Kolkatha
-
భాగ్యనగరంలో బెంగాలీ రుచులు.. లొట్టలేస్తున్న ఆహార ప్రియులు
విభిన్న సంస్కృతుల సమ్మేళనం, విభిన్న రుచుల సంగమం హైదరాబాద్.. వారసత్వం పేర్చిన ఈ ఆహార సంస్కృతిలో దేశవ్యాప్తంగా అన్ని రుచులనూ నగరవాసులు ఆదరిస్తున్నారు, ఆస్వాదిస్తున్నారు. ఈ కల్చరల్ డైవర్సిటీలో తన ప్రశస్తి సువాసనలు నలుదిశలా వెదజల్లుతున్నాయి. అందుకు చక్కని వేదికైంది బెంగాలీ రుచులు (Bengali Recipes) ప్రదర్శన. నగరంలో బెంగాలీలు ఉన్నప్పటికీ దాదాపు 40 శాతం వరకూ స్థానికులు కూడా ఆదరణ చూపిస్తున్నారని హైటెక్ సిటీలోని ‘ఓ కలకత్తా’ రెస్టారెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫిరోజ్ సాద్రి తెలిపారు. గత 25 సంవత్సరాలుగా బెంగాలీ రుచులను అందిస్తున్న ‘ఓ కలకత్తా’.. హైదరాబాద్ వేదికగా బెంగాలీ ఆహార సంస్కృతిని పెంచడంలో కీలకపాత్ర పోషిస్తోంది. ఈ నేపథ్యంలో నగరానికి బెంగాలీ ఫుడ్ కల్చర్ వచ్చిన తీరు, ఇక్కడ వినూత్నంగా అందుబాటులో ఉన్న వెరైటీ డిషెస్ గురించి ఫిరోజ్ సాద్రి వెల్లడించారు.– సాక్షి, సిటీబ్యూరో దేశాన్ని వందల ఏళ్లు పాలించిన బ్రిటిష్ వారు బెంగాల్ కేంద్రంగా ఎంచుకున్నారు.. ఎందరో ముస్లిం రాజవంశస్తులు పరిపాలించిన ప్రాంతం కూడా బెంగాల్. ఈ ఇద్దరికీ ప్రధాన కేంద్రం హైదరాబాద్ (Hyderabad). ఇలా సాంస్కృతిక పరిణామంలో నగరానికి బెంగాలీ ఆహారం వచ్చింది. బ్రిటిష్వారు స్పైసీ తక్కువ, తీపి ఎక్కువ ఇష్టపడతారు. ఇందులో భాగంగా వారు ప్రత్యేకంగా తయారుచేసుకున్న బెంగాలీ వెరైటీ అడాబ్ చిగిరీ. ఇది కొబ్బరి నీరు (Coconu Water), కొబ్బరి క్రీంతో తయారు చేసే అరుదైన వంటకం. ఈ వెరైటీ ‘ఓ కలకత్తా’లో లభిస్తుంది. దీనిని నగరవాసులు ఇష్టంగా ఆరగిస్తున్నారు. ఇదీ చదవండి: Ma Illu ట్విన్స్ విజేత, శ్వేత అనాథలు కాదు అంగరంగ వైభవంగా పెళ్లి! హిల్సా ఆఫ్ పాతూరి.. ఈ వెరైటీ మాన్సూన్ సీజన్లో మాత్రమే లభించే అరుదైన హిల్సా చేపతో తయారు చేస్తారు. దీనిలో మిలియన్ల సంఖ్యలో సన్నని ఎముకలుంటాయి. వీటన్నింటినీ సృజనాత్మకంగా తొలగించి, అరిటాకులో కొబ్బరిని కలిపి స్టీమ్ చేసి వడ్డించే వినూత్న వంటకం. ఇది కలకత్తా స్పెషల్, ఖరీదైనది కూడా. మాన్సూన్ సీజన్లో బ్రహ్మపుత్ర నదిలో బ్రీడింగ్ కోసం వలస వచ్చే అరుదైన చేప కావడమే దీని ప్రత్యేకత. మోచా.. అరటి పువ్వుతో ప్రత్యేకంగా తయారు చేసే కలకత్తా వంటకం. అరటి పువ్వులో పోషక విలువలుంటే చిన్న చిన్న పెటల్స్తో దీనిని తయారు చేస్తారు. ఆరోగ్యంతో పాటు రుచికరమైనదని చెఫ్ వెల్లడించారు. గోబిందో బోగ్.. బెంగాల్లో గోబిందో బోగ్ రైస్ను దేవుని ఆహారంగా భావిస్తారు (ఫుడ్ ఫర్ ది గాడ్). ఇది బెంగాల్లో తప్ప మరెక్కడా దొరకదు. సాధారణ బియ్యం, బాస్మతి బియ్యానికీ భిన్నంగా, రుచికరంగా ఉంటుంది. అత్యంత సాధారణమైన బెంగాలీ వంటకం ఈ రైస్ వెరైటీ. జర్నా ఘీ.. తెలుగువారి ఆహారంలో నెయ్యికి ఎంతో ప్రాధాన్యం ఉంది. అలాగే బెంగాలీలు కూడా ఆహార పదార్థాల్లో నెయ్యికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. ఇందులో భాగంగానే ఫ్లేవర్ కోసం బెంగాలీలు జర్నా నెయ్యిని వాడతారు. ఇది ఒక్క స్పూన్తో మొత్తం రుచినే మార్చేస్తుంది. ఇవే కాకుండా ఇండియన్ చికెన్ కట్లెట్, రాయల్ మటన్ చాన్ప్,కోల్కతా బిర్యానీ, రాధూనీ మసాలా, రాధా తిలక్ రైస్, చానా పాతూరి, జాక్ ఫ్రూట్ టిక్కీ (స్పైసీ.. సూపర్ ఫుడ్), పెఫెటా చీజ్, మలాయీ కర్రీ, పెటాయ్ పరోటా, ఆమ్ఆచావో ఇలా.. విభిన్న రకాల బెంగాలీ రుచులతో ఓ కలకత్తాలో నోరూరిస్తుందని చెఫ్లు పేర్కొన్నారు. 1992లో ముంబై వేదికగా నాలుగు టేబుళ్లతో ‘ఓన్లీ ఫిష్’ పేరుతో అంజన్ ఛటర్జీ ప్రారంభించిన హోటల్ క్రమంగా హైదరాబాద్తో పాటు ఢిల్లీ, బెంగళూరు, కోల్కతా వంటి 8 ప్రాంతాలతో పాటు యూఏఈ, లండన్లో వండి వడ్డిస్తున్నారు. ఆమ్ అదా అల్లంనగరవాసులకు సరికొత్త బెంగాలీ రుచులను అందించడానికి కలకత్తా పరిసర ప్రాంతాల నుంచి ఆమ్ ఆదా అల్లంను పరిచయం చేశారని ఫిరోజ్ సాద్రి తెలిపారు. దీనిని మామిడి అల్లం అని పిలుస్తారు. దీంతో చేసే ఆమ్ ఆదా మాచ్కు నగరంలో ఆదరణ పెరుగుతోంది. మిస్టీ దహీ(దోయి) బెంగాల్ నుంచి ఎవరైనా హైదరాబాద్ వస్తున్నారంటే విమానంలో కూడా ఓ బాక్స్లో పార్సిల్ తెచ్చుకునే ప్రియమైన వెరైటీ ఈ మిస్టీ దహీ(దోయి). ఇది కూడా బెంగాలీ సిగ్నేచర్ వెరైటీ. మటన్ టిక్యాముస్లింలు ఎక్కువగా ఉండే కలకత్తాలో వారి ప్రత్యేక వంటకం ఇది. షాఫ్రాన్, రోజ్ వాటర్ సమ్మిళితంగా సంప్రదాయ వంటగా దీనిని చేస్తారు. దీనిని నగరవాసులు సైతం ఇష్టంగా తింటున్నారు. చదవండి: Birthright Citizenship మరోసారి బ్రేక్: భారతీయులకు భారీ ఊరట -
కోల్ కతా డాక్టర్ కేసులో దోషికి మరణశిక్ష?
-
కోల్కతాలో తీవ్ర ఉద్రిక్తత.. ఆందోళనకారులపై విరుచుకుపడిన పోలీసులు
పశ్చిమబెంగాల్ రాజధాని కోలకత్తాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటన ప్రకంపనలు మరింత ఉధృతమవుతున్నాయి. ఈ ఘటనపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పలు ప్రజా, విద్యార్థి సంఘాలు ‘పశ్చిమబంగాఛాత్రో సమాజ్’మంగళవారం చేపట్టిన నిరసన ప్రదర్శనపై పోలీసులు విరుచుకు పడ్డారు. దీంతో కోల్కతా వీధుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.‘నభన్నా అభిజాన్’ పేరుతో హావ్డా నుంచి మొదలైన విద్యార్థుల ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. బాష్పవాయువు వాటర్ ఫిరంగులతో విరుచుకుపడ్డారు. దీంతో కొందరు ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. మరికొందరు బారికేడ్లను తోసుకొని దూసుకొచ్చారు. ఈ క్రమంలో ఆందోళనకారులను అదుపుచేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేసి గాల్లోకి కాల్పులు జరిపారు. మరోవైపుఈ ర్యాలీ నేపథ్యంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నివాసం దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు. ర్యాలీ నిర్వహించేందుకు ఎలాంటి అనుమతి లేదని రాష్ట్ర పోలీసులు చెప్పారు. హింసకు పాల్పడేందుకు కుట్ర పన్నారని ఆరోపిస్తూ నలుగురు విద్యార్థులను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. ఇది బీజేపీ ప్రేరేపిత కుట్ర అని హింసాకాండతో అల్లకల్లోలం సృష్టించేందుకు పన్నిన పన్నాగమని అధికార తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించిన సంగతి తెలిసిందే. కాగా ఈ ర్యాలీ సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 6 వేలమంది పోలీసులను మోహరించారు. నిరసనకారులపై నిఘా నిమిత్తం డ్రోన్లను ఉపయోగించారు. బారికేడ్లను తొలగించే అవకాశం లేకుండా, వెల్డింగ్ చేసి గ్రీజు పూయడం గమనార్హం. -
ఇండిగో, కోల్కతా ఎయిర్ పోర్ట్ నిర్వాకం: మహిళా పారా అథ్లెట్ ఆగ్రహం
బడ్జెట్ ఎయిర్లైన్స్ ఇండిగోకు సంబంధించి మరో అనుచిత ఘటన వివాదాన్ని రేపింది. అలాగే కోల్కతా విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది దివ్యాంగ మహిళ పట్ల అమానుషంగా వ్యవరించారు. దీనికి సంబంధించిన ఘటనను ఆమె ట్విటర్ షేర్ చేయడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. సెక్యూరిటీ క్లియరెన్స్ సమయంలో వికలాంగురాలైన (వీల్చైర్ యూజర్ కూడా) తనను మూడుసార్లు లేచి నిలబడాలంటూ కోరారని న్యాయ విద్యార్థిని ఆరూషి సింగ్ ట్వీట్ చేశారు. మొదట ఆమె నన్ను లేచి కియోస్క్లోకి రెండు అడుగులు వేయమని చెప్పింది. పుట్టుకతోనే తనకు వైక్యల్యంఉందని తన వల్ల కాదని చెప్పినా. వినిపించుకోకుండా రెండు నిమిషాలే అయిపోతుంది అంటూ వేధించారని ఆమె ఆరోపించారు. దీంతో తాను భయంతో వణికి పోయానంటూ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా తనకు 20 నిమిషాలు లేటైందని పేర్కొన్నారు. గతంలో ఇలాంటి జరిగినా, ఇండిగోకు ఇంకా బుద్ధి రాలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే కోల్కతా ఎయిర్పోర్టు అధికారులు వైకల్యం ఉన్న ప్రయాణీకుల పట్ల వ్యవహరించాల్సిన తీరును పునరాలోచించాల్సిన అవసరం ఉందని సింగ్ కోరారు. ఈ ఘటనపై సిఐఎస్ఎఫ్, కోల్కతా విమానాశ్రయం ఇప్పటి వరకు అధికారిక ప్రకటన చేయ లేదు. Yesterday evening during the security clearance at Kolkata airport, the officer asked me (a wheelchair user) to stand up, not once but thrice. First she asked me to get up and walk two steps into the kiosk. (1/1) — Arushi Singh (@singhharushi) February 1, 2024 ఇది ఇలా ఉంటే ఇండిగోకు సంబంధించి తాజా సంఘటన కలకలం రేపింది. వీల్ చెయిర్ విషయంలో ఇండిగో సిబ్బంది అమానుషంగా ప్రవర్తించారంటూ ఆసియా పారా గేమ్స్ పతక విజేత , పారా అథ్లెట్ సువర్ణ రాజ్ ఆరోపణలు గుప్పించారు. దివ్యాంగురాలైన తనకు విమానం డోర్ దగ్గర తన వీల్ చెయిర్ ఇవ్వకుండా ఇబ్బందికి గురి చేశారని మండి పడుతూ తన అనుభవాన్ని ఏఎన్ఐతో షేర్ చేశారు. #WATCH | Chennai, Tamil Nadu: Indian para-athlete Suvarna Raj alleges that she was mistreated by IndiGo Airlines crew members while taking a flight from New Delhi to Chennai yesterday. "...I told them 10 times that I want my personal wheelchair at the aircraft door, but no… pic.twitter.com/avResgXHJ0 — ANI (@ANI) February 3, 2024 విమానం డోర్ వద్ద తనకు వ్యక్తిగత వీల్చైర్ గురించి సిబ్బంది స్పందించలేదని ఆరోపించారు. న్యూఢిల్లీనుంచి చెన్నైకి వెళ్తుండగా ఇండిగో సిబ్బంది తన పట్ల దారుణంగా ప్రవర్తించారని సువర్ణ తెలిపారు. ఇండిగో నిర్ల్యక్షం మూలంగా తన వ్యక్తిగత వీల్చైర్ పాడైందని, దాని రిపేర్కు రూ. 3 లక్షలు ఖర్చయ్యాయని పేర్కొన్నారు. ఈ నష్టాన్ని ఇండిగోనే భరించాలన్నారు. వికలాంగులకు వీల్చైర్లు ప్రోటోకాల్ ఉల్లంఘనపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని సువర్ణ డిమాండ్ చేశారు. అంతేకాదు సింగ్ వ్యవహారంపై కూడా ఆమె స్పందించారు. వికలాంగుల సమస్యను అర్థం చేసుకొని వారి పట్ల సున్నితంగా వ్యవహరించాలని రాజ్ కోరారు. -
‘దిగజారుడు వ్యాఖ్యలంటూ.. టీఎంసీ కౌంటర్’
కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యలపై తృణమూళ్ కాంగ్రెస్ పార్టీ మండిపడింది. టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై చేసిన వ్యాఖ్యలకు టీఎంసీ గట్టి కౌంటర్ ఇచ్చింది. కేంద్రమంత్రి వ్యాఖ్యలపై స్పందించిన టీఎంసీ.. ‘తమ అధికారానికి సవాలు విసురుతున్న మహిళను బీజేపీ ఓర్చుకోలేకపోతుందని తెలిపడానికి ఇలాంటి వ్యాఖ్యలే నిదర్శం. లింగ పక్షవాతంతో కూడిన పాతకాలపు మనస్తత్వాన్ని బీజేపీ బహిరంగంగా వ్యక్త పరుస్తోంది’ అని ‘ఎక్స్’లో విరుచుకుపడింది. After PM @narendramodi's "didi o didi" catcall, Union Minister @girirajsinghbjp now joins the list of @BJP4India leaders who made degrading comments about Smt. @MamataOfficial. It's evident that the BJP leaders find it incredibly hard to fathom a woman in power challenging their… pic.twitter.com/ZCM8GehdIC — All India Trinamool Congress (@AITCofficial) December 6, 2023 కాగా, 29వ విడత కోల్కత్ ఇంటర్ నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొన్న సీఎం మమతా.. బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్, అనిల్ కపూర్, మహేష్ భట్ల కోరిక మేరకు వేదికపై కాలు కదిపారు. దీనిపై బీజేపీ కేంద్రమంత్రి గిరిరాజ్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ‘మమతా డాన్స్ చేస్తూ.. వేడుక చేసుకుంటోంది. ఫిల్మ్ ఫెస్టివల్లో డాన్స్ చేయాల్సిన అవసరం ఏముంది’ అని విమర్శించారు. దీంతో ఆయన మాటాలు.. దిగజారుడు తనానికి ప్రతీక అని టీఎంసీ మండిపడింది. ఇదికూడా చదవండి: వారి తర్వాత.. కాంగ్రెస్లో బీసీ సీఎం లేరు: నిశికాంత్ దుబే -
IPL సీజన్లో స్విగ్గిలో అత్యధికంగా చికెన్ బిర్యానీ ఆర్డర్..!
-
60 ఏళ్ల వయసులో నటుడు రెండో పెళ్లి.. వధువు బ్యాక్గ్రౌండ్ ఇదే
ప్రముఖ నటుడు ఆశిష్ విద్యార్థి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, బెంగాలీ సహా సుమారు 11 భాషల్లో 200కి పైగా సినిమాల్లో నటించాడు. టాలీవుడ్లో విలన్ పాత్రలతో గుర్తింపు పొందిన ఆయన తాజాగా 60ఏళ్ల వయసులో రెండోసారి పెళ్లిబంధంలోకి అడుగుపెట్టాడు. అస్సాంకు చెందిన 33 ఏళ్ల ఫ్యాషన్ ఎంటర్ప్రెన్యూర్ రూపాలి బారువాను ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. కోల్కతాలో వీరి వివాహం నిరాడంబరంగా జరిగింది. అతికొద్ది మంది బంధువులు, కుటుంబసభ్యుల సమక్షంలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో ఈ జంటకు పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సుమారు 20ఏళ్ల క్రితమే ఆశిష్ విద్యార్థి నటి శాకుంతల బారువా కుమార్తె రాజోషి బారువాను ప్రేమించి మనువాడారు. వీరికి ఆర్త్ విద్యార్థి అనే కుమారుడు ఉన్నాడు. నటిగా, సింగర్గా రాజోషి బారువా పాపులర్. అయితే భార్యభర్తల మధ్య కొంతకాలంగా విబేధాలు రావడంతో వీరు విడిపోయారు. ఆ తర్వాత ఫ్యాషన్ ఎంటర్ప్రెన్యూర్ రుపాలీతో ఆశీష్ విద్యార్థికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారి చివరకు పెళ్లిపీటలు ఎక్కేదాకా వచ్చింది. ఈమెకు కోల్కతాలో పలు స్టోర్స్ ఉన్నట్లు తెలుస్తుంది. కొంతకాలంగా వీరు రిలేషన్షిప్లో ఉన్నట్లు రూమర్స్ వచ్చినా వాటినే నిజం చేస్తూ పెళ్లి చేసుకున్నారు. రూపాలీని పెళ్లి చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని, తమ బంధం వెనుక పెద్ద కథే ఉందని, తర్వాత ఎప్పుడైనా చెబుతానంటూ స్వయంగా ఆశిష్ విద్యార్థి పేర్కొన్నారు. కాగా 60 ఏళ్ల వయసులో ఆశిష్విద్యార్థి రెండో పెళ్లి చేసుకోవడం, అది కూడా ప్రేమ పెళ్లి చేసుకోవడం విశేషం. దీనిపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొందరు కొత్తజంటకు కంగ్రాట్స్ అంటూ కామెంట్స్ చేస్తుంటే, మరికొందరు మాత్రం ఈ వయసులో మీకిది అవసరమా? అయినా ప్రేమ గుడ్డిది అంటారు. నిజమేనేమో అంటూ సెటైర్లు వేస్తున్నారు. -
కోల్కతాలో భోళాశంకర్.. ఆ సీన్ రిపీట్ కానుందా?
మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటిస్తోన్న చిత్రం 'భోళాశంకర్'. ఈ చిత్రానికి మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్నారు. వాల్తేరు వీరయ్య సూపర్ హిట్ తర్వాత మెగాస్టార్ నటిస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే హైదరాబాద్ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ కోసం మెగాస్టార్ కోల్కతాకు బయలుదేరారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకుంది చిత్రబృందం. కోల్కతాకు ఓ ప్రత్యేకత కోల్కతాలో రేపటి నుంచే భోళాశంకర్ మూవీ షెడ్యూల్ ప్రారంభం కానుంది. మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ప్రత్యేకమైన సినిమాగా నిలిచిన ‘చూడాలని ఉంది’ కోల్కతా బ్యాక్డ్రాప్లోనే వచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆ మూవీ సూపర్ హిట్గా నిలిచింది. ఆ సినిమాలో మెగాస్టార్ టాక్సీ డ్రైవర్గా అలకించారు. మళ్లీ ఇప్పుడు ‘భోళా శంకర్’ టీమ్ కోల్కతాకు బయలుదేరడంతో అదే సీన్ రిపీట్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ అంటోంది. (ఇది చదవండి: మెగా ఫ్యాన్స్కు ఉగాది సర్ప్రైజ్.. భోళాశంకర్ రిలీజ్ అప్పుడే!) కాగా.. ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా తమన్నా నటిస్తున్నారు. చిరంజీవి చెల్లెలి పాత్రలో కీర్తీ సురేష్ కనిపించనుండగా.. నటుడు సుశాంత్ లవర్ బాయ్ పాత్ర చేస్తున్నారు. క్రియేటివ్ కమర్షియల్స్తో కలిసి అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే ఇంటర్వెల్ ఫైట్ చిత్రీకరణను హైదరాబాద్లో చిత్రీకరించారు. భోళా శంకర్ ఫుల్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీగా తెరకెక్కిస్తున్నారు. చిరంజీవిని స్టైలిష్ మాస్ అవతార్లో చూపిస్తున్నారు మెహర్ రమేశ్. ఎమోషన్, ఎంటర్టైన్మెంట్, యాక్షన్తో పాటు ఐఫీస్ట్ అనిపించే పాటలు ఉంటాయి. ఈ చిత్రాన్ని ఆగస్టు 11న సినిమాని రిలీజ్ చేస్తామని చిత్రయూనిట్ తెలిపింది. (ఇది చదవండి: అప్పుడు భూమిక.. ఇప్పుడు శ్రీముఖి.. భోళాశంకర్లో ఆ సీన్ రిపీట్..!) కాగా.. తమిళ చిత్రం ‘వేదాళం’కు రీమేక్గా టాలీవుడ్లో తెరకెక్కిస్తున్నారు. తమిళంలో అజిత్ కుమార్ హీరోగా నటించిన ఈ సినిమా 2015లో విడుదలై సూపర్ హిట్గా నిలిచింది. దాదాపు ఎనిమిదేళ్ల తరవాత తెలుగులో రీమేక్ చేస్తున్నారు. The new schedule of Mega 🌟 @KChiruTweets's #BholaaShankar 🔱 will begin in Kolkata from tomorrow💥 A few major sequences will be shot in this schedule at the premises of Yamahanagari❤️ In Theatres on AUG 11th 🤟🏻@MeherRamesh @AnilSunkara1 @tamannaahspeaks @KeerthyOfficial pic.twitter.com/rUfTaHzn0G — BholāShankar (@BholaaShankar) May 3, 2023 Megastar 🤩😍🔥🔥🔥🔥🔥🔥@BholaaShankar 🔱 “Boss” look as Taxi 🚖 Driver in #Kolkata Tremendous response from everyone 🎉Big thanks to print & web media for their support @AKentsOfficial @AnilSunkara1 @dudlyraj #Mahatiswarasagar @prakash3933 @cinesoul1 @Yugandhart_ #Ramlaxman pic.twitter.com/AM7FDVWA44 — Meher Ramesh 🇮🇳 (@MeherRamesh) May 2, 2023 -
నటి ఆండ్రిలా శర్మ మరణం.. ప్రియుడు తీవ్ర భావోద్వేగం..!
24 ఏళ్ల బెంగాలీ నటి ఆండ్రిలా శర్మ గుండెపోటుకు గురై ఆదివారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆమె రెండుసార్లు ప్రాణాంతక క్యాన్సర్ బారి నుంచి ప్రాణాలతో బయటపడినా చివరికి మరణాన్ని జయించలేకపోయింది. చిన్న వయసులోనే ఆమె మరణించడంతో వారి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఎల్లప్పుడు ఆమె తోడుగా నిలిచిన బాయ్ ఫ్రెండ్ సబ్యసాచి చౌదరి.. ఆండ్రిలా శర్మ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమె అంత్యక్రియలు జరుగుతున్నప్పుడు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు సబ్యసాచి చౌదరి. ఆండ్రిలా పార్థివదేహం వద్ద కాళ్లు పట్టుకుని మరీ ఏడ్చారు. ఆమె పాదాలను ముద్దాడి ప్రియురాలి చివరి వీడ్కోలు పలికారు. అంతే కాకుండా సబ్యాసాచి తన సోషల్ మీడియా ఖాతాను కూడా డిలీట్ చేశాడు. ఆండ్రిలా ఆస్పత్రిలో ఉండగా ఆమె ప్రార్థించమని సోషల్ మీడియాలో అభిమానులకు కోరిన సబ్యసాచికి అదే తన చివరిపోస్ట్గా నిలిచింది. -
కోట్లాదిమందికి ప్రాణదాత, ఓఆర్ఎస్ సృష్టికర్త ఇకలేరు
కోలకతా: ప్రముఖ వైద్యుడు, ఓఆర్ఎస్ (ఓరల్ రీహైడ్రేషన్ థెరపీకి) ఆద్యుడు డాక్టర్ దిలీప్ మహలనాబిస్ (87) ఇకలేరు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, ఇతర వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. (క్రికెట్ వైరల్ వీడియో: ఆనంద్ మహీంద్ర ట్వీట్, నెటిజన్ల నోస్టాల్జియా) ఆయన మృతి పట్ల పలువురు సంతాపం ప్రకటించారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ అపూర్బా ఘోష్ మాట్లాడుతూ, తక్కువ ఖర్చుతో కలరా , ఎంటెరిక్ వ్యాధుల చికిత్సలో మహలనాబిస్ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. అలాగే అతని రచనలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని ఘోష్ పేర్కొన్నారు. శిశువైద్యునిగా పేరు తెచ్చుకున్నప్పటికీ, 1971లో బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో, పశ్చిమ బెంగాల్లోని బంగావ్లోని శరణార్థి శిబిరంలో పనిచేస్తున్నప్పుడు కలరా వ్యాప్తి చెందినపుడు డాక్టర్ దిలీస్ ఓఆర్ఎస్ ద్రావణంతో వేలాది మంది ప్రాణాలను రక్షించి వార్తల్లో నిలిచారు. కాగా నీటి ద్వారా వచ్చే వ్యాధులు నివారించడానికి ఓఆర్ఎస్ ద్రావణానికి మించిన ప్రత్యామ్నాయం లేదు. ఈ థెరపీ శరీరంలోని ఉప్పు, చక్కెర, ఇతర ద్రవాల మొత్తాన్ని సమతుల్యం చేస్తుంది. ఒక విధంగా ఇది మ్యాజిక్ లాగా పనిచేస్తూ ప్రపంచంలోని కోట్లాది మంది ప్రాణాలను కాపాడింది. గతంలో కోలకతాలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్ అభివృద్ధికి మహలనాబిస్ దంపతులు కోటి విరాళాన్ని అందించడం గమనార్హం. (5జీ సేవలు: ప్రధాన ప్రత్యర్థులతో జియో కీలక డీల్స్) -
గేమింగ్ యాప్ స్కాం: గుట్టలకొద్దీ నగదు,కళ్లు చెదిరే వీడియో
కోలకతా: కోలకత్తా గేమింగ్ యాప్ స్కాంలో ఈడీ దాడుల్లో గుట్టల కొద్దీ నగదు స్వాధీనం చేసుకోవడం కలకలం రేపింది. గేమింగ్ యాప్ స్కాంలో ఈడీ ఏకంగా రూ. 17 కోట్ల నగదును స్వాధీనం చేసుకుంది. ఈ నగ్గెట్స్` అనే గేమింగ్ యాపప్కు సంబంధించిన కుంభకోణంలో కోలకతాకు చెందిన గేమ్ ఆపరేటర్స్ కార్యాలయాల్లో శనివారం ఈడీ తనిఖీలు చేపట్టింది. మనీలాండరింగ్ ఆరోపణలతోసాగిన ఈసెర్చ్ ఆపరేషన్ కోల్కతాకు చెందిన వ్యాపారవేత్త ఇంటినుంచి సుమారు రూ. 17 కోట్లను రికవరీ చేసింది. గార్డెన్ రీచ్ ప్రాంతంలోని ఒకదానితో సహా ఆరు చోట్ల దాడులు చేపట్టింది. రూ. 2వేల నోట్లు, రూ.500 నోట్ల కుప్పలను లెక్కించేందుకు ఈడీ మనీకౌంటింగ్ మెషీన్ల సహాయం తీసుకోవాల్సి వచ్చింది. అంతేకాదు గంటల తరబడి కొనసాగుతున్న లెక్కింపులో నగదును తరలించేందుకు పెద్ద పెద్ద ట్రంక్ పెట్టెలను తీసుకొస్తుండటం గమనార్హం. ప్రజలను నమ్మించి మోసగించి అక్రమాలను పాల్పడిన "ఈ-నగ్గెట్స్" అనే గేమింగ్ యాప్ను నిందితుడు నిసార్ ఖాన్ ప్రమోట్ చేశారని దర్యాప్తు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే దీనికి, ఆపరేటర్లకు ఇతర "చైనీస్ నియంత్రిత" యాప్లతో లింక్లు ఉన్నాయో లేదో దర్యాప్తు చేస్తోంది. కాగా 2021, ఫిబ్రవరిలో కంపెనీ, దాని ప్రమోటర్లపై కోల్కతా పోలీసులు కేసు నమోదు చేశారు. ఫెడరల్ బ్యాంక్ ఫిర్యాదు మేరకు ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. ఈ యాప్ డౌన్ లోడింగ్, గేమింగ్ ప్రాసెస్లో రివార్డు పేరుతో డబ్బు ఎరగా వేశారు. మొదట్లో విత్ డ్రా చేసుకునే అవకాశం బాగానే కల్పించారు. ఎంత ఎక్కువ డబ్బు డిపాజిట్ చేస్తే అంత మొత్తంలో రివార్డ్స్ ఇచ్చి ప్రజలకు ఆశలు కల్పించారు. దీంతో యూజర్లు పెద్ద మొత్తంలో డబ్బును డిపాజిట్ చేయడం ప్రారంభించడంతో అక్రమాలకు తెరలేచింది. #WATCH | Kolkata, WB: Stacks of cash amounting to several crores have been recovered from the residence of businessman Nisar Khan during ED's raid ongoing for several hours pic.twitter.com/o2qXzNSmDR — ANI (@ANI) September 10, 2022 #WATCH | Kolkata, WB: Trunks being carried into the residence of businessman Nisar Khan to collect crores in cash that have been recovered during ED's raid ongoing for several hours pic.twitter.com/jJjV3ZJRN6 — ANI (@ANI) September 10, 2022 -
సింగర్ కేకే మరణంపై అనుమానాలు!
ప్రముఖ బాలీవుడ్ సింగర్ కృష్ణకుమార్ కున్నాత్ అలియాస్ కేకే(53) మృతిపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. కేకే హఠాన్మరణంపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆయన పాల్గొన్న స్టేజ్ షో దగ్గరి సీసీ పుటేజ్ని స్వాదీనం చేసుకొని పరిశీలిస్తున్నారు. సింగర్ కేకేది అసహజ మరణం అని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం. సరైన వసతులు లేకపోవడం వల్లే కేకే మరణించారని పశ్చిమ బెంగాల్ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు కేకే ముఖంపై గాయాలు ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై పోలీసులు ఇంకా స్పందించలేదు. కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. (చదవండి: సింగర్ కేకే హఠాన్మరణం: విరహ గీతాలతో కోట్ల హృదయాలను కొల్లగొట్టి..) కాగా, కోల్కతాలో ఒక ప్రదర్శన కోసం వెళ్లిన కేకే మంగళవారం అర్థరాత్రి అకస్మాత్తుగా చనిపోయారు. ప్రదర్శన అనంతరం హోటల్ గదిలోకి వెళ్లిన కేకే.. గుండెపోటుకు గురవడంతో కలకత్తా మెడికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కేకేగా ప్రసిద్దుడైన ఆయన ఎమోషనల్ సాంగ్స్కు పెట్టింది పేరుగా మారాడు. హిందీతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ తదితర భాషల్లో ఏన్నో పాటలు పాడారు. తెలుగులో 20కి పైగా సూపర్ హిట్ సాంగ్స్తో సినీ ప్రియుల మనసు గెలుచుకున్నాడు. ఫీల్ మై లవ్(ఆర్య), చెలియ చెలియా(ఘర్షణ), దాయి దాయి దామ్మా(ఇంద్ర) ఏ మేరా జహా(ఖుషి)వంటి పలు పాటలను ఆయన ఆలపించాడు. కేకే మృతికి ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు.అక్షయ్ కుమార్తో సహా పలువురు సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. -
సింగర్ కేకే హఠాన్మరణంపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు
-
సంబరాల దసరా
దుష్టసంహారం ద్వారా ధర్మాన్ని నిలపడమే శరన్నవరాత్రి ఉత్సవాల పరమార్థం. చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నమే విజయ దశమి. తమలోని దుర్గుణాలను తొలగించి సన్మార్గాన్ని ప్రసాదించ మని అమ్మవారిని కొలుచుకునే వేడుకే దసరా. ఈ శరన్నవరాత్రుల్లో తొమ్మిదిరోజులపాటు జగన్మాతను భక్తి శ్రద్దలతో పూజించి, 10వ రోజు పండగ జరుపుకోవడం ఆనవాయితీ. భారతదేశం సాంస్కృతిక వైవిధ్యం కారణంగా, దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో, వివిధ రూపాల్లో దసరా ఉత్సవాలు జరుగుతాయి. ఇకనైనా కరోనా మహమ్మారినుంచి విముక్తి ప్రసాదించమని శరణు వేడుకుంటున్న ప్రత్యేక సందర్భంలో ఈ ఏడాది పండుగను నిర్వహించుకుంటున్నాం. ఆయురారోగ్యాలు, సకల శుభాలు వరించేలా ఆ దుర్గామాత దీవించాలని కోరుకుంటూ సాక్షి.కామ్ పాఠకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. -
కోల్కతా బ్యాక్డ్రాప్లో వస్తున్న సినిమాలివే..
విక్టోరియా మెమోరియల్, హౌరా బ్రిడ్జ్, మదర్ హౌస్, బిర్లా ప్లానిటోరియం, కాళీ మాత టెంపుల్, పార్క్ స్ట్రీట్, ఎకో టూరిజం పార్క్... ఏంటీ కోల్కతాలోని ఫేమస్ ప్లేసెస్ను వరుసగా చెబుతున్నాం అనుకుంటున్నారా! ఇప్పటికే పలు చిత్రాల్లో వీటన్నింటినీ చూసి ఉంటారు. మరోసారి చూపించడానికి రెడీ అవుతున్నాయి. ఆ సినిమాలేంటో చూసేయండి.. -
కోల్కతా వెళ్లనున్న రజనీకాంత్
హీరో రజనీకాంత్ కోల్కతాకు హాయ్ చెప్పనున్నారు. రజనీ హీరోగా శివ దర్శకత్వంలో ‘అన్నాత్తే’ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాలోని కీలక సన్నివేశాలను లక్నోలో తీస్తున్నారట దర్శకుడు శివ. ఇక్కడ షూటింగ్ పూర్తి కాగానే టీమ్ కోల్కతాకు పయనం కానుంది. ఈ నెల 21 నుంచి కోల్కతాలో ‘అన్నాత్తే’ షూటింగ్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుందని సమాచారం. ఈ షెడ్యూల్లో రజనీకాంత్ పాల్గొంటారు. కోల్కతా షెడ్యూల్తో ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తవుతుంది. ఈ చిత్రంలో మీనా, ఖుష్బూ, నయనతార, కీర్తీ సురేష్, అభిమన్యు సిన్హా ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ‘అన్నాత్తే’ దీపావళి సందర్భంగా నవంబరు 4న విడుదల కానుంది. చదవండి : హీరోగా శశికుమార్..త్వరలోనే షూటింగ్ మొదలు 8ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న డైరెక్టర్ -
బీజేపీ నేతలకు కనీస మర్యాద, సభ్యత లేదు: మమతా
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీపై విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గవర్నర్ జగదీప్ ధన్కర్ ప్రారంభ ఉపన్యాస సమయంలో బీజేపీ ఎమ్మెల్యేల తీరుపై సీఎం మమతా తీవ్రంగా మండిపడ్డారు. గవర్నర్ ఉపన్యాసం అనంతరం ఆయనకు సీఎం మమతా కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్రమంలో సీఎం మమతా బీజేపీ ఎమ్మెల్యేలపై మండిపడ్డారు. తాను బీజేపీకి చెందిన సుష్మా స్వరాజ్ నుంచి రాజనాథ్సింగ్ వంటి నేతలను చూశానని తెలిపారు. కానీ ప్రస్తుతం బెంగాల్లో ఉన్న బీజేపీ నాయకులు చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. ఇక్కడున్న బీజేపీ నేతలకు కనీసం సభా గౌరవ మర్యాదలు, సభ్యత లేదని దుయ్యబట్టారు. ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత చెలరేగిన హింసాత్మక ఘటన కేసులకు సంబంధించి అసెంబ్లీలో నిరసన తెలిపారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రారంభ ఉపన్యాసాన్ని అడ్డుకోవడానికి బీజేపీ ఎమ్మెల్యేలు యత్నించారు. -
కరోనా విలయం: కాంగ్రెస్ అభ్యర్థి కన్నుమూత
సాక్షి, కోలకతా: కరోనా వైరస్ మహమ్మారి రెండవ దశలో పంజా విసురుతోంది. చిన్నా పెద్దా, తేకుండా పలువుర్ని కబళిస్తోంది. ఇప్పటికే పలువురు మాజీఎమ్మెల్యేలు, మాజీ కేంద్ర మంత్రులు,మంత్రులు కరోనా బారిన పడి అసువులు బాశారు. తాజాగా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో సంషర్గంజ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ రజాఉల్ హక్ కన్నుమూశారు. ఆయనకు ఇటీవల కరోనా నిర్ణారణ అయింది. కోల్కతాలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. (కరోనా కలకలం: రికార్డు స్థాయిలో కేసులు) కాగా ఎనిమిదో దశల పోలింగ్లో భాగంగా 45 సీట్లుకు గాను ఐదో దశ ఏప్రిల్ 17న జరగనుంది. దీనికి సంబంధించిన ప్రచారం బుధవారం ముగిసింది. మరోవైపు బెంగాల్లో నూతన సంవత్సర వేడుకను నేడు (ఏప్రిల్ 15) జరుపుకుంటున్నారు. -
ట్రెండ్ సెట్ చేసిన పెళ్లి కూతురు.. వీడియో వైరల్
కోల్కతా : పెళ్లి తర్వాత అమ్మాయిని అత్తారింటికి పంపే అప్పగింతల కార్యక్రమం ఎంతో ఉద్వేగభరితమైంది. పుట్టింటి నుంచి అత్తారింటికి వెళ్లే ఘట్టం ప్రతీ అమ్మాయి జీవితంలో ఎంతో మరుపురానిది. అయితే ఈ సాంప్రదాయాన్ని మరింత స్పెషల్గా మార్చాలనుకుంది ఓ వధువు. కోల్కతాకు చెందిన స్నేహ సింఘీ(28) అనే యంగ్ బిజినెస్ ఉమెన్...ఇటీవలె సౌగత్ ఉపాధ్యాయ అనే వ్యక్తిని పెళ్లాడింది. అయితే అందరి అమ్మాయిల్లానే అప్పగింతల కార్యక్రమంలో తల్లిదండ్రులను విడిచి వెళ్లేటప్పుడు ఎంతో భావోధ్వేగానికి లోనైంది. వారికి బై..బై చెబుతూ అక్కడి నుంచి కదిలింది. వరుడిని పక్క సీట్లో కూర్చోబెట్టుకొని తానే స్వయంగా కారు నడుపుతూ అత్తారింటికి బయల్దేరింది. దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయగా, కొద్ది గంటల్లోనే ఇది వైరల్గా మారింది. పెళ్లి దుస్తుల్లోనే స్టీరింగ్ పట్టుకున్న వధువు స్నేహను పలువురు నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. పెళ్లికూతురు ట్రెండ్ సెట్ చేసిందంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ కొత్త సాంప్రదాయానికి తెరతీయడంపై వధువు స్నేహ సింఘీ మాట్లాడుతూ.. పెళ్లి తర్వాత నేనే స్వయంగా కారును డ్రైవ్ చేసుకుంటూ అత్తారింటికి వెళితే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది. పెళ్లికి నెల కిందట సౌగత్ను అడగితే,అతను ఈ ఐడియా చాలా బావుందని చెప్పాడు. అంతేకాకుండా సౌగత్ తల్లి కూడా ఇందుకు వెంటనే అంగీకరించింది. దీంతో నా కల నెలవేరింది. అని స్నేహ సంతోషం వ్యక్తం చేసింది. View this post on Instagram A post shared by Sneha Singhi Upadhaya (@snehasinghi1) చదవండి : తొలి రాత్రే షాకిచ్చిన వధువు: రాడ్తో భర్తను కొట్టి.. ఐఫోన్ ఆర్డర్ చేస్తే.. భారీ పార్శిల్ -
బెంగాల్, అసోం తొలిదశ పోలింగ్
-
బీజేపీ కార్యకర్తలపై దాడి
-
బెంగాల్, అసోంలో ముగిసిన తొలి దశ
► ప్రశాంతంగా ముగిసిన తొలి దశ పోలింగ్ పశ్చిమ బెంగాల్ 30, అసోంలో 47 స్థానాలకు ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. తొలిదశ ఎన్నికల్లో భారీగా పోలింగ్ నమోదైంది. సాయంత్రం 5 గంటల వరకు బెంగాల్లో 77.99 శాతం పోలింగ్ నమోదు అసోంలో సాయంత్రం 5 గంటల వరకు 71.62 శాతం పోలింగ్ ► పశ్చిమ బెంగాల్, అసోంలో తొలిదశ ఎన్నికల పోలింగ్ బెంగాల్లో 30, అసోంలో 47 అసెంబ్లీ స్థానాలకు తొలిదశలో ఎన్నికలు జరుగుతున్నాయి. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో బెంగాల్లో సాయంత్రం 4 గంటల వరకు 70.17 శాతం పోలింగ్ నమోదైంది. అసోంలో సాయంత్రం 4 గంటల వరకు 62.36 శాతం పోలింగ్ నమోదు. ► సువేందు సోదరుడి కారుపై దాడి, ఒక కార్యకర్త హత్య పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలోని కేశియారి ప్రాంతంలో బీజేపీ కార్యకర్త మంగల్ సోరెన్ (35) దారుణ హత్యకు గురయ్యాడు. పుర్బా మేదినిపూర్ జిల్లా సత్సతామల్ నియోజకవర్గంలో ఓ పోలింగ్ కేంద్రం వద్ద కాల్పులు కలకలం రేపాయి. గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపగా ఇద్దరు భద్రతా సిబ్బంది తీవ్ర గాయాలపాలయ్యారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. కొంటై నియోజకవర్గంలోని బీజేపీ సీనియర్ నాయకుడు సువేందు అధికారి సోదరుడు సౌమెందు అధికారి కారుపై దాడి జరిగింది. అతడి కారును అడ్డగించి ధ్వంసం చేశారు. కారు డ్రైవర్పై దాడి చేశారు. అయితే ఈ దాడి నుంచి సౌమెందు అధికారి సురక్షితంగా బయటపడ్డాడు. ► బెంగాల్, అసోంలో రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పెద్ద సంఖ్యలో క్యూలైన్లలో నిల్చున్నారు. ఎన్నికల అధికారులు పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. బెంగాల్లో ఉదయం 11 గంటల వరకు 24.61 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. అసోంలో ఉదయం11 గంటల వరకు 24.48 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. అసోంలోని డిబ్రుగఢ్లో సీఎం సర్వానంద సోనోవాల్ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో వందకు పైగా సీట్లను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ►బెంగాల్, అసోంలో తొలిదశ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. బెంగాల్లో ఉదయం 9 గంటల వరకు 7.72 శాతం పోలింగ్ నమోదు నమోదైనట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. అసోంలో ఉదయం 9 గంటల వరకు 8.84 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఓటుర్లు అధిక సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. ►బెంగాల్లో 5 జిల్లాల్లో 30 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు భారీ సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి క్యూలైన్లలో వేచి ఉన్నారు. తొలిదశలో బరిలో 191 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. తొలిదశలో 10,288 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు.73.80 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. ►అసోంలో 12 జిల్లాల్లో 47 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు భారీ సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి క్యూలైన్లలో వేచి ఉన్నారు. తొలిదశలో బరిలో 264 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. తొలి దశలో 11,537 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు.50 శాతం పోలింగ్ కేంద్రాల్లో అధికారులు వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. 81.09 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. తొలిదశలో మజూలి నుంచి బరిలో సీఎం సర్వానంద సోనోవాల్, జోర్హత్ నుంచి స్పీకర్ హితేంద్రనాథ్ బరిలో ఉన్నారు. ►పశ్చిమబెంగాల్లో తొలిదశ ఎన్నికల వేళ హింస చెలరేగింది. ఖేజురిలో బీజేపీ కార్యకర్తలపై దాడి జరిగింది. పటాష్పూర్లో భద్రతా సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. కోల్కతాలో 22 నాటు బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ►పురులియాలో బస్సులో మంటలు చెలరేగాయి. ఎన్నికల సిబ్బందికి ఆహారం సరఫరా చేస్తున్న బస్సులో మంటలు ఎగిసిపడ్డాయి. బస్సులో మంటలు చెలరేగిన ఘటనపై విచారణ చేపట్టామని పోలీసులు తెలిపారు. కోల్కతా/గౌహటి: దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న పశ్చిమబెంగాల్తో పాటు అసోం అసెంబ్లీ తొలి దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. బెంగాల్లో 30, అసోంలో 47 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఓటర్లు పెద్ద ఎత్తున తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి తరలివస్తున్నారు. కోవిడ్–19 కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో ఎన్నికలు జరుగుతూ ఉండటంతో కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంది. ప్రతీ పోలింగ్ కేంద్రం దగ్గర థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. శానిటైజర్లు ఉంచారు. పరీక్షలో ఎవరికైనా జ్వరం ఉందని తేలితే వారిని సాయంత్రం ఓటు వేయడానికి అనుమతిస్తారు. ఓటర్లందరూ తప్పనిసరిగా మాస్కు ధరించి తీరాలన్న నిబంధనలున్నాయి. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు యంత్రాంగం పటిష్ట భద్రత ఏర్పాటు చేసింది. అస్పాం తొలిదశ ఎన్నికల పోలింగ్లో సీఎం సర్వానంద సోనోవాల్, స్పీకర్ హితేంద్రనాథ్ అదృష్టం పరీక్షించుకోనున్నారు. బరిలో ఉన్న ప్రముఖులు పశ్చిమబెంగాల్లోని 30 స్థానాల్లో కొందరి అభ్యర్థిత్వం ఆసక్తి రేపుతోంది. పురూలియా సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సుదీప్ ముఖర్జీ ఇటీవల బీజేపీ గూటికి చేరుకొని ఎన్నికల బరిలో నిలిచారు. ఆయనపై టీఎంసీ మంత్రి శాంతి రామ్ మెహతా పోటీ పడుతున్నారు. ఖరగ్పూర్ నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొని ఉంది. దినేన్ రాయ్ (టీఎంసీ), తపన్ భూహియా (బీజేపీ), ఎస్.కె.సద్దామ్ అలీ (సీపీఐఎం) మధ్య గట్టి పోటీ ఉంది. అస్సాంలో తొలి దశలోనే ముఖ్యమంత్రి, స్పీకర్, మంత్రులు, ఎందరో విపక్ష నేతలు తమ అదృష్టాన్ని పరీక్షించు కుంటున్నారు. ముఖ్యమంత్రి సర్వానంద సోనోవాల్ మజూలి నుంచి తిరిగి బరిలో నిలిచారు. కాంగ్రెస్ నేత రజీబ్ లోచన్ పెగు ఈ నియోజకవర్గం నుంచి 2001 నుంచి వరసగా మూడు సార్లు ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో సోనోవాల్ చేతిలో ఓటమిపాలయ్యారు. ఈ సారి మళ్లీ వీళ్లిద్దరే తలపడుతున్నారు. జోర్హత్ నుంచి అసెంబ్లీ స్పీకర్ హితేంద్రనాథ్ పోటీ పడుతున్నారు. -
‘బెంగాల్లో ప్రజాస్వామ్య వ్యవస్థ నాశనమైంది’
-
‘బెంగాల్లో ప్రజాస్వామ్య వ్యవస్థ నాశనమైంది’
కోల్కతా: పశ్చిమ బెంగాల్ అభివృద్ధిని తృణముల్ కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఆదివారం పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ కోల్కతాలో నిర్వహించిన బహిరంగ సభలో మోదీ పాల్గొని ప్రసంగించారు. వచ్చే 25 ఏళ్లు బెంగాల్ అభివృద్ధికి చాలా ముఖ్యమైనవని, రాబోయే ఐదేళ్లలో ఇక్కడ జరిగే అభివృద్ధి, బెంగాల్ అభివృద్ధికి పునాది వేస్తుందన్నారు. 2047లో భారత్ 100 ఏళ్ల స్వాతంత్ర్యాన్ని జరుపునేటప్పుడు బెంగాల్ మరోసారి దేశానికి నాయకత్వం వహిస్తుందని పేర్కొన్నారు. రైతులు, వ్యాపారులు, మహిళల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని, వారి కలల సాకారానికి ప్రతి క్షణం శ్రమిస్తున్నామని తెలిపారు.పెట్టుబడులు, పరిశ్రమలు పెంచడం ద్వారా బెంగాల్ను పునర్నిర్మాణం చేస్తామని అన్నారు. పశ్చిమబెంగాల్లో ప్రజాస్వామ్య వ్యవస్థ నాశనమైందని, బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తామన్నారు. ప్రభుత్వ వ్యవస్థలపై మళ్లీ ప్రజల్లో నమ్మకాన్ని తిరిగి తెస్తామని పేర్కొన్నారు. బెంగాల్ ప్రజల సోనార్ బంగ్లా కలను బీజేపీ సాకారం చేస్తుందన్నారు. బెంగాల్ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని తెలిపారు. బెంగాల్ సంస్కృతి, కళల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని ప్రధాని మోదీ తెలిపారు. ఈ బహిరంగ సభకు వేదికైన బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ ఎంతో మంది గొప్ప నాయకులకు సాక్ష్యంగా నిలిచిందని తెలిపారు. మార్పు కోసం బెంగాల్ ప్రజలు తమ ఆశలను ఎప్పుడూ వదిలిపెట్టలేదని గుర్తుచేశారు. బెంగాల్లోని కాంగ్రెస్, తృణముల్ కాంగ్రెస్ పార్టీ, వామపక్షపార్టీలు రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో బెంగాల్ వ్యతిరేక విధానాలతో ప్రవర్తించనున్నాయని తెలిపారు. గత 75 ఏళ్లలో బెంగాల్ కోల్పోయిన వైభవాన్ని తిరిగి నిర్మిస్తామని ప్రధాని మోదీ తెలిపారు. ప్రధాని ప్రసంగానికి కంటే ముందు సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి బీజేపీలో చేరారు. మర్చి27న ప్రారంభమయ్యే అసెంబ్లీ ఎన్నికలు ఎనిమిది దశల్లో జరగనున్నాయి. చదవండి: డీఎంకే కూటమిలో కొలిక్కివచ్చిన సీట్ల కేటాయింపు -
దీదీ నీకు వాళ్ల గతే పడుతుంది: యోగి ఆదిత్యనాథ్
-
దీదీ నీకు వాళ్ల గతే పడుతుంది: యోగి ఆదిత్యనాథ్
కోల్కతా: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పశ్చిమ బెంగాల్లో రాజకీయం వేడెక్కుతోంది. బీజేపీ-తృణముల్ కాంగ్రెస్ మధ్య విమర్శలు తారస్థాయికి చేరుతున్నాయి. బెంగాల్లో బీజేపీ అధికారంలోకి రావడానికి సీఎం మమతా బెనర్జీ సర్కార్పై విమర్శలు గుప్పిస్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మంగళవారం బెంగాల్లోని మల్దాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మమతా బెనర్జీ ప్రభుత్వ విధానాలపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. మమతా బెనర్జీ బెంగాల్లో ఆవుల అక్రమ రవాణా, లవ్ జిహాద్లకు అనుమతి ఇస్తున్నారని మండిపడ్డారు. కేవలం ఓట్ల కోసమే అక్రమ వలసదారులను ప్రోత్సహింస్తున్నారని విమర్శించారు. జై శ్రీరాం అనే నినాదాన్ని బెంగాల్లో అనుమంతిచడం లేదని, మతపరమైన సెంటిమెట్ను రాజకీయల కోసం ఉపయోగిస్తున్నారని మండిపడ్డారు. యూపీలో రామ మందిర నిర్మాణానికి అడ్డుపడినవారికి పట్టిన గతి మమతకు బెంగాల్లో ఎదురవుతుందని హెచ్చరించారు. భారతదేశంలో రామునికి వ్యతిరేకంగా ఉండేవాళ్లు రామ ద్రోహులుగా మిగిలిపోతారని అన్నారు. బెంగాల్లో టీఎంసీ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయి, బీజేపీ అధికారంలోకి వస్తుందని సీఎం యోగి ధీమా వ్యక్తం చేశారు. 294 నియోజకవార్గాలు ఉ్న పశ్చిమబెంగాల్లో 8 విడతలుగా ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల ప్రకటించిన విషషయం తెలిసిందే. చదవండి: దీదీని కలిసిన ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ -
నిరసన గళం: ఎలక్ట్రిక్ స్కూటర్పై సచివాలయానికి దీదీ
కోల్కత: ఆకాశానికి ఎగబాకుతున్న పెట్రోల్ ధరలకు నిరసనగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం ఎలక్ట్రిక్ స్కూటర్పై సచివాలయానికి చేరుకున్నారు. ఆ రాష్ట్ర మంత్రి ఫిర్హాద్ హకీమ్ స్కూటర్ను నడుపగా, మమతా హెల్మెట్ ధరించి వెనక సీట్లో కూర్చున్నారు. పెట్రో ధరలను నిరసిస్తూ ఫ్లకార్డును మెడలో ధరించారు. ఇప్పుడు మీ నోళ్లలో నానుతున్న అంశంఏది అని ప్రశ్నిస్తే..పెట్రోల్ ధరల పెరుగుదల. డీజిల్ ధరల పెరుగుదల. వంట గ్యాస్ ధరల పెరుగుదల అనే ఉంటుందన్న సమాధానాలు వినిపిస్తాయి అని ఫ్లకార్డులో రాసి ఉంది. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు పెట్రోల్ ధరల్లో ఉన్న వ్యత్యాసాన్ని గమనించివచ్చు అని మమతా పేర్కొన్నారు. మోదీ, అమిత్ షా..దేశాన్ని అమ్మేస్తున్నారని, ఇది ప్రజా వ్యతిరేక ప్రభుత్వం అని అన్నారు. అహ్మదాబాద్లోని సర్దార్ పటేల్ స్టేడియంగా ప్రసిద్ధి చెందిన మోటెరా స్టేడియానికి మోదీ పేరు పెట్టడాన్ని ఆమె తీవ్రంగా విమర్శించారు. కాగా గత కొన్ని రోజలుగా పెట్రోల్, డిజిల్ ధరలు గణనీయంగా పెరిగిన సంగతి తెలిసిందే. రెండు రోజుల స్వల్ప విరామం తరువాత తాజాగా రికార్డు స్థాయికి చేరిన ఇంధన ధరలు వినియోగదారులకు షాకిస్తున్నాయి. గత 30 రోజులలో మునుపెన్నడూ లేని విధంగా ధరలు పెరిగాయి. ప్రధాన నగరాల్లో లీటరు పెట్రోల్ 90 రూపాయలు దాటేసింది. కోల్కతాలో లీటరు పెట్రోల్ ధర (రూ .91.12), చెన్నై (రూ .92.90), బెంగళూరు (రూ .93.98), భువనేశ్వర్ (రూ .92), హైదరాబాద్ (రూ. 94.54), జైపూర్ (రూ. 97.34), పాట్నా (రూ. 93.56), తిరువనంతపురం (రూ. 92.81)గా ఉంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఇప్పటికే పెట్రోల్ లీటరు ధర సెంచరీ దాటేసింది. ఈ నెల 23న పెట్రోల్ డీజిల్ ధరలు 35 పైసలు చొప్పున పెంపు తరువాత దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 91 రూపాయల మార్క్, ముంబై లో 97 రూపాయల ఎగువకు చేరింది. రెండు వారాలుగా పెరుగుతున్న ధరలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. రాజకీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తుండగా తాజాగా ధరల పెంపుపై లారీ యజమానులు ఆందోళనకు దిగారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా శుక్రవారం (ఫిబ్రవరి 26) భారత్ బంద్కు పిలుపునిచ్చారు. చదవండి : (పెట్రో సెగలపై ఆర్బీఐ సంచలన వ్యాఖ్యలు) (పెట్రో సెగ: బీజేపీ మంత్రి ఉచిత సలహా) #WATCH | West Bengal CM Mamata Banerjee nearly falls while driving an electric scooter in Howrah, as a mark of protest against fuel price hike. She quickly regained her balance with support and continued to drive. She is travelling to Kalighat from State Secretariat in Nabanna pic.twitter.com/CnAsQYNhTP — ANI (@ANI) February 25, 2021 -
ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన గంగూలీ
కోల్కతా: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆదివారం అపోలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. నాలుగు రోజుల క్రితం రెండోసారి గుండె నొప్పితో దాదా ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని అపోలో వైద్యులు తెలిపారు. వైద్యులు గురువారం ఆయనకు యాంజియోప్లాస్టీ చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. 48 ఏళ్ల గంగూలీ ఈ నెలలో రెండు సార్లు ఆసుపత్రి పాలయ్యారు. జనవరి 2న స్వల్ప గుండెపోటు రావడంతో ఆయనకు యాంజియోప్లాస్టీ ద్వారా ఒక స్టెంట్ను అమర్చారు. బుధవారం మరోసారి ఛాతీలో అసౌకర్యంగా ఉండటంతో ఆస్పత్రిలో చేరిన ఆయనకు వైద్యులు మరో రెండు స్టెంట్లు వేశారు. -
చద్ది బిర్యానీ పెట్టిందని వదినను..
కోల్కతా : బిర్యానీ విషయంలో చోటుచేసుకున్న గొడవ ఓ ప్రాణాన్ని బలి తీసుకుంది. ఆడపడచు దెబ్బలు తాళలేక ఓ మహిళ గుండెపోటుతో మరణించింది. ఈ సంఘటన పశ్చిమ బెంగాల్లో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కోల్కతా, డల్హౌసీ ప్రాంతానికి చెందిన ఫాల్గుణి బసు సోమవారం రోజు ఆడపడుచు కుమారుడికి బిర్యానీ చేసి పెట్టింది. అయితే కొద్దిసేపటి తర్వాత అతడికి వాంతులు కావటం మొదలుపెట్టాయి. దీంతో ఆడపడుచు శర్మిష్ట బసు (40) ఫాల్గుణి తన కుమారుడికి చద్ది బిర్యానీ పెట్టడం వల్లే వాంతులు అయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. వదినపై దాడికి దిగి విచక్షణా రహితంగా కొట్టింది. ( విశాఖలో మరో ప్రేమోన్మాది ఘాతుకం) దెబ్బల కారణంగా ఫాల్గుణి గట్టిగా ఏడుస్తూ.. గుండెపోటు వచ్చి, నేలపై కుప్పకూలింది. ఫాల్గుణి అరుపులు విని అక్కడికి వచ్చిన భర్త నేలపై పడిఉన్న ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించాడు. ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తేల్చారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితురాలు స్క్రిజోఫ్రేనియా అనే మానసిక రుగ్మతతో బాధపడుతోందని, తరుచూ వింతగా ప్రవర్తిస్తోందని కుటుంబసభ్యులు తెలిపారు. -
మమతను హత్తుకుంటా: బీజేపీ నేతకు కరోనా
సాక్షి, కోలకతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత అనుపమ్ హజ్రాను తథాస్తు దేవతలు దీవించినట్టున్నారు. ఏదో ఒక సమయంలో కరోనా సోకుతుందని, అపుడు మమతా బెనర్జీని హత్తుకుంటానంటూ రెచ్చిపోయిన హజ్రాకు తాజాగా కోవిడ్-19 నిర్ధారణ అయిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ ధృవీకరించింది. స్వల్ప అనారోగ్యం కారణంగా నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు కరోనా సోకినట్టు తేలిందని అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం ఆయనకు కోల్కతాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. ఇటీవల జాతీయ కార్యదర్శిగా నియమితులైన అనుపమ్ హజ్రా తనకు కరోనా వైరస్ సోకితే బెంగాల్ సీఎం మమతా బెనర్జీని కౌగిలించుకుంటానంటూ నోరు పారేసుకున్నారు. ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన తృణమూల్ కాంగ్రెస్ అనుపమ్పై డార్జిలింగ్ జిల్లాలోని సిలిగురి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన సంగతి తెలిసిందే. (‘కరోనా వస్తే మమత బెనర్జీని కౌగిలించుకుంటా’) -
క్షమాపణలు కోరిన విశ్వభారతి వర్సిటీ వీసీ
కోల్కతా : శాంతినికేతన్ (విశ్వభారతి) యూనివర్సిటీలో రవీంద్రనాథ్ ఠాగూర్ బయటివ్యక్తి (అవుట్ సైడర్ ) అంటూ చేసిన వ్యాఖ్యలను వెనక్కతీసుకుంటున్నట్లు వైస్ చాన్సలర్, ప్రొఫెసర్ బిద్యూత్ చక్రవర్తి ప్రకటించారు. తన వ్యాఖ్యలు ఇతరుల మరోభావాలు దెబ్బతీసినందుకు క్షమాపణలు కోరుతున్నా అని పేర్కొన్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ సైతం బోల్పూర్ నుంచి ఇన్స్టిట్యూట్కు వచ్చారని, ఆయన కూడా అవుట్సైడరే అంటూ వీసి చక్రవర్తి చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. సహ అధ్యాపకులు, విద్యార్థుల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తం అయింది. ఠాగూర్ స్థాపించిన సంస్థకి ఆయనే బయటివ్యక్తి ఎలా అయ్యారంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎవరినీ నొప్పించడం తన ఉద్దేశం కాదని, తాను కేవంలం చారిత్రక, భౌగోళిక వాస్తవాలనే ప్రస్తావించానని వైస్ చాన్సలర్ వివరణ ఇచ్చారు. (జేఈఈ మెయిన్స్: 4 మార్కులు కలపనున్న ఎన్టీఏ) అయితే తన వ్యాఖ్యలు ఇతరుల మనోభావాలను దెబ్బతీసినందున క్షమాపణలు కోరుతున్నా అంటూ పేర్కొన్నారు. ఇక 1921లో రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన శాంతికేతన్ ఇన్స్టిట్యూట్ 1951లో కేంద్ర విశ్వవిద్యాలయంగా మారింది. ఇక ఇన్స్టిట్యూట్ సమీపాన ఉన్న పౌష్ మేళా మైదానంలో జరిగిన హింసాకాండపై స్వతంత్ర, నిష్పాక్షిక దర్యాప్తు కోరుకుంటున్నామని చక్రవర్తి అన్నారు. ఈ దాడి వెనక టీఎంసీ నాయకులు ఉన్నారని అనుమానం వ్యక్తం చేవారు. ఆగస్టు 17న ఇన్స్టిట్యూట్లోని ఓ గేటును కూల్చివేసిన సంగతి తెలిసిందే. అయితే తాను బీజేపీ పక్షం ఉన్నానని, కావాలనే లేనిపోని వ్యాఖ్యలు చేస్తున్నానన్న ఆరోపణలను వీసీ చక్రవర్తి కొట్టిపారేశారు. ఒకవేళ అది నిజమైతే రుజువు చేయాలని డిమాండ్ చేశారు. (మేం మర్చిపోం, మర్చిపోనివ్వం: ఫడ్నవీస్) -
కరోనా : బెంగాల్లో రికార్డు స్థాయిలో కేసులు
కోల్కతా : పశ్చిమ బెంగాల్లో అత్యధికంగా ఒక్కరోజే రికార్డు స్థాయిలో 895 కొత్త కరోనా కేసులు నమోదుకాగా 21 మంది మరణించారు. వీటిలో అత్యధికంగా కోల్కతాలోనే 244 కొత్త కేసులు వెలుగుచూడటం ఆందోళన కలిగిస్తుంది. గత 24 గంటల్లోనే కరోనా కారణంగా 21 మంది మరణించారని వైద్యా ఆరోగ్యశాఖ సోమవారం వెల్లడించింది. అయితే గత ఐదు రోజుల నుంచి రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. కేవలం ఐదు రోజుల్లోనే 3567 కొత్త కరోనా కేసులు నమోదైతే వాటిలో కోల్కతాలోనే 1,187 కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర రాజధానిలో అత్యధిక కరోనా కేసులు నమోదవుతుండటంపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. ఇతర జిల్లాలనుంచి కరోనా రోగులను కోల్కతాలోని ఆసుపత్రులకు తరలిస్తున్నందునే కేసుల సంఖ్య అధికంగా ఉందని ఇటీవల మీడియా సమావేశంలో వెల్లడించారు. (10 వేల పడకల కోవిడ్ సెంటర్ ) అత్యధిక కరోనా కేసుల నేపథ్యంలో ఆసుపత్రుల్లో బెడ్లు సరిపోవడం లేదని వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 8,018 బెడ్లు ఖాళీగా ఉన్నాయని ఎవరూ ఆందోళనకు గురికావద్దని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అయితే కరోనా రోగులు అత్యధికంగా ప్రైవేటు ఆసుపత్రులకే మొగ్గు చూపుతున్నారని కరోనా బాధితుల తాకిడి పెరిగిందని ప్రైవేట్ ఆసుపత్రులు నివేదించాయి. ప్రస్తుతం కేవలం 107 పడకలు మాత్రమే ఖాళీగా ఉన్నాయని వెల్లడించాయి. ప్రభుత్వం చర్యలు తీసుకొని కరోనా ఆస్పత్రుల సంఖ్యను పెంచాలని విఙ్ఞప్తి చేశాయి. (కరోనా: ప్రపంచంలో మూడో స్థానంలో భారత్ ) -
నా నోబెల్ బహుమతి తిరిగి ఇప్పించండి
కోల్కతా : నోబెల్ బహుమతి కావాలి అంటూ ఓ మహిళ హౌరా బ్రిడ్జి ఎక్కి హల్చల్ చేసింది. ప్రముఖ ఆర్థికవేత్త అమర్థ్యసేన్ నా నోబెల్ బహుమతిని దొంగిలించాడని ఆరోపణలు చేసింది. ఈ విషయంపై కేంద్రం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందంటూ వాపోయింది. నోబెల్ ప్రైజ్ తిరిగి ఇచ్చేవరకు కదలనని భీష్మించుకొని కూర్చుంది. దీంతో ఆమెను కిందకి దించడానికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చాలా అవస్థలు పడ్డారు. మతిస్థిమితం లేని మధ్య వయస్కురాలిగా పోలీసులు గుర్తించారు. ఆమె పేరు డొల్లి ఘోష్ అని అశోక్నగర్లో నివాసం ఉంటున్నట్లు గుర్తించారు. ఆదివారం 6 గంటల ప్రాంతంలో ఆమె హౌరా బ్రిడ్జిపై ఎక్కిందని పోలీసులకు సమాచారం అందడంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమెను కిందకి దింపేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. చివరికి నోబెల్ ప్రైజ్ వెతికి తెచ్చిస్తామని మాట ఇవ్వడంతో సదరు మహిళ కిందకు దిగేందుకు ఇప్పుకోవడంతో విషయం సద్దుమణిగింది. (కరోనా: అవసరం లేకపోయినా చికిత్స.. ) -
ఉంపన్ విధ్వంసం : 72 మంది మృతి
కోల్కత్తా : పశ్చిమ బెంగాల్లో ఉంపన్ తుపాను పెను వినాశనాన్ని సృష్టిస్తోంది. ఇప్పటికే ప్రాణాంతక కరోనా వైరస్ ధాటికి వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన బెంగాల్లో ఉంపన్ వల్ల భారీ విధ్వంసం చోటుచేసుకుంది. భారీ తుపాను కారణంగా ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 72 మంది మృత్యువాత పడ్డారు. వేలమంది ప్రజలు నిరాశ్రయులు అయ్యారు. ఈ మేరకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓ ప్రకటన విడుదల చేశారు. తుపాన్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వ్యక్తుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. ఇప్పటి వరకు ఇలాంటి విధ్వంసం చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం బెంగాల్లో పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా వచ్చి ఇక్కడి పరిస్థితిని చూడాలని మమత కోరారు. మరోవైపు ఉంపన్ తీవ్ర రూపం దాల్చడంతో బెంగాల్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆస్తి ప్రాణ నష్టం సంభవించింది. రాజధాని కోల్కత్తా ప్రాంతంలో రవాణా వ్యవస్థ, విద్యుత్ సరాఫరా నిలిచిపోయింది. గాలులు, భారీ వర్షాల కారణంగా కోల్కత్తా ఎయిర్పోర్ట్ పూర్తిగా నీట మునిగింది. (నీట మునిగిన కోల్కతా ఎయిర్పోర్టు) -
కరోనా : చివరి చూపైనా దక్కలేదు
కోల్కతా: కరోనా నేపథ్యంలో దేశ వ్యాప్తంగా విధించిన లాక్డౌన్ కారణంగా చాలామంది తీవ్ర ఇబ్బందులను పడుతున్నారు. ఐన వారు చనిపోయినా చివరిచూపు కూడా చూడలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కొంతమంది వీడియో కాల్ ద్వారా కడసారి చూపుకు నోచుకుంటున్నారు. కరోనా కారణంగా మృతి చెందిన ఓ వృద్ధుడిని వారి కుటుంబ సభ్యులు కడచూపు చూసుకోలేకపోయిన ఘటన పశ్చిమ బెంగాల్లో జరిగింది. గత నెల 29న హరినాథ్ సేన్(70)కు కరోనా సోకింది. దీంతో ఆయన్ను ఎంఆర్ బంగుర్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితిని మే 1న ఆస్పత్రి సిబ్బంది కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారు. ఈనెల 5న కుటుంబీకులు ఫోన్చేయగా ఆయనకు సంబంధించిన సమాచారం లేదని తమ వద్ద లేదని సిబ్బంది ఫోన్లో చెప్పారు. 6న ఫోన్ చేయగా నాలుగురోజుల క్రితమే ఆయన మరణించాడని, కోల్కతా కార్పొరేషన్ సిబ్బంది అంత్యక్రియలు పూర్తి చేశారని ఆస్పత్రి సిబ్బంది చెప్పారు. ప్రస్తుతం హరినాథ్ కుటుంబం ఐసోలేషన్లో ఉంది. వారిచ్చిన నంబర్కు ముందే విషయంచెప్పామని ఆస్పత్రియాజమాన్యం వివరణ ఇచ్చింది. (క్వారంటైన్లో రాధారవి..?) -
ఎస్బీఐ ఉద్యోగికి కరోనా: ఆఫీసు మూసివేత
సాక్షి, కోలకతా: దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)ను కరోనా వైరస్ ప్రకంపనలు తాకాయి. కోల్కతాలోని ఒక ఉద్యోగికి కరోనా వైరస్ సోకడంతో ప్రధాన కార్యాలయంలోని ఒక విభాగాన్ని ఎస్బీఐ మూసివేసింది. స్థానిక ప్రధాన కార్యాలయానికి చెందిన ఇ-వింగ్ ఉద్యోగిగా బాధితుడిని సంస్థ ప్రకటించింది. స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో అతను చికిత్స పొందుతున్నాడని తెలిపింది. వైరస్ సోకిందని గుర్తించక ముందే సదరు ఉద్యోగి గత పది రోజులుగా సెలవులో ఉన్నాడని బ్యాంకు అధికారి వెల్లడించారు. కోవిడ్-19 పాజిటివ్ వచ్చిన వెంటనే మొత్తం భవనాన్ని శుభ్రపరిచి, మే 11వ తేదీ వరకు ఈ విభాగాన్ని మూసివేశామని తెలిపింది. అయితే ఈ భవనంలోని మిగతా అన్ని విభాగాలు పనిచేస్తున్నాయని చెప్పింది. ప్రస్తుత సంక్షోభ సమయంలో బాధ్యతాయుతమైన సంస్థగా ఉద్యోగుల సంక్షేమాన్ని పరిశీలిస్తూ, అన్ని నిబంధనలను అనుసరిస్తున్నామని అధికారి తెలిపారు. గతంలో విదేశాలకు వెళ్లిన మరొకరికి కూడా పాజిటివ్ వచ్చిందని, ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు.(ఎస్బీఐ గుడ్ న్యూస్, వారికి ప్రత్యేక పథకం) మరోవైపు ఎస్బీఐ పనిచేస్తున్న ఉద్యోగి (48)కి. ఆమె కుమార్తె(28)కు పాజటివ్ గా తేలడంతో పంజాబ్ లోని పాటియాలా నగరంలో ఎస్బీఐ రెండు శాఖలు మూసివేసినట్టు సమాచారం. వీరిని క్వారంటైన్ లో ఉంచామని పాటియాలా సివిల్ సర్జన్ డాక్టర్ హరీష్ మల్హోత్రా తెలిపారు. అలాగే ఈ శాఖలను సందర్శించిన వ్యక్తులను గుర్తించే ప్రక్రియ జరుగుతోందని చెప్పారు. మే 8, ఉదయం 8 గంటల వరకు పశ్చిమ బెంగాల్లో కరోనా కారణంగా 151 మరణాలు సంభవించగా, 1548 కేసులు నమోదయ్యాయి. దేశంలో అత్యధిక మరణాల నమోదు చేస్తున్న రాష్ట్రాల్లో బెంగాల్ ఒకటి. (అతి ఖరీదైన బీఎండబ్ల్యూ కారు లాంచ్ ) -
తప్పిన ప్రమాదం, విమానంలో మంత్రి
సాక్షి, కోల్కతా: కోల్కతా నేతాజీ సుభాస్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ ఏషియా విమానానికి భారీ ప్రమాదం తప్పింది. పశ్చిమ బెంగాల్ మంత్రి అరూప్ బిస్వాస్తో సహా 171 మంది ప్రయాణికులతో బాగ్డోగ్రాకు బయలుదేరిన ఎయిర్ ఏషియా విమానం టేకాఫ్ అయిన వెంటనే అత్యవసరంగా ల్యాండ్ అయింది. దీంతో అధికారులు సహా, విమాన సిబ్బంది, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. టేకాఫ్ అయిన వెంటనే వడగండ్ల వర్షం కురవడంతో పైలట్ అప్రమత్తమై తిరిగి అత్యవసరంగా ల్యాండ్ చేశారు. దీంతో భారీ ప్రమాదం తప్పిందని విమానయాన సంస్థ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. విండ్షీల్డ్కు నష్టం వాటిల్లిందనే అనుమానంతో పైలట్ ఈ నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. ప్రయాణీకుల భద్రతే తమ మొదటి ప్రాధాన్యమని, ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామంటూ విమానయాన సంస్థ ముఖ్య భద్రతా అధికారి క్షమాపణలు చెప్పారు. -
పాపం: నాటు బాంబులను బాల్స్ అనుకుని..
కోల్కతా : నాటు బాంబులను బంతులుగా భావించి ఆడుకున్న ఘటనలో ఓ చిన్నారి మృతిచెందాడు. తీవ్రంగా గాయపడ్డ మరో ఇద్దరు చిన్నారులు ప్రాణాలతో పోరాడుతున్నారు. ఈ విషాద సంఘటన పశ్చిమ బెంగాల్లోని పరగణా జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నాలుగు రోజుల క్రితం పరగణా జిల్లాలో ముగ్గురు చిన్నారులు ఇంటి ఆవరణలో ఆడుకుంటున్నారు. అలా ఆడుకుంటూ అక్కడి ఓ ఇంట్లోకి ప్రవేశించారు. ఆ ఇంట్లో ఓ సంచిలో ఉన్న నాటు బాంబులను బంతులుగా భావించిన వారు వాటితో ఆడుకున్నారు. ఈ నేపథ్యంలో బాంబులు పేలి చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని కోల్కతాలోని ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. నాలుగు రోజుల చికిత్స అనంతరం ఈ ఆదివారం ఓ బాలుడు మృతి చెందాడు. మిగిలిన వారి పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ నాటు బాంబులు టీఎంసీ నేతకు చెందినవిగా గుర్తించారు. అతడ్ని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. -
అనాథల అక్క
రైలొచ్చి ఆగిందంటే స్టేషన్ ఖాళీ అవుతుంది. అక్కొచ్చి వెళ్లిదంటే.. స్టేషన్లో అనాథ బాలలెవరూ కనిపించరు.రైలు.. ప్రయాణికుల్ని మోసుకెళ్లినట్లు.అక్క.. గమ్యం లేని ఆ పిల్లల్ని తనతో తీసుకెళుతుంది. వారికో గూడు కల్పిస్తుంది. బడిలో చేర్పిస్తుంది. వాళ్ల భవిష్యత్తుకు బతుకు పట్టాలు వేస్తుంది. ఆ అక్క పరిచయం ఇది. షోరాపుల్లి రైల్వే జంక్షన్ కోల్కతాకు 30 కి.మీ.ల దూరాన ఉంటుంది. తొమ్మిది ట్రాక్లు, ఆరు ప్లాట్ఫామ్లతో ఎప్పుడూ వచ్చే పోయే రైళ్లతో, ప్రయాణికులతో రద్దీగా ఉంటుంది. పశ్చిమ బెంగాల్, హుగ్లీ జిల్లాలో ఉంది షోరాపుల్లి. తూర్పు రైల్వే నడిపిన తొలి రైలు మార్గం ఇది. ప్రథమ స్వాతంత్య్ర సమరానికి మూడేళ్ల ముందు 1854, ఆగస్టు 15వ తేదీన హౌరా నుంచి హుగ్లీ వరకు షోరాపుల్లి మీదుగా తొలి రైలు నడిచింది. అంతటి చరిత్రాత్మకమైన రైల్వే స్టేషన్ కాలక్రమంలో అనాథ బాలలకు నెలవుగా మారింది. వాళ్లలో నాలుగేళ్ల పిల్లల నుంచి ఉన్నారు, కానీ ఎక్కువ మంది పన్నెండు– పదమూడేళ్ల వయసు వాళ్లు. చాలా మందికి తల్లిదండ్రులు లేరు. కొంతమందికి తల్లి లేదు. మరో పెళ్లి చేసుకున్న తండ్రి శ్రద్ధ పెట్టకపోవడంతో వీధుల బాట పట్టిన బాల్యం వాళ్లది. ఆ పిల్లలను ‘తిన్నారా’ అని అడిగే వాళ్లు ఉండరు. దొరికింది తినడం, ఏదీ దొరక్కపోతే చెట్ల గుబుర్ల నుంచి చిగురుటాకులు కోసుకుని తినడం! ఎక్కడ పడితే అక్కడే నిద్రకు వాలిపోయేవారు. (మదిదోచే జలపాతాలు.. ఒక్కసారైనా వెళ్లాల్సిందే) ఆకలిని, చలిని అణుచుకోవడానికి మత్తుగా నిద్రపోవడానికి డెండ్రైట్ గమ్కి కూడా అలవాటు పడ్డారు! పరిశ్రమలలో ఉపయోగించే డెండ్రైట్ గమ్ తాగితే మత్తు వస్తుందని, భ్రాంతిలో, అందమైన ఊహల్లో తేలిపోవచ్చని వాళ్లకు ఎలా తెలిసిందో, ఎప్పుడు తెలిసిందో! పెద్ద పిల్లల నుంచి చిన్న పిల్లలకు కొన్నేళ్లుగా ఆ అలవాటు వస్తూనే ఉంది. రైళ్లలో, రైల్వే స్టేషన్లో అడుక్కోవడం, వాడేసిన బాటిళ్లను ఏరి అమ్ముకోవడం... పదో పదిహేనో వస్తే బిస్కట్టో, కేక్ ముక్కో కొనుక్కుని తినడమే వాళ్లకు తెలిసింది. అదే డబ్బులకు చిన్న బ్రెడ్ ప్యాకెట్ వస్తుందని, దాంతో అయితే ఆకలి తీరుతుందనే ఆలోచన కూడా ఉండదు. అలాగే ఒక్క కేకు ముక్కతో ఆకలి తీరదని కూడా తెలుసు, అందుకే ఆకలి తీర్చుకోవడానికంటే ముందు గమ్ కొనుక్కోవడానికి కొంత డబ్బు తీసి పక్కన పెట్టుకుంటారు. హార్డ్వేర్ షాపుకెళ్లి గమ్ కొనుక్కుంటారు. ఆ గమ్ను పిల్లలకు అమ్మడం నేరమని ఆ దుకాణాల వాళ్లకు తెలుసు. అయినా సరే అమ్మేస్తుంటారు. అది తాగడం ఆరోగ్యానికి హానికరం అని చెప్పేవాళ్లు లేరు. డెండ్రైట్ గమ్ నుంచి వచ్చే తియ్యటి వాసనను పీల్చకుండా ఉండలేని స్థితికి చేరుకున్నారా పిల్లలు. ఇంకా ఘోరం ఏమిటంటే... స్టేషన్ పరిసరాల్లో నిద్రిస్తున్న ఆడపిల్లల మీద దుండగులు అత్యాచారాలకు పాల్పడడం, కొంతమంది సెక్స్వర్కర్లు ఈ పిల్లల్ని మభ్య పెట్టి వ్యభిచారకూపంలోకి దించడమూ. రాత్రయితే ఆ స్టేషన్ పరిసరాలు రెడ్లైట్ ఏరియాగా మారిపోతుండేవి. నాలుగేళ్ల కిందట మైత్రేయి బెనర్జీ దృష్టి ఆ పిల్లల మీద పడే వరకు అలాగే ఉండింది. ఆకలి మత్తు మైత్రేయి బెనర్జీ పుట్టిల్లు పశ్చిమ బెంగాల్లో దక్షిణేశ్వర్. అర్నాబ్ బెనర్జీని పెళ్లి చేసుకుని కోల్కతాలో అడుగుపెట్టింది. సోషల్ వర్క్లో గ్రాడ్యుయేషన్ చేసిన మైత్రేయి పెళ్లయి ఓ బిడ్డ పుట్టిన తర్వాత ఉద్యోగం వదిలేసి గృహిణిగా మారిపోయింది. ఓ రోజు మార్కెట్కి వెళ్లినప్పుడు అక్కడ కొంతమంది పిల్లలు అల్లరిచిల్లరిగా వ్యవహరించడం ఆమె దృష్టిలో పడింది. వాళ్లను మాటల్లో పెట్టి, వాళ్ల బస రైల్వే స్టేషన్ అని తెలుసుకుంది. మరో రోజు అదేపనిగా రైల్వే స్టేషన్కెళ్లి గమనించిందామె. పిల్లలు డెండ్రైట్ గమ్ మత్తు మందు పీల్చడం గమనించి ఎందుకిలా చేస్తున్నారని అడిగింది. ఆమె ఏ మాత్రం ఊహించని సమాధానం... ‘‘అక్కా! మాకు తినడానికి తిండి లేదు. దీన్ని పీలిస్తే మత్తుగా నిద్ర వస్తుంది. ఆకలి తెలియదు’’ అన్నారా పిల్లలు. అప్పటి సంఘటనను గుర్తు చేసుకుంటూ ‘‘ఆ సమాధానం విని గుండె పగిలిపోయింది’’ అని చెప్పేటప్పుడు మైత్రేయి కళ్ల నుంచి కన్నీరు ధారగా చెంపల మీదకు జారాయి. బాల్యం పట్టాలెక్కింది రైల్వేస్టేషన్లో రోజులు గడుపుతున్న పిల్లలకు మంచి జీవితాన్ని ఇవ్వాలనుకున్నారు మైత్రేయి. వాళ్ల సమస్యకు పరిష్కారం అంత సులభం కాదని తెలుసు. అయినా ఒక్కటొక్కటిగా తన ప్రయత్నాలను మొదలుపెట్టారామె. దగ్గరలో ఉన్న రెస్టారెంట్లకు వెళ్లి మధ్యాహ్నం మిగిలిన భోజనాన్ని ఈ పిల్లలకు పెట్టడానికి రెస్టారెంట్ యజమానులను ఒప్పించారు మైత్రేయి. ఒక పూట భోజనానికి భరోసా వచ్చింది. వాళ్లకు నీడ వెతకాలి. ఈ లోపు బంధువులు, స్నేహితులతో వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేసి తాను చేపట్టిన పని గురించి వివరించారు. అందరి ఇళ్లకు వెళ్లి పిల్లల దుస్తులు, దుప్పట్లు, స్కూలు బ్యాగ్లు, బూట్లు సేకరించారామె. ఆ దుస్తులను తాను బాధ్యత తీసుకున్న పిల్లలకు వేసి ఫొటోలు తీసి వాట్సప్ గ్రూప్లో పెట్టేవారామె. దాంతో మొదట్లో ఒకింత సహాయం చేసిన వాళ్లందరూ మైత్రేయి చేపట్టిన పనిలో సంతోషంగా భాగస్వాములయ్యారు. ఆ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలో చేర్చేటప్పుడు పుస్తకాలు, యూనిఫామ్ కొనివ్వడం వంటి సహాయాన్ని స్వచ్ఛందంగా అందించారు. ఒక్కొక్కటీ దారిన పడుతోంది. కానీ చీకటి నేరాల నుంచి భద్రత కల్పించే భరోసానిచ్చే నీడ మాత్రం ప్రశ్నార్థకంగానే ఉంది. అనాథ పిల్లల కోసం ప్రభుత్వం నడిపిస్తున్న హోమ్లను, ఎస్ఓఎస్ చిల్డ్రన్స్ గ్రామాలను సంప్రదించి మిగిలిన పిల్లలను చేర్పించారు. మొత్తం నూట పదిమంది పిల్లలకు భద్రత కల్పించారు మైత్రేయి. ‘‘ఎవరి జీవితమూ ఒకరికంటే తక్కువ కాదు, మరొకరి కంటే ఎక్కువా కాదు. ఎవరి జీవితం వాళ్లకు గొప్పది. వీధిపాలైందని జీవితాన్ని వదిలేయకూడదు. పట్టాలు తప్పిన బతుకును గాడిన పెట్టాలి. గొప్ప జీవితంగా మలుచుకోవాలి. ఆ ఉద్దేశంతోనే నేను చేస్తున్న ఈ పనికి ‘మహా జిబన్’ అని పేరు పెట్టాను. అంటే మహా జీవితం అని అర్థం’’ అన్నారు మైత్రేయి. – మంజీర అసలైన సవాల్ పిల్లలకు భరోసా కలిగిన ఒక నీడ వెతకడం, అందులో చేర్చడం ఒక ఎత్తయితే.. వారిని అందులో కొనసాగించడం ఆమెకు పెద్ద సవాల్గా మారింది. ఇద్దరు పిల్లలు ఎస్ఓఎస్ గ్రామం నుంచి పారిపోయి తిరిగి రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. కేవలం డెండ్రైట్ కోసమే వాళ్లు ఆ పని చేశారు. వాళ్లను తిరిగి తీసుకెళ్లి ఎస్ఓఎస్లో చేర్చడంతోపాటు వాళ్లకు జీవితం పట్ల ఆశ కలిగేటట్లు కౌన్సెలింగ్ ఇవ్వడం పెద్ద పనిగా మారింది. క్రమం తప్పకుండా కౌన్సెలింగ్లు, థెరపీలు, మందులిప్పించడం ద్వారా ఆ పిల్లలను మార్చగలిగారామె. ‘‘ముందున్నది మహా జీవితం అని వాళ్లకు నచ్చచెప్పి జీవితం మీద ఆశలు కల్పించగలిగాను. జీవితేచ్ఛ కలిగితే.. ఆ జీవితేచ్ఛే మనిషిని నడిపిస్తుంది. తొలిసారి వాళ్లను కలిసినప్పుడు స్నానం లేకుండా, మాసిన దుస్తులతో, చింపిరి జుట్టుతో ఎవరు ఎవరో గుర్తు పట్టలేనట్లు ఉన్నారా పిల్లలు. ఇప్పుడు మంచి దుస్తులు ధరించి, స్కూలుకు పోతున్నారు. పలకరిస్తే స్వచ్ఛంగా నవ్వుతున్నారు. బాల్యాన్ని సంతోషంగా గడుపుతున్నారు. వాళ్ల బాల్యాన్ని వాళ్లకు తిరిగి తెచ్చివ్వగలిగినందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు మైత్రేయి. -
కోల్కతాలో ముగ్గురు కరోనా బాధితులు
కోల్కతా: భారత దేశంలో కూడా కోవిడ్-19 బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గురువారం కోలకతాలోని నేతాజీ సుభాష్ చంద్ర బోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరో వ్యక్తికి నోవల్ కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారించారు. బ్యాంకాక్ నుంచి కోలకతా చేరుకున్న ప్రయాణికుడికి కరోనా వైరస్ పాజిటివ్గా నిర్ధారించినట్లు విమానాశ్రయ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు గురువారం తెలిపారు. దీంతో కోల్కతాలో కరోనావైరస్ సోకిన వారి సంఖ్య మూడుకు చేరింది. మంగళ, బుధవారాల్లో కోలకతా విమానాశ్రయంలో హిమాద్రి బార్మాన్, నాగేంద్ర సింగ్ ఇద్దరు ప్రయాణికులకు నిర్ధారిత పరీక్షలో పాజిటివ్ వచ్చిందని విమానాశ్రయం డైరెక్టర్ కౌశిక్ భట్టాచార్జీ పీటీఐకి తెలిపారు. వీరిద్దరినీ బెలియాఘాటా ఐడి ఆసుపత్రికి పంపినట్లు తెలిపారు. అంతకుముందు అనితా ఒరాన్ అనే ప్రయాణీకుడికి కూడా థర్మల్ స్కానింగ్ సమయంలో పాజిటివ్ వచ్చినట్టు భట్టాచార్జీ చెప్పారు. మరోవైపు స్పైస్జెట్ విమానంలో బ్యాంకాక్ నుంచి ఢిల్లీ వచ్చిన ఢిల్లీ విమానాశ్రయంలో ఒక ప్రయాణికుడిని కరోనా వైరస్ బాధితుడుగా అనుమానిస్తూ, పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కోల్కతా, చైనా మధ్య ప్రత్యక్ష విమానాలను కలిగి ఉన్న రెండు విమానయాన సంస్థలు తమ విమాన సేవలనుతాత్కాలికంగా నిలిపివేసాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల మేరకు ఇండిగో ఫిబ్రవరి 6- 25, 2020 వరకు కోల్కతా- గ్వాంగ్జౌ మధ్య తన విమానాలను తాత్కాలికంగా నిలిపివేసింది. ఇండిగో తరువాత, చైనా ఈస్టర్న్ ఎయిర్లైన్స్ ఫిబ్రవరి 10 నుండి ఫిబ్రవరి 29 వరకు చైనాలోని కోల్కతా, కున్మింగ్ మధ్య విమానాలను నిలిపివేసింది. చైనా, హాంకాంగ్, సింగపూర్ బ్యాంకాక్ నుండి కోల్కతాకు వచ్చే విమాన ప్రయాణికులను జనవరి 17 నుండి క్షుణ్ణంగా పరిశీలిస్తున్న సంగతి తెలిసిందే. చదవండి : స్పైస్ జెట్లో కోవిడ్ అనుమానితుడి కలకలం కరోనా ప్రమాదం : మన ర్యాంకు ఎంతంటే? కోవిడ్-19 : ఎలక్ట్రానిక్ పరిశ్రమలు మూత -
చిరుతపులి ముఖంపై పంచ్లు కురిపించింది!
కోల్కతా : చిరుతపులితో తలపడి తన ప్రాణాలను రక్షించుకోవటమే కాకుండా పలువురికి ఆదర్శంగా నిలిచిందో మహిళ. ఈ సంఘటన నార్త్ బెంగాల్లోని అలిపురుద్వార్ జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం ఉదయం అనితా నగషియా అనే మహిళ అలిపురుద్వార్.. కల్చిని పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రాజభట్ టీ తోటలో పనిచేసుకుంటోంది. అదే సమయంలో అనిత వెనకాల నక్కి ఉన్న ఓ చిరుత పులి ఆమెపైకి దూకింది. ఈ హఠాత్పరిణామానికి మొదట భయపడ్డా.. ఆ వెంటనే ధైర్యంగా చిరుతపై తిరగబడింది. ఒట్టి చేతుల్తో దాని ముఖంపై పిడిగుద్దులు గుద్దటం ప్రారంభించింది. దాదాపు ఐదు నిమిషాల పాటు చిరుతకు, మహిళ మధ్య పోరాటం జరిగింది. మొదట్లో చిరుత ఆమె దాడికి స్పందించకపోయినా, చివరకు దెబ్బలు తాళలేక తోక ముడిచింది. అక్కడినుంచి పరుగులు పెట్టింది. అనంతరం తీవ్ర గాయాలపాలైన అనితను తోటి పనివాళ్లు దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. కాగా, టీ తోటలలో చిరుతపులుల దాడులు మామూలైపోయాయి. నిత్యం ఎక్కడో ఓ చోట ఎవరో ఒకరు చిరుతల బారిన పడుతూనే ఉన్నారు. గత డిసెంబర్లోనూ టీ తోటలో పనిచేసుకుంటున్న ఓ 17ఏళ్ల యువతిపై చిరుతపులి దాడి చేసి తీవ్రంగా గాయపర్చిన సంగతి తెలిసిందే. -
బాలుడి ఊపిరితిత్తుల్లో పెన్ క్యాప్..
కోల్కతా: సాధారణంగా చిన్న పిల్లలు పెన్నుక్యాప్లను నోట్లో పెట్టుకొని ఆడుతూ ఉంటడం చూస్తాం. కానీ, కొన్ని సార్లు పెన్నక్యాప్లు వారి శరీరంలోకి పోయి చాలా ప్రమాదకరంగా మారిన సంగతి కూడా తెలిసిందే. తాజాగా ఓ బాలుడి ఊపిరితిత్తుల్లో పెన్నుక్యాప్ ఉండటంలో వైద్యులు ఆశ్చర్యపోయారు. ఈ ఘటన కోల్కతాలోని గారియా ప్రాంతంలో చోటు చేసుకుంది. కొన్ని రోజులుగా తీవ్రమైన దగ్గు, జలుబుతో బాధపడుతున్న 12 ఏళ్ల బాలుడ్ని.. అతని తల్లిదండ్రులు స్థానిక ఎస్ఎస్కేఎం ఆసుపత్రికి తీసుకువెళ్లారు. దీంతో ఆస్పత్రి ఈఎన్టీ వైద్యుడు డా.అరుణాభా సేన్గుప్తా బాలుడికి సిటీ స్కాన్ తీశారు. సిటీ స్కాన్ రిపొర్టు పరిశీలించగా.. బాలుడి ఊపిరితిత్తుల్లో పెన్క్యాప్ ఉన్నట్లు తేలింది. నవంబర్లో తమ బాలుడు పెన్క్యాప్ మింగినటట్లు తల్లిదండ్రులు తెలిపారు. వెంటనే బాలుడి తల్లిదండ్రులు అతన్ని స్థానిక నర్సింగ్ హోంకి తీసుకువెళ్లారు. ఆ నర్సింగ్ హోం డాక్టర్లు.. బాలుడి శరీరంలో పెన్క్యాప్ ఉందని తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినకుండా మాములుగా వైద్యం చేసి పంపించారు. పెన్క్యాప్ బాలుడి శరీరంలో ఉంటే ప్రాణాలతో ఉండేవాడు కాదని ఆ వైద్యులు తెలిపారు. దీంతో చేసేదేమి లేక బాలుడ్ని ఆ తల్లిదండ్రులు తమ ఇంటికి తీసుకువెళ్లారు. కానీ ఆ బాలుడికి రోజురోజుకి దగ్గు, జలుబు ఎక్కువ కావటంతో అతని తల్లిండ్రులు గురువారం స్థానిక ఎస్ఎస్కేఎం ఆస్పత్రికి తీసుకువెళ్లారు. బాలుడి ఎడమ ఊపిరితిత్తులో ఉన్న పెన్క్యాప్ను శుక్రవారం ఆపరేషన్ చేసి తొలగించామని డాక్టర్ అరుణాభాసేన్ గుప్తా తెలిపారు. అదేవిధంగా ప్రస్తుతం బాలుడి ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉందని ఆయన పేర్కొన్నారు. -
విమానానికి తప్పిన ప్రమాదం, షాకైన స్థానికులు
సాక్షి, కోలకతా: గో ఎయిర్ విమానానికి భారీ ప్రమాదం తప్పింది. టేక్ ఆఫ్ తీసుకున్న కొద్ద సమయానికే సాంకేతిక లోపం తలెత్తడంతో గువహటిలోని లోక్ప్రియ గోపీనాథ్ బర్దోయి అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అయితే విమానంలో ఉన్న మొత్తం 157 మంది సురక్షితంగా బయటపడ్డారు. గోవహతి-కోల్కతా గోఎయిర్ జి 8546 విమానం ఉదయం 11:15 గంటలకు గువహతి విమానాశ్రయం నుండి బయలుదేరింది. వెంటనే సాంకేతిక లోపాన్ని గుర్తించిన పైలట్ వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించారు. ఈ సందర్భంగా భారీ శబ్దం వినపడిందని విమానాశ్రయంలోఉన్నవారు చెప్పారు. లోహపు ముక్కలను కనుగొన్నామని స్థానికులు తెలిపారు. విమానం క్రాష్ అయినట్టుగా పెద్ద శబ్దం వినగానే తాను షాక్ అయ్యానని స్థానికుడు ఒకరు తెలిపారు. -
మరో ఘోరం : కిడ్నాప్, గ్యాంగ్రేప్
కోల్కతా: మహిళలపై జరుగుతున్న వరుస ఆఘాయిత్యాలతో దేశం వణికిపోతోంది. హైదరాబాద్ షాద్నగర్లో డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతుండగా మరిన్ని ఘోరాలు వెలుగు చూశాయి. కోల్కతాలో ఇద్దరు బాలికల సామూహిక అత్యాచార ఉదంతం మరింత ఆందోళన రేకెత్తిస్తోంది. దక్షిణ కోల్కతాలోని కాలీఘాట్ ఆలయం దగ్గర ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ కేసులో కూడా మైనర్ బాలురు నిందితులు కావడం గమనార్హం. వివరాల్లోకి వెళితే కాలీఘాట్ ఆలయం వద్ద బాధిత బాలికలు భిక్షాటన ద్వారా జీవనం సాగిస్తున్నారు. గురువారం సాయంత్రం ముగ్గురు మైనర్ బాలురు వీరిని అపహరించుకొని తీసుకెళ్లారు. అనంతరం మాచండి ఆశ్రమానికి సమీపంలో (దాదాపు 75 కిలోమీటర్ల దూరం) ఉన్న ఆది గంగా వద్ద సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం అక్కడినుంచి పారిపోయారు. దీంతో బాధిత బాలికల తల్లిదండ్రులు కాలిఘాట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి, బాలికలను వైద్య పరీక్షల నిమిత్తం కోసం తరలించామని పోలీసు అధికారులు తెలిపారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామని, మరొకరి కోసం గాలిస్తున్నామని చెప్పారు. ఫోరెన్సిక్ నిపుణుల బృందం నేరం జరిగిన ప్రదేశం నుంచి మరిన్ని ఆధారాలు సేకరించడానికి ప్రయత్నిస్తోందని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. -
సీపీఐ సీనియర్ నేత కన్నుమూత
-
సీపీఐ నేత గురుదాస్ గుప్తా కన్నుమూత
కోల్కత్తా: సీపీఐ సీనియర్ నాయకుడు గురుదాస్ దాస్గుప్తా (83) కన్నుమూశారు. గతకొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం కోల్కత్తాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 2004-2014 మధ్య కాలంలో ఆయన లోక్సభకు ప్రాతినిథ్యం వహించారు. రాజ్యసభకూ పలుమార్లు ఎన్నికయ్యారు. ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ (ఏఐటీయుసీ) ప్రధాన కార్యదర్శిగా గురుదాస్ దాస్గుప్తా సేవలు అందించారు. దాస్గుప్తా మరణంపై సీపీఐ జాతీయ కమిటీ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. గురుదాస్ దాస్గుప్తా మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం తెలిపారు. ప్రజలు, కార్మికుల సంక్షేమానికి గురుదాస్ దాస్గుప్తా చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. రాజకీయాల్లో విలువలకు ప్రతీకగా ఆయన నిలిచారని ఆయన సేవలను గుర్తుచేసుకున్నారు. -
మోదీ భార్యను కలుసుకున్న మమత
కోల్కత్తా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని నరేంద్రమోదీ భార్య జశోదాబెన్ను కలిసి మాట్లాడారు. మోదీని కలుసుకునేందుకు ఢిల్లీ బయలుదేరిన మమత మంగళవారం రాత్రి కోల్కత్తా విమానాశ్రయానికి చేరుకున్నారు. అదే సమయంలో జశోదాబెన్ కోల్కత్తా నుంచి ధన్బాద్ వెళ్లేందుకు అక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా ఎదురుపడిన వారిద్దరూ ఒకరినొకరు పలుకరించుకున్నారు. పరస్పరం యోగక్షేమాలు అగిడి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జశోదాబెన్కు మమత చీర బహుకరించారు. కాగా నరేంద్ర మోదీతో మమతాబెనర్జీ బుధవారం సమావేశమైన విషయం తెలిసిందే. మమత తన తరఫున బహుమతిగా మోదీకి ప్రత్యేక కుర్తా, బెంగాలీ స్వీట్స్ను బహుకరించారు. చదవండి: మోదీకి కుర్తా బహుకరించిన దీదీ -
చిరుతతో పోరాడిన ‘టైగర్’
కోల్కతా : పెంపుడు జంతువులు, అందులోనూ కుక్కలు విశ్వాసానికి పెట్టింది పేరు. కోల్కతా, డార్జిలింగ్ సమీపంలో సోనాడలో జరిగిన ఒక సంఘటన ఈ విషయాన్నే మరోసారి రుజువు చేసింది. తన యజమానురాలిని చిరుతపులి దాడి నుంచి కాపాడి పలువురి ప్రశంసలందుకుంటోంది. చాలామంది లాగానే బాధితురాలు అరుణ లామా (57) కూడా ఒక కుక్కను పెంచుకుంటున్నారు. దాని పేరు ‘టైగర్’. ఈ టైగర్ సాహసోపేతంగా పోరాడి చిరుతపులి దాడి నుంచి ప్రాణాలకు తెగించి మరీ తన యజమాని అరుణను కాపాడింది. దీంతో తీవ్ర గాయాలతో (నుదిటి కుడివైపున 20కుట్లు, చెంపలపై ఐదు కుట్లు) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అరుణ. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. బాధితురాలి కుమార్తె స్మార్టీ అందించిన సమాచారం ప్రకారం ఆగస్టు 14న ఈ సంఘటన జరిగింది. తమ ఇంటి భవనంలో కింది ఫ్లోర్లో నివాసం ఉండే.. తన తల్లి చీకట్లో రెండు కళ్లు మెరుస్తూ ఉండడాన్ని గమనించింది... అదేంటో తెలుసుకుని, ఈ షాక్ నుంచి తేరుకునే లోపే ఆమెపై చిరుతపులి దాడి చేసింది. దీన్ని అక్కడే వున్న నాలుగేళ్ల మాంగ్రెల్ జాతికి చెందిన టైగర్ చిరుతను ధీటుగా ఎదుర్కొంది. కొంత పోరాటం తరువాత విజయవంతంగా దాన్ని తరిమివేయగలిగింది. ఏంతో ధైర్యంగా తన తల్లిని టైగర్ కాపాండిందంటూ ఆమె సంతోషం వ్యక్తం చేశారు. మరోవైపు అటవీశాఖ అధికారులు ఈ ప్రాంతంలో నిఘా పెట్టారు. చిరుతపులిని బంధించేందుకు ఉచ్చును ఏర్పాటు చేయనున్నారు. WB:A pet dog saved life of its owner,Aruna Lama who was attacked by a leopard on Aug 14 in Darjeeling.Aruna's daughter says,"as my mother was making her way to ground floor of our house she noticed a pair of glowing eyes,then the leopard attacked her but Tiger(pet dog) saved her" pic.twitter.com/JedUyCjGPd — ANI (@ANI) August 17, 2019 -
మద్యం మత్తులో బీజేపీ ఎంపీ కుమారుడి బీభత్సం
కోల్కతా: నటి, బీజేపీ ఎంపీ రూపా గంగూలీ కుమారుడు మద్యం మత్తులో వాహనాన్ని నడిపి బీభత్సం సృష్టించాడు. రాష్ డ్రైవింగ్తో విలాసవంతమైన గోల్ఫ్ గార్డెన్ ఏరియాలోని కోల్కతా క్లబ్ గోడను ఢీకొట్టాడు. అయితే అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ గంగూలీ కొడుకు ఆకాష్ ముఖోపాధ్యాయ్ (20) మద్యం మత్తులో అతివేగంగా దూసుకొచ్చి ప్రమాదానికి కారణమయ్యాడన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆకాష్ బ్లాక్ సుడాన్ కారుతో మితిమీరిన వేగంతో దూసుకొచ్చాడు. అసలే మద్యం మత్తులో కారును అదుపు చేయలేక సౌత్ కోల్కతా క్లబ్ను గోడను ఢీకొట్టాడు. దీంతో గోడ కూలి, అక్కడే కారు చిక్కుపోయింది. డ్రైవర్ సీటులో ఆకాష్ ఇరుక్కుపోయాడు. అయితే అదృష్టవశాత్తూ అక్కుడన్న వారు భారీ ప్రమాదంనుంచి బయటపడ్డారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేసినట్టు ప్రత్యక్ష సాక్షలు ఆరోపించారు. ఈ ఘటనలో పలువురు తృటిలో తప్పించుకున్నారని పోలీసు వర్గాలు తెలిపాయి. అనంతరం సమీపంలోనే ఉన్న ముఖోపాధ్యాయ్ తండ్రి సంఘటనా స్థలానికి చేరుకుని కారులో చిక్కుకుపోయిన ఆకాష్ను బయటికి తీశారు. అయితే మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తున్నాడని స్థానికులు ఆరోపించడంతో అతన్ని పోలీసులు జాదవ్పూర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై స్పందించిన ఎంపీ రూపా గంగూలీ తమ నివాసానికి సమీంలో, తన కొడుకు ప్రమాదానికి గురయ్యాడంటూ ట్వీట్ చేశారు. నా కొడుకును ప్రేమిస్తున్నాను . కానీ అదే సమయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని ట్వీట్ చేశారు. ఇందులో ఎలాంటి రాజకీయాలకు తావు లేదనీ, చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారని తెలిపారు. ఈ ట్వీట్ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్యాగ్ చేయడం గమనార్హం. My son has met with an accident near MY RESIDENCE. I called police to tke care of it with all legal implications No favours/ politics plz. I love my son & will tk cr of him BUT, LAW SHOULD TAKE ITS OWN COURSE. न मै घलत करती हूं, न मै सेहेती हू @narendramodi मै बिकाऊ नही हूँ — Roopa Ganguly (@RoopaSpeaks) August 15, 2019 -
కాంగ్రెస్ నేత, ఎంపీ శశి థరూర్పై అరెస్ట్ వారెంట్
సాక్షి, కోలకతా : కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్పై అరెస్ట్ వారెంట్జారీ అయింది. గత ఏడాది (2018, జులై) జరిగిన కార్యక్రమంలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో కోల్కతా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. 'హిందూ పాకిస్తాన్' అంటూ శశి థరూర్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని తిరువనంతపురానికి చెందిన న్యాయవాది సుమీత్ చౌదరి కోర్టును ఆశ్రయించారు. పిటిషన్ ను విచారించిన కోర్టు, థరూర్కు నోటీసులు జారీ చేసింది. కోర్టు సమన్లను ఖాతరు చేయకపోవడంతో, ఆయనపై అరెస్ట్ వారెంట్ ను జారీ చేస్తూ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ దీపాంజన్ సేన్ నిర్ణయం తీసుకున్నారు. తదుపరి విచారణను సెప్టెంబరు 24కి వాయిదా వేశారు. కోలకతాలో జరిగిన కార్యక్రమంలో థరూర్ చేసిన ప్రకటన వివాదానికి దారితీసింది. 2019 ఎన్నికల్లో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే, దేశాన్ని 'హిందూ పాకిస్తాన్'గా మారుస్తుందని శశి థరూర్ బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఇప్పుడున్న ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని రద్దు చేసి..కొత్త రాజ్యాంగాన్ని తీసుకొస్తుందని, ఫలితంగా ప్రజాస్వామ్యం మనుగడ సాగించడం అసాధ్యమని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు, అదే జరిగితే దేశంలో మైనారిటీలకు రక్షణ ఉండదని...అంతిమంగా సరికొత్త ‘హిందూ పాకిస్థాన్’గా దేశాన్ని మారుస్తారంటూ ఘాటుగా విమర్శించారు. థరూర్ చేసిన ఈ వ్యాఖ్యలపై ప్రధానంగా 'హిందూ పాకిస్తాన్' అని పేర్కొనడం అప్పట్లో తీవ్ర దుమారం రేగింది. దీనిపై మండిపడిన బీజేపీ శ్రేణులు కాంగ్రెస్ కార్యాలయంపై దాడి కూడా చేశాయి. అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడం తెలిసిందే. -
మెట్రో రైలు కింద దూకి వ్యక్తి ఆత్మహత్య
కోల్కత్తా: కదులుతున్న మెట్రో రైలు కిందకు దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్లోని డమ్డమ్ మెట్రో రైల్వే స్టేషన్లో శనివారం చోటుచేసుకుంది. రైలు పట్టాలపైకి దూకగానే ట్రైన్ ఆపి.. అతన్ని దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లామని, కానీ అతను అప్పటికే మృతి చెందినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఆత్మహత్యకు పాల్పడ్డ వ్యక్తిని ప్రకాశ్ షా (40)గా అధికారులు గుర్తించారు. కాగా అతని మృతికి కారణాలు తెలిసిరాలేదని మెట్రో సీపీఆర్ఓ ఇద్రాణి ముఖర్జీ తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి.. విచారణ చేపట్టామని వెల్లడించారు. కాగా వ్యక్తి ఆత్మహత్య కారణంగా ఆ మార్గంలో రెండు గంటల పాటు మెట్రో సేవలను నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. -
ఛీటింగ్ చేసి ఎన్నికల్లో గెలిచారు: దీదీ
కోల్కత్తా: అధికార దాహంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాలను కుట్రపూరితంగా కూల్చివేస్తోందని బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతాబెనర్జీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దీనికి నిదర్శనం కర్ణాటక రాజకీయ సంక్షోభమేనని అన్నారు. బెంగాల్లో కూడా టీఎంసీ నేతలను ప్రలోభాలకు గురిచేస్తూ.. బలవంతగా పార్టీలో చేర్చుకుంటున్నారని దీదీ ఆరోపించారు. ప్రశాంతంగా ఉన్న బెంగాల్లో మత సంఘర్షణ సృష్టించాలని ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. గత లోక్సభ ఎన్నికల్లో బెంగాల్ ప్రజలను ఈవీఎంలతో ఛీటింగ్ చేసి బీజేపీ గెలిచిందని అన్నారు. దేశ వ్యాప్తంగా ఈవీఎంలపై అనేక ఆరోపణలు వస్తున్నాయని, భవిష్యత్తులో జరిగే ఎన్నికలను బ్యాలెట్ పద్దతిన ఎన్నుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. దేశ వ్యాప్తంగా బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ.. రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోందని మమత విమర్శించారు. కాగా ఆదివారం బెంగాల్ రాజధాని కోల్కత్తాలో టీఎంసీ భారీ మెగా ర్యాలీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఈ ర్యాలీకి హాజరయ్యారు. కాగా ప్రతి ఏడాది జాలై 21న కోల్కత్తాలో టీఎంసీ మెగా ర్యాలీని ఏర్పాటు చేస్తోన్న విషయం తెలిసిందే. -
నటితో డ్రైవర్ అసభ్య ప్రవర్తన; అరెస్ట్
కోల్కతా: ప్రముఖ బెంగాల్ టీవీ సీరియల్ నటి స్వస్తికా దత్త పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉబర్ డ్రైవర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. సీరియల్ షూటింగ్కు వెళ్లడానికి బుధవారం ఉదయం స్వస్తికాదత్త ఉబెర్ క్యాబ్ను బుక్ చేశారు. కారులో షూటింగ్ స్పాట్కు వెళ్తుండగా మార్గమధ్యలో డ్రైవర్ బుకింగ్ను క్యాన్సిల్ చేసి, ఆమెను బయటికి లాగాలని ప్రయత్నించాడు. స్వస్తికా దత్త ప్రతిఘటించడంతో కారులోనే మరో చోటికి తీసుకెళ్లడానికి యత్నించి, ఫోన్లో తన ఫ్రెండ్స్ని కూడా రమ్మన్నాడు. దీంతో బెదిరిపోయిన నటి కారుదిగి గట్టిగా కేకలు వేయడంతో డ్రైవర్ కారుతో సహా పారిపోయాడు. ఇదంతా కేవలం అరగంట వ్యవధిలో జరిగిందని స్వస్తికా దత్త సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కారు నెంబర్, డ్రైవర్ పేరుతో సహా వివరాలను షేర్ చేశారు. దీంతో స్పందించిన పోలీసులు డ్రైవర్ని అరెస్ట్ చేశారు. -
మీ వివేకాన్ని పెంచుకోండి!
ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ కేవలం బెంగాల్కి పరిమితం అయిన వ్యక్తి కాదు. భారతీయ సాంస్కృతిక వికాసోద్యమానికి దారి చూపిన మార్గదర్శకుడు. సంకుచిత భావాలతో కుళ్ళి కంపు కొడుతున్న ఛాందస భావాలను కాదని భావోద్యమాలకి రాచబాట వేసిన సంఘ సంస్కర్త. గ్రాంధిక భాషకి బదులు వాడుక భాషని కొత్త పుంతలు తొక్కించి ప్రజల భాషకి పట్టం కట్టిన రచయిత. సామాజిక చైతన్యాన్ని కలిగించే అనేక రచనలు చేయడంతోపాటూ స్వయంగా అనేక గ్రంథాల్ని ముద్రించినవాడు. వితంతు పునర్వివాహాల కోసం నిరవధిక పోరాటం చేయడమే కాదు, ఏకంగా చట్టం కూడా చేయించేదాకా అలుపెరగని కృషి చేశారు. ఆంధ్రదేశం లోని మన కందుకూరి వీరేశలింగంతో మొదలుపెట్టి దేశంలోని అనేక ప్రాంతాలలో సాంస్కృతిక వికాసానికి దారి చూపిన మహానుభావుడు. విద్యా విధా నం మొదలుకొని వివాహాది విషయాల వరకూ ఆనాడే ఎంతో ప్రగతిశీలంగా ఆలోచించడమే కాదు, అనుకున్న దానిని ఆచరణలో పెట్టిన ఆదర్శవాది. అమిత్ షా యాత్రలో భాగంగా కోల్కతాలోని సిటీ కాలేజీ విద్యార్థులపై మతోన్మాదులు అమానుష దాడి చేయడమే కాక ఏకంగా కళాశాల ఆవరణ లోని విద్యాసాగరుడి విగ్రహాన్ని కూల్చ డం మతతత్వశక్తుల అవివేకానికి పరా కాష్ట. సిటీ కాలేజ్ చారిత్రక ప్రాముఖ్యం కలది. తూ.గో.జిల్లాలోని మా పిఠాపురానికి, బెంగాల్లోని కోల్కతా సిటీ కాలేజీకి అనుబంధం ఉంది. సిటీ కాలేజీ నిర్మాణానికి ఉదారంగా ముందుకొచ్చి స్పందించిన వ్యక్తిగా పిఠాపురం యువ రాజాని ఇప్పటికీ గుర్తుచేసుకుంటారు. అటువంటి మహోన్నత కళాశాలపై దాడికి దిగడం మతోన్మాదుల అజ్ఞానానికి చిహ్నం. గాంధీ, అంబేడ్కర్, లెనిన్, ఈశ్వర్చంద్ర విద్యాసాగర్.. ఈనాటికీ మతోన్మాదులను విగ్రహాలుగా సైతం భయ పెడుతున్నారంటే నాటి వాళ్ళ కృషి ఎంతటిదో అర్థం చేసుకోవాల్సిందే. విగ్రహాల్ని కూల్చడం కాదు, వివేకాన్ని పెంచుకోవడమొక్కటే విద్వేష శక్తులకి మిగిలున్న ఏకైక మార్గం. విభేదాలు ఎన్నున్నా ఈశ్వర్చంద్ర సాగర్ విగ్రహ కూల్చివేతను అభ్యుదయ శక్తులు, ఆలోచనాపరులంతా ఖండించాలి. మతోన్మాదుల ఆగ డాల్ని ప్రజాస్వామికవాదులంతా నిరసించాలి. ఇంక్విలాబ్ జిందాబాద్! – గౌరవ్ కృçష్ణ, పిఠాపురం కోల్కతా కాలేజీలో ధ్వంసమైన ఈశ్వర్చంద్ర విద్యాసాగర్ విగ్రహం -
హత్యకు దారితీసిన స్వలింగ సంపర్కం
కోల్కత్తా : స్వలింగ సంపర్కం ఓ పసి బాలుడి హత్యకు దారితీసింది. బాలుడి తండ్రి తనను పట్టించుకోవటం లేదన్న కోపంతో చిన్నారిని గొంతునులిమి చంపేశాడో యువకుడు. ఈ సంఘటన పశ్చిమ బెంగాల్లోని కాశీపూర్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. భాంగోర్లోని కాశీపూర్కు చెందిన సఫివుల్ మోలా అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన వ్యక్తితో స్వలింగ సంపర్కం కొనసాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో గత కొద్దిరోజుల నుంచి ఆ వ్యక్తి తనను పట్టించుకోవటం లేదని మోలా ఆగ్రహించాడు. ఆవేశంలో ఆ వ్యక్తి కుమారుడైన ఆరేళ్ల బాలుడ్ని గొంతు నులిమి చంపి, ఇంటికి దూరంగా పడవేశాడు. విషయం తెలుసుకుని, కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడి తల్లిని విచారించగా.. మోలాకు తన భర్తకు మధ్య ఉన్న సంబంధాన్ని ఆమె బయటపెట్టింది. అతడిపైన తనకు అనుమానం ఉన్నట్లు పోలీసులకు తెలిపింది. దీంతో మోలాను అదుపులోకి తీసుకుని, విచారించగా తనే ఈ హత్య చేసినట్లు మోలా ఒప్పుకున్నాడు. -
సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ దీదీ బరిలోకి
సాక్షి, కోలకతా : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, త్రిణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ ఎన్నికల సమరంలోకి దిగిపోయారు. శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా కోలకతాలో ప్రచార కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. కేంద్ర ఎన్నికల సంఘం ఇంకా ఎన్నికల తేదీలు ప్రకటించనప్పటికీ, తన పాత సాంప్రదాయాన్ని పాటిస్తూ, మార్చి 8న శ్రద్ధానంద పార్క్ నుంచి పాదయాత్ర (ర్యాలీ) ప్రారంభించారు. భారతీయ సమాజానికి మహిళలే వెన్నెముక అనీ మహిళల సాధికారతకు తమ ప్రభుత్వం కట్టుబడి వుందంటూ దీదీ ట్వీట్ చేశారు. ప్రపంచంలోని మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందజేశారు. కొత్త భారతదేశం, ఐక్య భారతదేశం బలమైన భారతదేశాన్ని సృష్టించడమే ఈ ర్యాలీ ఉద్దేశమని పార్టీ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. ఈ మేరకు కోలకతా వీధుల్లో పోస్టర్లు కూడా వెలిసాయి. 2014, 16 సంవత్సరాల్లో మార్చి 8వ తేదీనే దీదీ ఎన్నికల ప్రచార సంరేశాన్నిస్తారనీ, పార్టీ సీనియర్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. తేదీలు ప్రకటించిన తరువాత, పూర్తిస్థాయి ప్రచారం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. Women are the backbone of our society. They are our pride. On #IWD2019 I want to congratulate all the women around the world. Today I will participate in a march to mark the occasion in #Kolkata 1/3 pic.twitter.com/RufVP5Hq96 — Mamata Banerjee (@MamataOfficial) March 8, 2019 -
ఒక జననం : ఒక మరణం
కోలకతా: సృష్టికి ప్రతిసృష్టి చేసే బ్రహ్మ వైద్యుడు అని ప్రతీతి. ఈ అంశాన్ని మరోసారి నిరూపించిన ఒక వైద్యుడు...అనూహ్యంగా ప్రాణాలు కోల్పోవడం దిగ్భ్రాంతికి గురి చేసింది. నిర్జీవంగా పడివున్న అపుడే పుట్టిన నవజాత శిశువుకు ప్రాణంపోసిన వైద్యుడు బిభాస్ ఖుతియా(48) లేబర్ రూంలోనే కుప్పకూలిపోవడం, క్షణాల్లో ఊపిరి ఆగిపోవడం పలువురిని కలవరపర్చింది. పశ్చిమ బెంగాల్లోని ఈస్ట్మిడ్నాపూర్ జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. పురిటినొప్పులతో సోనాలి మాజి ఆరోగ్యం కేంద్రానికి వచ్చింది. దీంతో అక్కడే విధుల్లో ఉన్న డాక్టర్ బిభాస్ ఆమెకు ప్రసవం చేశారు. కానీ పుట్టిన బిడ్డలో చలనం లేకపోవడంతో తక్షణమే వైద్యం అందించి పాపకు ఊపిరి పోశారు. దీంతో కోలుకున్న శిశువు ఏడవడం మొదలు పెట్టడంతో వూపిరి పీల్చుకున్నారు. కానీ అంతలోనే తీవ్రమైన గుండెనొప్పితో బిభాస్ కుప్పకూలిపోయారు. వెంటనే నర్సు పరోమి బెరా ఇతర సిబ్బంది ఆయన్ను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన చనిపోయారని వైద్యులు ధృవీకరించారు. పటిండాలో పీహెచ్సీలో గత 15ఏళ్లుగా సేవలు అందిస్తున్నారు. డా. బిభాస్ ఖుతియా. ఆరోగ్యంకేంద్రంలో సిబ్బంది కొరతతో వున్న సందర్భంలో బిభాస్ 24 గంటలూ రోగులకు అందుబాటులో ఉంటూ, సేవలందించే వారని సిబ్బంది కన్నీటి పర్యంతమయ్యారు. గతంలోనే యాంజియో గ్రామ్ చేసుకోవాల్సిందిగా వైద్యులు సూచించినప్పటికీ ఆయన నిర్లక్ష్యం చేశారనీ, అదే ఆయన ప్రాణాలు తీసిందని వాపోయారు. మరోవైపు బిభాస్ అకాల మరణంపై జిల్లా వైద్యశాఖ ముఖ్య అధికారి నిటాయ్ చంద్ర మండల్ సంతాపం వ్యక్తం చేశారు. చాలా నిబద్ధతతో విధులను నిర్వహించేవారని గుర్తు చేసుకున్నారు. వృత్తిపట్ల ప్రేమ, నిబద్ధత ఉండటం ఎంత అవసరమో.. ఆరోగ్యంపై కూడా శ్రద్ధ అంతే ముఖ్యమని ఆయన మరణం నిరూపించిందని వ్యాఖ్యానించారు -
పశ్చిమ బెంగాల్లో డమ్డమ్లో పేలుడు కలకలం
-
కోల్కత్తాలో భారీ పేలుడు
కోల్కత్తా : పశ్చిమ బెంగాల్లోని డమ్ డమ్లో గాంధీ జయంతి నాడు భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ ఏడేళ్ల బాలుడు మృతి చెందగా, పది మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషయంగా ఉందని వైద్యులు తెలిపారు. డమ్డమ్ సమీపంలోని నగర్బజార్లో మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఉదయం భారీ శబ్ధంతో బాంబు పేలగానే దానిలోంచి గాజు పెంకులు, ఇనుప చువ్వలు దూసుకుని వచ్చాయని స్థానికులు చెపుతున్నారు. మార్కెట్ సమీపంలో రద్దీగా ఉండే ప్రాంతంలో దుండగులు పేలుడు పదార్ధాలు ఏర్పాటు చేశారు. ప్రమాదం జరిగినే వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, బాండ్ డిస్పోజల్ స్వాడ్ తనికీ నిర్వహించారు. ఘటనలో గాయపడ్డ వారిని దగ్గరలోని జీకే కౌర్ మెడికల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్కు చెందిన డమ్ డమ్ మున్సిపాలిటీ చైర్మన్ పంచూ రాయ్ పార్టీ కార్యాలయం సమీపంలో ఈ పేళుల్లు సంభవించాయి. దీంతో అధికార తృణమూల్ దీనిపై తీవ్రంగా మండిపడుతోంది. తమను రాజకీయంగా ఎదుర్కొలేకనే గాంధీ జయంతి నాడు రాష్ట్రంలో శాంతి, భద్రతలకు విఘాతం కలిగించాలిన బీజేపీ ఈ చర్యకు పాల్పడిందని టీఎంసీ ఆరోపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల భద్రతను గాలికొదిలేసిందని వామపక్షాలు ఆరోపిస్తున్నాయి. తమకు లండన్ లాంటి నగరం అవసరంలేదని.. బెంగాల్లోనే భద్రత కల్పిస్తే చాలని సీపీఎం నేతలు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. -
యూనిటెక్ ఆస్తుల వేలానికి సుప్రీం ఆదేశాలు
సాక్షి, న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ సంస్థల అక్రమాలపై కొరడా ఝళింపించేలా దేశ అత్యున్నత న్యాయస్థానం మంగళవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ యూనిటెక్పై సుప్రీం కోర్టు మరోసారి ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. యూనిటెక్ డైరెక్టర్ల వ్యక్తిగత ఆస్తులను వేలం వేయాలని ఆదేశించింది. మాజీ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఎన్ డింగ్రా నేతృత్వంలోని త్రిసభ్య కమిటీకి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్వీల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్లతో కూడిన సుప్రీం ధర్మాసనం ఈ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కొనుగోలుదారులను యూనిటెక్ మోసగించింది. కనుక కొనుగోలుదారుల సొమ్మును తిరిగి చెల్లించాలంటే ఆ సంస్థ ఆస్తులను వేలం వేయాల్సిందేనని గతంలోనే స్పష్టం చేసిన సుప్రీం తాజాగా ఆదేశాలిచ్చింది. సంస్థకు చెందిన కోలకతా ఆస్తులను వేలం/విక్రయించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. తద్వారా రూ.25కోట్లను కొనుగోలుదారుల డబ్బును తిరిగి చెల్లిచాలని కోరింది. అలాగే ఈ ప్రక్రియంలో సహకారం అందించేందుకు మరో ఇద్దరు వ్యక్తులను నియమించుకునేలా సుప్రీంకోర్టు సహాయకుడు ఎమికస్ క్యూరీ పవన్శ్రీ అగర్వాల్కు అనుతినిచ్చింది. అనంతరం తదుపరి విచారణను సెప్టెంబరు 11కి వాయిదా వేసింది. సంస్థ డైరెకర్ట వ్యక్తిగత ఆస్తులతోపాటు ఇతర ఆస్తుల వివరాలను అందించాలని, మే 11 నాటికి 100 కోట్ల రూపాయల మేరకు డిపాజిట్ చేయకపోతే వారి ఆస్తులను వేలం వేయాలని సుప్రీం యూనిటెక్ సంస్థను గతంలో హెచ్చరించింది. అయితే యూనిటెక్ సమర్పించిన నివేదికపై అసంతృప్తిని వ్యక్తంచేసింది. ఈ నేపథ్యంలోనే యూనిటెక్కు చెందిన ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా, వారణాసి, తమిళనాడులోని శ్రీపెరంబుదుర్లోని ఆస్తులను విక్రయించి, ఆ సొమ్మును గృహ కొనుగోలుదారులకు డబ్బు తిరిగి చెల్లించాలని జూలై 5న కమిటీని కోరింది. కాగా కొనుగోలుదారుల నుంచి డబ్బులు తీసుకుని, వారికి సరైన సమయంలో ఇళ్లను నిర్మించి ఇవ్వలేదన్న ఆరోపణలపై యూనిటెక్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే ఈ కేసులో యూనిటెక్ ఎండీ సంజయ్ చంద్ర, అతని సోదరుడు మరో డైరెక్టర్ అజయ్ చంద్ర గత ఏడాది కాలంగా జైలులో ఉన్నారు. -
గన్నుతో భర్త చెవులు కాల్చేసి..
కోల్కతా : భర్త తనను వదిలి ఇంటి నుంచి తరుచూ పారిపోతున్నాడనే కోపంతో గన్నుతో అతని రెండు చెవులను కాల్చేసిందో భార్య. ఈ ఘటన మంగళవారం పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కోల్కతాకు సమీపంలోని నర్కెల్గంగకు చెందిన తన్వీర్(20) రెండు సంవత్సరాల క్రితం తనకంటే వయస్సులో 20 సంవత్సరాలు పెద్దదైన ముంతాజ్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైన కొద్ది నెలలకే భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో ముంతాజ్ తన్వీర్ను తరుచూ చిత్రహింసలకు గురిచేసేది. ముంతాజ్ పెట్టే బాధలు భరించలేక అతను ఇంటి నుంచి పారిపోయిన ప్రతిసారి వెనక్కు పట్టుకువచ్చి చిత్రహింసలు పెట్టేది. తమ కొడుకును విడిచి పెట్టాల్సిందిగా తన్వీర్ తల్లిదండ్రులు ఆమెను బ్రతిమాలినా వినలేదు. భర్త ఇళ్లు అమ్మగా వచ్చిన డబ్బులు సైతం తీసుకుని అతన్ని ఇంటికి పంపించలేదు. తన్వీర్ గత కొద్దిరోజులుగా ముంతాజ్ ఇంట్లోనే ఉంటున్నాడు. అతన్ని సొంత ఊరికి పోనివ్వకుండా, తల్లిని కలవనీయకుండా ఆంక్షలు విధించింది. కొద్దిరోజుల క్రితం అతడు ఆ ఇంటి నుంచి మల్లిక్పుర్కు పారిపోయినా.. తన మనషుల సహాయంతో వెనక్కి రప్పించిన ముంతాజ్, ఆమె చెల్లెళ్లు అతన్ని తీవ్రంగా హింసించారు. మంగళవారం రాత్రి ముంతాజ్ గన్నుతో తన్వీర్ రెండు చెవులను కాల్చేసింది. దీంతో తన్వీర్ చనిపోయాడని అక్కాచెల్లెళ్లు భావించారు. అయితే ప్రాణాలతో బయటపడ్డ తన్వీర్ అక్కడినుంచి తప్పించుకుని దగ్గరలోని ఆస్పత్రిలో చేరాడు. విషయం తెలుసుకున్న అతని తల్లిదండ్రులు, బంధువులు ఆస్పత్రి ముందు ఆందోళన చేపట్టారు. తన్వీర్ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న ముంతాజ్, ఆమె చెల్లెళ్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
యాసిడ్ దాడి బాధితురాలి పోరాటం
కోల్కతా: ఆమె నాలుగేళ్ల పోరాటం ఫలించింది. తనపై యాసిడ్తో దాడిని దుర్మార్గుడిని కటకటాల వెనక్కునెట్టింది. పశ్చిమ బెంగాల్లో నాలుగేళ్ల క్రితం చోటుచేసుకున్న యాసిడ్ దాడి కేసులో నిందితుడిని పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. సంచయిత యాదవ్(25) బెంగాల్లోని డుండుంలోని సెత్బగాన్ ప్రాంతంలో 2014లో సోమెన్ సాహా అనే యువకుడి చేతిలో యాసిడ్ దాడికి గురైంది. తన తల్లితో కలిసి రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న ఆమెపై యాసిడ్ పోశాడు. తన ప్రేమను నిరాకరించిందన్న అక్కసుతో తన తల్లిముందే సంచయితపై సాహా ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. నాలుగేళ్ల పోరాటం తర్వాత నిందితుడిని అరెస్ట్ చేయించగలిగింది. పూర్తిగా కాలిపోయిన ముఖంతో మానసికంగా ఎంతో కుంగిపోయానని, తన తల్లి సహాయంతో తనకు జరిగిన అన్యాయంపై పోరాటం చేశానని సంచయిత తెలిపింది. నాలుగేళ్లనుంచి పోలీస్స్టేషన్ చుట్టూ తిరిగినా ఎవరు తమను పట్టించుకోలేదని, తనకు జరిగిన అన్యాయం మరే ఆడబిడ్డకు జరగకూడదన్న ఉద్దేశంతో పోరాటం చేశానన్నారు. యాసిడ్ దాడి బాధితుల తరుఫున పోరాడే ఎన్జీవోల సహాయంతో రాష్ట్ర మానవహక్కుల కమిషన్ను కలిసి 2017లో బెంగాల్ హైకోర్టును ఆశ్రయించినట్టు వెల్లడించింది. కోర్టు ఆదేశాల మేరకు డండం పోలీసులు ఆదివారం సోనార్పూర్లో నిందితుడిని అరెస్ట్ చేశారు. పోలీస్స్టేషన్లో నిందితుడిని చూసిన సంచయిత పట్టరాని కోపంతో అతడి చెంప చెళ్లుమనిపించింది. నాలుగేళ్లుగా ఎంతో క్షోభ అనుభవించానని, తన జీవితాన్ని నాశనం చేసిన సాహా మాత్రం స్వేచ్ఛగా బయట తిరుగుతుండటంతో కోపాన్ని ఆపులేకపోయినట్టు ఆమె వివరించింది. తన పోరాటం ఆగిపోలేదని, నిందితుడికి శిక్ష పడేవరకు తన పోరాటం ఆపనని స్పష్టం చేసింది. -
గెలుస్తామనుకోలేదు: క్రిస్ వోక్స్
కోల్ కతా: బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో అసలు గెలుస్తామని ఊహించలేదని కోల్ కతా నైట్ రైడర్స్ బౌలర్ క్రిస్ వోక్స్ అభిప్రాయపడ్డాడు. "స్వల్ప లక్ష్యాన్ని ముందుంచిన మేము బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న బెంగళూరుతో గెలవడం కష్టంగా భావించామన్నాడు'. అయితే కెప్టెన్ గంభీర్ ఇచ్చిన స్పూర్తి మాలోని పోరాట పటిమను పెంచిందన్నాడు. ముందుగా వేసిన బౌలర్లు త్వరగా వికెట్లు తీయడంతో తర్వాతి బౌలర్లకు సులభమైందని తెలిపాడు. గేల్, కోహ్లీ, డివిలియర్స్ అవుట్ అవ్వడంతో మ్యాచ్ పై ఆశలు కలిగాయని వోక్స్ వ్యాఖ్యానించాడు.ఈ మ్యాచ్ లో వోక్స్ 2-0-6-3 తో అద్భుత ప్రదర్శన కనబర్చాడు. మిగతా బౌలర్లు ఉమేశ్, కౌల్టర్ నైల్ బంతిని స్వింగ్ చేశారని, నేను మాత్రం సరైన ప్రాంతాల్లో బంతులు విసిరానని పేర్కొన్నాడు. వోక్స్ గేల్, బిన్నీ, శ్యాముల్ బద్రీలను పెవిలియన్ కు చేర్చాడు. కౌల్టర్ నైల్, గ్రాండ్ హోమ్ లకు మూడేసి వికెట్లు దక్కగా ఉమేశ్ కు ఒక వికెట్ దక్కింది. ఆదివారం కోల్ కతా తో బెంగళూరు 82 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. కోల్ కతాను 131 పరుగులకు కుప్పకూల్చిన బెంగళూరు ఐపీఎల్ లోనే అత్యంత చెత్త ప్రదర్శన కనిబర్చింది. కోహ్లీ, గేల్, డివిలియర్స్, జాదవ్ లతో బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న బెంగళూరు 49 పరుగులకు ఆల్ అవుట్ అయి ఐపీఎల్ చరిత్రలో చెత్త రికార్డును నమోదు చేసుకుంది. -
బెంగళూరుకు దారుణ పరాభవం
కోల్ కతా: ఐపీఎల్ చరిత్రలోనే అత్యల్ప స్కోరు నమోదైంది. ఐపీఎల్ లో భాగంగా కోల్ కతా నైట్ రైడర్స్ తో ఇక్కడ జరిగిన మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు దారుణ పరాభవం ఎదురైంది. 9.4 ఓవర్లలో 49 పరుగులు చేసి ఐపీఎల్ చరిత్రలోనే తక్కువ స్కోరు రికార్డును ఆర్సీబీ మూటకట్టుకుంది. గతేడాది అప్రతిహత విజయాలతో ఫైనల్స్కు దూసుకుపోయిన ఆర్సీబీ ఇక్కడ కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్లో 82 పరుగుల తేడాతో ఘోర పరాభవాన్ని చవిచూసింది. 132 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బ్యాటింగ్కు దిగిన కోహ్లీ సేన కేవలం 9.4 ఓవర్లలోనే 49 పరుగులు చేసి ఆలౌటైంది. అంతకుముందు టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కోల్ కతా 19.3 ఓవర్లలో 131 పరుగులకు ఆలౌటైంది. సంచలన ఓపెనర్ సునీల్ నరైన్ మరోసారి విధ్వంసం సృష్టించాడు. 17 బంతుల్లో 6 ఫోర్లు ఒక సిక్సర్ తో 34 పరుగులు చేశాడు. నరైన్ దూకుడుతో కేకేఆర్ 5.4 ఓవర్లలోనే 65 పరగులు చేసింది. ఆ తర్వాత ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. గంభీర్(14), ఉతప్ప(11), మనీశ్ పాండే(15), యూసఫ్ పఠాన్(8) స్వల్పస్కోర్లకే పరిమితమయ్యారు. చివర్లో వోక్స్ (18) చేయడంతో 131 పరుగులకే ఆలౌటై ఆర్సీబీ ముందు 132 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. 132 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ కోహ్లీ తొలి బంతికే డకౌట్ అయ్యాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్లో ఏ ఒక్క బ్యాట్స్మన్ కూడా రెండంకెల మార్కు స్కోరు చేయలేకపోవడంతో ఐపీఎల్ చరిత్రలోనే అతి తక్కువ స్కోరుకు పరిమితమైంది. 17 బంతులాడిన క్రిస్ గేల్ 7 పరుగులు చేశాడు. మన్ దీప్ సింగ్(1), డివిలియర్స్ (8), స్టూవర్ట్ బిన్ని(8) విఫలమయ్యారు. ఆర్సీబీలో కేదార్ జాదవ్(9) దే అత్యధిక స్కోరు. కోల్టర్ నైల్, వోక్స్, గ్రాండ్ హోమ్ తలో 3 వికెట్లు తీసి ఆర్సీబీ పతనాన్ని శాసించారు. -
కుప్పకూలిన కోల్ కతా నైట్ రైడర్స్
► నరైన మినహా అందరూ విఫలం ► బెంగళూరు లక్ష్యం 132 కోల్ కతా: రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్ లో బెంగళూరు స్పిన్ మాయాజాలానికి కోల్ కతా నైట్ రైడర్స్ కుప్పకూలింది. ఓపెనర్ సునీల్ నరైన్ మినహా మిగతా బ్యాట్సమెన్స్ తక్కువ స్కోర్ల కే పేవిలియన్ చేరడంతో కోల్ కతా 19.3 ఓవర్లకు 131 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బెంగళూరు తొలి ఓవర్లలో పరుగులు ఇచ్చుకున్న తర్వాతి ఓవర్లో కట్టడి చేసింది. తొలి ఓవర్లోనే వరుస బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్ తో విరుచుకుపడ్డ సునీల్ నరైన్, 6 ఫోర్లు ఒక సిక్సర్ తో 34 పరుగులు చేశాడు. గౌతమ్ గంభీర్ ను తైమల్ మిల్స్ అవుట్ చేయగా, బిన్ని నరైన్ అవుట్ చేశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ఏ ఒక్క బ్యాట్స్ మెన్ క్రీజులో నిలదొక్కుకోలేక పోయాడు. బెంగళూరు స్పిన్నర్ యజువేంద్ర చాహాల్ కు మూడు వికెట్లు, మరో స్పిన్నర్ పవన్ నెగికి 2 వికెట్లు, ఎస్ బద్రీకి ఒక వికెట్ దక్కింది. ఇక పేస్ బౌలర్స్ లో మిల్స్ రెండు వికెట్లు, బిన్ని, ఎస్ అరవింద్ లకు చెరో వికెట్ దక్కాయి. -
రిపబ్లిక్ డే రిహార్సల్స్లో విషాదం
కోలకతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో రిపబ్లిక్ డే రిహార్సిల్ లో అపశృతి చోటు చేసుకుంది. కోలకతాలో రిపబ్లిక్ డే పరేడ్ ఉత్సవ ఏర్పాట్లను పర్యవేక్షిస్తుండగా చోటు చేసుకున్న ప్రమాదంలో ఓ ఎయిర్ ఫోర్స్ అధికారి మరణించడం విషాదాన్ని నింపింది. రిపబ్లికే డే సందర్భంగా జరుగుతున్న రిహార్సల్స్ లో ప్రమాదవశాత్తూ ఓ కారు ఢీకొని విమానయాన అధికారి అభిమన్యు గౌడ్ ప్రాణాలు కోల్పోయారు. జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా జరుగుతున్న రిహార్సల్స్ లో గుర్తు తెలియని ఓ వ్యక్తి ఆడీ కారుతో ఢీకొట్టడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. సంఘటన అనంతరం కారును వదిలి డ్రైవర్ పరారయ్యాడు. కారును సీజ్ చేసిన అధికారులు అధికారులు దర్యాప్తు చేపట్టారు. -
కోల్కతాలో మరో గ్యాంగ్ రేప్
కోల్కతా: క్రైస్తవ సన్యాసిని గ్యాంగ్ రేప్ ఉదంతం వివాదం ఇంకా చల్లారకముందే కోలకతాలో మరో గ్యాంగ్రేప్ కేసు వెలుగులోకి వచ్చింది. సిటీలోని లేక్ టౌన్ ప్రాంతంలో మార్చి 9న ఓ 28 ఏళ్ల మహిళపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాదు ఆ దృశ్యాలను వీడియోతీశారు. విషయం ఎవరికైనా చెబితే, సోషల్ మీడియాలో వీడియో అప్ లోడ్ చేస్తామని బాధితురాలిని బెదిరించారని పోలీసులు తెలిపారు. బాధితురాలు, అతని సోదరుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని నిందితులకోసం గాలిస్తున్నామని వారు తెలిపారు.