laborers
-
చి‘వరి’కి పొరుగు కూలీలే దిక్కు
సాక్షి, పెద్దపల్లి: యాసంగి సాగు పనులు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి. పల్లెల్లో కూలీల కొరత అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో రైతులు పొరుగు రాష్ట్రాలకు వెళ్లి వలస కూలీలను తీసుకొస్తున్నారు. స్థానిక కూలీలకు రెట్టింపు కూలి చెల్లిస్తేనే వ్యవసాయ పనులు సాగుతున్నాయి. ప్రస్తుతం పెరిగిన డిమాండ్ మేరకు స్థానిక మహిళలకు రూ.500 నుంచి రూ.600, పురుషులకు రూ.1,000 వరకు కూలి చెల్లిస్తున్నారు. గతంతో పోల్చితే రెట్టింపు కూలి చెల్లించాల్సి రావడంతో అన్నదాతలపై పెట్టుబడి పెరుగుతోంది.పొలాలు దూరంగా ఉండడంతో.. ఉచితంగా రవాణా సౌకర్యం కల్పించడం, అదనంగా అల్పాహారం, టీ సమకూర్చడం రైతులపై ఆర్థిక భారానికి కారణమవుతోంది. మరికొన్నిచోట్ల పురుషులకు ఇతర ఖర్చుల కింద రూ.100 చెల్లిస్తున్నారు. రెండేళ్ల క్రితం ఎకరాలో వరి నాట్లు వేసేందుకు రూ.4,000 – రూ.4,500 వరకు ఖర్చు ఉండేది. ప్రస్తుతం రూ.6 వేలకు పైగా అవుతోంది. అదికూడా కేవలం కూలీలకు చెల్లించాల్సి వస్తోందని అన్నదాతలు వాపోతున్నారు. స్థానిక మహిళలకు రూ.5,500 చొప్పున.. ఎకరాలో వరి నాట్లు వేసేందుకు గంపగుత్తకు ఇస్తున్నా.. అదనంగా నారు పంచేందుకు రూ.1,000తో పురుషులను ఏర్పాటు చేయాల్సి వస్తోందని రైతులు అంటున్నారు. అదే వలస కూలీలకు.. వరి నాట్ల బాధ్యత గంపగుత్తకు ఇస్తే.. ఎకరాకు రూ.5,500తోనే మొత్తం పనులు చూసుకుంటున్నారు. దీంతో అదనపు భారం తగ్గడంతోపాటు, తక్కువ సమయంలోనే నాట్లు పూర్తవుతున్నాయి. ఫలితంగా రైతులు పక్కరాష్ట్రాల కూలీల వైపే మొగ్గు చూపుతున్నారు.యంత్రాలు, వలస కూలీలే ఆధారం..కూలీల కొరతతో రైతులు వరినాట్లు వేసేందుకు ఇబ్బంది పడుతున్నారు. దీనిని అధిగమించేందుకు అన్నదాతలు కొన్నేళ్లుగా వలస కూలీలు, యంత్రాలపై ఆధారపడుతున్నారు. యంత్రాల కొరతతోపాటు కొన్ని నేలల్లో నాట్లు వేసే పరిస్థితి లేక.. మనుషులతో నాట్లు వేయిస్తే అధిక దిగుబడి వస్తుందని రైతులు వలస కూలీల కోసం ఎదురు చూస్తున్నారు. కోల్కతా, మహారాష్ట్రకు చెందిన గడ్చిరోలి, చంద్రాపూర్, పశ్చిమ బెంగాల్, బిహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి కార్మికులు వరి నాట్లు వేసేందుకు జిల్లాకు వలస వస్తున్నారు. కొంతమంది స్థానికులు ఆయా ప్రాంతాలకు చెందిన వలస కార్మికులను గ్రామాలకు తీసుకొచ్చి ఆశ్రయం కల్పిస్తున్నారు. వారితో ఎకరాకు ఒక ధరను ఒప్పందం చేసుకొని.. రైతుల నుంచి ఎక్కువ మొత్తం వసూలు చేసుకుని వరి నాట్లు వేయిస్తున్నారు.వలస కూలీలకు డిమాండ్జిల్లాలో ఈ యాసంగిలో 2,04,433 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తుండగా, 1,91,351 ఎకరాల్లో వరి సాగు చేసే అవకాశం ఉందని అధికారులు అంచనా సిద్ధం చేశారు. వలస కూలీల గ్రూపులుగా వచ్చి తక్కువ సమయంలోనే ఎక్కువ పని చేస్తుండటంతో డిమాండ్ ఎక్కువగా ఉంది. నాట్లు వేసేందుకు ఎకరాకు రూ.5,000 నుంచి రూ.5,500 వసూలు చేస్తున్నారు. డిమాండ్ అధికంగా ఉన్న గ్రామాల్లో రూ.6 వేల వరకు తీసుకుంటున్నారు. డిమాండ్ను బట్టి ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క తేదీ ఇస్తూ బుక్ చేసుకొని వరి నాట్లు వేస్తున్నారు. వీరి రాకతో కూలీల కొరత తీరుతోందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.రోజూ రూ.2 వేలు వస్తాయి పొద్దున్నుంచి సాయంత్రం వరకు నాలుగు ఎకరాల్లో వరి నాట్లు వేస్తాం. నాకు రోజూ రూ.2 వేల కూలి గిట్టుబాటవుతుంది. ప్రతీ సీజన్లో రెండునెలలు ఇక్కడే మాకు పనులు దొరకుతాయి. రైతులు బాగా చూసుకుంటున్నారు.– బబుల్, కూలీ, కోల్కత్తాపది రోజులైంది వచ్చి..నేను కోల్కత్తా నుంచి వచ్చి పదిరోజులైంది. తెల్లారగానే పంట పొలాల్లోకి వెళ్తాం. రాత్రి వరకూ నాట్లు వేస్తాం. అందరం కలసికట్టుగానే ఉంటాం. ఇక్కడి వారికంటే మంచిగా నాట్లు వేస్తాం. మా రాష్ట్రంలో పనులు లేవు. –మంగళ్, కూలీ, కోల్కత్తామంది కూలీలను తీసుకొస్తా.. యాసంగి, వానాకాలంలో వరినాట్ల కోసం ఏటా పశ్చిమబెంగాల్, కోల్కత్తా నుంచి సుమారు 560 మందికి కూలీలను తీసుకొస్తా. రైతులకు ఎదురవుతున్న కూలీల కొరతను అధిగమించేందుకు ఎనిమిదేళ్లుగా ఏటా ఇలాగే చేస్తున్నా.– కసిరెడ్డి మల్లారెడ్డి, ఏజెంట్, గుండ్లపల్లి -
వ్యవసాయ కూలీలతో ముచ్చటించిన మంత్రి పొంగులేటి
-
మహిళా కూలీలకు నోటీసులు
రామచంద్రపురం రూరల్ : వ్యవసాయ కూలీలకు అందులోనూ మహిళలకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ లీగల్ నోటీసులు పంపించారు. ఈ అంశం రామచంద్రపురం నియోజకవర్గంలో తీవ్ర చర్చనీయాంశమైంది. రోజువారీ కూలిపని చేసుకునే మహిళలకు మంత్రి నోటీసులు పంపడంపై ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇది పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా ఉందని.. మంత్రి చేసిన పని సరైంది కాదని వారంటున్నారు. వివరాలివీ..డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలోని తాళ్లపొలెం గ్రామ సర్పంచ్ కట్టా గోవిందుకు, ఆయన ఆడపడుచులకు కొంతకాలంగా 2.40 ఎకరాల పంట భూమి విషయమై కోర్టులో వివాదం నడుస్తోంది. కోర్టులో వివాదం సాగుతున్నప్పటికీ సర్పంచ్ కట్టా గోవిందు స్వాధీనంలోనే భూమి ఉంది. ఆయనే పంటలు పండించుకుంటున్నారు. అదే భూమిలో కొంతభాగం ఇటీవల మంత్రి అనుచరుడు దొంగల శ్రీధర్, అతని భార్య దొంగల సునీత పేరున రిజిస్టర్ అయ్యింది. ఇటీవల సర్పంచ్ గోవిందు పంట కోసుకోగా దానిపై ద్రాక్షారామ పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ కేసులో కట్టా గోవిందు, అతని సోదరి జానకమ్మ, మేడిశెట్టి ఇజ్రాయేలుతో పాటు 8 మంది వ్యవసాయ కూలీలు అందులోనూ మహిళలపై అక్రమంగా పంట కోసుకుపోయారని ఒక కేసు నమోదైంది. దీనిపై గతనెల 24న రామచంద్రపురం తహసీల్దార్ కార్యాలయం వద్ద మీడియా సమక్షంలో అక్రమ కేసులు ఎత్తివేయాలని బాధితులు డిమాండ్ చేశారు. ఎవరైతే పోలీసు కేసులో ఉన్నారో అదే వ్యవసాయ కూలీలకు మంత్రి సుభాష్ లీగల్ నోటీసులు పంపారు. వారు మీడియాతో మాట్లాడటంవల్ల తన పరువుకు భంగం కలిగిందని.. వారిపై సివిల్, క్రిమినల్ చర్యలు చేపడతామంటూ ఇచ్చిన ఆ నోటీసులను చూసి కూలీలు లబోదిబోమంటున్నారు. తమను ఇబ్బంది పెట్టవద్దని మంత్రి సుభాష్ను వారు కోరుతున్నారు. -
కష్టజీవులను కబళించిన మృత్యుశకటం.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
గార్లదిన్నె: వారంతా వ్యవసాయ కూలీలు.. రెక్కాడితేగానీ డొక్కాడని నిరుపేదలు. రోజూ మాదిరిగానే ఉదయాన్నే పనులకు వెళ్లారు. పనులు ముగించుకుని ఆటోలో ఇంటికి వెళ్తుండగా ఆర్టీసీ బస్సు రూపంలో మృత్యుశకటం కబళించింది. ఈ ఘటనలో ఎనిమిది మంది దుర్మరణం చెందగా.. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతపురం జిల్లా గార్లదిన్నెకు సమీపంలోని 44వ నంబరు జాతీయ రహదారిపై శనివారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామ ఎస్సీ కాలనీకి చెందిన 12 మంది వ్యవసాయ కూలీలు గార్లదిన్నె మండలం తిమ్మంపేట వద్ద అరటి తోటలో ఎరువు వేసే పనికోసం ఉదయమే ఆటోలో వచ్చారు. అక్కడ పని ముగించుకుని మధ్యాహ్నం ఇంటికి తిరుగు పయనమయ్యారు. తలగాచిపల్లి క్రాస్ వద్ద ఆటో గార్లదిన్నె వైపునకు మలుపు తీసుకుంటుండగా.. అదే సమయంలో అనంతపురం నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలపెద్దయ్య అలియాస్ తాతయ్య (55), చిన్ననాగమ్మ (48) రామాంజినమ్మ (47), పెద్ద నాగమ్మ (60) అక్కడికక్కడే మృతిచెందారు. మిగిలిన వారికి తీవ్ర గాయాలయ్యాయి. ఆటోలో నుంచి రోడ్డు మీద పడి తీవ్రగాయాలతో హాహాకారాలు, ఆర్తనాదాలు చేస్తున్న కూలీలను స్థానికులు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు.ఎస్ఐ గౌస్ మహమ్మద్ బాషా తన సిబ్బందితో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108 వాహనాల్లో అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చిన్ననాగన్న (55), జయరాముడు (48), కొండమ్మ (50), ఈశ్వరయ్య మృతిచెందారు. లక్ష్మీదేవి, పెద్దులమ్మ, రామాంజినమ్మ, గంగాధర్, ఆటో డ్రైవర్ నీలకంఠ తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు. మృతుల్లో చిన్ననాగన్న–చిన్ననాగమ్మ, ఈశ్వరయ్య–కొండమ్మ దంపతులు.ఒకేరోజు ఎనిమిది మంది మృతిచెందడం, ఐదుగురు గాయపడడంతో ఎల్లుట్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అనంతపురం ప్రభుత్వాస్పత్రి వద్ద బాధిత కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఈ ప్రమాదంపై గార్లదిన్నె పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ జగదీష్, అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేశ్వర్లు తదితరులు పరిశీలించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లించనున్నట్లు కలెక్టర్ వినోద్కుమార్ తెలిపారు.మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి:వైఎస్ జగన్అనంతపురం జిల్లాలో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గార్లదిన్నె మండలం తలగాచిపల్లె వద్ద ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఎనిమిది మంది మరణించారు. వీరంతా కూలి పనులకు వెళ్లొస్తూ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వారి కుటుంబాలకు వైఎస్ జగన్ ప్రగాఢ సంతాపం తెలియజేశారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఉదారంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని.. వారికి అవసరమైన సాయం అందజేయాలని కోరారు. -
ఉసురు తీసిన ముసురు
చేతిలో కొడవలి.. నెత్తిన కండువా.. ముఖంలో ఆందోళనతో 9 మంది కూలీలు ఏ చేలోనైనా చిన్న పని దొరుకుతుందేమోనన్న ఆశతో సోమవారం కృష్ణా జిల్లా చోడవరం–పెనమలూరు రోడ్డు పక్కనున్న పొలాల వైపు ఆశగా చూస్తూ వెళ్తున్నారు. ఎటు చూసినా వర్షాలు, వరదలకు దెబ్బ తిన్న పొలాలే కనిపిస్తున్నాయి. రైతే దెబ్బ తిన్నాక కూలీలకు పనిచ్చేదెవరు? ఆ కూలీల కుటుంబాల కడుపు నింపేదెవరు? ఆ ఆవేదనే వారి మాటల్లో ప్రతిధ్వనించింది. పది రోజులుగా పని లేదని, ఇంటిల్లిపాదీ ఆకలితో ఆలమటిస్తున్నామని వారు ‘సాక్షి’ ప్రతినిధి వద్ద బోరుమన్నారు. ఎడతెరిపిలేని వర్షాలు ఉపాధిని దెబ్బతీశాయని, ప్రభుత్వమూ ఆదుకోవడంలేదని, ఎన్నెన్నో అవస్థలు పడుతున్నామని వివరించారు. దాదాపు ఐదు వేల జనాభా కలిగిన చోడవరం గ్రామంలో 750 మంది వ్యవసాయ కూలీలు, 60 మంది భవన నిర్మాణ కార్మికులు పనుల్లేక, చేతిలో డబ్బు లేక ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. వీరే కాదు.. రాష్ట్రంలో ఎడతెరిపిలేని వర్షాలు, వరదలకు లక్షలాది బడుగు జీవులు బతుకుదెరువు కోల్పోయారు. పనుల్లేక ఇంటికే పరిమితమైన వ్యవసాయ కూలీలు.. ఇసుక లేక, వర్షాలతో భవన నిర్మాణ కార్మికుల అవస్థలు.. మగ్గం గుంటల్లోకి నీరు చేరి నేతన్నల అగచాట్లు.. తాటి చెట్లు తడిసిపోయి దెబ్బతిన్న గీత కార్మికులు.. పల్లె కన్నీరు పెడుతున్న తీరుపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్ ఇది..పది లక్షల మందికి పనుల్లేవువిజయవాడలో వరదలతోపాటు గుంటూరు, బాపట్ల, ఎనీ్టఆర్, కృష్ణా, ఏలూరు, పశి్చమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో భారీ వర్షాలు వ్యవసాయ కార్మికుల ఉపాధిని తీవ్రంగా దెబ్బతీశాయి. వరి, అరటి, మొక్కజొన్న, చెరకు, ప్రత్తి, మిర్చి, పసుపు, కంద పంటలు, ఆక్వా కల్చర్ç పనులపై ఆధారపడిన లక్షలాది వ్యవసాయ కార్మికులు రోజువారీ పనులను కోల్పోయారు. రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 1.10 కోట్ల మంది వ్యవసాయ కార్మికులున్నారు. వారిలో 10 లక్షల మందికిపైగా కార్మికులు వర్షాల వల్ల పనుల్లేక పస్తులుంటున్నారు. రోజూ ఇంటిల్లిపాదీ పనిచేస్తే కానీ గడవని ఈ కుటుంబాల్లో ఇప్పుడు ఒక్కరికి కూడ పని దొరకడంలేదు. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ కూలీల ఉపాధి దెబ్బతింది. పది రోజులుగా పనుల్లేక అవస్థలు పడుతున్న ప్రతి కుటుంబానికి తక్షణమే రూ. 10 వేలు సాయం అందించాలని, అన్ని గ్రామాల్లో ఉపాధి హామీ పనులు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గీత వృత్తికి చేటురాష్ట్రంలో అధికారిక లెక్కల ప్రకారం 2 లక్షలకుపైగా కుటుంబాలు కల్లు గీత వృత్తిపై ఆధారపడ్డాయి. పలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాలకు తడిసిపోయిన తాటి చెట్లు ఎక్కేందుకు వీలు కాకపోవడంతో గీత వృత్తి నిలిచిపోయింది. వేలాది గీత కార్మికులు ఉపాధి కోల్పోయారు. వీరందరినీ ప్రభుత్వమే ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుత్తిగ నరసింహామూర్తి డిమాండ్ చేశారు.భవన నిర్మాణ రంగం కుదేలుకూటమి ప్రభుత్వం వచ్చాక ఉచిత ఇసుక విధానం అస్తవ్యస్థంగా మారడంతో భవన నిర్మాణ రంగం దెబ్బ తింది. దీనికితోడు ఇప్పుడొచి్చన వర్షాలు, వరదలకు ఇసుక రీచ్లలో తవ్వకాలు నిలిచిపోయాయి. దీంతో భవన నిర్మాణ రంగం మరింతగా కుదేలైంది. రాష్ట్రంలో ఆ రంగంపై ఆధారపడి జీవిస్తున్న 31 లక్షల మందికిపైగా కార్మికుల జీవనాన్ని దెబ్బతీసింది. విజయవాడలో వరద తాకిడికి అతలాకుతలమైన ప్రాంతాల్లోనే 20 వేల మందికిపైగా భవన నిర్మాణ కార్మికులు కట్టుబట్టలతో మిగిలి, ఆహారం కోసం అలమటిస్తున్నారు.నేతన్న అగచాట్లు.. వర్షాలు, వరదలకు చేనేత కుటుంబాలూ తీవ్రంగా ప్రభావితమయ్యాయి. రాష్ట్రంలో సుమారు 1.60 లక్షల మగ్గాలు ఉన్నట్టు అంచనా. పది రోజులుగా పడుతున్న వర్షాలకు ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని నేత మగ్గాల కుంటల్లోకి నీరు చేరింది. దీంతో చేనేత కార్మికుల జీవనం స్తంభించింది. వేలాది నేతన్నల కుటుంబాలు అవస్థల పాలయ్యాయి.శ్రీకాకుళం నుంచి వలసొచ్చాం కొన్నేళ్ల క్రితమే 450 కుటుంబాల వాళ్లం శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల వలసొచ్చి వ్యవసాయ పనులు చేసుకుంటున్నాయి. ఎక్కడ కూలి పని ఉంటే అక్కడకు వెళ్తుంటాం. నేను కూడా శ్రీకాకుళం జిల్లా నుంచే వచ్చాను. మేస్త్రీగా పది మందిని పనులకు తీసుకెళ్తున్నాను. వర్షాల వల్ల పది రోజులుగా పనుల్లేవు. మా కుటుంబాలన్నీ తిండి లేక అవస్థలు పడుతున్నాయి. – వడ్డేపల్లి భాస్కరరావు, మేస్త్రీకూలికెళితేనే రోజు గడిచేది వ్యవసాయ పనులకు వెళితేనే మాకు రోజు గడిచేది. ఉదయం 6 గంటలకు పనులకు వెళ్లి మధ్యాహా్నం 1గంటకు వస్తాం. రోజు కూలీ రూ.450 ఇస్తారు. ఇంటి అద్దె నెలకు రూ.4 వేలు చెల్లించాలి. ఇద్దరు ఆడ పిల్లలు. నేను, నా భార్య ఇద్దరం కష్టపడితేనే మాకు నెల భారంగా గడుస్తుంది. అలాంటిది పది రోజులుగా పనుల్లేకఅవస్థలు పడుతున్నాం. – మడల సీతారామయ్య, చోడవరంవర్షాలతో మగ్గం నేతకు ఇబ్బందులే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో చేనేత మగ్గాల కుంటల్లో వర్షం నీరు చేరి చేనేత కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మగ్గాల కుంటల్లో నీరు చేరితో దాన్ని బయటకు తోడి ఆరిన తర్వాతే మళ్లీ పని మొదలు పెట్టాలి. ఇందుకు 15 నుంచి 20 రోజులు పడుతుంది. ఇన్ని రోజులూ చేనేత కార్మికులు పస్తులుండాల్సిందే. మగ్గం కుంటల్లో నీరు చేరి కొందరు, పడుగు తడిసి పాడైపోయి మరికొందరు, నేత నూలు మొత్తబడిపోయి ఇంకొందరు నేత నేసేందుకు అవకాశం లేక ఉపాధి కోల్పోయారు. – పిల్లలమర్రి బాలకృష్ణ, చేనేత నాయకుడు -
మోదీ ప్రమాణ స్వీకారానికి ట్రాన్స్జెండర్లు, పారిశుధ్య కార్మికులు, కూలీలు
న్యూఢిల్లీ: మోదీ ప్రమాణ స్వీకారానికి భిన్న వర్గాల ప్రజలు హాజరయ్యారు. ట్రాన్స్జెండర్లు, పారిశుధ్య కార్మికులతోపాటు నూతన పార్లమెంట్ భవన నిర్మాణంలో పాలుపంచుకున్న కూలీలు సైతం హాజరుకావడం విశేషం. ప్రమాణ స్వీకారం కంటే ముందు ట్రాన్స్జెండర్లను కేంద్ర మాజీ మంత్రి వీరేంద్ర కుమార్, పారిశుధ్య కార్మికులను బీజేపీ ఎంపీ గజేంద్రసింగ్ షెకావత్ ఘనంగా సత్కరించారు. ‘సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్’ అంటూ ప్రధాని మోదీ ఇచి్చన పిలుపును అందిపుచ్చుకుంటూ ట్రాన్స్జెండర్లను సత్కరించినట్లు వీరేంద్ర కుమార్ తెలిపారు. -
మీసాలున్నాయని 80 మందిని తొలగించిన కంపెనీ!
హిమాచల్ ప్రదేశ్లో ఓ ఆసక్తికర ఉదంతం వెలుగు చూసింది. గడ్డం, మీసాలతో డ్యూటీకి వచ్చారంటూ ఓ ఫార్మాస్యూటికల్ కంపెనీ 80 మంది ఉద్యోగులను తొలగించింది. సంస్థలోని ఉద్యోగులంతా క్లీన్ షేవ్తో రావాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో బాధిత ఉద్యోగులంతా లేబర్ కమిషనర్ను ఆశ్రయించారు.మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఇది సోలన్లోని పారిశ్రామిక ప్రాంతమైన పర్వానూలో చోటుచేసుకుంది. గడ్డం, మీసాలు ఉన్నందుకు ఓ కంపెనీ 80 మంది కార్మికులను విధుల నుంచి తొలగించింది. అయితే తర్వాత ఆ కార్మికులు క్లీన్ షేవ్తో కంపెనీకి వచ్చారు. అయినా సదరు కంపెనీ వారిని తిరిగి నియమించుకునేందుకు నిరాకరించింది. వారు పరిశ్రమలోకి రాకుండా అడ్డుకుంది.దీంతో కార్మికులంతా నిరసన చేపట్టి లేబర్ కమిషనర్తో పాటు ముఖ్యమంత్రికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అనంతరం లేబర్ ఇన్స్పెక్టర్ లలిత్ ఠాకూర్ కంపెనీని సందర్శించి ఇరువర్గాల వాదనలు విన్నారు. దీనిని డీసీ సోలన్ మన్మోహన్ శర్మ దృష్టికి తీసుకెళ్లారు. పరిశ్రమలో ఇలాంటి సంఘటనలు జరిగితే నిబంధనల ప్రకారం పరిశ్రమపై చర్యలు తీసుకుంటామని మన్మోహన్ శర్మ హెచ్చరించారు. ఈ కేసుపై ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు. -
నాట్లేస్తాం.. వరి నాట్లేస్తాం..
నిర్మల్: జిల్లాలో వ్యవసాయ మండలంగా పేరున్న లక్ష్మణచాందలో ఈ ఏడాది యాసంగి సీజన్ వరినాట్లు జోరందుకున్నాయి. కూలీలు దొరకకపోవడంతో రైతులు బిహార్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల నుంచి కూలీలను తీసుకువచ్చి నాట్లు వేయిస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో రెండో పంట సమయంలో ఉపాధి లభించకపోవడంతో కూలీలు తెలంగాణకు వలస వస్తున్నారు. ఇక్కడ నాట్లు వేస్తూ ఉపాధి పొందుతున్నారు. అన్నిపనులూ వారే.. బిహార్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలు వరి నారు తీయడం, తీసిన నారును మడులలో పంచుకోవడం, మందు చల్లడం, నాటు వేయడం.. ఇలా అన్నిపనులూ వారే చేస్తున్నారు. ఉదయం 7 గంటలకే పొలం వద్దకు చేరుకున్న కూలీలు ముందుగా వరినారు తీస్తున్నారు. ఆతర్వాత ఎరువులు చల్లిన అనంతరం నాటు వేయడం ప్రారంభిస్తున్నారు. 12 మంది కలిసి ఒక గ్రూపుగా ఏర్పడుతున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రోజుకు మూడు నుంచి నాలుగు ఎకరాల్లో వరి నాటు వేస్తున్నారు. ఎకరాకు రూ.4 వేల నుంచి రూ.4,500 మండలంలోని మునిపెల్లి, చామన్పెల్లి, లక్ష్మణచాంద, తదితర గ్రామాల్లో 12 మంది కలిసి గ్రూపుగా ఏర్పడిన కూలీలు ఎకరాకు రూ.4 వేల నుంచి రూ.4,500ల చొప్పున తీసుకుని నాట్లు వేస్తున్నారు. ఒక్కో గ్రూపుకు రోజుకు రూ.16 వేల చొప్పున, ఒక్కో కూలీకి రోజుకు రూ.900 నుంచి రూ.వెయ్యి వరకు సంపాదిస్తున్నారు. రోజుకు నాలుగెకరాల్లో.. 12 మంది సభ్యులం కలిసి గ్రూపుగా ఏర్పడ్డాం. రోజుకు మూడు నుంచి నాలుగు ఎకరాల్లో వరినాట్లు వేస్తున్నాం. దీంతో రోజుకు కూలి రూ.900 నుంచి వెయ్యి వరకు సంపాదిస్తున్నాం. – సికిందర్, కూలీ, బిహార్ -
ఉత్తరకాశీలో కూలిన సొరంగం: ప్రమాదంలో 40 మంది కూలీలు?
ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలోని సిల్క్యారాలో నిర్మాణంలో ఉన్న సొరంగంలోని కొంత భాగం కూలిపోయింది. ఆ సమయంలో 40 మంది కూలీలు సొరంగంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. సంబంధిత అధికారులు వెంటనే సహయక చర్యలు ప్రారంభించారు. ఈ ప్రమాదం ఆదివారం అర్థరాత్రి జరిగింది. ఈ సొరంగం ఉత్తరకాశీలోని యమునోత్రి జాతీయ రహదారిపై ఉంది. ప్రస్తుతం సొరంగంలోని శిధిలాలను తొలగిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సిల్క్యారాలోని నాలుగున్నర కిలోమీటర్ల పొడవున నిర్మితమవుతున్న ఈ సొరంగంలో 150 మీటర్ల భాగం కూలిపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందిన వెంటనే ఉత్తరకాశీ పోలీసు సూపరింటెండెంట్ అర్పణ్ యదువంశీ తమ బృందంతో సహా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. పోలీసులు, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఫైర్ బ్రిగేడ్, ఎమర్జెన్సీ 108, సొరంగం నిర్మిస్తున్న నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్హెచ్ఐడిసిఎల్) ఉద్యోగులు సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. చార్ ధామ్ రోడ్ ప్రాజెక్ట్ కింద చేపడుతున్న ఈ ఆల్-వెదర్ టన్నెల్ నిర్మాణం కారణంగా ఉత్తరకాశీ నుండి యమునోత్రి ధామ్ వరకు ప్రయాణం 26 కిలోమీటర్లమేర తగ్గనుంది. ఇది కూడా చదవండి: నేడు ఛత్తీస్గఢ్లో ప్రధాని ఎన్నికల ర్యాలీ.. జనం హాజరుపై సందేహాలు? -
ఉపాధి కెళ్లినా డబ్బులు రావడంలే
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలను నివారించి కూలీలకు స్థానికంగా పని కల్పించడమే లక్ష్యంగా అమలు చేస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి పథకం రాష్ట్రంలో నీరుగారి పోతోంది. ఈ పథకం పనులకు వచ్చే కూలీల సంఖ్య భారీగా తగ్గుతుండటమే ఇందుకు నిదర్శనం. గతేడాదితో పోల్చితే ఈ పనులకు వెళ్తున్న కూలీల సంఖ్య 25 శాతానికి పడిపోవడం గమనార్హం. గతేడాది 2022 జనవరి 3న రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి హామీ పనులకు వెళ్లిన కూలీల సంఖ్య 3,23,028 మంది కాగా, మంగళవారం (2023 జనవరి 3న) రోజు పనులకు హాజరైన కూలీల సంఖ్య కేవలం 72,371 అంటేనే వాస్తవ పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఈ పనులు చేసేందుకు కూలీల్లో ఆసక్తి తగ్గుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రోజు వారీ కూలీ సగటున రూ.211 ఉపాధి హామీ పనులు చేసిన వారికి సకాలంలో కూలీ డబ్బులు అందకపోవడమే ఇందుకు ప్రధాన కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సాధారణంగా కూలీలకు 15 రోజుల్లో కూలీ డబ్బులు చెల్లించాలి. కానీ నెలల తరబడి చెల్లింపుల్లో జాప్యం జరుగుతోంది. ►కొందరు కూలీలకు గతేడాది ఆగస్టు నుంచి డబ్బులు రాలేదు. ఈ డబ్బుల కోసం అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ►ఉపాధి పనులకు వెళితే కూలీ గిట్టుబాటు కాకపోవడము కూడా కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉపాధి కూలీలకు రోజుకు సగటున రూ.211లు వస్తోంది. ప్రస్తుతం వ్యవసాయ కూలీలకు డిమాండ్ అధికంగా ఉంది. రబీ పంటలు.. వరి నాట్లు, పత్తి తీయడం వంటి పనులకు వెళితే ఇంతకు రెండింతలు కూలీ గిట్టుబాటు అవుతోంది. ►మారుతున్న నిబంధనలు కూడా ఓ కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం పనులకు వెళుతున్న కూలీలు ప్రత్యేక యాప్లో రెండు పూటలా ఫొటోలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే సెల్ఫోన్ నెట్వర్క్ లేని చోట్ల ఈ ప్రక్రియ వీలు కావడం లేదు. 66 లక్షల మంది కూలీలు.. రూ.2,841 కోట్ల పనులు.. రాష్ట్ర వ్యాప్తంగా 56.74 లక్షల జాబ్కార్డులుండగా, మొత్తం 1.18 కోట్ల మంది కూలీలు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇందులో 37.09 లక్షలు యాక్టివ్ జాబ్కార్డులు కార్డుదారులు కాగా, 66.44 మంది కూలీలు ఉపాధి హామీ పనులకు వెళుతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం 2022–23లో ఇప్పటి వరకు రూ. 2,841.17 కోట్ల మేరకు ఉపాధి హామీ పనులు జరిగాయి. ఇందులో కూలీలకు చెల్లించిన వేతనం రూ.1,791.10 కోట్లు కాగా, మెటీరియల్ కాంపోనెంట్ కింద రూ.875.35 కోట్లు ఖర్చు చేశారు. సెప్టెంబర్లో చేసిన పనికి ఇంకా డబ్బులు రాలే.. గతేడాది సెప్టెంబర్లో గ్రామంలో ఉపాధి పనులకు వెళ్లాను. ఇప్పటికీ కూలీ డబ్బులు రాలేదు. ఎప్పుడు ఇస్తారోనని ఎదురు చూస్తున్నాను. అధికారులను ఎన్నిమార్లు అడిగినా ప్రయోజనం లేకుండా పోయింది. – భూమయ్య, ఉపాధి కూలీ, జంబిగి, సంగారెడ్డి జిల్లా ఇతర పనులకు వెళ్తున్నాం.. సరిగ్గా డబ్బులు రాకపోవడంతో ఉపాధి పనులకు వెళ్లడం లేదు. ఇతర వ్యవసాయ పనులకు వెళుతున్నాం. సెప్టెంబర్లో చేసిన పనులకే ఇంకా కూలీ డబ్బులు రాలేదు. పనులు చేసుకుంటేనే పూట గడిచే మాకు వెంటనే కూలీ డబ్బులు చెల్లించాలి. – మణెమ్మ, ఉపాధి కూలీ,జంబిగి, సంగారెడ్డి జిల్లా -
‘ఉపాధి’లో ఆన్లైన్ హాజరు! జనవరి 1 నుంచి కేంద్రం కొత్త నిబంధనలు
సాక్షి, హైదరాబాద్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమల్లో కేంద్రం మరిన్ని కఠిన నిబంధనలను అమల్లోకి తెచ్చింది. జనవరి 1 నుంచి ఈ పథకం కింద చేపట్టే అన్నిరకాల పనులను నేషనల్ మొబైల్ మానిటరింగ్ యాప్ (ఎన్ఎంఎంఎస్) ద్వారా నమోదు చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. ఉపాధి పనుల్లో కూలీల ‘మాన్యువల్ అటెండెన్స్’కు చెల్లుచీటీ పలికింది. ఇకపై లైవ్ లొకేషన్లో మొబైల్ యాప్ ద్వారానే అన్నిరకాల పనులకు సంబంధించిన పనుల వివరాలు, కూలీల హాజరును నమోదు చేయాలని స్పష్టం చేసింది. అయితే వ్యక్తిగత మరుగుదొడ్లు, సోక్ పిట్స్, క్యాటిల్ షెడ్స్ తదితర వ్యక్తిగత ప్రయోజన పనులు, ప్రాజెక్టులకు మాత్రం ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శులకు, ఉపాధి హామీ పథకం కమిషనర్లకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని ఉపాధిహామీ పథకం అమలు డైరెక్టర్ ధర్మవీర్ ఝా ఉత్తర్వులను పంపించారు. ఈ పథకాన్ని పారదర్శకంగా అమలు చేయడం, పౌర సమాజం పర్యవేక్షణకు వీలుగా కొత్త నిబంధనలు తెచ్చినట్టు అందులో పేర్కొన్నారు. ఇప్పటికే మొదలు.. ఉపాధి హామీ కూలీల హాజరును రోజుకు రెండుసార్లు తప్పనిసరిగా ఎన్ఎంఎంఎస్ యాప్ ద్వారా లైవ్ లొకేషన్లో క్యాప్చర్ చేసి అప్లోడ్ చేయాలనే నిబంధనను కేంద్రం ఈ ఏడాది మే నెలలోనే తీసుకొచ్చింది. కూలీల అటెండెన్స్ రోజుకు రెండుసార్లు సమయంతో సహా నమోదయ్యేలా, కూలీల ఫొటోలను జియోట్యాగ్ చేసేలా ఏర్పాట్లు చేసింది. అయితే ఇరవై మందికిపైగా కూలీలు పనిచేసే సైట్లలో మాత్రమే వాటిని అమలు చేశారు. ఇప్పుడు ఉపాధి హామీ కింద చేపట్టే అన్ని పనుల్లో (వ్యక్తిగత ప్రయోజన పనులు మినహా) ఎన్ఎంఎంఎస్ ద్వారానే కూలీల హాజరు నమోదు చేయాలని తాజాగా కేంద్రం ఆదేశించింది. జనవరి 1 నుంచి ఈ వి«ధానాన్ని కచ్చితంగా అమలు చేసేలా చర్యలు చేపట్టాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టం చేసింది. ఆన్లైన్ నమోదులో ఇబ్బందులెన్నో.. ఉపాధి హామీ పనులు జరిగే మారుమూల ప్రాంతాల్లో మొబైల్ నెట్వర్క్ సమస్య ఉండటం, అందరికీ స్మార్ట్ఫోన్లు, డేటా లేకపోవడం వంటి సమస్యల వల్ల ఎన్ఎంఎంఎస్ యాప్ ద్వారా కూలీల అటెండెన్స్ నమోదు ఇబ్బందికరమేనని క్షేత్రస్థాయిలో ఈ పథకం పరిశీలకులు చెప్తున్నారు. కూలీలు చేసే పనుల కొలతలు, పరిమాణం ప్రకారమే కూలి డబ్బు ఇస్తున్నపుడు కొత్త నిబంధనలు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే సరిగా పని, కూలి సొమ్ము అందక ఉపాధి హామీ పథకానికి గ్రామీణ పేదలు దూరమవుతున్నారని అంటున్నారు. లైవ్ లొకేషన్లో మొబైల్ యాప్ ద్వారా అటెండెన్స్ నమోదు వంటి చర్యలు మరింత ప్రతిబంధకంగా మారతాయని స్పష్టం చేస్తున్నారు. -
అనంతపురం జిల్లాలో తీవ్ర విషాదం
-
పిడుగుపాటుకు నలుగురు కూలీలు మృతి
-
వరదలో చిక్కుకుపోయిన 21 మంది కూలీలు.. రాత్రంతా అక్కడే!
సాక్షి, మహబూబాబాద్/మరిపెడ రూరల్/మద్దిరాల: వాళ్లంతా రెక్కాడితే కానీ డొక్కాడని గిరిజన కూలీలు. కూలికోసం ఏరు దాటి వెళ్లారు. రోజువారీగా పనిచేస్తుండగానే ఒక్కసారిగా వచ్చిన వరద చుట్టుముట్టింది. రెండు పాయలుగా ఉన్న సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం ముకుందాపురం శివారులో పాలేరు వాగులో మధ్యలో కూలీలు చిక్కుకుపోయారు. ఎన్డీఆర్ఎఫ్ బృందం శ్రమించి కూలీలను శనివారం ఉదయం బయటకు తీసుకొచ్చింది. నీళ్ల మధ్య చిక్కుకున్న కూలీలు.. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తానంచర్ల రెవెన్యూ పరిధిలోని కోట్యాతండా, వాల్యతండా గ్రామ పంచాయతీల పరిధిలోని చౌళతండాకు చెందిన 17 మంది, వాల్యతండాకు చెందిన నలుగురు.. మొత్తం 21 మంది కూలీలు సరిహద్దు ప్రాంతంలోని ముకుందాపురం గ్రామానికి చెందిన తిరుమలయ్య వ్యవసాయ క్షేత్రంలోని వరి నాటు వేయడానికి ఆటోలో శుక్రవారం ఉదయం వెళ్లారు. అక్కడ వాగు 2 పాయలుగా చీలిన ప్రదేశంలో రైతు వ్యవసాయ భూమి ఉంది. ఉదయం నాటు వేయడానికి వెళ్లినప్పుడు మాములుగానే ఉండటంతో కూలీలు వెళ్లి నాటు వేశారు. తిరిగివస్తుండగా వాగు ఒక్కసారిగా ఉధృతి పెరిగింది. ఎటుచూసినా నీరు.. మధ్యలో కూలీలు ఉండిపోయారు. బయటికొచ్చే మార్గం లేకపోవడంతో ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు, ప్రజాప్రతినిధులకు విషయం చెప్పారు. వారు అధికారులకు సమాచారం అందించారు. ఉదయం సురక్షితంగా.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం కూలీలను బయటకు తీసే ప్రక్రియ ప్రారంభించారు. రాత్రి డ్రోన్ ద్వారా కూలీలకు ఆహారం అందజేశారు. రాత్రి 2గంటలకు ఎన్డీఆర్ఎఫ్ బృందం చేరుకున్నా వర్షం కురుస్తుండటంతో కూలీలను ఒడ్డుకు చేర్చడం సాధ్యం కాలేదు. దీంతో శనివారం ఉదయం 5 గంటల సమయంలో ఆపరేషన్ ప్రారంభించారు. దాదాపు గంటన్నర పాటు ఎన్డీఆర్ఎఫ్ బృంద ఇన్చార్జి మన్మోహన్సింగ్ ఆధ్వర్యంలో శ్రమించి బోటు సాయంతో కూలీలను ఒడ్డుకు చేర్చారు. దీంతో కూలీలు, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్, జిల్లా కలెక్టర్ శశాంక్ రక్షణ చర్యలను పర్యవేక్షించారు. చీకట్లో గడిపాం పాలేరు వాగు మధ్యలో ఉండిపోయి రాత్రంతా కారు చీకట్లో ఉండిపోయాం. అధికారులు ధైర్యం చెప్పినా భయం వేసింది. తాగేందుకు నీళ్లు కూడా లేవు. రాత్రి మొత్తం బురదలో నిలబడే ఉన్నాం. –తేజావత్ దేవి నా కొడుకు గుర్తుకొచ్చాడు వాగులో చిక్కుకున్న. నా రెండేళ్ల కొడుకు గుర్తుకు వచ్చి ఏడ్చా. తోటి కూలీలు ధైర్యం చెప్పి నన్ను ఓదార్చారు. అయినప్పటికి కొడుకును చూస్తాను అనుకోలేదు. –ఆంగోతు కవిత, చంటి బిడ్డతల్లి ఇదీ చదవండి: Telangana: రానున్న 2 రోజుల్లో అతి భారీ వర్షాలు.. 11 జిల్లాలకు రెడ్ అలర్ట్ -
భారంగా బతుకు‘పాఠం’
పై ఫోటోలో పత్తి ఏరుతున్న ఈయన పేరు లింగమయ్య. కల్వకుర్తికి చెందిన ఈయన ఎంఎస్సీ బీఈడీ చేశారు. ఒక ప్రైవేటు స్కూల్లో టీచర్గా పని చేస్తున్న లింగమయ్య.. కరోనా దెబ్బతో ఉద్యోగం కోల్పోయారు. సొంతూరుకు వెళ్లి జీవనోపాధి కోసం వ్యవసాయ కూలీగా మారారు. సాక్షి, హైదరాబాద్: కరోనా దెబ్బతో ఉద్యోగాలు కోల్పో యిన లక్షన్నర మంది టీచర్లు, అధ్యాపకుల జీవితాలు తలకిందులయ్యాయి. ఉపాధి కోల్పోయి రోడ్డునపడ్డారు. 6 నెలలుగా పని లేక.. జీవనం గడిచే దారిలేక కొంత మంది వ్యవసాయ, దినసరి వేతన కూలీలుగా మారితే.. మరికొంతమందిపరువు కోసం కడుపు మాడ్చు కొని ఉన్న దాంట్లోనే సర్దుకుంటున్నారు. అర్ధాకలితో అవస్థలు పడుతూ ఎప్పుడు పరిస్థితులు చక్క బడుతాయో నని ఎదురుచూస్తున్నారు. ఇపుడు 75% స్కూళ్లు ఆన్లైన్ తరగ తులను ప్రారంభించి, ఫీజులూ వసూలు చేసుకుంటున్నాయి. ఫీజులు చెల్లించని వారి పిల్లలకు ఆన్లైన్ యాక్సెస్ ఇవ్వకుండా వేధిస్తూ ఫీజులను పెంచి మరీ దండుకుంటున్నాయి. అయినా టీచర్లను స్కూళ్లకు రమ్మని పిలవడం లేదు. వెళ్లి అడిగినా పట్టించు కోవడం లేదు. చివ రకు గత విద్యా సంవత్సరపు వేతన బకాయి లను, కోత పెట్టినవేతనాలను చెల్లించడంలే దని, పీఎఫ్ డబ్బులు విడిపించు కునేందుకు అవకాశమివ్వట్లేదని వాపోతున్నారు. మళ్లీ వస్తామన్నా... తీసుకొనే వారేరీ? డిగ్రీ, పీజీలు, పీహెచ్డీలు చేసి పట్నం వచ్చి టీచర్లు, లెక్చరర్లుగా బతుకీడుస్తున్న అనేక మంది కరోనా వల్ల బతుకుదెరువు కోల్పోయారు. యాజమాన్యాలు జీతాలు ఇవ్వక, పట్టణాల్లోనే ఉండేందుకు డబ్బులు లేక, ఏదో ఒక పని చేసుకొని బతికేం దుకు ఏప్రిల్, మే నెలల్లోనే అనేక మంది తమ సొంతూళ్లకు వెళ్లిపోయారు. ఇప్పుడు వెనక్కి వద్దామని యాజమాన్యాలను సంప్ర దిస్తున్నా... అటు నుంచి స్పందన లేదు. చివరకు సగం జీతానికైనా పనిచేస్తామని చెప్పినా పట్టించుకోవడం లేదని, తామెలా బతకాలని ఆవేదన చెందుతున్నారు. ఆన్లైన్ తరగతుల్లో 40 శాతం మందే.. విద్యాశాఖ లెక్కల ప్రకారమే రాష్ట్రంలో 10,912 ప్రైవేటు స్కూళ్లు ఉండగా, వాటిల్లో 1,27,790 మంది టీచర్లు పని చేస్తున్నారు. మరోవైపు 15 వేల మంది వరకు బోధనేతర సిబ్బంది ఉన్నారు. ఇక 1,496 ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో 20 వేల మంది వరకు లెక్చరర్లు ఉన్నారు. మరోవైపు 187 ఇంజనీరింగ్ కాలేజీల్లో 90 వేల మందికి పైగా అధ్యాపకులు పని చేస్తున్నారు. అయితే వీరిలో ఇపుడు 40 శాతం మంది కూడా స్కూళ్లు, కాలేజీల్లో లేరు. మెజారిటీ స్కూళ్లు ఆన్లైన్ తరగతులు ప్రారంభించినా టీచర్లను వెనక్కి తిరిగి తీసుకోలేదు. 20–25 మంది టీచర్లు ఉన్న స్కూళ్లలో 10 మందిలోపు టీచర్లతోనే ఆన్లైన్ బోధనను కొనసాగిస్తున్నాయి. చాలా పాఠశాలలైతే ప్రైవేటు ఆన్లైన్ లెర్నింగ్ ఏజెన్సీలతో ఒప్పందాలు చేసుకొని రికార్డెడ్ పాఠాలను ప్రసారం చేస్తున్నాయి. దీంతో వాటిని మానిటర్ చేసేందుకు ముగ్గురు నలుగురు టీచర్లను మాత్రమే స్కూళ్లకు రమ్మన్నాయి. అదీ సగం జీతాలతోనే పని చేయించుకుంటున్నాయి. మిగతా లక్షన్నర మందికి పైగా టీచర్లకైతే ఆ సగం జీతంతో కూడిన జీవితం కూడా లేకుండా పోయింది. క్లాసుకు ఇంతని దినసరి కూలీ స్కూళ్లకు వెళ్లి ఆన్లైన్ పాఠాలు చెబుతున్న వారి పరిస్థితి గొప్పగా ఏమీ లేదు. చెప్పినా సగం జీతం కూడా ఇవ్వడం లేదు. వారికి వారంలో నాలుగు తరగతులను ఇచ్చి, ఒక్కో క్లాస్ రూ. 100 చొప్పున 400 చెల్లిస్తున్నారు. నెలకు రూ. 2 వేలు కూడా పొందని టీచర్లు అనేక మంది ఉన్నారు. మరోవైపు చాలా మంది టీచర్లకు స్కూళ్లు ఫీజుల వసూలు టార్గెట్లు పెట్టాయి. తల్లిదండ్రులకు ఫోన్లు చేసి, ఫీజులు చెల్లించేలా చేస్తే ఒక్కో ట్రాన్జాక్షన్పై రూ. 300 చొప్పున కూలీగా చెల్లిస్తున్నాయి. రూల్సా... లైట్ తీస్కో! విద్యాశాఖ జీవో 1 ప్రకారం ఫీజుల రూపంలో వచ్చే మొత్తంలో 50 శాతం టీచర్ల వేతనాలకు, మరో 15 శాతం స్కూల్ అభివృద్ధికి, ఇంకో 15 శాతం పాఠశాల నిర్వహణకు, మరో 15 శాతం నిధులను ఉపాధ్యాయులు, సిబ్బంది సంక్షేమం కోసం వెచ్చించాలి. మిగతా 5 శాతం డబ్బునే యాజమాన్యాలు లాభంగా తీసుకోవాలి. కానీ ఈ నిబంధనలు ఎక్కడా అమలవుతున్న దాఖలాలు లేవు. అయినా విద్యాశాఖకు పట్టదు. ఈమె పేరు లావణ్య. లాక్డౌన్ ముందు వరకు ఓ ప్రైవేటు స్కూళ్లో టీచర్. ఆమె భర్త కూడా ప్రైవేటు ఉద్యో గి. వీరికి ఇద్దరు పిల్లలు. చెరో ఉద్యోగం చేసుకుంటేనే ఇళ్లు గడిచే పరిస్థితి. కరోనా కారణంగా విధించిన లాక్డౌన్ వల్ల స్కూల్ బంద్ అయింది. ఆమె ఉద్యోగం పోయింది. ఆర్నెల్లు అవుతోంది. భర్తకు వచ్చే కొద్దిపాటి వేతనంతోనే కుటుంబాన్ని వెళ్లదీయాల్సి వస్తోంది. వాటర్ ప్లాంట్లో పని చేస్తున్నా: మహదేవ్ ఏప్రిల్ నుంచి జీతం లేదు. అడిగితే బెదిరిస్తున్నారు. ఎక్కువ మాట్లాడితే ఎక్కడా ఉద్యోగం రాకుండా చేస్తామంటున్నారు. మేనేజ్మెంట్ అసోసియేషన్ ఉంది. మీ డాటా వాళ్లకు పంపించి మీకు ఎక్కడా పని దొరక్కుండా చేస్తామని బెదిరిస్తున్నారు. గత్యంతరం లేక వాటర్ ప్లాంట్లో పని చేస్తున్నా. -
వరంగల్ జిల్లాలో తీవ్ర విషాదం
సాక్షి, వరంగల్ : వరంగల్ రూరల్ జిల్లా గీసుగొండ మండలం గొర్రెకుంట గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామంలోని కోల్డ్ స్టోరేజ్కు ఎదురుగా ఉన్న బావిలోకి దూకి చిన్నారితో సహా నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడితో పాటు చిన్నారి ఉన్నారు. ఈ సంఘటన స్థానికులను ఎంతగానో కలిచి వేసింది.(కరోనా : తెలంగాణపై కేంద్రం ఆగ్రహం) బతుకు దెరువు కోసం వరంగల్ శివారులోని గొర్రెకుంట గ్రామానికి వచ్చిన పశ్చిమ బెంగాల్ వలసకూలీలు స్థానికంగా ఓ కంపెనీలో పనిచేస్తూ జీవనం గడుపుతున్నారు. లాక్డౌన్ కారణంగా ఆర్థిక సమస్యలు చుట్టుముట్టగా, సొంత రాష్ట్రానికి కూడా పోయే వీలు లేక వీరు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ సమాచారం తెలిసిన వెంటనే గీసుగొండ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని నలుగురి మృతదేహలు గుర్తించారు. (తెలుగు రాష్ట్రాల్లో వడగాల్పులు: ఐఎండీ హెచ్చరిక) -
తాడిపత్రి ఎంపీడీఓ కార్యలయంలో ఉపాధి కూలీలు ఆందోళన
-
మట్టిపెళ్లలు కూలి విషాదం..
సాక్షి, విశాఖ పట్నం : తూర్పు గోదావరి జిల్లా తునిలో విషాదం చోటు చేసుకుంది. ఉప్పార గూడెం సమీపంలో తాండవ నది ఒడ్డున మట్టిని తవ్వుతుండగా మట్టిపెళ్లలు విగిరిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు కూలీలు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిని తుని ఆస్పత్రికి తరలించారు.మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
వేతన కష్టాలు
కర్నూలు(అర్బన్): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జిల్లాలో పనులు చేస్తున్న కూలీలకు వేతనాలు అందడం లేదు. దాదాపు రెండున్నర నెలలుగా వేతనాలు ఆగిపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లోని కూలీలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. ఉదయం ఆరు గంటలకే పనులకు వెళుతూ.. చెమటోడ్చి కష్టిస్తున్నారు. అయినప్పటికీ కనీసం వారానికి ఒక సారి కూడా వేతనాలు ఇవ్వకపోవడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. వేతనాలు సరిగా అందకపోవడంతో చాలా ప్రాంతాల్లోని కూలీలు ఉపాధి పనులకు స్వస్తి పలికి, సుదూర ప్రాంతాలకు వలస బాట పడుతున్నారు. ఇప్పటికే పత్తికొండ, ఆలూరు, ఎమ్మిగనూరు, ఆదోని, కోడుమూరు తదితర ప్రాంతాల్లో 50 శాతానికి పైగా వ్యవసాయ కూలీలు పొట్ట చేతపట్టుకొని ఇతర ప్రాంతాలకు వెళ్లారు. ఉన్న వారు కూడా తమ ప్రాంతాల్లో జరుగుతున్న రోజువారీ కూలి ఇచ్చే పనులకు వెళ్లేందుకే ఇష్టపడుతున్నారు. వ్యవసాయ పనులు అంతంతమాత్రంగా ఉన్న ప్రాంతాల్లో ఇబ్బందులు తప్పడం లేదు. రెగ్యులర్గా వేతనాలు విడుదల కాకపోవడంతో కూలీలతో పనులు చేయించేందుకు ఫీల్డ్ అసిస్టెంట్లు కూడా మక్కువ చూపడం లేదని తెలుస్తోంది. చేసిన పనులకు వేతనాలు ఇవ్వాలని కూలీలు మండల పరిషత్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా.. సంబంధిత అధికారులు ఇదిగో, అదిగో అంటూ కాలయాపన చేస్తున్నారు. రూ.50 కోట్ల పెండింగ్ జిల్లాలో ఇప్పటి వరకు ఉపాధి కూలీలకు రూ.50 కోట్ల మేర వేతనాలను చెల్లించాల్సి ఉంది. గత ఏడాది నవంబర్ ఏడో తేదీ నుంచి బకాయిలు ఉన్నాయి. గత ఏడాది ఆగస్టులో విడుదలైన రూ.39 కోట్ల నిధులతో అక్టోబర్ వరకు సర్దుబాటు చేశారు. తర్వాత నిధులు విడుదల కాలేదు. వేతనాలు అందకపోవడంతో కూలీల హాజరు క్రమేణా తగ్గిపోతోంది. గతంలో 60 వేల దాకా ఉన్న కూలీల సంఖ్య ప్రస్తుతం 40 వేలకు పడిపోయింది. వారానికి ఒకసారైనా ఇవ్వకపోతే ఎలా? చేసిన పనులకు కనీసం వారానికి ఒకసారైనా కూలి ఇవ్వకపోతే ఎలా బతకాలి? ఇప్పటికే రెండున్నర నెలలుగా వేతనాలు అందించకపోవడంతో కుటుంబం గడవడం కష్టంగా ఉంది. గ్రామాల్లో ఇతర పనులకు వెళ్లే వారిని ఉపాధి పనులకు రావాలని చెబుతున్నారు. అయితే..వేతనం మాత్రం నెలల తరబడి ఇవ్వడం లేదు. – ఆంజనేయులు, కలచట్ల, ప్యాపిలి మండలం నెలాఖరుకు విడుదల కానున్నాయి ఉపాధి కూలీలకు రూ.50 కోట్ల వరకు వేతన బకాయిలున్న మాట వాస్తవమే. నవంబర్ ఏడో తేదీ నుంచి ఇప్పటి వరకు వేతనాలను అందించాల్సి ఉంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ పెండింగ్ ఉన్నాయి. బకాయి పడిన వేతనాలను విడుదల చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెలాఖరు నాటికి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. – ఎం.వెంకటసుబ్బయ్య, డ్వామా పీడీ -
ఛత్తీస్గఢ్ కూలీలకు విముక్తి
ఇబ్రహీంపట్నం రూరల్: ఇటుక బట్టీల్లో వెట్టిచాకిరీ చేస్తున్న కూలీలకు అధికారులు విముక్తి కల్పించారు. బట్టీల్లో కూలీలను వేధింపులకు గురిచేస్తున్నారని ఛత్తీస్గఢ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయగా అధికారులు స్పందించి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ లోకేశ్కుమార్ను అప్రమత్తం చేశారు. కలెక్టర్ ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి మహేశ్వరం, ఇబ్రహీంపట్నం మండలాల్లో పనిచేస్తున్న ఛత్తీస్గఢ్ కూలీలను గుర్తించారు. ఈ నెల 24, 25ల్లో దాడులు నిర్వహించారు. మహేశ్వరంలోని రావిర్యాల, కొంగరఖుర్దూ, ఇబ్రహీంపట్నంలోని కొంగరకలాన్, ఆదిభట్ల, ఎల్మినేడు, చర్లపటేల్గూడల్లో పనిచేస్తున్న ఛత్తీస్గఢ్కు చెందిన 140 మంది పెద్దలు, 37 మంది చిన్నారులను అధికారుల సమక్షంలో వారి రాష్ట్రానికి పంపించారు. -
'కూలి'పోయారు
కూలీల జీవనం కూలిపోయింది. బతుకు కోసం పయనం కన్నీరే మిగిల్చింది. తమకు దిక్కెవరు దేవుడా..! అంటూ మృతుల కుటుంబ సభ్యుల రోదనలు చూపరులను కంటతడి పెట్టించాయి. కుప్పం మండలం పెద్దవంక అటవీ ప్రాంతంలో శనివారం రాత్రి ఘోర ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెల్సిందే. ఈ ఘటనలో ఎనిమిది మంది అక్కడికక్కడే చనిపోయారు. మరొకరు ఆదివారం చికిత్స పొందుతూ మృత్యుఒడికి చేరారు. 22 మంది క్షతగాత్రులు ఆస్పత్రిపాలయ్యారు. తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా వానియంబాడి తాలూకా కల్నరసంబట్టు గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. కండీషన్ లేని లారీనే దీనికంతటికి కారణంగా తేలింది. కుప్పం రూరల్, కుప్పం: పొట్టకూటి కోసం కూలి కొచ్చిన 9 మంది తమిళనాడు వాసులు.. శని వారం రాత్రి కుప్పం మండలం నాయనూరు పెద్దవంక వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా ఒకే ఊరికి చెందడం, అందరూ బంధువులు కావడంతో వారి స్వగ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. పోలీసులు, మృతుల బంధువుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా నాట్రంపల్లె తాలూకా కల్లర్సంపట్టి గ్రామానికి చెందిన 31 మంది కూలీలు మామిడి కాయలు కోసేందుకు కుప్పం మండలం నాయనూరు గ్రామానికి శనివారం లారీలో వచ్చారు. అదే గ్రామానికి చెందిన దిలీప్ కూలీలను పనుల కోసం నాయనూరుకు తరలించాడు. కాయలు కోసిన తరువాత ఇళ్లకు తిరుగు ప్రయాణమయ్యా రు. ఈ క్రమంలో పెద్దవంక సమీపంలోని అనపబావి మలుపు లోయలో లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 8 మంది అక్కడికక్కడే మృతి చెందగా.. మరో వ్యక్తి వాణియంబాడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మరో 22 మంది గాయపడ్డారు. కాగా రాత్రికి రాత్రే మృతదేహాలను కుప్పం వంద పడకల ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారికి తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు, నాట్రంపల్లె ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందించారు. మృతులందరిదీ ఒకే గ్రామం.. కల్లర్సంపట్టి గ్రామంలో ఉన్న కుటుంబాలన్నీ కూలీపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఒక్కో కుటుంబంలో ఒకరిద్దరు తప్పనిసరిగా కూలీపై ఆధారపడిన వారే. ఈ క్రమంలో మామిడి కాయలు కోసేందుకు ఆంధ్రాకు వచ్చి రోడ్డు ప్రమాదంలో మరణించారు. దీంతో ఆ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. కాగా కుప్పం వంద పడకల ఆస్పత్రి వద్దకు ఆదివారం మృతుల బంధువులు పెద్దఎత్తున చేరుకున్నారు. తమ వారి జాడకోసం అధికారులను వేడుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. స్పందించిన జిల్లా అధికారగణం.. రోడ్డు ప్రమాదం సంఘటన సమాచారం తెలియడంతో ఆంధ్రా, తమిళనాడు అధికారులు వెంటనే స్పందించారు. రాత్రికి రాత్రే జిల్లా కలెక్టర్ ప్రద్యు మ్న, ఎస్పీ రాజశేఖర్, డీఎస్పీ చౌడేశ్వరితో పాటు రెవెన్యూ శాఖ, పోలీసు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అవసరమైన ఏర్పాట్లు చేశారు. తమిళనాడు రాష్ట్రం వాణియంబాడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి మృతుల కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేశారు. ఆదివారం ఉదయం పంచనామా అనంతరం తమిళనాడు ప్రభుత్వ అంబులెన్స్లలో మృతదేహాలను వారి స్వగ్రామానికి తరలించారు. -
పట్టణ 'హోదా'తో 'ఉపాధి' హుష్
సాక్షి, హైదరాబాద్ : అది జోగుళాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ గ్రామ పంచాయతీ.. సుమారు 6,357 కుటుంబాలకు ఉపాధి హామీ పథకమే దిక్కు.. ఒక్కో కుటుంబంలో ఇద్దరు ముగ్గురు ఉపాధి కూలీలుగా ఉన్నారు.. జూలై తర్వాత ఈ గ్రామపంచాయతీ పరిధిలో సుమారు 12 వేల మంది కూలీలు ఉపాధికి దూరమవనున్నారు! అలంపూర్కు మున్సిపాలిటీ హోదా కల్పించనుండటమే ఇందుకు కారణం!! ఇలా ఒక్క అలంపూరే కాదు.. రాష్ట్రం లోని 309 గ్రామ పంచాయతీలు/గ్రామాల పరిధిలో ఆగస్టు నుంచి ఉపాధి హామీ పథకం అమలు నిలిచిపోనుంది. ఫలితంగా 5 లక్షల నుంచి 7 లక్షల మంది పేద కూలీలు జీవనోపాధిని కోల్పోనున్నారు. అనధికార అంచనాల ప్రకారం వారి సంఖ్య ఇంకా ఎక్కువే ఉండనుంది. 8,755 గ్రామాలు.. 50 లక్షల కుటుంబాలు.. రాష్ట్రంలోని 173 గ్రామ పంచాయతీలు/గ్రామాల విలీనంతో ప్రభుత్వం కొత్తగా 71 మున్సిపాలిటీలను ఏర్పాటు చేస్తోంది. వీటితోడు ఇప్పటికే ఉన్న 41 మున్సిపాలిటీల్లో మరో 136 గ్రామాలను విలీనం చేసింది. అంటే మొత్తం 309 గ్రామ పంచాయతీలు/గ్రామాలు మున్సిలిటీల పరిధిలోకి వెళ్లనున్నాయి. ఇందుకు సంబంధించిన చట్ట సవరణ బిల్లును ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించారు. జూలైతో రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల పాలకవర్గాల పదవీ కాలం ముగియనుంది. ఆ వెంటనే అంటే.. ఆగస్టు 1 నుంచి ఈ 309 గ్రామాల్లో ఉపాధి హామీ పథకం నిలిచిపోనుంది. దీంతో ఈ గ్రామాల్లో కనీసం 5 లక్షల మంది కూలీలు అకస్మాత్తుగా జీవనోపాధికి దూరం కానున్నారు. ఇందులో అత్యధికులు ఎస్సీ, ఎస్టీ, బీసీలే ఉన్నారు. రాష్ట్రంలోని 8,755 గ్రామ పంచాయతీల పరిధిలో 50,82,970 కుటుంబాలు ఉపాధి హామీ పథకం జాబ్ కార్డులు కలిగి ఉన్నాయి. పురుషులు, మహిళలు కలిపి 1,12,11,923 మంది కూలీలు ఉపాధి పొందుతున్నారు. ఈ పథకం కింద ఉపాధి కల్పించేందుకు కేంద్రం 2017–18లో రూ.2,930 కోట్లు ఖర్చు చేసింది. ఒక్కో కూలీకి గరిష్టంగా రూ.205 వేతనం అందిస్తున్నారు. సగటున ఒక్కో వ్యక్తి రోజుకు రూ.140 వేతనాన్ని అందుకుంటున్నాడు. వ్యవసాయేతర ఉపాధి లేకున్నా.. గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు ఏడాదిలో కనీసం 100 రోజుల పనికి హామీ కల్పిస్తూ 2006 ఫిబ్రవరి 2న అప్పటి యూపీఏ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఉన్న ఊరిలోనే పని లభిస్తుండడంతో గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలు తగ్గుముఖం పట్టాయి. ఇప్పుడు 309 గ్రామ పంచాయతీల పరిధిలో ఈ పథకం నిలిచిపోనుండటంతో కూలీలకు పని లేకుండా పోతుంది. వాస్తవానికి రాష్ట్ర పురపాలికల చట్టంలోని నిబంధనల ప్రకారం 20 వేల కనీస జనాభా ఉండి, జనాభాలో సగానికి పైగా వ్యవసాయేతర పనులపై ఆధారపడి ఉన్న గ్రామాన్ని మాత్రమే మున్సిపాలిటీగా ఏర్పాటు చేయాలి. అయితే పేరుకు పట్టణ హోదా వస్తున్నా ఈ 309 గ్రామాల్లో ఎక్కడా వ్యవసాయేతర ఉపాధి అవకాశాలు, పట్టణ ప్రాంత ఛాయలు, పట్టణ ప్రాంతాల్లో ఉండే వ్యాపార, వాణిజ్య సదుపాయాల్లేవు. వ్యవసాయం, ఉపాధి హామీ పథకాలు తప్ప ప్రజలకు మరే ఇతర ఉపాధి అవకాశాలు లేవు. నిబంధనల ప్రకారం కొత్త మున్సిపాలిటీల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటే చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుందని భావించిన ప్రభుత్వం.. చట్ట సవరణ ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేసింది. జీహెచ్ఎంసీతోసహా రాష్ట్రంలో 73 పురపాలికలు ఉండగా కొత్తగా ఏర్పాటు చేయనున్న 71 మున్సిపాలిటీలతో వాటి సంఖ్య 144కి పెరగనుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం.. రాష్ట్రంలో పట్టణ ప్రాంత జనాభా 1.24 కోట్లు కాగా.. కొత్త పురపాలికల ఏర్పాటు తర్వాత ఈ సంఖ్య 1.50 కోట్లకు పెరగనుంది. రాష్ట్ర జనాభాలో పట్టణ జనాభా 41 నుంచి 45 శాతానికి పెరగనుంది. దాదాపు 25 లక్షల మంది గ్రామీణ జనాభా పట్టణ జనాభా పరిధిలోకి రానున్నారు. అందులో కనీసం 5 లక్షల మంది ఉపాధి హామీకి అనర్హులుగా మారనున్నారు. -
హైటెక్ సిటీలో వంద గుడిసెలు దగ్ధం
హైదరాబాద్: హైటెక్ సిటీలో వంద గుడిసెలు కాలి బూడిదయ్యాయి. పొయ్యిలో పడ్డ ప్లాస్టిక్ కవర్తో చెలరేగిన మంటలు వలస కూలీలకు బూడిదను మిగిల్చాయి. గుడిసెలతోపాటు వాటిలో నిల్వ చేసుకున్న నిత్యావసరాలు, బట్టలు కాలిపోవడంతో వలస కూలీలు నిరాశ్రయులయ్యారు. మాదాపూర్లోని పత్రికానగర్లో గురువారం ఉదయం 9.30 సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఒడిశాకు చెం దిన వలస కూలీల బృందం ఓ గుడిసెలో వంట చేస్తుండగా ప్లాస్టిక్ కవర్ అంటుకోవడంతో మంటలు చేలరేగాయి. మాదాపూర్ ఫైర్స్టేషన్ అధికారి పర్యవేక్షణలో సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఆస్తినష్టం దాదాపు రూ.75 లక్షలు ఉంటుందని, వందకు పైగా గుడిసెలు కాలిపోయాయని తెలిపారు. ఉలిక్కిపడ్డ పత్రికానగర్ ఐటీ కారిడార్ నడిబొడ్డులో, పెద్ద పెద్ద కంపెనీలు, భవనాల మధ్యలో మంటలు భారీస్థాయిలో చెలరేగడంతో స్థానికులు, అపార్ట్మెంట్ వాసులు ఉలిక్కిపడ్డారు. గాలి వాటానికి మం టలు తమవైపు వస్తాయోనని కార్యాలయాలు, అపార్ట్మెంట్ వాసులు భయభ్రాంతులకు గురయ్యారు. ఏం జరుగుతుం దోనని ఆలోచించేలోపే 100 గుడిసెలకు పైగా కాలి బూడిద కావడంతో ఆ ప్రాంతం పొగమయంగా మారిపోయింది. నిరాశ్రయులైన 300 మంది కూలీలు ఒడిశా, వరంగల్, నల్లగొండ తదితర ప్రాంతాలకు చెందిన వలస కూలీలు ఆరేళ్ల నుంచి గుడిసెలను ఏర్పాటు చేసుకొని మాదాపూర్ పరిసరాల్లో రోజు కూలి పనులు చేసుకొని జీవ నం సాగిస్తున్నారు. ఈ అగ్నిప్రమాదంతో వారు దాచుకున్న నగదు, చిన్న చిన్న బంగారు, వెండి ఆభరణాలు కాలి బూడిదయ్యాయి. ఉదయమే అందరూ కూలీ పనులకు వెళ్లడంతో ఆస్తి నష్టం మాత్రమే జరిగింది. ఎలాంటి ప్రాణనష్టం చోటు చేసుకోలేదు. ఒక్కసారిగా గుడిసెలు తగలబడిపోవడంతో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. పునరావాసం కల్పించాలని బాధితులు అధికారులను వేడుకుంటున్నారు. -
బలూచిస్తాన్లో కూలీలపై కాల్పులు
-
ఉపాధి పేరిట శేషాచలం అడవుల్లోకి!
► గ్రామీణులే ‘ఎర్ర’ కూలీలుగా టార్గెట్ ► ఇప్పటికే పలువురిని తరలించిన వైనం ► ముందస్తు బయానా, రోజుకు రూ.500 కూలి ► కూలీల సేకరణకు ప్రత్యేక ఏజెంట్లు పలమనేరు: బెంగళూరు, చెన్నె తదితర నగరాల్లో పనులు కల్పిస్తామంటూ పలమనేరు, కుప్పం నియోజకవర్గం లోని గ్రామీణులకు మాయమాటలు చెప్పి శేషాచలం అడవుల్లో ఎర్రదుంగలు నరికివేత పనులకు వారిని ఓ ముఠా చేరవేస్తున్నట్టు తెలుస్తోంది. పనులు లేని పలువురు నిరక్షరాస్యులను ఇప్పటికే ఈ ఊబిలోకి దించిన ట్టు సమాచారం. ఏజెంట్లు ముందుగా చెల్లించిన డబ్బును అవసరాలకు వాడుకున్న కూలీలు విధిలేక ఈ పనులకు వెళుతున్నట్టు తెలిసింది. అటవీప్రాంత గిరిజనులే టార్గెట్ పలమనేరు నియోజకవర్గంలోని మండిపేట కోటూరు, చెత్తపెంట, కాలువపల్లె, యానాది కాలనీ, సెంటర్, నెల్లిపట్ల, బాపలనత్తం, వెంగంవారిపల్లె, కొత్తిండ్లు, కేసీ పెంట, గాంధీనగర్, జగమర్ల, దేవళం పెంటతో పాటు పెద్దపంజాణి, వీకోట మండలాలో్లని అటవీ ప్రాంతాల సమీపంలో పలు గ్రామాలున్నాయి. ఈ గ్రామాలో్లని గిరిజనులు గతంలో అటవీ ఉత్పతు్తలను సేకరించి పొట్టపోసుకునేవారు. మరికొందరు అడవుల్లో పశువులను కాయడం, ఇంకొందరు ఉపాధి పనులకు వెళ్లేవారు. కొంతకాలంగా వీరికి ఉపాధి కరువైంది. దీంతో కుటుంబాలు గడవడమే గగనంగా మారింది. ఇది అవకాశంగా తీసుకున్న ఎర్రచందనం ముఠాలు వీరికి గాలం వేస్తున్నాయి. బెంగళూరులో పనులని చెప్పి... బెంగళూరులో కేబుల్ పనులు, టేకు చెట్ల కోత పనులకు కూలీలు కావాలంటూ ఏజెంట్లు నమ్మబలుకుతారు. యువకులకు ఎంపిక చేసుకుని గ్రామంలోని పెద్దమనిషి ముందు వారికి బయానాగా రూ.పదివేల దాకా అందిస్తారు. తాము చెప్పినపుడు పనికిరావాలని చెప్పి వెళ్తారు. ఈ వ్యవధిలోనే ఏజెంట్లు ఇచ్చిన సొమ్ము ఖర్చు చేసిన యువకులు తీరా ఏజెంట్లు పంపిన చోట్లకు వెళ్లాల్సి వస్తోంది. ఈ ప్రాంతంలోనే పదుల సంఖ్యలో కూలీలు గత కొన్నేళ్లు ఇళ్లకే రాకుండా పోయారంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. వ్యకు్తలు అదృశ్యవైునా వారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసిన దాఖలాలు లేవు. ఇదో ఊబి అనుకోని విధంగా ఎర్రచందనం చెట్లను కొట్టేందుకు కూలీలుగా వెళ్లిన యువకులు ఆ తర్వాత ఇతర పనులకు వెళ్లడం లేదు. గ్రామాల్లో తిరిగితే పోలీసులు పట్టుకుంటారని వారిని బెదిరించి, మరలా ఇవే పనుల్లో కొనసాగేలా చేస్తున్నట్టు గతంలో ఈ పనులకు వెళ్లిన వారు చెబుతున్నారు. దీనికి తోడు కూలీలకు రోజుకు రూ.500 ఇవ్వడంతో పాటు ఆహారం, మద్యం సరఫరా చేస్తుంటారని తెలిసింది. తక్కువ కాలంలోనే ఇలా ఎకు్కవ మొత్తంలో సంపాదించి, డాబుగా జీవిస్తుండడం చూసి మరికొందరు ఆకర్షితులైన ఇదే ‘ఎర్ర’బాట పడుతున్నారు. ఈ కూలీల్లో చదువుకున్న వారు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. కూలీల కోసం ప్రత్యేక ఏజెంట్లు శేషాచలం అడవులో్లకి కూలీలను సరఫరా చేసేందుకు పలమనేరు, వీ.కోటలో పలువురు ఏజెంట్లు ఉన్నట్టు సమాచారం. స్మగ్లర్లకు కావాల్సిన పనిముట్లు, లగేజీ ఆటోలు, దుంగలను తరలించేందుకు తప్పుడు ఆర్సీలున్న వాహనాలను ఈ ఏజెంట్లే సమకూర్చుతున్నట్టు గతంలో పోలీసుల విచారణలో తేలింది. ఈ ఎర్రకూలీల వ్యవహారాన్ని గుట్టురట్టు చేయాలంటే కీలకవైున ఏజెంట్లను పట్టుకోవాల్సిన అవరసం ఉంది. నిర్లక్ష్యం చేస్తే మరెందరో ఈ ఊబిలో కూరుకుపోవడం తథ్యమని వాస్తవ పరిస్థితులు తేటతెల్లం చేస్తున్నాయి. -
కలుపుపై కసితో యంత్రాన్ని సృష్టించాడు!
- పాత పరికరాలతో కలుపు యంత్రం రూపొందించిన రైతు - 3 గంటల్లో 2 లీటర్ల పెట్రోల్తో ఎకరాలో పైపాటు పూర్తి కలుపు ఖర్చును తగ్గించుకోవడంతోపాటు.. కూలీలు, అరకలపై ఆధారపడడం కూడా తగ్గించుకోవడం చిన్న రైతు మనుగడకు అనివార్యంగా మారింది. ఈ పరిస్థితుల్లో ఓ చిన్న రైతు తపనకు సృజనాత్మకత తోడవడంతో అద్భుత కలుపు యంత్రం ఆవిష్కృతమైంది. అల్లం వెంకటేశ్వర్లు ఓ ఆదర్శ రైతు. వరంగల్ జిల్లా కేసముద్రం ఆయన స్వగ్రామం. పదో తరగతి వరకు చదువుకొని వ్యవసాయం చేస్తున్నారు. తన ఐదెకరాల పొలంలో పత్తి, మిర్చి పంటలను సాగు చేస్తున్నారు. పొలాల్లో కలుపును నిర్మూలించేందుకు పంటకాలంలో ఏడు సార్లు పైపాటు చేయాలి. అరకతో ఒక్కోసారి రూ. వెయ్యి చొప్పున ఏడాదికి 5 ఎకరాలకు రూ.35 వేల వరకు ఖర్చవుతోంది. ఒక్కోసారి అదునులో అరకలు దొరక్క పొలాలు బీడుగా మారే పరిస్థితి. ఈ సమస్యను అధిగమించేందుకు కలుపు తీసే యంత్రం (పవర్ వీడర్) కొనాలని వెంకటేశ్వర్లు భావించారు. అయితే మార్కెట్లో వాటి ధరలు రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు ఉండటంతో ఆ ప్రయత్నం విరమించుకొని తానే స్వంతంగా తయారు చేయాలని నిర్ణయించుకున్నారు. పాత పరికరాలు కొత్త కలుపు యంత్రం.. మార్కెట్లో ఉన్న పవర్వీడర్లకు గేర్లు ఉండవు. దీని వల్ల వేగాన్ని నియంత్రించలేక వాటి వెంట పరుగులు పెట్టి రైతు త్వరగా అలసిపోతాడు. మలుపుల్లో వెనుకకు యంత్రాన్ని నడపటం వీలుకాదు. పైగా వీటి ఇంధన సామర్థ్యం చాలా తక్కువగా ఉండటం వల్ల ఖర్చు ఎక్కువ అవుతుంది. ఈ యంత్రాల ధరలు కూడా చిన్న రైతులకు అందుబాటులో ఉండవు. తాను రూపొందించే యంత్రంలో ఈ లోపాలన్నింటిని అధిగమించేలా ప్రణాళిక రూపొందించుకున్నారు వెంకటేశ్వర్లు. ముందుగా పాత పవర్ వీడర్ గేర్బాక్స్, ఆటో గేర్బాక్స్, జీకే200 వాటర్పంప్లను కొనుగోలు చేశారు. వీటన్నింటిని అమర్చేందుకు ఇనుప బద్దెలను వెల్డింగ్ చేసి చ ట్రం తయారు చేశారు. ముందుగా ఆటో గేర్బాక్స్కు ఇనుప చక్రాలను అమర్చి చట్రం కిందివైపున అమర్చారు. వాటర్ పంపు ఇంజిన్ను మరో వైపు పవర్ వీడర్ గేర్బాక్స్ను అమర్చారు. దీనివల్ల రైతు అలసట లే కుండా యంత్రాన్ని నడపగలుగుతాడు. మొక్కలు పాడవవు. కిరోసిన్ లేదా పెట్రోల్తో నడుస్తుంది.. ఈ యంత్రం కిరోసిన్ లేదా పెట్రోల్తో పని చేస్తుంది. అయితే ఇంజిన్ మాత్రం పెట్రోల్తో స్టార్టవుతుంది. ఇంజిన్ స్టార్టయ్యాక పవర్ వీడర్ హ్యాండిల్కు ఎడమవైపు ఉన్న క్లచ్ను పట్టుకుని కుడివైపు గేర్ను మార్చాలి. తర్వాత కుడివైపు హ్యాండిల్ కు ఉన్న ఎక్స్లేటర్ను రైజ్ చేసి వదిలితే చాలు యంత్రం ముందుకు కదులుతుంది. వేగాన్ని నియంత్రించేందుకు రెండు, మూడు గేర్లు.. వెనక్కి వచ్చేందుకు రివర్స్ గేర్ వాడాలి. ఇందులో 16 అంగుళాల వెడల్పు గల రోటావేటర్ను అమర్చారు. సాళ్ల మధ్య అంతే వెడల్పు ఉన్న ఏ పంటల్లోనయినా దీనితో అంతరకృషి చేయవచ్చు. కావాలంటే ఈ దూరాన్ని పెంచుకోవచ్చు. నేల రకాన్ని బట్టి సర్దుబాటు చేసుకునేందుకు చిన్న లివర్ను ఏర్పాటు చేశారు. రోడ్డుపై వెళ్లేటప్పుడు, పొలంలో వెనక్కు వచ్చేటప్పుడు రోటావేటర్ తిరగకుండా ఉండేందుకు మరో లివర్ను ఏర్పాటు చేశారు. అవసరాన్ని బట్టి ఆన్, ఆఫ్ చేసుకోవచ్చు. ఆన్ చేయగానే కలుపును పూర్తిగా పెకలించి, ముక్కలు చేసి మట్టిలో కలిపివేస్తుంది. ఎకరం పత్తిలో మూడు గంటల్లో సాలు ఇరవాలు (నిలువు, అడ్డం) పైపాటు పూర్తవుతుంది. దీనికి 3 లీటర్ల కిరోసిన్ లేదా 2 లీటర్ల పెట్రోల్ ఖర్చవుతుంది. అదునులో పని పూర్తవుతుంది. కూలీల ఖర్చు తగ్గుతుంది. సమస్యల సాలెగూడులో చిక్కిన రైతులోకానికి వెంకటేశ్వర్లు రూపొందించిన అంతరకృషి యంత్రం పెను ఊరట. - దూదికట్ల రామాచారి, సాక్షి, కేసముద్రం, వరంగల్ జిల్లా ఒళ్లలవకుండా పైపాటు చేసుకుంటున్నా.. అదును వెంబడి పాటు పడకపోతే కలుపు పెరుగుతుంది. కూలీలను పెడితే చాలా ఖర్చవుతుంది. ఒక్కసారి అదును తప్పినా పొలంలో కలుపును నిర్మూలించటం ఇంటిల్లిపాదీ కష్టపడ్డా వల్ల కాదు. సొంతంగా ఎడ్లను కొని మేపే స్థోమత లేక కలుపు యంత్రం తయారీకి పూనుకున్నా. దీంతో ఒళ్లు అలవకుండా పై పాటు చేస్తున్నా. రైతులు కోరితే తయారు చేసి ఇస్తాను. - అల్లం వెంకటేశ్వర్లు (949211 114599), కేసముద్రం, వరంగల్ జిల్లా 25న వరి, మిరప, పత్తి, అపరాల్లో చీడపీడలపై శిక్షణ ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగయ్యే వరి, మిరప, పత్తి, అపరాల పంటలను ఆశించే పురుగులు, తెగుళ్ల నివారణపై ఈ నెల 25న రైతునేస్తం ఫౌండేషన్ రైతులకు శిక్షణ ఇవ్వనుంది. ప్రకృతి వ్యవసాయంలో అనుభవం ఉన్న రైతులు, శాస్త్రవేత్తలు కషాయాలు, ద్రావణాల తయారీపై శిక్షణ ఇస్తారు. 0863-2286255, 83744 22599 నంబర్లలో సంప్రదించవచ్చు. -
50 మంది ఎర్రచందనం కూలీలు పరారీ
ఎర్రచందనం దుంగలను నరికేందుకు వచ్చిన 50 మంది ఎర్రచందనం కూలీలు పోలీసులను చూసి పరారయ్యారు. వీరంతా ఓ టూరిస్టు బస్సులో నకిలీ నంబర్ప్లేటు తగిలించుకుని వచ్చారు. కడప నగర శివారు కనుమలోపల్లి వద్ద పోలీసులు బస్సును తనిఖీ చేయడానికి ప్రయత్నించిన విషయం తెలుసుకుని.. పారి పోయారు. బస్సులో ఉన్న గొడ్డళ్లు, కూరగాయలు, బియ్యం మూటలను అటవీశాఖ ఫ్లైయింగ్ స్క్వాడ్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. బస్సును సీజ్ చేశారు. పరారై న కూలీల కోసం టాస్స్ఫోర్స్, స్పెషల్ పార్టీ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. -
ట్రాక్టర్ బోల్తా.. 20 మంది కూలీలకు గాయాలు
ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలం జమ్మిగూడెం వద్ద సోమవారం ఉదయం ఓ ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో 20 మందికి గాయాలు కాగా వారిలో ఎం.రామలక్ష్మి, టి.లలిత, ఎన్.నాగుదర్గకు తీవ్ర గాయాలు అయ్యాయి. తీవ్రంగా గాయపడిన ముగ్గురినీ అశ్వారావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి విజయవాడలోని ఓ ఆస్పత్రికి తరలించారు. సప్పగూడెం నుంచి జమ్మిగూడెం గ్రామంలో మొక్కజొన్న కంకులు విరిచే పనికి వెళుతుండగా ట్రాక్టర్ ఇంజన్ నుంచి ట్రక్కు లింక్ విడిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. -
ఎంపీడీఓపై ఉపాధి కూలీల దాడి
కొడంగల్: ఉపాధి హామీ పథకంలో చేసిన పనికి తగిన కూలి ఇవ్వలేదని ఆరోపిస్తూ ఇన్చార్జి ఎంపీడీఓ వీరబ్రహ్మచారిపై కూలీలు దాడి చేశారు. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లా కొడంగల్లో బుధవారం జరిగింది. పర్సాపూర్కి చెందిన సగం మంది కూలీలు ర్యాలపేట చెరువు మట్టిరోడ్డు పనులకు వెళ్లారు. వారం రోజుల పాటు పని చేశారు. రోజుకు ఒక్కొక్కరికి రూ.10-12 మాత్రమే కూలి డబ్బులు వచ్చే విధంగా ఈజీఎస్ సిబ్బంది బిల్లులు తయారు చేశారు. దీంతో ఆగ్రహించిన కూలీలు బుధవారం కొడంగల్ అంబేద్కర్ చౌరస్తా నుంచి ఎంపీడీఓ కార్యాలయం వరకు చావు డప్పు కొట్టుకుంటూ వచ్చారు. ఒక్కసారిగా కార్యాలయంలోకి దూసుకెళ్లారు. వీరబ్రహ్మచారిపై మూకుమ్మడిగా దాడి చేశారు. ఫర్నిచర్ ధ్వంసం చేశారు. కాగా ఎంపీడీఓ ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన పర్సాపూర్కి చెందిన రామకృష్ణ, జీడీ మల్లేష్, సాకలి మల్లప్ప, జీడీ మొగులప్పలపై కేసు నమోదు చేశారు. -
పిడుగుపాటుకు ముగ్గురు మహిళలు మృతి
పొలంలో పనిచేసుకుంటున్న ముగ్గురు మహిళలు పిడుగుపాటుకు గురై మృతిచెందారు. ఈ సంఘటన మెదక్ జిల్లా కంగ్టి మండలంలోని తుర్కవడగం గ్రామ శివారులో గురువారం సాయంత్రం జరిగింది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన ముగ్గురు మహిళా కూలీలు పొలంలో పనిచేస్తున్న సమయంలో ఉరుములతో కూడిన వర్షం పడింది. దీంతో పనిచేస్తున్న హాజీబేగం(40), అమినాబేగం(22), పద్మ(40) వేపచెట్టు కిందికి పరుగులు తీశారు. అదే సమయంలో వేపచెట్టు సమీపంలో పిడుగుపడటంతో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
గుట్టల్లో... గుట్టుగా
ఏటా కొండలను గుల్లచేస్తూ సాగించే రంగురాళ్ల తవ్వకాలు సాలూరు ఏజెన్సీలో మళ్లీ ప్రారంభమయ్యాయి. రంగురాళ్ల తవ్వకాలపై నిషేధం ఉన్నా పట్టించుకోకుండా ఎప్పటిలాగే పలుగుపార పట్టుకుని కొండలను తొలిచేస్తున్నారు. రూ.కోట్లలో వ్యాపారం సాగుతుండడంతో వ్యాపారులే కూలీలను నియమించి తవ్వకాలు సాగిస్తున్నారు. పోలీసులు కేసులు పెడుతున్నా కూలీలు, వ్యాపారులు వెరవడంలేదు. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నానికి చెందిన వర్తకులు వెనక ఉండి చక్రం తిప్పుతున్నారు. సాలూరు/సాలూరు రూరల్: చినుకుపడితే చాలు ఏజెన్సీలో రంగురాళ్ల జాతర ప్రారంభమవుతుం ది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు కొండప్రాం తంలో మట్టి వదులుగా మారడంతో రంగరాళ్ల కోసం తవ్వకాలు ప్రారంభించారు. సాలూరు ఏజెన్సీతో పాటు ఒడిశా రాష్ట్రంలోని సుంకి వద్ద ఈ తవ్వకాలు జోరుగా సాగుతు న్నాయి. మట్టిపెళ్లలు విరిగిపడి ప్రాణాలు కోల్పోయే ప్రమాదమున్నా కూలీలు భయపడడం లేదు. మండలంలోని సారిక పంచాయతీలోని సొంపిగాం స మీపంలోనున్న బంగారుగుడ్డి, సంపంగిపాడు పంచాయతీలోని పుల్లమామిడి సమీపంలోనున్న తండికొండ, రూడి గ్రామం సమీపంలోని హనుమాన్కొండ, దండిగాం కొత్తూరు సమీపంలోని సూరన్నకొండలతోపాటు బట్టివలస సమీపంలోని ఎత్తై కొండలతోపాటు దొరలతాడివలస సమీపంలోని గుట్టల్లోనూ, దుగ్దసాగరం డిపట్టా భూముల్లో కూడా విలువైన రంగురాళ్లున్నాయి. ప్రస్తు తం తండికొండ, హనుమాన్కొండ, దొరలతాడివలస, బట్టివలస ప్రాంతాలలో తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. విషయం తెలుసుకుని అక్కడికి వెళ్లిన ‘సాక్షి’ రాకను గమనించిన తవ్వకందారులు పరుగందుకుని కొండలెక్కారు. రూ కోట్లలో వ్యాపారం రంగురాళ్ల తవ్వకాలపై నిషేధం ఉన్నా బేఖాతరుచేస్తున్నారు. కేట్ ఐ, మూన్ స్టోన్ తదితర రకాల రంగురాళ్లు ఎక్కువగా లభ్యమవుతుండడంతో ఈ ప్రాంతంపై వ్యాపారులు దృష్టి పెట్టారు. వీటి పరిమాణం, నాణ్యతనుబట్టి వేల రూపాయల నుంచి రూ. లక్షల్లో ధర పలుకుతున్నాయి. స్థానిక వ్యాపారులు తవ్వకందారుల నుంచి రంగురాళ్లను కొనుగోలుచేసి బడావ్యాపారులకు చేరవేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. గత ఏడాది కోటి రూపాయలకు పైనే వ్యాపారం జరిగినట్టు తెలిసింది. బయటకుమాత్రం ఇదో కక్కుర్తి వ్యాపారంలా, గిరిజనులకు ఉపాధి మార్గంలా కనిపిస్తున్నా, అక్రమ వ్యాపారుల పాలిట కామథేనువుగా మారింది. నర్సీపట్నం వ్యాపారులే కీలకం స్థానికంగా లభ్యమవుతున్న రంగురాళ్ల కొనుగోలులో విశాఖపట్నం జిల్లా నర్సీపట్నానికి చెందిన ఇద్దరు వ్యాపారులు కీలకంగా వ్యవహరిస్తున్నారు. వీరిలో ఒకవ్యాపారి గతంలో లాడ్జిలో మకాంవేసి లావాదేవీలు నిర్వహించేవాడు. కానీ గత రెండేళ్లగా పోలీసులు నిఘా అధికమవడంతో తన సమీప బందువు ఇంట్లో తిష్టవేసి చక్రం తిప్పుతున్నాడు. అలాగే మరోవ్యాపారి సాలూరు, రామభద్రపురం తదితర ప్రాంతాల లాడ్జీలలో ఉంటూ స్థానిక వ్యాపారుల నుంచి రంగురాళ్లను కొనుగోళు చేస్తున్నాడు. విఫలమవుతున్న పోలీసు రంగురాళ్ల తవ్వకాలను నిలువరించడంలో పోలీసులు పూర్తిగా విఫలమతున్నారు. ఏజెన్సీప్రాంతంలోని ఎత్తై కొండలపై తవ్వకాలు జరగుతుండడంతో అక్కడకు వెళ్లలేకపోతున్నారు. ప్రయాసపడి వెళ్లినా వీరి రాకను పై నుంచి గమనించి, కూలీలు పారిపోతుండడం పరిపాటైంది. ఏటా పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నా తవ్వకాలు మాత్రం ఆగడం లేదు. -
కదలని చక్రం
ఆర్టీసీ సమ్మె తొలిరోజు విజయవంతం డిపోలకే పరిమితమైన బస్సులు తాతాల్కిక ఉద్యోగులతో నడిపేందుకు అధికారుల యత్నం అడ్డుకున్న కార్మికులు, సంఘాల నాయకులు చార్జీల మోత మోగించిన ప్రైవేట్ వాహనదారులు ప్రయాణికులకు తప్పని ఇబ్బందులు ఫిట్మెంట్ సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె జిల్లాలో తొలిరోజు విజయవంతమైంది. రోజూ లక్షలాది మందిని గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. తాతాల్కిక ఉద్యోగులతో బస్సులు నడిపేం దుకు అధికారులు చేసిన ప్రయత్నం కార్మికులు అడ్డుకోవడంతో విఫలమైంది. మొత్తంమీద జిల్లాలోని అన్నిచోట్ల బస్సులు రోడ్డెక్కలేదు. సమ్మెతో ఆర్టీసీకి భారీ నష్టం జరగగా, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇదే అదనుగా ప్రైవేట్ వాహనాలు చార్జీల మోత మోగించాయి. పట్నంబజారు(గుంటూరు) : ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) పిలుపు మేరకు కార్మికులు బుధవారం అర్ధరాత్రి నుంచే జిల్లాలోని అన్ని డిపోల్లో సమ్మెకు దిగారు. ఈయూకు మరో ప్రధాన కార్మిక సంఘం నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్ఎంయూ), ఇతర కార్మిక సంఘాలు మద్దతు పలికాయి. కార్మికులందరూ సమ్మెలో ఉండడంతో గ్యారేజీల నుంచి బస్సులు బయటకు రాలేదు. ఉదయం 6 గంటల నుంచే కార్మికులంతా బస్టాండ్కు చేరుకుని గ్యారేజీ నుంచి బస్సులు రాకుండా అడ్డుకున్నారు. మధ్యాహ్నం వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, సీపీఐ, వివిధ కార్మిక సంఘాల నాయకులు సమ్మెకు సంఘీభావాన్ని తెలియజేసి, కార్మికులకు బాసటగా నిలిచారు. మధ్యాహ్నం 3 గంటల వరకు రీజియన్ పరిధిలో ఒక్క బస్సు తిరగనివ్వకుండా అడ్డుకున్నామని కార్మిక సంఘాల నాయకులు తెలిపారు. ఉదయం నుంచి ఆర్టీసీ అధికారులు బస్సులు బయటకు తెచ్చేందుకు అనుమతి ఇవ్వాలని కార్మిక సంఘాల నేతలను కోరినా ప్రయోజనం కనిపించలేదు. పలుమార్లు బస్సులను బయటకు తీసే ప్రయత్నం చేయడంతో కార్మికులు అడ్డుకున్నారు. మధ్యాహ్న సమయంలో పోలీసులు కార్మిక సంఘాల నాయకులతో చర్చించినా ససేమిరా అన్నారు. కార్మిక సంఘాల నేతలు, కార్మికులను అక్కడ నుంచి బలవంతంగా పక్కకు తొలగించే ప్రయత్నం చేశారు. కొద్దిసేపు బస్టాండ్ ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. కార్మికులు ప్రతిఘటనతో తోపులాట జరిగింది. అనంతరం నేతలను అరెస్ట్ చేసి పోలీసుస్టేషన్కు తరలించి, అదుపులోకి తీసుకుని, గ్యారేజీ నుండి బస్సులను బయటకు పంపారు. ప్రతి బస్సుకి ఒక కానిస్టేబుల్ని సహాయంగా పంపారు. ఈస్ట్ డీఎస్పీ సంతోష్ బందోబస్తును పర్యవేక్షించారు. హయ్యర్ బస్సు తీసుకుని వెళ్లే క్రమంలో బస్సు యజమాని మహిళ కార్మికుడిపై చేయి చేసుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు సర్దిచెప్పడంతో ఇరువర్గాలు అక్కడ నుంచి వెళ్లిపోయాయి. రీజియన్ పరిధిలో 102 హయ్యర్, 22 ఆర్టీసీ కలిపి 126 బస్సులు రీజయన్ పరిధిలో తిరిగాయి. దీంతో 1150 బస్సులు డిపోలకే పరితమయ్యాయని అధికారులు తెలిపారు. విజయవాడ, తెనాలి, అమరావతి, పర్చూరు. చిలక లూరిపేట, నరసరావుపేటకు బస్సులు తిప్పినట్లు చెప్పారు. గురువారం పూర్తిస్థాయిలో బస్సులు నడిపేందుకు అధికారులు దృష్టి సారిస్తున్నారు. సమ్మె ప్రభావంతో రీజయన్కు రూ.కోటికి పైగా నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేస్తున్నారు. బస్సులు నిలిపివేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. తిరుపతి, విశాఖపట్నం తదితర ప్రాంతాల నుంచి వచ్చిన కార్మికులు బస్సులు లేక ఆటోలు, కార్లను ఆశ్రయించారు. నిత్యం కళకళలాడే బస్టాండ్లు వెలవెలబోయాయి. దుకాణాలు సైతం వ్యాపారాలు లేకపోవడంతో మూసివేశారు. ప్రైవేట్ బస్సులు హవా.. గుంటూరు నుంచి దూరప్రాంతాలకు ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు ప్రైవేట్ బస్సుల వైపు మొగ్గు చూపారు. ప్రయాణికుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని ప్రైవేట్ యాజమాన్యాలు కాసుల పండుగ చేసుకున్నాయి. హైదరాబాద్, వైజాగ్, చెన్నై, తిరుపతి తదితర ప్రాంతాల బస్సు టికెట్టుపై రూ.200 నుంచి రూ.500 వరకు అధికంగా తీసుకుంటున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. త్రుటిలో తప్పిన ప్రమాదం ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. బస్సులు నడిపేందుకు ఆర్టీసీ తాత్కాలిక నియామకాలు చేపట్టింది. కండక్టర్, డ్రైవర్ విధులు నిర్వహణకు అధిక సంఖ్యలో నిరుద్యోగులు తరలివచ్చారు. 150 మంది కండక్టర్లు, 40 మంది డ్రైవర్లు వచ్చారు. ఆ డ్రైవర్ల అనుభవ రాహిత్యం బట్టబయలైంది. లెసైన్స్ కలిగిన 40 మందిని తాత్కాలిక ప్రాతిపదికన డ్రైవర్లుగా విధుల్లోకి తీసుకున్నారు. వారిలోని డ్రైవింగ్ నైపుణ్యాన్ని పరీక్షిస్తున్న సమయంలోనే ఒక బస్సు రోడ్డు పక్కన బాటసారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటన పాత బస్టాండ్ సెంటర్లోని కింగ్స్ హోటల్ సమీపంలో జరిగింది. ప్రమాదంలో ఎలాంటి నష్టం కలగకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. -
ఆ పది ఎందుకు వదిలారో..!
మోర్తాడ్ : డిచ్పల్లి మండలంలోని చంద్రయాన్పల్లికి చెందిన గడ్డం యమున(52), బర్దీపూర్ పంచాయతీ పరిధిలోని ఆరెపల్లికి చెందిన కూన రాజవ్వ (53) ఉపాధి హామీ కూలీలు. తీవ్ర ఎండలో పనిచేయడం వల్ల వడదెబ్బకు గురై ఇటీవల ప్రాణాలు కోల్పోయూరు. వీరిద్దరే కాదు జిల్లాలో ఇలాంటి వారు ఎందరో ఉపాధి కూలీలు ప్రాణాలు కోల్పోతున్నారు. అరుునా, ప్రభుత్వంలో మాత్రం చలనం రావడం లేదు. ఉపాధి పనులు జరిగే చోట కూలీలకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఉపాధి హామీ చట్టం స్పష్టం చేస్తోంది. కానీ, ప్రభుత్వ నిర్వాకం వల్ల ఉపాధి కూలీలకు ఎలాంటి సౌకర్యాలు అందడం లేదు. ఎండ వేడిమికి తట్టుకోవడానికి కూలీలకు టెంట్లు సరఫరా చేయాలి. ప్రభుత్వం టెంట్ల కొనుగోలు అంశంపై నిర్లక్ష్యం వహించడంతో కూలీలు ఎండలో పనిచేస్తున్నారు. ఏటా టెంట్ల కొనుగోలుకు ప్రభుత్వం టెండర్లు నిర్వహించి ఉపాధి పనులు జరిగే గ్రామాలకు సరఫరా చేయాలి. గతంలో జిల్లాకు సరఫరా అయిన టెంట్లను కేవలం 26 మండలాలకు పంపిణీ చేసి మిగతా 10 మండలాలకు మొండి చేయి చూపించారు. 26 మండలాల్లోని 510 గ్రామ పంచాయతీల పరిధిలోని 11,995 ఉపాధి కూలీల గ్రూపులకు వీటిని సరఫరా చేశారు. మోర్తాడ్, కమ్మర్పల్లి, డిచ్పల్లి, జక్రాన్పల్లి, ధర్పల్లి, సిరికొండ, సదాశివనగర్, గాంధారి, వేల్పూర్, భీమ్గల్ మండలాల్లోని ఉపాధి కూలీలకు వాటిని సరఫరా చేయలేదు. సుమారు మూడేళ్ల నుంచి వీరికి టెంట్లు సరఫరా చేయడం లేదని కొందరు ఉపాధి అధికారులు తెలిపారు. 26 మండలాలకు సరఫరా చేసి పది మండలాలకు మాత్రమే ఎందుకు సరఫరా చేయలేదని ప్రశ్నిస్తున్నారు. ఉపాధి పనులకు విధించిన లక్ష్యం, వారికి సౌకర్యాలు కల్పించడంలో లేదా.? అని మండిపడుతున్నారు. ఇప్పటికైనా కనీస సౌకర్యాలు కల్పించాలని కూలీలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. -
ఎక్కడి బస్సులు అక్కడే
► ఆర్టీసీలో సమ్మె షురూ ► ప్రభుత్వ వైఖరికి నిరసనగా కార్మిక సంఘాల ఆందోళన ► ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మద్దతుతో కార్మికుల హర్షం ► ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి బస్సులు నడిపిన అధికారులు ► సమ్మెతో ఆర్టీసీకి రూ.90 లక్షలు నష్టం కర్నూలు(రాజ్విహార్) : రోడ్డు రవాణా సంస్థలో సమ్మె సైరన్ మోగింది. సమస్యలు పరిష్కరించాలని కార్మిక సంఘాలు ఆందోళన బాట పట్టడంతో బస్సులు నిలిచిపోయాయి. ఫలితంగా ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం 5 గంటలకు బయల్దేరాల్సిన మొదటి సర్వీసు నుంచే కదలనీయలేదు. డ్రైవర్లు, కండక్టర్లతోపాటు గ్యారేజీ, డీఎం కార్యాలయ సిబ్బంది, రీజినల్ మేనేజరు ఆఫీస్, పర్సనల్, అకౌంట్స్, మెకానికల్, ట్రైనింగ్ కళాశాల తదితర అన్ని విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులు, సిబ్బంది సమ్మెలో వెళ్లారు. 11 డిపోల్లో 4,800 ఉద్యోగులు ఉండగా వీరిలో ఆఫీసర్ స్థాయి అధికారులు 48 మంది ఉన్నారు. వీరు తప్ప 4,752 మంది విధులకు దూరంగా ఉన్నారు. నిలిచిపోయిన 970బస్సులు : జిల్లాలోని 11డిపోల్లో 970 బస్సులున్నాయి. ఇవి 371 రూట్లలో 4లక్షల మంది ప్రయాణికులను చేరవేస్తున్నాయి. దీంతో సంస్థకు రోజుకు రూ.1.10కోట్ల వరకు ఆదాయం సమకూరుతోంది. సమ్మె కారణంగా 970 బస్సులు నిలిచిపోయాయి. అయితే, అధికారులు చేపట్టిన ప్రత్యామ్నాయ చర్యలతో పలు బస్సులు తిప్పారు. ఆర్టీఓ అధికారుల సహకారంతో హెవీ లెసైన్స్ కాలపరిమితి ఉన్న వ్యక్తులను డ్రైవర్లుగా, 10వ తరగతి ఉత్తీర్ణులైన వారిని కండక్టర్లుగా తాత్కాలికంగా ఎంపిక చేసి 84 బస్సులను వివిధ రూట్లలో నడిపారు. వీటితోపాటు అద్దెప్రతిపాదికన ఉన్న మరో 64 బస్సులను సైతం తిప్పారు. సమ్మె కారణంగా సంస్థకు రూ.90 లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజరు టీవీ రామం పేర్కొన్నారు. జనంపై ‘సమ్మె’ట: రాష్ట్ర స్థాయిలో గుర్తింపు ఉన్న ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) తలపెట్టిన సమ్మెకు నేషనల్ మజ్దూర్ యూనియన్(ఎన్ఎంయూ) పూర్తిగా మద్దతు ప్రకటించింది. వైఎస్ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ ఇప్పటికే సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఇతర కార్మిక సంఘాలు కూడా మద్దతు ప్రకటించడంతో బస్సులు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమ్మె కారణంగా బస్సులు లేకపోవడంతో ప్రైవేటు వాహనాలు, ఆటోలను ఆశ్రయించారు. ప్రయాణికుల అవసరాలను ఆసరా చేసుకున్న వాహనదారులు వారి నుంచి ఎక్కువ మొత్తం చార్జీ వసూలు చేశారు. సమ్మె ఇలాగే కొనసాగితే త్వరలో పోటీ పరీక్షలు, ఎంసెట్, పాలిసెట్ తదితర పరీక్షలు సైతం ఉండడంతో విద్యార్థులకు సైతం కష్టాలు తప్పవు. జగన్ మద్దతుపై హర్షం : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సమ్మెకు మద్దతు ప్రకటించడంతో ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు, ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శులు ఏవీ రెడ్డి, ఖాజా మిన్నల్ల, ఊరుకుందు, రషీద్, జోనల్ అధ్యక్షుడు నబి రసూల్, రీజినల్ కార్యదర్శి మద్దిలేటి, ఎన్ఎంయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మధుసూదన్, జిల్లా కార్యదర్శి మద్దిలేటి, జిల్లా నాయకులు సింగ్, వైఎస్ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంవీ కుమార్, ఎంబీఎన్ శాస్త్రి, నాగయ్య, ప్రభుదాస్, నాగన్న, మనోహర్ మాణిక్యం, మునెప్ప జగన్మోహన్రెడ్డిని కలిసి అభినందించారు. తొలుత ర్యాలీ నిర్వహించారు. -
‘ఉపాధి’పై నేడోరేపో రాష్ట్ర సర్కార్ ఉత్తర్వులు
ఏప్రిల్ 1 నుంచి రూ.180 కూలీ సాక్షి, హైదరాబాద్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కూలీలకు రోజూ వారీ వేతనాన్ని పెంచుతూ కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు సర్క్యులర్ జారీచేసింది. ప్రస్తుతం ఈ పథకం కింద గ్రామీణ పేద కూలీలకు రోజువారీ వేతనం రూ.169 ఇస్తుండగా, తాజా పెంపుతో అది రూ.180 కానుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సర్క్యులర్కు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. వేతన పెంపునకు సంబంధించిన ఫైలును గ్రామీణాభివృద్ధి విభాగం ఇప్పటికే ప్రభుత్వానికి పంపించింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేడో, రేపో ఉత్తర్వులు జారీ కానున్నాయని సమాచారం. పెరిగిన వేతనం ఏప్రిల్ 1 నుంచే అమలవుతుం దని గ్రామీణాభివృద్ధి విభాగం అధికారులు తెలిపారు. రోజుకు 8 లక్షల మందికి ఉపాధి వేసవి కాలం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని (హైదరాబాద్ మినహా) జిల్లాల్లో ఉపాధి హామీ పనులు ఊపందుకున్నాయి. గ్రామీణాభివృద్ధి విభాగం ఆధ్వర్యంలో రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథ కం(ఎంజీఎన్ఆర్ఈజీఎస్)ను ప్రభుత్వం అమలు చేస్తోంది. కొన్ని జిల్లాల్లో వ్యవసాయ పనులు ఇప్పటికే పూర్తికావడం, మరికొన్ని జిల్లాల్లో కరువు పరిస్థితులు నెలకొని ఉండటంతో గత మూడు నెలలుగా రోజువారీ ఉపాధి పనులకు వచ్చే కూలీల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు. గత జనవరిలో రాష్ట్రవ్యాప్తంగా రోజుకు 1.33 లక్షల మంది కూలీలు ఉపాధి హామీ పనుల్లో పాల్గొనగా.. ఫిబ్రవరిలో 5.68 లక్షలు, మార్చిలో వీరి సంఖ్య 7.90 లక్షలకు చేరుకుంది. తాజా సమాచారం మేరకు ప్రతిరోజూ 8,00,693 మంది ఉపాధి హామీ పనులకు వస్తున్నారని, ఈ నెలాఖారు కల్లా ఈ సంఖ్య రోజుకు 12 లక్షలకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. -
అట్టుడికిన రాష్ట్రం
ఏపీలో ఎర్రచందనం కూలీలపై జరిగిన ఎన్కౌంటర్పై అనుమానాలు వస్తున్న నేపథ్యంలో బుధవారం కూడా రాష్ట్రం అట్టుడికిపోయింది. ప్రజలు, వివిధ ప్రజా సంఘాలు, పలు పార్టీల నేతలు ర్యాలీలు, రాస్తారోకోలతో ఆందోళనలు నిర్వహించారు. ఏపీ సీఎం దిష్టిబొమ్మ దహనానికి యత్నించారు. అయితే పరిస్థితులు చేయిదాటకుండా వందలాది మందిని పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. చెన్నై, సాక్షి ప్రతినిధి: కూలీలు దాడులకు దిగడం వల్లనే కాల్పులు జరపాల్సి వచ్చిందని ఏపీ పోలీసులు చెబుతున్నా ప్రజాసంఘాలు, తమిళ పార్టీలు ఎంతమాత్రం వాటిని నమ్మడం లేదు. కూలీల చేతుల్ని కట్టేసి కాల్చినట్లు ఆధారాలున్నాయని వారు ఆరోపిస్తున్నారు. ఎన్కౌంటర్ జరగడానికి ముందు రోజు సోమవారం రాత్రి ఏడుగురు కూలీలను ఏపీ పోలీసులు అరెస్ట్ చేసినట్లు తిరువణ్నామలైకి చేరుకున్న కూలీ శేఖర్ చెప్పాడు. మరుసటి రోజు జరిగిన ఎన్కౌంటర్ మృతుల్లో ఆ ఏడుగురు ఉండడంతో కూలీలను ఉద్దేశ పూర్వకంగానే కాల్చి చంపినట్లు వారు నిర్ధారిస్తున్నారు. తెలుగు ప్రజలూ జాగ్రత్త: నామ్తమిళర్ కట్చి నేతలు చెన్నైలోని ఆంధ్రాక్లబ్ వద్ద ఆందోళన నిర్వహించారు. ‘నిన్న శ్రీలంక-నేడు ఆంధ్రప్రదేశ్’ అంటూ ప్లకార్డులు, ‘ఏపీ ప్రభుత్వాన్ని వదలబోం’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేయడానికి ఆందోళనకారులు ప్రయత్నించగా దాన్ని పోలీసులు అడ్డుకున్నారు. బూటకపు ఎన్కౌంటర్పై విచారణ కమిషన్ను నియమించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నామ్తమిళర్ కట్చి నాయకుడు అన్బుతెన్నరసన్ మాట్లాడుతూ.. ఇదేమన్నా పాకిస్తానా, పొట్టకూటికోసం పక్క రాష్ట్రానికి వెళితే కాల్చిచంపుతారా? అంటూ ప్రశ్నించారు. ఏపీలోని కొందరు బడానేతలను కాపాడేందుకు అమాయక తమిళ కూలీలను కాల్చిచంపారని ఆయన ఆరోపించారు. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నామ్తమిళర్ కట్చి ఆస్కాను ముట్టడించడానికి వస్తోందని సమాచారం అందుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మృతదేహాలు మాకవసరం లేదు: ఎన్కౌంటర్లో అసువులు బాసిన కూలీల మృతదేహాలను తాము స్వాధీనం చేసుకోబోమని మృతుల కుటుంబాలు వేలూరు జిల్లా కన్నమంగళం పోలీస్స్టేషన్ వద్ద ధర్నాకు దిగారు. ఇక్కడి టీటీడీ సమాచార కేంద్రం వద్ద ఆందోళనకు దిగి, సీఎం చంద్రబాబు చిత్రపటాలకు నిప్పంటించారు. మరోవైపు ఆంధ్రా బస్సులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. మంగళవారం రాత్రి ఏపీఎస్ ఆర్టీసీ బస్సు అద్దాలను గుర్తుతెలియని వ్యక్తులు పగులగొట్టారు. విళుపురం జిల్లాలోని 40 గ్రామాల ప్రజలు ఎక్కడికక్కడే రాస్తారోకోలు నిర్వహించారు. రైలు ముట్టడికి యత్నించిన వీసీకే నేతలను పోలీసులు అరెస్టు చేశారు. తిరుచ్చీ-తంజావూరు మధ్యనున్న టోల్గేట్ను ఆందోళనకారులు ధ్వంసం చేసి, తిరుచ్చీ హైవేపై రాస్తారోకోకు దిగారు. ఆరంబాకం వద్ద ఒక బస్సు అద్దాలను పగులగొట్టారు. తమిళనాడు నుంచి ఏపీవైపు వెళ్లే ఏపీఎస్ఆర్టీసీ బస్సులను పూర్తిగా నిలిపివేశారు. -
‘ఉపాధి’కి ఏదీ హామీ!
- ఎంపీడీఓల పర్యవేక్షణలోనూ నిరాశే - 10.72 లక్షల మందికి జాబ్కార్డులు - 3.88 లక్షల మంది కూలీలకే పని - జిల్లాలో 43.61 శాతం దాటని వైనం - 100 రోజుల పని 15,878 కుటుంబాలకే - పనులు గుర్తించడంలోనే అసలు నిర్లక్ష్యం - ఫలితాలు ఇవ్వని ‘ఉపాధి’ మార్పులు సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలకు భరోసా ఇవ్వడం లేదు. 2014-15 ఆర్థిక సం వత్సరం ముగియడానికి మరో 26 రోజులే ఉంది. కానీ, జిల్లాలో ఉపాధిహామీ పథకం లక్ష్యం 43.61 శాతానికే పరిమితమైంది. 10.72 లక్షల మంది జాబ్కార్డులు పొందిన కూలీలుం టే, ఇప్పటి వరకు అధికారులు 3.88 లక్షల మందికే ఉపాధి కల్పించారు. ఈ ఏడాది కేవలం 15,878 కుటుంబాలకే 100 రోజులు పని కల్పించగలిగారంటే ఈ పథకం ఎంతగా నిర్లక్ష్యానికి గురవుతుందో అర్థం చేసుకోవచ్చు. పథకాన్ని మరింత పారదర్శకంగా అమలు చేసేందుకు ప్రభుత్వం బాధ్యతలను ఎంపీడీఓలకు బదలాయించింది. ఈ మేరకు 2014 అక్టోబర్ 31న ఉత్తర్వులు జారీ చేసింది. పథకం విజయవంతం కోసం గ్రామ, మండల స్థాయిలలో ఎంపీడీఓలు చురుకైన పాత్ర పోషించాలని ఆదేశించింది. ఈఓఆర్డీ, సూపరింటెండెంట్ సహా 11 కేటగిరీలకు చెందిన అధికారులు, ఉద్యోగుల విధి విధానాలను కూడా సూచిం చింది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో రాష్ర్టంలోని 9 జిల్లాలు, 443 మండలాలలో జాబ్కార్డున్న ప్రతి కూలీకి కనీసం 100 రోజుల పని లక్ష్యంగా నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి జె. రేమండ్ పీటర్ ఆ ఉత్తర్వులో పేర్కొనగా, జిల్లాలో మాత్రం ‘ఉపాధి’ కూలీలకు ‘హామీ’ ఇవ్వలేకపోతోంది. తప్పని కూలీల వలసబాట ఉపాధిహామీ చట్టం-2005 ప్రకారం నమోదు చేసుకున్న కూలీలకు కనీసం 100 రోజులపాటు పని కల్పించాలన్న నిబంధన ఉంది. అధికారులు మాత్రం లక్ష్యసాధనకు అనేక ప్రతికూల పరిస్థితులను కారణాలుగా చూపుతున్నారు. ఈ నేపథ్యంలో కూలీలు పనులు దొరుకక మళ్లీ వలసబాట పడుతున్నారనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇ ప్పటికే మద్నూరు, పిట్లం, జుక్కల్, నిజాంసాగర్, కోటగిరి, బాన్సువాడ తదితర మండలాలలో ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలోనూ పలువురు ప్రజాప్రతి నిధులు ఉపాధిహామీ పథకం అమలుపై ప్రశ్నలు కు రిపించారు. మంగళవారం సమీక్ష జరిపిన కలెక్టర్ రొనాల్డ్రోస్ సైతం కొందరు ఎంపీడీఓలు, పథకం అమలు తీరుపై అసహనం వ్యక్తం చేశారు. 2014-15లో రూ. 914 కోట్ల విలువ చేసే 82,135 పనులను గుర్తించాలని లక్ష్యంగా పెట్టు కోగా, కేవలం 26,585 పనులను గుర్తిం చి రూ.180.19 కోట్ల మేరకు కూలీలకు చెల్లించారు. జిల్లాలో 720 గ్రామపంచాయతీలుంటే, ఇంకా 120 గ్రామ పంచాయతీలలో ఉపాధిహామీ పనులే మొదలుకాలేదు. పనులు గుర్తించడంలో నిర్లక్ష్యం కారణంగా బుధవారంనాటికి ఉపాధిహామీలో పాల్గొన్న కూలీకి రోజు కు సగటున రూ.109.47కు మించడం లేదు. ప్రోగ్రాం ఆఫీసర్లు దృష్టిసారిస్తేనే ఉపాధిహామీ పథకం కింద జిల్లాలో 4,48,001 కు టుంబాలకు చెందిన 10.72 లక్షల మంది కూలీలకు జా బ్కార్డులు అందజేసిన అధికారులు అందరికీ ఉపాధి క ల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కూలీలకు ఉపాధి కల్పించడం ద్వారా రూ.557.62 కోట్లు ఖర్చు చేసేం దుకు ప్రణాళిక సిద్దమైనా, ఇప్పటి వరకు అందులో 26,585 పనులపై రూ.180.19 కోట్లు ఖర్చు చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. అయితే, ఉపాధిహామీ పథకం అమలు కోసం నిర్వాహకుల ప్రణాళికలు బాగానే ఉన్నా... క్షేత్రస్థాయిలో ఆచరించడం మాత్రం సాధ్యం కావడం లేదు. కొత్తగా కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల మేరకు ఉపాధిహామీ పథకం పనుల పర్యవేక్షణ పూర్తిస్థాయి బాధ్యతలు ఎంపీడీఓలకు అప్పగించినా, వారు పూర్తిస్థాయిలో దృష్టి పెడితేనే లక్ష్యసాధన సాధ్యమనే చర్చ ఉంది. ప్రోగ్రాం ఆఫీసర్లుగా అవతారమెత్తిన ఎంపీడీఓలు కూలీలకు ఇక ముందైనా భరోసా కల్పించాలని పలువురు కోరుతున్నారు. -
తీపి కబురు
⇒ ప్రయివేటీకరణ చెర వీడనున్న ఎన్డీఎస్ఎల్ ⇒ సీఎం సమక్షంలో ఎట్టకేలకు వీడిన సందిగ్ధత ⇒ రైతులతో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం ⇒ చెరుకు ధరపై స్పష్టత ఇచ్చిన కేసీఆర్ ⇒ టన్నుకు రూ. 340 ప్రభుత్వమే భరిస్తుందని హామీ బోధన్: బోధన్ ప్రాంత రైతులు, కార్మికులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎట్టకేలకు తీపికబురు అందించారు. ‘నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్’కు ప్రయివేటు చెర విడిపించేందుకు భరోసా ఇచ్చారు. పుష్కర కాలంగా ఈ అంశం పెండింగ్లో ఉంది. ఎన్డీఎస్ఎల్ను ప్రభు త్వ పరం చేస్తామని, ఫ్యాక్టరీకి పూర్వ వైభవం తెస్తామ ని టీఆర్ఎస్ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చింది. ఇపుడు ఆ హామీ నెరవేరేలా ఓ అడుగు ముందుకు పడింది. సోమవారం సీఎం హైదరాబాద్లోని సచివాల యంలో బోధన్, కరీంనగర్ జిల్లా మెట్పల్లి, మెదక్ జిల్లాకు చెందిన ఎన్డీఎస్ఎల్ యూనిట్ల పరిధిలోని రైతులతో సమావేశమయ్యారు. నిజామాబాద్, జహీరాబాద్ ఎంపీలు కల్వకుంట్ల కవిత, బీ బీ పా టిల్, రాష్ట్ర మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి, బోధన్, మెట్పల్లి, మెదక్ ఎమ్మెల్యేలు మహ్మద్ షకీల్, వి ద్యాసాగర్రావు, పద్మాదేవేందర్రెడ్డి ఇందులో పా ల్గొన్నారు. ఈ సందర్భంగా చక్కెర ఫ్యాక్టరీ భవితపై నిర్ణయం తీసుకునేందుకు రైతులతో సమావేశాలు నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. ఈ విషయా న్ని బోధన్ చెరుకు ఉత్ప త్తిదారుల సంఘం అధ్యక్షు డు కెపీ శ్రీనివాస్రెడ్డి ఫోన్లో ‘సాక్షి’కి తెలిపారు. కొ ద్ది రోజుల క్రితమే ఎమ్మెల్యే షకీల్ నేతృత్వంలో రైతులు ఎంపీ కవితను కలిసి చెరుకు ధర, ఫ్యాక్టరీ భవిత అంశాలపై చర్చించారు. ఆమె చొరవ తీసుకుని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. సమావేశాలు ఇలా ఫ్యాక్టరీ భవిత గురించి చర్చించేందుకు మూడు ఫ్యాక్టరీల పరిధిలో రైతులతో సమావేశాలు నిర్వహించాలని కేసీఆర్ సూచించారు. ఈ నెల 7న మెట్పల్లిలో, 10న మెదక్లో, 11న బోధన్లో సమావేశాలు నిర్వహిస్తారు. బోధన్ సమావేశానికి ఎంపీ కవిత హాజరవుతారు. ఫ్యాక్టరీని ప్రభుత్వమే నిర్వహించాలా? రైతుల భాగస్వామ్యంతో నడుపాలా అనే అంశంపై అభిప్రాయాలు సేకరించనున్నారు. పొరుగున ఉన్న మహారాష్ట్రలో సహకార పద్ధతిన నడుస్తున్న ఫ్యాక్టరీల నిర్వహణపై అధ్యయనం చే యాలని సీఎం సూచించినట్టు రైతు నాయకులు తెలిపారు. ఒక్క పైసా ఖర్చు బరువు పడకుండా ప్రభుత్వం ఫ్యాక్టరీని ఆధునీకరిస్తుందని హామీ ఇచ్చారన్నారు. 2014-15 క్రషింగ్ సీజన్కుగాను ఎన్డీఎస్ఎల్ యాజమాన్యం టన్నుకు రూ. 2260 ధర చెల్లిస్తామంటోంది. రైతులు రూ. 2600 చెల్లిం చాలని కోరుతున్నారు. దీనికీ సీఎం అంగీకరించి, రెండు మూడు రోజులలో జీఓ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. 12 ఏళ్లుగా నాటకీయ పరిణామాలు ఆసియాలోనే అతి పెద్ద వ్యవసాయాధార పరిశ్రమగా ఖ్యాతి పొందిన బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ నిజాం పాలకులు 1938లో నిర్మించారు. ప్రభుత్వరంగ సంస్థగా ఉండగా ఇది ఓ వెలుగు వెలిగింది. వేలాది మంది కార్మికులకు జీవనోపాధి కల్పించిం ది.రైతులకు లాభసాటి ధర అందించింది. 2002లో చంద్రబాబు దీనిని ప్రయివేటీ కరించారు. వారికే నిర్వహణ అధికారం కట్టబెట్టారు. దీంతో రైతులు, కార్మికులు తీవ్ర కష్టాల పాలయ్యారు. వందలాది మంది కార్మికులను ఉద్యోగాలు కోల్పోయారు. రై తులు లాభసాటి ధర అందక అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ప్రయివేటీకరణను రద్దు చేయాలని రైతులు, కార్మికులు దశాబ్ద కాలం నుంచీ పోరాడుతున్నారు. నిజాం షుగర్స్ పరిరక్షణ కమిటీ కన్వీనర్ ఎం అప్పిరెడ్డి, పలువురు రైతు, కార్మిక సం ఘాలు హైకోర్టును ఆశ్రయించి న్యాయ పోరాటం చేశారు. ఇపుడు ఈ పోరాటం ఫలిం చబోతోంది. 2004లో వైఎస్ఆర్ హయాంలో సభా సంఘం 2004లో అధికారంలోకి వచ్చిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నిజాం షుగర్స్ ప్రయివేటీకరణలో అవినీతి,అక్రమాల నిగ్గు తేల్చేందుకు సభా సంఘాన్ని నియమించారు. 2006 ఆగస్టు 31న ఇది నివేదిక ఇచ్చింది. ఫ్యాక్టరీని తిరిగి స్వా దీనం చేసుకోవాలని సిఫారసు చేసింది. ఆయన మరణానంతరం ఈ అంశం కోర్టు విచారణకు వ చ్చిన సందర్భంలో ఉమ్మడి రాష్ట్రం ప్రభుత్వం మీనమేషాలు లెక్కించింది. ఫ్యాక్టరీ స్వాధీనం అంశాన్ని పట్టించుకోలేదు. దాంతో విషయం మరుగున పడిపోయింది. ఎట్టకేలకు సీఎం కేసీఆర్ ఫ్యాక్టరీపై స్పష్టత ఇవ్వడంతో రైతులు, కార్మికులలో హర్షం వ్యక్తం అవుతుంది. సీఎంతో జరిగిన సమావేశంలో చెరుకు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు కెపీ శ్రీనివాస్రెడ్డి,ఉపాధ్యక్షుడు శివరాజ్పాటిల్, ప్రధాన కార్యదర్శి గోపాల్ రెడ్డి, బి. సుబ్బారావు, మారుతీపటేల్, ఆర్ విఠల్, నిజాం షుగర్స్ పరిరక్షణ కమిటీ కన్వీనర్ ఎం అప్పిరెడ్డితోపాటు మరో 30 మంది రైతులు, మెట్పల్లి, మెదక్కు చెందిన రైతు నాయకులు పాల్గొన్నారు. -
‘ఉపాధి’లో రూ.1.63కోట్లు ఉఫ్!
జగ్గయ్యపేట మండలంలో అక్రమాల గుర్తింపు రూ.98లక్షల రికవరీకి ఆదేశం సామాజిక తనిఖీ ప్రజావేదిక సభలో ఉద్రిక్తత చిల్లకల్లు (జగ్గయ్యపేట) : జగ్గయ్యపేట మండలంలో 2013, జూన్ నుంచి 2014 మే వరకు నిర్వహించిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో రూ.1.63కోట్ల మేరకు అక్రమాలు జరిగాయి. ఈ మొత్తంలో రూ.98లక్షలు రికవరీ చేయాలని, రూ.40లక్షలపై విచారించాలని ఆదేశించినట్లు పీడీ తెలిపారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం జగ్గయ్యపేట మండల ఉపాధి హామీ పథకంపై సామాజిక తనిఖీ ప్రజావేదిక జరిగింది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సభకు 17 గ్రామాలకు చెందిన కూలీలు, ప్రజలు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. పంచాయతీల వారీగా ఉపాధి హామీ పథకం జిల్లా ప్రాజెక్టు డెరైక్టర్ అనిల్కుమార్ సామాజిక తనిఖీ బృందం గ్రామాల్లో గుర్తించిన నివేదికలను చదివి వివరించారు. మండలంలో 2013, జూన్ నుంచి 2014, మే వరకు రూ.7కోట్ల మేర మట్టి, రోడ్లు, కంపచెట్లు తొలగింపు వంటి పనులను చేపట్టినట్లు తెలిపారు. ఈ పనుల వివరాలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు వారం రోజులపాటు గ్రామాల్లో సామాజిక తనిఖీ బృందం సభ్యులు పర్యటించి పనుల వివరాలను గుర్తించారని చెప్పారు. బినామీ పేర్లతో మస్తర్లు, మట్టి తోలకాలు, ట్రాక్టర్లకు చెల్లించే రశీదు నంబర్లు, ద్విచక్రవాహనాల నంబర్లు, మృతిచెందిన వారికి వేతనాలు చెల్లించడం వంటివి గుర్తించినట్లు వివరించారు. మొత్తం పనులు రూ.7కోట్లతో నిర్వహించగా, రూ.1.63 కోట్ల మేరకు అవినీతిని గుర్తించినట్లు తెలిపారు. బాధ్యుల నుంచి రూ.98లక్షల రికవరీకి ఆదేశించినట్లు పీడీ తెలిపారు. మరో రూ.40లక్షల విలువైన పనులపై విచారణకు ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్కు మద్దతుగా గ్రామస్తుల ఆందోళన షేర్మహ్మద్పేట ఫీల్డ్ అసిస్టెంట్ సక్రమంగానే పనిచేస్తున్నాడని, అతనిపై కొందరు రాజకీయ నాయకులు వ్యక్తిగత ద్వేషంతో అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారని కూలీలు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. సభలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ సైతం సమాధానం చెప్పాలని నిలదీశారు. మల్కాపురానికి చెందిన కొందరు నాయకులు కూడా ఫీల్డ్ అసిస్టెంట్ సక్రమంగా పనిచేయడం లేదంటూ ఫిర్యాదు చేయగా, కూలీలు ఖండించారు. పనులు సక్రమంగా చేశామని, ఫీల్డ్ అసిస్టెంట్పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ అధికారులకు లిఖితపూర్వంగా వినతిపత్రం అందించారు. పోచంపల్లిలో మృతిచెందిన వారికి వేతనాలు ఇవ్వడంతోపాటు మట్టి రోడ్డుకు రూ.2.47 లక్షలను అదనంగా చెల్లించినట్లు గుర్తించారు. తనిఖీ బృందం నివేదికల ఆధారంగా ఫీల్డ్ అసిస్టెంట్లపై చర్యలు తగదని, వారి అభిప్రాయాలు కూడా తెలుసుకోవాలని పలువురు కోరారు. ఆరోపణలు, పత్యారోపణలో ఒకదశలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా విజిలెన్స్ అధికారి సురేష్బాబు, ఏపీడీ కవిత, స్టేట్ టీం మానిటర్ కె.సత్యనారాయణ, ఎంపీపీ తాళ్లూరి పార్వతి, జెడ్పీటీసీ సభ్యురాలు ఎ.రాణి, ఎస్ఆర్పీలు ఎన్వీవీఎస్ఎన్ రెడ్డి, ఎ.నాగేశ్వరరావు, డి.ప్రభాకర్, 22మంది డీఆర్పీలు, 47మంది వీఎస్పీలు పాల్గొన్నారు. -
అంతా..బుస్!
కర్నూలు(హాస్పిటల్): ఇప్పుడిప్పుడే వర్షాలు ప్రారంభమయ్యాయి. వ్యవసాయ పనుల కోసం రైతులు, కూలీలు పొలాలకు వెళ్తున్నారు. పొదల మాటున, బొరియల్లో ఉండే పాములను గమనించక వాటి కాటుకు గురవుతున్నారు. ఈ సమయంలో వీరి ప్రాణాలు నిలపాల్సిన యాంటీ స్నేక్ వీనమ్(ఏఎస్వీ)లు అందుబాటులో ఉండటం లేదు. ఆరోగ్య శాఖ అలసత్వంతో అనేక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఈ వ్యాక్సిన్ లభ్యం కావడం లేదు. చాలా పీహెచ్సీల్లో దీన్ని నిల్వ చేసుకునేందుకు సౌకర్యాలు లేవు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు దూరంగా ఉన్న గ్రామాల్లో పాము కాటు వేస్తే... కాటికే వెళ్తారన్న విమర్శలు ఉన్నాయి. అలాగే నాటు వైద్యం వైపు కూడా ప్రజలు మొగ్గుచూపడంతో ఈ సమస్య నెలకొందన్న అభిప్రాయం ఉంది. గ్రామీణ ప్రజలకు వైద్యం అందించేందుకు జిల్లాలో 83 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. వీటికి అదనంగా 16 సామాజిక ఆరోగ్య కేంద్రాలు(సీహెచ్సీ) ఏర్పాటు చేశారు. ఇప్పటికి ఆంధ్రప్రదేశ్ వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థలో 3,371 యాంటీ స్నేక్ వ్యాక్సిన్లు స్టోరేజ్లో ఉన్నాయి. అధికారికంగా రూ.6, 38, 35 విలువ చేసే వీటిని కొన్ని మండలాలకు తరలించినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మే నెల 12వ తేదీ సంజామల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, 13వ తేదీ పెద్దయమ్మనూరు, 15వ తేదీ చిప్పగిరి, 22న కోడుమూరు, జూన్ నెల 6న ఆలూరు, 11న పత్తికొండ, వేల్పనూరు, 14న ఎమ్మిగనూరు, 17న ఆదోని, 22న డోన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తరలించినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే చాలా చోట్ల ఈ వ్యాక్సిన్ అందుబాటులో లేదు. పాణ్యం నియోజకవర్గం పరిధిలోని ఓర్వకల్లు, గడివేముల మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వీటి కొరత ఉంది. కొన్ని పీహెచ్సీల్లో వీటిని నిల్వ చేసేందుకు సదుపాయాలు లేవు. దీంతో విషసర్పాలు, విష పురుగుల కాటుకు గురైనవారు అక్కడి వెళ్తే చికిత్స అందడం లేదు. వేరొక ఆసుపత్రికి వెళ్లేలోగా మృత్యువాత పడుతున్నారు. మృతులు వందల్లో ఉంటున్నా అధికారుల తమ రికార్డుల్లో పదుల సంఖ్యలో నమోదు చేస్తున్నారు. విలువైన ప్రాణాలు పోతున్నా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిద్రమత్తు వీడటం లేదన్న విమర్శలున్నాయి. -
శేషాచలం అడవుల్లో పోలీస్ ఫైర్
రాళ్లతో ‘ఎర్ర’ స్మగ్లర్ల దాడి ఆత్మరక్షణ కోసం పోలీసుల కాల్పులు నిందితుల పరార్ తిరుపతి, న్యూస్లైన్: జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లు, వారికి సహకరిస్తున్న కూలీల ఆగడాలకు అంతులేకుండా పోతోంది. స్మగ్లర్ల ఆట కట్టించేందుకు అడవిలోకి వెళ్లిన పోలీసులపై ఎదురు దాడులకు దిగుతున్నారు. ఈ క్రమంలో పోలీసులు తుపాకులకు పనిచెబుతున్నారు. రెండు రోజుల క్రితం శేషాచల అడవిలోని చామలరేంజ్లో ఇలాంటి సంఘటనే జరిగింది. తాజాగా ఆదివారం శేషాచలం కొండల్లో గుడ్డెద్దుబండ, ఈతకుంట ప్రాంతాల్లో కూంబింగ్కు వెళ్లిన పోలీసులపై ఎర్రచందనం కూలీలు రాళ్లు రువ్వారు. పోలీసులు ఆత్మ రక్షణ కోసం కాల్పులు జరిపారని జిల్లా సెక్యూరిటీ వింగ్ డీఎస్పీ ఇలియాస్బాషా తెలిపారు. ఆయన కథనం మేరకు.. 15 మంది స్పెషల్ పార్టీ పోలీసులు ఆదివారం కల్యాణిడ్యాం సమీపంలోని శ్రీవారి పాదాలు ప్రాంత అడవిలోకి కూంబింగ్కు వెళ్లారు. ఆ సమయంలో గుడ్డెద్దుబండ వద్ద వారికి సుమారు 30 మంది ఎర్రచందనం కూలీలు, స్మగ్లర్ల ముఠా ఎదురుపడింది. పోలీసులను చూసిన వెంటనే వారు రాళ్లు రువ్వి ఎదురుదాడికి దిగారు. దాంతో పోలీసులు ఆత్మరక్షణ కోసం రెండు రౌండ్లు కాల్పులు జరి పారు. నిందితులు రాళ్లు రువ్వుతూ పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని పారిపోయారు. అలాగే కొండ దిగువ భాగంలో శ్రీవారి పాదాల ప్రాంతానికి ఎడమ వైపు 3 కిలోమీటర్ల దూరంలోని అటవీ ప్రాంతానికి 40 మందితో కూడిన మరో స్పెషల్ పార్టీ పోలీసు బృందం కూం బింగ్కు వెళ్లింది. అక్కడ ఈతగుంట ప్రాంతంలో వారికి స్మగ్లర్ల ముఠా తారసపడింది. వారిని పట్టుకునే ప్రయత్నం చేస్తుండగా స్మగ్లర్లు పోలీ సులపైకి రాళ్లు విసిరారు. ఆత్మరక్షణ కోసం పోలీసులు రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో స్మగ్లర్లు పారిపోయారు. ఈ రెండు సంఘటనలు ఆదివారం సాయంత్రం చీకటి పడిన తర్వాత జరిగినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై ప్రాథమిక సమాచారం మాత్రమే అందిందని, పోలీసు బృందాలకు స్మగ్లర్లు ఎవైరైనా పట్టుబడ్డారా, ఎర్రచందనం దుంగలు లభ్యమయ్యాయా అనేది ఇంకా తెలియలేదని డీఎస్పీ ఇలియాస్బాషా చెప్పారు. -
ఉపాధి కూలీ... జేబు ఖాళీ
నిజాంసాగర్, న్యూస్లైన్: పొట్టకూటి కోసం ఉపాధి పనులు చేస్తున్న కూలీలు డబ్బుల కోసం నిరీక్షిస్తున్నారు. వారం రోజుల్లో చేతికందాల్సిన కూలీ డబ్బులు రెండు నెలలైనా అందడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండుటెండల్లో రెక్కలు వంచి ఉపాధి పనులు చేస్తున్నా.. కూలీ డబ్బులు సకాలంలో రాకపోవడంతో వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రు. జిల్లాలో 718 గ్రామపంచాయతీల కు గాను 620 పైగా గ్రామ పంచాయతీల్లో ఉపాధి పనులు జరుగుతున్నాయి. ఆయా గ్రామాల్లో రోజుకు 1.5 లక్షల మంది కూలీలు ఉపాధి పనుల్లో పాల్గొం టున్నారు. గత మార్చి 2వ వారం నుంచి ఉపాధి పనులు చేస్తున్న కూలీల కు ఇంతవరకు డబ్బులు రాలేదు. వారం వారం కూలీలు ఉపాధి పనులు చేస్తున్నా, అధికారులు డబ్బులు మం జూరు చేయకపోవడంతో అవస్థలు పడుతున్నారు.కుంటుంబ పోషణ కోసం కూలీ పనులు చేస్తున్న వారికి సకాలంలో డబ్బులు అందకపోవడంతో అప్పులు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో కూలీల సంఖ్యను పెంచాలని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశాలు జారీచేస్తున్న అధికారులు, కూలీ డబ్బుల చెల్లింపుపై శ్రద్ధ చూపడం లేదు. కూలి డబ్బుల కోసం గ్రామాల్లో ఉన్న పోస్టాఫీసుల్లో, సీఎస్పీ కేంద్రాల ద్వారా డబ్బులు తీసుకోవాల్సిన కూలీలు వారిచుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. రెండు నెలల నుంచి ఉపాధి డబ్బులు పెండింగ్లో ఉండటంతో కూలీలు ఈజీఎస్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా కూలీలకు దాదాపు 20 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఎన్ఆర్ఈ జీఎస్ ద్వారా కేంద్ర ప్రభుత్వం గ్రాంటు కొరత వల్ల డబ్బులు రావడం ఆలస్యమవుతోందని ఈజీఎస్ జిల్లా అధికారుల ద్వారా తెలిసింది. -
సిటీ గజగజ
చలి నగరవాసులను భయపెడుతోంది. వృద్ధులు వాకింగ్కి వెళ్లాలంటే జంకుతున్నారు. భానుడి కిరణాలు సైతం శీతల గాలుల గిలిగింతలను అడ్డుకోలేకపోతున్నాయి. స్కూలుకి వెళ్లే విద్యార్థులు.. కొలువుకి వెళ్లే ఉద్యోగులు.. పనులకు వెళ్లే కూలీలు తప్పదంటూ ఇంటి నుంచి బయటకు అడుగులు వేస్తున్నారు. సోమవారం మంచుకురిసే వేళలో నగరంలో కనిపించిన దృశ్యాలు.మంచుదుప్పటి కప్పుకున్న బీహెచ్ఈఎల్ ప్రాంతంకండువాలు కప్పుకుని పనికెళ్తూ...కొలిమి పక్కన వెచ్చగా కాసేపు నిద్రపోని...పాఠాలు చదివేముందు కాసేపు పరుగుఇంటి ముందు కల్లాపు చల్లుతూ..ఎండ పడే ప్రాంతంలో నిలబడి ఉన్న అయ్యప్ప స్వాములుభానుడి కిరణాల తోడుగా బడికిస్వేదం చిందిస్తే చలి ఇంకెక్కడ?నగరంలో చలి తీవ్రతను తెలుపుతున్న సూచిక బోర్డు ఫొటోలు : మోర్లా అనిల్కుమార్ -
మార్కెట్లో మళ్లీ మొదలైన దౌర్జన్యం
కేసముద్రం, న్యూస్లైన్ : కేసముద్రం మార్కెట్లో సమసిపోరుునట్లేనని భావించిన కూలీల దాన,ధర్మాల వివాదం మళ్లీ మొదటికొచ్చింది. మార్కెట్లో దానధర్మాల పేరిట కూలీలు ధాన్యం తీసుకోవడం ఇకమీదట జరగదంటూ మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు ప్రకటించినా పరిస్థితిలో మార్పు రాలేదు. ఇటీవల ఇదే విషయమై కూలీలు రైతులపై దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనను మార్కెటింగ్ శాఖ అధికారులు, ఇటు రూరల్ ఎస్పీ పాలరాజు సీరియస్గా తీసుకున్నారు. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వ్యాపార, రైతు, కూలీ సంఘాల నాయకులతో రెండు రోజుల క్రితం డీడీఎం, ఏడీఎం, పాలకవర్గం సమక్షంలో చర్చలు జరిపారు. అనంతరం ఇక నుంచి దానధర్మాలు ఉండవని తెలిపారు. దీంతో చర్చల అనంతరం ఎట్టకేలకు గురువారం మార్కెట్ పునఃప్రారంభం కాగా మార్కెట్లో మళ్లీ కూలీలు దానధర్మాల పేరిట రైతులపై దౌర్జన్యానికి దిగారు. దీంతో ఆగ్రహించిన రైతులు తాము ఎందుకు ధాన్యం ఇవ్వాలంటూ నిలదీయడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఫలితంగా సాయంత్రం వరకు మక్కలకు వేలం పాటలు నిలిచిపోయాయి. చివరికి మార్కెట్ కమిటీ చైర్మన్ మాదవపెద్ది శశివర్దన్రెడ్డి వ్యాపారులతో, కార్మిక నాయకులతో చర్చలు జరిపారు. అయినా సమస్య కొలిక్కి రాకపోవడంతో మధ్యాహ్నం 3 గంటల వరకు మక్కలకు వేలంపాటలు నిలిచిపోయాయి. అప్పటికే అక్కడికి చేరుకున్న రైతు సంఘం నాయకులు రైతుల పక్షాన నిలవగా, కూలీల తరఫున కార్మిక సంఘాల నాయకులు నిలిచారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. సరుకులకు ఎందుకు వేలం పాటలు పెట్టరంటూ రైతులు మార్కెట్ కార్యాలయానికి దూసుకొచ్చి దిగ్బంధించారు. విషయం తెలుసుకున్న ఎస్సై అబ్దుల్ రహమాన్ సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. ఆగ్రహించిన రైతులను శాంతింపజేశారు. అనంతరం కార్మిక సంఘం నాయకులతో, రైతు సంఘం నాయకులతో ఎస్సై, మార్కెట్ చైర్మన్ చర్చలు జరిపారు. చివరకు పడిగాపులు పడుతున్న రైతులను దృష్టిలో పెట్టుకోనైనా దానధర్మాలు లేకుండా కాంటాలు పెట్టాలని, కూలీల సమస్యలను తర్వాత పరిష్కరించుకోవాలే తప్ప రైతులపై ఇలా దౌర్జన్యాలకు దిగడం సరికాదని ఎస్సై కూలీలను, ఆ సంఘాల నాయకులను హెచ్చరించారు. ఎస్సై ప్రతి యార్డు తిరుగుతూ పోలీస్ బందోబస్తు మధ్య కూలీలతో ధాన్యాన్ని, మక్కలను, పెసర్లను, పసుపును ఎత్తించారు. కూలీల ప్రవర్తనతో రైతులు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. మార్కెట్లో కూలీలు చేస్తున్న దౌర్జన్యాన్ని అరిక ట్టాలని రైతులు, రైతుసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. మళ్లీ మార్కెట్కు సెలవులు కొలిక్కి వచ్చిందనుకున్న సమస్య మళ్లీ మొదటికి రావడంతో కూలీలతో పూర్తిస్థాయి చర్చలు జరిపేందుకుగాను మార్కెట్కు ఈనెల 20, 21 తేదీల్లో సెలవులు ప్రకటించినట్లు మార్కెట్ చైర్మన్ మాదవపెద్ది శశివర్దన్రెడ్డి తెలిపారు.