘జై లవ కుశ’. ఈ మూవీ ట్రైలర్ టాలీవుడ్లో రికార్డులు సృష్టిస్తోంది. ఆదివారం విడుదలైన జై లవ కుశ ట్రైలర్ విడుదలైన 24 గంటల్లోనే రికార్డు స్థాయిలో 7.24 మిలియన్ల వ్యూస్ను సాధించింది. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమలో ఇంత వేగంగా ఎక్కువగా వ్యూస్ దక్కించుకున్న రెండో చిత్ర ట్రైలర్ గా ఈ మూవీ నిలిచింది. టాలీవుడ్లో ఓవరాల్గా దర్శక దిగ్గజం ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి మూవీ ట్రైలర్ తొలి స్థానంలో ఉందని సినీ విశ్లేషకుడు రమేశ్ బాలా పేర్కొన్నారు. తమ మూవీకి రికార్డు స్థాయిలో వ్యూస్ రావడంపై ఎన్టీఆర్ హర్షం వ్యక్తం చేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలిపారు. మీ అందరికీ నచ్చే సినిమాలు చేస్తాను.. అందుకు ఎంతగానైనా కష్టపడతానని ఎన్టీఆర్ మరోసారి స్పష్టం చేశారు. ఏ తల్లికైనా ముగ్గురు పిల్లలు పుడితే రామ, లక్ష్మణ, భరతులు అవ్వాలని కోరుకుంటుంది. కానీ దురదృష్టవశాత్తూ ఈ తల్లికి పుట్టిన బిడ్డలు రావణ, రామ, లక్ష్మణులు అయ్యారు అంటూ ట్రైలర్ ప్రారంభమైన ట్రైలర్ లో మూడు పాత్రలు కనిపించడం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కె.ఎస్. రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో కల్యాణ్రామ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్, రాశీ ఖన్నా, నివేధా థామస్ నటించారు. ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ స్వరాలు అందించాడు. విజయ దశమి కానుకగా సెప్టెంబర్ 21న విడుదలవుతోంది. -
జై లవ కుశ ట్రైలర్ లాంచ్
-
కల్యాణ్రామ్తో కొత్త లుక్లో...
‘బాహుబలి–2’ తర్వాత తెలుగులో పలు అవకాశాలొచ్చినా తమన్నా అంగీకరించలేదు. జస్ట్... గాళ్ నెక్ట్స్ డోర్, బబ్లీ గ్లామరస్ రోల్స్ కాకుండా కొత్తగా, నటనకు అవకాశమున్న క్యారెక్టర్స్ కోసం వెయిట్ చేస్తున్నానని ఓ సందర్భంలో పేర్కొన్నారు. ఇప్పుడు అటువంటి అవకాశమే వచ్చినట్టుంది. వెంటనే ఓకే చెప్పేశారు. నందమూరి కల్యాణ్రామ్ హీరోగా ‘180’ ఫేమ్ జయేంద్ర దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. కిరణ్ ముప్పవరపు, విజయ్కుమార్ వట్టికూటి నిర్మిస్తున్న ఈ సిన్మాలో హీరోయిన్గా ముందు ఐశ్వర్యలక్ష్మిని ఎంపిక చేశారు. ఏమైందో ఏమో ఇప్పుడామె స్థానంలో తమన్నా వచ్చి చేరారు. ‘‘యస్... కల్యాణ్రామ్కు జోడీగా తమన్నాను ఎంపిక చేశాం. హీరో హీరోయిన్లు ఇద్దరూ కొత్త లుక్లో కనిపిస్తారు. సెప్టెంబర్ 1న హైదరాబాద్లో మేజర్ షెడ్యూల్ మొదలవుతుంది. సెప్టెంబర్ నెలాఖరుకు 50 శాతం టాకీ పూర్తవుతుంది’’ అని చిత్రసమర్పకుడు మహేశ్ కోనేరు తెలిపారు. ఈ సినిమాకు తమన్నా కోటీ అరవై లక్షలు పారితోషికం అందుకుంటున్నట్లు సమా చారం!! -
అంతా కుశలమే
అభిమానులకు వినాయక చవితి కానుకగా ఎన్టీఆర్ ఓ సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. అదేంటంటే... ‘కుశ’ లుక్! ఎన్టీఆర్ హీరోగా కె.ఎస్. రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో నందమూరి కల్యాణ్రామ్ నిర్మిస్తున్న సినిమా ‘జై లవ కుశ’. ఇందులో ఎన్టీఆర్ మూడు పాత్రల్లో (జై, లవకుమార్, కుశ) నటిస్తున్న సంగతి తెలిసిందే. చవితి ముందు రోజున లవకుమార్ టీజర్ విడుదల చేసిన ఎన్టీఆర్, చవితి రోజున ‘కుశ’ లుక్ విడుదల చేశారు. ఇంకో సర్ప్రైజ్ ఏంటంటే... ఇందులో ప్రియా పాత్రలో నటిస్తున్న రాశీ ఖన్నా లుక్ను సైతం చవితి రోజునే విడుదల చేశారు. లవ టీజర్, కుశ లుక్, ప్రియా లుక్... ప్రేక్షకులకు ట్రిపుల్ ధమాకా అనే చెప్పాలి. ముఖ్యంగా టీజర్లో ‘మంచితనం... అది పుస్తకాల్లో ఉంటే పాఠం అవుతుంది. మనలో ఉంటే గుణపాఠం అవుతుంది. అదే నా జీవితాన్ని తల్లకిందులు చేసింది’ అని ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్కు అద్భుత స్పందన లభిస్తోంది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్, ‘జై లవకుశ’ చిత్రబృందం అంతా కుశలమే. -
కొత్త కల్యాణ్రామ్ కనపడతాడు
‘‘పదమూడేళ్లుగా డిఫరెంట్ కమర్షియల్ సినిమాలు చేస్తున్నా. అయితే... ఎప్పట్నుంచో మంచి రొమాంటిక్ కామెడీ సిన్మాలో నటించాలని నా కోరిక. సరిగ్గా జయేంద్రగారు అటువంటి స్క్రిప్ట్తో నా దగ్గరకు వచ్చారు. ఈ సినిమా నాకో ఛేంజ్ ఓవర్. ఇందులో కొత్త కల్యాణ్రామ్ కనపడతాడని గట్టిగా నమ్ముతున్నా’’ అన్నారు నందమూరి కల్యాణ్రామ్. జయేంద్ర దర్శకత్వంలో ఆయన హీరోగా మహేశ్ కోనేరు సమర్పణలో కిరణ్ ముప్పవరపు, విజయ్కుమార్ వట్టికూటి నిర్మించనున్న సినిమా ఆదివారం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత శ్యామ్ప్రసాద్రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేయగా, హీరో ఎన్టీఆర్ క్లాప్ ఇచ్చారు. క్రిష్ గౌరవ దర్శకత్వం వహించారు. నందమూరి హరికృష్ణ స్క్రిప్టును దర్శకుడికి అందించారు. ‘‘కల్యాణ్రామ్గారితో వర్క్ చేయడం ఎగ్జయిటింగ్గా ఉంది. ఈ సినిమాతో ఐశ్వర్యలక్ష్మిని తెలుగుకు హీరోయిన్గా పరిచయం చేస్తున్నాం’’ అన్నారు దర్శకుడు. ‘‘ఆగస్టు 5న ఏర్కాడ్లో ఫస్ట్ షెడ్యూల్ మొదలవుతుంది. మూడు రోజులు అక్కడ చిత్రీకరణ జరిపిన తర్వాత ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ చివరి వరకు హైదరాబాద్లో చిత్రీకరణ జరుపుతాం. వచ్చే ఏడాది సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు మహేశ్ కోనేరు. ఈ కార్యక్రమంలో చిత్ర–నిర్మాతలు విజయ్కుమార్ వట్టికూటి, కిరణ్ ముప్పవరపు, సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్, హీరోయిన్ ఐశ్వర్యలక్ష్మి, సంగీత దర్శకుడు శరత్, రచయిత సుభా తదితరులు పాల్గొన్నారు. -
సమ సమాజ్ పార్టీలో...!!
యస్... కొత్తగా పుట్టుకొచ్చిన రాజకీయ పార్టీ ‘సమ సమాజ్’కి ఎన్టీఆర్ జై కొట్టారు. జై కొట్టడం ఏంటి? అందులో చేరి ప్రజల వద్దకు వెళ్లారు. తమ పార్టీకి, తమ అభ్యర్థులకు ఓటేయమని ప్రజల్ని అడుగుతున్నారు. ఆల్రెడీ పూణేలో పార్టీ ప్రచార కార్యక్రమాలు ప్రారంభించారు. పూణెలో ఎందుకు ప్రచారం చేస్తున్నారనే డౌట్ వచ్చిందా? ఎందుకంటే... ‘జై లవకుశ’ సినిమా సెట్ ఒకటి వేసిందక్కడే మరి! యస్... ఎన్టీఆర్ చేరింది రియల్ పార్టీలో కాదు, రీల్ పార్టీలో. ఆయన హీరోగా కె.ఎస్. రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో నందమూరి కల్యాణ్రామ్ నిర్మిస్తున్న సినిమా ‘జై లవకుశ’. ఇందులో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ ముగ్గురిలో ఒకరు ‘జై’, సమ సమాజ్ పార్టీ నాయకుడిగా కనిపించనున్నారు. ప్రస్తుతం పూణెలో ‘జై’ పాత్రధారిపై ముఖ్య సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఓ పక్క ఈ సినిమా షూటింగ్ చేస్తూనే, మరోపక్క వీకెండ్స్లో ‘బిగ్ బాస్’ షోను హోస్ట్ చేస్తున్నారు ఎన్టీఆర్. ‘బిగ్ బాస్’ హౌస్ సెట్ కూడా పూణేలోనే ఉంది. -
బ్రహ్మీ ఆశీర్వాదంతో...
కొత్త సినిమా షూటింగులో తొలి అడుగు వేశారు కాజల్ అగర్వాల్. ఈ అడుగుకి ఓ ప్రత్యేకత ఉంది. అదేంటంటే... తెలుగు చిత్రసీమలో ‘లక్ష్మీ కల్యాణం’ సినిమాతో కాజల్ తొలి అడుగు వేశారు. అందులో హీరో నందమూరి కల్యాణ్రామ్. ఆయనకు జోడీగా మళ్లీ పదేళ్ల తర్వాత ఇప్పుడు ‘ఎం.ఎల్.ఎ.’ అనే సినిమాలో కాజల్ నటిస్తున్నారు. ‘ఎం.ఎల్.ఎ.’ అంటే ‘మంచి లక్షణాలు ఉన్న అబ్బాయి’ అని మీనింగ్. ఆదివారం నుంచి కాజల్ ఈ సినిమా షూటింగులో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఓ సెల్ఫీ ఫొటో పోస్ట్ చేశారు. అందులో ‘హాయ్... హలో... నమస్తే! నేను మీ కాజల్ అగర్వాల్. నా ఫస్ట్ హీరోతో ‘ఎం.ఎల్.ఎ.’ సెట్లో ఫస్ట్ డే’ అన్నట్టు పోజిస్తే... బ్రహ్మీ బాబా ఆశీర్వదించారు. ఆయనెవరు అనుకుంటున్నారా? ఫొటోలో కనిపిస్తున్నారు కదా! నవ్వుల బాబా బ్రహ్మానందం, ఆయనే. వీళ్లిద్దరి పోజులు చూసి సెల్ఫీ తీసిన కల్యాణ్రామ్ నవ్వులు చిందించారు. ఉపేంద్ర మాధవ్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాను సి. భరత్చౌదరి, ఎమ్.వి. కిరణ్రెడ్డి నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. -
కళ్యాణ్ రామ్ MLA ఓపెనింగ్
-
మంచోడి లవర్ కాజలే!
నందమూరి కల్యాణ్రామ్ ‘లక్ష్మీ కల్యాణం’ సినిమాతో కథానాయికగా కాజల్ అగర్వాల్ కెరీర్ మొదలైంది. అప్పుడెప్పుడో పదేళ్ల క్రితం వచ్చిన ఆ సినిమా తర్వాత కల్యాణ్రామ్, కాజల్ జంటగా నటించలేదు. పదేళ్ల తర్వాత ‘ఎమ్మెల్యే’ అనే సిన్మాలో జంటగా నటించనున్నారనే న్యూస్ ఎప్పుడో బయటకొచ్చింది. ఎమ్మెల్యే అంటే ‘మంచి లక్షణాలు ఉన్న అబ్బాయ్’. సినిమా క్యాప్షన్ అదే. శ్రీను వైట్ల, అనిల్ రావిపూడి దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేసిన ఉపేంద్ర మాధవ్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమా సోమవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. అప్పుడు కల్యాణ్రామ్, కాజల్ జంటగా నటిస్తున్నారనే న్యూస్ను కన్ఫర్మ్ చేశారు. టీజీ విశ్వప్రసాద్ సమర్పణలో బ్లూ ప్లానెట్ ఎంటర్టైన్మెంట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు నిర్మిస్తున్న ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి కళ్యాణ్రామ్ కూతురు తారక అద్విత, చిత్రనిర్మాతల్లో ఒకరైన ఎంవీ కిరణ్రెడ్డి కూతురు ఐక్రా కెమెరా స్విచ్చాన్ చేశారు. కల్యాణ్రామ్ తనయుడు సౌర్యారామ్, మరో చిత్రనిర్మాత భరత్ చౌదరి తనయుడు కరణ్ క్లాప్ ఇచ్చారు. రచయిత కోన వెంకట్ గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్ ఇది. కల్యాణ్రామ్ న్యూ లుక్లో సై్టల్గా కనిపిస్తారు. ‘ఎమ్మెల్యే’ టైటిల్కి, క్యాప్షన్కి జస్టిఫికేషన్ ఉంటుంది. ఈ నెల 9న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది’’ అన్నారు దర్శక–నిర్మాతలు. సహ నిర్మాత వివేక్ కూచిభొట్ల పాల్గొన్నారు. రవి కిషన్, అజయ్, ‘వెన్నెల’ కిశోర్, పృథ్వీ, లాస్య, మనాలీ రాథోడ్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి సంగీతం: మణిశర్మ, కెమెరా: ప్రసాద్ మూరెళ్ల. -
నందమూరి హీరోకు జోడిగా..!
పటాస్ సినిమాతో ట్రాక్ లోకి వచ్చినట్టుగానే కనిపించిన కళ్యాణ్ రామ్ తిరిగి వరుస ఫ్లాప్లతో కష్టాల్లో పడ్డాడు. దీంతో నెక్ట్స్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేందుకు బ్రేక్ తీసుకున్న ఈయంగ్ హీరో ప్రస్తుతం నిర్మాతగా బిజీగా ఉన్నాడు. ఎన్టీఆర్ హీరోగా జై లవ కుశ సినిమాను నిర్మిస్తున్న కళ్యాణ్ రామ్.. త్వరలోనూ తాను హీరోగా సినిమాను ప్రారంభించేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇప్పటికే ఉపేంద్ర మాధవన్ అనే కొత్త దర్శకుడితో సినిమా చేసేందుకు అంగీకరించాడు కళ్యాణ్ రామ్. మంచి లక్షణాలున్న అబ్బాయి పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కళ్యాణ్ రామ్కు జోడిగా మనాలి రాథోడ్ను ఫైనల్ చేశారు. ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్న ఫ్యాషన్ డిజైనర్ సినిమాలో ఒక హీరోయిన్గా నటిస్తున్న మనాలి, కళ్యాణ్ రామ్ లాంటి హీరో సరసన చాన్స్ రావటంతో తెగ సంబరపడిపోతోంది. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ మూవీ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. -
రొమాంటిక్ రామ్
మాస్... మమ మాస్! ఇప్పటివరకు నందమూరి కల్యాణ్రామ్ ఎక్కువగా మాస్ సినిమాలే చేశారు. వాటిలో రొమాన్స్ ఉన్నా... మాస్ సీన్స్ ముందు ఆ రొమాంటిక్ సీన్స్ ప్రేక్షకులకు పెద్దగా కనిపించలేదు. అందుకేనేమో, కాస్త రూటు మార్చి తన నటనలో రొమాంటిక్ యాంగిల్ను చూపించాలని నిర్ణయించుకున్నట్టున్నారు. ప్రస్తుతం నూతన దర్శకుడు ఉపేంద్రతో ఓ సినిమా చేస్తున్న ఈ మాస్ రామ్, తదుపరి సినిమాను ప్రముఖ యాడ్ ఫిల్మ్మేకర్, ‘180’ మూవీ ఫేమ్ జయేంద్ర దర్శకత్వంలో చేయనున్నారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందే ఈ సినిమాకు పీసీ శ్రీరామ్ ఛాయాగ్రాహకుడు. రొమాంటిక్ రామ్కు జోడీగా నటించే భామను త్వరలో పరిచయం చేస్తామని జయేంద్ర తెలిపారు. -
'మీ నాడి వేగం పెరుగుతుంది.. ఊపిరి ఆగిపోతుంది'
జాతీయ స్ధాయిలో భారీ హైప్ క్రియేట్ చేసిన బాహుబలి 2 ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇప్పటికే పోస్టర్స్, టీజర్తో అంచనాలను పెంచేసిన బాహుబలి టీం.. ట్రైలర్తో మరోసారి ఆ ఎక్స్పెక్టేషన్స్ను పీక్స్కు తీసుకెళ్లింది. గురువారం రిలీజ్ అయిన బాహుబలి 2 ట్రైలర్పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా ఇంతటి భారీ చిత్రాన్ని తెరకెక్కించిన రాజమౌళిని ఇండస్ట్రీ ప్రముఖులు ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. పలువురు టాలీవుడ్ స్టార్స్ ట్విట్టర్ ద్వారా తమ అనుభూతిని పంచుకున్నారు. రాజమౌళితో హ్యట్రిక్ సినిమాలు చేసిన ఎన్టీఆర్ 'గతంలో ఎప్పుడు తెలియని అనుభవం. మీ నాడి వేగం పెరుగుతుంది. ఊపిరి ఆగిపోతుంది. కన్ను రెప్ప కూడా వేయలేరు. కుద్దూస్ జక్కన్న' అంటూ ట్వీట్ చేశాడు. ఎన్టీఆర్ అన్న, హీరో కళ్యాణ్ రామ్ 'రోమాలు నిక్కబొడుచుకోవటం గ్యారెంటీ. బాహుబలి 2 ట్రైలర్ అవుట్ స్టాండింగ్. ప్రభాస్, రానా, రాజమౌళి గారికి శుభాకాంక్షలు' అంటూ ట్వీట్ చేశాడు. మరో హీరో అల్లరి నరేష్ కూడా బాహుబలి ట్రైలర్పై స్పందించాడు.'ఇది నిజంగా అద్భుతం, రాజమౌళి, శోభు, ప్రభాస్, రానా, ఆర్కా మీడియా వర్క్ ఇతర యూనిట్ సభ్యులకు హ్యాట్స్ ఆఫ్' అని ట్వీట్ చేశాడు. గాయని స్మిత ఓ ఆంగ్ల సామెతతోబాహుబలి ట్రైలర్ తెలుగు సినీ ప్రముఖుల గౌరవాన్ని పెంచే, ఇతర సినీరంగాల వారు అసూయ చెందే అద్భుతం అంటూ ట్వీట్ చేసింది. హీరోయిన్ సమంత, హీరోలు రామ్, సందీప్ కిషన్, వెన్నెల కిశోర్ లాంటి ఇతర సినీ ప్రముఖులు బాహుబలి ట్రైలర్ పై స్పందించారు. బాహుబలి సినిమాకు పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులు కూడా ట్రైలర్ పై తమ అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. An experience unlike any other.your pulse races your breath stops and you can't stop staring.kudos Jakkana @ssrajamouli #Baahubali2trailer — tarakaram n (@tarak9999) 16 March 2017 Selfie with @ssrajamouli @Shobu_ @RanaDaggubati #Prasad and Team at the Trailer launch. #Baahubali2Trailer pic.twitter.com/47diapZOlp — KK Senthil Kumar (@DOPSenthilKumar) 16 March 2017 #Baahubali2trailer is truly king size!Hats off to the genius @ssrajamouli & team @Shobu_ Prabhas @RanaDaggubati @arkamediaworks — Allari Naresh (@allarinaresh) 16 March 2017 A trailer that guarantees goosebumps. #Baahubali2trailer is outstanding. Congratulations Prabhas, @RanaDaggubati, @ssrajamouli garu and team — Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) 16 March 2017 -
ఇద్దరికీ న్యాయం చేసే కథ ఇది
– కల్యాణ్రామ్ ‘జనతా గ్యారేజ్’ వంటి హిట్ చిత్రం తర్వాత తమ అభిమాన నటుడి కొత్త చిత్రం ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని చూస్తున్న జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఎదురు చూపులకు శుక్రవారంతో తెరపడింది. తమ్ముడు ఎన్టీఆర్ హీరోగా బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై అన్న కళ్యాణ్రామ్ నిర్మిస్తున్న చిత్ర ప్రారంభోత్సవం శుక్రవారం హైదరాబాద్లో జరిగింది. ఓ కొడుకు హీరోగా, మరో కొడుకు నిర్మాతగా రూపొందుతున్న ఈ చిత్రం తొలి సన్నివేశానికి తండ్రి హరికృష్ణ కెమెరా స్విచ్చాన్ చేయగా, ఎన్టీఆర్ క్లాప్ ఇచ్చారు. దర్శకుడు వీవీ వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు. కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ– ‘‘నా సోదరుడు ఎన్టీఆర్ 27వ చిత్రాన్ని నేను నిర్మిస్తుండటం ఆనందంగా ఉంది. బాబీ చెప్పిన స్టోరీ ఎన్టీఆర్లోని స్టార్కి, నటుడుకి న్యాయం చేసేలా ఉంది. ఈ నెల 15న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ చిత్రం విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రంలో ఒక హీరోయిన్గా ఇప్పటికే రాశీఖన్నాను ఖరారు చేశారు. సంగీత దర్శకుడిగా దేవిశ్రీప్రసాద్, ఛాయాగ్రాహకుడిగా సీకే మురళీధరన్ వ్యవహరిస్తారు. నందమూరి రామకృష్ణ, నిర్మాతలు భోగవల్లి ప్రసాద్, ‘దిల్’ రాజు, శిరీష్, యలమంచిలి రవిశంకర్, కిలారు సతీష్, ఎస్. రాధాకృష్ణ, సూర్యదేవర నాగవంశీ తదితరులు పాల్గొన్నారు. -
బాబాయ్ సినిమాపై అబ్బాయిలు ఏమన్నారు?
బాలకృష్ణ నూరో చిత్రంగా ప్రతిష్ఠాత్మకంగా వచ్చిన గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. దీనిపై పలువురు అగ్రహీరోలు, దర్శకులు అంతా స్పందించారు. బాలకృష్ణ అన్న కొడుకులు నందమూరి తారక రామారావు, కళ్యాణ్రాం కూడా దీనిపై తమ స్పందన ఏంటో తెలిపారు. తారక్ ముందుగానే ఈ సినిమాకు తన శుభాకాంక్షలు తెలిపాడు. బాబాయ్తో పాటు గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా యూనిట్ మొత్తానికి అభినందనలని, దర్శకుడు క్రిష్కు కూడా ఆల్ ద బెస్ట్ అని సినిమా విడుదలకు ముందే ట్వీట్ చేశాడు. ఇక హరికృష్ణ మరో కొడుకు నందమూరి కళ్యాణ్రామ్ అయితే సినిమా విడుదలైన తర్వాత స్పందించాడు. జీపీపెస్కే స్టన్నింగ్గా ఉందని అన్నాడు. 2017 ప్రారంభం అదిరిపోయిందని చెప్పాడు. దాంతోపాటు ఖైదీ నెంబర్ 150 హీరో చిరంజీవికి అభినందనలు తెలిపాడు. ఇంకా విడుదల కావాల్సి ఉన్న శతమానం భవతి, కానిస్టేబుల్ వెంకట్రామయ్య సినిమాలకు గుడ్లక్ చెప్పాడు. Wishing Babai and the whole team of #GPSK and @DirKrish all the best.#NBK100 — tarakaram n (@tarak9999) 11 January 2017 #GPSK is stunning.Great start to 2017.Congratulations Chiranjeevi garu for Khaidi150. Good luck Shatamanam &Constable Venkatramayya teams — Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) 12 January 2017 -
జై.. లవ.. కుశ..?
‘త్రిమూర్తులు’, ‘నట విశ్వరూపం’... ఎన్టీఆర్ తాజా చిత్రానికి ఈ టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయా? అంటే.. ఫిల్మ్నగర్ వర్గాల ప్రకారం అవుననే సమాధానం వినిపించింది. తమ్ముడు ఎన్టీఆర్ హీరోగా అన్న కల్యాణ్రామ్ నిర్మించనున్న ఈ చిత్రానికి బాబీ దర్శకుడు. ఇది క్లియర్. కానీ, టైటిల్ విషయంలో మాత్రం నో క్లారిటీ. ఎందుకంటే, పైన పేర్కొన్న రెండు టైటిల్స్నీ కల్యాణ్రామ్ అనుకోలేదట. ఈ నేపథ్యంలో మరో టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. ఈ మూడో టైటిల్ మాత్రం ‘ఫిక్స్’ అని చాలామంది ఫిక్స్ అయ్యారు. ఎందుకంటే, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై ఫిల్మ్ఛాంబర్లో ‘జై లవకుశ’ అనే టైటిల్ను కల్యాణ్రామ్ నమోదు చేయించారట. ఈ చిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేయనున్నారనీ, అందుకే జై, లవ, కుశ అనే పాత్రల పేర్లతో ‘జై లవకుశ’ టైటిల్ పెట్టారన్నది టాక్. చిత్రవర్గాలు అధికారికంగా ప్రకటిస్తేగానీ టైటిల్ రూమర్లకు చెక్ పడేలా లేదు. త్వరలో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. -
అఫీషియల్.. ఎన్టీఆర్ సినిమా బాబీతోనే..!
జనతా గ్యారేజ్ సినిమా విడుదలై వందరోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా నందమూరి అభిమానులకు కళ్యాణ్ రామ్ గుడ్ న్యూస్ చెప్పాడు. ఇన్నాళ్లు తన నెక్ట్స్ సినిమా విషయంలో కన్ఫ్యూజ్ చేస్తున్న ఎన్టీఆర్ సినిమాపై క్లారిటీ ఇచ్చాడు. ప్రస్టీజియస్గా తెరకెక్కనున్న ఎన్టీఆర్ 27వ సినిమాను తన సొంతం నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కిస్తున్నట్టుగా తెలిపాడు కళ్యాణ్ రామ్. ఈ విషయాన్ని తన ట్విట్టర్ పేజ్ అఫీషియల్గా ఎనౌన్స్ చేశాడు కళ్యాణ్ రామ్. ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహిస్తాడన్న క్లారిటీ కూడా ఇచ్చేశాడు. రవితేజ హీరోగా తెరకెక్కిన పవర్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన బాబీ, తరువాత సర్థార్ గబ్బర్సింగ్ సినిమాతో నిరాశపరిచాడు. పవన్ కళ్యాణ్ కథా కథనాలు అందించిన సర్థార్ గబ్బర్సింగ్ డిజాస్టర్ కావటంతో, బాబీ కెరీర్ డైలామాలో పడింది. ఈ సమయంలో ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో చాన్స్ ఇవ్వటంతో మరోసారి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాడు దర్శకుడు బాబీ. Very happy to announce that my brother @tarak9999 's prestigious #NTR27 will be on our home banner, @NTRArtsOfficial .Directed by @dirbobby — Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) 9 December 2016 -
యూట్యూబ్లో దుమ్మురేపుతున్న 'ఇజం'
-
యూట్యూబ్లో దుమ్మురేపుతున్న'ఇజం' ట్రైలర్!
'పటాస్'తో చాలా కాలం తరువాత హిట్ కొట్టిన టాలీవుడ్ హీరో కళ్యాణ్ రామ్. ఈ నందమూరి యంగ్ హీరో మాస్ బాట పట్టి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇజం సినిమాలో నటిస్తున్నాడు. గతంలో టెంపర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ను సిక్స్ ప్యాక్ లో చూపించిన పూరీ, ఈ మూవీ కోసం కళ్యాణ్ రామ్ తో సిక్స్ ప్యాక్ చేయించాడు. పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఇజం మూవీ థియరిటికల్ ట్రైలర్ సెప్టెంబర్ 5న విడుదలైంది. తమ అభిమాన హీరో సిక్స్ ప్యాక్ లో ఎలా కనిపిస్తాడో చూడాలని నందమూరి అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. దీంతో సోమవారం విడుదలైన ఇజం ట్రైలర్ ను యూట్యూబ్ లో ఇప్పటికే 3.5 లక్షల మంది వీక్షించారు. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది. ఇటీవలే స్పెయిన్లో ఇజం మూవీ భారీ షెడ్యూల్ షూటింగ్ పూర్తిచేసుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోల మూవీలేవీ లేకపోవడంతో ఇజం మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. కల్యాణ్రామ్ హీరోగా నటిస్తూ, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై ఈ మూవీని నిర్మిస్తున్నారు. కళ్యాణ్ రామ్ జోడీగా అదితీ ఆర్య కనిపించనుంది. విజయ దశమి సందర్భంగా చిత్రాన్ని విడుదల చేయాలని మూవీ యూనిట్ భావిస్తుంది. జగపతిబాబు, గొల్లపూడి మారుతిరావు, తనికెళ్ల భరణి, పోసాని తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. -
నాడు తమ్ముడు నేడు అన్నతో సిక్స్ ప్యాక్
చెన్నై: దర్శకుడు పూరీ జగన్నాథ్ టెంపర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ను సిక్స్ ప్యాక్ లో చూపించారు. తాజాగా ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ తో పూరీ ఇజమ్ సినిమా చేస్తున్నారు. కథలో పాత్ర డిమాండ్ మేరకు కళ్యాణ్ ను సిక్స్ ప్యాక్ లో చూపించనున్నారని సమాచారం. ఇందుకోసం కళ్యాణ్ రామ్ నాలుగు నెలలుగా ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా అదితి ఆర్య, ప్రతినాయకునిగా జగపతి బాబు నటిస్తున్నారు. -
రేటు తగ్గించుకోక తప్పలేదు..!
కిక్ 2 ఫెయిల్యూర్ కళ్యాణ్ రామ్ తో పాటు రవితేజ కెరీర్ ను కూడా ఇబ్బందుల్లో పడేసింది. ఈ మధ్యే సక్సెస్ ట్రాక్ ఎక్కిన మాస్ మహారాజ బలుపు, పవర్ సినిమాల తరువాత భారీ రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడు. కిక్ 2 సినిమాకు కూడా అదే స్ధాయిలో పారితోషికం అందుకున్న రవితేజ ఆ సినిమా ఫెయిల్యూర్ తో ఢీలాపడిపోయాడు. కెరీర్ గ్రాఫ్ పరంగానే కాదు రెమ్యూనరేషన్ పరంగా కూడా సినిమా ఫెయిల్యూర్ రవితేజను కష్టాల్లో పడేసింది. రవితేజ ప్రస్తుతం బెంగాల్ టైగర్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. రచ్చ ఫేం సంపత్ నంది డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా సక్సెస్ ఇప్పుడు కీలకం కానుంది. కుర్ర హీరోల నుంచి కాంపిటీషన్ విపరీతంగా ఉండటంతో హిట్ ఇస్తే తప్ప రవితేజకు నెక్ట్స్ సినిమాలు దొరకని పరిస్థితి. దీంతో బెంగాల్ టైగర్ మేకింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు రవితేజ. బెంగాల్ టైగర్ సినిమా తరువాత దిల్ రాజు బ్యానర్ లో ఓ కామెడీ ఎంటర్ టైనర్ కమిట్ అయ్యాడు రవితేజ.. ఓ మై ఫ్రెండ్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన వేణు శ్రీరామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకు రవితేజ గత సినిమాలతో పోలిస్తే చాలా తక్కువ రెమ్యూనరేషన్ అందుకోబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. భారీ ఫ్లాప్ తరువాత చేస్తున్న సినిమా కావటంతో పాటు రవితేజ మార్కెట్ కూడా ఆ స్ధాయిలో లేకపోవటంతో రెమ్యూనరేషన్ తగ్గించుకోక తప్పలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. -
జూలై 5న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు: కళ్యాణ్రామ్ (నటుడు), జాయెద్ ఖాన్ (నటుడు) ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 2. దీనికి చంద్రుడు అధిపతి కావడం వల్ల ఈ సంవత్సరమంతా కొద్దిపాటి ఒడుదొడుకులుంటాయి కాబట్టి ఈ సంవత్సరం కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టకుండా, గతంలో చేపట్టిన వృత్తి ఉద్యోగ వ్యాపారాలనే కొనసాగించడం మంచిది. ఉద్యోగులు కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు మానుకుని, ఉన్నదానినే జాగ్రత్తగా చేసుకోవడం శ్రేయస్కరం. స్థిరాస్తులు అమ్ముకుని, చరాస్తుల కొనుగోలు చేసేందుకు ప్రయత్నించవద్దు. తల్లి లేదా భార్య తరఫు వారి నుంచి సహాయ సహకారాలు అందుతాయి. చంద్రుడి ప్రభావం వల్ల కొత్త విషయాలు తెలుసుకుంటారు. సౌందర్యంపై దృష్టి పెడతారు. వృత్తి ఉద్యోగాలలో కొత్త కొత్త ఐడియాలు ప్రదర్శించి లాభపడతారు. మీలోని సృజనాత్మకతకు గుర్తింపు లభిస్తుంది. కవులు, కళాకారుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. నూతన పరిచయాల వల్ల లబ్ధి పొందుతారు. మానసిక ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. లక్కీనంబర్స్: 1,2,5, 6,9; లక్కీ కలర్స్: బ్లూ, వైట్, సిల్వర్, శాండల్; లక్కీ డేస్: సోమ, బుధ, శుక్రవారాలు. సూచనలు: వెండితో ముత్యపుటుంగరాన్ని ధరించడం, పాలు, బియ్యంతో చేసిన పాయసాన్ని అనాథలకు పెట్టడం, రోజూ కొద్దిసేపు వెన్నెలలో విహరించడం, తల్లిని, తల్లితో సమానులైన వారిని ఆదరించి, గౌరవించడం . - రెహమాన్ దావూద్, జ్యోతిష, సంఖ్యాశాస్త్ర నిపుణులు -
కృష్ణానదిలో జానకిరామ్ అస్థికల నిమజ్జనం
ఇటిక్యాల: నల్లగొండ జిల్లాలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నందమూరి హరికృష్ణ కుమారుడు జానకిరామ్ అస్థికలను బుధవారం మహబూబ్నగర్ జిల్లా బీచుపల్లి వద్ద కృష్ణానదిలో నిమజ్జనం చేశారు. పుష్కరఘాట్పై పూజారుల మంత్రోచ్ఛరణల మధ్య జానకిరామ్ కుమారుడు మాస్టర్ తారక రామారావు, సోదరులు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్రామ్, బాలకృష్ణ సోదరుడు రామకృష్ణలతో కలసి అస్థికలను కృష్ణాన దిలో కలిపారు. -
'కత్తి' హీరోయిన్ అరెస్ట్, విడుదల
ముంబై: తెలుగు చిత్రం 'కత్తి' లో హీరోయిన్ గా నటించిన సనా ఖాన్, ఆమె బాయ్ ఫ్రెండ్ ఇస్మాయిల్ ఖాన్ అరెస్ట్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సనా ఖాన్, ఇస్మాయిల్ ఖాన్ లను బుధవారం ఉదయం అరెస్ట్ చేసి అంధేరి కోర్టుకు తీసుకెళ్లామని, అదే రోజు వారు బెయిల్ పై విడుదలయ్యారని అంబోలి పోలీసుల తెలిపారు. ఈ కేసులో తగిన ఆధారాల కోసం సేకరిస్తున్నామని పోలీసు ఇన్స్ పెక్టర్ వెల్లడించారు. తనను బెదిరించడమే కాకుండా, వేధింపులకు కూడా పాల్పడుతున్నారని సనా, ఇస్మాయిల్ లపై ఓ మహిళ ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా.. ఓ జిమ్ వద్ద దాడి చేశారని సనా, ఇస్మాయిల్ లపై సోహిల్ ఖాన్ అనే నటుడు కూడా ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. టాలీవుడ్ నటుడు కళ్యాణ్ రామ్ సరసన కత్తి, మంచు మనోజ్ తో మిస్టర్ నూకయ్య చిత్రంలో సనా ఖాన్ నటించింది. Follow @sakshinews -
పోలీస్ పాత్రలో... పటాస్
బాక్సాఫీస్ వద్ద ‘పటాస్’ మోత మోగించడానికి కల్యాణ్రామ్ సంసిద్ధమయ్యారు. కల్యాణ్రామ్ ‘పటాస్’ మోత మోగించడం ఏంటి? అనుకుంటున్నారా! ఆయన తాజా సినిమా పేరు ‘పటాస్’. రచయిత అనిల్ రావిపూడిని దర్శకునిగా పరిచయం చేస్తూ... నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై కల్యాణ్రామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో కథానాయకుడు కూడా ఆయనే. శుక్రవారం హైదరాబాద్లో ఈ సినిమా లాంఛనంగా మొదలైంది. ముహూర్తపు దృశ్యానికి నందమూరి జానకీరామ్ కెమెరా స్విచాన్ చేయగా, జూనియర్ ఎన్టీఆర్ క్లాప్ ఇచ్చారు. ‘కిక్’ సురేందర్రెడ్డి గౌరవ దర్శకత్వం వహించగా, నందమూరి హరికృష్ణ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సినిమా విజయం సాధించాలని ఆహూతులందరూ ఆకాంక్షించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘నా తొలి చిత్రమే ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ సంస్థలో చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ‘కందిరీగ, ఆగడు’ చిత్రాలకు రచయితగా పనిచేసిన నాకు దర్శకునిగా అవకాశం ఇచ్చిన కల్యాణ్రామ్గారికి కృతజ్ఞతలు. ఆసక్తికరమైన మలుపులతో సాగే... యాక్షన్ ఎంటర్టైనర్ ‘పటాస్’. అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ అలరించే అంశాలు ఇందులో ఉంటాయి. కల్యాణ్రామ్ ఈ సినిమాలో పోలీస్ అధికారిగా కనిపిస్తారు. నేటి నుంచి నిరవధికంగా చిత్రీకరణ జరుపుతాం’’ అని తెలిపారు. కొత్తమ్మాయి కథానాయికగా పరిచయమయ్యే ఈ సినిమాలో సాయికుమార్, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాశ్రెడ్డి, పోసాని తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: సర్వేష్ మురారి, సంగీతం: సాయికార్తీక్, కూర్పు: తమ్మిరాజు. -
కల్యాణ్రామ్ నిర్మాతగా కిక్-2 ?
ఇద్దరు హీరోలు ఒకే సినిమాలో నటించే ట్రెండ్ ఒకప్పుడుండేది. ఇప్పుడిప్పుడే మళ్లీ నిదానంగా ఆ ట్రెండ్ మొదలైంది. అలాగే... ఓ హీరో నిర్మాతగా, మరో హీరోతో సినిమా నిర్మించే ట్రెండ్ కూడా ఒకప్పుడు ఉండేది. ఇప్పుడైతే... ఆ ట్రెండ్ లేదు. ఆ ట్రెండ్కి మళ్లీ జీవం పోసే పనిలో ఉన్నారు కల్యాణ్రామ్. ఎన్టీఆర్ ఆర్ట్స్ స్థాపించి తానే నటిస్తూ ఇన్నాళ్లూ సినిమాలు తీశారాయన. ఇప్పుడు కాస్త ఢిఫరెంట్గా... తాను నిర్మాతగా మాత్రమే కొనసాగుతూ రవితేజ హీరోగా ఓ చిత్రాన్ని నిర్మించనున్నారట. ‘అతనొక్కడే’ సినిమా ద్వారా తానే దర్శకునిగా పరిచయం చేసిన సురేందర్రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. రవితేజ, సురేందర్రెడ్డి కాంబినేషన్లో వచ్చిన ‘కిక్’ సినిమా ప్రేక్షకులకు ఏ రేంజ్లో కిక్ ఇచ్చిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇప్పుడు కల్యాణ్రామ్ నిర్మించబోతున్న చిత్రం ఆ ‘కిక్’కి కొనసాగింపని తెలిసింది. ‘కిక్-2’గా ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు వినికిడి. ఈ ఏడాదే ఈ చిత్రం సెట్స్కి వెళ్లనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన మిగిలిన వివరాలు తెలియాల్సి ఉంది.