kidnappers
-
తప్పు స్పెల్లింగ్తో నకిలీ కిడ్నాప్ గుట్టు రట్టు
లక్నో: ఓ ఫేక్ కిడ్నాప్ కేసును ఉత్తరప్రదేశ్ పోలీసులు చాకచక్యంగా చేధించారు. ఒక ఇంగ్లీష్ పదానికి రాంగ్ స్పెల్లింగ్ రాసిన క్లూతో కేసు అసలు గుట్టును రట్టు చేశారు. ఈ నకిలీ కిడ్నాప్ ఘటన యూపీలోని హర్దోయి జిల్లాలో జరిగింది. జిల్లాకు చెందిన సందీప్ (27) తాను కిడ్నాప్ అయినట్లు నాటకమాడి,రూ.50వేలు ఇవ్వాలని తన సోదరుడిని డిమాండ్ చేస్తూ వేరే ఫోన్ నుంచి మెసేజ్ పెట్టాడు.సోదరుడికి పంపిన బెదిరింపు మెసేజ్లో డబ్బులు ఇవ్వకుంటే సందీప్ను చంపేస్తామని రాసిన చోట డెత్ అనే పదాన్ని తప్పుగా(deathబదులుdeth)అని రాశాడు. ఈ మెసేజ్ నిశితంగా పరిశీలించిన పోలీసులు దానిని పంపిన వ్యక్తి అంతగా చదువుకోని వ్యక్తి అని నిర్ణయానికి వచ్చారు. పైగా సందీప్కు శత్రువులు ఎవరూ లేకపోవడంతో అనుమానం బలపడింది. ఫోన్ సిగ్నల్ ఆధారంగా సందీప్ ఆచూకీ గుర్తించారు.కిడ్నాప్ విషయమై సందీప్ను విచారించారు. విచారణ సందర్భంగా ఆ బెదిరింపు మెసేజ్ను రాయమని సందీప్ను కోరారు. దీంతో సందీప్ మరోసారి ‘డెత్’ అనే పదాన్ని తప్పుగా రాయడంతో కిడ్నాప్ నాటకమాడింది అతడేనని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. డబ్బుల కోసం తానే ఈ నాటకం ఆడానని, ఓ పాపులర్ క్రైమ్ సీరియల్ చూసి ఈ పని చేశానని పోలీసులకు చెప్పాడు. ఇదీ చదవండి: పెళ్లికి సాయం చేస్తానని పిలిచి -
Farm House: అంతా అక్రమమే..
శంషాబాద్: ఇటీవల సంచలనం రేపిన ఎమ్మార్పీఎస్ నేతలు నరేందర్, ప్రవీణ్లను కిడ్నాప్ చేసి బంధించిన ఫాంహౌస్ను సోమవారం పోలీసుల బందోబస్తు మధ్య శంషాబాద్ మున్సిపాలిటీ అధికారులు నేలమట్టం చేశారు. పట్టణంలోని 103 సర్వే నంబరులో ధర్మగిరి ఆలయానికి సమీపంలో కిడ్నాపర్లు సుమారు వెయ్యి గజాల స్థలంలో ఈ ఫాంహౌస్ను నిరి్మంచినట్లు గుర్తించారు. రెండు మూడేళ్ల క్రితంఎలాంటి అనుమతులు లేకుండా రెండు రేకుల షెడ్లతో పాటు ప్రహరీ, కుక్కలను ఉంచేందుకు ప్రత్యేకంగా ఎనిమిది బోన్లను ఏర్పాటు చేశారు. పదుల సంఖ్యలో బాతులు, కోళ్లను కూడా పెంచుతున్నారు. కిడ్నాప్ సంఘటనతో పాటు అప్రత్తమైన పోలీసులు ఫాంహౌస్లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్న గుర్తించిన మున్సిపల్ అధికారులకు సమాచారం అందించారు. అక్రమ నిర్మాణంగా తేలితే కూల్చివేయాలని సూచించారు. ఈ మేరకు మున్సిపల్ కమిషన్ బి. సుమన్రావు ఆదేశాలతో టౌన్ప్లానింగ్ అధికారులు ఇటీవల ఫాంహౌస్కు నోటీసులు అంటించారు. సోమవారం మూడు జేసీబీలతో కూల్చివేతలు చేపట్టారు. కుక్కలతో పాటు, కోళ్లు, బాతులను తీసుకెళ్లేందుకు పశుసంవర్థక శాఖతో పాటు బ్లూక్రాస్కు సమాచారం అందించారు. అప్పటి వరకు కుక్కలకు సంబంధించిన బోన్ల కూలి్చవేతను నిలిపివేశారు. ఫాంహౌస్ పూర్తిగా అక్రమ నిర్మాణమేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అయితే కూల్చివేతల సమయంలో దానికి సంబంధించిన వ్యక్తులు ఎవరూ అక్కడికి రాలేదు. ఓ వ్యక్తి అనుమానాస్పదంగా సంచరిస్తుండడంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం.. భూ కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాజేంద్రనగర్ డీసీపీ సీహెచ్ శ్రీనివాస్ హెచ్చరించారు. భూ కబ్జాదారులు ఇబ్బంది పెడితే పోలీసులను సంప్రదించాలన్నారు. -
KNR: కిడ్నాపర్ చెర నుంచి తల్లి ఒడికి
కరీంనగర్ జిల్లా: కరీంనగర్ మాతా శిశు ఆసుపత్రి నుంచి పసికందు మాయమైన ఘటన కలకలం రేపుతోంది. ఫిబ్రవరి 17వ తేదీ శనివారం రాత్రి ప్రభుత్వ మతా శిశు కేంద్రంలో బీహార్ రాష్ట్రానికి చెందిన నిర్మలా దేవి ఆడపిల్లకు జన్మనిచ్చింది. చికిత్స కోసం నిర్మలా దేవిని ఆస్పత్రి సిబ్బంది వేరే గదిలోకి తీసుకెళ్లారు. ఆ సమయంలో పసికందు మంచం దగ్గర తన ఏడేళ్ల కొడుకును తండ్రి భర్త మనోజ్ రామ్ కాపాలా ఉంచారు. ఆ తర్వాత తమ పాప కనిపించడం లేదంటూ ఆస్పత్రి సిబ్బందికి ఫిర్యాదు చేశారు. ఆస్పత్రి అంతా వెతికినా పాప దొరక్కపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సీసీ కెమెరాల సహాయంతో పసికందు అపహరణపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు పెద్దపెల్లి జిల్లా బసంత్ నగర్ లో కిడ్నాపర్ ను పట్టుకున్న పోలీసులు -
రాయదుర్గం కిడ్నాప్ కేసులో కొత్త ట్విస్ట్
సాక్షి, నంద్యాల/హైదరాబాద్: రాయదుర్గం కిడ్నాప్ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. కిడ్నాపర్లతో చేతులు కలిపిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ సురేందర్ సోదరి సహకారంతో కిడ్నాప్ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. సమస్య పరిష్కారానికి సురేందర్ని రాయదుర్గం పిలిపించిన సోదరి.. కిడ్నాపర్లకు అప్పగించింది. సురేందర్ను బలవంతంగా కారులో ఎక్కించుకున్న కిడ్నాపర్లు.. నల్లమల వైపు తీసుకెళ్లారు. గతంలోనూ ఇదే తరహా కిడ్నాప్కి పాల్పడి డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. సురేందర్ను కిడ్నాప్ చేసి పెద్ద మొత్తంలో కిడ్నాపర్లు డబ్బులు డిమాండ్ చేశారు. సాప్ట్వేర్ ఇంజనీర్ను కిడ్నాప్ చేసి నల్లమల అడవులకు తరలిస్తున్నారని సమాచారం రావడంతో కారును కర్నూలు జిల్లా ఆత్మకూరులో ఫారెస్ట్ సిబ్బంది ఆపి తనిఖీ చేయగా, కారు,బాధితుని వదిలేసి కిడ్నాపర్లు పారిపోయారు. ఒక కిడ్నాపర్ను ఫారెస్ట్ సిబ్బంది పట్టుకున్నారు. రాయదుర్గం పోలీసులకు పారెస్ట్ అధికారులు సమాచారం ఇవ్వడంతో సురేందర్ను క్షేమంగా హైదరాబాద్కు తీసుకొచ్చారు. మరో ఇద్దరు కిడ్నాపర్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. కిడ్నాప్ కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కిడ్నాప్ స్పాట్కు సురేంద్ను తరలించిన పోలీసులు.. సోదరి పాత్రపై వివరాలు సేకరిస్తున్నారు. సురేందర్ నుంచి ఆరు గంటల పాటు వివరాలు సేకరించారు. నిందితులను పోలీసులు విచారిస్తున్నారు. భారీగా డబ్బులు వసూలు చేయడానికే కిడ్నాప్ స్కెచ్ వేసినట్లు సమాచారం. ఇదీ చదవండి: రేణుశ్రీ ఆత్మహత్యకు ముందు ఎవరితో ఫోన్లో మాట్లాడింది.. -
రిటైర్డ్ ఎంపీడీవో నల్ల రామకృష్ణయ్య కిడ్నాప్ విషాదాంతం
-
రిటైర్డ్ ఎంపీడీవో నల్ల రామకృష్ణయ్య కిడ్నాప్ విషాదాంతం
సాక్షి, జనగామ జిల్లా: రిటైర్డ్ ఎంపీడీవో రామకృష్ణయ్య కిడ్నాప్ విషాదాంతంగా మారింది. కిడ్నాపర్లు కొట్టి హత్య చేసి మృతదేహాన్ని జనగామ సమీపంలోని చంపక్ హిల్స్ క్వారీ గుంతలో పడేశారు. మృతదేహాన్ని పోలీసులు గుర్తించి, ఐదుగురిని అందులోకి తీసుకుని విచారిస్తున్నారు. హత్యకు భూ వివాదాలే కారణమని స్థానికులు భావిస్తున్నారు. హత్య వెనుక అధికారపార్టీ నాయకుల హస్తం ఉందని కుటుంబసభ్యులు ఆరోపిస్తు ఆందోళనకు దిగారు. కిడ్నాప్నకు గురైన బచ్చన్నపేట మండలం పోచన్నపేట గ్రామానికి చెందిన రిటైర్డ్ ఎంపీడీఓ నల్లా రామకృష్ణయ్య మృతదేహం లభించడంతో మూడు రోజుల మిస్టరీకి తెరపడింది. రామకృష్ణయ్య కిడ్నాప్ ఉదంతం జిల్లాలో సంచలనం కలిగించగా.. అధికార పార్టీ నేతల హస్తం ఉన్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపించడంతో వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ రంగంలోకి దిగినట్లు సమాచారం. కిడ్నాప్పై స్థానిక పోలీసులతో పాటు టాస్క్ఫోర్స్ బృందం అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న క్రమంలో.. రామకృష్ణయ్య హత్యకు సంబంధించిన సమాచారం శనివారం సాయంత్రమే బయటకు వచ్చింది. పోచన్నపేటకు చెందిన రామకృష్ణయ్య గతంలో నర్మెట, రఘునాథపల్లి, భూపాలపల్లి తదితర ప్రాంతాల్లో ఎంపీడీఓగా పని చేశారు. ఆ తర్వాత ఇంటి వద్దనే ఉంటూ.. సమాచార హక్కు చట్టం కింద వివరాల సేకరణలో యాక్టివ్గా పని చేస్తున్నాడు. జీపీ, తదితర ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి సర్కారు నుంచి మంజూరైన నిధులు, వాటి వినియోగం తదితర వివరాలు సేకరించేవారు. ఆయన ఈనెల 15వ తేదీన బచ్చన్నపేట మండల కేంద్రం నుంచి తన ద్విచక్రవాహనంపై పోచన్నపేటకు వస్తుండగా మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. అదే రోజు కుటుంబ సభ్యులు అనుమానితులపై స్థానిక పీఎస్లో ఫిర్యాదు చేశారు. చదవండి: Hyderabad: అనుమానాస్పదంగా సినీ రచయిత మృతి క్రైం నంబర్ 105/2023, యూ/ఎస్.363 ఐపీఎస్ కింద కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. రామకృష్ణయ్యను కిడ్నాపర్లు జనగామ మండలం ఓబుల్ కేశ్వాపురం వైపు తీసుకువెళ్లినట్లు పోలీసులు గుర్తించి.. ఆ కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. కిడ్నాప్ చేసే సమయంలో రిటైర్డ్ ఎంపీడీఓ సెల్ఫోన్ దారిలో పడిపోయింది. ఫోన్ సిగ్నల్ ను ట్రాక్ చేసిన పోలీసులు.. ఓ రైతు వద్ద ఉన్నట్లు గుర్తించారు. విచారణలో భాగంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి భర్తతో పాటు ఆయన సోదరుడు, మరో నలుగురిని అదుపులోకి తీసుకుని విచారణ మొదలుపెట్టారు. చివరికి రిటైర్డ్ ఎంపీడీవో రామకృష్ణయ్య కిడ్నాప్ విషాదాంతంగా ముగిసింది. -
ఆరేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి రూ.15 లక్షలు డిమాండ్!
Kidnapped child in greed of 15 lakhs మధ్యప్రదేశ్: శివపురిలోని భావఖేడి గ్రామానికి చెందిన బాలుడిని కిడ్నాప్ చేసిన ముగ్గురు నేరగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. రూ.15 లక్షల కోసం చిన్నారిని ఇద్దరు కిడ్నాప్ చేశారని, మూడో నేరస్థుడు గ్రామంలోనే ఉంటూ ప్రతి వార్తను నేరగాళ్లకు చేరవేస్తున్నాడని పోలీసులు సోమవారం మీడియాకు వెల్లడించారు. ఎస్పీ రాజేష్ సింగ్ చందేల్ మాట్లాడుతూ.. ఫిర్యాదుదారుడు రామ్జీలాల్ యాదవ్ తన మేనల్లుడు నరేంద్ర యాదవ్ కుమారుడు హరిఓమ్ (6) డిసెంబర్ 25న మధ్యాహ్నం 3 గంటల నుండి కనిపించకుండా పోయాడని భావ్ఖేడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఎంతవెతికినా జాడకనిపించలేదని, సాయంత్రం 4 గంటల 26 నిముషాలకు ఓ ఫోన్ కాల్ వచ్చిందన్నాడు. చిన్నారి తమ వద్దనే ఉన్నాడని, రూ. 15 లక్షలు సిద్ధం చేసుకోమని, ఏదైనా తెలివితేటలు ప్రదర్శిస్తే బిడ్డ దక్కడని చెప్పి కిడ్నాపర్లు కాల్ డిస్కనెక్ట్ చేసినట్లు తెలిపాడు. దీంతో వెంటనే పోలీసు బృందం రంగంలోకి దిగింది. భయాందోళనలకు గురైన నేరస్థులు చిన్నారిని గ్రామంలో రహదారిపై విడిచిపెట్టారు. అనంతరం పోలీసులు చిన్నారిని ప్రశ్నించగా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పేరు చెప్పాడు. సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా 15 లక్షల రూపాయల డబ్బు కోసం రెండు నెలల క్రితమే ఇద్దరు స్నేహితులతో కలిసి చిన్నారి కిడ్నాప్కు ప్లాన్ చేసినట్లు నేరం ఒప్పుకున్నాడు. కాగా పోలీసులు ముగ్గురు నేరగాళ్లను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు మీడియాకు తెలిపారు. చదవండి: Warning: పెను ప్రమాదంలో మానవాళి! కిల్లర్ రోబోట్ల తయారీకి అగ్రదేశాల మొగ్గు.. -
అమ్మ కంట ఆనందభాష్పాలు.. తల్లిదండ్రుల చెంతకు చిన్నారులు
సాక్షి, పాడేరు: వారంతా నెలల వయసున్న బిడ్డలకు దూరమైన తల్లిదండ్రులు.. కనిపించకుండా పోయిన తమ చిన్నారులు ఇక దొరుకుతారో లేదోనన్న ఆందోళనతో ఉన్నారు.. మీ పిల్లలు దొరికారని పోలీసుల నుంచి వచ్చిన సమాచారం వారిని చెప్పలేనంత సంతోషానికి గురి చేసింది.. పరుగు పరుగున వెళ్లి తమ పిల్లల్ని చూసుకొని ఆనందబాష్పాలు రాల్చారు. ఈ అపురూప దృశ్యం బుధవారం పాడేరు పోలీస్ స్టేషన్లో కనిపించింది. ఈనెల 2వ తేదీన డుంబ్రిగుడ మండలంలో మాయమైన 6 నెలల పసికందు లోహర్ అర్జున్ అపహరణ కేసులో.. పోలీసులు తీగ లాగితే పెద్ద డొంకే కదిలింది. ఇలాంటి చిన్నారుల్ని కిడ్నాప్ చేస్తున్న పదిమంది ముఠా పట్టుబడింది. వారి వద్ద మరో ముగ్గురు చిన్నారులు లభించారు. వారందరినీ బుధవారం రూరల్ ఎస్పీ బొడ్డేపల్లి కృష్ణారావు సమక్షంలో తల్లిదండ్రులకు అప్పగించారు.ఈ ముఠా కిడ్నాప్ చేసిన పితాని దర్షిత్కుమార్, చింతలపూడి రూపశ్రీ, కోరుపల్లి దీక్షిత, లోహర్ అర్జున్లు సురక్షితంగానే ఉన్నారు. వీరిని కొనుగోలు చేసిన వారి నుంచి ఈ పిల్లల్ని స్వాధీనం చేసుకుని వారి సొంత తల్లిదండ్రులకు రూరల్ ఎస్పీ కృష్ణారావు చేతుల మీదుగా బుధవారం సాయంత్రం పాడేరులో అప్పగించారు. తమ పిల్లలు తమకు దక్కడానికి ఎంతో శ్రమించిన పోలీసు అధికారులకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. పోలీసులకు రివార్డులు ప్రశంసనీయమైన రీతిలో పోలీసులు అపహరణ కేసును ఛేదించడంతో.. మరో ముగ్గురు చిన్నారులు తమ తల్లిదండ్రుల చెంతకు చేరగలిగారు. పోలీసులకు అభినందనలతోపాటు ఉన్నతాధికారుల రివార్డులు దక్కాయి. డుంబ్రిగుడ మండలం అరకు సంతబయలు ప్రాంతంలో ఈనెల 2వ తేదీన మధ్యప్రదేశ్కు చెందిన సంచార కుటుంబంలోని ఆరు నెలల శిశువును అర్ధరాత్రి సమయంలో అపహరించారు. మరుసటి రోజే డుంబ్రిగుడ పోలీసు స్టేషన్లో ఎస్ఐ సంతోష్కుమార్ కేసు నమోదు చేశారు. ఈ శిశువు అపహరణ ఘటనపై అరకు సీఐ జి.దేముడుబాబు వెంటనే స్పందించారు. డుంబ్రిగుడ, అరకు, అనంతగిరి ఎస్ఐలు సంతోష్కుమార్, నజీర్, కరక రాములను అప్రమత్తం చేసి జిల్లావ్యాప్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. అపహరించిన శిశువు సబ్బవరం మండలం గాలి భీమవరం ప్రాంతంలో ఉన్నట్టు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఆ నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో జిల్లాలోని పిల్లల కిడ్నాప్, అక్రమ అమ్మకాల ముఠా వెలుగు చూసింది. ఈ కేసును 24 గంటల్లోనే చేధించడంతో పాటు ముఠా నుంచి నలుగురు శిశువులను స్వాధీనం చేసుకుని వారి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ కేసులో ఎంతో శ్రమించిన అరకు సీఐ జి.దేముడుబాబుతోపాటు అనంతగిరి, అరకులోయ, డుంబ్రిగుడ ఎస్ఐలు కరక రాము, నజీర్, సంతోష్కుమార్లను బుధవారం సాయంత్రం పాడేరులో విశాఖ రూరల్ ఎస్పీ బి.కృష్ణారావు ప్రత్యేకంగా అభినందించారు. సీఐ, ఎస్ఐలకు వేర్వేరుగా నగదు రివార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాడేరు ఏఎస్పీ పి.జగదీష్, పాడేరు, జి.మాడుగుల సీఐలు సుధాకర్, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. -
నేడు స్వదేశానికి ‘లిబియా బాధితులు’
టెక్కలి: కిడ్నాపర్ల చెరలో బిక్కుబిక్కుమంటూ గడిపిన శ్రీకాకుళం జిల్లా యువకులు స్వదేశానికి రానున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక చొరవ, మంత్రి సీదిరి అప్పలరాజు, డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఎప్పటికప్పుడు వారి విడుదలకు చర్యలు చేపట్టడంతో 28 రోజుల్లో కిడ్నాపర్ల చెర నుంచి వారికి విముక్తి లభించింది. సంతబొమ్మాళి మండలం సీతానగరానికి చెందిన బత్సల వెంకటరావు, బత్సల జోగారావు, బొడ్డు దానయ్య లిబియా నుంచి స్వదేశానికి వస్తూ ట్రిపోలీ ఎయిర్పోర్ట్ మార్గ మధ్యలో కిడ్నాప్కు గురైన ఘటన సంచలనం కలిగించింది. మంత్రి సీదిరి అప్పలరాజు, ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. లిబియాలో భారత ప్రభుత్వ దౌత్య కార్యాలయం నుంచి కంపెనీ ప్రతినిధులతో చర్చించి కిడ్నాపర్ల నుంచి వారిని విడుదల చేసేందుకు అన్ని విధాలుగా ప్రయతి్నంచారు. కిడ్నాపర్ల చెర నుంచి బయట పడిన యువకులు నేడు ఢిల్లీకి రానుండగా మరో రెండు రోజుల్లో ఇళ్లకు చేరుకోనున్నారు. ప్రభుత్వ చొరవ మరిచిపోలేం ట్రిపోలీ ఎయిర్పోర్ట్ వద్ద కిడ్నాప్కు గురయ్యాం. ప్రభుత్వ చొరవతో లిబియాలో మా కంపెనీ ప్రతినిధులు కిడ్నాపర్లతో చర్చలు జరిపి మమ్మల్ని విడిపించారు. ప్రభుత్వ చొరవ మరిచిపోలేం. – బత్సల వెంకట్రావు ముఖ్యమంత్రికి రుణపడి ఉంటాం కిడ్నాప్కు గురైన తర్వాత జీవితంపై ఆశలు వదులుకున్నాం. ఎంతో భయపడ్డాం. అయితే మమ్మల్ని విడిపించడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతో చొరవ చూపారు. – బత్సల జోగారావు మరో రెండు రోజుల్లో ఇంటికి.. మమ్మల్ని విడిపించడంలో మంత్రి అప్పలరాజు, ఉపముఖ్యమంత్రి కృష్ణదాస్ కృషి చేశారు. 2 రోజుల్లో ఇంటికి వచ్చేస్తున్నాం. – బొడ్డు దానయ్య -
కోటిస్తేనే కనికరించారు!
హైదరాబాద్: చిక్కడపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో ఆటోమొబైల్ ఫైనాన్షియర్ కిడ్నాప్కు గురైన సంఘటన చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో ఫైనాన్షియర్ను కిడ్నాప్ చేసిన అగంతకులు రూ.కోటి తీసుకుని సోమవారం తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో వదిలిపెట్టారు. 3 గంటలపాటు నాటకీయ ఫక్కీలో ఈ ఘటన జరిగి చివరకు బాధితుడు స్వల్పగాయాలతో బయ టపడ్డారు. చిక్కడపల్లి పోలీస్స్టేషన్ ఇన్స్పెక్టర్ వెంకట్రెడ్డి వీడియాకు వివరాలు వెల్లడించారు. హిమాయత్నగర్ రోడ్ నం.16లో నివ సించే గజేందర్ పారక్ (40) మైనా ఫైనాన్స్ కంపెనీను నిర్వహిస్తున్నాడు. స్నేహితులను కలిసేందుకు తరచూ దోమలగూడ ఏవీ కళాశాల వద్దకు వస్తుంటాడు. ఆదివారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో తన కారు (టీఎస్09ఎఫ్ఏ2131)లో అక్కడికి వచ్చాడు. అతని స్నేహితుడు రసగుల్లా అతడితో మాట్లాడి వెళ్లిపోయాడు. 11.15 గంటల ప్రాంతంలో 30 నుంచి 35 యేళ్ల వయస్సున్న ఇద్దరు ద్విచక్ర వాహనంపై వచ్చి కారు వెనకే ఆపారు. వారు గజేందర్ను అడ్డగించేలోపే ముసుగు వేసుకున్న మరో ముగ్గురు కారులో అక్కడికి చేరుకున్నారు. వెంటనే గజేందర్ను కారులో కూర్చోబెట్టారు. ఎక్కడికి వెళ్తున్నామో తెలియకుండా గజేందర్కు మాస్క్ తగిలించారు. రూ.3 కోట్లు డిమాండ్... గజేందర్ను అబిడ్స్కు తరలించి రూ.3 కోట్లు డిమాండ్ చేశారు. రూ.15 నుంచి రూ.20 లక్షల కంటే ఎక్కువ ఇవ్వలేనని చెప్పినా కిడ్నాపర్లు ఒప్పుకోకపోగా, గజేందర్ను చితకబాదారు. దీంతో రూ.కోటి ఇవ్వడానికి డీల్ కుదిరింది. గజేందర్ అతని స్నేహితుడు రాజేష్ అగర్వాల్కు ఫోన్ చేసి రూ.కోటి తీసుకురావాలని కోరారు. జగదీశ్ మార్కెట్ వద్ద ఉన్న బాంబే జ్యూస్ సెంటర్ వద్దకు డబ్బులు తీసుకువచ్చి అతని కారు డిక్కీపైనే ఉంచి దూరంగా వెళ్లాలని కిడ్నాపర్లు సూచించారు. తర్వాత స్కూటీపై ముసుగువేసుకుని వచ్చిన ఇద్దరు ఆ బ్యాగ్ తీసుకుని చిరాగ్ ఆలీ లేన్ వైపు ఉడాయించారు. అనంతరం గజేందర్ను చిరాగ్ ఆలీ లేన్లో వదిలిపెట్టారు. బాధితుడు ఇంటికి వెళ్లి ఉదయం 5 గంటలకు చిక్కడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసి, హైదర్గూడ అపోలో ఆసుపత్రికి వెళ్లారు. సెంట్రల్ డీసీపీ విశ్వప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక లావాదేవీలే కారణమా?.. గజేందర్ కిడ్నాప్ కేసులో ఆర్థిక లావాదేవీలే ప్రధాన పాత్ర పోషించాయా అనే అనుమానంతో పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. గతంలో ఫార్చూన్ ఫైనాన్స్లో దాదాపు రూ.24 కోట్ల మేర మోసం చేశాడనే కేసులో గజేందర్ అన్నను పోలీసులు అరెస్టు చేశారు. దీనికి దానికి ఏదైనా సంబంధం ఉందా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గజేందర్తో పాటు మరికొందరు బినామీలుగా ఏర్పడి ముంబైకి చెందిన కంపెనీని మోసగించిన కేసులు కూడా ఉన్నట్లు సమాచారం. కాగా, కిడ్నాప్ జరిగిన ప్రాంతంతో పాటు అబిడ్స్లో చోటుచేసుకున్న నాటకీయ పరిణామాలను కూడా పోలీసులు సీసీ ఫుటేజీల ద్వారా సేకరిస్తున్నారు. -
పిక్పాకెటర్పై సూడో పోలీసుల వల
సాక్షి, హైదరాబాద్: అతడో పిక్పాకెటర్. బస్సుల్లో తిరుగుతూ సెల్ఫోన్లు చోరీ చేస్తుంటాడు. ఈ నెల 2న అమీర్పేట మైత్రీవనం ఎదురుగా ఉన్న బస్టాప్ ప్రాంతంలో ఉండగా కొంతమంది వచ్చి అతడిని పట్టుకున్నారు. తాము పోలీసులం అని చెప్పి తీసుకెళ్లారు. ఇంటరాగేషన్ పేరుతో చిత్రహింసలు పెట్టారు. చివరకు రూ.50 లక్షలు డిమాండ్ చేసి, అతడి భార్య నుంచి రూ.18 లక్షలు వసూలు చేసి విడిచిపెట్టారు. అయితే, తనను తీసుకెళ్లింది పోలీసులు కాదని తెలియడంతో ఎస్సార్నగర్ పోలీస్స్టేషన్లో బాధి తుడు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు బాధితుడి సమీప బంధువుతోపాటు పది మంది నిందితులను అరెస్టు చేశారు. ఈ కేసు వివరాలను వెస్ట్జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ మంగళవారం వెల్లడించారు. యాదాద్రి జిల్లా భువనగిరికి చెందిన వెంకటయ్య కొన్నేళ్ల క్రితం నగరానికి వలసవచ్చి స్థిరపడ్డాడు. బస్సుల్లో తిరుగుతూ సెల్ఫోన్ల చోరీలకు పాల్పడేవాడు. వెంకటయ్యపై పలు పోలీసుస్టేషన్లలో 40కి పైగా కేసులు ఉన్నాయి. ఇప్పటికే పలు మార్లు జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. చోరీల ద్వారా సంపాదించిన సొమ్ముతో జల్సాలు చేస్తున్న వెంకటయ్యను చూసి, అతడి సమీప బంధువైన నిజామాబాద్కు చెందిన పిట్ల శంకర్కు దుర్బుద్ధి పుట్టింది. అతడిని కిడ్నాప్ చేసి బెదిరించడం ద్వారా పెద్ద మొత్తం రాబట్టవచ్చంటూ తన స్నేహితులకు చెప్పి పథకం రూపొందించాడు. ఈనెల 2న మైత్రీవనం బస్టాప్ వద్ద ఉన్న వెంకటయ్య వద్దకు తన స్నేహితులను పంపించాడు. తాము పోలీసులమని, కేసు విషయమై విచారణకు రావాలని చెప్పి అతడిని కిడ్నాప్ చేసి, యాదగిరిగుట్టలోని యాదాద్రి గౌడ్ ట్రస్ట్ భవన్ లాడ్జికి తీసుకెళ్లారు. అక్కడ ఇంటరాగేషన్ పేరుతో చిత్ర హింసలకు గురి చేశారు. తర్వాత రంగారెడ్డి జిల్లా తుక్కుగూడకు తీసుకెళ్లి ఓ గదిలో నిర్బంధించి హింసించారు. సిగరెట్లు కాల్చి వాతలు కూడా పెట్టారు. ఈ మొత్తం వ్యవహారంలో శంకర్ బయటకు రాకుండా వెనకాల ఉండి కథ నడిపించాడు. అనంతరం వెంకటయ్య భార్యకు ఫోన్ చేసి రూ.50 లక్షలు ఇవ్వకుంటే అతడిని చంపేస్తామని కిడ్నాపర్లు బెదిరించారు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన ఆమె తన వద్దనున్న రూ.18 లక్షలతోపాటు 4.5 తులాల బంగారం ఇచ్చేందుకు అంగీకరించింది. కిడ్నాపర్ల సూచన మేరకు భువనగిరికి తీసుకెళ్లి ఓ వ్యక్తికి వాటిని అప్పగించింది. అనంతరం ఈ నెల 4న కిడ్నాపర్లు వెంకటయ్యను విడిచిపెట్టారు. స్నేహితుడికి అనుమానం రావడంతో... ఇంటికి వచ్చిన వెంకటయ్య.. తనను పోలీసులే తీసుకెళ్లారని అనుకున్నాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఉండిపోయాడు. అయితే, ఈనెల 6న వెంకటయ్యను పరామర్శించడానికి వచ్చిన ఓ స్నేహితుడు.. అతడి ఒంటిపై ఉన్న గాయాలు చూసి అనుమానించాడు. పోలీసులు ఇలా చేయరని, ఎక్కడో ఏదో తిరకాసు ఉందని చెప్పాడు. దీంతో వెంకటయ్య ఎస్సార్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కిడ్నాప్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మైత్రీవనం వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్ ఆధారంగా కిడ్నాపర్ల కారు నంబర్ గుర్తించారు. దీంతో పాటు సాంకేతికంగా ముందుకు వెళ్లిన పోలీసులు వెంకటయ్య సమీప బంధువు పిట్ల శంకర్ సూత్రధారిగా, అతడి స్నేహితులు పాత్రధారులుగా ఈ కిడ్నాప్ వ్యవహారం సాగినట్లు తెలుసుకున్నారు. శంకర్తో పాటు ఇంద్రాల చిరంజీవి, కొల్లి సాయికృష్ణ, రాజారామ్, పిట్ల రవి, అబ్దుల్ హమీద్, పంజాల సాయికృష్ణ, షేక్ అన్వర్, గుర్రం కళ్యాణ్లను అరెస్టు చేశారు. వీరి నుంచి నగదు, బంగారం స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన పోలీసు అధికారులు అజయ్కుమార్, మురళీకృష్ణ, బందయ్యలను డీసీపీ శ్రీనివాస్ ప్రత్యేకంగా అభినందించారు. -
వెంటాడి...వేటాడారు!
సాక్షి, హైదరాబాద్: కర్ణాటకలోని బీదర్లో నలుగురు హైదరాబాదీలను పిల్లల కిడ్నాపర్లుగా పొరబడి స్థానికులు చేసిన దాడిలో ఒకరు మృతిచెందడం వెనుక వాట్సాప్లో వ్యాపించిన వదంతులే కారణమని తేలింది. ఓసారి దాడి నుంచి తృటిలో తప్పించుకున్నా హైదరాబాదీలు ప్రయాణించిన కారుతోపాటు అందులోని వారి ఫొటోలను కిడ్నాపర్లుగా పేర్కొంటూ వాట్సాప్ గ్రూపులో షేర్ చేయడంతో మరో చోట దారికాచిన స్థానికులు వారిని చావబాదినట్లు వెల్లడైంది. ఈ కేసుకు సంబంధించి 30 మంది గ్రామస్తులతోపాటు వదంతులను వాట్సాప్లో పోస్టు చేసిన గ్రూపు అడ్మిన్ మనోజ్ కుమార్, ఫొటోలు షేర్ చేసిన గ్రూపు సభ్యుడు అమర్ పాటిల్లనూ అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నట్లు బీదర్ ఎస్పీ డి.దేవ్రాజ్ వెల్లడించారు. ఈ దాడిలో గాయపడిన ముగ్గురు నగరవాసులను చికిత్స అనంతరం ఆదివారం డిశ్చార్జి చేశారు. దాడి జరిగిందిలా... ఈ ఘటనకు సంబంధించి బాధిత కుటుంబాలు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ పహాడీ షరీఫ్ పరిధిలోని ఎర్రకుంట, షహీన్ నగర్, బార్కస్ ప్రాంతాలకు చెందిన మహ్మద్ ఆజం, నూర్ మహ్మద్, మహ్మద్ సల్మాన్ బంధువులు. వీరి స్నేహితుడు, ఖతార్లో పనిచేసే సల్హామ్–ఈది–అల్–కుబసీ ఇటీవల నగరానికి వచ్చాడు. వీరిందరి స్నేహితుడైన బషీర్ బీదర్ సమీపంలోని హండికర గ్రామంలో ఉంటాడు. దీంతో అతన్ని కలిసేందుకు నలుగురూ కలసి కారులో శుక్రవారం అక్కడకు వెళ్లారు. మధ్యాహ్న భోజనాలు అనంతరం నలుగురూ తిరుగు ప్రయాణమయ్యారు. వాహనం థౌల్ గ్రామ శివార్లకు చేరుకున్నప్పుడు కొందరు స్కూలు విద్యార్థులు తారసపడ్డారు. వారిని చూసి ముచ్చటపడిన సల్హామ్, ఇతర స్నేహితులు కారు ఆపి ఆ చిన్నారులకు చాక్లెట్లు ఇచ్చే ప్రయ త్నం చేశారు. కర్ణాటకలో కొన్ని నెలలుగా కిడ్నాపర్ల వదంతులు వ్యాపిస్తుండటం, ఇదే కారణంతో మే 23న బెంగళూరు శివార్లలో ఓ వ్యక్తిని కొందరు కొట్టి చంపడంతో అపరిచితుల నుంచి చాక్లెట్లు సహా ఎలాంటి వస్తువులూ తీసుకోవద్దని ప్రజలు చిన్నారులకు నూరిపోస్తున్నారు. దీంతో సల్హామ్, అతని స్నేహితులు ఇచ్చిన విదేశీ చాక్లెట్లను ఆ చిన్నారులు తీసుకోకుండా పారిపోతుండగా ఓ చిన్నారిని బలవంతంగా ఆపిన హైదరాబాదీలు.... ఆమె చేతిలో చాక్లెట్లు పెట్టే ప్రయత్నం చేయగా ఆమె పెద్దపెట్టున ఏడ్చింది. ఇది గమనించిన స్థానికులు వారిని కిడ్నాపర్లుగా భావించి పట్టుకునే ప్రయత్నం చేశారు. ఇది గమనించిన హైదరాబాదీలు స్థానికులకు చిక్కకుండా తప్పించుకున్నారు. దారి కాచి దాడి.. వాహనంతోపాటు అందులోని వ్యక్తుల్ని థౌల్ గ్రామస్తులు ఫొటోలు తీశారు. వాటిని మనోజ్ కుమార్ అనే స్థానికుడు అడ్మిన్గా ఉండి క్రియేట్ చేసిన వాట్సాప్ గ్రూప్లోకి షేర్ చేసిన అమర్ పాటిల్ అనే వ్యక్తి... వారు కిడ్నాపర్లని, తమ గ్రామం నుంచి తప్పించుకుని ఫలానా దిశలో వస్తున్నారంటూ పోస్ట్ చేశాడు. ఇదే గ్రూప్లో ఉన్న ముర్కీ గ్రామస్తులు వాట్సాప్ సందేశాలతో తీవ్ర ఆగ్రహావేశాలకు లోనయ్యారు. కిడ్నాపర్లు తమ గ్రామం మీదుగానే పారి పోతారని గమనించి రహదారికి అడ్డంగా రాళ్లు, దిమ్మెలు పెట్టారు. అదే సమయంలో అటుగా వాహనం రావడంతో దాదాపు 300 మంది గ్రామస్తులు వారిపై విరుచుకుపడ్డారు. వాహనాన్ని బోల్తా పడేసి ధ్వంసం చేయడంతోపాటు అందులోని ముగ్గురిపై రాళ్లు, కర్రలు, మారణాయుధాలతో దాడి చేశారు. విషయం తెలుసుకుని ఘటనాస్థలికి చేరుకున్న స్థానిక పోలీసుల్నీ గ్రామస్తులు వదిలిపెట్టలేదు. ఓ ఇన్స్పెక్టర్, మరో కానిస్టేబుల్కు గాయాలు కావడంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి స్థానికుల్ని చెదరగొట్టారు. క్షతగాత్రులు నలుగురినీ బీదర్ సమీపంలోని అమృద్లో ఉన్న ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆజం మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో మిగిలిన ముగ్గురినీ హైదరాబాద్లోని మలక్పేటలో ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఎర్రగుంట శ్మశానవాటికలో శనివారం ఆజం అంత్యక్రియలు జరిగాయి. -
సోషల్ మీడియాలో వచ్చే పుకార్లు నమ్మొద్దు
-
చినారుల కిడ్నాప్ ముఠా కలకలం
-
కిడ్నాపైన విద్యార్థి దారుణ హత్య
సాక్షి,ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని ద్వారకలో దారుణం చోటు చేసుకుంది. ఢిల్లీ యూనివర్సీటీకి చెందిన ఓ విద్యార్థిని కిడ్నాప్ చేసిన దుండగులు వారం రోజుల తర్వాత హత్య చేశారు. విద్యార్థి కుటుంబాన్ని 50లక్షలు డిమాండ్ చేసిన దుండగులు.. డబ్బులు ఇవ్వకపోవడంతో అతడిని హత్య చేసి ఇంటికి సమీపంలోనే మృతదేహాన్ని పడేశారు. పోలీసుల వివరాల ప్రకారం..21 ఏళ్ల ఆయుష్ నౌటియల్ ఢిల్లీలోని రామ్లాల్ ఆనంద్ కాలేజీలో బీకామ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. గత గురువారం ఇంటి నుంచి కాలేజీ వెళ్లిన అతడిని దుండగులు కిడ్నాప్ చేశారు. సాయంత్రం అయినా కొడుకు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. ఇంతలోనే ఆయుష్ తండ్రికి వాట్సాప్ నుంచి ఓ మెసేజ్ వచ్చింది. దాంట్లో ఆయుష్ కిడ్నాప్ చేశామని, 50 లక్షలు ఇస్తే వదిలేస్తామని డిమాండ్ చేయడంతో తండ్రి పోలీసులను ఆశ్రయించారు. అనంతరం దుండగులకు 10 లక్షలు ఇస్తామని చెప్పి వారు ఉండేచోటు కనుక్కోవడానికి పోలీసులు ప్రయత్నించారు. కానీ ఆయుష్ ఆచూకీని కనుక్కోలేకపోయారు. చివరికి బుధవారం రాత్రి ద్వారకాలోని ఓ కాలువ వద్ద అతడి మృతదేహాన్ని కనుగొన్నారు. తాము పోలీసులకు సమాచారం ఇచ్చినా వారు దుండగుల ఆచూకీ కనిపెట్టలేకపోయారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. -
ఆ నలుగురితో పార్టీ పరువు గోవిందా
సాక్షి, తిరుపతి :‘నలుగురు కిడ్నాపర్లు.. స్మగ్లర్లు టీడీపీని అడ్డుపెట్టుకుని అవినీతి, అరాచకాలకు పాల్పడుతున్నారు. ఆ నేతలపై కఠిన చర్యలు తీసుకోండి’ అని అధికార పార్టీకి చెందిన కొంతమంది నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫి ర్యాదు చేశారు. సంక్రాంతి వేడుకలకు వచ్చిన ముఖ్యమంత్రితోపాటు మంత్రి లోకేష్ను పాకాల మండలం నేతలు మంగళవారం కలిశారు. రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. బెల్ట్షాపులు నడిపేవారు, కిడ్నాపర్లు, ఎర్రస్మగ్లర్లు పార్టీలో తిష్టవేసి అరాచకాలు చేస్తున్నారని పేర్కొన్నారు. గల్లా అరుణకుమారి, బాలకృష్ణారెడ్డి పేర్లతో మండలంలో దందాలు చేస్తూ లక్షలు వసూలు చేస్తున్నారని తెలిపారు. మండల స్థాయిలో రెవెన్యూ పంచాయతీరాజ్, ఎక్సైజ్ ఇలా అన్ని విభాగాల్లో మా మూళ్లు వసూలు చేస్తున్నారని, ఇవ్వని వారపై వేధింపులకు దిగుతున్నారని ముఖ్యమంత్రికి చెప్పారు. పార్టీని అడ్డంగా అమ్మేస్తున్నారని, పరువు బజారున పడిందని వివరించారు. ఆ నలుగురి కారణంగా పార్టీ కేడర్ నిస్సహాయ స్థితిలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వారిపై పూర్తిస్థాయిలో విచారణ చేసి పార్టీ నుంచి బహిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. నాగరాజనాయుడే సూత్రధారి పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు నాగరాజనాయుడు మద్యం మాఫి యాను ప్రోత్సహిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈయ న మండలంలోని మిగిలిన మద్యం షాపులపై పెత్తనం చెలా యిస్తూ మాటవినని వారిపై తప్పుడు కేసులు బనాయించేలా చేస్తున్నారని చెప్పుకొచ్చారు. మాట వినని అధికార పార్టీ నేతలపైనా కేసులు పెట్టి బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వెళ్లగక్కారు. ఆయన అనుమతిలేనిదే ఎవరికీ ఎలాంటి పనులు మంజూరు చేయవద్దని మండల కార్యాలయాల్లో దౌర్జన్యానికి దిగుతున్నట్లు వివరించారు. పర్సెంటేజీ ఇస్తే తప్ప అభివృద్ధి పనులు మంజూరు కావని బహిరంగానే చెబుతున్నారని, దీంతో పార్టీ కేడర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఫిర్యాదు చేశారు. జెడ్పీటీసీ సురేష్ బంధువు కావడంతో వీరి అరాచకాలు మితిమీరినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పార్టీలో కిడ్నాపర్లు, స్మగ్లర్లు పాకాల మండలం టీడీపీలో కిడ్నాపర్లు, స్మగ్లర్లు పెత్తనం చెలాయిస్తున్నారంటూ చలపతినాయుడు, కిశోర్నాయుడిపై ఫిర్యాదు చేశారు. పార్టీ నాయకులుగా చెలామణి అవుతున్న వీరు ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ ఇప్పటికే పట్టుపడ్డారని చెప్పారు. మూడేళ్లుగా వీరి అరాచకాలకు అడ్డేలేకుండా పోయిందన్నారు. వీరిని పార్టీ నుంచి బహిష్కరించాలని కోరారు. వీరి ఫిర్యాదుపె కంగుతిన్న ఆ నలుగురు నేతలు నియోజకవర్గ పార్టీ ఇన్చార్జ్ గల్లా అరుణకుమారి, గతంలో ఆమెకు పీఏగా పనిచేసిన బాలకృష్ణారెడ్డిని ప్రసన్నం చేసుకునే పనిలో పడినట్లు తెలిసింది. -
పిల్లలను కిడ్నాప్ చేసే ముఠా అరెస్ట్
థానె: ఒక రోజు వయసున్న బాలుడిని దొంగతనం చేసిన కేసులో ముగ్గురు వ్యక్తులను థానే పోలీసులు సోమవారం అరెస్టు చేసి ఆ బాలుడితోపాటు మరో ఐదుగురు పిల్లలను రక్షించారు. ఇన్స్పెక్టర్ నితిన్ థాక్రే ఆధ్వర్యంలోని పోలీసుల బృందం కళ్యాణ్ తహసిల్లోని పీసావలి గ్రామంలోని ఓ ఇంటిపై దాడిచేసి గుడియా సోను రాజభర్(35), ఆమె భర్త సోను రాజ్భర్(40), విజయ్ కైలాస్ శ్రీవాత్సవ (55)లను అరెస్టు చేసింది. ఆ ఇంటి నుంచి థానే సివిల్ ఆస్పత్రిలో ఆదివారం ఉదయం దొంగిలించిన శిశువుతోపాటు మరో ఐదుగురు పిల్లలను పోలీసులు కనుగొన్నారు. వీరిలో 2 నెలల ఆడశిశువు, పదకొండు, తొమ్మిది, ఐదు సంవత్సరాల వయసున్న బాలికలు, మరో మూడేళ్ల వయసున్న బాలుడు ఉన్నారు. పసికందును అతడి తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. ఓ మహిళ ఈ పసికందు తల్లి వద్దకు వచ్చి మీ తల్లి బాలుడిని చూడాలనుకుంటోందని చెప్పి తీసుకుని అక్కడినుంచి వెళ్లిపోయిందని పోలీసులు తెలిపారు. తమకందిన ఫిర్యాదు మేరకు థానే పోలీసులు ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్ నుంచి కళ్యాణ్ వరకు అన్ని రైల్వే స్టేషన్లలో సోదా చేశారని, అలాగే ఆస్పత్రి, రైల్వే స్టేషన్లలోని సీసీ టీవీ ఫుటేజ్లు పరిశీలించి పీసావలి గ్రామానికి పోలీసులు వెళ్లి ఆ ఇంట్లో సోదా చేశారని కమిషనర్ మధుకర్ పాండే వివరించారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి కిడ్నాప్ కేసు నమోదు చేశారు. వీరు పిల్లలను దొంగిలించి అక్రమ రవాణాకు పాల్పడుతున్నారా అనే విషయమై దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. -
అర్ధరాత్రి బాలికల కిడ్నాప్.. ఆపై అత్యాచారయత్నం
సాక్షి, వినుకొండటౌన్: అర్ధరాత్రి వేళ ఇళ్లలో నిద్రిస్తున్న బాలికలను కిడ్నాప్ చేసి అత్యాచారయత్నానికి పాల్పడుతున్న నిందితులను గ్రామస్తులు పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన గుంటూరు జిల్లా వినుకొండ మండలం శృంగారపురంలో శనివారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..స్థానిక డిగ్రీ కళాశాల సమీపంలో నివసించే షేక్ బాషా, పోలం పోలయ్య వరుసకు బాబాయ్, అబ్బాయ్ అవుతారు. వారిద్దరూ పట్టణంలోని ముట్లకుంట కాలనీ, శృంగారపురంలోని ఇళ్లలో నిద్రిస్తున్న బాలికలను అపహరించుకుపోయి అత్యాచార యత్నానికి పాల్పడుతున్నారు. పొట్టకూటి కోసం పగలంతా కాయకష్టం చేసిన తల్లిదండ్రులు అలసిపోయి అర్ధరాత్రివేళ గాఢనిద్రలో ఉన్న సమయంలో నిందితులు ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. పట్టుబడింది ఇలా... ముట్లకుంట కాలనీకి చెందిన మూడో తరగతి చదువుతున్న ఓ బాలిక (8)ను పది రోజుల క్రితం అపహరించిన నిందితులు అత్యాచారానికి యత్నించినట్లు బాధిత బాలిక తన తల్లిదండ్రులకు తెలిపింది. బాషా, పోలయ్య శుక్రవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో అదే కాలనీలోని మరో బాలికను అపహరించే ప్రయత్నం చేయగా, గుర్తించిన తల్లిదండ్రులు, బాలిక కేకలు వేశారు. దీంతో నిందితులు అక్కడినుంచి పరారయ్యారు. అదే క్రమంలో శృంగారపురంలోని 12 ఏళ్ల మరో బాలికను ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారని, బాలిక నాయనమ్మ గుర్తించి కేకలు వేయటంతో పరారయ్యారని స్థానికులు తెలిపారు. మరికొద్దిసేపటికే మరో వీధిలో నివాసం ఉండే 11 ఏళ్ల బాలికను తీసుకెళ్లే ప్రయత్నంలో నిందితులు పట్టుబడ్డారు. తొలుత బాలిక అనుకుని బాలుడిని తీసుకెళ్లబోయారు. గుర్తించి మళ్లీ బాలికను అపహరించే యత్నం చేయగా కుటుంబీకులు గుర్తించారు. కుటుంబసభ్యులు, స్థానికులంతా అక్కడికి చేరుకొని గాలించగా, పాఠశాల వద్ద నక్కి ఉన్న వీరిని గుర్తించి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. అప్పటికే ముట్లకుంట కాలనీ వాసులు ఫిర్యాదు చేసేందుకు స్టేషన్కు వచ్చారు. బాలికలు నిందితులను గుర్తించటంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిలో బాషా పాత నేరస్తుడని, గతంలో దొంగతనం కేసులో ఇతనికి శిక్ష పడిందని పోలీసులు తెలిపారు. వీరితో పాటు వచ్చిన మరో వ్యక్తి పారిపోయినట్లు బాధితులు పేర్కొన్నారు. -
బూచోళ్లను పట్టుకున్నారు!
చిన్న పిల్లలు కనిపించే దేవుళ్లంటాం.. ఏడిస్తే ఓదారుస్తాం.. అల్లరి చేసినా అక్కున చేర్చుకుంటాం.. మారాం చేసినా గారాబంగా చూసుకుంటాం..గోరుముద్దలు తినిపిస్తూ ఆడిస్తాం..లాలిస్తాం.. రాత్రి పూట నిద్రలేచి ఏడుస్తుంటే ‘రేయ్.. ఏడ్చొద్దు.. ఏడిస్తే బూచోడు పట్టుకుపోతాడు’ అని మాయమాటలు చెప్పి నిద్రపుచ్చుతాం.. అవే మాటలే ఆ తల్లిదండ్రులకు నిజమయ్యాయి..అభం శుభం తెలియని పసిపిల్లలు ఆడుతూపాడుతూ కళ్లెదుట తిరగాల్సిన సమయంలో అదృశ్యమయ్యారు.. నెలలు గడుస్తున్నా చిన్నారుల ఆచూకీ లేదు..వారినే తలుచుకుంటూ ‘అదిగో వస్తున్నారు..ఇదిగో పిల్లలొస్తున్నారు’ అని నిద్రాహారం మానేసి కళ్లు కాయలు కాసేలా ఎదురుచూశారు. ఓపికున్నంత వరకు గాలించారు. తెలిసినవారందరినీ విచారించారు. పూజలూ పునస్కారాలు చేశారు. పోలీసులకు మొర పెట్టుకున్నారు. వారి నిరీక్షణ పోలీసుల రూపంలో ఫలించింది. పిల్లలను ఎత్తుకెళ్లిన బూచాళ్లను పట్టుకున్నారు. వారి నుంచి ముగ్గురు పిల్లలనూ స్వాధీనం చేసుకుని, తల్లిదండ్రులకు అప్పగించారు. అనంతపురం సెంట్రల్: కదిరి ప్రాంతంలో చిన్న పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠాను ఎస్పీ అశోక్కుమార్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం అరెస్ట్ చేసింది. 12 మంది సభ్యులు గల ముఠాలో కీలక నిందితుడైన పసుపులేటి సుబ్బరాయుడుతోపాటు రామాంజనేయులు (నల్లచెరువు మండల కేంద్రం), రాజు (కర్నూలు జిల్లాడోన్), రాజేష్ (నిజామాబాద్ జిల్లా కేంద్రం రోటరీనగర్), సొత్తుపాటి హరికృష్ణ (హైదరాబాద్లోని శేర్లింగంపల్లి)ను అరెస్ట్ చేసి, ఒక కారును స్వాధీనం చేసుకుంది. వీరి చెరలో ఉన్న వికాస్, జైనుల్లా, శివసాయి అనే ముగ్గురు చిన్నారులకు విముక్తి కల్పించింది. ముఠాలోని మిగతా ఏడుగురు సభ్యులైన బాబు (నిజామాబాద్), రవి, కిరణ్, సాయి (డోన్), నాగమ్మ, నిర్మల, సాయిరాం (నల్లచెరువు)ల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్పీ అశోక్కుమార్ శుక్రవారం అనంతపురంలోని పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో మీడియాకు వెల్లడించారు. కిడ్నాప్ చేశారిలా.. ఈ ఏడాది మార్చి 12న కదిరి పట్టణం రాజేంద్రప్రసాద్ వీధికి చెందిన ఆంజనేయులు కుమారుడు వికాస్(6)ను ప్రభుత్వాస్పత్రి వద్ద చాక్లెట్ చూపించి ముఠా సభ్యులు కిడ్నాప్ చేశారు. ఈ చిన్నారిని ఎత్తుకెళ్లిన ముఠా సభ్యుల్లో ఒకరైన నిజామాబాద్కు చెందిన బాబు నానిగా పేరు మార్చి.. రూ.2లక్షలకు అమ్మేశాడు. ఏప్రిల్ 3న నల్లచెరువులో అల్లాబకాష్ కొడుకు జైనుల్లా(6) పాఠశాల వద్ద ఉండగా అదే తరహాలోనే కిడ్నాప్ చేశారు. చందుగా పేరు మార్చి అమ్మేశారు. జూలై 6న కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లికి చెందిన నాగరాజు కుమారుడు శివసాయి(6) ఇంటివద్ద ఆడుకుంటుండగా కిడ్నాప్ చేసి.. అజయ్గా పేరు మార్చి.. అమ్మేశారు. ముఠాలోని కొందరు ఈ పిల్లలకు పిక్ ప్యాకెట్లు ఎలా కొట్టాలో శిక్షణ ఇచ్చేందుకు కర్ణాటకలోని గుల్బర్గా, మహారాష్ట్రలోని పూణే ప్రాంతాలకు తీసుకెళ్లారు. రంగంలోకి ప్రత్యేక బృందాలు శివసాయి అదృశ్యానికి ముందు రోజు ఎస్పీగా అశోక్కుమార్ బాధ్యతలు స్వీకరించారు. మిస్సింగ్ కేసును ఛేదించడంపై ఎస్పీ దృష్టిపెట్టారు. ఎంత లోతుగా విశ్లేషిస్తున్నా ఆచూకీ లభించలేదు. కదిరి పరిసర ప్రాంతాల్లో ఈ తరహా మిస్సింగ్ అంతకు ముందు జరిగినట్లు అక్కడి పోలీసులు ఎస్పీ దృష్టికి తీసుకొచ్చారు. దీని వెనుక ముఠా ఉన్నట్లు భావించిన ఎస్పీ.. ఈకేసును సవాల్గా తీసుకొని ప్రత్యేకబృందాలను రంగంలోకి దింపారు. కదిరి ఇన్చార్జ్ డీఎస్పీ వెంకటరమణ, సీఐ శ్రీధర్, ఎస్ఐలు ప్రసాద్, హేమంద్కుమార్, ప్రసాద్ల ఆధ్వర్యంలో సిబ్బంది ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఇదే పనిలో నిమగ్నమయ్యారు. పిల్లల ఆచూకీ కోసం మన రాష్ట్రంతో పాటు కేరళలో కూడా పర్యటించి వచ్చారు. ఈ క్రమంలో సెప్టెంబర్ 9న తెలంగాణలోని నిజామాబాద్కు చెందిన అరుణ్ అనే చిన్నారి కిడ్నాప్ చేధింపు ఘటనలో పసుపులేటి సుబ్బరాయుడు, మరికొందరిని అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న ప్రత్యేక బృందం పోలీసులు సుబ్బరాయుడును కస్టడీలోకి తీసుకొని విచారించారు. కదిరి ప్రాంతంలో చిన్నపిల్లల కిడ్నాప్కు పాల్పడింది తామేనని వారు అంగీకరించారు. దొరకరనుకున్న పిల్లలు తిరిగి వచ్చేసరికి ఒక రోజు ముందుగానే ఆ కుటుంబాల్లో పండుగ సందడి నెలకొంది. -
మహిళలకు రక్షా కవచం
విశాఖపట్నం : మహిళలు, బాలల అక్రమ రవాణా, వారిపై దాడులు, కిడ్నాప్లు వంటి సంఘవిద్రోహ చర్యలకు అడ్డుకట్ట వేసేందుకు జిల్లా రెవెన్యూ, పోలీసు విభాగాలు సంయుక్త కార్యాచరణ సిద్ధం చేశాయి. విశాఖను మహిళా, బాలల స్నేహపూర్వక నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ప్రకటించాయి. ‘బంగారు తల్లులు–అంగడి సరుకులు’ అనే శీర్షకతో ఇటీవల సాక్షిలో ప్రచురితమైన కధనంపై జిల్లా యంత్రాంగం తీవ్రంగా స్పందించింది. ఓ పక్క పోలీసులు దర్యాప్తు చేస్తుండగా.. మరో వైపు జిల్లా రెవెన్యూ యంత్రాంగం కూడా ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుంది. కలెక్టర్ ప్రవీణ్కుమార్ ఉమెన్ ట్రాఫికింగ్పై మంగళవారం జిల్లాస్థాయిలో సమీక్షించారు. మహిళలను ఆదుకునేందుకు, బాలకార్మికులు, బాల యాచకుల గుర్తింపునకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. వివిధ రూపాల్లో హింసకు గురయ్యే బాధిత మహిళలకు అవసరమైన మద్దతు, సహాయం అందజేయడంతోపాటు వారి పునరావాసానికి ఉద్దేశించిన వన్స్టాప్ సెంటర్పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని నిర్ణయించారు. గత ఏడాది జనవరిలో కేజీహెచ్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రంపై తగిన ప్రచారం లేకపోవడం వల్ల ఫలితాలు రావడంలేదన్న అభిప్రాయాన్ని కలెక్టర్ వ్యక్తం చేశారు. ఈ కేంద్రం పనితీరును మెరుగుపర్చాలని, అవసరమైన సిబ్బందిని వెంటనే నియమించాలని ఐసీడీఎస్ పీడీ చిన్మయిదేవిని ఆదేశించారు. వన్స్టాప్ సెంటర్కు శాశ్వత భవనం కోసం విమ్స్లో స్థలాన్ని కేటాయించేందుకు పంపిన ప్రతిపాదనలకు వెంటనే ఆమోదం లభించేలా ఉన్నతాధికారులతో మాట్లాడతానన్నారు. హెల్ప్లైన్ల ఏర్పాటు హింసకు గురయ్యే మహిళలు 0891–2564575 లేదా ఉమెన్ హెల్ప్లైన్–181కు ఫిర్యాదు చేయాలని కలెక్టర్ సూచించారు. మెట్రోపాలిటన్ సిటీగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో బాలకార్మికుల, బాలయాచకుల లేకుండా చూడాలని అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను ఆయన కోరారు. నగరంలోని పలు కూడళ్లలో బాలయాచకుల సమస్య ఎక్కువగా ఉందని పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కలెక్టర్ దృష్టికి తేగా దీనిపై ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించేలా పోలీస్ కమిషనర్ ఆదేశాలు జారీ చేయాలన్నారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల సమన్వయంతో బాలకార్మికులు, బాలయాచకులను గుర్తించి వారికి తగిన పునరావాసం కల్పించాలన్నారు. నగరంలో బాలకార్మికులు, బాలయాచకులు, తప్పిపోయిన బాలలను ఎవరైనా గుర్తిస్తే వెంటనే చైల్డ్ హెల్ప్ లైన్–1098కు ఫోన్ చేసి వివరాలు తెలపాలని విజ్ఞప్తిచేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో డ్రాపవుట్స్పై సర్వే నిర్వహించాలని సర్వశిక్ష అభియాన్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సీపీవో రామశాస్త్రి, పంచాయతీరాజ్ ఎస్ఈ గజేంద్ర తదితరులతో పాటు ఐసీడీఎస్ సీడీపీవోలు, సూపర్వైజర్లు సమావేశంలో పాల్గొన్నారు. -
శవమై తేలిన ఇంజినీరింగ్ విద్యార్థి
కిడ్నాప్ అరుునట్టు భావించిన యువకుడి మృతి హత్యేనంటున్న బంధువులు పోలీసుల అదుపులో ప్రదీప్పై దాడిచేసిన నిందితులు కశింకోట: కశింకోటలో కిడ్నాప్ అరుునట్టు భావిస్తున్న ఇంజినీరింగ్ విద్యార్థి సోమవారం శవమై కనిపించడం సంచలనం కలకలంరేపింది.. ఇది హత్యా? లేక ఆత్మహత్య? అని అనుమానాలు వ్యక్తం అవుతున్నారుు. మాకవరపాలెంలోని ఒక కళాశాలలో ఇంజినీరింగ్ చదువుతున్న అగనంపూడి దానబోరుునపాలెంకి చెందిన దానా ప్రదీప్(22) కనిపించకపోవడంతో గత శనివారం అతని తండ్రి రాము పోలీ సులకు ఫిర్యాదు చేయడంతో కిడ్నాప్ కేసుగా నమోదు చేసిన విషయం తెలిసిందే. ప్రదీప్ గత శుక్రవారం తన స్నేహితుడు తులసీకుమార్తో కలిసి కశింకోట వచ్చాడు. తనతో పాటు బీటెక్ 4వ సంత్సరం చదువుతున్న కశింకోటకు చెందిన సహా విద్యార్థినితో పరిచయం ఉన్న మేరకు మాట్లాడ సాగారు. ఈ విషయాన్ని గమనించిన ఆ విద్యార్థిని బంధువులు సారుు, సాకేత్ తదితరులు ప్రదీప్ను కొట్టి గాయపరిచారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోరాదని అతనితోపాటు వచ్చిన స్నేహితుడు తులసీకుమార్ను బెదిరించడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అరుుతే ప్రదీప్ అప్పటి నుంచి ఇంటికి చేరకపోవడంతో తండ్రి రాము అనుమానంతో పోలీసులను ఆశ్రరుుంచి, కిడ్నాప్ చేసినట్టు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చేపట్టగా, మునగపాక మండల పరిధిలోని ఉమ్మలాడ వద్ద శారదానదిలో శవమై ప్రదీప్ కనిపించాడు. సరిగ్గా గుర్తు పట్టని విధంగా ఉన్న అతని మృతదేహాన్ని పోలీసులు వెలికి తీసి అనకాపల్లి వంద పడకల ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అరుుతే కిడ్నాప్కు గురైన ప్రదీప్ ఆత్మహత్య చేసుకున్నాడా?లేక హత్య చేశారా? అని అనుమానాలు వ్యక్తమవుతున్నారుు. మృతదేహం చేతులు కట్టి ఉండటాన్ని బట్టి హత్య చేసి ఉంటారని తండ్రి రాము, బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో సుమారు 25 మంది ప్రమేయం ఉందని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అరుుతే నది నుంచి మృతదేహాన్ని వెలికి తీయడానికి చేతులకు చీర కట్టినట్టు ఎస్ఐ బి.మధుసూదనరావు పేర్కొన్నారు. సంఘటన జరిగిన రోజు ప్రదీప్ను కొట్టిన నిందితులు సారుు,సాకేత్ తమ అదుపులో ఉన్నట్టు ఎస్ఐ తెలిపారు. శోక సంద్రంలో కుటుంబం : రాము,సత్యవతి దంపతులకు మృతుడు ప్రదీప్ ఒక్కడే కుమారుడు. కుమార్తెకు వివాహం అరుుంది. దర్జీగా పని చేస్తూ రాము తన కుమారుడు పదీప్ను చదివిస్తున్నాడు. చేతికి అంది వచ్చిన కుమారుడు మృతి చెందడం కుటుంబాన్ని కలచి వేచింది. శోక సముద్రంలో మునిగిపోయారు. శనివారం ఫిర్యాదు చేయగా, ఆదివారానికి కూడా పోలీసులు ప్రదీప్ ఆచూకీ తెలపకపోవడంపై కుటుంబ సభ్యులు కశింకోట పోలీసు స్టేషన్ వద్ద ఆందోళన చేశారు న్యాయం చేయాలి : ప్రదీప్ వ్యవహారంలో అతని కుటుంబానికి పోలీసులు న్యాయం చేయాలని వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి జిలకర్ర నాగేంద్ర డిమాండ్ చేశారు. న్యాయం జరగకపోతే ఆందోళన చేపట్టాల్సి వస్తుందన్నారు. పోలీసులు ఫిర్యాదు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించారని విశాఖ జీవీఎంసీ 56వ వార్డు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు పూర్ణానంద శర్మ విమర్శించారు. బాధితుల ఆందోళన అనకాపల్లిటౌన్: కశింకోట పోలీసులకు వ్యతిరేకంగా గాజువాక మండలం అగనంపూడి దానబోరుునపాలెం గ్రామస్తులు, ప్రదీప్ కుటుంబ సభ్యులు సోమవారం రాత్రి ఆందోళనకు దిగారు. తమ కుమారుడు ప్రదీప్ (22)ని కిడ్నాప్ చేశారంటూ ఫిర్యాదు చేసినా కశింకోట పోలీసులు పట్టించుకోలేదని, పోలీసులు వెంటనే స్పందించి ఉంటే ప్రదీప్ సజీవంగా ఉండేవాడని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎన్టీఆర్ వైద్యాలయం వద్ద ఆందోళన చేశారు. విషయం తెలుసుకున్న గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఘటనాస్థలికి చేరుకొని డీఎస్పీ పురుషోత్తంతో మాట్లాడారు. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీనికి స్పందించిన డీఎస్పీ పోస్టుమార్టం పరీక్షల అనంతరం నిందితులపై చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే పల్లాకు చెప్పడంతో ఆందోళనకారులను ఎమ్మెల్యే పల్లా శాంతింపచేశారు. -
మంచితనంగా ఇంటికి పిలిచి దారుణం
అమృత్సర్: తమకు ఉన్న పరిచయం మేరకు మంచితనంగా ఓ గృహిణిని ఇంటికి పిలిపించి ఆమె ఇద్దరు పిల్లలను కిడ్నాప్ చేశారు. ఇంటికొచ్చిన స్నేహితురాలిపై దాడి చేసి స్పృహలేనిపరిస్థితుల్లో చనిపోయిందనుకొని ఓ కాలువలో పడేశారు. అదృష్టం కొద్ది ఆమె తిరిగి స్పృహలోకి రావడంతో నేరుగా ఇంటికెళ్లి భర్తకు చెప్పగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో అసలు విషయం తెలిసింది. పూర్తి వివరాల్లోకి వెళితే పంజాబ్ లోని అమృత్ సర్ లో గుర్మీత్ కౌర్ అనే ఓ మహిళ ఉంది. ఆమెకు బాజ్ సింగ్, ఫతే అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిద్దరిని తీసుకొని తమ ఇంటికి రావాల్సిందిగా మంజిత్ కౌర్ మహిళ ఆహ్వానించింది. ఆమె ఇంటికి రాగానే మంజిత్ కుమారుడు మహిందర్ జిత్, వాళ్లింట్లో పనిచేసే హరిజిందర్ అనే ఇద్దరు వారిపై దాడి చేశారు. ఆమెను కొట్టి చనిపోయిందని కాలువలో పడేసి పిల్లలను ఎత్తుకెళ్లారు. అందులో ఫతేకు ఎనిమిది నెలలు కాగా బాజ్కు ఎనిమిదేళ్లు. వీరిని నేరుగా తీసుకెళ్లిన వారు క్షుద్రపూజలకోసం అమ్మేశారు. పోలీసులు నిర్వహించిన గాలింపు చర్యల్లో ఈ విషయం తెలిసింది. బాజ్ను రూ.50వేలకు దీరా బాబా నానక్ అనే తాంత్రికుడికి అమ్మినట్లు తెలిసింది. అయితే, బాజ్ తిరగబడినంత పనిచేయడంతో విషయం బయటకు పొక్కుతుందని భయంతో అతడిని హత్య చేసి ఓ ఊరి వద్ద పడేశారు. నేరాన్ని వారు స్వయంగా అంగీకరించడంతో ముగ్గురుని పోలీసులు అరెస్టు చేశారు. -
నోటికి ప్లాస్టర్.. సంకెళ్లతో జడ్జి కుమారుడు
కరాచీ: తాలిబన్లు ఎత్తుకెళ్లిన పాకిస్థాన్ న్యాయమూర్తి కుమారుడు దొరికాడు. పాక్ సైనికులు అతడిని గుర్తించారు. నోటికి ప్లాస్టర్, చేతినిండా సంకెళ్లు వేసి పూర్తిగా బురఖా కప్పి ఉన్న అతడిని సైనికులు మంగళవారం తమ ఆదీనంలోకి తీసుకున్నారు. గత నెల(జూన్ 21)న సింధు ప్రావిన్స్ చీఫ్ జస్టిస్ సాజిద్ అలీ షా కుమారుడు అవాయిష్ షాను తాలిబన్ ఉగ్రవాదులు ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి తీవ్రంగా గాలింపులు జరిపినా అతడి జాడ తెలియలేదు. తన మిత్రుడిని కలిసి ఓ షాపింగ్ మాల్ వద్దకు వెళ్లి తిరిగొస్తుండగా గుర్తు తెలియని దుండగులు ఆయనను ఎత్తుకెళ్లారు. ఎట్టకేలకు అతడు ప్రాణాలతో దొరకడంతో ఆర్మీ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కిడ్నాపర్లను సైన్యం కాల్చి చంపింది. తెల్లవారు జామున 2గంటల ప్రాంతంలో ఈ ఆపరేషన్ నిర్వహించారు. కార్లో వెనుక సీట్లో బందీగా ఉన్న అతడిని పాక్ పశ్చిమ భాగంలోని గిరిజన ప్రాంతంలో సైన్యం గుర్తించింది. -
ఫలించిన నిరీక్షణ
విశాఖ ఇంజినీర్ను విడిచిపెట్టిన కిడ్నాపర్లు 18 రోజుల తర్వాత విముక్తి స్వీట్లు పంచుకున్న కుటుంబ సభ్యులు భర్త శ్రీనివాస్తో స్కైప్లో మాట్లాడిన లలిత పెదవాల్తేరు : కన్నీటి స్థానంలో ఆనంద బాష్పాలు.. దీన వదనాల్లో సంతోష రేఖలు.. నైజీరియాలో కిడ్నాప్నకు గురైన ఇంజనీరు సాయిశ్రీనివాస్ ఇంట్లో సందడి వాతావరణం.. విడుదలైనట్టు క్షేమ వార్త తెలియడంతో 18 రోజుల తర్వాత శనివారం ఉత్కంఠ వీడింది. దీంతో కుటుంబమంతా ఆనందడోలికలలో మునిగితేలారు. నైజీరియాలోగల భారత రాయబారి బి.ఎన్.రెడ్డి ఈ సమాచారాన్ని తనే స్వయంగా ఫోన్ ద్వారా సాయిశ్రీనివాస్ భార్య లలితకు తెలిపారు. భారత హైకమిషన్, అక్కడి ఫెడరల్ గవర్నమెంట్తో పాటు, బెన్యూ రాష్ర్ట ప్రభుత్వం, డెంకోట్ ఇండస్ట్రీస్ చేసిన కృషి ఎట్టకేలకు ఫలించింది. ప్రస్తుతం సాయిశ్రీనివాస్తోపాటు మరో భారతీయుడు అనిష్లు వారు పనిచేస్తున్న కంపెనీలో సురక్షింతంగా ఉన్నారు. వారికి అక్కడి ప్రభుత్వం వైద్య పరీక్షలు నిర్వహిస్తోంది. ఫలించిన మంతనాలు డెంకోట ఇండస్ట్రీస్ యాజమాన్యం కిడ్నాపర్లతో జరిపిన చర్చలు ఫలించడంతో కిడ్నాపర్ల చెరలో ఉన్న ఇద్దరి భారతీయులను సురక్షింతంగా విడిచిపెట్టారు. దీంతోపాటు అక్కడి ఫెడరల్ గవర్నమెంట్, బెన్యూ రాష్ట్ర ప్రభుత్వాలపై నైజరియాలో గల భారత హైకమిషన్ ఒత్తిడి తీసుకురావడంతో కిడ్నాప్ ఉదంతానికి చెక్ పడింది. శనివారం ఉదయం 10.30గంటల సమయంలో నైజీరియాలో గల భారత రాయబారి బి.ఎన్.రెడ్డి ఫోన్ ద్వారా సమాచారం అందించారని సాయిశ్రీనివాస్ భార్య లలిత ఆనందభాష్పాల నడుమ తెలిపింది. ఈ 18 రోజులు క్షణమొక యుగంలా గడిచిందని, నరకయాతన అనుభవించామని ఉద్వేగంతో పేర్కొన్నారు. తెల్లవారితే ఏ కబురు వినాల్సి వస్తుందోనని నిద్రాహారాలు మాని గడిపామని బోరున విలపించారు. అందరికీ ధన్యవాదాలు నైజిరియాలో తన భర్త కిడ్నాప్నకు గురైన క్షణం నుంచి అతను సురక్షితంగా విడుదల కావాలని ఆకాంక్షించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని సాయిశ్రీనివాస్ భార్య లలిత ఉద్విగ్నంగా తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడ, మంత్రి పల్లె రఘునాథ్రెడ్డి,ఎంపీ హరిబాబు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వంశీకృష్ణ శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ ఎన్.యువరాజ్లు తన భర్త సమస్యను భారత ైహైకమిషన్ దృష్టికి తీసుకెళ్లారన్నారు. ఢిల్లీలోని ఆంధ్రభవన్ , నైజీరియాలో గల భారత రాయబారి బి.ఎన్.రెడ్డి కృషి మరవలేనన్నారు. వీరు ఎప్పటికప్పడు తనకు సమాచారం అందించి మనోస్థైర్యాన్ని నింపారన్నారు. క్షణమొక యుగంలా... రోజూ రక్షణ సిబ్బంది తోడుగా కార్యాలయానికి వెళ్లేవాడిని. ఆ రోజు సెక్యూరిటీ లేకుండానే విధులకు బయలుదేరాను. కొద్ది సేపటిలో కంపెనీకి చేరుకుంటామనగా అగంతకులు దాడి చేశారు. రెప్పపాటులో నన్ను, మరో ఇంజినీరు అనిష్ను వారి వాహనంలోకి తరలించి నిర్మాణుష్య ప్రాంతానికి తీసుకుపోయారు. అక్కడ మా ఇద్దరినీ వేర్వేరు గదుల్లో ఉంచి మాట్లాడుకోవడానికి కూడా అవకాశం కల్పించలేదు. కేవలం రొట్టె మాత్రమే ఆహారంగా ఇచ్చేవారు. 18 రోజులూ అది తినే బతికాం. ఎప్పుడు ఏం చేస్తారో అన్న భయంతో బిక్కుబిక్కుమంటూ గడిపాం. క్షణమొక యుగంలా గడిచింది. మళ్లీ కుటుంబ సభ్యులను కలుస్తామని అనుకోలేదు. ఆ భగవంతుడి దయ, భారత ప్రభుత్వం కృషి వల్ల సజీవంగా కిడ్నాపర్ల చెర నుంచి వీడాం. కిడ్నాపర్ల డిమాండ్లను నైజీరియా ప్రభుత్వంతోపాటు మా కంపెనీ త్వరగా తీర్చి ఉంటే ఇంకా ముందుగానే విడుదలయ్యేవాళ్లం. మీడియాలో వరుసగా వచ్చిన కథనాల వల్ల ఆలస్యమయింది. నా విడుదలకు ప్రయత్నించిన అందరికీ కృతజ్ఞతలు అంటూ ఉద్వేగంగా సాయి శ్రీనివాస్ ‘సాక్షి’తో మాట్లాడారు. అంతకుముందు స్కైప్లో భార్యతో మాట్లాడిన సాయిశ్రీనివాస్ మాసిన గెడ్డంతో నీరసంగా కనిపించారు. ఆరోగ్యం క్షీణించి ఉంటుందని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
కొత్తూరులో కిడ్నాప్ కలకలం
కొత్తూరు : కొత్తూరు మండల కేంద్రంలో సోమవారం రాత్రి ఆర్ఎంపీ (ఆయుర్వేదిక్) వైద్యుడిని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద కిడ్నాప్ చేశారన్న వార్త స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఘటన జరిగి 24 గంటలు గడిచినప్పటికీ సదరు వైద్యుడిని ఎవరు తీసుకువెళ్లారన్న విషయంలో స్పష్ట త కొరవడింది. మంగళవారం వైద్యుడి కుటుంబ సభ్యులు కొత్తూరు పోలీస్ స్టేషన్ను ఆశ్రయించినట్టు తెలియవచ్చింది. ఈ ఆర్ఎంపీ వైద్యుడు ఎవరు ? ఆయన్ని ఎవరు కిడ్నాప్ చేశారన్న అంశంపై ఇప్పటికీ స్పష్టత లేదు. ఈ విషయమై కొత్తూరు పీఎస్సై జనార్దనరావు వద్ద ప్రస్తావించగా.. కిడ్నాప్ ఘటనపై తమ కు ఎటువంటి ఫిర్యాదు అందలేదని స్పష్టం చేశారు. హల్చల్ చేస్తున్న ఉదంతాలు... ఇటీవల సీతంపేట ఏజెన్సీ దొనుబాయి కేంద్రంగా పురాతన రాగి నాణేలు క్రయ, విక్రయాల జరిగిన విషయం బయట పడటంతో పోలీసులు నిఘా పెంచారని వదంతులు వెల్లువెత్తున్నాయి. ఈ క్రమంలోనే అనుమానితులను పోలీసులు ఆదుపులోకి తీసుకుంటున్నట్టు పలువురు భావిస్తున్నారు. ఆర్ఎంపీ వైద్యుడితో పాటు సీతంపేట, కొత్తూరు మండలాలకు చెందిన మరికొంత మందిని కూడా పోలీసులు ఆదుపులోకి తీసుకొన్నారని వందలు వినిపిస్తున్నాయి. వారి కుటుంబ సభ్యులు సైతం పాలకొండ, సీతంపేట, వీరఘట్టాం పోలీసు స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నట్టు ప్రచారం ఊపందుకుంది. -
భీమవరంలో కిడ్నాపర్లు అరెస్ట్
ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా భీమవరం రెండవ పోలీస్ స్టేషన్ పరిధిలో క్రికెట్ బెట్టర్ను కిడ్నాప్ చేసిన ముగ్గురిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి కారుతోపాటు రూ. 4.25 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. వారిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. వారిని పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నారు. -
కిడ్నాపైన బాలుడు రేవంత్ క్షేమం
గుంటూరు: మూడేళ్ల బాలుడు కిడ్నాప్కు గురైన సంఘటన గుంటూరు నగరంలో తీవ్ర కలకలం రేపింది. అయితే పోలీసులు కిడ్నాప్ వ్యవహారాన్ని గంటల వ్యధిలో ఛేదించి కిడ్నాపర్ను అదుపులోకి తీసుకున్నారు. బాలుడ్ని క్షేమంగా కిడ్నాపర్ చెర నుంచి రక్షించి తల్లిదండ్రులకు అప్పగించారు. గుంటూరు ఈస్ట్ డీఎస్పీ సంతోష్ తెలిపిన వివరాల ప్రకారం... లాలాపేట చిన్న బజారులో నివసించే గుడివాడ శివనాగేశ్వరావు ఊరావారి వీధిలో శ్రీ సుబ్బలక్ష్మి టెక్స్టైల్స్తోపాటు దానికి సమీపంలోనే భవాని కిడ్స్వేర్ పేరుతో రెండు వస్త్రాల షాపులు నిర్వహిస్తున్నాడు. శివనాగేశ్వరరావు, సరోజిని దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుమార్తెలకువివాహం చేశాడు. కుమారుడు ఎనిమిదేళ్ల క్రితం మృతి చెందాడు. దీనితో కొడుకు కావాలనే ఆశతో సుభాషిణిని రెండో వివాహం చేసుకున్నాడు. అయితే ఆమెకు పిల్లలు కలుగలేదు. దీనితో మూడేళ్ల క్రితం ఓ ఆసుపత్రిలో జన్మించిన రోజుల బాలుడిని దత్తత తీసుకుని రేవంత్సాయికుమార్ అని పేరు పెట్టి పెంచుకుంటున్నారు. శనివారం మధ్యాహ్నాం 1.15 గంటల సమయంలో రేవంత్ సాయికుమార్ భవాని కిడ్స్వేర్ షాపు ముందు ఉన్న కౌంటర్ మీద కూర్చుని ఉన్నాడు. శివనాగేశ్వరావు మొదటి భార్య సరోజిని షాపులో ఉంది. ఈ సమయంలో ఎర్ర టీషర్ట్ వేసుకున్న ఓ యువకుడు దుకాణంలోకి వచ్చి దుస్తులు బేరమాడుతున్నట్టుగా నటించి రేవంత్ సాయికుమార్ను బలవంతంగా ఎత్తుకుని తన ద్విచక్రవాహనం ముందు కూర్చొపెట్టుకుని పరారయ్యాడు. గమనించిన స్థానికులు కేకలు వేస్తూ పట్టుకునేందుకు యత్నించినా ఫలితం లేకుండాపోయింది. ఓ వ్యాపారి ద్విచక్రవాహనాన్ని అడ్డుకోబోగా కొట్టి వెళ్లిపోయాడు. బాలుడ్ని ఎత్తుకెళ్లేందుకు పది నిమిషాలకు ముందు కిడ్నాపర్ దుకాణం ముందు ఓ హిజ్రాతో వేరే భాషలో మాట్లాడినట్లు స్థానికులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న అర్బన్ అడిషనల్ ఎస్పీ జె. భాస్కరరావు, ఈస్ట్, వెస్ట్ డీఎస్పీలు సంతోష్, సరిత, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కిడ్నాప్నకు గురయిన దుకాణానికి సమీపంలో ఉన్న సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. ఫుటేజిలో బాలుడిన బైక్పై ఎత్తుకెళ్తున్న దుండగుడు స్పష్టంగా కనిపించడంతోపాటు బైక్ నంబర్ను పోలీసులు గుర్తించారు. దీంతో అర్బన్ జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆదేశాలతో డీఎస్పీల ఆధ్వర్యంలో గాలింపు చేపట్టారు. సీసీ ఫుటేజిలతోపాటు సెల్ టవర్ సిగ్నల్స్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు గంటల వ్యవధిలోనే కిడ్నాపర్ను పట్టుకుని బాలుడ్ని క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించడంతో కిడ్నాప్ కథ సుఖాంతం అయింది. కిడ్నాప్కు కుటుంబ కలహాలు కారణం కాదని విచారణ తరువాత అసలు విషయాలు తేలుతాయని చెప్పారు. అయితే బాలుడ్ని దుకాణం వద్ద వదిలేసేందుకు ఓ వ్యక్తి రాగా పోలీసులు పట్టుకున్నట్లు చెబుతున్నారు. పోలీసులు మాత్రం పూర్తి విషయాలు బయటపెట్టేందుకు విముఖత వ్యక్తం చేశారు. -
ఎంత ఘోరం..!
బాలుడిని అపహరించి ఆపై హతమార్చిన ఆగంతకులు కర్చీఫ్తో గొంతు బిగించి కర్కశంగా చంపిన వైనం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న తల్లిదండ్రులు ముమ్మరంగా పోలీసుల దర్యాప్తు కిడ్నాపర్ల కర్కశత్వానికి బాలుడు బలయ్యాడు. అడిగిన సొమ్ము ఇవ్వలేదన్న కక్షతో అతి కిరాతకంగా చంపేశారు.. గొంతుకు కర్చీఫ్ చుట్టి, కాళ్లుచేతులు కట్టేసి.. రాయిని తాడుతో ఒంటికి కట్టి బావిలో పడేశారు. నేడో రేపో తమ బిడ్డ తిరిగొస్తాడని ఎదురుచూస్తున్న తల్లిదండ్రులు బాలుడి మృతివార్తతో గుండె లవిసేలా విలపిస్తున్నారు.. పట్నంబజారు(గుంటూరు) : గుంటూరు ఏటీ అగ్రహారం జోరో లైనుకు చెందిన నన్నం జయకుమారి కుమారుడు యదిద్యరాజు (డుంబు) (12) ఇదే ప్రాంతంలోని సెంట్రల్ పబ్లిక్ స్కూల్లో ఆరో తరగతి చదువుతున్నాడు. ఈ నెల 14వ తేదీన సాయంత్రం నాలుగు గంటలకు ఇంటి నుంచి ట్యూషన్కు బయలుదేరి వెళ్లాడు. తిరిగి ఇంటికి వచ్చే సమయం కావస్తున్నా.. రాకపోవడంతో కంగారుపడుతున్న తల్లి జయకుమారికి రాత్రి 10 గంటల సమయంలో ఆగంతకులు ఫోన్ చేశారు. మీ బిడ్డ మా వద్దే ఉన్నాడని, రూ.15 లక్షలు ఇస్తే కానీ వదలమని, విషయాన్ని పోలీసులకు తెలియజేస్తే కడతేరుస్తామని బెదిరింపులకు దిగారు. మళ్లీ ఆగంతకులు ఫోన్ చేయడంతో తమ వద్ద అంత డబ్బుల్లేవని, రూ.రెండు లక్షలే ఉన్నాయని వారికి తెలిపారు. కిడ్నాప్ జరిగిన మరుసటి రోజు 15వ తేదీన డుంబు తల్లి జయకుమారి నగరంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఫోన్ కాల్ ఆధారంగా విచారణ ప్రారంభించారు. దానిలో భాగంగానే పేరేచర్ల, మాచర్ల, వినుకొండ ప్రాంతాల్లో మూడు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. అయినా యదిద్యరాజు ఆచూకీ తెలియలేదు. రూ.రెండు లక్షలు చెల్లించేందుకు వెళ్లాడుగానీ.. కిడ్నాపర్ల కోరిక మేరకు రూ.రెండు లక్షలు చెల్లించేందుకు శుక్ర, శనివారాల్లో మృతుడి మేనమామ రాజు వెళ్లాడు. మాచర్ల రెలైక్కి, తుమ్మల చెరువు రైల్వేస్టేషన్లో ఆగంతకులు చెప్పిన ప్రకారం డబ్బు సంచిని పడేశాడు. మొదటి రోజు వెళ్లినప్పుడు డబ్బుల సంచి పడేయలేదని, రెండో రోజు శనివారం వారు కుడి పక్కకు చెబితే, పొరపాటున కంగారులో ఎడమ చేతి పక్కకు పడేసినట్లు రాజు చెప్పాడు. దీంతో డబ్బులు ఇవ్వలేదని, పోలీసులను తీసుకువచ్చారని ఆగంతకులు ఇంతటి దారుణానికి ఒడిగట్టి ఉంటారని భావిస్తున్నారు. రెండు రోజుల కిందటే దారుణం.. ఫిరంగిపురం మండలం తాళ్లూరు గ్రామంలో రోడ్డు పక్క ఉన్న పొలంలోని బావిలో యదిద్యరాజును దారుణంగా కాళ్లు, చేతులు కట్టి పడేశారు. శరీరమంతా భారీగా ఉబ్బిపోయి ఉండడంతో రెండు రోజుల కిందటే పడేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అనంతరం అక్కడ నుంచి మృతదేహాన్ని గుంటూరు మార్చురీకి తరలించారు. సంఘటన స్థలాన్ని వెస్ట్ డీఎస్పీ కేజీవీ సరిత, నగరంపాలెం పోలీస్స్టేషన్ ఎస్హెచ్వో హైమారావు సందర్శించారు. యదిద్యరాజు మృతదేహాన్ని చూసిన తల్లి జయకుమారి కన్నీరుమున్నీరుగా విలపించిన తీరు ప్రతి ఒక్కరిని కంట తడి పెట్టించింది. -
బాలుడిని అపహరించి..
► బాలుడిని అపహరించి.. ఆపై హతమార్చిన అగంతకులు ► కర్చిఫ్తో గొంతు బిగించి కర్కశంగా చంపిన వైనం ► కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న తల్లిదండ్రులు ► దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు కిడ్నాపర్ల కర్కశత్వానికి బాలుడు బలయ్యాడు. అడిగిన సొమ్ము ఇవ్వలేదన్న కక్షతో అతి కిరాతకంగా చంపేశారు.. గొంతుకు కర్చీఫ్ చుట్టి, కాళ్లుచేతులు కట్టేసి.. రాయిని తాడుతో ఒంటికి కట్టి బావిలో పడేశారు. నేడో రేపో తమ బిడ్డ తిరిగొస్తాడని ఎదురుచూస్తున్న తల్లిదండ్రులు బాలుడి మృతివార్తతో గుండెలవిసేలా విలపిస్తున్నారు.. పట్నంబజారు(గుంటూరు) : గుంటూరు ఏటీ అగ్రహారం జోరో లైనుకు చెందిన నన్నం జయకుమారి కుమారుడు యదిద్యరాజు (డుంబు) (12) ఇదే ప్రాంతంలోని సెంట్రల్ పబ్లిక్ స్కూల్లో ఆరో తరగతి చదువుతున్నాడు. ఈ నెల 14వ తేదీన సాయంత్రం నాలుగు గంటలకు ఇంటి నుంచి ట్యూషన్కు బయలుదేరి వెళ్లాడు. తిరిగి ఇంటికి వచ్చే సమయం కావస్తున్నా.. రాకపోవడంతో కంగారుపడుతున్న తల్లి జయకుమారికి రాత్రి 10 గంటల సమయంలో ఆగంతకులు ఫోన్ చేశారు. మీ బిడ్డ మా వద్దే ఉన్నాడని, రూ.15 లక్షలు ఇస్తే కానీ వదలమని, విషయాన్ని పోలీసులకు తెలియజేస్తే కడతేరుస్తామని బెదిరింపులకు దిగారు. మళ్లీ ఆగంతకులు ఫోన్ చేయడంతో తమ వద్ద అంత డబ్బుల్లేవని, రూ.రెండు లక్షలే ఉన్నాయని వారికి తెలిపారు. కిడ్నాప్ జరిగిన మరుసటి రోజు 15వ తేదీన డుంబు తల్లి జయకుమారి నగరంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఫోన్ కాల్ ఆధారంగా విచారణ ప్రారంభించారు. దానిలో భాగంగానే పేరేచర్ల, మాచర్ల, వినుకొండ ప్రాంతాల్లో మూడు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. అయినా యదిద్యరాజు ఆచూకీ తెలియలేదు. రూ.రెండు లక్షలు చెల్లించేందుకు వెళ్లాడుగానీ.. కిడ్నాపర్ల కోరిక మేరకు రూ.రెండు లక్షలు చెల్లించేందుకు శుక్ర, శనివారాల్లో మృతుడి మేనమామ రాజు వెళ్లాడు. మాచర్ల రెలైక్కి, తుమ్మల చెరువు రైల్వేస్టేషన్లో ఆగంతకులు చెప్పిన ప్రకారం డబ్బు సంచిని పడేశాడు. మొదటి రోజు వెళ్లినప్పుడు డబ్బుల సంచి పడేయలేదని, రెండో రోజు శనివారం వారు కుడి పక్కకు చెబితే, పొరపాటున కంగారులో ఎడమ చేతి పక్కకు పడేసినట్లు రాజు చెప్పాడు. దీంతో డబ్బులు ఇవ్వలేదని, పోలీసులను తీసుకువచ్చారని ఆగంతకులు ఇంతటి దారుణానికి ఒడిగట్టి ఉంటారని భావిస్తున్నారు. రెండు రోజుల కిందటే దారుణం.. ఫిరంగిపురం మండలం తాళ్లూరు గ్రామంలో రోడ్డు పక్క ఉన్న పొలంలోని బావిలో యదిద్యరాజును దారుణంగా కాళ్లు, చేతులు కట్టి పడేశారు. శరీరమంతా భారీగా ఉబ్బిపోయి ఉండడంతో రెండు రోజుల కిందటే పడేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అనంతరం అక్కడ నుంచి మృతదేహాన్ని గుంటూరు మార్చురీకి తరలించారు. సంఘటన స్థలాన్ని వెస్ట్ డీఎస్పీ కేజీవీ సరిత, నగరంపాలెం పోలీస్స్టేషన్ ఎస్హెచ్వో హైమారావు సందర్శించారు. యదిద్యరాజు మృతదేహాన్ని చూసిన తల్లి జయకుమారి కన్నీరుమున్నీరుగా విలపించిన తీరు ప్రతి ఒక్కరిని కంట తడి పెట్టించింది. తెలిసిన వారి పనేనా..? రోడ్డుపై బాలుడిని ఎత్తుకుని వెళితే... కనీసం గొడవ జరగడం, లేదా కేకలు వేయడం వంటి సంఘటనలైనా జరిగి ఉండాలి. ఇటువంటి ఏమీ లేకుండా బాలుడిని తీసుకుని వెళ్లారంటే ఇది కచ్చితంగా ఎవరో తెలిసిన వారి పనే అయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. యదిద్యరాజు కుటుంబంతో అంతటి పగ ఎవరికి ఉందనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దీనికితోడు ఆస్తి తగాదాలు కూడా ఉండడంతో పలు అనుమానాలకు తావిస్తోందని పోలీసులు అంటున్నారు. -
శిక్షల కోసం..శిక్షణ!
ఇప్పటికే సీసీ కెమెరాలన్నీ ‘మ్యాప్ మీదికి’ ఫుటేజ్ సేకరణ, విశ్లేషణపై ప్రత్యేక శిక్షణ న్యాయస్థానంలో దాఖలు విధానం పైనా విడతల వారీగా చేపడుతున్న అధికారులు సిటీబ్యూరో: ‘రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టెన్త్ క్లాస్ విద్యార్థి అభయ్ కిడ్నాప్, హత్య కేసులో పోలీసులకు ప్రాథమిక ఆధారం అందించింది సీసీ కెమెరా ఫీడ్. న్యాయస్థానంలో కీలక ఆధారంగా మారబోయేదీ అదే’ నేరాల నిరోధం, కేసులు కొలిక్కి తీసుకురావడానికి నగర వ్యాప్తంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయిస్తున్న నగర పోలీసు విభాగం వీటిలో రికార్డు అయ్యే దృశ్యాలను బలమైన ఆధారాలుగా వాడుకోవాలని నిర్ణయించింది. ఓపక్క నేరగాళ్లను పట్టుకోవడంతో పాటు మరోపక్క వీరిని దోషులుగా నిరూపించడంలోనూ వినియోగించుకోనుంది. దీనికి సంబంధించి వీడియో ఫుటేజ్ల సంగ్రహణ, విశ్లేషణ, ఆధారాలుగా రూపకల్పనలో సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. ప్రస్తుతం క్రైమ్ టీమ్స్కు నిర్వహిస్తున్న ఈ ట్రైనింగ్ను దశల వారీగా అందరికీ ఇవ్వాలని కొత్వాల్ ఎం.మహేందర్రెడ్డి నిర్ణయించారు. కెమెరాలన్నీ క్రైమ్ మ్యాపింగ్లోకి... నేరాల నియంత్రణ (ప్రివెన్షన్), కేసుల్ని కొలిక్కి తేవడం (డిటెక్షన్)కు ఉద్దేశించిన ప్రత్యేక యాప్ క్రైమ్ మ్యాపింగ్ను సిటీ పోలీసు ఐటీ సెల్ ఇప్పటికే రూపొందించింది. దీన్ని కమిషనరేట్లోని అన్ని స్థాయిల అధికారులకు అందుబాటులోకి తెచ్చారు. సిటీలోని అన్ని పోలీసుస్టేషన్ల పరిధిలో ఉన్న నేరాలు జరిగే ప్రాంతాలను డిజిటలైజ్ చేయడంతో పాటు ఆయా ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలను మ్యాప్ పైకి తీసుకువచ్చారు. స్నాచింగ్, అటెన్షన్ డ్రైవర్షన్తో పాటు ఇతర నేరాలు చోటు చేసుకున్న సమయంలో ఘటనాస్థలికి పోలీసులు చేరుకుంటారు. అయితే అనుమానితుల గుర్తింపు, ఆధారాల సేకరణకు ఆ క్రైమ్ సీన్కు సమీపంలో, దారితీసే ప్రాంతాల్లో ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి? అనేది తెలుసుకోవడానికి ప్రస్తుతం మానవ వనరుల్ని వినియోగించి మాన్యువల్గా వెతకాల్సి వస్తోంది. దీనికి కొంత సమయం పడుతోంది. అలాంటి జాప్యానికీ తావులేకుండా క్షేత్రస్థాయి అధికారులు ఈ యాప్లో ‘క్రైమ్ రాడార్’ను ఏర్పాటు చేశారు. దర్యాప్తు అధికారులు దీనిలోకి ఎంటర్ అయితే చాలు... నేరం జరిగిన ప్రాంతానికి సమీపంలో ఎక్కడెక్కడ ఎన్ని కెమెరాలు ఉన్నాయనేది చూపిస్తుంది. మ్యాప్ పైన కనిపించే కెమెరా మార్క్ వద్ద క్లిక్ చేస్తే.. అది ఎక్కడ ఉందనే చిరునామా సైతం పాప్అప్ రూపంలో ప్రత్యక్షమవుతుంది. సేకరణ, విశ్లేషణ అత్యంత కీలకం... ఘటనాస్థలికి సంబంధించి సీసీ కెమెరాలు ఎక్కడ ఉన్నాయో గుర్తించడం ఒక ఎత్తై... వాటిలో రికార్డు అయిన ఫీడ్ను సేకరించడం, విశ్లేషించడం మరో ఎత్తు. వీటిలో ఏమాత్రం పొరపాటు జరిగినా కీలకాధారాలు తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం పోలీసులు దీనికోసం నిపుణులపై ఆధారపడాల్సి వస్తోంది. ఆ అవసరం లేకుండా సిబ్బందికే ఈ అంశాలపై శిక్షణ ఇప్పించాలని నిర్ణయించిన కొత్వాల్ మహేందర్రెడ్డి ఆ విధానానికి శ్రీకారం చుట్టారు. సీసీ కెమెరాల ద్వారా రికార్డు అయ్యే ఫీడ్ మొత్తం దానికి సంబంధించిన సర్వర్ లేదా హార్డ్డిస్క్లో సేవ్ అవుతుంది. వీటిని ఎలా నిర్వహించాలి? రికార్డు అయిన ఫీడ్ను ఏ రకంగా సంగ్రహించాలి? దర్యాప్తునకు అనుగుణంగా దాన్ని ఏ రకంగా విశ్లేషించాలి? తదితర అంశాలను నిపుణుల ద్వారా సిబ్బందికి శిక్షణ ఇప్పిస్తున్నారు. కోర్టుల కోణంలోనూ కీలక తర్ఫీదు... నేరం జరిగిన ప్రాంతంలో, సమీపంలో సీసీ కెమెరాలు ఎక్కడ ఉన్నాయో గుర్తించడం, వాటి ద్వారా రికార్డు అయిన ఫీడ్ను సేకరించడం, దర్యాప్తు ద్వారా నిందితుల్ని పట్టుకోవడానికి విశ్లేషించడం... ఈ ప్రక్రియలన్నీ పూర్తయిన తర్వాత మరో కీలక ఘట్టం ఉంటుంది. ఆ సీసీ కెమెరాల ఫీడ్ను న్యాయస్థానంలో ఆధారంగా ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ సక్రమంగా జరిగినప్పుడే నిందితుల్ని దోషులుగా నిరూపించే ఆస్కారం ఉంటుంది. ఇందులో పొరపాటు జరిగినా పోలీసుల శ్రమకు తగిన ఫలితం ఉండదు. దీంతో ఈ ట్రైనింగ్లో భాగంగా సిబ్బందికి నిబంధనలు, చట్ట ప్రకారం సీసీ కెమెరాల ఫీడ్ను ఏరకంగా న్యాయస్థానంలో దాఖలు చేయాలనేది నేర్పిస్తున్నారు. బృందాల వారీగా జరుగుతున్న ఈ శిక్షణ ప్రస్తుతం కమిషనరేట్లోని క్రైమ్ టీమ్స్కు ఇస్తున్నారు. వీరి తర్వాత శాంతిభద్రతల విభాగంలో పని చేస్తున్న సిబ్బందికీ ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. బషీర్బాగ్లోని పోలీసు కమిషనరేట్ కార్యాలయంలోనే ట్రైనింగ్ జరుగుతోంది. -
కానూరులో కిడ్నాప్ కలకలం
విజయవాడ/ పెనమలూరు : కానూరులో శుక్రవారం కిడ్నాప్ కలకలం రేగింది. ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన ఆరేళ్ల చిన్నారి కిడ్నాప్కు గురైందని, కిడ్నాపర్లు విజయవాడకే తీసుకొచ్చారని తెలుసుకున్న నగరవాసులు ఉలిక్కిపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన దేవిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మల్లేశ్వరి దంపతులు ప్రభుత్వోద్యోగులు. వారి కుమార్తె సహస్ర (6). శ్రీనివాసరెడ్డికి రాజేష్రెడ్డి అనే సోదరుడు ఉన్నాడు. రాజేష్ రెడ్డి అల్లరి చిల్లరిగా తిరిగేవాడు. అతని ఆర్థిక అవసరాలకు శ్రీనివాసరెడ్డి డబ్బులు ఇవ్వకపోవడంతో పాటు ఆస్తిని కూడా పంచకపోవడంతో అన్న కుటుంబంపై కక్ష పెంచుకున్నాడు. తన జల్సాలకు డబ్బు అవసరం కావడంతో సోదరుని కుమార్తె సహస్రను కిడ్నాప్ చేసేందుకు పథకం పన్నాడు. ఈ నేపథ్యంలో విజయవాడ మురళీనగర్లోని వెంకటరమణ ఎన్క్లేవ్లో ఒక ఫ్లాట్ గత నెల 20న అద్దెకు తీసుకుని తన స్నేహితుడితో కలిసి అక్కడ ఉన్నాడు. స్నేహితుడి సహాయంతో కనిగిరిలో తన సోదరుడి ఇంటి వద్ద ఆడుకుంటున్న సహస్రను కిడ్నాప్ చేశాడు. స్థానికులు గుర్తించకుండా హెల్మెట్ పెట్టుకున్నట్లు సమాచారం. కనిగిరి నుంచి సహస్రను విజయవాడకు తీసుకొచ్చిన రాజేష్రెడ్డి రూ.50 లక్షలు కావాలంటూ స్నేహితుడితో సోదరుడికి ఫోన్ చేయించాడు. దీంతో అప్రమత్తమైన కనిగిరి పోలీసులు ఫోన్ నంబర్, సెల్టవర్ల ఆధారంగా గురువారం రాత్రి విజయవాడకు వచ్చి వెంకట రమణ ఎన్క్లేవ్లో సోదాలు చేశారు. అయితే నిందితులు ఇక్కడ లేరని నిర్ధారించుకున్నారు. ఆ తర్వాత నిందితుడి స్నేహితుడు వాడిన సెల్ఫోన్ ఆధారంగా కనిగిరిలో అరెస్టు చేసినట్లు తెలిసింది. -
యాక్షన్ సినిమా లెవల్లో కాల్పులు
న్యూఢిల్లీ: ఓ బాలుడిని కాపాడేందుకు పోలీసులకు, దుండగలకు మధ్య యాక్షన్ సినిమా లెవల్లో పోరు నడిచింది. యుద్ధ వాతావరణాన్ని తలపించేలా స్కూలు ఆవరణ కాల్పులతో దద్దరిల్లిపోయింది. హైడ్రామా అనంతరం ఎట్టకేలకు కిడ్నాపర్ల చెర నుండి బాలుడిని కాపాడిన వైనం ఢిల్లీ శివారు ప్రాంతంలోని ఘజియాబాద్లోని ఓ స్కూల్లో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. వివరాల్లోకి వెళితే విలాసవంతమైన రాజ్ నగర్ ఏరియా నుంచి జై కరన్ అనే 13 ఏళ్ల బాలుడిని దుండగులు ఆదివారం కిడ్నాప్ చేశారు. ఒకరోజు తర్వాత...జై కరన్ తండ్రి, స్టాక్ ట్రేడర్ వివేక్ మహాజన్ కి బాలుని మొబైల్ నుంచే ఫోన్ చేశారు. అతడిని విడిచిపెట్టాలంటే రెండు కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా పోలీసులకు చెబితే చంపేస్తామని బెదిరించారు. అయినా బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రాథమిక వివరాల సేకరణ అనంతరం జై కరన్ మొబైల్ సిగ్నల్ ఆధారంగా దుండగులు దాగి వున్న స్థలాన్ని గుర్తించిన పోలీసులు రంగంలోకి దిగారు. స్థానిక రాయల్ కిడ్స్ ప్లే స్కూల్లో పనిచేసే ఉద్యోగి ఇంట్లో పిల్లాడిని దాచి పెట్టిన సంగతిని తెలుసుకుని ఇంటిపై దాడి చేశారు. సుమారు 20 నిమిషాలపాటు పోలీసులు, దుండగుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. పరస్పర భీకర కాల్పుల తరువాత చివరికి దుండగుల ఆట కట్టించారు. 10-12 రౌండ్ల కాల్పులు జరగగా, ఈ ఘటనలో నిందితుడు దిలీప్ గాయపడ్డాడు. సందీప్ కుమార్, దీపక్ ,బిట్టు అనే ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం జై కరన్ కిడ్నాప్ ఉదంతాన్ని వివరిస్తూ.... 'నన్ను కారులో తీసుకెళ్లి, ఒక ఇంట్లో దాచారు. తుపాకితో బెదిరించి, బాగా కొట్టారు. వాళ్ల అమ్మ నన్ను విడిచిపెట్టమని అంటే ఆమెను కూడా తిట్టారు. తుపాకి గురిపెట్టి ఆమెను భయపెట్టారు. తరువాత ఏదో ఇంజక్షన్ ఇచ్చారని ఆ తరువాత తనకేమీ తెలియదని' పోలీసులకు వివరించాడు. తేలికగా డబ్బు సంపాదించడం కోసం నిందితులు ఈ చర్యకు పాల్పడ్డట్టు పోలీసులు తెలిపారు. అటు ఈ వ్యవహారంలో స్కూలు యాజమాన్యాన్ని, ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు శని, ఆదివారాలు స్కూలుకు సెలవు కావడంతో బాలుడి కిడ్నాప్ విషయం తమ దృష్టికి రాలేదని స్కూలు యాజమాన్యం చెబుతోంది. మరోవైపు తమ కుమారుడు క్షేమంగా తిరిగి రావటంతో తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. -
లంగర్ హౌజ్లో కిడ్నాప్ కలకలం
-
టెక్కీని కిడ్నాప్ చేసిన నలుగురి అరెస్ట్
సాప్ట్వేర్ ఇంజినీర్ని కిడ్నాప్ చేసి రూ.20 లక్షలు డిమాండ్ చేసిన నలుగురిని హెచ్ఎస్ఆర్ లే అవుట్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. పట్టుబడిన వారిలో మోహన్, కవిదరన్, శంకర్, కుమార్ ఉన్నారు. వీరిలో మోహన్, కవిదరన్ టైలర్లుగా పనిచేస్తున్నారు. వీరందరూ గార్మెంట్స్ దుకాణం నిర్వహించి నష్టపోయారు. దీంతో చేసిన అప్పులు తీర్చేందుకు హెచ్ఎస్ఆర్ లే అవుట్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ని కిడ్నాప్ చేయాలని భావించారు. రెండురోజుల క్రితం ఎలక్ట్రానిక్సిటీ నుంచి కారులో ఇంటికి బయలుదేరిన టెక్కీని బైక్ల్లో అనుసరించి, నిర్జన ప్రదేశంలో బైక్ను కారుకు తాకించి అతనితో గొడవపడ్డారు. అనంతరం అతన్ని కిడ్నాప్ చేసి అతడి భార్యకు ఫోన్ చేయించి తొలుత రూ. 5 లక్షలు.. అనంతరం రూ. 20 లక్షలు కావాలని డిమాండ్ చేశారు. ఘటనపై బాధితుడి భార్య ఫిర్యాదు మేరకు దర్యాప్తుచేపట్టిన డీసీపీ రోహిణి కటౌచ్ సెపట్ రంగంలో 8 బృందాలను దింపారు. పక్కా సమాచారంతో తమిళనాడులోని క్రిష్ణగిరి జిల్లాలో తల దాచుకున్న కిడ్నాపర్లను అరెస్ట్ చేసి, టెక్కీని కాపాడారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు డీసీపీ తెలిపారు. -
హమ్మయ్య!
ఊపిరి పీల్చుకున్న మన్యం ముగ్గురు గిరిజనులనూ విడిచిపెట్టిన మావోయిస్టులు ఫలించిన గిరిజన ఉద్యోగ సంఘాల కృషి అధికార పార్టీ తీరుపై సర్వత్రా విమర్శలు కిడ్నాప్ చేసిన ముగ్గురు టీడీపీ నాయకులను మావోయిస్టులు సురక్షితంగా విడుదల చేయడంతో పది రోజుల ఉత్కంఠకు తెరపడింది. దీంతో కుటుంబ సభ్యులు, మన్యం ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ప్రభుత్వం స్పందించకపోయినా వీరి విడుదల కోసం గిరిజన ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు చేసిన విశేష కృషి ఫలించింది. తెలుగుదేశం పార్టీకి, పదవులకు రాజీనామాలు చేసి బాక్సైట్ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొంటామని విడుదలైన నాయకులు స్పష్టంచేశారు. జీకేవీధి: ఎట్టకేలకు మావోయిస్టులు మానవతా దృక్పథంతో టీడీపీ నేతలు ముక్కల మహేష్, మామిడి బాలయ్యపడాల్, వండలం బాలయ్యను బుధవారం సాయంత్రం విడుదల చేయడంతో తెల్లవారుజామున వారు క్షేమంగా ఇళ్లకు చేరుకున్నారు. ఈనెల 6న జీకేవీధి మండలం కొత్తూరు గ్రామం వద్ద మావోయిస్టులు ఈ ముగ్గురినీ అపహరించిన సంగతి తెలిసిందే. వారికి ఎలాంటి హాని తలపెడతారోనని అప్పటి నుంచి కుటుంబసభ్యులు, మన్యం వాసుసలు ఆందోళనతో గడిపారు. గిరిజన ఉద్యోగ సంఘాల కృషి ఫలితమే.. టీడీపీ నేతల విడుదలలో గిరిజన ఉద్యోగ సంఘాల నాయకులు కీలకపాత్ర పోషించారు. పోరాడితే పోయేదేమీ లేదు.. బానిస సంకెళ్లు తప్ప.. అనే విప్లవ నానుడిని నిజం చేసి నిరూపించారు. మన్యంలో గిరిజన ఉద్యోగులుగా ఉంటూ అనేక సమస్యలపై పోరాడుతున్న గిరిజన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు తోటి గిరిజనులను మావోయిస్టులు అపహరించారన్న సంగతి తెలియగానే స్వచ్ఛందంగా స్పందించారు. చింతపల్లి, జీకేవీధి గిరిజన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పోతురాజు బాలయ్య, సేవా రాజారావు, ముర్ల వెంకటరమణ, గెమ్మెలి మోహన్, యువి గిరితోపాటు వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యుడు రమేష్ పలు దఫాలుగా మావోయిస్టులతో సంప్రదింపుల కోసం ప్రయత్నించారు. ఈ క్రమంలోనే అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టుల కోసం అడవుల్లో అణువణువునా జల్లెడ పట్టారు. రెండు విడతలుగా వీరి ప్రయత్నాలు బెడిసి కొట్టినప్పటికీ మూడోసారి ఉపాధ్యాయ సంఘాల నేతలు అలుపెరగకుండా చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఎట్టకేలకు మావోయిస్టులతో సంప్రదింపులు జరిపి వారి అధీనంలో ఉన్న టీడీపీ నేతలన సురక్షితంగా తీసుకు వచ్చి వారి కుటుంబ సభ్యులకు అప్పగించిన ఘనత గిరిజన ఉపాధ్యాయ సంఘాలకే దక్కింది. గత నెల ఇదే ఉపాధ్యాయ సంఘ నాయకులు మావోయిస్టులను కలిశారంటూ జరిగిన ప్రచారంపై పోలీసులు బైండోవర్ కేసులు నమోదు చేశారు. భవిష్యత్తులో ఎదురయ్యే ఇబ్బందులను లెక్క చేయకుండా సాటి గిరిజనుల విడుదలపై కృషి చేసిన గిరిజన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకుల కృషిని మన్యం వాసులు అభినందిస్తున్నారు. అధికార పార్టీ తీరుపై సర్వత్రా విమర్శలు టీడీపీ నేతలను మావోయిస్టులు అపహరించిన వ్యవహారంలో ఆది నుంచి ఆ పార్టీ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీ అయినప్పటికీ మావోయిస్టుల చెరలో ఉన్న నేతల విడుదలపై ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు , ముఖ్యమంత్రి చంద్రబాబు ఎవరు కూడా స్పష్టమైన ప్రకటన చేయకపోవడం పలు విమర్శలకు తావిచ్చింది. గాలింపులను నిలిపివేస్తామని, మావోయిస్టుల చెరలో ఉన్న వారి విడుదలకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని పోలీసులు ప్రకటనలు చేశారే తప్ప క్షేత్రస్థాయిలో తీసుకున్న చర్యలేమీ కానరాలేదు. ఈ నేపధ్యంలోనే గిరిజన ఉపాధ్యాయ సంఘ నేతల చొరవ వల్ల టీడీపీ నేతలు మావోయిస్టుల చెర నుంచి బయపడ్డారు. -
కొవ్వలిలో కిడ్నాపర్కి దేహశుద్ధి
ఏలూరు : ప్రజలు అప్రమత్తమై కిడ్నాపర్ల బారి నుంచి ఓ వ్యక్తిని రక్షించారు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు సమీపంలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.... రాజమండ్రికి చెందిన ఎ.సతీశ్ అనే వ్యక్తి ఓఎన్జీసీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసిన కేసులో నిందితుడు. అయితే అతడు కోర్టులో పని నిమిత్తం మంగళవారం ఉదయం ఏలూరుకు పయనమైయ్యాడు. ఆ క్రమంలో ఏలూరు నగరంలోని ఆశ్రమ్ జంక్షన్ బస్స్టాప్ వద్ద సతీశ్ బస్సు దిగాడు. అప్పటికే అక్కడ కాపు కాసి ఉన్న కిడ్నాపర్లు సతీశ్ను బెదిరించి కారులో ఎక్కించారు. అనంతరం కారులో వెళ్తున్న అతడు బిగ్గరగా అరవడంతో స్థానికులు వెంటనే అప్రమత్తమై... కారును బైక్లతో వెంబడించారు. అంతలో దెందులూరు మండలం కొవ్వలి గ్రామస్తుల సాయంతో గ్రామస్తులు కారును అడ్డుకున్నారు. దీంతో కిడ్నాపర్లు కారు వదిలి పరారైయ్యారు. గ్రామస్తులు కిడ్నాపర్లను వెంబడించారు. ఓ కిడ్నాపర్ని గ్రామస్తులు పట్టుకున్నారు. పోలీసులకు అప్పగించారు. పట్టుబడిన కిడ్నాపర్ని పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నారు. -
పోలీసుల అదుపులో కిడ్నాపర్లు....?
మన్సూరాబాద్: ఇంటి ముందు సైకిల్ తొక్కుతున్న బాలున్ని కిడ్నాప్ కేసులో కిడ్నాపర్లు ఎల్బీనగర్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే.... ఎల్బీనగర్ చింతల్కుంట చెక్పోస్ట్ హైవే కాలనీలో నివాసముండే ఆశిష్కుమార్ కుమార్ ఎల్బీనగర్లో మార్బుల్స్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. కుమారుడు యశెష్ విజయ్పాత్ర (7) జాన్సన్ గ్రామర్ స్కూల్లో 2వ తరగతి చదువుతున్నాడు. ఈ నెల 12వ తేదీన రాత్రి 7 గంటల సమయంలో ఇంటి ముందు సైకిల్ తొక్కుతూ ఆడుకుంటుండగా గుర్తు తెలియని వ్యక్తులు ఇండికా కారులో వచ్చి బాలుడిని కిడ్నాప్ చేసి అదే రాత్రి వనస్థలిపురంలో వదిలిపెట్టారు. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నలుగురు కిడ్నాపర్లలో మనోహర్, భానుప్రసాద్తో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. వీరిలో ఇద్దరు మీడియా ప్రతినిధులు ఉన్నట్లు తెలుస్తోంది. మంగళవారం సాయంత్రానికి మీడియా ముందు కిడ్నాపర్లను ప్రవేశపెట్టనున్నట్లు విశ్వసనీయ సమాచారం. -
కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు
-
కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు
తమిళనాడులో శిశువు లభ్యం 24 గంటల్లోగానిందితురాలు పట్టివేత తిరుపతి క్రైం : పుట్టి నెలరోజులు కూడా గడవని శిశువును కిడ్నాప్ చేసిన కేసును 24 గంటల్లోగా అర్బన్ జిల్లా పోలీసులు చేధించారు. శనివారం తిరుపతి రూరల్ విద్యానగర్ కాలనీలోని నలందానగర్లో సంతోష్, బాటు దంపతుల బిడ్డ(27 రోజుల పురుటిబిడ్డ) మాయమైన విషయం తెల్సిందే. వెస్ట్ డివిజన్ డీఎస్పీ శ్రీనివాసులు తెలిపిన వివరాల మేరకు.. సంతోష్ భార్య బాటుకు వరుసకు చిన్నాన్న అయిన బలరాం రెండో భార్య పూజాకు పిల్లలు లేరు. అయితే తాను గర్భిణి అంటూ పుట్టింటి వారిని నమ్మించే ప్రయత్నం చేస్తుండేది. తనకు కుమారుడు పుట్టాడని చూపించేందుకు ఆమె బంధువైన బాటు కుమారుడు ఉత్తమ్కుమార్ను తీసుకెళ్లింది. అయితే శిశువును తీసుకెళ్లే విషయం బలరాంకు కూడా తెలీయదని పోలీసులు చెబుతున్నారు. బాటు ఫిర్యాదు మేరకు 8 టీమ్లుగా ఏర్పాటు చేసి 2 టీమ్లు చెన్నైకి వెళ్లగా మరో ఆరు టీమ్లు స్థానికంగా ముమ్మర తనిఖీలు చేపట్టాయి. అయితే తమిళనాడులోని చిదంబరం పరిసర ప్రాంతంలోని మేళగిరిలో పూజాకు ఓ తమ్ముడున్నాడు. ఈమె కచ్చితంగా శిశువును తీసుకుని అక్కడికే వెళ్లి ఉంటుందని తెలుసుకున్న పోలీసులు ఈమెకన్నా ముందుగా ఆదివారమే ఉదయం అక్కడికి చేరుకున్నారు. ఆమె తన తమ్ముడు రాజేంద్ర ఇంటికి రాగానే శిశువును పోలీసుల చేతికి తీసుకున్నారు. ఆమెను ఆర్డీవో సమక్షంలో దగ్గరలోని పీలంబహూర్ పోలీస్స్టేషన్కు తీసుకెళ్లి అరెస్ట్ చూపించారు. శిశువును ఆదివారం రాత్రి తిరుపతి నగరానికి తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. -
చేజ్ చేసి పట్టుకున్నాం...
బెస్ట్కేస్ అపాయంలో ఉన్న ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడినప్పుడు తన కళ్లలోని ఆనందం కంటే అతని తల్లి తెలిపే కృతజ్ఞత ఎలాంటివారి హృదయాన్నైనా కదిలిస్తుంది. 2004 లో విజయనగరం ఎస్పీగా పనిచేస్తున్నప్పుడు జరిగిన ఒక సంఘటను నేను ఎప్పటికీ మరిచిపోలేను. ఆ కేసు దర్యాప్తు సంగతి అలా ఉంచితే కన్నకొడుకుని ప్రాణాలతో ఆమెకు అప్పగించినపుడు ఆ తల్లికార్చిన ఆనందబాష్పాలు నా కళ్లను కూడా తడిపాయి. ఒకరోజు పొద్దున పదకొండు గంటలకు ఒరిస్సా పోలీసుల నుంచి ఫోన్ వచ్చింది. విజయనగరం -ఒరిస్సా సరిహద్దులో ఓ కిడ్నాప్ జరిగింది. కిడ్నాప్కి గురైంది ఒరిస్సాకి చెందిన ఓ నగలవ్యాపారి కుమారుడు. వయసు 22 ఉంటుంది. కిడ్నాపర్లు విజయనగరానికి చెందినవాళ్లు. బ్లాక్మెయిల్... ఒకపక్క వ్యాపారి కొడుకుని క్షేమంగా అప్పగించాలంటే మాకు పెద్దమొత్తంలో డబ్బు కావాలంటూ బ్లాక్మెయిల్ కాల్స్ వస్తున్నాయి. మరో పక్క మీ పరిధిలో జరిగిన సంఘటన దర్యాప్తు ముమ్మరం చేయండంటూ ఒరిస్సా పోలీసుల ఒత్తిడి. వ్యాపారి ఫొటో పంపించారు. అన్ని చెక్పోస్టులకు అనుమానితులను చెక్ చేయమంటూ మెసేజ్ పంపించాను. రోజు గడిచింది గానీ పాజిటివ్ మెసేజ్ రాలేదు. పసిబిడ్డ తండ్రి... కిడ్నాప్కి గురైన వ్యాపారికి ఏడాదిన్నరక్రితం పెళ్లయింది. మూడు నెలల పసి బిడ్డ ఉన్నాడు. బాధితుడు తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకు. తల్లిదండ్రులు, భార్యా ఆవేదన గురించి చెబుతూ ఒరిస్సా పోలీసులు మమ్మల్ని చాలా టెన్షన్ పెడుతున్నారు. ఓ గుడిసెలో... మా గాలింపుల విషయం తెలుసుకున్న దుండగులు తప్పించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఒరిస్సా - విజయనగరం సరిహద్దులో హైవేకి ఆనుకుని ఉన్న వ్యవసాయ పొలంలోని గుడిసెలో దాక్కున్నట్టు సమాచారం అందింది. వెంటనే మా వాళ్లు మారువేషాల్లో దుండగులు ఉన్న ప్రదేశానికి చేరుకున్నారు. ఆ విషయాన్ని కూడా పసిగట్టిన దుండగులు అక్కడి నుంచి సుమోలో పారిపోయారు. ఎటువైపు వెళ్లారో తెలుసుకుని ఆ వైపు ఉన్న అన్ని చెక్పోస్టులకు వెహికల్స్ని స్ట్రిక్ట్గా చెక్ చేయమని చెప్పాను. హైవేలలో నిఘా పెట్టాం. 80 కిలోమీటర్లు.... దుండగుల వాహనాన్ని వెంబడిస్తూ దాదాపు ఎనైభై కిలోమీటర్ల దూరం మా టీమ్ వేట సాగింది. ‘రెండు రోజుల్లో మేం చెప్పిన చోటుకు అడిగిన సొమ్ము పంపించకపోతే అక్కడ మీ అబ్బాయి శవం దొరుకుతుంది’ అంటూ దుండగులు వ్యాపారి తండ్రికి చెప్పిన మాట నాకు పదే పదే గుర్తొస్తోంది. ఎట్టకేలకు వంద అడుగుల దూరంలో దుండగుల బండి ఉందనగా సుమోలో నుంచి ఒక దుండగుడు గన్ చూపించాడు. వెంటనే మా వాళ్లు బండి స్పీడు తగ్గించి నాకు ఫోన్ చేశారు. అంటే దానర్థం వెనక్కి వెళ్లిపొమ్మనా, వ్యాపారిని చంపేస్తారనా? అర్థంకాలేదు. వెంబడించాలా...వెనక్కి రావాలా? అంటూ మావాళ్లు నన్ను అడిగిన ప్రశ్నకు తడుముకోకుండా నేను చెప్పిన సమాధానం... వెంబడించి దుండగుల్ని పట్టుకోమని. మావాళ్లు స్పీడు పెంచి దుండగుల బండిని ఓవర్టేక్ చేశారు. ఎలాంటి ఫైరింగ్ చేయకుండా వాళ్లను పట్టుకున్నారు. ఆ తల్లి కళ్లలో... సుమో వెనకసీట్లో ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కూర్చున్న వ్యాపారి సురక్షితంగా కనిపించడంతో మావాళ్ల ఆనందానికి అవధుల్లేవు. నేను వెళ్లి అతనికి షేక్హ్యాండ్ ఇచ్చినపుడు ‘బతుకుతాననుకోలేదు మేడమ్’ అంటూ చేతులు జోడించాడు. ఇంతలో అతని తల్లిదండ్రులు, భార్యాబిడ్డా అందరూ మా పోలీస్స్టేషన్కి చేరుకున్నారు. అప్పటికి అతను కిడ్నాప్కి గురయ్యి రెండురోజులైంది. ఆ రెండు రోజులూ కూడా తల్లిదండ్రులు, భార్య పచ్చి మంచినీళ్లు ముట్టలేదట. అందరూ ఏడ్చి ఏడ్చి ఎర్రబడ్డ మొహాలతో ఉన్నారు. వ్యాపారి తల్లి నా చేతులు పట్టుకుని ‘నీ రుణం తీర్చుకోలేను తల్లీ....’ అంటూ ఒరిస్సా భాషలో తన పరిస్థితిని, సంతోషాన్ని పంచుకుంది. వ్యాపారి తన మూడు నెలల బిడ్డని చేతుల్లోకి తీసుకుని ముద్దాడాడు. ఏ భార్య అయినా ఏం చేస్తుంది? రెప్పార్పకుండా భర్తని కంటినిండా చూసుకుంది. ఇంతలో వెంట తెచ్చుకున్న ఆహారమేదో బిడ్డకు తినిపించిందా తల్లి. ప్రెజెంటేషన్: భువనేశ్వరి -
ఫిలింసిటీలో కిడ్నాప్ కలకలం
* ‘లయన్’ సినిమా ప్రొడక్షన్ మేనేజర్, క్యాషియర్ అపహరణ * దుండగులను పట్టుకున్న పోలీసులు హయత్నగర్: రామోజీ ఫిలింసిటీలో కిడ్నాప్ కలకలం... లయన్ సినిమా షూటింగ్ స్పాట్నుంచి దుండుగులు ప్రొడక్షన్ మేనేజర్, క్యాషియర్ను ఎత్తుకెళ్లారు. పోలీసులు వెంబడించి వారిని పట్టుకున్నారు. బాధితులు, హయత్నగర్ పోలీసుల కథనం ప్రకారం... ఫిలింసిటీలో బాలకృష్ణ నటిస్తున్న లయన్ షూటింగ్ జరుగుతోంది. సినిమా నిర్మిస్తున్న ఎస్ఎల్వీ కంపెనీ షూటింగ్ కోసం ఫనా ట్రావెల్స్కు చెందిన కార్లను అద్దెకు తీసుకుంది. గత డిసెంబర్ 31న వీటిలో రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొనడంతో పాడైపోయాయి. ఆ కార్లకు మరమ్మతు చేయించాలని, కార్ల అద్దె కూడా చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఫనా ట్రావెల్స్ నిర్వాహకులు జూబ్లీహిల్స్లోని ఎస్ఎల్వీ కార్యాలయానికి వెళ్లి గొడవ చేశారు. దీంతో కార్లకు మరమ్మతులు చేయించి అద్దె చెల్లిస్తామని ఎస్ఎల్వీ కంపెనీ వారు ఒప్పుకున్నారు. ఈ క్రమంలో ఆదివారం వేరే కంపెనీ కార్లను అద్దెకు తీసుకుని షూటింగ్ చేస్తున్నారు. ఫనా ట్రావెల్స్కు చెందిన అక్బర్, ఇమ్రాన్ఖాన్, ఖాదర్ షరీఫ్, జీసంత్ఖాన్లతో పాటు మరో ఇద్దరు రామోజీ ఫిలింసిటీలో లయన్ సినిమా షూటింగ్ జరుగుతున్న చోటకు వచ్చారు. అక్కడే ఉన్న ప్రొడక్షన్ మేనేజర్ దిలీప్సింగ్, క్యాషియర్ రాఘవచంద్రలను బలవంతంగా కారు (ఏపీ09 సీసీ 1851)లో ఎక్కించుకుని నగరం వైపు బయలుదేరారు. అదే విధంగా మరో ట్రావెల్స్కు చెందిన డ్రైవర్ మహేష్ను కొట్టి అతని కారు పట్టుకెళ్లారు. క్యాషియర్ రాఘవచంద్రను తీసుకెళ్తున్న కారు హయత్నగర్లోని తొర్రూరు క్రాస్రోడ్డు వద్ద ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ క్రమంలో రాఘవచంద్ర కారు దిగి పారిపోగా.. దిలీప్సింగ్ లోపలే కూర్చున్నాడు. అదే సమయంలో మరో ట్రావెల్స్కు చెందిన కారు డ్రైవర్ మహేష్ దుండగులను కారులో వెంబడిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు, మహేష్ కలిసి వనస్థలిపురం పనామా వద్ద దుండగుల కారును అడ్డుకున్నారు. నిందితులను హయత్నగర్ పోలీస్స్టేషన్కు తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కిడ్నాపర్ల చెరనుంచి చిన్నారులకు విముక్తి
సాక్షి, ముంబై: కిడ్నాపర్ల చెరనుంచి 83 మంది చిన్నారులకు విముక్తి లభించింది. కుర్లా గవర్నమెంట్ రైల్వే పోలీస్ (జీఆర్పీ), ప్రధమ్ అనే సామాజిక సేవా సంస్థ లోక్మాన్య తిలక్ టెర్మినస్లో సోమవారం మెరుపు దాడులు నిర్వహించారు. ఈ విషయాన్ని జీఆర్పీ సీనియర్ ఇన్స్పెక్టర్ విజయ్ దోపార్కర్ వెల్లడించారు. పిల్లల బలవంతపు తరలింపునకు సంబంధించిన సమాచారాన్ని ప్రథమ్ స్వచ్ఛంద సంస్థ సభ్యులు తమకు అందించారన్నారు. కిడ్నాపర్లు జన్సాధారణ్ ఎక్స్ప్రెస్ రైలులో దాదాపు 83 మంది చిన్న పిల్లలను తరలిస్తున్నారని తెలిపారు. ఉదయం ఐదు గంటలకు రావాల్సిన ఎక్స్ప్రెస్ రైలు గంట ఆల స్యంగా వచ్చింది. చిన్న తరహా పరిశ్రమల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తామంటూ కొంతమంది వ్యక్తులు 83మంది పిల్లలను ఇక్కడికి తీసుకొచ్చారన్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఎటువంటి అరెస్టులు జరగలేదన్నారు. -
కిడ్నాపర్ల బారి నుంచి తప్పించుకున్న శివ
-
తెగబడిన తమ్ముళ్లు
జెడ్పీ, ఎంపీపీ, మునిసిపల్ చైర్మన్గిరి కైవసానికి కుట్రలు - కిడ్నాప్లకూ వెనుకాడని వైనం - ప్యాపిలికి చెందిన ఇద్దరు ఎంపీటీసీల అపహరణ - మరి కొందరి కోసం ప్రలోభాలపర్వం సాక్షి ప్రతినిధి, కర్నూలు: అధికారం కోసం టీడీపీ నేతలు తెగబడుతున్నారు. బలం లేకపోయినా దౌర్జన్యంగానైనా జెడ్పీ చైర్మన్, ఎంపీపీ, మునిసిపల్ చైర్మన్ పదవుల కోసం కిడ్నాప్లకు తెరతీశారు. ప్యాపిలి మండలంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీటీసీ సభ్యుల కిడ్నాప్ ఉదంతమే ఇందుకు నిదర్శనం. ఈ మేరకు ఎంపీటీసీల బంధువులు, వైఎస్సార్సీపీ నాయకులు ఆదివారం జిల్లా ఎస్పీ రఘురామిరెడ్డికి ఫిర్యాదు చేశారు. జిల్లాలో అత్యధికంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మునిసిపల్ కౌన్సిలర్లు గెలుపొందిన విషయం తెలిసిందే. ప్రజాస్వామ్య బద్దంగా అయితే జెడ్పీ చైర్మన్, 22 ఎంపీపీ, ఐదు మునిసిపాలిటీ స్థానాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే దక్కాలి. అయితే టీడీపీ నేతలు ఈ పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్నారు. అందులో భాగంగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారిని రకరకాల ప్రలోభాలకు గురిచేస్తున్నారు. భారీ ఎత్తున డబ్బు ఆశ చూపిస్తున్నారు. మరి కొందరిని బెదిరిస్తున్నారు. ఇంకొందరిని కిడ్నాప్ చేస్తున్నారు. ప్యాపిలి మండలంలోని 21 ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్ సీపీ 12, టీడీపీ తొమ్మిదింట గెలుపొందాయి. అందులో వైఎస్సార్ సీపీకి చెందిన ఊటకొండ ఎంపీటీసీ అనారోగ్యంతో మృతి చెందారు. అయినా ఎంపీపీ కావటానికి వైఎస్సార్ సీపీకే బలముంది. ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేని టీడీపీ నేతలు శనివారం రాత్రి ప్యాపిలి-3 ఎంపీటీసీ పెద్దరాజును కారుబాడుగ విషయం మాట్లాడేందుకని ఇతరుల ద్వారా ఫోన్ చేయించి గుత్తిలో కిడ్నాప్కు పాల్పడ్డారు. అలాగే జక్కసానికుంట్ల ఎంపీటీసీ రమాదేవిని సైతం మభ్య పెట్టారు. ఆమెతో పాటు ఆమె భర్త శ్రీనివాసులు రెండు రోజులుగా కనిపించటం లేదని వైఎస్సార్సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. దీని వెనుక టీడీపీ నాయకుల హస్తం ఉందన్న ప్రచారం జరుగుతోంది. రూ. 5 లక్షల నగదుతో పాటు రేషన్ డీలర్ షిప్ను కూడా ఇప్పిస్తామని ఆశ చూపుతున్నట్లు తెలుస్తోంది. టీడీపీలోకి వెళ్లేందుకు వైఎస్సార్ సీపీ ఎంపీటీసీలు ససేమిరా అంటున్నా వారి బంధువుల ద్వారా తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిందన్న ధీమాతో తాము ఏం చేసినా చెల్లుతుందని టీడీపీ నాయకులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వ్యతిరేకంగా ఓటేస్తే అనర్హత వేటే: ఒక పార్టీ తరుపున గెలిచి మరో పార్టీకి ఓటు వేయడానికి వీలు లేదని, అలా చేసిన వారికి విప్ను జారీ చేస్తే వారిపై అనర్హత వేటు పడుతోందని అందరికీ తెలిసిందే. అన్నీ తెలిసీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తుతో గెలిచిన వారిపై ఎలాగైనా అనర్హత వేటు వేయించటమే టీడీపీ నేతలు లక్ష్యంగా పెట్టుకున్నారని ఆ పార్టీకి చెందిన ఓ నాయకుడు అభిప్రాయం వ్యక్తం చేయటం గమనార్హం. కిడ్నాప్లపై స్పందించని పోలీసులు: టీడీపీ నాయకులు కిడ్నాప్ చేశారని శనివారం పెద్దరాజు భార్య వెంకటేశ్వరమ్మ ప్యాపిలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే స్థానిక పోలీసులు స్పందించక పోవడంతో పెద్దరాజు భార్య వెంకటేశ్వరమ్మ ఆదివారం జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. టీడీపీ నాయకులు తన భర్తను కిడ్నాప్ చేశారని ఆమె ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అలాగే జక్కసానికుంట్ల ఎంపీటీసీ రమాదేవితో పాటు ఆమె భర్త శ్రీనివాసులు మూడు రోజులుగా కనిపించడం లేదని వైఎస్సార్ సీపీ నాయకులు బోరెడ్డి శ్రీరామిరెడ్డి, రాజా మూర్తి, మల్లికార్జునరెడ్డి తదితరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు రమాదేవి కుమారుడు హరికృష్ణ ఆదివారం జలదుర్గం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన తల్లిదండ్రులు రమాదేవి, శ్రీనివాసులు ఈ నెల 27 వ తేదీ నుంచి కనిపించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్యాపిలి మండల టీడీపీ నాయకులే తన తల్లిదండ్రులను కిడ్నాప్ చేసి ప్రలోభాలకు గురి చేస్తున్నారని హరికృష్ణ ఆరోపించారు. ఈ విషయంపై సంబంధిత అధికారులు స్పందించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పలువురు కోరుతున్నారు. కిడ్నాప్ కేసులో టీడీపీ నాయకులపై కేసు నమోదు ప్యాపిలి: వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ సభ్యుడు పెద్దరాజును కిడ్నాప్ చేసిన సంఘటనలో తెలుగుదేశం పార్టీకి చెందిన 15 మందిపై కేసు నమోదు చేసినట్లు సీఐ ప్రసాద్ ఆదివారం తెలిపారు. కారు బాడుగ మాట్లాడేందుకు పెద్దరాజును పిలిచి గుత్తి వద్ద టీడీపీ నాయకులు కిడ్నాప్ చేసినట్లు బాధితుడి భార్య నులక వెంకటేశ్వరమ్మ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం విదితమే. వైఎస్సార్సీపీ తరఫున గెలుపొందిన తన భర్తను టీడీపీ నాయకులు బలవంతంగా కిడ్నాప్ చేసినట్లు ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు టీడీపీ నాయకులు టి. శ్రీనివాసులు, శాంతు, అర్జున్, వెంకటేష్, హరి, పోదొడ్డి సుంకన్నలతో పాటు మరో 9 మందిపై కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు. -
విద్యార్థిని కిడ్నాప్
మెదక్ రూరల్, న్యూస్లైన్ : కిడ్నాపర్ల చెర నుంచి ఓ బాలిక తప్పించుకుని ఇంటికి చేరింది. ఈ సంఘటన మండల పరిధిలోని నాగాపూర్ గ్రామంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. బాధిత విద్యార్థి కథనం మేరకు.. ‘నా పేరు సంతోష. నాయన పేరు చింతకింది సాయిలు, అమ్మ పేరు లక్ష్మి. స్థానిక జిల్లా ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నా. బుధవారం బడికి పోలేదు. సాయంత్రం 6.30 గంటల సమయంలో స్నేహితురాలు వద్ద నోట్ బుక్ తెచ్చుకునేందుకు వెళ్లా. అంతులోనే ఇరువురు గుర్తు తెలియని వ్యక్తులు హెల్మెట్లు ధరించి ఓ అడ్రస్ చెప్పాలని కోరారు. నాకు తెలియదని చెప్పా. అంతలోనే వారిలో ఒకరు ఓ చిన్న డబ్బాను తీసి నా ముక్కు వద్ద పెట్టారు. దాని వాసన పీల్చడంతో స్పృహ కోల్పోయా. తరువాత స్పృహ రాగానే చూడగా రోడ్డు మీద పడి ఉన్నా. పక్కన చూడగా బైక్ అదుపు తప్పి కిందకు పడింది. ఒకరు బైక్ వద్ద ఉండగా మరొకరు ఫోన్లో మాట్లాడుతూ.. ఓ పిల్లను పట్టుకు వస్తున్నామంటూ చెబుతున్నాడు. నన్ను ఎవరో ఎత్తుకెళుతున్నారని గమనించి పరుగులు పెట్టా.. సమీపంలో ఓ వ్యక్తి పంట పొలాల నుంచి సుల్తాన్పూర్కు వస్తున్నాడు. తనను చూసి ఎందుకు పరుగెడుతున్నావంటూ ప్రశ్నించాడు. తనకు విషయాన్ని వివరించా. ఇతడిని చూసి కిడ్నాపర్లు పారిపోయాడు. అక్కడి నుంచి సుల్తాన్పూర్, నాగాపూర్కు వచ్చి విషయాన్ని తల్లిదండ్రులకు వివరించా. అప్పటికే నా జుట్టు, ముక్కు పుల్ల లేదు’. అని చెప్పింది. విద్యార్థి తల్లిదండ్రులు సాయిలు, లక్ష్మిలు మాట్లాడుతూ విషయాన్ని రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వివరించారు. -
కిడ్నాపర్ల చేతిలో లచ్చిరాజు హత్య
పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయిగూడెం మండలం రెడ్డి గణపవరంలో కిడ్నాప్నకు గురైన లచ్చిరాజు శవాన్ని బుధవారం కామవరం కాలువ వద్ద స్థానికులు గుర్తించారు. దాంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. లచ్చిరాజు శవాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహన్ని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇటీవలే లచ్చిరాజును కొంత మంది దుండగులు కిడ్నాప్ చేశారు. లచ్చిరాజును విడుదల చేయాలంటే అధిక మొత్తంలో నగదు చెల్లించాలని కిడ్నాపర్లు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.