Left Wing Parties
-
అమిత్ షాతో భేటీలో పాల్గొన్న సీఎం కేసీఆర్, ఏపీ డిప్యూటీ సీఎం సుచరిత
సాక్షి, న్యూఢిల్లీ: వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల సమావేశం ఆదివారం ఉదయం ప్రారంభమైంది. వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాలతో కేంద్ర హోంశాఖ ఈ కీలక సమావేశం నిర్వహించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ప్రారంభమైన ఈ సదస్సుకు వామపక్ష తీవ్రవాద ప్రభావితం ఉన్న 10 రాష్ట్రాలు హాజరయ్యాయి. తెలంగాణ, ఏపీతో పాటు చత్తీస్గఢ్, ఒడిశా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బిహార్, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్లకు చెందిన వారు హాజరయ్యారు. సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హాజరయ్యారు. అయితే ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరు కావాల్సి ఉండగా అస్వస్థతకు గురవడంతో ఢిల్లీ ప్రయాణం రద్దు చేసుకున్నారు. దీంతో ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత పాల్గొన్నారు. తమ రాష్ట్రాల్లో వామపక్ష తీవ్రవాదం ప్రస్తుత పరిస్థితి, చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను ఆయా రాష్ట్రాలు వివరించాయి. -
వీవీ ప్రాణాలు కాపాడాలి
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ విప్లవకవి వరవరరావు(వీవీ)కు కోవిడ్ సోకిన నేపథ్యంలో వెంటనే ఆయనను జైలు నుంచి విడుదల చేసి, మెరుగైన చికిత్స అందించి ప్రాణాలు కాపాడాలని కేంద్ర ప్రభుత్వానికి వివిధ వామపక్ష పార్టీల నేతలు శుక్రవారం విజ్ఞప్తిచేశారు. వీవీతోపాటు 90 శాతం అంగవైకల్యమున్న ప్రొ.జీఎన్ సాయిబాబా, ఇతర రాజకీయ ఖైదీలను బెయిల్పై విడుదల చేయాలని కోరారు. ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురైనప్పుడే బెయిల్ ఇచ్చి ఉంటే ఆయనకు కోవిడ్ సోకేది కాదన్నారు. వెంటనే ఆయనను విడుదల చేసి డాక్టర్లు, కుటుంబసభ్యుల సంరక్షణలో హైదరాబాద్కు తరలించి మెరుగైన వైద్యాన్ని అందించడం ద్వారా ప్రాణాలను కాపాడొచ్చని పేర్కొన్నారు. శుక్రవారం మఖ్దూంభవన్లో సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అధ్యక్షతన జరిగిన సమావేశంలో చాడ వెంకటరెడ్డి, పశ్యపద్మ, ఎన్.బాలమల్లేష్ (సీపీఐ), డీజీ నర్సింహా రావు, బి.వెంకట్ (సీపీఎం), కె. గోవర్థన్. కె.రమాదేవి (న్యూడెమోక్రసీ రెండు గ్రూపులు), ఉపేందర్ రెడ్డి (ఎంసీపీఐ–యూ), సీహేచ్ మురహరి (ఎస్యూసీఐ–సీ),డి.రాజేశ్ (లిబరేషన్) పాల్గొన్నారు. ప్రజాసంఘాల ర్యాలీ విరసం నేత వరవరరావుతోపాటు దేశవ్యాప్తంగా జైళ్లలో ఉన్న రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలని పీడీఎస్యూ, పీవోడబ్లు్య, ఐఎఫ్టీయూ, ఏఐకేఎంఎస్, ప్రజా సంఘాలు శుక్రవారం విద్యానగర్ నుంచి హిందీ మహావిద్యాలయ వరకు ర్యాలీ నిర్వహించాయి. పీవోడబ్లు్య జాతీయ అధ్యక్షురాలు వి.సంధ్య మాట్లాడుతూ వరవరరావు, సాయిబాబాలకు కరోనా సోకడంతో పాటు తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి మెరుగైన వైద్య చికిత్సలు అందించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు. కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి అచ్యుత రామారావు, ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. శ్రీనివాస్, సహాయ కార్యదర్శి జి. అనురాధ, పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు పరశురామ్, నగర అధ్యక్షుడు రియాజ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజాస్వామ్యాన్ని కాపాడండి : వామ పక్షాలు
విజయనగరం పూల్బాగ్ : పశ్చిమ బెంగాల్, త్రిపుర రాష్ట్రాల్లో జరుగుతున్న ప్రజాస్వామ్య ఖూనీని నిరసిస్తూ అఖిలభారత వామపక్షాల పిలుపు మేరకు సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో గురువారం స్థానిక కోట జంక్షన్ నుంచి కన్యకాపపరమేశ్వరి కోవెల వరకు నిరసన ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ, సీపీఐ నాయకులు బుగత సూరిబాబు మాట్లాడుతూ తృణమూల్ కాంగ్రెస్ పశ్చిమ బెంగాల్లో, బీజేపీ త్రిపురలో అధికారం చేపట్టిన నుంచి యథేచ్ఛగా మానవ హక్కులు ఉల్లంఘించబడుతున్నాయని ఆరోపించారు. వామపక్ష కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. వామపక్ష కార్యకర్తలపైనే కాకుండా ప్రజలపైన తృణమూల్ గూండాలు దాడులకు పాల్పడుతున్నారని చెప్పారు. కార్యక్రమంలో వామపక్ష నేతలు డి.అప్పలరాజు, గాడి అప్పారావు, సుధారాణి, అప్పారావు, రామారావు, రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. -
ముందస్తుకు సంకేతమా?
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: విపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై చర్చ చేపట్టడానికి కేంద్రం అంగీకరించడంతో ముందస్తు ఎన్నికలపై ఊహాగానాలు మరోసారి ఊపందుకున్నాయి. లోక్సభ ఎన్నికలను ముందుకు జరిపే విశేష అధికారం ప్రధానికే ఉన్నా, చివరి నిమిషం లెక్కలను బేరీజు వేసుకుని ఆ దిశగా అడుగేసే అవకాశాలున్నాయి. 2019 సాధారణ ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించడానికి ఇంకా 7–8 నెలల సమయమే మిగిలి ఉన్న నేపథ్యంలో మోదీ ఆలోచన ఏంటో ఊహించడం కష్టమని, ఏదైనా జరగొచ్చని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సభ్యుడు ఒకరు వెల్లడించారు. మరోవైపు, రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లతో పాటే లోక్సభ ఎన్నికలు జరుగుతాయన్న ఊహాగానాలను బీజేపీ వర్గాలు తోసిపుచ్చాయి. ఈ పార్లమెంట్ సమావేశాల్లో కొన్ని కీలక బిల్లులపై చర్చ తప్ప, ముందస్తు ఎన్నికలపై ఆలోచించడం లేదని కేంద్ర మంత్రి ఒకరు తెలిపారు. జాగ్రత్తగా పరిశీలిస్తున్న కాంగ్రెస్, లెఫ్ట్.. ఇటీవల ప్రధాని మోదీ వరుసగా యూపీలో పర్యటించిన సంగతిని విపక్షాలు జాగ్రత్తగా పరిశీలిస్తున్నాయి. ముందస్తు ఎన్నికలకు బీజేపీ అన్ని అవకాశాలను సిద్ధం చేసుకుంటోందా? అని కాంగ్రెస్, లెఫ్ట్లో అంతర్మథనం మొదలైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రచారం, ప్రచారకర్తకు ఎదురయ్యే సమస్యలు ముందుగానే తెలుస్తాయని లెఫ్ట్ నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. బీజేపీకి తగిన రాజకీయ అస్త్రాలు ఉన్నట్లయితే ఇతర పార్టీలు స్పందించేందుకూ అవకాశం ఇచ్చేదని, కానీ ఇప్పుడా పరిస్థితి లేదని అన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా దేశవ్యాప్తంగా పర్యటిస్తూ ‘సంపర్క్ కే సమర్థన్’ పేరిట ప్రముఖులతో సమావేశమై ఎన్డీయే ప్రభుత్వ విజయాలను వివరిస్తున్నారు. సుమారు 100 మంది సిట్టింగ్ ఎంపీలు ఈసారి అవకాశం కోల్పోవచ్చని అమిత్ షా పర్యటనల్లో తెలిసినట్లు బీజేపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరోవైపు, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని ఆరెస్సెస్ ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. -
మెక్సికోపై వామపక్ష కేతనం
ఎటు చూసినా నిరాశా నిస్పృహలు అలుముకున్నప్పుడు, నిజ వేతనాలు పడిపోయి పౌరులు నానా కష్టాల్లో కూరుకుపోయినప్పుడు, అవినీతి రివాజుగా మారినప్పుడు, అరాచకం తాండవించిన ప్పుడు ఎక్కడైనా ఏమవుతుందో మెక్సికోలో కూడా అదే అయింది. రెండు దశాబ్దాలుగా రెండు పార్టీల్లో ఏదో ఒకదాన్ని ఎన్నుకోవడానికి అలవాటుపడిన మెక్సికో పౌరులు ఈసారి అధ్యక్ష ఎన్ని కల్లో కొత్తగా ఆవిర్భవించిన మూడో పార్టీకి పట్టంగట్టి యధాతథ స్థితిని బద్దలుకొట్టారు. ఆదివారం దేశాధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో వామపక్ష మొరెనా పార్టీ అభ్యర్థి ఆండ్రస్ మ్యాన్యువల్ లోపెజ్ ఆబ్రడార్(ఆమ్లో) 53 శాతం ఓట్లతో విజయం సాధించారు. ఆబ్రడార్ ఎన్నికయ్యారని ప్రకటించిన వెంటనే పొరుగు దేశమైన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆయన్ను అభినందించినా వారిద్దరి మధ్య సంబంధాలు ఉప్పు–నిప్పులాగే ఉంటాయని, ఆయన్ను పదవీచ్యుతుణ్ణి చేయడానికి ట్రంప్ మార్గాలు వెదకటం ఖాయమని వారిద్దరి సంగతీ తెలిసిన రాజకీయ విశ్లేషకులు అంచనా. ఆబ్ర డార్కు ‘మెక్సికో ట్రంప్’ అన్న పేరుంది. అలాగని ఇద్దరి సిద్ధాంతాలకూ పొంతన లేదు. కానీ అమల్లో ఉన్న వ్యవస్థను తూర్పారబట్టడంలో, ప్రత్యర్థులను చీల్చిచెండాటంలో, ప్రభుత్వ విధా నాలపై ఓటర్లలో ఉన్న ఆగ్రహాన్ని పసిగట్టి దానికి తగినట్టు మాట్లాడటంలో ఇద్దరూ ఒకటే. అయితే సిద్ధాంతరీత్యా ఆబ్రడార్ వామపక్షవాది గనుక అమెరికా అధ్యక్ష పదవి అభ్యర్థి త్వానికి డెమొక్రటిక్ పార్టీలో హిల్లరీతో పోటీపడిన వామపక్షవాది బెర్నీ శాండర్స్తో ఆయన్ను పోల్చవచ్చు. అధ్యక్ష భవనంలో ఆబ్రడార్ ప్రవేశం అమెరికాకు మింగుడుపడనిది. కానీ చిత్రంగా ట్రంప్ విధానాలే అందుకు కారణమయ్యాయి. ఒకపక్క మెక్సికో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో(ఎఫ్డీఐ) అమెరికా వాటాయే అత్యధికమైనా, అమెరికాకు అది మూడో పెద్ద వాణిజ్య భాగస్వామి అయినా ట్రంప్ అధికారంలోకి రావడానికి ముందు సరే... తర్వాత కూడా మెక్సికో పౌరులను తరచు కించ పరుస్తూ మాట్లాడారు. వారు అమెరికాను కొల్లగొడుతున్నట్టు ప్రచారం చేశారు. మెక్సికోతో ఉన్న సరిహద్దుల పొడవునా గోడ కడతామని, అందుకయ్యే ఖర్చంతా ఆ దేశమే భరించాలని చెప్పారు. అమెరికాకు చట్టవిరుద్ధ వలసలు మెక్సికో నుంచే అధికంగా ఉంటాయన్నది నిజమే అయినా, వారంతా పొట్టకూటి కోసమే వస్తున్నారు. చిన్నా చితకా పనులు చేసుకుని ఎదగడమే వారి ధ్యేయం. మెక్సికోలో పెట్టుబడులు పెట్టి ఏటా భారీయెత్తున లాభాలు గడిస్తున్న అమెరికా పెట్టుబడిదారుల్లా వారేమీ నిలువుదోపిడీకి దిగలేదు. మెక్సికో నుంచి మాదకద్రవ్యాలు వచ్చిపడుతుండటం అమెరి కాకు సమస్య అయితే... అమెరికా నుంచి అక్రమంగా దేశంలోకి ప్రవేశించే మారణాయుధాలు మెక్సికోకు ప్రాణాంతకమవుతున్నాయి. వాటి సాయంతోనే మాదకద్రవ్య ముఠాలు విచ్చలవిడిగా కిడ్నాప్లకూ, హత్యలకూ పాల్పడుతున్నాయి. నిరుడు ఆ దేశంలో 30,000 హత్యలు జరిగాయి. సెనేట్కూ, దిగువ సభకూ ఎన్నికలు ప్రకటించాక 50మంది అభ్యర్థులతోసహా 130మంది నేతల్ని చంపేశారు. బెదిరింపుల పర్యవసానంగా 600మంది పోటీ నుంచి తప్పుకున్నారు. ట్రంప్ అధ్య క్షుడు కాకముందు మెక్సికో పౌరుల్లో అత్యధికులకు అమెరికా అంటే వల్లమాలిన అభిమానం. కానీ ట్రంప్ నిత్య దూషణలతో అది కాస్తా ఆవిరైంది. అదే సమయంలో ట్రంప్కు దీటుగా, ఘాటుగా జవాబిచ్చిన ఆబ్రడార్ను మెక్సికో పౌరులు ఆదరించారు. మెక్సికో అనేక సమస్యలతో అట్టుడుకుతోంది. అక్కడ పౌరులను మాయం చేయడం నిత్య కృత్యం. ఈ ‘అదృశ్యాలకు’ అటు భద్రతా బలగాలు– ఇటు మాదకద్రవ్య ముఠాలు కారణమే. గత దశాబ్దకాలంలో 32,000మంది పౌరులు ఆచూకీ లేకుండా పోయారు. అపహరణలపై కేసులు, అరెస్టులు రివాజు. కానీ ఏళ్లు గడుస్తున్నా ఆ కేసుల అతీగతీ ఉండదు. అప్పుడప్పుడు శవాల దిబ్బలు బయటపడుతుంటాయి. వాటిని తవ్వి డీఎన్ఏ పరీక్షలు జరిపి అదృశ్యమైన వ్యక్తులు చని పోయారని ధ్రువీకరించడం తప్ప ప్రభుత్వం చేస్తున్నదేమీ లేదు. వీటికితోడు మెక్సికోతో 1994లో కుదిరిన ఉత్తర అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(నాఫ్టా)ను తిరగదోడతానని ట్రంప్ ప్రక టించడంతో ఆర్థిక అనిశ్చితి ఏర్పడింది. అనేక అమెరికా సంస్థలు ట్రంప్ విధానాల పర్యవసానంగా అయోమయంలో పడ్డాయి. చిత్రమేమంటే ఆబ్రడార్ కూడా నాఫ్టాకు తొలినుంచీ వ్యతిరేకి. అది దేశ సార్వభౌమత్వాన్ని అమెరికాకు తాకట్టు పెట్టిందని ఆయన ఆరోపణ. అమల్లో ఉన్న ఒప్పందం వల్ల అమెరికాకు అన్యాయం జరిగిందని వాపోయే ట్రంప్ ఒకపక్కా... దీనివల్ల మెక్సికో ప్రజలు నష్ట పోయారని వాదించే ఆబ్రడార్ మరోపక్కా ఉంటే ఇరు దేశాల మధ్యా కొత్త వాణిజ్య ఒప్పందం సంగతలా ఉంచి, అసలు ఎలాంటి ఒప్పందమైనా సాధ్యమేనా అని చాలామంది సందేహం. ఆబ్ర డార్ విజయం ఇప్పుడు అమెరికా పెట్టుబడిదారులను, మెక్సికో వాణిజ్యవేత్తలను కూడా భయ పెడుతోంది. అయితే పాలనకు ఆబ్రడార్ పూర్తిగా కొత్త వ్యక్తేమీ కాదు. ఆయన 1976 నుంచి రాజకీయాల్లో ఉన్నారు. మెక్సికో మేయర్గా పనిచేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ క్షీణ దశలో ఉండగా, అవినీతి, నేరాలు అడ్డూ ఆపూ లేకుండా విస్తరించిన దశలో, సంక్షేమ పథకాలకు, పింఛన్లకు కోతపడిన సమయంలో ఆబ్రడార్ దేశాధ్యక్షుడు కాబోతున్నారు. 2003లో బ్రెజిల్ అధ్యక్షుడిగా వామపక్షవాది లూలా డి సెల్వా ఎన్నికైనప్పుడు, ఇంచుమించు అదే సమయంలో చిలీలో సోషలిస్టు నాయకుడు మైకేల్ బాచెలే విజయం సాధించినప్పుడు ఆ దేశాల స్థితిగతులు మెక్సికో మాదిరే ఉన్నాయి. వారిద్దరూ సమర్ధవంతంగా పాలించి ఆ దేశాలను గట్టెక్కించారు. ఆర్థిక వ్యవస్థల్ని బలో పేతం చేసి సంక్షేమ పథకాలను అమలు చేశారు. అసమానతలను ఏదో మేరకు తగ్గించగలిగారు. ఇటీవలకాలంలో వివిధ దేశాల్లో లెఫ్టిస్టులు దెబ్బతింటుండగా మెక్సికో చరిత్రలో తొలిసారి వామ పక్షం విజయం సాధించడం విశేషమనే చెప్పాలి. అయితే మెక్సికోను ఆబ్రడార్ ఎలా చక్కదిద్దగలరో వేచిచూడాలి. -
మెక్సికోకు వామపక్ష అధ్యక్షుడు
మెక్సికో సిటీ: ఆధునిక మెక్సికో చరిత్రలో తొలిసారిగా ఓ వామపక్ష నాయకుడు ఆ దేశ అధ్యక్ష పదవికి ఎన్నికయ్యారు. దాదాపు గత శతాబ్ద కాలంగా మెక్సికోను పాలిస్తున్న రెండు పార్టీ లను కాదని ఆ దేశ ప్రజలు ఈసారి వామపక్ష పార్టీకి పట్టంగట్టారు. 2014లో మొరెనా పార్టీని స్థాపించిన ఆమ్లో (ఆండ్రస్ మ్యాన్యువల్ లోపెజ్ ఆబ్రడార్)కు తాజాగా జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఏకంగా 53 శాతం ఓట్లు వచ్చాయి. ఆధునిక కాలపు మెక్సికో ఎన్నికల్లో ఓ అభ్యర్థికి 50 శాతానికి మించి ఓట్లు రావడం ఇదే తొలిసారి. ఇన్నేళ్లూ పాలించిన నేషనల్ యాక్షన్ పార్టీ (పీఏఎన్), ఇన్స్టిట్యూషనల్ రివల్యూషనరీ పార్టీ (పీఆర్ఐ)లు వరుసగా రెండో, మూడో స్థానాల్లో నిలిచాయి. తీవ్ర అవినీతి, మితిమీరిన హింస, మత్తుపదార్థాలు తదితర సమస్యలతో విసిగిపోయిన మెక్సికన్లు తాజా ఎన్నికల్లో ఈ రెండు పార్టీలను తిరస్కరించారు. విజయానంతరం ఆమ్లో ప్రసంగిస్తూ ‘ఇదో చరిత్రాత్మకమైన రోజు. ఈ రాత్రి ఎప్పటికీ గుర్తుండిపోతుంది’ అని అన్నారు. వెనుజులా అనుసరిస్తున్న విధానాలనే ఆమ్లో మెక్సికోలో అమలుచేసి ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తారంటూ విమర్శకులు వ్యక్తం చేసిన భయాలను ఆయన కొట్టిపారేశారు. అవినీతిని నిర్మూలించడమే తమ ప్రభుత్వ ప్రాధాన్యమని ఆయన చెప్పగా, మత్తు పదార్థాల వ్యాపారులకు ప్రభుత్వంలోని పెద్దలు, సైన్యంతో సంబంధాలు ఉన్నందున అవినీతిని రూపుమాపడమనేది ఆమ్లో ముందున్న అతిపెద్ద సవాలని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఆమ్లో డిసెంబరులో అధ్యక్షపదవి చేపట్టనున్నారు. పార్టీ స్థాపించాక తొలి ఎన్నికలోనే గెలుపు ఆమ్లో గతంలోనూ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు. 2006, 2012 అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. 2014లో తన సొంత పార్టీ మొరెనా (నేషనల్ రీజనరేషన్ మూవ్మెంట్)ను స్థాపించిన అనంతరం తొలిసారి పోటీచేసిన ఎన్నికల్లోనే గెలుపొందడం గమనార్హం. 1953లో జన్మించిన ఆమ్లోకు దాదాపు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది. మెక్సికోలో ప్రస్తుత అధికార పార్టీ పీఆర్ఐలో 1976లో చేరి ఆయన తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1980ల చివర్లో ఆయన మరో పార్టీలో చేరి గవర్నర్ సహా పలు ఎన్నికల్లో పోటీచేశారు. 2000లో మెక్సికో సిటీ మేయర్గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2006, 2012 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. కాగా, మంచి వక్తగా ఆమ్లో పేరుతెచ్చుకున్నారు. -
టీడీపీ నేతలకు ఘోర అవమానం
సాక్షి, కడప: వైఎస్సార్ కడప జిల్లా అధికార తెలుగుదేశం పార్టీ నాయకులకు ఘోర అవమానం జరిగింది. జిల్లాలో ఉక్కు పరిశ్రమ సాధన కోసం ఎంపీ సీఎం రమేష్ అమరణ దీక్షపై శుక్రవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఇందుకోసం జిల్లాలోని వివిధ రాజకీయ పార్టీల నేతలను ఆహ్వానించారు. ఈ క్రమంలో సమావేశానికి మంత్రి ఆదినారాయణ రెడ్డి, సీఎం రమేష్, టీడీపీ సీనియర్ నేతలు హాజరయ్యారు. అయితే ఈ సమావేశానికి టీడీపీ నేతలు, ఒకరిద్దరు ప్రజా సంఘాల నేతలు తప్ప మిగతా రాజకీయ, ప్రజా, విద్యార్థి సంఘాల నేతలు హాజరు కాలేదు. నాలుగేళ్లుగా జిల్లాలో ఉక్కు పరిశ్రమ కోసం పోరాడని టీడీపీ ఈరోజు సమావేశం పెడితే ఎలా అంటూ వామపక్షాలు కార్యక్రమాన్ని బహిష్కరించాయి. బీజేపీతో సంసారం చేసి విడిపోయి జిల్లాకు మోసం చేసారని వామపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. -
విజయవాడలో వామపక్షాల ధర్నా
-
అమరావతి ఏపీకి కాదు.. టీడీపీ రాజధాని : పవన్
సాక్షి, అమరావతి : చంద్రబాబు ప్రభుత్వం తీరుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం ప్రతిసారి రాజీపడేలా వ్యవహరించిందని తెలిపారు. విభజన హామీల విషయంలో ఒక్కసారి కూడా రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని ఏర్పాటుచేయలేదని గుర్తుచేశారు. సోమవారం ఏపీ వామపక్ష నేతలు మధు, రామకృష్ణతో భేటీ అయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అసలు నిధులే కొరత ఉన్నా.. ఏపీ సర్కారు ఇష్టరాజ్యంగా నిధులను ఖర్చుపెట్టిందని, అభివృద్ధి, ప్రజారోగ్యానికి ఉద్దేశించిన నిధులను పుష్కరాల కోసం ఖర్చు చేసిందని విమర్శించారు. టీడీపీ తీరుతో రాష్ట్రానికి తీరనినష్టం వాటిల్లిందని తెలిపారు. అమరావతి ఏపీ ప్రజలకు సంబంధించిన రాజధానిలా కనిపించడం లేదు.. టీడీపికి సంబంధించిన రాజధానిలా మారిందని మండిపడ్డారు. ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కోసం జనసేన, సీపీఐ, సీపీఎం కలిసి పనిచేస్తాయని పవన్ తెలిపారు. కలిసి ఉద్యమాలు చేస్తాం రాజధాని లేదు. పరిశ్రమలు లేవు. రైల్వే జోన్ లేదు. సీమ, ఉత్తరాంధ్రకు ప్యాకేజీ లేదు. హోదా, విభజన హామీల సమస్యల మీద పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్మించాలని సీపీఎం, సీపీఐ, జనసేన కలిసి నిర్ణయించాయి. మేధావులు, ఉద్యోగస్తులు, మధ్యతరగతి వారిని కలుపుకొని.. ఉత్తరాంధ్ర, రాయలసీమ, ప్రకాశం జిల్లాల నుండి ఉద్యమాలు ప్రారంభిస్తాం. మోసం చేసిన బీజేపీ, వంతపాడిన టీడీపీని ఎండగడుతాం. -సీపీఎం నేత మధు బాబు కొత్త డ్రామాకు తెరతీశారు ఐదు కోట్ల ప్రజలు అన్యాయం జరిగిందని అంటున్నా మోదీ ప్రభుత్వం స్పందించలేదు. నాలుగేళ్ళు లాలూచీ పడి ఇప్పుడు ఉద్యమం చేస్తున్నట్టు బాబు డ్రామా ఆడుతున్నారు. తన లోపాలను ఎండగడితే రాష్ట్రాన్ని అవమాన పరిచినట్టు చంద్రబాబు కొత్త డ్రామాకు తెరతీశారు. అనంతపురంలో ఏప్రిల్లో, తర్వాత విశాఖ, ప్రకాశంలో సమావేశాలు నిర్వహిస్తాం. రాష్ట్రాల్లో ఫిరాయింపు, అవినీతి రాజకీయాలు నడుస్తున్నాయి. ప్రజలు మా వైపు చూసే విధంగా పోరాటం ఉంటది. 27న అంబేద్కర్ విగ్రహాల వద్ద మౌన దీక్షలు చేస్తాం. -సీపీఐ నేత రామకృష్ణ -
‘చలో అసెంబ్లీ’పై పోలీసుల ఉక్కుపాదం
-
వామపక్ష నేతల అరెస్టును ఖండించిన వైఎస్ జగన్
సాక్షి, హైదరాబాద్ : వంశధార ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలపై ఉద్యమిస్తున్న వామపక్ష నేతలను అరెస్టు చేయడాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఛలో వంశధార కార్యక్రమంలో పాల్గొంటున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం జిల్లా నేత ధర్మాన కృష్ణదాస్ను గృహ నిర్బంధంలో ఉంచడాన్ని, మళ్లీ ఈ రోజు వెంటాడినట్లుగా వామపక్ష నేతలను మరోసారి అరెస్టు చేయడాన్ని వైఎస్ జగన్ బుధవారం ఒక ప్రకటనలో ఖండించారు. కాంట్రాక్టర్ల నుంచి కమీషన్ల రూపంలో ఎంత దండుకోవాలన్నదే ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ విధానంగా మారింది తప్ప, నిర్వాసితులకు ఎంత ఇవ్వాలన్నది ఈ ప్రభుత్వం తలకెక్కడం లేదని జగన్ పేర్కొన్నారు. సీపీఎం నేత పి.మధును, సీపీఐ నేత కె.రామకృష్ణతో సహా వామపక్ష నేతలను కూడా ఈ ప్రభుత్వం అరెస్టులు చేసి బెదిరింపులకు గురి చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని తెలిపారు. వంశధారకు సంబంధించిన నిర్వాసితులకు న్యాయం జరిగేలా అన్ని చర్యలూ తీసుకోవాల్సిందేనని జగన్ ఉద్ఘాటించారు. లేని పక్షంలో ప్రజాగ్రహానికి గురికాక తప్పదని ఆయన హెచ్చరించారు. వంశధార నిర్వాసితులకు తప్పనిసరిగా న్యాయం చేస్తామని గతంలోనే తాము మాట ఇచ్చామని ఈ ప్రభుత్వం ముందుకు కదలని పక్షంలో అధికారంలోకి రాగానే వారంతా సంతోషించేలా న్యాయం చేస్తామని జగన్ తన ప్రకటనలో పేర్కొన్నారు. -
వామపక్ష నేతల అరెస్ట్..
-
అనంతలో ఉద్రిక్తత: బస్సులు, ఏటీఎంలపై దాడులు
అనంతపురం: అనంతపురంలో వామపక్షాల బంద్ ఉద్రిక్తతకు దారితీసింది. రామచంద్రనగర్లో ఆందోళనకారులు విధ్వంసానికి దిగారు. 10 బస్సులు, 5 దుకాణాలను ధ్వంసం చేశారు. పలు దుకాణాలు మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సుల అద్దాలను ధ్వంసం చేయగా ఇండియన్ బ్యాంకు పై రాళ్లదాడి జరిగింది. ఏటీఎంను కూడా ధ్వంసం చేశారు. మడకశిరలో కూడా వామపక్షాల కార్యకర్తలు విధ్వంసానికి దిగారు. కాగా ఆందోళన చేస్తున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, ఏఐసీటీయూ రాష్ట్ర కార్యదర్శి ఓబులేశులను పోలీసులు అరెస్టు చేశారు. -
మిర్చికి మద్దతు ధర ఇవ్వండి
ఒంగోలు టౌన్: మిర్చి క్వింటా 10వేల రూపాయలకు మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని నాలుగు వామపక్ష రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. గురువారం స్థానిక ఎల్బీజీ భవన్లో జరిగిన సమావేశంలో ఈ మేరకు తీర్మానించాయి. రైతు సంఘం జిల్లా కార్యదర్శి వి. హనుమారెడ్డి మాట్లాడుతూ మిర్చి రైతులు ఈ ఏడాది పంట పండించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరాకు 70వేల రూపాయల వరకు ఖర్చు చేశారన్నారు. ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పమిడి వెంకట్రావు మాట్లాడుతూ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించినా మిర్చి పంటను ఇంతవరకు నమోదు చేయకపోవడం దారుణమని తెలిపారు. ఎండిపోయిన మిర్చి పంటను వెంటనే నమోదుచేసి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతు కూలీ సంఘం జిల్లా నాయకుడు రామారావు మాట్లాడుతూ సాగు విస్తీర్ణం పెరగడం వల్ల ధరలు తగ్గాయని అధికారులు చెప్పడం సరికాదన్నారు. ఈ ఏడాది విస్తీర్ణం పెరిగినా దిగుబడి తగ్గిన విషయాన్ని గుర్తెరగాలన్నారు. అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకుడు ఆర్. మోహన్ మాట్లాడుతూ మిర్చి ధరలు రోజురోజుకు పతనం అవుతున్నా ప్రభుత్వం ప్రేక్షకపాత్ర వహిస్తోందని విమర్శించారు. కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి పెంట్యాల హనుమంతరావు మాట్లాడుతూ ఐక్య ఉద్యమాల ద్వారా గతంలో అనేక ఫలితాలు సాధించుకోవచ్చని చెప్పారు. మిర్చి రైతుల సమస్యలపై ఐక్య పోరాటాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. రైతు కూలీ సంఘం జిల్లా నాయకురాలు ఎస్. లలితకుమారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో నాయకులు పరిటాల నాగేశ్వరరావు, నాంచార్లు, కె. హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. -
ఇలపర్రు దళితులపై పోలీస్ జులుం
వామపక్ష నాయకులపై లాఠీచార్జి ► నేతలను ఈడ్చుకెళ్లి వాహనంలోపడేసిన పోలీసులు ► సీపీఎం, సీపీఐ కార్యదర్శులు రఘు, వనజలపై దౌర్జన్యం గుడివాడ: ఇలపర్రు దళితులపై పోలీసు జులుం ప్రదర్శించారు. ఆందోళనకారులను చితకబాదారు. దాడిలో సీపీఎం, సీపీఐ నాయకులు గాయపడ్డారు. వంద మందిని పోలీసులు అరెస్టు చేసి పోలీస్స్టేషన్కు తరలించారు. వివరాలు.. నందివాడ మండలం ఇలపర్రులో భూస్వాముల ఆక్రమణలో ఉన్న 165 ఎకరాల భూమిని తిరిగి పేదలకు ఇవ్వాలని కోరుతూ వామపక్షాలు ఐదు నెలలుగా వివిధ దశల్లో ఉద్యమం చేస్తున్నాయి. ప్రభుత్వ స్పందించకపోవడంతో సోమవారం ఆర్డీవో కార్యాలయం ముట్టడికి వామపక్షాలు పిలుపునిచ్చాయి. ఉదయం 10 గంటలకు స్థానిక నెహ్రూ చౌక్ సెంటర్ నుంచి ఉద్యమకారులు ర్యాలీగా బయలుదేరి స్థానిక ఆర్డీవో కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అప్పటికే పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆందోళనకారులను కార్యాలయంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. కార్యాలయం వద్ద బైఠాయింపు: కార్యాలయంలోకి వెళ్లకుండా అడ్డుకోవడంతో వామపక్షనాయకులు, వివిధ ప్రజాసంఘాలు, జనసేన, దళిత నాయకులు ఆర్డీవో కార్యాలయ ప్రవేశ ద్వారం వద్ద రోడ్డుపై బైఠాయించారు. భూముల కోసం పోరాటం ఆగదు: భూస్వాములు ఆక్రమించుకున్న దళితుల భూములు దళితులకే చెందుతాయని జిల్లా ఉన్నతాధికారులు చెబుతున్నా ప్రభుత్వం బడాబాలుకు కొమ్ముకాస్తోందని వామపక్షాల నాయకులు ఆర్.ర«ఘు, అక్కినేని వనజ ఆరోపించారు. స్థానిక వన్టౌన్ పోలీసు స్టేషన్ వద్ద వారు విలేకరులతో మాట్లాడుతూ కేవలం దళితులను అణచి వేసేందుకు ప్రభుత్వం పోలీసులతో లాఠీచార్జి చేయించిందన్నారు. అధికార పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యురాలు సీతామహాలక్ష్మి ఆక్రమించుకున్న భూముల్లో ఇలపర్రు దళితులకు చెందిన 27 ఎకరాల భూమి ఉందని చెప్పారు. అంతే కాకుండా నందివాడ మండలంలో ఇలపర్రు, పోలుకొండ, అనమనపూడి, వెన్ననపూడి, కుదరవల్లి గ్రామాల్లో ఉన్న సుమారు ఐదు వేల ఎకరాలు భూస్వాముల చేతిలో ఉందని వాటిపై కూడా తాము పోరాటం చేయనున్నట్లు తెలిపారు. అరెస్టు అయిన వారిలో సీపీఎం గుడివాడ డివిజన్ కార్యదర్శి ఆర్సీపీ రెడ్డిలతో పాటు మురాల రాజేష్, సీఐటీయూయు నాయకులు మాదాల వెంకటేశ్వరరావు, జనసేన పట్టణ నాయకుడు ఆర్కే, వ్యసాయ కార్మికసంఘం జిల్లా కార్యదర్శి కొండా వీరాస్వామిలతో పాటుగూడపాటి ప్రకాష్బాబు, దగాని సంగీతరావు ఉన్నారు. దళితులపై లాఠీచార్జి దారుణం : భూమి కోసం ఉద్యమిస్తున్న దళితులపై లాఠీచార్జి దారుణమని సీపీఎం పశ్చిమ కృష్ణా కమిటీ కార్యదర్శి డీవీ కృష్ణ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వంద మందిని అరెస్టు చేయటంపై నిరసన వ్యక్తం చేశారు. దళితులకే చెందిన భూములని ప్రభుత్వ ఇచ్చిన ఉత్తర్వులను ఏళ్ల తరబడి అమలు చేయకుండా భూస్వాములు ఆ భూమిని అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావుతో పాటు సీపీఐ, ఇతర ప్రజాసంఘాల నాయకులను అరెస్టు చేయడాన్ని ఖండించారు. --సీపీఎం ఆందోళనకారులపై లాఠీచార్జి: బైఠాయించిన ఆందోళనకారులపై డీఎస్పీ అంకినీడు ప్రసాద్ పర్యవేక్షణలో పోలీసులు విరుచుకుపడ్డారు. దొరికిన వారిని దొరికినట్లు చితక బాదారు. మహిళలు అత్యధిక సంఖ్యలో ఉండగా వారిని కూడా మగ పోలీసులతో ఊడ్చుకెళ్లి వాహనాల్లో పడేశారు. మహిళల జాకెట్లు ,చీరలు చిరిగి పోయాయి. పోలీసు లాఠీచార్జిలో సీపీఎం తూర్పు కృష్ణా కార్యదర్శి ఆర్.రఘు, సీపీఐ జిల్లా కార్యదర్శి అక్కినేని వనజ, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు మాదాల వెంకటేశ్వరరావులకు లాఠీదెబ్బలు తగిలాయి. ఆందోళనకారులను అరెస్టు చేసి గుడివాడ పట్టణంలోని వన్టౌన్, పెదపారుపూడి, పామర్రు పోలీసు స్టేషన్లకు తరలించారు. వనజను ఈడ్చుకెళ్లి.. దళితులకు మద్దతు తెలిపిన సీపీఐ జిల్లా కార్యదర్శి అక్కినేని వనజపై పిడిగుద్దులు కురిపిం చారు. బూటుకాళ్లతో తన్నుతూ తీసుకెళ్లారు. విచక్షణా రహితంగా లాఠీచార్జి చేస్తూ ఈడ్చుకెళ్లారు. -
రేపు వామపక్షాల ఆధ్వర్యంలో భారత్ బంద్
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆకస్మికంగా తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో సామాన్యులు అల్లాడిపోతున్నారని సీపీఎం, సీపీఐ జిల్లా కార్యదర్శులు ప్రభాకరరెడ్డి, రామాంజనేయులు అన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో నల్లకుబేరులెవరూ ఇబ్బంది పడటం లేదన్నారు. ఇప్పటికే నోట్ల మార్పిడిలో దేశవ్యాప్తంగా 70 మంది సామాన్యులు మృత్యువాత పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం సుందరయ్య భవన్లో ఈనెల 28న నిర్వహించనున్న భారత్ బంద్ విజయంతానికి తీసుకోవాల్సిన చర్యలపై వామపక్ష పార్టీల నేతలు సమావేశమయ్యారు. 86 శాతం చెలామణిలో ఉన్న రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసి ప్రత్నామ్నాయ చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడాల్సి వస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ ఈ నెల 28న నిర్వహించనున్న «భారత్ బంద్కు ప్రజలు సహకరించి విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి నరసింహులు, ఎస్యూసీఐ(సీ) జిల్లా నాయకులు నాగన్న, ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా నాయకులు చక్రవర్తి, సీపీఎం నాయకులు గౌస్దేశాయ్, ఇ.పుల్లారెడ్డి, సీపీఐ నాయకులు మనోహర్ మాణిక్యం పాల్గొన్నారు. -
ఆ రోజు ఉద్యోగులకు సెలవులు బంద్
కోల్కతా: కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ కమ్యూనిస్టు పార్టీలు బంద్ నిర్వహించే సోమవారం రోజు ప్రభుత్వ ఉద్యోగులందరూ తప్పనిసరిగా విధులకు హాజరుకావాల్సిందిగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ రోజు ఏ ఉద్యోగికీ సెలవు మంజూరు చేసేదిలేదని, తగిన కారణం లేకుండా ఎవరైనా విధులకు గైర్హాజరైతే కఠిన చర్యలు తప్పవని ఆ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి వాసుదేవ్ చెప్పారు. అత్యవసర, చాలా ముఖ్యమైన పని ఉంటే తప్ప ఉద్యోగులు సెలవు తీసుకోరాదని, సోమ, మంగళవారాల్లో కచ్చితంగా విధులకు హాజరుకావాలని ఆర్థిక శాఖ సర్క్యులర్ జారీ చేసింది. బంద్ రోజు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు పనిచేస్తాయని చెప్పారు. బంద్లకు తాము వ్యతిరేకమని, పెద్దనోట్ల రద్దును వ్యతిరేకిస్తూ సోమవారం నాడు నిరసన ప్రదర్శనలో పాల్గొంటామని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. బంద్ రోజు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు, వారి ఆస్తులకు ఎలాంటి నష్టం కలగకుండా భద్రత కల్పించాలని చెప్పారు. -
న్యాయవిచారణకు వామపక్షాల డిమాండ్
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్-ఒడిశా సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్ అనేక అనుమానాలకు తావిచ్చే విధంగా ఉందని, తక్షణమే దానిపై న్యాయవిచారణకు ఆదేశించాలని వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. మావోయిస్టుల సమస్యను ప్రభుత్వం శాం తిభద్రతల సమస్యగా మాత్రమే పరిగణించడం సరికాదని తమ్మినేని వీరభద్రం(సీపీఎం), చాడ వెంకటరెడ్డి(సీపీఐ), జానకిరాములు(ఆర్ఎస్పీ), మురహరి(ఎస్యూసీఐ-సీ), కె.గోవర్దన్(న్యూడెమోక్రసీ-చంద్రన్న), వేములపల్లి వెంకటరామయ్య(న్యూడెమోక్రసీ-రాయల), భూతం వీరన్న(సీపీఐ-ఎంఎల్), ఎన్.మూర్తి(లిబరేషన్), బం డా సురేందర్రెడ్డి(ఫార్వర్డ్బ్లాక్)లు ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విధం గా చూసినంత కాలం సమస్య పరిష్కారం కాదని సూచించారు. -
సమగ్ర దర్యాప్తు జరిపించాలి
వామపక్ష పార్టీల డిమాండ్ సాక్షి, హైదరాబాద్: ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దుల్లో మాల్కాన్గిరీ ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున ఎదురుకాల్పుల పేరిట 24 మందికి పైగా మావోయిస్టులను దారుణంగా కాల్చిచంపారని సీపీఐ, సీపీఎం, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ(చంద్రన్న) ఆరోపించాయి. ప్రజలు, ప్రజాతంత్ర, ప్రజాస్వామిక వాదులు, రాజకీయ పార్టీలు ఈ ఘటనను ఖండించాలని విజ్ఞప్తి చేశాయి. ఈ బూటకపు ఎన్కౌంటర్పై హైకోర్టు ప్రస్తుత న్యాయమూర్తితో సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఆయా పార్టీలు వేర్వేరు ప్రకటనల్లో డిమాండ్ చేశాయి. 500 మందికి పైగా సాయుధ పోలీసులు జరిపిన హంతక దాడిగా న్యూడెమెక్రసీ కేంద్రకమిటీ ప్రధాన కార్యదర్శి చంద్రన్న అభివర్ణించారు. పక్కా సమాచారం ఆధారంగా ఎన్కౌంటర్ చేశామని పోలీసులు చెబుతున్న దానివెనుకున్న పరమార్థమేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. కోవర్టు ఆధారంగా పోలీసులు ఇంతటి ఘాతుకానికి పాల్పడ్డారా? అనే అనుమానాన్ని కూడా చంద్రన్న వ్యక్తం చేశారు. ఈ ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసు ఉన్నతాధికారులపై 302 సెక్షన్ కింద హత్యానేరం మోపి విచారించాలన్నారు. సామూహిక హత్యాకాండకు పాల్పడమని ఏ చట్టంలో ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. మావోయిస్టుల్ని పట్టుకునేందుకు అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ కాల్చిచంపడం దారుణమని సీపీఎం నాయకుడు పి.మధు మండిపడ్డారు. ఎన్కౌంటర్పై న్యాయవిచారణ జరిపించాలని సీపీఐ (ఎంల్) న్యూడెమోక్రసీ సెంట్రల్ కమిటీ ప్రధాన కార్యదర్శి చంద్రం, రాష్ర్ట కార్యదర్శి సాధినేని వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. -
స్వార్థపరులే పార్టీని వీడారు
నర్మెట : కొందరూ వారి స్వార్ధ ప్రయోజనాల కోసం పార్టీని మోసం చేసి వెళ్లిపోయారని కొమురవెల్లి దేవస్థాన మాజీ చైర్మ¯ŒS గొల్లపల్లి కుమారస్వామి అన్నారు. ఎంతో నమ్మకంతో వారికి పదవులను కట్టబెట్టిన మోసంచేవారన్నారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు భూక్య జూంలాల్నాయక్, చేర్యాల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అర్జుల సుధాకర్రెడ్డి టీఆర్ఎస్ పార్టీలోకి చేరడంపై గురువారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. కుమారస్వామి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ తల్లిలాంటిదని అన్నారు. పార్టీ పదవులతో అన్నివిధాలుగా అభివృద్ధి చెంది ఇప్పుడు పార్టీని వీడటం సరైంది కాదన్నారు. కాంట్రాక్టుల కోసమే టీఆర్ఎస్ పార్టీలో చేరారని అన్నారు. వారు పార్టీని వీడటం వల్ల అధినాయకత్వానికి కాని, పార్టీకి కాని ఏలాంటి నష్టం లేదన్నారు. వారి స్థానాలను త్వరలోనే క్రీయశీలకంగా పనిచేసే కార్యకర్తలకు అప్పగిస్తామని తెలిపారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ కొంపెల్లి రమేష్, ప్రజ్ఞపురం కనుకయ్య, రాజిరెడ్డి తదితరులు ఉన్నారు -
పచ్చచొక్కా వేసుకుని పని చేస్తున్నాడు
– కలెక్టర్పై రాజకీయ, ప్రజాసంఘాల నేతల ఆగ్రహం – నేడు కలెక్టరేట్ వద్ద ధర్నా కర్నూలు సిటీ: జిల్లాలో నెలకొన్న సమస్యలు పరిష్కరించి ప్రజలకు అండగా నిలవాల్సిన కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ అధికార పార్టీ నాయకులకు అనుకూలంగా పని చేస్తున్నారని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టరేట్ ఎదుట ధర్నాలు చేయకూడదని నిషేధం విధించడంపై మంగళవారం నంద్యాల చెక్ పోస్టు సమీపంలో వామ పక్ష పార్టీలు, వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి రసూల్, సీపీఎం నగర నాయకులు రాజశేఖర్లు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి రామాంజనేయులు, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు టి.షడ్రక్, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి మనోహర్ మాణిక్యం, ఏపీ గిరిజన సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి గోవిందు, ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పి.నిర్మలమ్మ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మీనరసింహా, సమాజ్వాదీ పార్టీ జిల్లా అధ్యక్షులు దండు శేషు యాదవ్, వైఎస్సార్సీపీ నాయకులు మద్దయ్య, తోట క్రిష్ణారెడ్డి ప్రసంగించారు. విజయమోహన్ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు వినతులను పట్టించుకోవడం లేదన్నారు. ప్రజాస్వామ్య దేశంలో తమ హక్కులకు భంగం కలుగుతున్నప్పుడు శాంతియుతంగా నిరసన తెలియజేసే హక్కు ఉందని, దీన్ని కలెక్టర్ అణిచి వేయాలనే ధోరణిలో వ్యవహారిస్తున్నారన్నారు. ప్రజా సమస్యలను వదిలేసి కలెక్టరేట్ను అధికారి పార్టీ కార్యాలయంగా మార్చుతున్నారని ఆరోపించారు. కలెక్టరేట్ ఎదుట ధర్నాలు చేయకుడదని నిషేధించడం అప్రజాస్వామ్యమని, ఆ బోర్డును తొలగించాలని కోరుతూ బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తామని తెలిపారు. -
'అంతా వారికే ఊడిగం చేస్తున్నారు'
హైదరాబాద్: నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన తప్పిదాలనే నేడు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు చేస్తున్నారని లెఫ్ట్ పార్టీ నేతలు మండిపడ్డారు. గతంలో చంద్రబాబు విద్యుత్ ధరలను పెంచాడని.. అదే మాదిరిగా ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచిందని ఆరోపించారు. గత ఉద్యమ స్ఫూర్తిగా ఇప్పుడు కూడా ఉద్యమాలు చేస్తామని చెప్పారు. మోదీ ప్రభుత్వంతోపాటు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కాంట్రాక్టర్లు, కార్పొరేట్లకు ఊడిగం చేస్తున్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ప్రత్యేక హోదా కోసం రేపు ప్రజాబంద్
కాకినాడ సిటీ: రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంలో కేంద్రం, రాష్ట్రంలోని పాలక పార్టీలు బీజేపి, టీడీపిలు అవలంబిస్తున్న ధోరణిని నిరసిస్తూ మంగళవారం ప్రజాబంద్కు వామపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి. స్థానిక సుందరయ్యభవన్లో ఆదివారం సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, సీపీఎం జిల్లా కార్యదర్శి దువ్వా శేషబాబ్జి సంయుక్తంగా ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. 2వ తేదీన జరిగే రాష్ట్ర బంద్కు జిల్లాలో ఉన్న అన్ని వాణిజ్య, వ్యాపార వర్గాలు, విద్యాసంస్థలు, ఆర్టీసీ, కార్మిక, కర్షకులు, ప్రజలు, ప్రజాసంఘాలు సహకరించి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. విభజన సమయంలోనూ, తరువాత ఇచ్చిన హామీలను పక్కనపెట్టి పాలకపార్టీలు రాష్ట్ర ప్రజలను దగా చేశారని విమర్శించారు. గతంలో నేరుగా కేబినేట్ తీర్మానంతో 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించారని, ఎక్కడా చట్టం చేయలేదని, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు వచ్చేసరికి కుంటిసాకులు చెబుతున్నారన్నారు. ఆవిషయం విభజన చట్టంలో పొందుపరచ లేదనడం విడ్డూరంగా ఉందన్నారు. ఒకరిని ఒకరు విమర్శించుకుంటూ తెలుగుదేశం, బీజేపీ దొంగనాటకాలు ఆడుతున్నాయన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక హోదా ఉద్యమానికి కలిసిరావాలని, అన్ని పక్షాలను కలుపుకుని అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్ళి కేంద్రంపై తీవ్ర వత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. సీపీఎం కాకినాడ నగర కార్యదర్శి పలివెల వీరబాబు, సీపీఐ కాకినాడ నగర, రూరల్ కార్యదర్శులు తోకల ప్రసాద్, నక్కా కిషోర్ పాల్గొన్నారు. -
ఆగస్టు 1న విద్యాసంస్థల బంద్
ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతిగృహాల మూసివేతను ఉపసంహరించుకోవాలని, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆగస్టు 1న రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్కు పిలుపునిచ్చింది. స్థానిక ప్రెస్క్లబ్లో మంగళవారం జేఏసీ ఆధ్వర్యాన బంద్ వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.సుబ్బారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తోందన్నారు. కేజీనుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తామని, రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్గా తీర్చుదిద్దుతామని ప్రకటనలు చేస్తూనే చంద్రబాబు ప్రభుత్వం మరోవైపు హేతుబద్ధీకరణ పేరుతో పాఠశాలలు, హాస్టళ్లను మూసివేస్తోందన్నారు. ఏడు ప్రధాన డిమాండ్లతో చేపడుతున్న బంద్ను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో రామకృష్ణ, రవిచంద్ర (పీడీఎస్యూ), ఎన్.కోటి (ఎస్ఎఫ్ఐ), షేక్ బాజీసైదా (పీడీఎస్ఓ), సీహెచ్.రఘువీరా, షెహెన్షా (ఏఐఎస్ఎఫ్) పాల్గొన్నారు. -
సంస్థాగత నిర్మాణంపై లెఫ్ట్ పార్టీల దృష్టి
సాక్షి, హైదరాబాద్: సంస్థాగతంగా పార్టీలను బలోపేతం చేయడంపై సీపీఐ, సీపీఎం నాయకులు దృష్టి కేంద్రీకరించారు. ఇందుకోసం వివిధ కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించారు. ప్రధానంగా సైద్ధాంతిక అవగాహన, రాజకీయ శిక్షణ తరగతులతో కేడర్లో ఉత్సాహం నింపాలని ఈ పార్టీలు భావిస్తున్నాయి. రాబోయే 3, 4 నెలల పాటు వివిధ కార్యక్రమాలను చేపట్టాలని సీపీఐ నిర్ణయించగా, సీపీఎం కూడా అదే బాటలో నడుస్తోంది. కాగా పార్టీని కింది స్థాయి నుంచి బలోపేతం చేసే చర్యల్లో భాగంగా వచ్చే సెప్టెంబర్ వరకు సీపీఐ నాయకులు వివిధ కార్యక్రమాలను చేపట్టనున్నారు. జూన్ నుంచి ఆగస్టు వరకు గ్రామ, మండల, జిల్లాస్థాయి పార్టీ నిర్మాణ సమావేశాలను నిర్వహించాలని షెడ్యూల్ను రూపొందించారు. జిల్లాస్థాయిలో కార్యక్రమాలు ముగిశాక సెప్టెంబర్లో పార్టీనిర్మాణ రాష్ట్ర మహాసభను వరంగల్లో నిర్వహించాలని సీపీఐ నాయకత్వం నిర్ణయించింది. కాగా మండల కౌన్సిల్ సభ్యులు మొదలుకుని రాష్ర్ట కౌన్సిల్ సభ్యుల వరకు వివిధ స్థాయిల్లో రాజకీయ శిక్షణ తరగతులను నిర్వహించనున్నారు. 22 నుంచి సీపీఎం శిక్షణ తరగతులు ఈ నెల 22 నుంచి నెలాఖరు వరకు హైదరాబాద్, మిర్యాలగూడ, ఖమ్మంలలో సీపీఎం శిక్షణ తరగతులను నిర్వహించనుంది. డివిజన్ కమిటీ, జిల్లా కమిటీ సభ్యులు, పూర్తికాల కార్యకర్తలకు ఇందులో శిక్షణ ఇవ్వనున్నారు. ఆ తర్వాత మండల స్థాయిలో తరగతులను నిర్వహిస్తారు. అంబేడ్కరిజం, మార్క్సిజం, ప్రజా సమస్యలపై అవగాహన, జాతీయ, రాష్ట్రస్థాయిలో రాజకీయ పరిస్థితులపై తరగతులను నిర్వహించి కేడర్ను సైద్ధాంతికంగా బలోపేతం చేయాలని సీపీఎం భావిస్తోంది. -
ఏలూరులో వామపక్షాల ఆందోళన
ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో వామపక్షాలు బుధవారం ఆందోళనకు దిగాయి. పేదలు ఇళ్లు కట్టుకోవడానికి స్థలాలు ఇవ్వాలంటూ వామపక్షాల నాయకులు, కార్యకర్తలు ఏలూరు ఎమ్మార్వో ఆఫీసు ఎదుట ధర్నాకు దిగారు. ఈ ప్రభుత్వం పేదలను విస్మరిస్తుందంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఏలూరు ఎమ్మార్వో ప్రసాద్కు వినతిపత్రం అందజేశారు. -
25న ఇందిరాపార్క్ వద్ద వామపక్షాల దర్నా
హైదరాబాద్: ఈ నెల 25న ఇందిరాపార్క్ వద్ద వామపక్షాల ధర్నా జరుగుతుందని వామపక్ష నేతలు తమ్మినేని వీరభద్రం, చాడ వెంకట్ రెడ్డి వెల్లడించారు. జేఎన్యూ విద్యార్థి కన్హయ్య కుమార్ను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. శనివారం వారిద్దరూ హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ)లో ఆత్మహత్య చేసుకున్న వేముల రోహిత్ ఘటన నుంచి బయటపడటానికే బీజేపీ నాటకం ఆడుతోందని ఆరోపించారు. పార్లమెంట్లో సమాధానం చెప్పలేక బయట నాటకాలు ఆడుతోందని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ వచ్చాక దేశంలో నియంత్రృత్వ ధోరణి పెరిగిపోయిందని తమ్మినేని, చాడ విమర్శించారు. -
వామపక్ష రాష్ట్రంలో యోగా తప్పనిసరి
అది ఓ వామపక్ష పాలిత రాష్ట్రం. అయినా అక్కడి విద్యార్థులకు యోగా తప్పనిసరి చేశారు. గుజరాత్ తర్వాత అలా చేసిన ఏకైక రాష్ట్రం.. త్రిపుర! అవును.. జనవరి 1 నుంచి ఆ రాష్ట్రంలో 1-8వ తరగతి వరకు చదివే విద్యార్థులందరూ తప్పనిసరిగా యోగా నేర్చుకోవాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. తొలిదశలో రాష్ట్రంలోని వంద స్కూళ్లలో దీన్ని అమలుచేస్తామని, క్రమంగా అన్నింటికీ విస్తరిస్తామని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి తపన్ చక్రవర్తి చెప్పారు. పట్టణ, గ్రామీణ, త్రిపుర ట్రైబల్ ఏరియాస్ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ (టీటీఈఈడీసీ) ప్రాంతాల నుంచి ఈ స్కూళ్లను ఎన్నుకుంటారు. ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యం కోసం యోగాను నేర్పిస్తామని తపన్ చక్రవర్తి తెలిపారు. దీనివల్ల భావితరాలు క్రమశిక్షణతో ఉంటాయని ఆయన అన్నారు. ముందుగా కొంతమంది టీచర్లకు యోగాలో శిక్షణ ఇప్పిస్తామని, వాళ్లు పిల్లలకు నేర్పిస్తారని చెప్పారు. ఈ నిర్ణయాన్ని కొంతమంది స్వాగతిస్తుండగా, మరికొందరు మాత్రం అనవసరమని కొట్టిపారేస్తున్నారు. మాణిక్ సర్కార్ ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీని మంచి చేసుకోడానికే యోగా ప్రవేశపెడుతోందని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. రాష్ట్ర బీజేపీ వర్గాలు మాత్రం.. ఈ నిర్ణయాన్ని స్వాగతించాయి. -
వామపక్షాల ఆందోళన..అరెస్ట్
-
వామపక్షాల ఆందోళన..అరెస్ట్
విజయవాడ: కల్తీ మద్యం బారిన పడి విజయవాడలోని నెహ్రూనగర్కు చెందిన ఐదుగురు మృతి చెందిన ఘటనపై వామపక్షాలు మండిపడ్డాయి. సీఎం చంద్రబాబునాయుడు పరామర్శిస్తున్న ఆంధ్రా ఆస్పత్రి వద్ద సోమవారం రాత్రి వామపక్షాలు ఆందోళనకు దిగియి. ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సీఎంకు వినతిపత్రం ఇచ్చేందుకు వామపక్షాలు పోలీసుల అనుమతి కోరాయి. అయితే వారిని ముందుకు రాకుండా అడ్డుకొని పలువురు నేతలను అరెస్టు చేశారు. -
'ఇవి ప్రభుత్వ హత్యలే'
ఏలూరు: కల్తీ మద్యం బారిన పడి విజయవాడలోని నెహ్రూనగర్కు చెందిన ఐదుగురు మృతి చెందిన ఘటనపై వామపక్షాలు మండిపడ్డాయి. ఇవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని, దీనికి మద్యం పాలసీని తయారు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబే బాధ్యత వహించాలని వామపక్ష పార్టీ నేతలు డిమాండ్ చేశారు. ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రకు ఆ పదవిలో కొనసాగే అర్హత లేదని, అతను తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కల్తీ మద్యం వలన పేదల కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయని, ప్రభుత్వం వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. -
వామపక్షాల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు
దాబాగార్డెన్స్: మతోన్మాదానికి వ్యతిరేకంగా విశాఖ పట్నంలో వామపక్ష నాయకులు, కార్యకర్తలు తలపెట్టిన నిరసన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. నగరంలోని సరస్వతీ పార్కు నుంచి దాబాగార్డెన్స్ మీదుగా గాంధీ విగ్రహం వరకు నిరసన ర్యాలీని నిర్వహించారు. అయితే సెక్షన్-30, 31 అమలులో ఉన్నాయని, ర్యాలీలు నిర్వహించడానికి వీలు లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. అయితే పక్కనే సరస్వతీ పార్కు వద్ద టీడీపీ జన చైతన్యయాత్ర పేరిట ర్యాలీలు తీస్తున్నారు కదా అని వామపక్షాల నేతలు ప్రశ్నించగా పోలీసుల నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో వామపక్షాల నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేసి స్థానిక పోలీస్స్టేషన్కు తరలించారు. -
బంద్ ప్రశాంతం
-
ఐక్యంగా ఏపీ కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు
-
ఐక్యంగా ఏపీ కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు
హైదరాబాద్: టీడీపీ, బీజేపీలకు వ్యతిరేకంగా ఐక్య పోరాటం చేసేందుకు ఏపీ కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీ కసరత్తు ప్రారంభించాయి. సీపీఎం, సీపీఐ కార్యదర్శులు మధు, రామకృష్ణతో కాంగ్రెస్ నేత సీ రామచంద్రయ్య మంతనాలు జరిపారు. ప్రత్యేక హోదా డిమాండ్తో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్ జగన్ అంశంతోపాటు రాజధాని, ప్రత్యేక హోదా అంశంపై ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాయాలని ఆలోచనలో ఈ రెండు పార్టీలు ఉన్నట్లు తెలుస్తోంది. -
బంద్ ప్రశాంతం
* సీఎం కేసీఆర్ తీరుపై నిరసన * హోరెత్తిన నినాదాలు * సుమారు 5వేల మంది అరెస్టు సాక్షి, సిటీబ్యూరో: రైతు సమస్యల పరిష్కారం కోరుతూ కాంగ్రెస్, తెలుగుదేశం, బీజేపీ, వైఎస్ఆర్ సీపీ, వామపక్షాలు, వివిధప్రజా సంఘాల ఆధ్వర్యంలో శనివారం నగరంలో నిర్వహించిన బంద్ ప్రశాంతంగా ముగిసింది. పోలీసుల సాయంతో ఆర్టీసీ బస్సులు నడిచాయి. షాపులు, వ్యాపార కేంద్రాలు, పెట్రోల్ బంకులు ఉదయం కొంతసేపు మూసివేశారు. ఆ తరువాత యధావిధిగా తెరచుకున్నాయి. ఒకటి, రెండు మినహా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదు. ఉదయం నుంచే బస్ డిపోలు, బస్ స్టేషన్లకు చేరుకున్న విపక్షాల నేతలు సీఎం కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిర సన వ్యక్తం చేశారు. మహాత్మాగాంధీ, జూబ్లీ బస్స్టేషన్లు, ఆర్టీసీ క్రాస్రోడ్స్, ముషీరాబాద్, తదితర ప్రాంతాలు నినాదాలతో హోరెత్తాయి. ఆర్టీసీ క్రాస్రోడ్స్లో విరసం నేత వరవరరావు, సీపీఎం కార్యదర్శి తమ్మినేని, అరుణోదయ విమల, పీవోడబ్ల్యూ నేత సంధ్య, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ నేత గోవర్ధన్ తదితరులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పలుమార్లు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జేబీస్, ఎంజీబీఎస్లలో అఖిలపక్ష నాయకుల అరెస్టుల పర్వం కొనసాగింది. సుమారు 5వేల మంది నేతలు, కార్యకర్తలు అరెస్టయ్యారు. 80 శాతం తిరిగిన బస్సులు.. ఉదయం ఒకటి, రెండు గంటల అంతరాయం మినహా నగరంలోని అన్ని డిపోల నుంచి శనివారం 80 శాతం వరకు బస్సులు రోడ్డెక్కినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. అవసరమైన చోట పోలీసుల సాయంతో నడిపినట్లు పేర్కొన్నారు. వివిధ చోట్ల ఆందోళనకారులు 4 బస్సుల అద్దాలు పగులగొట్టారు. ఆటోలు యధావిధిగా నడిచాయి. -
తెలంగాణ బంద్ ఉద్రిక్తం
-
గ్రీస్ ఎన్నికల్లో సిప్రాస్ గెలుపు
ఏథెన్స్: గ్రీస్ మధ్యంతర ఎన్నికల్లో వామపక్ష పార్టీ సిరిజా నేత అలెక్సిస్ సిప్రాస్ మళ్లీ గెలుపొందారు. పెను రుణ సంక్షోభం నేపథ్యంలో గత నెల రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లిన అలెక్సిస్.. ఆదివారం నాటి ఎన్నికల్లో విజయం సాధించి మళ్లీ అధికారంలోకి వచ్చారు. బుధవారం నాటికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని ఆయన ప్రకటించారు. సమీప ప్రత్యర్థి పార్టీ న్యూ డెమొక్రసీ అధ్యక్షుడు వాంగెలిస్ మీమరాకిస్ ఓటమిని అంగీకరించారు. పార్లమెంట్లో 300 సీట్లు ఉండగా.. అత్యధిక ఓట్లు సాధించిన పార్టీకి అదనంగా 50 సీట్లు లభిస్తాయి. ఆదివారం రాత్రి తుది వార్తలు అందేవరకూ సగం ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. సిరిజా పార్టీకి 35 శాతం ఓట్లతో 150 స్థానాలు, న్యూ డెమొక్రసీ పార్టీకి 28 శాతం ఓట్లతో 75 స్థానాలు, మూడో స్థానంలో ఉన్న గోల్డెన్ డాన్ పార్టీకి 7 శాతం ఓట్లతో 19 సీట్లు వస్తాయని అంచనా. -
సెజ్ భూముల అవినీతిపై వామపక్షాల ఆందోళన
పెనుకొండ (అనంతపురం జిల్లా): అనంతపురం జిల్లా తుంగోడు సెజ్ భూముల నష్టపరిహారం చెల్లింపులో అధికారులు రూ.2 కోట్ల మేర అవినీతికి పాల్పడ్డారని, అవినీతి అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. పౌరహక్కుల సంఘం నేతలు, సమాచార హక్కు ఐక్యవేదిక నేతలు, సీపీఐ, సీపీఎం నేతలు, రైతులు పెద్దసంఖ్యలో పాల్గొని సోమందేపల్లి ఎంపీడీవో కార్యాలయంవద్ద ధర్నా చేశారు. రైతులకు దక్కాల్సిన కోట్లాది రూపాయలను అధికారులు స్వాహా చేశారని, అవినీతి అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు. అనంతరం జాతీయ రహదారిపై బైఠాయించారు. -
‘ప్రత్యేక’ బంద్ విజయవంతం
వైఎస్సార్ సీపీ, కాంగ్రెస్, వామపక్షాల మద్దతు సాక్షి, విజయవాడ బ్యూరో/హైదరాబాద్: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నిర్వహించిన రాష్ట్ర బంద్ విజయవంతమైంది. సీపీఐ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఈ బంద్కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్, వామపక్షాలు మద్దతు పలికాయి. బంద్ నేపథ్యంలో మంగళవారం సెలవు ఇస్తున్నట్లు విద్యా సంస్థలు ముందుగానే ప్రకటించాయి. పెట్రోల్ బంకులు, లారీ ఓనర్స్ అసోసియేషన్, వ్యాపార సంస్థల యజమానులు, ప్రజలు సంఘీభావం ప్రకటించి స్వచ్ఛందంగా బంద్ పాటించారు. పలు ప్రాంతాల్లో మానవ హారాలు నిర్వహించారు. న్యాయవాదులు నిరసన ప్రదర్శనలు, దీక్షలు చేశారు. అన్ని జిల్లాల్లో ఆర్టీసీ బస్సులు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు డిపోలు, బస్టాండ్ల నుంచి కదల్లేదు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలంటూ నినాదాలతో హోరెత్తించారు. బంద్ను విచ్ఛిన్నం చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 861 మందిని అరెస్టు చేశారు. ప్రత్యేక హోదా కోసం ప్రాణత్యాగం చేసిన మునికోటి అంత్యక్రియల రోజైన సోమవారం తిరుపతిలో బంద్ పాటించడంతో మంగళవారం అక్కడ బంద్కు మినహాయింపు ఇచ్చారు. చిత్తూరు జిల్లాలో బంద్ యథావిధిగా జరిగింది. విజయవాడలో నిర్వహించిన బంద్లో పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పాల్గొన్నారు. -
నేడు విద్యా సంస్థల బంద్
పిలుపునిచ్చిన వామపక్ష విద్యార్థి సంఘాలు సాక్షి, హైదరాబాద్: విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వా న్ని డిమాండ్ చేస్తూ మంగళవారం ఇంటర్, డిగ్రీ కళాశాలల బంద్కు వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. ఫీజుల నియంత్రణ చట్టాన్ని రూపొందించడం, ప్రభుత్వ ఇం టర్, డిగ్రీ కళాశాలల్లో బోధన, బోధనేతర సిబ్బంది పోస్టుల భర్తీ, మౌలిక వసతుల కల్పన, ప్రైవేటు కాలేజీడ లను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలన్న డిమాండ్ల సాధనకు బంద్ చేపట్టనున్నట్లు పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సత్య తెలిపారు. -
సమ్మెను పరిష్కరించాలి: తమ్మినేని
సాక్షి, హైదరాబాద్: వేతనాల పెంపు కోసం మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మెను పరిష్కరించేందుకు సీఎం కేసీఆర్ చొరవ చూపాలని వామపక్ష పార్టీలు కోరాయి. సమస్య పరిష్కారం కాకపోతే ఈనెల 28 నుంచి 30 వరకు అన్ని మండల కేంద్రాల్లో రాస్తారోకోలు, ధర్నాలు చేస్తామని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం చాడ వెంకటరెడ్డి(సీపీఐ), వెంకటరాములు(సీపీఐ-ఎంఎల్), మురహరి (ఎస్యూసీఐ), గౌస్ (ఎంసీపీఐ), జానకి రాములు(ఆర్ఎస్పీ), కె. నరేందర్ (ఫార్వర్డ్ బ్లాక్), యార్లగడ్డ సాయిబాబు(రైతు సంఘం) తదితరులతో కలసి తమ్మినేని విలేకరులతో మాట్లాడారు. న్యాయమై న వేతనపెంపు డిమాండ్తో సమ్మె చేస్తున్న మున్సిపల్, గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల ప్రభుత్వం దొరతనంతో వ్యవహరిస్తోందని విమర్శించారు. సమ్మె విరమిస్తే వేతనాలు పెంచుతామని చెప్పడం ప్రజాస్వామ్యం కాదన్నారు. -
పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారం
- వామపక్ష పార్టీల నేతలు హన్మకొండ : గ్రామ పంచాయతీ, మున్సిపల్ కార్మికులు, గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉద్యోగులకు అండగా వామపక్షాలు నిలుస్తాయని, పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయని వామపక్ష నాయకులు అన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పది వామ పక్ష పార్టీలు చేపట్టిన బస్సు యాత్ర మంగళవారం హన్మకొండకు చేరుకొంది. ఈ సందర్భంగా హన్మకొండలోని ఏకశిల పార్కులో బహిరంగ సభ జరిగింది. ఈ సభలో సీపీఐ శాసన సభ పక్షనేత ఆర్.రవీందర్కుమార్ నాయక్, సీపీఎం శాసనసభ పక్షనేత సున్నం రాజయ్య మాట్లాడారు. కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా వచ్చే అసెంబ్లీ సమావేశాలను జరుగనివ్వబోమని హెచ్చరించారు. సీఎం కే సీఆర్ విభజించి పాలించు అన్నట్లుగా కార్మికుల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు రానున్నందున అక్కడ పని చేస్తున్న కార్మికులకు వేతనాలు పెంచి తెలంగాణలోని ఇతర జిల్లాల కార్మికుల సమస్యలను విస్మరించారని మండిపడ్డారు. కార్మికులకు కమ్యూనిస్టులు అండగా నిలిస్తే ఆంధ్రా పార్టీలని చెప్పడం విడ్డూరంగా ఉందని, కమ్యూనిస్టులు పుట్టినప్పుడు కేసీఆర్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. 2001లో పార్టీ పెట్టిన కేసీఆర్కు ఎర్ర జెండా పార్టీలను విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. కేసీఆర్కు కార్మికుల పట్ల కనికరం లేదన్నారు. కార్మికులు భయపడొద్దని పది వామపక్ష పార్టీలు, ప్రజా సంఘా లు అండగా ఉంటాయని అన్నారు. సీపీఎం జిల్లా కార్యాదర్శి సారంపల్లి వాసుదేవరెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాస్రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో న్యూ డెమొక్రసీ నాయకుడు రాయ చంద్రశేఖర్రావు, ఎంసీపీఐ నాయకుడు మహమ్మద్ గౌస్, ఫార్వర్డ్ బ్లాక్ నాయకుడు ఈసంపల్లి వేణు, తెలంగాణ ఎమ్మార్పీస్ వ్యవస్థాపక అధ్యక్షుడు బొట్ల బిక్షపతి, వామపక్ష పార్టీల నాయకులు పోతినేని సుదర్శన్, గాదగోని రవి, సంపత్రావు, ఎం.చుక్కయ్య, పోతరాజు సారయ్య, దుబ్బ శ్రీనివాస్, సిరిబోయిన కరుణాకర్, టి.ఉప్పలయ్య, రాగుల రమేష్ పాల్గొన్నారు. -
బంద్ ప్రశాంతం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : మున్సిపల్ కార్మికుల సమ్మె పట్ల రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారశైలిని నిరసిస్తూ శుక్రవారం 10 వామపక్ష పార్టీలు నిర్వహించిన జిల్లా బంద్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో బంద్ ప్రభావం కనిపించింది. అన్ని చోట్లా వామపక్ష పార్టీల శ్రేణులు బంద్కు నాయకత్వం వహించి ముందుకు నడిపాయి. ఈ బంద్కు ప్రతిపక్ష కాంగ్రెస్తో పాటు వైఎస్సార్సీపీ, టీడీపీ, పలు ట్రేడ్యూనియన్లు, ప్రజాసంఘాలు సంఘీభావం తెలిపాయి. ఉదయం నుంచే అన్ని సంఘాల నేతలు ఆర్టీసీ డిపోల వద్ద బైఠాయించి బస్సులను అడ్డుకున్నారు. బంద్లో భాగంగా ఆర్టీసీ బస్సులను అడ్డగించడంతో పాటు వాణిజ్య సముదాయాలు, విద్యాసంస్థలు, హోటళ్లు, సినిమా థియేటర్లు, పెట్రోల్బంక్లు, బ్యాంకులను ఆందోళనకారులు మూసివేయించారు. ఉదయం సమయంలో జిల్లా వ్యా ప్తంగా బంద్ ప్రభావం పెద్ద ఎత్తున కనిపించినా రంజాన్ పండుగ ఉన్న కారణంగా ఆందోళనకారులు కూడా పట్టుబట్టకపోవడంతో 12 గంటల సమయానికే మళ్లీ యథాతథ పరిస్థితులు నెలకొన్నాయి. గుర్రంపోడు, పోచంపల్లి పమండలాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేయగా, ఆలేరులో మంత్రి కేటీఆర్ శవయాత్ర నిర్వహించారు. మేళ్లచెరువు మండల కేంద్రంలో ఆందోళనకారులు ఓ బస్సు అద్దాన్ని ధ్వంసం చేశారు. ఆందోళనల సందర్భంగా పోలీసులు పలువురు ఆందోళనకారులు, వివిధ పార్టీల నేతలను అడ్డుకుని అరెస్టు చేసి అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. మొత్తంమీద బంద్ సందర్భంగా ఎలాం టి అవాంఛనీయ ఘటనలు జరగకపోవడంతో పోలీసు యంత్రాం గం ఊపిరిపీల్చుకుంది. నియోజకవర్గాల వారీగా బంద్ జరిగిన తీరిది... నల్లగొండ : వామపక్ష పార్టీల ఆద్వర్యంలో శుక్రవారం పట్టణంలో బంద్ నిర్వహించారు. ఆర్టీసీ బస్సులను బయటకు వెల్లకుండా అడ్డుకునేందుకు తెల్లవారుజామునే బస్టాండ్కు చేరుకున్న వామపక్ష పార్టీలు, టీడీపీ నాయకులు ఆర్టీసి డిపోగేటు ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు. బంద్కు మద్దతుగా డీసీసీ అధ్య క్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆలేరు : ఆలేరులో పంచాయతీరాజ్ శాఖ మంత్రి కే తారకరామారావు దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. ఆలేరు, యాదగిరిగుట్ట, ఆత్మకూరు(ఎం), బొమ్మలరామారం, తుర్కపల్లి, గుండాల, రాజపేట మండలాల్లో వామపక్షాల ఆధ్వర్యంలో రాస్తారోకోలు నిర్వహించారు. ఆలేరులో నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. భువనగిరి : భువనగిరి బీబీనగర్, పోచంపల్లి, వలిగొండ మండలాల్లో ఆందోళన నిర్వహిస్తున్న వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం కార్మికులకు సంఘీభావంగా ప్రతిపక్ష పార్టీలు ర్యాలీ నిర్వహించాయి. బీబీనగర్, భువనగిరిలో రాస్తారోకోలు, పోచంపల్లిలో బస్లను నిలిపివే సి సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. మునుగోడు : వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో శుక్రవారం తలపెట్టిన బంద్ మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా విజయవంతమైంది. కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్, టీ డీపీ పార్టీలు మద్దతు పలికాయి. చౌటుప్పల్లో సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్, టీ డీపీ పార్టీల ఆధ్వర్యంలో బస్టాండ్లో రాస్తారోకో చేశారు. సంస్థాన్ నారాయణపురంలో రాస్తారోకో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దతు పలికారు. చండూరులో రాస్తోరోకో సందర్బంగా పోలీసులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు 10మందిని అరెస్టు చేశారు. మునుగోడులో వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వేర్వేరుగా బంద్ నిర్వహించారు. దేవరకొండ : వామపక్షాలు తలపెట్టిన బంద్ దేవరకొండలో పాక్షికంగా నిర్వహించారు. ఉదయం 8 గంటల సమయంలోనే దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ నేతృత్వంలో పట్టణంలో బంద్ నిర్వహించారు. నాగార్జునసాగర్ : నియోజకవర్గంలో బంద్ ప్రశాంతంగా జరిగింది. ఉదయం నుంచే వామపక్షపార్టీలతో పాటు టీడీపీ, కాంగ్రెస్, ఇతర ప్రజా సంఘాల నాయకులు రోడ్డుపైకి వచ్చి దుకాణాలను మూసివేయించి రోడ్డుపై ర్యాలీ తీశారు. హుజూర్నగర్ : సీపీఎం, సీపీఐ, వైఎస్సార్సీపీ, టీడీపీ, కాంగ్రెస్, బీజేపీల ఆధ్వర్యంలో హుజూర్నగర్, గరిడేపల్లి, మేళ్లచెరువు, మఠంపల్లి, నేరేడుచర్లలలో బంద్ పాటించారు. మేళ్లచెరువులో బంద్ పాటించి రాస్తారోకో చేస్తున్న సమయంలో కోదాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఆగకుండా వెళుతుండటంతో కొందరు బస్సును అడ్డగించి అద్దాన్ని ధ్వంసం చేశారు. కోదాడ : బంద్ కార్యక్రమం కోదాడ పట్టణంలో పాక్షి కంగా, ప్రశాంతంగా జరిగింది. ఈ బంద్లో వైఎస్సార్సీపీ, కాంగ్రెస్, టీడీపీ, సీపీఎం, సీపీఐ,సీపీఐ-ఎంఎల్, బీజేపీ నాయకులు పాల్గొని బంద్ను ప్రశాంతంగా నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలోని మునగాల, మోతె, నడిగూడెం, చిలుకూరు మండలాలలో బంద్ ప్రశాంతంగా జరిగింది. మిర్యాలగూడ : ఉదయం ఆర్టీసీ బస్టాండ్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం పట్టణంలోని దుకాణాలు బంద్ చేయించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, సినిమాహాళ్లు, పెట్రోల్ బంక్లు మూసి వేశారు. నియోజకవర్గంలోని దామరచర్ల, వేముపల్లిలో రాస్తారోకోలు నిర్వహించారు. తుంగతుర్తి : తుంగతుర్తిలో వామపక్షాల బంద్ విజయవంతమైంది. తిరుమలగిరి, మోత్కూర్, శాలిగౌరారం, తుంగతుర్తి, అర్వపల్లి, నూతనకల్లలో సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్, గ్రామపంచాయతీ సిబ్బందిల ఆధ్వర్యంలో బంద్చేసి రాస్తారోకోలు జరిపారు. నకిరేకల్ : వామపక్షాలు పిలుపు మేరకు నకిరేకల్ నియోజకవర్గంలోని నకిరేకల్, కట్టంగూర్,కేతేపల్లి, చిట్యాల, రామన్నపేట, నార్కట్పల్లి మండలాలలో బంద్ జరిగింది. నకిరేకల్లో చేపట్టిన బంద్కు సీపీఎం, సీపీఐ, టీ డీపీ,కాంగ్రెస్, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ, వైఎస్సార్సీపీ, బీఎస్పీ, ఎమ్మార్పీఎస్, రైతు కూలీ సంఘం, ఉపాధి హామీ సిబ్బంది మద్దతు ప్రకటించాయి. సూర్యాపేట : సూర్యాపేట పట్టణంలో అఖిలపక్షాల నాయకులు బంద్ను పాటించారు. బంద్లో భాగంగా శుక్రవారం ఉదయం 4గంటల నుంచే అఖిల పక్షాల నాయకులు పట్టణంలోని బస్డిపో వద్దకు చేరుకొని బస్సులను బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. డిపో ఎదుట ధర్నా చేస్తున్న అఖిల పక్షం నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం విడుదల చేశారు. -
నేటి బంద్ను జయపద్రం చేయండి
ఖమ్మం మయూరిసెంటర్ : రాష్ట్రంలో గత 16 రోజులుగా పంచాయతీ కార్మికులు, 11 రోజులు గా మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతుగా హైదరాబాద్లో 10 వామపక్ష పార్టీ నాయకులు చేస్తున్న నిరహరదీక్షను భగ్నం చేసి నాయకులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ 10 వామపక్ష పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించ తలపెట్టిన జిల్లా బంద్ను జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి భాగం హేమంతరావు, సీపీఎం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్రావు, సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా నాయకుడు వేమూరి భాస్కర్ కోరారు. ఖమ్మంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో గురువారం ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో వారు మా ట్లాడుతూ పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని భ క్తులకు ఇబ్బందులు కలగకుండా భద్రాచలంను బంద్లో మినహయిస్తున్నామని పేర్కొన్నారు. రంజాన్ పండుగ ఉంది గనుక ముస్లిం సోదరు లు బంద్కు సహకరించాలని కోరారు. కాంగ్రెస్ మద్దతు మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, ప్రభుత్వం అక్రమ అరెస్ట్లను నిరసిస్తూ శుక్రవారం తలపెట్టిన జిల్లాబంద్కు జిల్లా కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తున్నట్లు డీసీసీ అధ్యక్షుడు ఐతం సత్యం ఓ ప్రకటనలో తెలిపారు. నేటి బంద్కు వైఎస్సార్ సీపీ మద్దతు ఖమ్మం : మున్సిపల్ కార్మికులను రెగ్యులరైజ్ చేయడంతోపాటు వారి కనీస సమస్యల పరిష్కారాన్ని కోరుతూ కార్మికులు చేస్తున్న దీక్షను భగ్నం చేయడం అమానుషమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. వామపక్షాల బంద్కు తమ మద్దతు ఉంటుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయం వెంకటేశ్వర్లు ప్రకటించారు. ఈ మేరకు గురువారం పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయం వెంకటేశ్వర్లు, కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు సంపె ట వెంకటేశ్వర్లు ఓ సంయుక్త ప్రకటనను విడుదల చేశారు. మొదటి నుంచి పోరాటాలు చేసిన టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే తమ బతుకులు మారుతాయని నమ్మకంతో ప్రజలు గద్దెనెక్కించారని, కానీ అన్ని వర్గాల ప్రజలను మభ్యపెడుతూ ప్రస్తుత ప్రభుత్వం కాలం వెళ్లదీస్తోందని విమర్శించారు. ఏళ్ల తరబడి దుర్గంధం మధ్య జీవనం సాగిస్తున్న కార్మికుల కనీస సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం ఎందుకు వెనుకడుగు వేస్తోందో అర్థం కావడం లేదని విమర్శించారు. తక్షణమే మున్సిపల్ కార్మికుల సమస్యలు పరి ష్కరించాలని డిమాండ్చేశారు. -
‘స్థానిక’ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలోకి దింపనున్న పార్టీ
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల కోటాలో శాసన మండలికి జరగనున్న ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం చెరో సీటుకు పోటీచేయనున్నాయి. ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల కోటాలో జరగనున్న ఎన్నికల్లో సీపీఐ తరఫున పువ్వాడ నాగేశ్వరరావును పోటీకి నిలపాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం మఖ్దూంభవన్లో జరిగిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇక నల్లగొండ స్థానిక సంస్థల కోటాలో జరగనున్న ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థిని పోటీకి నిలపాలని ఇటీవల జరిగిన 10 వామపక్షాల భేటీలో నిర్ణయించారు. వరంగల్ ఎంపీ స్థానానికి ఉప ఎన్నికల్లో పది వామపక్షాల తరఫున అందరికీ ఆమోదయోగ్యమైన అభ్యర్థిని పోటీకి నిలపాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. బీజేపీ ప్రతిష్ట దిగజారుతోంది: సురవరం బీజేపీ ప్రతిష్ట దిగజారడం మొదలైందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి వ్యాఖ్యానించారు. లలిత్ మోదీ వ్యవహారంలో కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్, రాజస్థాన్ సీఎం వసుంధర రాజే కూరుకుపోయారని, వ్యాపం కుంభకోణంలో మధ్యప్రదేశ్ సీఎం అప్రతిష్ట పాలయ్యారని పేర్కొన్నారు. జాతీయ స్థాయి రాజకీయ పరిణామాలను కార్యవర్గ భేటీలో సురవరం వివరించారు. -
'మోదీ ఏ అర్హతతో విశాఖకు వస్తున్నారు'
విశాఖపట్టణం (అల్లిపురం): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వైజాగ్ స్టీల్ప్లాంటు 2వ దశ విస్తరణ ప్లాంటును ఏ అర్హతతో జాతికి అంకితం చేసేందుకు వస్తున్నారని వామపక్ష పార్టీల ప్రతినిధులు ప్రశ్నించారు. అల్లిపురం సీపీఐ కార్యాలయంలో శనివారం వామపక్ష పార్టీల రౌండు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోదీ పర్యటనకు వ్యతిరేకంగా ఈ నెల 13న జిల్లా కలెక్టరేట్ ఎదుట వామపక్ష పార్టీలు నిరసన వ్యక్తం చేయనున్నట్లు పేర్కొన్నారు. వైజాగ్ స్టీల్ప్లాంట్లో 10 శాతం పెట్టుబడులు ఉపసంహరించుకుంటామని ప్రకటించిన ప్రధాని మోదీ ఏ అర్హతతో విశాఖ పర్యటనకు వస్తున్నారని వారు ప్రశ్నించారు. ఏడాది కాలంలో విశాఖపట్నం, ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తామని చెప్పిన మోదీ ఇప్పటివరకు ఎటువంటి ప్యాకేజీ ప్రకటించలేదన్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రెండు బడ్జెట్లు ప్రవేశపెట్టినా, ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఒక్కపైసా కూడా కేటాయించలేదని, 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల్లో కూడా ఉత్తరాంధ్ర అభివృద్ధి ప్యాకేజీ ఊసే లేదని విమర్శించారు. విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ప్రకటిస్తామన్నా ఇంతవరకు జరగలేదన్నారు. అలాగే హుదూద్ తుఫాను సందర్భంగా విశాఖలో పర్యటించిన ప్రధాని తక్షణం వెయ్యి కోట్లు సహాయం ప్రకటించారు, కానీ 9 నెలలు గడిచినా ఒక్క రూపాయి కూడా విదల్చలేదని తెలిపారు. ఈ సమావేశంలో సీపీఐ నుంచి ఎ.జె.స్టాలిన్, సీపీఐ(ఎం) బి.గంగారావు, ఎంసీపీఐ(యు) నుండి ఎం.వి.ఎన్.ఆర్.పట్నాయక్, సీపీఐ(ఎంఎల్) న్యూడెమక్రసీ వై.కొండయ్య, సీపీఐ నుంచి ఎ.విమల పాల్గొన్నారు. -
లెఫ్ట్ ఫ్రంట్కు నో!
సాక్షి. హైదరాబాద్: రాష్ట్రంలో మితవాద, అతివాద, ఇతర కమ్యూనిస్టు పార్టీలన్నింటినీ కలుపుకొని లెఫ్ట్ఫ్రంట్ను ఏర్పాటు చేయాలన్న యోచనను పలు వామపక్ష పార్టీలు వ్యతిరేకించాయి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, ఎన్నికల్లో పోటీ చేయడంపై సైద్ధాంతికంగా విభేదాలు, అభిప్రాయభేదాలు ఉన్నందున ఇది సాధ్యం కాదని స్పష్టం చేశాయి. గురువారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో తొమ్మిది వామపక్షాల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విస్తృత ప్రాతిపదికన అన్ని కమ్యూనిస్టు పార్టీలను ఒక వేదికపైకి తీసుకువద్దామని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రతిపాదించగా.. మిగతా వామపక్షాలు వ్యతిరేకించినట్లు సమాచారం. ప్రజా సమస్యలు, ముఖ్యమైన అంశాలపై కలిసి ఉద్యమాలు చేయడం మినహా.. ఫ్రంట్ ఏర్పాటు సాధ్యం కాదని ఆయా పార్టీల నాయకులు పేర్కొన్నట్లు తెలిసింది. అయితే కాంగ్రెస్, బీజేపీ వంటి బూర్జువా పార్టీల అనుబంధ రైతు విభాగాలు, ఎన్జీవో రైతు సంఘాలు లేకుండా తెలంగాణ రైతు సంఘాల జేఏసీని ఏర్పాటు చేసుకోవాలన్న అభిప్రాయం ఈ భేటీలో వ్యక్తమైంది. దీనిపై ఈనెల 24న సమావేశమై తుదినిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. కాగా ఫీజు రీయింబర్స్మెంట్ను 5 వేల ర్యాంకు వరకే పరిమితం చేయాలనే ఆలోచనతో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందని.. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులందరికీ పూర్తి ఫీజు ఇచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని వామపక్షాల నేతలు నిర్ణయించారు. ఇక అన్ని వామపక్షాలకు ఆమోదయోగ్యుడైన అభ్యర్థిని వరంగల్ ఎంపీ స్థానానికి పోటీకి నిలపాలని భేటీలో భావన వ్యక్తమైంది. మరోవైపు ‘ఓటుకు కోట్లు’ వ్యవహారం నేపథ్యంలో అవినీతి అంశంపై శనివారం పది వామపక్షాల సదస్సును నిర్వహించాలని నిర్ణయించారు. ఈ భేటీలో చాడ వెంకటరెడ్డి (సీపీఐ), తమ్మినేని వీరభద్రం(సీపీఎం), జానకిరాములు (ఆర్ఎస్పీ), మురహరి (ఎస్యూసీఐ), ఝాన్సీ (న్యూడెమోక్రసీ-రాయల), గుర్రం విజయ్కుమార్ (సీపీఐ-ఎంఎల్) తదితరులు పాల్గొన్నారు. -
లెఫ్ట్ ఐక్యత సాధ్యమేనా?
సంపాదకీయం దేశంలో వామపక్షాల పలుకుబడి క్రమేపీ క్షీణిస్తున్నదన్న అభిప్రాయం బలపడుతున్న సమయంలో విశాఖపట్టణంలో సీపీఎం 21వ జాతీయ మహాసభలు ఆరురో జులపాటు కొనసాగి ఆదివారం పూర్తయ్యాయి. తాము అనుసరించిన వ్యూహం, ఎత్తుగడలూ, కార్యక్రమాలూ...వాటి సాఫల్య వైఫల్యాల గురించి చర్చించుకుని, వాటిలోని గుణదోషాలను నిర్ధారించుకుని భవిష్యత్తుకు సంబంధించిన వ్యూహాన్ని రూపొందించుకోవడం మూడేళ్లకోసారి జరిగే ఈ మహాసభల ప్రధాన ఉద్దేశం. సీపీఎం ఆవిర్భవించి అర్థ శతాబ్ది పూర్తయిన సందర్భం కావడంవల్ల ఈ మహాసభల కు ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది. దేశంలో కార్మికవర్గం నాయకత్వాన జనతా ప్రజాస్వామిక రాజ్యస్థాపనకు పూనుకోవడమే తమ ధ్యేయమని ఆవిర్భవించిన రోజున సీపీఎం ప్రకటించింది. ప్రజలను బూర్జువా భూస్వామ్య పార్టీల ప్రభావం నుంచి తప్పించాలని, వారికి బలమైన ప్రత్యామ్నాయాన్ని అందించాలని సంకల్పిం చింది. అందుకోసం ఎన్నికల్లో సహచర వామపక్షాలతో కలిసి అడుగులేయాల నుకున్నది. ఈ ఆచరణ పర్యవసానంగా సీపీఎం సాధించిన విజయాలు గణనీయ మైనవి. కేరళలో 1957 ఎన్నికల్లో తొలిసారి ఈఎంఎస్ నంబూద్రిపాద్ నేతృత్వంలో తొలి కమ్యూనిస్టు మంత్రివర్గం ఏర్పడింది. అటు తర్వాత మధ్య మధ్య విరామా లున్నా ఆ రాష్ట్రంలో సీపీఎం నేతృత్వాన వామపక్ష ప్రజాతంత్ర కూటమి ప్రభుత్వాలు అధికారంలోకొస్తున్నాయి. 2011 ఎన్నికల్లో ఆ కూటమి స్వల్ప తేడాతో అధికారా నికి దూరమైంది. పశ్చిమబెంగాల్లో సుదీర్ఘ కాలం...1977 నుంచి 2011 వరకూ ఆ పార్టీ నేతృత్వంలోని కూటమి అధికారంలో ఉంది. త్రిపురలో 1988, 1993 ఎన్నికలు మినహా 1977నుంచీ ఆ పార్టీ నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ అధికారంలో కొనసాగుతున్నది. ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు అజ్ఞాతం లోకి వెళ్లిన సీపీఎం ఆ తర్వాత బెంగాల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించి, జాతీయ స్థాయిలో ఎదగడంపై దృష్టి కేంద్రీకరించింది. 1980 దశకం తర్వాత కాంగ్రె సేతర పార్టీలతో పొత్తుపెట్టుకోవడం ప్రారంభించింది. ఈ పొత్తులవల్ల ఆ పార్టీకి కొన్ని సీట్లు లభిస్తే లభించి ఉండొచ్చుగానీ అది బలమైన శక్తిగా రూపొందలేక పోయింది. సీపీఎం జయాపజయాలు అది పొత్తు పెట్టుకునే పార్టీల గెలుపోటము లతో ముడిపడి ఉండటం దీన్నే సూచిస్తుంది. బలమైన ప్రజాపోరాటాలు నిర్మించినచోట మాత్రమే పొత్తులతో సంబంధం లేకుండా అది విజయం పొందగలిగింది. ఇటీవలికాలంలో వామపక్షాల ప్రభావం గణనీయంగా పడిపోయింది. మూడు న్నర దశాబ్దాలపాటు పశ్చిమబెంగాల్ను పాలించిన వామపక్షాలు 2011 ఎన్నికల్లో అధికారానికి దూరమయ్యాయి. తన పాలనాకాలంలో లెఫ్ట్ ఫ్రంట్ బెంగాల్లో నిరు పేదలకు భూములు పంచి, కౌలు రైతులకు హక్కులివ్వడంద్వారా బెంగాల్లోనే కాదు...దేశంలోనే కీర్తిప్రతిష్టలు ఆర్జించించింది. తీరా అదే ప్రభుత్వం సింగూర్, నందిగ్రామ్లలో పరిశ్రమల కోసం అక్కడి రైతుల భూములను బలవంతంగా తీసు కోవడానికి ప్రయత్నించడం దాన్ని అప్రదిష్టపాలు చేసింది. చివరికదే ఆ ప్రభుత్వ పతనానికి ప్రధాన కారణమైంది. అనంతరం మమతా బెనర్జీ నేతృత్వంలో తృణ మూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఆ పార్టీపై ఇప్పుడు పెరుగుతున్న అసంతృ ప్తిని సీపీఎం కంటే బీజేపీయే సొమ్ము చేసుకుంటున్నట్టు కనబడుతున్నది. జాతీయ స్థాయిలో చూస్తే సీపీఎంకు పార్లమెంటులో ఉన్న బలం ఎన్నడూ లేనంతగా పడిపో యింది. ఉభయ సభల్లోనూ ఆ పార్టీకి కేవలం 5 శాతం సీట్లు మాత్రమే ఉన్నాయి. లోక్సభలో 9మంది, రాజ్యసభలో 9మంది ఉండగా...కేరళనుంచి ఎన్నికైన ఆరుగు రు రాజ్యసభ ఎంపీల్లో ముగ్గురు ఈ నెలాఖరుకు రిటైరవుతున్నారు. మరో ముగ్గురు వచ్చే ఏడాది రిటైరవుతారు. వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్, కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ రెండుచోట్లా సీపీఎం రాష్ట్ర కమిటీలు సంస్థాగతంగా ఒడిదు డుకులను ఎదుర్కొంటున్నాయి. వీటిని అధిగమించి, ప్రజల విశ్వాసాన్ని చూరగొన డం అక్కడి కమిటీలకు అగ్ని పరీక్ష. అందులో విజయం సాధిస్తేనే జాతీయ స్థాయిలో కనీసం ఇప్పుడున్న బలాన్నయినా సీపీఎం నిలబెట్టు కోగలుగుతుంది. ఇలాంటి నేపథ్యంలో సీపీఎం సారథ్య బాధ్యతలను ప్రకాష్ కారత్ నుంచి సీతా రాం ఏచూరి స్వీకరించారు. విద్యార్థి ఉద్యమంలో ఎదిగి అనేక పోరాటాల్లో నేరుగా పాలుపంచుకున్న వ్యక్తిగా...ఇటు సైద్ధాంతిక పటిమ ఉన్న నేతగా ఆయనకు పేరుం ది. యాభైయ్యేళ్లనాడు సీపీఎం ఆవిర్భవించినప్పుడు తెలుగువాడు పుచ్చలపల్లి సుందరయ్య దానికి సారథ్యం వహించగా...మళ్లీ ఇన్నేళ్లకు ఈ ప్రాంతంనుంచి ఏచూరి దానికి ప్రధాన కార్యదర్శి అయ్యారు. అందుకు ఆయనను అభినందించాలి. అయితే ఆయన ముందున్న సవాళ్లు సామాన్యమైనవి కాదు. కేరళ, పశ్చిమ బెంగాల్లో అంతర్గత పోరును చక్కదిద్ది ఆ రెండుచోట్లా పార్టీని గెలుపు బాటలో నడిపించడం ఆయన నిర్వర్తించాల్సిన తక్షణ కర్తవ్యం. దేశంలో అమల్లోకి వచ్చిన నయా ఉదారవాద ఆర్థిక విధానాలు రేకెత్తించిన ఆశలు మధ్యతరగతిని వామ పక్షా లకు దూరం చేసిన మాట వాస్తవమే అయినా...ఆ విధానాలే చెప్పుకోదగినంతగా అసమానతలనూ పెంచాయి. దేశంలో పాలక, ప్రతిపక్షాలు రెండింటికీ ఆ విధానాల విషయంలో వైరుధ్యం లేదు. సకల రంగాలనూ ఆవరించిన అవినీతి ఇప్పుడు ప్రధా న సమస్యగా మారింది. కేంద్రంలో బీజేపీ నేతృత్వాన ఎన్డీయే సర్కారు ఏర్పడ్డాక మతతత్వ ధోరణులు పెరిగాయి. ఒక మంచి ప్రత్యామ్నాయాన్ని అందించగలమన్న భరోసానిస్తే మద్దతిచ్చేందుకు జనం సిద్ధంగా ఉన్నారని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ విజయం నిరూపించింది. భవిష్యత్తులో సీపీఐతో విలీనానికి సిద్ధమేనని ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యాక ఏచూరి ప్రకటించారుగానీ...అంతకన్నా ముందు కనీసం వామపక్షాల ఐక్యత అయినా సాధ్యపడాలని కోరుకుంటున్నవారెందరో ఉన్నారు. ఈ మహాసభల్లో చేసుకున్న ఆత్మవిమర్శ, రూపొందించుకున్న భవిష్యత్తు కార్యక్రమం ఆ దిశగా పార్టీని నడిపిస్తుందని అలాంటివారు ఆశిస్తున్నారు. -
ఆ బిల్లును అందరూ వ్యతిరేకిస్తున్నారు
భూ సేకరణ చట్ట సవరణ బిల్లుపై సీపీఎం ప్రధాన కార్యదర్శి కారత్ - బిల్లుకు రాజ్యసభలో ఆమోదం కష్టమే - కేంద్రం ఇప్పటికే పునరాలోచనలో పడింది - ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో కారత్ సాక్షి, హైదరాబాద్: రాజ్యసభలో భూ సేకరణ చట్ట సవరణ బిల్లు ఆమోదం పొందే ప్రసక్తే లేదని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ పేర్కొన్నారు. లోక్సభ, రాజ్యసభల్లో వామపక్షాల బలం తక్కువగానే ఉన్నా, యావత్ ప్రతిపక్షం ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నందున అది ఆమోదం పొందే అవకాశం లేదని చెప్పారు. సీపీఎం తొలి తెలంగాణ రాష్ట్ర మహాసభ ల్లో పాల్గొనేందుకు ఇక్కడకు వచ్చిన ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. రాజ్యసభలో ఎన్డీఏ కు తగిన బలం లేకపోయినా, ఉభయసభల సమావేశాన్ని పెట్టి ఆ బిల్లును ఆమోదింప చేసుకుంటామని బీజేపీ చెబుతోంది కదా అన్న ప్రశ్నకు.. లోక్సభలో లేదా రాజ్యసభలో బిల్లు తిరస్కరణకు గురైనపుడే ఉమ్మడి సమావేశాన్ని పెట్టాల్సి ఉంటుందన్నారు. ఎలాగైనా సరే ఈ బిల్లును ఆమోదింపచేసుకుంటామని ప్రధాని మోదీ చెబుతున్నారు కదా అన్న ప్రశ్నకు, కేంద్రం ఇప్పటికే ఈ విషయంలో పునరాలోచనలో పడిందన్నారు. ఈ బిల్లు రాజ్యసభకు వస్తుందా లేదా అన్నది అనుమానంగానే ఉందన్నారు. ఆయా అంశాలపై ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు.. సాక్షి: రైల్వే, సాధారణ బడ్జెట్లపై లెఫ్ట్ ఏవైనా ఆందోళనలు చేపడుతుందా? కారత్: కేంద్ర ప్రభుత్వ విధానాల్లో భాగంగా కార్పొరేట్ రంగానికి అనుకూలంగా బడ్జెట్లలో ఆయా ప్రతిపాదనలు చేశారు. ఇందుకు సంబంధించి ఆయా వర్గాల ప్రజల్లో వ్యక్తమయ్యే ఆందోళన, అసంతృప్తిని కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. సీపీఎం, సీపీఐ జాతీయ మహాసభలు ముగిసిన తర్వాత కార్యాచరణను రూపొందించుకుంటాం. కాంగ్రెస్, ఇతర పార్టీలతో కలసి ఆందోళనలు చేసే అవకాశముందా? ఇకముందు కాంగ్రెస్, ఇతర బూర్జువాపార్టీలతో కలసి ఆందోళనలు, నిరసనల్లో పాల్గొనే అవకాశాలు లేవు. వామపక్షాల కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయి? సీపీఐ, సీపీఎం జాతీయ మహాసభలు ముగిశాక, ఆయా అంశాలపై చర్చించుకుని, కార్యక్రమాలను రూపొందించుకుంటాం. ఇప్పటికే ఆరు వామపక్షాలు కలసి పనిచేస్తున్నాయి. ముందుగా వామపక్షాల మధ్య ఐక్యత సాధిం చేందుకు కృషి చేస్తూనే, ప్రజలు ఎదుర్కొం టున్న సమస్యలపై ప్రజాస్వామ్యశక్తులతో కలసి ఆందోళనలను తీవ్రతరం చేయాలనే ఆలోచనతో ఉన్నాము. దేశంలో వ్యవసాయ సంక్షోభం, కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఏ విధమైన వైఖరిని తీసుకుంటారు? వ్యవసాయరంగానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఒకేవిధమైన పరిస్థితులు, సమస్యలు లేవు. తెలంగాణలో ఒకవిధంగా, మరో రాష్ర్టంలో మరో విధంగా పంటలతీరు, వాతావరణ పరిస్థితులున్నాయి. అయితే భూసంస్కరణల అంశం అందరికీ సంబంధించిన విషయం కాబట్టి దానిపై కార్యాచరణను చేపడుతున్నాం. భూసంస్కరణ చట్టానికి సవరణలు, బీమారంగంలో ఎఫ్డీఐల కోసం జరుగుతున్న ప్రయత్నాలను అడ్డుకుంటాం. కేరళ మాజీ సీఎం అచ్యుతానందన్ను సస్పెండ్ చేస్తారా? ఆ అవసరమే లేదు. పార్టీలో అచ్యుతానందన్ ఒంటరి అయ్యారు. ఆయన ఒక వ్యక్తి మాత్రమే. కేరళలో మొదటిసారిగా 20 ఏళ్లలో పార్టీలో రాజకీయంగా, సంస్థాగతంగా ఐక్యత కనిపించింది. క్రమశిక్షణకు కట్టుబడితే మాజీ సీఎం అచ్యుతానందన్ మళ్లీ పార్టీలోకి రావొచ్చు. ప్రస్తుతం ఆయన స్థానాన్ని ఖాళీగానే ఉంచాం. -
సచివాలయం తరలింపును అడ్డుకోండి
గవర్నర్కు వామపక్ష పార్టీల ఫిర్యాదు సాక్షి, హైదరాబాద్: అశాస్త్రీయమైన వాస్తు పేరుతో తెలంగాణ రాష్ట్ర సచివాలయాన్ని మార్చాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్డుకోవాలని వామపక్ష పార్టీలు గవర్నర్ నరసింహన్ను కోరాయి. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ పది వామపక్ష పార్టీల ప్రతినిధులు గురువారం రాజ్భవన్లో గవర్నర్కు ఫిర్యాదు చేశారు. చాడ వెంకటరెడ్డి, అజీజ్పాషా(సీపీఐ), తమ్మినేని వీరభద్రం(సీపీఎం), కె.గోవర్ధన్, వేములపల్లి వెంకట్రామయ్య(సీపీఐ-ఎంఎల్-న్యూడెమొక్రసీ), బండా సురేందర్ రెడ్డి(ఫార్వర్డ్బ్లాక్), ఆర్.గోవింద్(ఆర్ఎస్పీ), బి.వీరయ్య(సీపీఐ-ఎంఎల్), సి.హెచ్.మురహరి(ఎస్యూసీఐసీ), ఎం.డి.గౌస్(ఎంసీపీఐయూ) తదితరులు గవర్నర్ను కలసినవారిలో ఉన్నారు. కొత్త సచివాలయం పేరిట ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం వంటి చర్యలను ఆపాలని వామపక్షనేతలు గవర్నర్ను కోరారు. ఈ అంశాలపై ప్రభుత్వంతో చర్చించి, తగిన నిర్ణయం తీసుకుంటానని గవర్నర్ తమకు హామీ ఇచ్చారని వామపక్ష పార్టీల నేతలు మీడియాకు తెలిపారు. -
'రైతులెవరూ అప్పులు చెల్లించొద్దు'
-
'రైతులెవరూ అప్పులు చెల్లించొద్దు'
రైతులు ఎవరూ ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి గానీ, ప్రైవేటుగా గానీ తాము తీసుకున్న అప్పులను తిరిగి చెల్లించొద్దని వామపక్షాలు పిలుపునిచ్చాయి. హైదరాబాద్లోని ఇందిరా పార్కు వద్ద పది వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రైతుల ఆత్మహత్యల వ్యవహారంపై ప్రభుత్వం తీరును వామపక్షాలు ఖండించాయి. రైతులను ఆదుకోవడంలో కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని నాయకులు మండిపడ్డారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. -
నేడు వామపక్షాల మహాధర్నా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న రైతుల ఆత్మహత్యల విషయంలో ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడాన్ని నిరసిస్తూ గురువారం ఇందిరాపార్కు వద్ద 10 వామపక్షాలు మహాధర్నాను నిర్వహించనున్నాయి. ఈ ధర్నాలో వామపక్షాలతో పాటు ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబసభ్యులతో పాటు, రైతు సంఘాల ప్రతి నిధులు పాల్గొంటారు. రైతులసమస్యలపై అసెంబ్లీలో, బయటా ఎలాంటి స్పష్టమైన హామీ రాకపోవడం, నిర్దిష్ట మైన కార్యాచరణను ప్రకటించకపోవడాన్ని ఎండగడుతున్నాయి. వామపక్షాల ఆధ్వర్యంలో నిర్వహించిన రైతుల భరోసాయాత్రకు మంచి స్పందన వచ్చిందని సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. -
11న రైతు కుటుంబాలతో మహాధర్నా
వామపక్షాల ప్రకటన సాక్షి, హైదరాబాద్: రైతుల ఆత్మహత్యలు, వ్యవసాయ రంగంలో సంక్షోభ నివారణకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలతో వచ్చేనెల 11న ఇందిరాపార్కు వద్ద మహాధర్నాను నిర్వహిస్తామని వామపక్షా లు ప్రకటించాయి. వచ్చేనెల 5-11 తేదీల మధ్య ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను కలుసుకోనున్నట్లు తెలిపాయి. అసెంబ్లీ జరుగుతున్నా బాధిత కుటుంబాలకు నష్టపరిహారాన్ని చెల్లించే విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని ఈ పార్టీలు ఖండించాయి. అసెంబ్లీ సమావేశాలు ముగి సేలోగా ఈ విషయంలో సానుకూలంగా స్పం దించాలని విజ్ఞప్తి చేసినా ప్రభుత్వంలో ఉలుకూ పలుకూ లేదని విమర్శించాయి. ఈనెల 29లోగా స్పష్టమైన ప్రకటన రాకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు దిగనున్నట్లు హె చ్చరించాయి. బుధవారం మఖ్దూంభవన్లో ఆర్ఎస్పీ నేత జానకిరాములు అధ్యక్షతన జరిగిన సమావేశంలో చాడవెంకటరెడ్డి (సీపీఐ), తమ్మినేని (సీపీఎం), వెంక టరామయ్య (న్యూడెమోక్రసీ), సురేందర్రెడ్డి (ఫార్వర్డ్బ్లాక్), కె.గోవర్దన్ (న్యూడెమోక్రసీ), గౌస్ (ఎంసీపీఐ), మురహరి (ఎస్యూసీఐ-సీ) పాల్గొన్నారు. -
'బీజేపీ వచ్చాక మతోన్మాదం పెరిగింది'
హైదరాబాద్: బీజేపీ అధికారంలోకి వచ్చాక మతోన్మాదం పెరిగిందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి విమర్శించారు. సుప్రీంకోర్టు మందలించే వరకు నల్లకుబేరుల జాబితా ఇవ్వకపోవడం కార్పొరేట్ శక్తులకు సహకరించడమేనని ఆరోపించారు. వామపక్షాల ఐక్యత కోసం వచ్చే నెలలో ఢిల్లీలో ఐక్యతా సదస్సు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని సుధాకరరెడ్డి చెప్పారు. -
బెజవాడలో వీఎంసీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
విజయవాడ : విజయవాడ మున్సిపల్ కార్యాలయం వద్ద శనివారం ఉద్రిక్తత నెలకొంది. తక్షణమే జీతాలు విడుదల చేయాలని ఉద్యోగులు ఆందోళనకు దిగగా, మరోవైపు మంచినీటి ఛార్జీల పెంపును నిరసిస్తూ వామపక్ష నేతల ఆధ్వర్యంలో కార్యకర్తలు మున్సిపల్ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించాయి. ఢిల్లీ తరహాలో విజయవాడలో కూడా ఉచితంగా మంచినీరు సరఫరా చేయాలని వామపక్షాలు డిమాండ్ చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
రోడ్డుపై కొట్టుకున్న సీపీఎం, సీపిఐ కార్యకర్తలు
-
భద్రాచలంలో వామపక్షాల బాహాబాహీ
తెలంగాణలోని భద్రచలం ప్రాంతాన్ని ఆంధ్ర ప్రాంతంలో కలపాలని కొంత మంది సీమాంధ్ర కేంద్రమంత్రులు కేంద్రాన్ని కోరడాన్ని సీపీఐ తీవ్రంగా ఖండించింది. భద్రాచలం తెలంగాణలోనే ఉంచాలని డిమాండ్ చేస్తు సీపీఐ మంగళవారం భద్రచలంలో దీక్షను చేపట్టింది. అయితే ఆ పార్టీ దీక్ష చేపట్టడాన్ని సీపీఎం కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ క్రమంలో సీపీఐ చేపట్టిన దీక్షను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దాంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో ఇరు పార్టీల కార్యకర్తలు బాహబాహీకి పోటిపడ్డారు. దాంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్తో పాటు 10 జిల్లాలతో కూడిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని ఆ ప్రాంతం నాయకులు కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆంధ్రలో పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తే భద్రచలం ప్రాంతాన్ని ఆంధ్రలో విలీనం చేయాలని సీమాంధ్ర కేంద్ర మంత్రులు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దాంతో తెలంగాణ ప్రజలు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో భద్రచలం తమ ప్రాంతంలోనే ఉండాలని తెలంగాణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అందులోభాగంగా ఇప్పటికే భద్రచలంలో పలు పార్టీలు ధర్నాలు, నిరసనలు, ఆందోళన ఉధృతం చేసిన సంగతి తెలిసిందే. -
10న వామపక్షాల సభకు ప్రజలను భారీగా తరలిస్తాం
ఖమ్మం మయూరి సెంటర్, న్యూస్లైన్: ప్రజాసమస్యలను పరిష్కరించాలన్న డిమాండుతో ఈ నెల 10న హైదరాబాద్లో నాలుగు వామపక్ష పార్టీలు (సీపీఎం, సీపీఐ, ఆర్ఎస్పీ, ఫార్వర్డ్బ్లాక్) ఉమ్మడిగా నిర్వహించనున్న బహిరంగ సభకు జిల్లా నుంచి ప్రజలను భారీగా సమీకరించనున్నట్టు సీపీఎం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్, సీపీఐ జిల్లా కార్యదర్శి భాగం హేమంతరావు చెప్పారు. వారు బుధవారం ఖమ్మంలోని సుందరయ్య భవనంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పోతినేని మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న సరళీకరణ విధానాలతో ప్రజలపై పడుతున్న భారాలకు వ్యతిరేకంగా ఈ సభ తలపెట్టినట్టు చెప్పారు. యూపీఏ-2 ప్రభుత్వ విధానాలతో ఆర్థిక పరిస్థితి తిరోగమనంలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో పేద-మధ్యతరగతి ప్రజల జీవనం దుర్భరంగా మారిందని అన్నారు. పారి శ్రామిక రంగంలో మందగమనం ఏర్పడిందని, పరిశ్రమలు మూతపడడంతో అందులోని కార్మికులు వీధిన పడ్డారని చెప్పారు. దేశంలోకి విదేశీ పెట్టుబడులను విచ్చలవిడిగా అనుమతిస్తోందని విమర్శించారు. ఇవే విధానాలను బీజేపీ తన పాలనలో కూడా అవలంబించిందన్నారు. భాగం హేమంతరావు మాట్లాడుతూ.. ప్రజాసమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ఘోరంగా విఫలమైందని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల నయా ఉదారవాద ఆర్థిక విధానాలతో దేశం సంక్షోభంలో చిక్కుకుందని అన్నారు. ఈ నేపథ్యంలో... హైదరాబాదులో వామపక్షాలు ఈ నెల 10న నిర్వహించనున్న బహిరంగ సభను ప్రజలు జయప్రదం చేయాలని కోరారు. బహిరంగ సభ పోస్టర్ను పోతినేని, భాగం తదితరులు ఆవిష్కరించారు. సమావేశంలో సీపీఐ నాయకులు పోటు ప్రసాద్, శింగు నరసింహారావు, ఎస్కె.జాన్మియా, సీపీఎం నాయకులు నున్నా నాగేశ్వరరావు, యర్రా శ్రీకాంత్ పాల్గొన్నారు.