live in relationship
-
అందుకు వెనుకాడుతున్న సహజీవన జంటలు..!
డెహ్రాడూన్:ఉత్తరాఖండ్లో యూనిఫామ్ సివిల్కోడ్(యూసీసీ) జనవరి 27న అమలులోకి వచ్చింది. ఈ చట్టం ద్వారా అన్ని మతాల్లోని వ్యక్తులకు వివాహం,ఆస్తిహక్కులు తదితర అంశాల్లో ఒకే రకమైన నిబంధనలు అమలు చేస్తున్నారు. ఏ మతంలోనూ బహుభార్యత్వాన్ని యూసీసీ అనుమతించదు. వీటికితోడు యూసీసీ కింద సహజీవనాలను సైతం రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా పెళ్లి చేసుకోకుండా కలిసి ఉండే జంటలు దరఖాస్తు చేసుకుని తమ సహజీవనాన్ని నమోదు చేసుకోవాలి. అయితే సహజీవనాల నమోదుకు ఇప్పటివరకు 5 దరఖాస్తులు రాగా కేవలం ఒక సహజీవనం మాత్రమే రిజిస్టర్ అయింది. అయితే సహజీవనాల నమోదుకు పెద్దగా స్పందన లేదన్న వాదన కొంత మంది వినిపిస్తున్నారు. దీనిని మరికొంత మంది వ్యతిరేకిస్తున్నారు. చట్టంపై ప్రజల్లో అవగాహన రావడానికి సమయం పడుతుందంటున్నారు. సహజీవనాల నమోదుకు చాలా మంది ఇష్టపడడం లేదన్న వాదనా ఉంది. అయితే సహజీవనం నమోదు చేసుకోకపోతే యూసీసీ కింద జరిమానాతో పాటు ఆరు నెలల జైలు శిక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది.సహజీవనాల నమోదును చాలా మంది వ్యతిరేకించినప్పటికీ ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఈ విషయంలో వెనక్కి తగ్గలేదు. శ్రద్దావాకర్ తరహా ఘటనలు పునరావృతం కావద్దంటే సహజీవనాల నమోదు తప్పనిసరన్న నిబంధనను తీసుకువచ్చింది. -
ఆ రాష్ట్రంలోనూ ‘లివ్ ఇన్’కు రిజిస్ట్రేషన్ తప్పనిసరి
జైపూర్: ‘లివ్ ఇన్ రిలేషన్’ జంటల విషయంలో రాజస్థాన్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ తరహా జంటలు తమ సంబంధాన్ని అధికారికంగా నమోదు చేసుకునేందుకు ఒక పోర్టల్ను ప్రారంభించాలని రాజస్థాన్ హైకోర్టు సింగిల్ బెంచ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.హైకోర్టులో ‘లివ్ ఇన్’ జంటలు దాఖలు చేసిన పిటిషన్లో వారు తమకు భద్రత కల్పించాలని కోర్టును కోరారు. దీనిపై స్పందించిన హైకోర్టు సింగిల్ బెంచ్ .. ‘కొందరు యువతీ యువకులు ‘లివ్-ఇన్’ సంబంధంలో ఉంటున్నారు. వారి సంబంధాన్ని పెద్దలు, ఇతరులు అంగీకరించకపోవడం వల్ల, ఆ జంటలతో పాటు వారి కుటుంబాలు సమాజంలో హేళనను, ముప్పును ఎదుర్కొంటున్నాయి. అందుకే వారు తమ జీవితాలను, స్వేచ్ఛను కాపాడాలని కోరుతున్నారు.దీనిపై చట్టం రూపొందించే వరకు ‘లివ్-ఇన్’ సంబంధాలను అధికారం కలిగిన ట్రిబ్యునల్ వద్ద నమోదు చేయాలని జస్టిస్ అనూప్ కుమార్ ధండ్ పేర్కొన్నారు. ‘లివ్-ఇన్’ సంబంధంలో ఉండే స్త్రీ భాగస్వామికి భార్య లాంటిది కాదని హైకోర్టు పేర్కొంది. ఇటువంటి సంబంధంలో జీవించాలనే ఆలోచన కొత్తగా అనిపించవచ్చు. కానీ వాస్తవానికి దీని కారణంగా పలు సమస్యలు తలెత్తుతాయి. ఇటువంటి ‘లివ్ ఇన్’ సంబంధాల నమోదు విషయాన్ని పరిశీలించడానికి రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఒక కమిటీని ఏర్పాటు చేయాలి, ఈ తరహా జంటల ఫిర్యాదులను పరిశీలించి, వాటిని ఆ కమిటీ పరిష్కరించాలి. ఇందుకోసం ఒక వెబ్సైట్ లేదా వెబ్ పోర్టల్ ఉండాలి" అని హైకోర్టు సింగిల్ బెంచ్ పేర్కొంది. కాగా ఉత్తరాఖండ్లో ‘లివ్ ఇన్’లో ఉంటున్న జంటలకు రాష్ట్రప్రభుత్వం రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసింది.ఇది కూడా చదవండి: Mahakumbh-2025: తొక్కిసలాట అనంతరం భద్రత పెంపు -
'పెళ్లికి ముందు సహజీవనం'.. ఉచిత సలహాపై మండిపడ్డ నటి!
దమ్ మారో దమ్.. పాటలో తన పర్ఫామెన్స్తో ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించింది జీనత్ అమన్. స్టార్ హీరోయిన్గా ఎదుగుతన్న సమయంలోనే దర్శకుడు మజర్ ఖాన్ను ప్రేమించి పెళ్లాడింది. వైవాహిక జీవితంలో గొడవలు తలెత్తడంతో విడాకులు తీసుకుంది. గతంలో ప్రేమ, డేటింగ్ గురించి మాట్లాడుతూ.. కుర్రకారు ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోవాలని పిలుపునిచ్చింది. మనసుకు నచ్చగానే బెడ్ ఎక్కేయడం కరెక్ట్ కాదని హెచ్చరించింది. తాజాగా మరోసారి అలాంటి సలహాలు ఇచ్చింది జీనత్ అమన్. పెళ్లికి ముందు సహజీవనం చేయాలంటూ యువతకు సలహాలు ఇచ్చింది. మీరు ప్రేమలో ఉన్నట్లైతే వెంటనే పెళ్లి చేసుకోవద్దు.. కచ్చితంగా సహజీవనం చేయండి.. ఆ తర్వాతే పెళ్లి చేసుకోండి. నా ఇద్దరు కుమారులకు కూడా ఇదే చెప్తూ ఉంటానని చెప్పుకొచ్చింది. అయితే జీనత్ సలహాలపై నెటిజన్స్ మండిపడుతున్నారు. మరికొందరు మీరు చెప్పింది బాగానే ఉంది.. కానీ, దాన్ని ఆచరణలో పెట్టేందుకు సొసైటీ అందుకు సహకరించదని కామెంట్స్ చేస్తున్నారు. అయితే తాజాగా మరో సీనియర్ నటి ముంతాజ్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. జీనత్ అలాంటి సలహాలు ఇవ్వడంపై విమర్శలు గుప్పించింది. స్త్రీలు ఇలాంటి సంస్కృతిని అనుసరించినట్లయితే వివాహ వ్యవస్థ నిరుపయోగం అవుతుందని ముంతాజ్ తెలిపింది. సోషల్ మీడియాలో జీనత్ ఇచ్చే సలహాల పట్ల జాగ్రత్తగా ఉండాలని ముంతాజ్ పేర్కొంది. ఆమె కేవలం సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం ఇలాంటి చెత్త సలహాలు ఇవ్వడం మంచిది కాదని హితవు పలికింది. మా నైతిక విలువలకు విరుద్ధంగా ఇలా చేయడం కరెక్ట్ కాదని సూచించింది. ఇలాంటి సంబంధాలపై సలహాలు ఇచ్చే చివరి వ్యక్తి జీనత్ అవ్వాలని కోరుకుంటున్నట్లు ముంతాజ్ తెలిపింది. గతంలో జీనత్ అమన్... నటుడు మజార్ ఖాన్తో వివాహంపై ముంతాజ్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. మజర్ ఖాన్ను పెళ్లి చేసుకోవడానికి ముందు ఆమెకు చాలా ఏళ్ల క్రితమే తెలుసని ముంతాజ్ వెల్లడించింది. ఆమె వివాహం ఒక ప్రత్యక్ష నరకమని పేర్కొంది. కాగా.. జీనత్ అమన్ మొదట సంజయ్ ఖాన్ను పెళ్లాడారు. ఆ తర్వాత ఏడాదికే విడిపోయారు. ఆ తర్వాత జీనత్ అమన్ 1985లో మజర్ ఖాన్ను వివాహం చేసుకుంది. 1998లో అతను మరణించే వరకు అతనితోనే ఉంది. అయితే గతంలో చాలా సందర్భాల్లో అతన్ని వివాహం చేసుకుని తప్పు చేశానని..పెళ్లయిన 12 సంవత్సరాలలో ఒక్క క్షణం కూడా ఆనందంగా లేనని పేర్కొంది. -
ప్రేమలో ఉన్నారా? ముందు సహజీవనం, తర్వాతే పెళ్లి!
దమ్ మారో దమ్.. పాటలో తన పర్ఫామెన్స్తో ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించింది జీనత్ అమన్. స్టార్ హీరోయిన్గా వెలుగొందుతున్న సమయంలో నటుడు, దర్శకుడు మజర్ ఖాన్ను ప్రేమించి పెళ్లాడింది. వైవాహిక జీవితంలో గొడవలు తలెత్తడంతో విడాకులు తీసుకుంది. ఆ మధ్య ప్రేమ, డేటింగ్ గురించి మాట్లాడుతూ.. కుర్రకారు ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోవాలని పిలుపునిచ్చింది. మనసుకు నచ్చగానే బెడ్ ఎక్కేయడం కరెక్ట్ కాదని హెచ్చరించింది. అవతలివారి కోసం మీ వ్యక్తిత్వాన్ని పక్కన పడేయొద్దని సూచించింది. నటి రిలేషన్ పాఠాలు తాజాగా మరోసారి ఆమె ప్రేమ పాఠాలు చెప్పింది. 'నేను ఇంతకుముందు ఏదో పోస్ట్ పెడితే రిలేషన్షిప్ సలహాలు ఇవ్వమని దానికింద కామెంట్లు చేశారు కదా.. ఇంతకుముందు ఎక్కడా చెప్పని ఓ విషయం ఇప్పుడు చెప్తున్నా వినండి.. మీరు ప్రేమలో ఉన్నట్లైతే వెంటనే పెళ్లి చేసుకోవద్దు. కచ్చితంగా సహజీవనం చేయండి.. ఆ తర్వాతే పెళ్లి చేసుకోండి. నా ఇద్దరు కుమారులకు కూడా ఇదే చెప్తూ ఉంటాను. సహజీవనమే బెటర్ రెండు కుటుంబాలు, రిజిస్ట్రేషన్ కోసం గవర్నమెంట్.. ఇలా అన్నింటినీ భాగం చేసే ముందు మీ ప్రేమకు టెస్ట్ పెట్టుకోండి.. అదే లివ్ ఇన్ రిలేషన్షిప్. నాకైతే ఇదే లాజిక్గా అనిపిస్తుంది. మీరు రోజూ కొన్ని గంటలు కబుర్లు చెప్పుకుంటూ ఉంటే బాగానే ఉంటుంది. అదే ఇద్దరూ ఒకే రూమ్ షేర్ చేసుకోగలుగుతారా? బాధలో ఉన్నప్పుడు నిజంగానే అవతలి వ్యక్తి ఓదార్చుతారా? నీకు నచ్చింది వంట చేసేందుకు ఒప్పుకుంటారా? సలహా బాగుంది కానీ.. బెడ్రూమ్, బాత్రూమ్.. అన్నింటినీ పంచుకోగలుగుతారా? సర్దుకుపోతారా? ఇలా ఎన్నో విషయాల్లో మీకంటూ ఓ క్లారిటీ వస్తుంది. సహజీవనం సరైనదే అంటే మన సమాజం అదొక పెద్ద పాపం అన్నట్లుగా చూస్తుంది.. అయినా చాలా విషయాల్లో సమాజం ఇలాగే ప్రవర్తిస్తుందిలే!' అని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టింది. ఇది చూసిన కొందరు మీరు చెప్పింది బాగానే ఉంది.. కానీ, దాన్ని ఆచరణలో పెట్టేందుకు సొసైటీ అందుకు సహకరించదని కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Zeenat Aman (@thezeenataman) చదవండి: నేరుగా ఓటీటీలోకి తెలుగు డబ్బింగ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే? -
బిగ్బాస్ నటితో సహజీవనం.. ఇప్పుడేమో సింగిల్గా ఉంటూ!
బిగ్బాస్ షోతో గుర్తింపు తెచ్చుకున్న భామ పవిత్రా పూనియా. ఈ ముద్దుగుమ్మ 2020లో బిగ్బాస్ -14వ సీజన్లో మెరిసింది. అదే సీజన్లో కంటెస్టెంట్గా పాల్గొన్న ఇజాజ్ ఖాన్తో ప్రేమలో పడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత డేటింగ్లో ఉన్న భామ.. ఏడాదిలోపే పెళ్లి చేసుకుంటానని నిశ్చితార్థం చేసుకున్నారు. కానీ.. అంతలోనే పెళ్లి విషయం పక్కనపెట్టేసి రెండేళ్లు సహజీవనం చేశారు. ఈ ఏడాదిలోనైనా పెళ్లిబంధంలోకి అడుగుపెడతారన్న జంట ఫిబ్రవరి 14న షాకింగ్ న్యూస్ చెప్పారు. తామిద్దరం విడిపోతున్నట్లు బుల్లితెర జంట ప్రకటించారు. బుల్లితెర నటులైన ఇజాజ్ ఖాన్- పవిత్ర పూనియా మధ్య విభేదాలు రావడంతో విడిపోయారు. అంతకుముందు ఇద్దరూ ఒకే అపార్ట్మెంట్లో ఉండగా.. గత నెలలో ఇజాజ్ ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు. పవిత్ర పూనియా మాత్రం ప్రస్తుతం అదే ఇంట్లో ఉంటోంది. నాలుగేళ్ల పాటు డేటింగ్లో ఉన్న వీరిద్దరు తమ బంధానికి ముగింపు పలికారు. అయితే ప్రస్తుతం ఇజాజ్ ఖాన్ తన దృష్టినంతా కెరీర్పైనే పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతను ఎవరితోనూ రిలేషన్లో లేడని సమాచారం. దీంతో ఇజాజ్ సింగిల్గానే ఉంటున్నారు. గతంలో పునియాను ఇజాజ్ ఖాన్ మోసం చేశాడని.. విడిపోవడానికి అదే కారణమని రూమర్స్ వచ్చాయి. కానీ వాటన్నింటినీ పూనియా తోసిపుచ్చింది. కాగా.. ఇజాజ్ ఖాన్ ప్రస్తుతం కొత్త ఇంటికి మారాడు. అంతే కాకుండా దివ్యాంక త్రిపాఠితో ఒక ప్రాజెక్ట్ను తెరకెక్కిస్తున్నాడు. బ్రేకప్ అయ్యాక పూర్తిగా తన కెరీర్పైనే ఫోకస్ పెట్టారు. కాగా.. పవిత్ర ప్రస్తుతం 'ఇష్క్ కీ దస్తాన్-నాగమణి' అనే సీరియల్లో నటిస్తోంది. -
‘చాలాకాలం సహజీవనం చేసి, పెళ్లి చేసుకోకున్నా భరణం ఇవ్వాల్సిందే’
భోపాల్: వివాహం, భరణం అంశంపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. పురుషుడితో చాలాకాలంపాటు సహజీవనం చేసిన మహిళ.. విడిపోయిన సమయంలో భరణం పొందేందుకు అర్హురాలని తెలిపింది. చట్టబద్దంగా ఇరువురు వివాహం చేసుకోకపోయినా ఇది వర్తిస్తుందని పేర్కొంది. గతంలో సహజీవనం చేసిన భాగస్వామికి భరణం ఇవ్వాలంటూ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. మహిళకు నెలసరి భత్యం కింద 1,500 చెల్లించాలంటూ కింద కోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధించింది. వివరాలు .. శైలేష్ బోప్చే(38), అనితా బోప్చే (48) అనే మహిళతో కొంతకాలం సహజీవనం చేశారు. వీరికి ఓ బిడ్డ కూడా జన్మించింది. బాలాఘాట్కి చెందిన శైలేష్ బోప్చే.. సదరు మహిళ ఆరోపణలపై ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. తన భార్యగా చెప్పుకుంటున్న మహిళ, ఆలయంలో వివాహం చేసుకున్నట్లు రుజువు చేయలేకపోయిందని బోప్చే కోర్టుకు చెప్పాడు. ఈ కేసులో మహిళ చట్టబద్ధంగా అతని భార్య కాదని.. సీఆర్పీసీలోని సెక్షన్ 125 కింద మెయింటనెన్స్ మొత్తాన్ని డిమాండ్ చేయలేదని బోప్చే తరుపు న్యాయవాది వాదనల్ని వినిపించారు. జస్టిస్ జీఎస్ అహ్లువాలియాతో కూడిన బెంచ్ మహిళ కొంత కాలం సదరు వ్యక్తితో కలిసి జీవించిందనే వివరాలను గుర్తించింది. దీంతో ఆమె భరణానికి అర్హురాలే అని తీర్పు వెల్లడించింది. తనతో నివసించిన మహిళకు నెలవారీ భత్యం రూ.1,500 చెల్లించాలని ట్రయల్ కోర్టు ఆదేశించింది. అయితే ఈ ఉతర్వులను శైలేష్ బాప్చే హైకోర్టులో సవాల్ చేశాడు. దీనిపై జస్టిస్ జేఎస్ అహ్లూవాలియాతో కూడిన ధర్మాసనం శనివారం విచారణ చేపట్టి.. ఆమెకు నెలసరి భత్యం కింద రూ. 1,500 చెల్లించాలంటూ కింద కోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధించింది. -
అమ్మతనానికి మాయని మచ్చ.. సహజీవనం చేస్తున్న వ్యక్తితో కూతురిపై
తిరువనంతపురం: అమ్మ ప్రేమకు ప్రత్యామ్నాయం ఉండదు. త్యాగానికి ప్రతిరూపం అమ్మ. పిల్లలపై కన్నతల్లికి ఉన్న ప్రేమ, మమకారం వర్ణించలేనిది. అలాంటి పేగు బంధానికి మాయని మచ్చ తెచ్చింది ఓ మాతృమూర్తి. తనతో సహజీవనం చేస్తున్న వ్యక్తితో సొంత కూతురిపై అత్యాచారానికి ప్రోత్సహించింది కసాయి తల్లి. సభ్యసమాజం సిగ్గుపడే ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. కన్నతల్లి బంధానికే అర్ధాన్ని మార్చివేస్తూ మహిళ చేసిన నిర్వాకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోక్సో కేసులో సదరు తల్లికి 40 ఏళ్ల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేరళకు చెందిన ఓ మహిళ తన భర్తను వదిలేసి ప్రియుడు శిశుపాలన్తో సహజీవనం చేస్తుంది. ఆ సమయంలో మహిళ ఏడేళ్ల కూతురు తన వద్దే ఉంటుంది. ఈ క్రమంలో బాలికనుని శిశుపాలన్ అనేకమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. కొన్నిసార్లు స్వయంగా తల్లే తన కూతురిని అతని వద్దకు తీసుకెళ్లి ఈ దారుణానికి ప్రోత్సహించింది. 2018 మార్చి నుంచి 2019 సెప్టెంబర్ మధ్య కాలంలో ఈలైంగిక దాడి జరిగింది. అయితే బాధితురాలి పదకొండేళ్ల సోదరి ఇంటికి వచ్చినప్పుడు.. తనపై జరుగుతున్న వేధింపుల విషయాన్ని ఆమెకు వివరించింది. అంతేగాక పెద్ద అమ్మాయిని కూడా శిశుపాలను వేధింపులకు గురిచేశాడు. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఈ క్రమంలో 11 ఏళ్ల అక్క చిన్నారితో కలిసి ఇంట్లో నుంచి తప్పించుకొని వాళ్ల అమ్మమ్మ ఇంటికి వెళ్లి జరిగిన విషయాన్ని వారితో చెప్పుకుంది. ఆమె పోలీసులను ఆశ్రయించగా.. నిందితులపై కేసు నమోదు చేసి తల్లితోపాటు సహజీవన భాగస్వామిని పోలీసులు అరెస్టు చేశారు. విచారణ సమయంలో నిందితుడు శిశుపాలన్ ఆత్మహత్య చేసుకోగా.. తనతో సహజీవనం చేస్తున్న వ్యక్తితో సొంత కూతురిపై అత్యాచారానికి ప్రోత్సహించిన తల్లికి 40 ఏళ్ల జైలు శిక్ష వేసింది కోర్టు. ఆమెకు ఆరునెలల కఠిన కారాగార శిక్ష కూడా విధించారు. తిరువనంతపురం ఫాస్ట్ట్రాక్ స్పెషల్ కోర్టు జడ్జి ఆర్ రేఖ ఈ మేరకు తీర్పునిచ్చారు. ఆ మహిళకు రూ. 20 వేలు జరిమానా కూడా విధించారు. ప్రస్తుతం పిల్లలు బాలల సంరక్షణ గృహంలో నివసిస్తున్నారు. చదవండి: కోటాలో 20 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్య.. ఈ ఏడాదిలో 28వ ఘటన -
సహజీవనం పేరుతో సీజన్కొక భాగస్వామి. ఇదేం పధ్ధతి?
లక్నో: సహజీవనం పేరిట పాశ్చాత్య సంస్కృతి వెర్రితలలు వేసి భారత సంస్కృతిని వివాహ వ్యవస్థను నాశనం చేస్తోందని వ్యాఖ్యానించింది అలహాబాద్ హైకోర్టు. ఈ సందర్బంగా సీజన్ల వారీగా భాగస్వాములను మార్చుకుంటూ పోవడం ఆరోగ్యకరమైన సమాజానికి మంచిది కాదని తెలిపింది కోర్టు. అన్నీ అయిపోయాక.. అలహాబాద్లో అద్నాన్ అనే ఓ వ్యక్తి పరస్పర అంగీకారంతో యూపీలోని సహరాన్పూర్కు చెందిన ఓ యువతితో సహజీవనం చేశాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమెతో శారీరక సంబంధాన్ని ఏర్పరచుకున్నాడు. అయితే ఆ యువతి అనూహ్యంగా గర్భం దాల్చడంతో అద్నాన్ పెళ్ళికి నిరాకరించాడు. దీంతో ఆ యువతి అలహాబాద్ హై కోర్టును ఆశ్రయించగా విచారణ సమయంలో అలహాబాద్ కోర్టు నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తూ సహజీవనంపై కీలక వ్యాఖ్యలు చేసింది. అంత సులువు కాదు.. ఒక వ్యక్తికి వివాహ వ్యవస్థ కల్పించినంత భద్రత కానీ సామాజిక అంగీకారం కానీ సహజీవనం కల్పించలేదని తెలిపారు అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిద్ధార్థ్. దీర్ఘకాలిక పరిణామాలపైఅవగాహనలేక యువత ఇలాంటి తప్పటడుగు వేస్తోంది. వివాహ వ్యవస్థ మనుగడలో లేని దేశాల్లో సహజీవనం సర్వసాధారణంగా మారిపోయింది కానీ ఇపుడు వారు ఈ సమస్య నుండి బయటపడి వివాహ వ్యవస్థను కాపాడటానికి నానా అవస్థలు పడుతున్నాయని అన్నారు. అయినా సీజన్ల వారీగా భాగస్వామిని మార్చడం సమాజపురోగతికి చేటు అని తెలిపారు. ఇది కూడా చదవండి: దీప్తిది హత్యే! కొలిక్కి వచ్చిన కోరుట్ల టెక్కీ కేసు -
ఆరేళ్లు కలిసుండి.. అత్యాచారం అంటే చెల్లదు: హైకోర్టు
దొడ్డబళ్లాపురం(బెంగళూరు): ఒక పురుషుడు, మహిళ ఇష్టపడి కలిసి ఉండి.. ఆ తర్వాత మహిళ అత్యాచారం ఆరోపణలు చేస్తే చెల్లదని కర్ణాటక హైకోర్టు ఓ తీర్పులో స్పష్టం చేసింది. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన దావణగెరెకు చెందిన మహిళ, బెంగళూరుకు చెందిన ఒక పురుషుడు ఆరేళ్లుగా సన్నిహితంగా ఉన్నారు. పురుషుడు వివాహానికి నిరాకరించడంతో తనపై అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపిస్తూ మహిళ 2021లో బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. దీనిని సవాల్ చేస్తూ అతడు హైకోర్టును ఆశ్రయించాడు. 2013లో ఫేస్బుక్ ద్వారా తమకు పరిచయం కలిగిందని, ఇద్దరి ఆమోదంతోనే సంబంధం కొనసాగిందని పేర్కొన్నాడు. ఇరువర్గాల వాదనలను ఆలకించిన జస్టిస్ నాగప్రసన్న ధర్మాసనం.. మహిళ ఆరోపణలను తోసిపుచ్చింది. ఆరేళ్లు సుదీర్ఘ సంబంధం ఉండడం వల్ల ఆమె చేసే అత్యాచారం అభియోగాలు చెల్లవని అభిప్రాయపడింది. చదవండి: కిలాడీ లేడీ.. ఆమె ట్రాప్లో పడితే అంతే సంగతులు! -
కలిసి జీవిస్తే సరిపోతుందా?.. విడాకులెలా కోరతారు?
మన దేశ చట్టాల్లో భూతద్దం పెట్టి చూసిన దొరకని ‘సహజీవనం’ అనే బంధం గురించి ఆసక్తికరమైన తీర్పు ఒకటి వెలువడింది. సహజీవనంలో ఉన్న ఓ జంట విడాకులు కోరుతూ కోర్టు మెట్లు ఎక్కింది. అయితే చట్టం ప్రకారం అది పెళ్లి కానప్పుడు.. విడాకుల ప్రస్తావన ఎక్కడి నుంచి వస్తుందని ఓ జంటను ప్రశ్నించింది కేరళ హైకోర్టు. ఏ చట్టంలోనూ కలిసి ఉంటే పెళ్లి అని లేదు. ఇద్దరి మనసులు కలిసాయని సహజీవనం చేసేవాళ్లకు విడాకులు అడిగే హక్కే లేదు. కేవలం పర్సనల్, సెక్యులర్ చట్టం ప్రకారం వివాహం జరిగినప్పుడే దానికి గుర్తింపు ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. ఒప్పందం ప్రకారం కలిసి జీవించినా.. అది వివాహం కిందకు రాదని, విడాకులకు ఆస్కారం ఉండదని స్పష్టం చేసింది బెంచ్. చట్టం ప్రకారం ఒక్కటైన జంటలకు మాత్రమే విడాకులు తీసుకునే హక్కు మన చట్టాలు కల్పించాయని ఈ సందర్భంగా పిటిషనర్లకు కోర్టు గుర్తుచేసింది. 2006 నుంచి వేర్వేరు మతాలకు చెందిన ఇద్దరు సహజీవనం చేస్తున్నారు. పైగా తమ బంధానికి సంబంధించి ఒప్పంద పత్రం కూడా రాసుకున్నారు. ఓ బిడ్డనూ కన్నారు. ఈ క్రమంలో మనస్పర్థలతో విడిపోవాలని నిర్ణయించుకున్న ఆ జంట స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. అయితే.. చట్ట ప్రకారం వివాహం కానప్పుడు విడాకులు ఎలా ఇస్తామని ప్రశ్నిస్తూ పిటిషన్ను ఫ్యామిలీ కోర్టు కొట్టేసింది. దీంతో ఫ్యామిలీ కోర్టు ఆదేశాల్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించింది ఆ జంట. చట్టం ప్రకారం సహజీవనానికి గుర్తింపు లేదు. కలిసి ఉండడానికి మీకు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. ఇప్పుడు విడిపోవడానికి చట్టం ప్రకారం ముందుకెళ్తున్నారు. ఇది వీలుకాని విషయం. చట్టంలోనూ అందుకు వెసులుబాటు లేదు అని జస్టిస్ ముహమ్మద్ ముస్తాఖ్, జస్టిస్ సోఫీ థామస్ నేతృత్వంలోని బెంచ్ తీర్పు ఇచ్చింది. ఇక ఈ కేసులో ఫ్యామిలీ కోర్టు తీరుపైనా హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. చట్టం ద్వారా గుర్తించబడిన వివాహాలకు సంబంధించిన దావాలను మాత్రమే స్వీకరించే పరిధి ఫ్యామిలీ కోర్టులకు ఉందని, పై పిటిషన్ను విచారణకు తీసుకుని కొట్టేసే బదులు.. పిటిషన్ నిర్వహణ సాధ్యం కాదని ముందుగానే పిటిషన్ను తిరస్కరించి ఉండాల్సిందని, తద్వారా కోర్టు సమయం వృథా కాకుండా ఉండేదని హైకోర్టు ఈ సందర్భంగా అభిప్రాయపడింది. ఇది రూ.10 మర్డర్ కేసు.. చదివేయండి! -
మూడోసారి సహజీవనం, 83 ఏళ్ల వయసులో నాలుగోసారి..
హాలీవుడ్ స్టార్, రెండుసార్లు ఆస్కార్ అందుకున్న హీరో రాబర్ట్ డి నిరో 79 ఏళ్ల వయసులో ఏడోసారి తండ్రైన విషయం తెలిసిందే కదా! తాజాగా ఇదే వయసులో ఉన్న మరో హాలీవుడ్ హీరో కూడా తండ్రి కాబోతున్నాడు. 83 ఏళ్ల వయసులో నాలుగోసారి డాడ్ అని పిలిపించుకోబోతున్నాడు. ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ నోరెళ్లబెడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. అల్ పచినో 29 ఏళ్ల వయసున్న నూర్ అల్ఫల్లాతో కొంతకాలంగా సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలో గతేడాది ఆమె గర్భం దాల్చగా ప్రస్తుతం ఆమెకు ఎనిమిది నెలలు నిండినట్లు తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లోనే ఆమె పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ సమయంలో అల్ పచినో తండ్రి కాబోతున్నాడన్న వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇకపోతే అల్ పచినో ఏప్రిల్లో 83వ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకున్నాడు. మూడు రిలేషన్స్- ముగ్గురు పిల్లలు పెళ్లి అంటే ముఖం చాటేసే అల్ పచినో గతంలో ఇద్దరితో ప్రేమాయణాలు నడిపాడు. మొదటగా యాక్టింగ్ కోచ్ జన్ తరంత్తో డేటింగ్ చేయగా వీరికి 1989లో జూలీ పుట్టింది. ఆ తర్వాత నటి బెవర్లీ డియాంగిలోతో సహజీవనం చేయగా వీరికి ఆంటన్, ఒలీవియా కవలలు జన్మించారు. అయితే వీరి రిలేషన్ కూడా ఎంతో కాలం సాగలేదు. 1997-2003 మధ్యకాలంలోనే కలిసి ఉన్నారు, తర్వాత బ్రేకప్ చెప్పుకుని ఎవరి దారి వారు చూసుకున్నారు. అనంతరం అల్.. నూర్ అల్ఫల్లాతో లవ్లో పడ్డాడు. అప్పటికే ఆమె మిక్ జాగర్, నికోలక్ బెరగ్రూన్లతో ప్రేమలో పడటం, బ్రేకప్ చెప్పడం కూడా అయిపోయింది. అంటే ఇద్దరికీ ఇది మూడో డేటింగే! ఎప్పుడూ ప్రేమ, సహజీవనం వరకే వచ్చి ఆగిపోయిన అల్ పచినో పెళ్లికి మాత్రం మొగ్గచూపలేదు. మరి ఈసారైనా తన గర్ల్ఫ్రెండ్ను పెళ్లి చేసుకుంటాడేమో చూడాలి! సినిమాల విషయానికి వస్తే.. అల్ పచినో ప్రస్తుతం 'డేవిడ్ మామెట్స్ అసాసినేషన్' సినిమా చేస్తున్నాడు. యూఎస్ మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ హత్య ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. షియా లేబఫ్, రెబెకా పిడ్జియాన్, కోర్ట్నీ లవ్ ముఖ్య పాత్రలు పోషించనున్నారు. సెప్టెంబర్లో ఈ సినిమా ప్రారంభం కానుంది. చదవండి: కోపంతో నయనతారను రావద్దని చెప్పా: పార్థిబన్ -
ఇన్స్టాగ్రామ్లో పరిచయం.. యువతితో సహజీవనం.. చివరికి ఊహించని ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్ (బంజారాహిల్స్): ప్రేమిస్తున్నా.. పెళ్లి చేసుకుంటా అని యువతితో సహజీవనం చేసి..గర్భందాల్చాక నమ్మక ద్రోహానికి పాల్పడటమే కాకుండా అబార్షన్ చేయించుకోకపోతే యాసిడ్ పోసి చంపేస్తానని బెదిరించిన యువకుడిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం... బంజారాహిల్స్ రోడ్ నం. 12లోని ఎన్బీటీ నగర్లో నివసించే యువతి(22) ప్రైవేట్ జాబ్ చేస్తోంది. 2020లో వరంగల్ జిల్లాకు చెందిన కాంట్రాక్టర్ బూక్యా కల్యాణ్(25)తో ఇన్స్ట్రాగామ్లో పరిచయం ఏర్పడింది. ప్రేమ పేరుతో ఇద్దరూ షికార్లు కొట్టారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో ఆమె కల్యాణ్తో శారీరక సంబంధాలు కూడా కొనసాగించింది. ఈ నేపథ్యంలోనే ఆమె గర్భందాలి్చంది. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని అతను అబార్షన్ చేయించుకోవాలని, లేకపోతే యాసిడ్ పోసి చంపేస్తానని బెదిరించాడు. ఆ తర్వాత వారం రోజులుగా ఆమె ఫోన్ చేస్తే స్పందించడంలేదు. దీంతో బాధితురాలు వరంగల్లోని కల్యాణ్ స్వగ్రామానికి వెళ్లి ఆరా తీయగా.. అప్పటికే మరో యువతితో కల్యాణ్కు వివాహ నిశ్చితార్థం జరిగిందని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నాడని తెలిసింది. తనను ఎందుకు మోసం చేశావని ప్రశ్నించగా రూ.10 లక్షలు కట్నం ఇస్తే చేసుకుంటానని డిమాండ్ చేశాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా బంజారాహిల్స్ పోలీసులు నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 493, 420, 417,313 506, వరకట్న నిషేధ చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. -
వివాహితతో సహజీవనం.. అసలు విషయం తెలిసి షాకయిన మహిళ
సాక్షి, హైదరాబాద్: మూడు పెళ్లిళ్లు చేసుకోవడమేగాక మరో వివాహితను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి సహజీవనం చేసి మోసం చేసిన నిత్య పెళ్లి కొడుకును బంజారాహిల్స్ పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఎస్ఐ హరీశ్వర్రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మెహిదీపట్నం సంతోష్నగర్లో నివసించే మహ్మద్ బిన్ ఇషాక్ డిజిటల్ ఎంటర్ప్రైజెస్ యూట్యూబర్గా పని చేస్తున్నాడు. గతంలోనే ఆయనకు మూడు పెళ్లిళ్లు జరిగాయి. గత అక్టోబర్లో బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని మిథిలానగర్లో ఉంటున్న వివాహిత(32)తో పరిచయం ఏర్పడింది. తనకు పెళ్లి కాలేదని ప్రేమిస్తున్నానని నమ్మించి పెళ్లి చేసుకుంటానని మభ్యపెట్టి ఆమెతో సహజీవనం చేశాడు. రెండు వారాల క్రితం ఆమెకు ఇషాక్ అసలు రూపం తెలియడంతో ఈ విషయంపై ఆమె నిలదీయగా అతను ముఖం చాటేశాడు. తాను మోసపోయానని తెలుసుకున్న బాధితురాలు ఈ నెల 13న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. చదవండి: Hyderabad: హనీట్రాప్.. అందమైన రూపంతో ఎర.. ఒక్క వీడియో కాల్ ఎంత పనిచేసింది!! -
వాలంటైన్స్డే రోజే ఢిల్లీలో దారుణం.. ప్రియురాలిని చంపి, ఫ్రిజ్లో దాచేసి..
న్యూఢిల్లీ: తనను ప్రేమించి మరో యువతిని ఎందుకు పెళ్లాడుతున్నావని నిలదీసినందుకు ప్రాణంతీశాడో దుర్మార్గుడు. చంపేసి ఊళ్లోని తన దాబాలో ఉన్న రిఫ్రిజరేటర్లో దాచాడు! రెండు, మూడు రోజుల క్రితం జరిగిన ఈ హత్యోదంతం ప్రేమికుల దినోత్సవం (ఫిబ్రవరి 14) రోజే వెలుగు చూడటం గమనార్హం. ఢిల్లీ పోలీసులు మంగళవారం వెల్లడించిన వివరాల ప్రకారం నైరుతి ఢిల్లీలోని మిత్రోన్ గ్రామానికి చెందిన సాహిల్ గెహ్లాట్(24) గత కొన్ని సంవత్సరాలుగా హర్యానాకు చెందిన నిక్కీ యాదవ్ అనే యువతితో సహజీవనంలో ఉన్నాడు. 2018 జనవరిలో ఉత్తమ్ నగర్లోని ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్లో వీరికి పరిచయం ఏర్పడి అది ప్రేమకు, తర్వాత సహజీవనానికి దారితీసింది. అప్పటి నుంచి సొంతూళ్లలో ఇంట్లో వాళ్లకు తెలీకుండా ఢిల్లీలో సహజీవనం చేస్తున్నారు. నిక్కీ సాహిల్ను పెళ్లి చేసుకోవాలనుకుంది. అయితే ఇటీవల గెహ్లాట్ తల్లిదండ్రులు అతడికి వేరే అమ్మాయితో వివాహం నిశ్చయించారు. ఈ విషయం సాహిల్ ప్రియురాలికి చెప్పలేదు. అయితే ఎట్టకేలకు పెళ్లి విషయం తెలుసుకున్న నిక్కీ అతడిని నిలదీసింది. మరొకరిని పెళ్లాడితే వేరే కేసులో ఇరికిస్తానని బెదిరించింది. కాగా ఫిబ్రవరి 9వ తేదీన సాహిల్కు మరో అమ్మాయితో నిశ్చితార్థం జరిగింది. దీంతో నిక్కీ అతనికి ఫోన్ చేసి ఉత్తమ్ నగర్లోని తన ఫ్లాట్కు రమ్మని చెప్పింది. నిందితుడు తన కారులో బాధితురాలి ఇంటికి వెళ్లి అక్కడి నుంచి ఆమెను కారులో బయటకు తీసుకొచ్చాడు. అక్కడ కూడా పెళ్లి చేసుకోవద్దని ఆమె ఒత్తిడి చేసింది. అంతేగాక అదే ఫిబ్రవరి 9న ప్రియుడితో కలిసి గోవాకు వెళ్లేందుకు ముందే ప్లాన్ చేసి టిక్కెట్లు బుక్ చేసుకుంది. తనతో పాటు గోవాకు రావాలని అడగ్గా.. సాహిల్ నిరాకరించాడు. దీంతో ఇద్దరి మధ్య అర్ధరాత్రి గొడవ జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన గెహ్లాట్ కారులో మొబైల్ ఫోన్ డేటా కేబుల్తో అమ్మాయిని గొంతు నులిమి చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని కారులో తన దాబా దగ్గరకు తీసుకెళ్లాడు. దాబాలోని ఫ్రిజ్లో పెట్టి దానికి తాళం వేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.. అదే రోజు(ఫిబ్రవరి 10 ఉదయం) వేరే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. నిందితుడు గెహ్లాట్ను ఢిల్లీ దగ్గర్లోని కయిర్ గ్రామంలో అరెస్ట్చేశామని పోలీస్ స్పెషల్ కమిషనర్ చెప్పారు. పోలీసుల దర్యాప్తులో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. మృతదేహం రిఫ్రిజిరేటర్ లోపల చెక్కుచెదరకుండా ఉండటం గుర్తించారు. నెమ్మదిగా కుళ్ళిపోవడం ప్రారంభించిందని, ఆమె శరీరంపై గొంతు నులిమిన గుర్తులు మాత్రమే ఉన్నాయని పోలీసులు తెలిపారు. నిందితుడు కశ్మీర్ గేట్ సమీపంలో ఈ నేరానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే హత్య జరిగిన ప్రాంతాన్ని ఇంకా ధృవీకరించబడలేదు. -
'సహజీవనం అనే మాటే వినలేదు.. అది మన సంస్కృతి కాదు..'
ముంబై: మహారాష్ట్ర ఎంపీ, మాజీ నటి నవనీత్ రానా సహజీవనం, స్వలింగ సంపర్క వివాహాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన సొంత నియోజకవర్గం అమరావతిలో నిర్వహించిన ఓ సమావేశంలో మాట్లాడుతూ.. అసలు సహజీవనం గురించి తన జీవితంలో ఎప్పుడూ వినలేదని పేర్కొన్నారు. పైచదువుల కోసం తల్లిదండ్రులు తమ పిల్లలను వేరే నగరాలకు పంపితే వారేమో లివ్ ఇన్ రిలేషన్ అంటూ తమకిష్టమైన వారితో కలిసి జీవిస్తున్నారని అన్నారు. అలాగే స్వలింగ సంపర్క వివాహలను కూడా నవనీత్ వ్యతిరేకించారు. ఈరోజుల్లో ఏం జరుగుతుందో తనకు అర్థం కావడం లేదని, అబ్బాయిలు అబ్బాయిలనే, అమ్మాయిలు అమ్మాయిలనే పెళ్లిచేసుకోవడం ఏంటి? అని వాపోయారు. సహజీవనం, స్వలింగ సంపర్క వివాహాలు మన సంస్కృతి, సంప్రదాయాలే కాదని నవనీత్ పేర్కొన్నారు. చదవండి: బీబీసీ కార్యాలయంపై ఐటీ దాడులు.. సిబ్బంది సెల్ఫోన్లు సీజ్! -
HYD: ప్రేమ పేరుతో సహజీవనం.. రూ. 8 లక్షలు తీసుకొని మరో యువతితో పెళ్లి
సాక్షి, హైదరాబాద్: ప్రేమ పేరుతో లైంగిక దాడికి పాల్పడి పెళ్లి చేసుకుంటానని సహజీవనం చేశాడు. అనంతరం ఉపాధి వెతుక్కుంటానని రూ. 8 లక్షలు తీసుకున్నాడు. తీరా పెళ్లి మాట ఎత్తేసరికి అప్పటికే మరో యువతిని పెళ్లి చేసుకొని మోసగించారు. ఘటనలో ఘరానా మోసగాడిని జూబ్లీహిల్స్ పోలీసులు శనివారం అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. వివరాలివీ... హయత్నగర్ సమీపంలో ప్రైవేట్ హాస్టల్ నడుపుతున్న కాశీ స్నేహిత్ ప్రణయ్ రాజ్కు 2011లో యువతితో పరిచయం ఏర్పడింది. ప్రేమిస్తున్నానని పలుమార్లు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అయిదేళ్లుగా సహజీవనం చేశాడు. బోరబండలో జవహర్నగర్లో గదులు అద్దెకు తీసుకొని ఆమెతో సహజీవనం చేసిన సమయంలోనే తాను వ్యాపారం చేస్తానని ఆమె వద్ద నుంచి దశల వారిగా రూ. 8 లక్షల వరకు వసూలు చేశాడు. పెళ్లి మాట ఎత్తేసరికి ముఖం చాటేయడమే కాకుండా గతేడాది ఆగస్టు 20న మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. తన మాటేమిటని ప్రశ్నిస్తే ఫోన్ బ్లాక్ చేశాడు. తాను మోసపోయానని తెలుసుకున్న బాధితురాలు ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి నాలుగు నెలలుగా తిరిగినా అది తమ పరిధి కాదంటూ పట్టించుకోకపోవడంతో షీ టీమ్స్ను ఆశ్రయించింది. అక్కడి పోలీసుల సూచన మేరకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 376, 420 కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. చదవండి: విధి ఆడిన వింత నాటకం.. కొత్త జంట అకాల మరణం -
25 ఏళ్లుగా సహజీవనం.. ఇంట్లో నుంచి వెళ్లగొట్టిన మహిళ.. కోపంతో ఆమెపై..
ముంబై: 25 ఏళ్లుగా తనతో సహజీవనం చేసిన మహిళపై యాసిడ్ దాడి చేశాడు 62 ఏళ్ల వ్యక్తి. ఆమె ఇంట్లో నుంచి వెళ్లగొట్టిందన్న కోపంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటనలో మహిళకు 40 శాతం కాలిన గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. మహారాష్ట్ర ముంబైలోని గిర్గావ్లో శుక్రవారం ఈ ఘటన జరిగింది. నిందితుడి పేరు మహేశ్ పూజారి. బాధితురాలితో 25 ఏళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. ఆమెకు అప్పటికే పెళ్లై భర్త నుంచి విడిపోయింది. మహేశ్ కూడా ఆమె భార్య నుంచి విడిపోయాడు. దీంతో ఇద్దరు కలిసి జీవిస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మహేశ్ను తన ఇంట్లో నుంచి వెళ్లగొట్టింది మహిళ. రెండు రోజుల తర్వాత అతడు ఇంటికి యాసిడ్ బాటిల్తో తిరిగివచ్చాడు. శుక్రవారం వేకువజామున 5:30 గంటల సమయంలో ఆమె నీళ్లు తోడుకునేందుకు బయటకు రాగా యాసిడ్ చల్లాడు. దీంతో ఆమె తీవ్రగాయాలపాలైంది. పోలీసులు నిందితుడ్ని గంటల్లోనే అరెస్ట్ చేశారు. చదవండి: క్రిమినల్ కేసులో ఎంపీకి 10 ఏళ్ల జైలు శిక్ష.. లోక్సభ సభ్యత్వం రద్దు.. -
అది అత్యాచారం కిందకు రాదు.. ఒరిస్సా హైకోర్టు కీలక తీర్పు..
భువనేశ్వర్: ఒరిస్సా హైకోర్టు సోమవారం కీలక తీర్పు వెలువరించింది. అత్యాచారం కేసులో నిందితుడికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పరస్పర అంగీకారంతో శృంగారంలో పాల్గొంటే అది అత్యాచారం కిందకు రాదని స్పష్టం చేసింది. ఏంటీ కేసు..? నిమపారకు చెందిన ఓ మహిళ ఓ వ్యక్తితో ప్రేమలో పడింది. అతను ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. భువనేశ్వర్ తీసుకెళ్లి ఆమెతో కొన్ని రోజులు సహజీవనం చేశాడు. ఉన్నట్టుండి ఒకరోజు ఆమెను వదిలి పారిపోయాడు. దీంతో మహిళ అతడిపై కేసు పెట్టింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని, అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపించింది. దీంతో పోలీసులు అతడ్ని అరెస్టు చేశారు. నిందితుడు జిల్లా కోర్టులో బెయిల్కు దరఖాస్తు చేసుకుంటే న్యాయస్థానం నిరాకరించింది. అయితే అతడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. వాదనలు విన్న న్యాయస్థానం నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది. పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చినప్పటికీ ఇద్దరు పరస్పర అంగీకారంతోనే సహజీవనం చేసిందున దీన్ని అత్యాచారంగా పరిగణించలేమని న్యాయస్థానం చెప్పింది. నిందితుడికి షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. అలాగే మహిళను బెదిరించవద్దని అతన్ని ఆదేశించింది. కేసు విచారణకు సహకరించాలని స్పష్టం చేసింది. చదవండి: విమానంలో మందుబాబుల హల్చల్.. ఎయిర్హోస్టస్తో అసభ్యకరంగా.. -
వయసులో మూడేళ్లు చిన్నోడితో సహజీవనం.. పెళ్లి చేసుకోమని అడిగితే..
బెంగళూరు: ఆమె వయసు 27 ఏళ్లు.. తన కంటే మూడేళ్లు చిన్నోడికి దగ్గరైంది. ఇద్దరు కలిసి సహజీవనం చేయాలని నిర్ణయించుకున్నారు. తనను పెళ్లి చేసుకోమని అడిగితే.. చెల్లి పెళ్లి అయ్యాక చేసుకుందామని అతను చెప్పాడు. ఇలా మూడేళ్లు గడిచింది. ఇప్పటికే ఆలస్యమవుతోంది, తనను పెళ్లి చేసుకోవాలని మహిళ యువకుడిని తరచూ అడగుతోంది. దీంతో విసిగెత్తిపోయిన అతడు ఆమెపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. అనంతరం గొంతునులుమి హత్య చేశాడు. అయితే ఈ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు మహిళ మృతదేహాం మెడకు తాడు కట్టి సీలింగ్ ఫ్యాన్కు వేలాడదీశాడు. మరునాడు ఆస్పత్రికి ఫోన్ చేసి ఆమె ఆత్మహత్యా ప్రయత్నం చేసిందని చెప్పాడు. ఆస్పత్రికి తీసుకెళ్లి పరిశీలించిన వైద్యులకు ఆమె మెడపై గాయాలు కన్పించాయి. దీంతో అనుమానంతో పోలీసులకు సమాచారం అందించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. డిసెంబర్ 6న కర్ణాటక బెంగళూరులోని సింగసంద్రలో ఈ ఘటన జరిగింది. మృతురాలి పేరు సునీత. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి బెంగళూరులో నివసిస్తోంది. నిందుతుడి పేరు ప్రశాంత్. ఓ ఈ కామర్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే సునీతకు అప్పటికే వివాహమై విడాకులు తీసుకుందని పోలీసులు తెలిపారు. మొదట తన గుర్తింపు దాచుకుందని, చుట్టపక్కల వారికి దీపుగా పరిచయం చేసుకుందని వివరించారు. ప్రశాంత్ కూడా ఈమె ఇంటి పక్కనే నివసిస్తాడని, ఈ క్రమంలోనే ఇద్దరు దగ్గరయ్యారని వివరించారు. చదవండి: షాకింగ్..12 ఏళ్లకే గుండెపోటు..స్కూల్ బస్సులోనే కుప్పకూలిన విద్యార్థి.. -
అన్నా చెల్లెళ్ల ముసుగులో సహజీవనం.. ఫ్లాట్ అద్దెకు తీసుకుని.. చివరికి..
సాక్షి, తాడేపల్లి రూరల్: వడ్డేశ్వరంలోని ఓ వర్సిటీలో చదువుతున్న విద్యార్థినీవిద్యార్థి మధ్య చిగురించిన ప్రేమ కాస్తా సహజీవనానికి దారి తీసింది. ఈ నేపథ్యంలో వారి మధ్య తలెత్తిన విభేదాలు తారాస్థాయికి చేరి విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన గురువారం తెల్లవారుజామున జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. రాజమండ్రి రూరల్ మండలం రాజవోలుకు చెందిన హెల్త్ ఇన్స్పెక్టర్ రవికుమార్ రెండో కుమారుడైన మందపాటి అజయ్కుమార్(20) వడ్డేశ్వరంలోని వర్సిటీలో బీబీఏ మూడో సంవత్సరం చదువుతున్నాడు. అదే ప్రాంతానికి చెందిన ఓ ప్రైవేటు టీచర్ కుమార్తె బీబీఏ మొదటి సంవత్సరం చదువుతోంది. వీరిద్దరి మధ్య ప్రేమ మొలకెత్తడంతో ఇద్దరూ కలిసి కుంచనపల్లిలోని ఓ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అద్దెకు తీసుకుని అన్నా చెల్లెళ్ల ముసుగులో సహజీవనం చేస్తున్నారు. విద్యార్థిని కాలేజీకి తరచూ రావడం లేదనే విషయమై గత నెల 25న ఇద్దరి మధ్య వివాదం జరిగింది. ఈ నేపథ్యంలో విద్యార్థిని గత నెల 29న రాజవోలులోని తల్లి దగ్గరకు వెళ్లిపోయింది. బుధవారం సాయంత్రం అజయ్కుమార్ విద్యార్థినికి ఫోన్చేసి ఫ్లాట్లో పెంచుతున్న కుక్కపిల్ల (షాషా)కు ఫీడ్ ఇవ్వను, చంపేస్తానని బెదిరించడంతో విద్యార్థిని హుటాహుటిన విజయవాడ వచ్చింది. రాత్రి 1.40 గంటల సమయంలో రోడ్డుమీద ఇద్దరూ గొడవ పడ్డారు. విద్యార్థిని నా జీవితాన్ని నాశనం చేయకు అని వేడుకోవడంతో అతను నన్ను ఎందుకు ప్రేమించావంటూ దురుసుగా ప్రవర్తించాడు. చదవండి: ఆర్య సమాజ్లో ప్రేమ పెళ్లి.. మియాపూర్లో కాపురం.. చివరికి భర్త షాకింగ్ ట్విస్ట్ ఆ తర్వాత ఇద్దరూ ఒకే బైక్పై ఫ్లాట్కు వెళ్లారు. రాత్రి 2.30 గంటలకు అలికిడి కావడంతో విద్యార్థిని నిద్ర లేచి చూడగా నోట్లో గుడ్డలు కుక్కుకుని కిటికీకి హీటర్ వైర్తో ఉరివేసుకుని అజయ్కుమార్ కనిపించాడు. భయపడిన విద్యారి్థని వెంటనే మిగతా ఫ్లాట్ల వారిని లేపి విషయం వివరించింది. వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అజయ్కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
'లివ్-ఇన్ రిలేషన్, పెళ్లి కాదు.. మగాళ్ల మనస్తత్వంలోనే అసలు సమస్య..'
శ్రద్ధ వాకర్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనమైన విషయం తెలిసిందే. ఆమెను 35 ముక్కలు చేసిన అత్యంత క్రూరమైన ఈ అనాగరిక చర్య సర్వత్రా చర్చనీయాంశమైంది. లివ్-ఇన్ రిలేషన్ల కారణంగానే ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయని కేంద్రమంత్రి కౌశల్ కిశోర్ గురువారం అన్నారు. చదువుకున్న అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని, లివ్ ఇన్ రిలేషన్ల జోలికి వెళ్లకుండా నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని సూచించారు. అయితే కేంద్రమంత్రి వ్యాఖ్యలకు వివాదాస్పద రచయిత్రి తస్లీమా నజ్రీన్ కౌంటర్ ఇచ్చారు. ట్విట్టర్లో ఈ విషయంపై స్పందిస్తూ ఓ సందేశం రాసుకొచ్చారు. 'లివ్ ఇన్ రిలేషన్లో ఉన్న ఓ వ్యక్తి తన గర్ల్ఫ్రెండ్ను హత్య చేస్తే.. అమ్మాయిలు పెళ్లి చేసుకోవాలి.. లివ్ ఇన్ రిలేషన్ల వల్లే నేరాలు జరుగుతున్నాయని మీరు చెబుతున్నారు. కానీ పెళ్లైన పురుషులు తమ భార్యలను చంపినప్పుడు.. పెళ్లిళ్ల వల్లే నేరాలు జరుగుతున్నాయి, అందుకే పెళ్లి చేసుకోవద్దు.. లివ్ ఇన్ రిలేషన్లే ఎంచుకోండి అని ఎందుకు చెప్పడం లేదు. పెళ్లిళ్లు, లివ్ ఇన్ రిలేషన్లు కాదు.. అసలు సమస్య మగాళ్ల మనస్తత్వంలోనే ఉంది.' అని నజ్రీన్ రాసుకొచ్చారు. కేంద్రమంత్రి వ్యాఖ్యలకు ఘాటుగా బదులిచ్చారు. When a man kills his girlfriend in a live-in relationship,u ask girls to get married coz live-in encourages crimes. But when men kill their wives,u don't ask girls to go for live-in relationships coz marriage encourages crimes!! Not marriage or live-in,problem is men's mentality. — taslima nasreen (@taslimanasreen) November 17, 2022 మరోవైపు కౌషల్ కిశోర్ వ్యాఖ్యలపై శివసేన నేత ప్రియాంక చతుర్వేది తీవ్రంగా స్పందించారు. ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ జోక్యం చేసుకుని కౌషల్ కిశోర్ను పదవి నుంచి తప్పించాలని కోరారు. ఇలాంటి హేయమైన నేరాళ్లో మహిళలనే నిందించడం క్రూరం, నిర్దాక్షిణ్యంగా అభివర్ణించారు. చదవండి: శ్రద్ధ హత్య కేసు విచారణలో షాకింగ్ నిజాలు.. గంజాయి మత్తులో క్రూరంగా -
షాకింగ్ ఘటన: ప్రియురాలిని చంపి.. ముక్కలుగా కోసి.. తలను పాలిథిన్ సంచిలో!
సెల్ఫోన్, సరదాలు, చెడు స్నేహాలతో కొంతమంది యువత పెడదోవ పడుతుంటే మరికొందరు వయస్సుతో సంబంధం లేకుండా ప్రేమ, సహజీవనం మోజులో పడి హద్దుమీరుతున్నారు. కొత్త అనుభూతి కోసం చెడు అలవాట్లకు బానిసలుగా మారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. తొందరపాటు నిర్ణయాలతో బంగారు భవిష్యత్తును చేజేతులా పేకమేడల్లా కూల్చేసుకుంటున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో శ్రద్ధా వాకర్ హత్య చేసు ఇందుకు నిదర్శనంగా నిలిచిన విషయం తెలిసిందే. గంజాయి మత్తులో ప్రియురాలిని అత్యంత క్రూరంగా హత్య చేసిన నిందితుడు అఫ్తాబ్.. ఆమె శరీరాన్ని 35 భాగాలుగా కోశాడు. అనతంరం ఫ్రిజ్లో దాచి పెట్టి ఒక్కొక్క అవయమవాన్ని మెల్లగా ఢిల్లీ అంతటా పడేశాడు. గూగుల్, యూట్యూబ్ వంటి సాంకేతికతను ఉపయోగించి చేసిన తప్పును కప్పిపుచ్చకునే ప్రయత్నం చేశాడు. హత్య జరిగిన విషయం ఎక్కడా పొక్కకుండా హంతకుడు పన్నిన పన్నాగం యావత్ దేశాన్ని విస్మయానికి గురిచేస్తోంది. 5 రోజుల పరిచయం ఈ ఘటన నుంచి తేరుకోకముందే బంగ్లాదేశ్లో మరో ఘోరం వెలుగు చూసింది. ప్రియుడి చేతిలో ఓ యువతి దారుణ హత్యకు గురైంది. హత్య చేయడానికి కేవలం అయిదు రోజుల క్రితమే వీరిద్దరికి పరిచయం ఏర్పడటం గమనార్హం. వివరాలు.. అబు బాకర్ అనే యువకుడు సప్నా అనే యవతితో సహజీనం చేస్తున్నాడు. వీరిద్దరూ గత నాలుగు ఏళ్లుగా గోబర్చాకా ప్రాంతంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని జీవిస్తున్నారు. చదవండి: అఫ్తాబ్ డ్రగ్ అడిక్ట్.. గంజాయి మత్తులోనే శ్రద్ధను హత్యచేసి.. రాత్రంతా శవం పక్కనే.. మరో యువతితో.. అబుకి కొన్ని రోజుల క్రితం కవితా రాణి అనే యువతితో పరిచయం ఏర్పడింది. ఇది నెమ్మదిగా ప్రేమకు, వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈనెల 5న పని నిమిత్తం సప్నా వేరే ఊరికి వెళ్లిన సమయంలో కవితను అబూ బాకర్ తన ఇంటికి తీసుకొచ్చాడు. అయితే యువకుడికి ఇంతకుముందే మరో యువతితో సంబంధం ఉన్న విషయం కవితకు తెలియడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చెలరేగింది. దీంతో ఆవేశానికి లోనైన అబూ.. యువతిని గొంతు కోసి చంపాడు. అనంతరం ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేశాడు. ఆమె శరీరం నుంచి తలను వేరు చేసి, చేతులను నరికి కాలువలో పడేశాడు. తలను పాలిథిన్ సంచిలో చుట్టి ఉంచి మిగిలిన మృతదేహాన్ని బాక్సులో పడేసి ఇంటి నుంచి పారిపోయాడు. ఈనెల 6న అబూ బాకర్ పనికి రాకపోవడం. ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో అతను పనిచేస్తున్న రవాణా సంస్థ యజమాని బకర్ అద్దె ఇంటికి ఒక వ్యక్తిని పంపాడు. ఇంటికి తాళం వేసి ఉండటంతో అబూబకర్ అదృశ్యంపై అనుమానంతో యజమాని పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు షాక్ పోలీసులు వచ్చి తలుపులు తీయగా.. ఇంట్లో చూసిన దృశ్యాలకు షాక్ అయ్యారు. ఓ పెట్టెలో తల లేని యువతి మృతదేహం కనిపించింది. పక్కనే తలను పాలిథిన్లో చుట్టి వేరుగా ఉండటాన్ని గుర్తించారు. చేతులు మాత్రం లభించలేదు. బాధితురాలిని కాళీపాడ్ బాచర్ల కుమార్తె కవితా రాణిగా గుర్తించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలించడం ప్రారంభించారు. హత్య చేసిన రోజు రాత్రి అబూ బకర్ తన భాగస్వామి సప్నాతో కలిసి రూప్సా నది దాటి ఢాకాకు బయలుదేరినట్లు గుర్తించారు. నవంబర్ 6 రాత్రి నిందితుడి ఆచూకీని పోలీసులు కనుగొన్నారు. ఘాజీపూర్ జిల్లా బసాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అబు బాకర్, ప్రేయసి సప్నాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కస్టడీలో అబూ బకర్ నేరాన్ని అంగీకరించాడు. గోబర్చాకా ప్రాంతంలోని ఇరుకైన ప్రదేశంలో పాలిథిన్లో చుట్టిన కవిత తెగిపోయిన చేతులను స్వాధీనం చేసుకున్నారు. ఇదీ చదవండి: Shraddha Case: అమ్మాయిలే జాగ్రత్త పడాలి! -
శ్రద్ధా దారుణ హత్య.. స్పందించిన బాలీవుడ్ నటి
న్యూఢిల్లీ: ఢిల్లీ శ్రద్ధా వాకర్ హత్య కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. శ్రద్ధా శరీర భాగాలను పడేసిన ఢిల్లీలో మోహరౌలీ అడవుల్లోకి అఫ్తాబ్ను తీసుకెళ్లిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికే 13 శరీర భాగాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఫొరెన్సిక్ పరీక్షలకు పంపించారు. హత్య చేసేందుకు ఉపయోగించిన కత్తిని గుర్తించాల్సి ఉంది. మరోవైపు ప్రియురాలు శ్రద్దా వాకర్ను హత్య చేసిన నిందితుడు అఫ్తాబ్ పునావాలా.. ప్రియురాలు మృతదేహం అపార్ట్మెంట్లో ఉండగానే మరో యువతిని తరచూ ఇంటికి తీసుకొచ్చేడని పోలీసుల విచారణలో తేలడంతో. అతడు వాడిన డేటింగ్ యాప్ ‘బబుల్’ నుంచి సమాచారం సేకరిస్తున్నారు. అఫ్తాబ్ డేటింగ్ హిస్టరీ ఇవ్వాలని బబుల్కు లేఖ రాశారు. అతడి ప్రొఫైల్, యువతుల వివరాలు ఇవ్వాలని కోరారు. అంతేగాక అఫ్తాబ్ సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉన్నట్లు తేలింది. అతనికి ఇన్స్టాలో 28 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. చదవండి: శ్రద్ధా హత్య కేసులో ట్విస్ట్.. ప్రియురాలి శవాన్ని ఫ్రిజ్లో ఉంచి.. మరో యువతితో.. ఇదిలా ఉండగా ఢిల్లీ హత్య ఘటనపై దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రియురాలిని అత్యంత క్రూరంగా చంపిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. తన కూతురిని హత్య చేసిన అఫ్తాబ్ అమీన్ పునావాలాకు మరణశిక్ష వేయాలని శ్రద్ధా తండ్రి డిమాండ్ చేశారు. ఈ ఘటన వెనక లవ్ జిహాద్ కోణం ఉందని ఆయన ఆనుమానిస్తున్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘లవ్ జిహాద్ (ప్రేమ ముసుగులో బలవంతంగా మత మార్పిడికి పాల్పడటం) పేరుతో నా కూతురిని హింసించాడని అనిపిస్తోంది. అఫ్తాబ్ను ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నాను. కేసులో ఢిల్లీ పోలీసులపై నమ్మకం ఉంది. సరైన విధంగా విచారణ చేసి శిక్షిస్తారని ఆశిస్తున్నా. శ్రద్ధా వాళ్ల అంకుల్తో దగ్గరగా ఉంటుంది. నాతో ఎక్కువ మాట్లేడేది కాదు. నేను ఇప్పటి వరకు అఫ్తాబ్తో మాట్లాడలేదు. కూతురు కనిపించడం లేదని నవంబర్లోనే ముంబై వాసాయ్లో ముందుగా ఫిర్యాదు చేశాను’ అని తెలిపారు. అయితే శ్రద్ధ ఢిల్లీలో ఉందన్న విషయం తెలిసి కేసును ఢిల్లీ పోలీసులకు బదిలీ చేశారు. శ్రద్ధా అఫ్తాబ్ సంబంధం గురించి చెప్పడంతో కూతురు కనిపించకుండా పోవడం వెనక అతని హస్తం ఉందని అనుమానంతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. చదవండి: ఢిల్లీ: ప్రియురాలి హత్యోదంతం.. సంచలన విషయాలు వెలుగులోకి కాగా శ్రద్ధా- అఫ్తాబ్ 2019 నుంచి రిలేషన్ షిష్లో ఉన్నారు. ఢిల్లీకి వచ్చే ముందు మార్చి ఏప్రిల్ నెలలో హిమాచల్ ప్రదేశ్ వంటి కొన్ని ప్రదేశాలను చుట్టి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. శ్రద్ధా కంటే ముందే అఫ్తాబ్కు చాలా మంది అమ్మాయిలతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. శ్రద్ధాను హత్య చేసిన తరువాత 18 రోజులపాటుటు తెల్లవారుజామున 2 గంటలకు శరీర భాగాలను బయట పారేశాడు. శ్రద్ధా బతికే ఉందని నమ్మించేందుకు ఆమె సోషల్ మీడియా అకౌంట్లను ఉపయోగించేవాడు. హత్య గురించి ఎవరికి అనుమానం రాకుండా ఇంట్లోనే ఎక్కువ సమయం గడిపేవాడు. శ్రద్ధాను చంపిన గదిలోనే తాను ఉండేవాడు. స్పందించిన స్వరా భాస్కర్ ఢిల్లీలో ప్రియురాలిని అతి కిరాతకంగా హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ డిమాండ్ చేశారు. ఈ కేసు ఎంతో విషాదకరమైనదని.. ఈ దారుణాన్ని చెప్పడానికి మాటలు రావడం లేదని అన్నారు. ప్రేమించిన వ్యక్తిని నమ్మి వెళ్తే ఇంత ఘోరానికి పాల్పడటం తన హృదయాన్ని ద్రవింపజేస్తోందన్నారు. పోలీసులు త్వరగా విచారణను ముగిస్తారని, ఈ రాక్షసుడికి కఠిన శిక్ష పడుతుందని ఆశిస్తున్నట్లు ట్వీట్ చేశారు. NO WORDS for how horrifying, gruesome & tragic this case is. My heart goes out to this poor girl-awful betrayal by someone she loved & trusted. Hope police speedily conclude their investigation & hope this monster gets the harshest punishment he thoroughly deserves. #shradhha 💔 https://t.co/W4w10JjdDf — Swara Bhasker (@ReallySwara) November 14, 2022 -
ఢిల్లీ: ప్రియురాలి హత్యోదంతం.. సంచలన విషయాలు వెలుగులోకి
న్యూఢిల్లీ: ఢిల్లీలో సహజీవనం చేస్తున్న ప్రియురాలిని యువకుడు అత్యంత క్రూరంగా హత్య చేసిన ఘటన యావత్ దేశాన్ని కలవరానికి గురిచేస్తోంది. యువతితో పరిచయం, సహజీవనం, హత్య, మృతదేహాన్ని ముక్కలుగా కోయడం, ఎవరికి అనుమానం రాకుండా మృతదేహాన్ని భద్రపరిచిన తీరు విస్మయానికి గురి చేస్తోంది. దీనికి తోడు హత్య చేసిన ఆరు నెలల తర్వాత ఈ ఉదంతం వెలుగులోకి రావడం మరింత గమనార్హం. ఈ కేసులో ఇప్పటికే హంతకుడిని పోలీసులు అదుపులోకి తీసుకోగా.. కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. కేసు వివరాలను ఢిల్లీ సౌత్ పోలీసు ఇన్ఛార్జ్ అంకిత్ చౌహాన్ తెలిపారు. 300 లీటర్ల ఫ్రిడ్జి కొని 24 ఏళ్ల యువతితో సహజీవనం చేసిన ప్రియుడు చివరికి ఆమె పాలిట మృత్యుపాశంగా మారాడు. ఉన్మాదిగా మారి ఆమెను అత్యంత కిరాతకంగా హతమార్చాడు. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతోనే ప్రియురాలిని కత్తితో పొడిచి చంపినట్లు పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. అయిదు నెలల క్రితమే ప్రియురాలని హత్య చేసినట్లు తేలింది. యువతిని అంతమొందించి.. ఆమె మృతదేహాన్ని 35 భాగాలుగా కోశాడు. అయితే ఆమె శరీర భాగాలను భద్రపరిచేందుకు ఓ భారీ(300 లీటర్ల) ఫ్రిడ్జిని కొనుగోలు చేశాడు. చదవండి: కాలేజ్ బిల్డింగ్ పైనుంచి దూకి బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య దుర్వాసన రాకుండా అగర్బత్తీలు హత్య చేసిన 18 రోజుల్లో వాటిని ఒక్కొక్కటిగా నగరంలోని మొహహ్రౌలీ అటవీ ప్రాంతంలో చెల్లాచెదురుగా విసిరేశాడు. తెల్లవారుజామున 2 గంటల సమయంలో బయటకు వచ్చి ముక్కలుగానరికిన శరీర భాగాలను పారేశాడు. అపార్ట్మెంట్ ఇరుగుపొరుగు వారికి దుర్వాసన రాకుండా ఉండేందుకు ఇంట్లో అగర్బత్తిలు వెలిగించినట్లు అంగీకరించాడు. అంతేగాక అమెరికన్ క్రైం షో ‘డెక్స్టర్’ నుంచి ప్రేరణ పొంది ఇంతటి కిరాతకానికి ఒడిగట్టినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. దీనికితోడు చెఫ్గా శిక్షణ పొందిన నిందితుడు మాంసం కత్తిని ఉపయోగించడంలో ప్రవీణుడని తేలింది. హత్యకు ముందు ఏం జరిగిందంటే ముంబైలో పనిచేస్తుండగా అఫ్తాబ్ అనే 28 ఏళ్ల యువకుడు శ్రద్ధా(26) యువతితో పరిచయం ఏర్పడింది. ఇద్దరి మతాలు వేరు కావడంతో యువతి వాళ్ల ఇంట్లో వీరి బంధాన్ని అంగీకరించలేదు. దీంతో ఇద్దరు కలిసి ఢిల్లీకి మకాం మార్చారు. ఓ మల్టినేషనల్ కంపెనీకి చెందిన కాల్ సెంటర్లో పనిచేస్తూ ఛతర్పూర్లోని అపార్ఠ్మెంట్లో ఫ్లాట్ అద్దెకు తీసుకొని సహజీవనం చేశారు. మే నెలలో ఇద్దరి మధ్య పెళ్లి విషయమై గొడవలు ప్రారంభమయ్యాయి. ఈ గొడవలు కాస్తా పెద్దగా అయ్యాయి. పెళ్లి చేసుకోవాలని శ్రద్ధా నిత్యం ఒత్తిడి తేవడంతో మే 18న ప్రియురాలిని అఫ్తాబ్ గొంతు కొసి చంపాడు. ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో కూతురు సహజీవనం విషయంలో విభేదాలు రావడంతో తల్లిదండడ్రులు ఆమెతో మాట్లాడటం మానేశారు. అయితే కొంతకాలంగా శ్రద్ధా ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుందని ఆమె స్నేహితురాలు చెప్పడంతో అనుమానం వచ్చిన తండ్రి కూతురు కోసం ముంబై నుంచి ఢిల్లీకి బయల్దేరాడు. ఇంటికి తాళం వేసి ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శనివారం నిందితుడిని అరెస్ట్ చేశారు. హత్య కేసుగా నమోదు చేసిన పోలీసులు హంతకుడిని ఐదు రోజుల కస్టడీకి తరలించారు. అటవీ ప్రాంతంలో కొన్ని శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నామని, అయితే అవి మానవ అవశేషాలు కాదా అనేది తెలియాల్సి ఉందని తెలిపారు. నిందితుడు ఉపయోగించిన కత్తి ఇంకా లభ్యం కాలేదని పేర్కొన్నారు. -
Hyderabad: భర్తతో విడిపోయి ఒంటరిగా.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి..
సాక్షి, హైదరాబాద్: పెళ్లి చేసుకుంటానని నమ్మించి సహజీవనం చేసి మోసం చేసిన వ్యక్తిపై ఎస్ఆర్నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. 34 ఏళ్ల మహిళ భర్తతో విడిపోయి ఇద్దరు పిల్లలతో కలిసి బల్కంపేటలో ఉంటోంది. సనత్నగర్ ఎస్ఆర్టీకి చెందిన సురేష్ కచువాతో ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి సహజీవనం చేస్తున్నాడు. ఈ నెల 8న ఆమెతో గొడవ పడి వెళ్లగా ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో సనత్నగర్లోని అతడి ఇంటికి వెళ్లింది. సురేష్ తల్లిదండ్రుల నుంచి సరైన స్పందన రాకపోవడంతో ఎస్ఆర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (క్లిక్: యువతితో సన్నిహితంగా ఉన్న వీడియోతో సినీనటి బ్లాక్మెయిల్) -
Hyderabad: అజయ్తో పరిచయం.. సహజీవనం ముసుగులో చిన్నారుల కిడ్నాప్
సాక్షి, హైదరాబాద్: మహిళతో సహజీవనం చేస్తున్న ఓ వ్యక్తి ఆమె ఇద్దరు పిల్లలను ఎత్తుకెళ్లిన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై కె.మధుసూదన్ కథనం ప్రకారం.. బిహార్ రాష్ట్రానికి చెందిన లీలం యాదవ్ భర్త జితేందర్ యాదవ్ ఏడాది క్రితం మృతి చెందగా ముగ్గురు పిల్లలతో కలిసి హైదరాబాద్లో కూలీనాలీ చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో ఏడు నెలల క్రితం బిహార్కే చెందిన అజయ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి సహజీవనం చేయసాగారు. రెండు నెలల క్రితం వీరు జల్పల్లి శ్రీరాం కాలనీలోకి మకాం మార్చగా.. లీలం యాదవ్ స్థానికంగా ఉన్న ఓ కంపెనీలో పని చేస్తోంది. ఆదివారం సాయంత్రం ఆమె ఇంట్లో పని చేస్తుండగా ఆమె కుమార్తె ప్రీతి (2.5 సంవత్సరాలు), కుమారుడు రితేష్ (16 నెలలు) ఇంటి ముందు ఆడుకుంటున్నారు. ఆ సమయంలో తాగిన మైకంలో ఇంటికి వచ్చిన అజయ్ లీలంతో గొడవపడి చేయిచేసుకున్నాడు. అనంతరం ఇద్దరు పిల్లలను తీసుకొని వెళ్లిపోయాడు. కొద్ది సేపటి అనంతరం గమనించిన ఆమె స్థానికంగా వెతికినా లాభం లేకపోవడంతో సోమవారం పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. చదవండి: కుల పంచాయితీలో మహిళపై దాడి.. నిండు ప్రాణం తీసిన వాట్సాప్ ప్రచారం -
పరిచయం.. కొన్నేళ్లుగా సహజీవనం.. అసలు ఏం జరిగిందో కానీ..
తాడికొండ(గుంటూరు జిల్లా): కొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్న ఓ జంట ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ దుర్ఘటన పేరేచర్లలో శుక్రవారం జరిగింది. సేకరించిన వివరాల ప్రకారం నరసరావుపేట చంద్రబాబు నాయుడు కాలనీకి చెందిన కృష్ణవేణి (35), మేడికొండూరుకు చెందిన హసన్వలి (40) పేరేచర్లలో ఓ ఇంట్లో సహజీవనం చేస్తున్నారు. కృష్ణవేణి భర్తతో గొడవపడి కొంతకాలంగా పేరేచర్లలోనే ఉంటుంది. చదవండి: కూల్డ్రింక్లో మత్తు మందు కలిపి.. స్నేహితుడి భార్యను లొంగదీసుకుని.. దీంతో వీరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్తా సహజీవనానికి దారి తీసింది. శుక్రవారం మధ్యాహ్నం వీరిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఇద్దరూ ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు జీజీహెచ్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మేడికొండూరు పోలీసులు తెలిపారు. -
సహజీవనాలతో పెరుగుతున్న లైంగిక నేరాలు
ఇండోర్: సమాజంలో సహజీవనాల(లివ్ఇన్)తో లైంగిక నేరాలు, స్వైరత్వం పెరిగిపోతున్నాయని మధ్యప్రదేశ్ హైకోర్టు అభిప్రాయపడింది. ఒక యువతిపై అత్యాచారం చేసాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న 25ఏళ్ల యువకుడి ముందస్తు బెయిల్ పిటిషన్ను విచారిస్తూ జస్టిస్ సుబోధ్ అభయంకర్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. లివ్ ఇన్ల కారణంగా ఇటీవల కాలంలో పెరుగుతున్న ఇలాంటి నేరాలను దృష్టిలో ఉంచుకొని ఈ అభిప్రాయం వ్యక్తం చేయాల్సివస్తోందని తెలిపింది. అధికరణం 21 కల్పించిన హక్కులనుంచి ఉద్భవించిన సహజీవన సంస్కృతి భారతీయ సమాజ నైతికనియమాలను కబళిస్తోందని, కామవికారాలను ప్రోత్సహిస్తోందని, అంతిమంగా లైంగిక దాడుల పెరుగుదలకు కారణమవుతోందని విమర్శించింది. అధికరణం 21 జీవించే హక్కును, వ్యక్తిగత స్వేచ్ఛను కల్పిస్తుంది. దీని పరిధిని న్యాయస్థానాలు కాలక్రమంలో పలు అంశాలకు విస్తరిస్తూ వచ్చాయి. రాజ్యాంగం కల్పించిన హక్కులను దుర్వినియోగం చేయాలనుకునేవాళ్లకు ఈ హక్కుకున్న పరిధి గురించిన ఆలోచన ఉండదని, సహజీవనంలోని భాగస్వాములకు ఈ హక్కు వర్తించదని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. ప్రస్తుత కేసులో ఫిర్యాది, ఫిర్యాదిదారు సహజీవనం చేసేవారు. సదరు యువతి అంతకుముందు రెండు సార్లు యువకుడి బలవంతంతో గర్భస్రావం చేయించుకుంది. అనంతరం ఆ యువతి సహజీవనానికి స్వస్తి పలికి వేరేవారిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. కానీ ఆ యువకుడు దీన్ని సహించలేక ఆమెను బ్లాక్మెయిల్ చేయనారంభించాడు. తామిద్దరం కలిసిఉన్న వీడియోలను కాబోయే పెళ్లి కొడుకుకు పంపాడు. తనను కాదని వేరే పెళ్లి చేసుకుంటే చస్తానని బెదిరించాడు. దీంతో ఆ యువతి పెళ్లి రద్దయింది. దీనికి ఆగ్రహించిన యువతి ఆ వ్యక్తిపై కేసు పెట్టింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం యువకుడు చేసుకున్న అభ్యర్థనను హైకోర్టు కొట్టివేసింది. -
అతడు ఆమె ఫోన్
స్త్రీ పురుష సంబంధాలు ఎంత ఆకర్షణీయమైనవో అంత లోతైనవి. సామాజిక సూత్రాలకు, నైతిక విలువలకు ఎడంగా జరిగి స్త్రీ పురుషుల మధ్య బంధం ఏర్పడితే అది ఏ ఒడ్డుకు చేరుస్తుందో చెప్పలేము. ఆగి, ఆలోచించుకునే వాస్తవిక స్పృహ ఇవ్వకుండా స్త్రీ పురుషుల అనంగీకార అనుబంధాలకు ఎడతెగని వాహికగా ఉంటున్న స్మార్ట్ ఫోన్ మన జీవితాలను ఎటు తీసుకెళుతోంది అని కూడా ఆలోచింపచేస్తున్న సినిమా ‘గెహరాయియా’. అమేజాన్లో తాజా విడుదల. స్త్రీ, పురుషులు ఒకరికొకరు కట్టుబడి ఉండటం ఈ సమాజం కొన్ని వందల ఏళ్లుగా ఏర్పరుచుకున్న విలువ. ఆ విలువకు బయట జరిగి ‘అనంగీకార’ అనుబంధాలకు వెళ్లిన జంటలు ఎక్కువగా కష్టాలనే ఎదుర్కొన్నారు, సమాజపు దృష్టిలో దోషులుగానే నిలుచున్నారు. భారతీయ సమాజంలో అయితే ప్రేమలోగాని, వివాహంలోగాని జీవిత భాగస్వామిని వంచన చేసి మరొకరితో బంధంలో ఉండటం పూర్తి అనైతికంగా పరిగణించబడుతుంది. కాని ఎల్లకాలం ఎల్లవేళలా ఇరుపక్షాల మనసు అన్ని రకాల కట్టుబాట్లకు లొంగదు. అది ఒక్కోసారి ‘ఇదే నాకు కావలసింది’ అనుకుంటుంది. ‘ఉన్నది సరి కాదు... ఇది సరిౖయెనది’ అనుకుంటుంది. ‘ఉన్నది ఉండగా... ఇది కూడా ఉంటే ఏమవుతుంది?’ అనుకోనూవచ్చు. ‘ఇది ఒక చిన్న సరదా... ఎవరికి తెలుస్తుందిలే’ అని భావించవచ్చు. స్త్రీ, పురుషుల అంచనాలు కేవలం అంచనాలు మాత్రమే. ఒకసారి రంగంలోకి దిగాక పరిణామాలు అంచనాలకు తగినట్టుగా ఉండవు. సంక్షోభాలు తెచ్చిపెడతాయి. అశాంతి, ప్రమాదం, హింస, పగ, పరారీ... ఏమైనా జరగొచ్చు. ఒకప్పుడు ఈ పరిణామాలు వేగంగా జరిగే అవకాశం తక్కువ కమ్యూనికేషన్ పరిమితుల వల్ల. ఇవాళ స్మార్ట్ఫోన్ వచ్చింది. అది అనుక్షణ ప్రసారానికి సంభాషణకి వీలు కల్పిస్తోంది. దీని వల్ల ఎలాంటి మంచి జరుగుతున్నదో కాని పత్రికలలో చెడు పరిణామాల వార్తలే చూస్తూ ఉంటాం. ఈ సినిమా కథ ఏమిటి? రెండు జంటలు. దీపికా పడుకోన్– ధైర్య కరవా... సిద్ధాంత్ చతుర్వేది– అనన్యా పాండే. రెండు జంటలూ లివ్ ఇన్ రిలేషన్లో ఉంటాయి. రెండు జంటలూ పెళ్లి ఆలోచనల్లో కూడా ఉంటాయి. దీపికా యోగా ఇన్స్ట్రక్టర్. ఆమె బాయ్ఫ్రెండ్ ధైర్య కరవా రచయితగా స్ట్రగుల్ అవుతుంటాడు. అనన్యా పాండే శ్రీమంతురాలు. ఆమె బోయ్ఫ్రెండ్ సిద్ధాంత్ చతుర్వేది కార్పొరేట్ దిగ్గజం. దీపికా, అనన్యా కజిన్స్ అవుతారు కనుక ఈ నలుగురూ చాలా రోజుల తర్వాత కలుస్తారు. అది కూడా అత్యంత విలాసవంతమైన చిన్న పడవ మీద... సముద్రంలో ప్రయాణిస్తూ. కాని దీపికా పట్ల సిద్ధాంత్ ఆకర్షితుడవుతాడు. ఇద్దరూ తమ లివ్ ఇన్ పార్ట్నర్లను చీట్ చేస్తూ రిలేషన్లోకి వెళతారు. తాను చేస్తున్న వెంచర్ పూర్తయితే దానికి అందాకా ఆర్థికంగా మద్దతుగా ఉంటున్న అనన్యతో తెగదెంపులు చేసుకుని నిన్ను పెళ్లి చేసుకుంటాను అని దీపికతో చెబుతాడు సిద్ధాంత్. వారిద్దరూ అలాంటి అంచనాతో తమ రహస్య బంధాన్ని కొనసాగిస్తారు. కాని అంచనా తప్పుతుంది. సిద్ధాంత్ వెంచర్ నిధుల గోల్మాల్లో మునుగుతుంది. మరోవైపు దీపిక గర్భవతి అవుతుంది. ఇంకో వైపు అనన్యకు తన బోయ్ఫ్రెండ్ ఎవరితోనైనా అఫైర్లో ఉన్నాడా అని అనుమానం వస్తుంది. ప్రేమ, రిలేషన్ ఉండాల్సిన చోట ఊపిరాడనితనం, అసహనం, దీని నుంచి ఎలాగైనా బయటపడాలన్న క్రైమ్ ఆలోచనలు... అన్నీ ఈ ‘రహస్యం’గా ఉంచాల్సిన ‘బంధం’ వల్ల ఏర్పడతాయి. స్త్రీ పురుషులు తమ పాత బంధాల నుంచి ఓపెన్గా, చట్టబద్ధంగా విడిపోయి కొత్త బంధాల్లోకి వెళ్లొచ్చు. కాని ఉన్న బంధాల్లో ఉంటూ రహస్య బంధం కొనసాగించాల్సి వచ్చినప్పుడు, లేదా ఉన్న బంధాన్ని సరిగ్గా ముగించకుండా కొత్త బంధాల్లో మునిగినప్పుడు పరిణామాలు భయానకం అవుతాయి. ఈ సినిమా కూడా అలాగే ముగుస్తుంది. పైపై ఆకర్షణల లోతు ఎంత అగాధంగా ఉంటుందో ‘గెహరాయియా’ (అగాధాలు) చెబుతుంది. ఫోన్ ఒక పాత్రధారి ఫోన్ ఒక కమ్యూనికేషన్ మాధ్యమం. అదే సమయంలో ఇవాళ స్త్రీ,పురుష బంధాలకు ఒక ప్రధాన వాహిక. ఒకప్పుడు అబ్బాయి. అమ్మాయిల ప్రేమ దగ్గరి నుంచి వివాహేతర రహస్య బంధాల వరకూ కమ్యూనికేషన్ ఒక దుస్సాధ్యంగా ఉండేది. కాని స్మార్ట్ఫోన్ వల్ల ఆ సమస్య అవసరమైన దాని కంటే ఎక్కువే అయిందని ఈ సినిమా చూస్తే అనిపిస్తుంది. ఇందులో సినిమా అంతా పాత్రలు మాట్లాడినంత ఫోన్ మాట్లాడుతుంది. దీపిక, సిద్ధాంత్ల మధ్య రహస్య బంధం పూర్తిగా వాట్సప్ చాట్ వల్ల బలపడుతుంది... ముందుకు పోతుంది... చివరకు విషాద పరిణామమూ తీసుకుంటుంది. బంధం ఏర్పడేంత వరకూ ‘కిక్’ ఇచ్చే వాట్సప్ సంభాషణలు బంధం ఏర్పడ్డాక ‘అనుక్షణం వెంటాడే’ సంభాషణలుగా మారతాయి. స్త్రీగాని, పురుషుడు గాని ఇంట్లో ఉన్నా, ఆఫీస్లో ఉన్న ఈ ఎడతెగని చాటింగ్ ‘మతి’ని గతి తప్పేలా చేస్తున్నదేమోనని ఈ సినిమా చూస్తే అనిపిస్తుంది. డిస్ట్రబ్ చేసే మూవీ వివాహేతర బంధాలు ఎంత డిస్ట్రబ్ చేస్తాయో అంత డిస్ట్రబ్ చేసే మూడ్లో ఈ సినిమా కథనం ఉంటుంది. దర్శకుడు షకున్ బాత్ర ఆ జాగ్రత్త తీసుకున్నాడు. కాని ఒక విలువను ఆపాదించడం లేదా ఆరోగ్యకరమైన అర్థవంతమైన ముగింపును ఇవ్వకపోవడంతో ప్రేక్షకుడికి ఒక డిస్ట్రబెన్స్ భావన మాత్రమే కలుగుతుంది. ఉన్న బంధాలు అన్నీ ఏవో కొద్ది ఇష్టాయిష్టాలతోనే ఉంటాయి. సమస్యలు లేని బంధాలు ఉండవు. అవి మరీ ఘోరంగా ఉంటే కొత్తబంధాల్లోకి వెళ్లడం పట్ల సమాజానికి అభ్యంతరం ఉండదు. కాని దూరపు కొండలు నునుపు అనే భావనతో బాధ్యతలు అధిగమించే ఆకర్షణల్లో పడటం పట్ల మాత్రం ఈ సినిమా కచ్చితంగా ఒక హెచ్చరికే. దీపిక మంచి నటనకు ఈ సినిమా చూడొచ్చు. లేదంటే చదివిన ఈ రివ్యూ సరిపోతుంది. -
రెండేళ్లుగా మహిళతో సహజీవనం...ఇంట్లో ఒంటరిగా ఉన్న కూతురిని బలవంతంగా...
చండీగఢ్: ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాలు నేరాలకు దారి తీస్తున్నాయి. అందులోని కొన్ని ఘటనలైతే కూతురు వరసయ్యే వాళ్ల మీద కూడా లైంగైక దాడులు పాల్పడుతున్నారు కొందరు కామందులు. తాజాగా ఇటువంటి ఘటనే చండీగఢ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఓ మహిళ తన భర్తని ఆరేళ్ల క్రితం విడిచిపెట్టి ఒంటరిగా తన కూతురితో జీవనం గడుపుతోంది. రెండేళ్ల క్రితం ఆమెకు డ్రైవర్గా పనిచేస్తున్న ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. కొన్ని రోజులకు అది కాస్త వారి మధ్య సాన్నిహిత్యాన్ని పెంచింది. దీంతో ఆ మహిళ డ్రైవర్ తో కొన్నాళ్లుగా సహజీవనం చేస్తోంది. కొన్ని నెలల క్రితం, అతను డ్రైవర్ ఉద్యోగం కోల్పోవడంతో ఇంటి వద్దే ఉంటున్నాడు. ఈ క్రమంలో ఇంట్లో ఉన్న ఆ మహిళపై కూతురిపై కన్నేసి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక ఈ దారుణాన్ని తన తల్లికి చెప్పింది. దీంతో మహిళ అతన్ని నిలదీయగా ఆమెతో ఘర్షణకు దిగి పారి పోయాడు. మహిళా ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు ముమ్మరం చేశారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. -
కొన్ని రోజులు కలిసుంటే సహజీవనం కాదు!
చండీగఢ్: ఇద్దరు వయోజనులు కొన్ని రోజులు కలిసి జీవించి, తాము సహజీవనం చేస్తున్నామని ప్రకటించుకోవడం నిజమైన సహజీవనం(లివ్ ఇన్ రిలేషన్) కిందకు రాదని పంజాబ్, హర్యానా హైకోర్టు అభిప్రాయపడింది. కలిసి జీవించే కాలం, ఈ కాలంలో ఇరువురు నెరవేర్చిన బాధ్యతలు, ఒకరికొకరు చేసుకున్న సాయం తదితర అనేక అంశాలను బట్టి సహజీవనాన్ని గుర్తించాల్సిఉంటుందని జస్టిస్ మనోజ్ బజాజ్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా స్త్రీ కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని, తమకు రక్షణ కల్పించాలని ఒక జంట పెట్టుకున్న అభ్యర్ధనను కొట్టివేసింది. దీంతో పాటు సదరు జంటకు రూ. 25వేల జరిమానా విధించింది. చదవండి: ఎమ్మెల్యే ‘అత్యాచార’ కామెంట్లు.. తీవ్ర దుమారం -
మూడు నెలలుగా సహజీవనం.. మనస్పర్థల కారణంగా ఆత్మహత్య
సాక్షి, గన్నవరం: యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం జరిగింది. గన్నవం పోలీసుల సమాచారం మేరకు.. విజయవాడ రూరల్ మండలం గూడవల్లికి చెందిన సొంగా శశి, జి.మండలం కవులూరుకు చెందిన కంచర్ల అహల్య (22) రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వారిద్దరూ బంధువులే. అహల్య కుటుంబ సభ్యులు వారి ప్రేమను అంగీకరించలేదు. కొండపల్లిలో ఉంటూ బ్యూటీషియన్గా పనిచేస్తున్న అహల్య మూడు నెలలు క్రితం గూడవల్లి వచ్చి శశితో సహజీవనం చేస్తోంది. చదవండి: ప్రాణాలు తీసిన ‘పార్టీ’ ఈ నేపథ్యంలో వారి మధ్య విభేదాలు తలె త్తాయి. దీంతో అహల్య ఆదివారం ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కొద్ది సేపటికి శశి కుటుంబ సభ్యులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనాస్థలాన్ని సందర్శించి మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్ఐ రమేష్బాబు తెలిపారు. -
సహజీవనం కేసు: రాజస్థాన్ హైకోర్టు సంచలన తీర్పు!
పెళ్లైన మహిళ, మరో వ్యక్తితో కలిసి సహజీవనం చేయడం అక్రమమే అవుతుందని రాజస్థాన్ హైకోర్టు తాజాగా తేల్చి చెప్పింది. జస్టిస్ సతీష్ కుమార్ శర్మతో కూడిన ఏకధర్మాసనం తీర్పును వెలువరించింది. అలాగే పోలీసుల భద్రత కోరుతూ ఈ జంట దాఖలు చేసిన పిటిషన్ను తిరస్కరించింది. వారికి రక్షణ పొందే అర్హత లేదని న్యాయమూర్తి పేర్కొన్నారు. మహిళకు ఇంతకముందే పెళ్లై, ఇప్పటి వరకు విడాకులు తీసుకోని నేపథ్యంలో మరో వ్యక్తితో సహజీవనం చేయడం వివాహేతర సంబంధం కిందకు వస్తుందని పేర్కొన్నారు. అలాగే పోలీసుల రక్షణ కోరుతూ వేసిన పిటిషన్ను తిరస్కరించారు. డేటింగ్ చేస్తున్న వారికి పోలీసుల భద్రత కల్పించడం అంటే ఇలాంటి సంబంధాలకు పరోక్షంగా అనుమతి ఇవ్వడమే అవుతుందని వ్యాఖ్యానించారు. అయితే ఈ జంటపై ఎవరైనా దాడికి పాల్పడితే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని పిటిషనర్లను ఆదేశించారు. ఈ కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే.. రాజస్థాన్లోని జున్జును జిల్లాకు చెందిన 30 ఏళ్ల మహిళ, 27 ఏళ్ల యువకుడు సహజీనం చేస్తున్నారు. అయితే మహిళకు ఇంతకుముందే చట్టబద్ధంగా మరో వ్యక్తితో వివాహం అయ్యింది. భర్త శారీరక వేధింపులకు పాల్పడుతున్న కారణంగా ఆమె తన నుంచి విడిగా ఉంటూ ఈ యువకుడితో జీవిస్తోంది. ఈ క్రమంలో భర్త, అత్తమామలు మహిళపై నిరంతరం బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీంతో తమ జీవితాలకు ప్రమాదం ఉందని రక్షణ కల్పించాలని బాధిత జంట కోర్టును ఆశ్రయించింది. విచారణ సమయంలో.. మహిళ భర్త, అతని కుటుంబ సభ్యులు సైతం ఈ జంట మధ్య సంబంధాన్ని చట్ట విరుద్ధమని ఆరోపించారు. కాగా గత జూన్లో జస్టిస్ నవీన్ సిన్హా,జస్టిస్ అజయ్ రస్తోగిలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సహజీవనం చేస్తున్న జంటకు రక్షణ కల్పించాలని పంజాబ్ పోలీసులను ఆదేశించింది. అంతకముందు వీరి పిటిషన్ను పంజాబ్-హర్యానా హైకోర్టు తిరస్కరించింది. -
20ఏళ్ల అవమానాలు: బారాత్, డీజే, విందుతో వృద్ధ జంట పెళ్లి
సాక్షి, లక్నో: ఉత్తరప్రదేశ్లో హింస, మహిళలపై దారుణాలకు సంబంధించిన కథనాలనే ఎక్కువగా వింటూ ఉంటాం కదా. అయితే యూపీలోని ఉన్నావ్ జిల్లాలో ఒక వృద్ధ జంటకు వైభవంగా వివాహం జరిపించిన ఘటన ఒకటి ఆసక్తికరంగా మారింది. అంతేకాదు దాదాపు 20 సంవత్సరాలు సహజీవనం తరువాత ఈ పెళ్లి జరగడం మరో విశేషం. మరో విశేషం ఏమిటంటే, పెళ్లి ఖర్చులన్నీ గ్రామ సర్పంచ్, ఇతర గ్రామస్తులు భరించడం. దీంతో ముచ్చటైన పెళ్లి సందడితో అధికారికంగా ఒక్కటైన ఈ జంటకు అతిధులందరూ అభినందనలు తెలిపారు ఈ స్టోరీలోని వృద్ధ దంపతులు, సారీ నూతన వధూవరుల పేర్లు నరేన్ రైదాస్(60), రామ్రతి (55). వ్యవసాయ కుటుంబానికి చెందిన వీరిద్దరూ 2001నుండి కలిసి జీవిస్తున్నారు. అయితే వివాహం చేసుకోకుండా కలిసి కాపురం చేయడంపై గ్రామస్తులనుంచి చాలా అవమానాలను ఎదుర్కొన్నారు. అయినా తమ జీవనాన్ని కొనసాగించారు. వీరికి అజయ్ అనే 13 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. చివరికి కుమారుడితోపాటు, గ్రామపెద్దల ప్రోత్సాహంతో అధికారికంగా ఆ పెళ్ళి వేడుక కాస్తా ముగించేందుకు అంగీకరించారు. తద్వారా గత రెండు దశాబ్దాలుగా తాము పడుతున్న వేదనకు, కొడుకు ఎదుర్కొంటున్న అవమానాలను చెక్ పెట్టాలని ఇద్దరూ భావించారు. గ్రామ పెద్ద రమేశ్కుమార్, సామాజిక కార్యకర్త ధర్మేంద్ర బాజ్ పేయీ కలిసి గంజ్ మొరాదాబాద్, రసూల్పూర్ రూరి గ్రామంలో నరైన్, రామ్రతిని వివాహాన్ని ఘనంగా నిర్వహించారు. వివాహానికి ముందు వీరు గ్రామంలోని బ్రహ్మదేవ్ బాబా ఆలయాన్ని సందర్భించి ఆశీస్సులు తీసుకున్నారు. అంతేనా బ్యాండ్ బాజాలతో బారాత్, డీజేతో సందడి చేశారు. అనంతరం చక్కటి విందును కూడా ఏర్పాటు చేశారు. ముదిమి వయసులో,అదీ షష్టిపూర్తి చేసుకోవాల్సిన తరుణంలో కొడుకు సమక్షంలో ఒక్కటైన ఈ జంటకు పలువురు శుభాకాంక్షలు అందజేశారు. -
పెళ్లి చేసుకుంటానని అత్యాచారం.. గర్భిణి ఫిర్యాదు
లక్నో: తనతో సహజీవనం చేస్తున్న వ్యక్తే అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని బాలియా జిల్లాలో జరిగింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. విజయ్నగర్కు చెందిన అమిత్ మౌర్యతో 2019లో ఆమెకు పరిచయం ఏర్పడగా, కొంత కాలానికి ప్రేమగా మారింది. ఇక అప్పటి నుంచి వారు లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నటట్లు తెలిపింది. పెండ్లి చేసుకుంటానని నమ్మించిన మౌర్య కొన్నాళ్లుగా తనపై అత్యాచారం చేసినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఇటీవల బాధితురాలు గర్భం దాల్చడంతో అతను ముఖం చాటేస్తూ తప్పించుకుంటున్నాడని, పెళ్లి విషయమై గట్టిగా అడిగేసరికి చేసుకోనని తెగేసి చెప్పినట్లు ఆరోపించింది. అంతేగాక ఓ యువతి పేరిట ఫేస్బుక్లో నకిలీ ఖాతా సృష్టించిన మౌర్య తన అభ్యంతకరమైన చిత్రాలను కూడా అందులో పోస్ట్ చేస్తున్నట్లు వెల్లడించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువతిని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. చదవండి: కన్నతల్లి కర్కశత్వం: బతికుండగానే బావిలోకి తోసేసింది -
సోషల్ మీడియా పోస్ట్ రచ్చ.. లవర్ని సజీవదహనం
తిరువనంతపురం: కేరళలో దారుణం చోటు చేసుకుంది. సోషల్ మీడియా పోస్ట్ వల్ల చెలరేగిన వివాదం చివరకు మహిళ ప్రాణాన్ని బలి తీసుకుంది. తిరువనంతపురం మెడికల్ కాలేజీ వద్ద మహిళను సజీవ దహనం చేశాడు ఆమె భాగస్వామి. ఆ వివరాలు.. షానవాజ్(30), అతిరా గత కొద్ది కాలంగా సహజీవనం చేస్తున్నారు. కొల్లాం అంచల్లో నివసిస్తున్నారు. వీరికి మూడు నెలల పాప ఉంది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం అతిరా సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేసింది. దీనిపై ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. మాట మాట పెరిగింది. ఆగ్రహించిన షాన్వాజ్ అతిరా మీద కిరోసిన్ పోసి, లైటర్తో నిప్పంటించాడు. ఆమె ఆరుపులు విన్న ఇరుగుపొరుగు వారు అంబులెన్స్కు కాల్ చేశారు. ఇక ఈ ఘటనలో షాన్వాజ్కు కూడా తీవ్రంగా గాయలయ్యాయి. ఇద్దరిని ఆస్పత్రిలో చేర్చారు. ఇక తీవ్రంగా గాయపడిన అతిరా మృతి చెందగా.. షాన్వాజ్ చికిత్స పొందుతున్నాడు. ఇక అతిరా తల్లి ఫిర్యాదు మేరకు కొల్లాం పోలీసులు షాన్వాజ్ మీద కేసు నమోదు చేశారు. చదవండి: సహజీవనం.. గదిలో బంధించి అత్యాచారం -
సహజీవనం.. గదిలో బంధించి అత్యాచారం
తిరువనంతపురం: కేరళలో దారుణం చోటు చేసుకుంది. లివ్ ఇన్ రిలేషన్లో ఉంటున్న యువతిని ఆమె సహచరుడు గదిలో బంధించి.. ఆపై అత్యాచారం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ వివరాలు.. బాధిత యువతి, నిందితుడు గత కొన్నేళ్లుగా ఎర్నాకులం సిటీలోని మెరైన్ డ్రైవ్ ప్రాంతంలో ఓ ప్లాట్లో సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలో నిందితుడు గత కొద్ది కాలంగా యువతిని చిత్రహింసలకు గురి చేయసాగాడు. బాధితురాలిని అవమానిస్తూ.. ఆమెపై అత్యాచారం చేస్తూ హింసించేవాడు. ఈ టార్చర్ గురించి ఎవరికైనా చెబితే బాధితురాలి పర్సనల్ ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానని బెదిరించసాగాడు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం నిందితుడి ఆగడాలు మరింత మితిమీరాయి. ఏకంగా బాధితురాలిని గదిలో పెట్టి తాళం వేసి.. ఆమెపై దాడి చేయడమే కాక.. అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో బాధితురాలు ఎర్నాకులం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఎలాగోలా అతడి చెర నుంచి తప్పించుకుని.. వేరే ప్రదేశంలో షెల్టర్ పొందుతున్నాని పోలీసులకు తెలిపింది. ఇక నిందితుడు తన దగ్గర నుంచి ఇప్పటికే 5 లక్షల రూపాయల వరకు తీసుకున్నాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నది. బాధితురాలి శరీరమంతా గాయాలున్నాయన్నారు పోలీసులు. ఆమె ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్ట్ చేసేందుకు వెళ్లగా.. అతడు అప్పటికే పారిపోయాడు.. ముందస్తు బెయిల్ కోరుతూ కేరళ హైకోర్టును ఆశ్రయించాడని పోలీసులు తెలిపారు. చదవండి: Heart Touching Video : వెళ్లిరా.. మావటి ! -
మూడు బెంచ్లు... మూడు తీర్పులు
కేవలం కొన్ని రోజుల వ్యవధి... మూడు కేసులు, మూడు బెంచ్లు–అదే హైకోర్టు. కానీ యువతీయువ కుల సహజీవన సంబంధాల విషయంలో వేర్వేరు తీర్పులు. సమాజంలో ఇలాంటి సంబంధాల విషయంలో ఎలాంటి వైఖరులు వ్యక్తమవుతున్నాయో, అవి ఎంత పరస్పర విరుద్ధంగా వుంటున్నాయో చెప్పడానికి ఈ మూడు తీర్పులూ ఉదాహరణ. న్యాయస్థానాలను సమాజానికి అతీతంగా లేదా వెలు పల వుంచి ఆలోచించటం సాధ్యం కాదు. న్యాయమూర్తులు చట్టాన్ని, న్యాయాన్ని అర్థం చేసుకున్న తీరునుబట్టి, వారి వారి సామాజిక అనుభవాలనుబట్టి తమ ముందుకొచ్చిన కేసుల్ని అన్వయించి తీర్పు చెబుతారు. అయితే ఆ తీర్పులు పురోగామి దృక్పథంతో వుంటే సమాజంలోవుండే దురభిప్రా యాలు సడలుతూ, అది క్రమేపీ మెరుగుపడే అవకాశం వుంటుంది. న్యాయమూర్తులు సైతం కులాధి క్యత, పురుషాధిక్యత, వివక్ష వంటి అంశాల చట్రాన్ని దాటకపోతే ఆ మేరకు సమాజం నష్టపోతుంది. మూడు కేసుల్లోని సారాంశమూ ఒకటే. పెళ్లీడు వచ్చిన ఆడ–మగ జంటలు తల్లిదండ్రుల అభీష్టానికి భిన్నంగా వెలుపలికొచ్చి సహజీవనం సాగిస్తున్నారు. పెద్దవాళ్లనుంచి ఆ జంటలకు ప్రమాదం ముంచు కొచ్చింది. ముందుగా పోలీసులను ఆశ్రయించి, అక్కడ సరైన స్పందన లేదన్న ఆందోళనతో పంజాబ్, హరియాణా కోర్టును ఆశ్రయించారు. మొదటి కేసులో ఈనెల 11న తీర్పు వెలువడింది. తమకు పెద్దవాళ్లనుంచి ప్రాణహాని వున్నదని, రక్షణ కల్పించాలని కోరిన పిటిషన్ జస్టిస్ హెచ్ఎస్ మదాన్ నేతృత్వంలోని ధర్మాసనంముందుకు రాగా, ‘ఇలాంటి సంబంధాలు సామాజికంగానూ, నైతికంగానూ అంగీకరించదగ్గవి కాదు. అందువల్ల పిటిషనర్లు కోరుతున్నట్టు రక్షణ కోసం ఆదేశాలివ్వలేం’ అంటూ తోసిపుచ్చింది. ఆ మర్నాడు ఈ మాదిరి కేసులోనే జస్టిస్ అనిల్ క్షేత్రపాల్ నాయకత్వంలోని ధర్మాసనం ఇలాంటి కారణాన్నే చెప్పి భద్రత కల్పించాలన్న మరో జంట వినతిని తోసిపుచ్చింది. ‘ఇలాంటివారికి రక్షణ కల్పిస్తే మొత్తం సమాజ నిర్మాణమే చెదిరిపోతుంది’ అంటూ కొంత కటువుగానే న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. కానీ మూడో కేసులో జస్టిస్ సుధీర్ మిత్తల్ నాయకత్వంలోని ధర్మాసనం గురువారం పూర్తి భిన్నమైన తీర్పునిచ్చింది. పెళ్లీడు వచ్చినవారు తమకు నచ్చిన భాగస్వామిని ఎంచుకుని పరస్పర అంగీకారంతో కలిసివుండొచ్చని...అది పెళ్లి ద్వారానా లేక మరోవిధంగానా అనేది పూర్తిగా వారి ఇష్ట మని, పౌరులుగా అది వారికుండే ప్రాథమిక హక్కని తేల్చిచెప్పింది. అంతేకాదు... వివాహంతో ప్రమేయం లేని సహజీవన సంబంధాలు వర్తమానకాలంలో నగరాల్లోనేకాక గ్రామాల్లో కూడా పెరుగు తున్నాయని న్యాయమూర్తి చెప్పారు. ఏ సంబంధాన్నీ చట్టం నిషేధించనప్పుడు అలాంటి సంబం ధాల్లో వుండేవారికి రక్షణ కల్పించాల్సిందేనని తేల్చిచెప్పారు. మన దేశంలో పెద్దలకు నచ్చని పెళ్లి చేసుకుని న్యాయస్థానాలను ఆశ్రయించడం కొత్తేమీ కాదు. వ్యక్తులుగా ఇలాంటి సంబంధాల విషయంలో న్యాయమూర్తులకు ఎలాంటి అభిప్రాయాలున్నా అవి తీర్పుల్లో ప్రతిబింబించకుండా వుండటమే మేలు. ఎందుకంటే మన రాజ్యాంగం చాలా అంశాల్లో సమాజం ఆచరించే విలువలకు భిన్నమైన దృక్పథాన్ని తీసుకుంది. కుల, మత, జాతి, లింగ, ప్రాంతీయ వివక్ష లేని సమాజం ఏర్పడాలని రాజ్యాంగం ఆకాంక్షించింది. అందుకనుగుణమైన అధికర ణలు అందులో పొందుపరిచారు. పైగా మూడేళ్లక్రితం ఒక కేసులో సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన తీర్పును వెలువరించింది. అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్ ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్లతో కూడిన ఆ ధర్మాసనం వ్యక్తి స్వేచ్ఛ, ప్రతిష్టల్లో ఎంపిక చేసుకోవటమన్నది విడదీయలేని భాగమని స్పష్టం చేసింది. సర్వోన్నత న్యాయస్థానం అనుసరించిన ఆ వైఖరి దేశంలోని మారుమూలవుండే కిందిస్థాయి కోర్టు వరకూ... పోలీసులు, పాలనా యంత్రాంగం తోసహా అన్ని వ్యవస్థలకూ శిరోధార్యమైనది. హరియాణా, పంజాబ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్ తదితర ప్రాంతాల్లో ప్రేమించుకోవడం, స్వతంత్రంగా పెళ్లిచేసుకోవడానికి సిద్ధపడటం యువతీయువకుల ప్రాణాలకు ముప్పుగా పరిణమిస్తున్నదని శక్తివాహిని అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన కేసులో సర్వోన్నత న్యాయస్థానం ఈ తీర్పునిచ్చింది. అయినా పంజాబ్, హరియాణా హైకోర్టులో రెండు ధర్మాసనాలు అందుకు విరుద్ధమైన తీర్పులివ్వడం విచారించదగ్గ విషయం. ఈ మూడు జంటలూ తాము కలిసి బతకాలనుకుంటున్నామని, కానీ పెద్దవాళ్లు అందుకు నిరా కరించి ప్రాణహాని తలపెడతామని హెచ్చరిస్తున్నారని హైకోర్టును ఆశ్రయించాయి. రక్షణ కల్పిం చాలని కోరాయి. న్యాయమూర్తులు ఆ పరిమిత అంశానికి లోబడి అలాంటి పౌరుల భద్రతకు అవసరమైన ఆదేశాలివ్వాలి. కానీ అందుకు భిన్నంగా నైతికత గురించి, తల్లిదండ్రుల అభీష్టానికి భిన్నంగా జీవిత భాగస్వామిని ఎంచుకోవడం వల్ల సమాజానికి ఏర్పడే ఉపద్రవం గురించి ఉపన్య సించి, రక్షణ కల్పించలేమని తిరస్కరించడం ప్రమాదకరమైన ధోరణి. వాస్తవానికి పంజాబ్, హరి యాణా, మరికొన్ని ఇతర ఉత్తరాది రాష్ట్రాల్లో మాత్రమే కాదు... ఉభయ తెలుగు రాష్ట్రాలతోసహా చాలాచోట్ల ఈమాదిరి జంటలు నిత్యం ప్రాణభయంతో బతుకుతున్నాయి. ఇలాంటి ఉదంతాల్లో తల్లిదండ్రుల వల్లమాలిన ప్రేమ, కుల మత వివక్ష, ఆర్థిక కారణాలు వగైరాలు ప్రధాన పాత్ర పోషిస్తుంటాయి. అనేక ఉదంతాల్లో పోలీసులు సైతం ఈ ప్రభావాలకు లోనై ఆ జంటలకు రక్షణ కల్పించడానికి నిరాకరిస్తుంటారు. ఇక న్యాయస్థానాలు సైతం అదే దృక్పథాన్ని ప్రదర్శిస్తే సమాజం ఎప్పటికీ వెనకబాటుతనాన్నే ప్రదర్శిస్తుంది. అది అవాంఛనీయం. -
సహజీవనంపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
చండీగఢ్: లివ్ ఇన్ రిలేన్షిప్(సహజీవనం)పై పంజాబ్, హరియాణా హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ బంధం సామాజికంగా, నైతికంగా ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. ఇంటి నుంచి పారిపోయిన ఓ జంట తమకు రక్షణ కల్పించాల్సిందిగా కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. పిటిషినర్లు గుల్జా కుమారి(19), గురువిందర్ సింగ్(22) తార్న్ తరన్ జిల్లాకు చెందిన వారు. ఈ క్రమంలో వారు తాము కలిసి నివసిస్తున్నామని.. త్వరలోనే వివాహం చేసుకోబోతున్నామని తెలిపారు. గుల్జా కుమారి తల్లిదండ్రుల వల్ల తమకు ప్రాణహాని ఉందని.. రక్షణ కల్సించాల్సిందిగా కోరుతూ.. కోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా కోర్టు.. ‘‘వాస్తవానికి పిటిషినర్లు దాఖలు చేసిన పిటిషన్ ద్వారా తమ లివ్ ఇన్ రిలేషన్కు ఆమోద ముద్ర కోరుతున్నారు. కానీ సహజీవనం నైతికంగా, సామాజికంగా ఆమోదయోగ్యం కాదు’’ అని జస్టిస్ హెచ్ఎస్ మదాన్ తన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. చదవండి: ‘‘టీకాలు లేనప్పుడు విసిగించే ఆ కాలర్ ట్యూన్ ఎందుకు?’’ -
వాళ్లు పదేళ్లు సహజీవనం చేశారు: ప్రముఖ సింగర్
ప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణ్ కుమారుడు, సింగర్ ఆదిత్య నారాయణ్ ఇటీవలే ఓ ఇంటివాడయ్యాడు. నటి శ్వేతా అగర్వాల్ను పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగు పెట్టాడు. డిసెంబర్ 1న ముంబైలోని ఇస్కాన్ టెంపుల్ వీరి ఏడడుగుల బంధానికి వేదికగా మారింది. ఒక్కగానొక్క కొడుకు పెళ్లిని అంగరంగ వైభవంగా చేయాలని ఉదిత్ ఎన్నో కలలు గన్నా కోవిడ్ ఆయన ఆశల మీద నీళ్లు చల్లింది. ఫలితంగా పెద్ద పెద్ద ఆడంబరాలకు పోకుండా తక్కువ మంది మధ్యే సంబరాలు జరుపుకోవాల్సి వచ్చింది. తాజాగా ఆయన తన కొడుకు ప్రేమ, పెళ్లి గురించి స్పందించారు. (చదవండి: దిల్జిత్.. కరణ్ పెంపుడు జంతువు: కంగన) "నాకు ఏకైక సంతానం ఆదిత్య. వాడి పెళ్లిని ఎంతో ఘనంగా చేయాలనుకున్నా. కానీ కరోనా వల్ల గ్రాండ్గా చేసుకునే వేడుకలకు దూరమవాల్సి వచ్చింది. నిజానికైతే ఈ కరోనా ధాటి తగ్గిన తర్వాతే వాడి పెళ్లి చేద్దామనుకున్నా. కానీ నా కొడుకుతో పాటు శ్వేత, ఆమె కుటుంబం కూడా ఇప్పుడే చేసేద్దామన్నారు. ఆదిత్య, శ్వేత పదేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. దీన్ని ఇప్పుడు అధికారికంగా ప్రకటించాల్సిన సమయం వచ్చింది అని అనుకుంటున్నా" అని చెప్పుకొచ్చారు. తన కోడలు శ్వేత గురించి చెప్తూ.. 'ఆమె నా కొడుకుకు స్నేహితురాలిగానే తెలుసు. ఓ రోజు ఆదిత్య నా దగ్గరకు వచ్చి శ్వేతను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ఓ క్షణం షాకైన నేను వాడి మాటను కాదనలేకపోయాను. అయితే తర్వాత ఏం జరిగినా నన్ను నిందించొద్దు అని చెప్పాను' అని చెప్పుకొచ్చారు. (చదవండి: శ్వేత అగర్వాల్ను పెళ్లాడిన ఆదిత్య) -
మద్యపానం, సహజీవనం చట్టబద్ధమే!
దుబాయ్ : కఠిన చట్టాలకు పెట్టింది పేరైన ఇస్లామిక్ దేశాలతో కూడిన యూఏఈ కీలక నిర్ణయం తీసుకుంది. టూరిస్టులను ఆకర్షించేందుకు పలు చట్టాలను సరళతరం చేస్తోంది. మద్యపానం సేవించడం, సహజీవనం చట్టవిరుద్ధం కాదని ప్రకటించింది. అవివాహిత జంటలు ఒకేచోట నివసించేందుకు అనుమతించడంతో పాటు మద్యపానంపై నియంత్రణలను సరళతరం చేసస్తూ ఇస్లామిక్ వివాహ చట్టాల్లో కీలక మార్పులను యూఏఈ ప్రకటించింది. పెట్టుబడుల వాతావరణం, చట్టాల అమలును మెరుగుపరిచే చర్యల్లో భాగంగా ఈ సంస్కరణలను చేపట్టామని యూఏఈ ప్రభుత్వం పేర్కొంది. గతంలో మద్యం సేవించినా, మద్యాన్ని కలిగిఉన్నా యూఏఈలో నేరంగా పరిగణించేవారు. ఇక తాజా నిర్ణయంతో 21 సంవత్సరాలు పైబడిన వారు స్వేచ్ఛగా మద్యాన్ని సేవించవచ్చు. ఇక అవివాహిత జంట కలిసిఉండటం యూఏఈలో ఇప్పటివరకూ నేరం కాగా, ఆ చట్టాన్ని ప్రస్తుతం తొలగించారు. కాగా, యూఏఈ తీసుకున్న నిర్ణయాలను ప్రజలు స్వాగతించారు. నూతన చట్టాలు పురోగమనానికి దారితీస్తాయని, ఈ ఏడాది పలు సవాళ్లు ఎదురైనా కీలక మార్పులకు నాందిపలికిందని అల్జజీరా ఛానెల్ వ్యాఖ్యానించారు. చదవండి : యూఏఈ ప్రధానికి ట్రయల్ కరోనా వ్యాక్సిన్ -
ప్రియురాలిని కడతేర్చి మరో మహిళతో పరార్
డెహ్రాడూన్ : తనతో సహజీవనం చేస్తున్న మహిళను గొంతు నులిమి చంపి మృతదేహాన్ని సూట్కేసులో కుక్కి మరో మహిళతో పారిపోయిన బీహార్ వ్యక్తి ఉదంతం ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో వెలుగుచూసింది. ఈ ఘటన శుక్రవారం చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బయట నుంచి తాళం వేసిన అపార్ట్మెంట్ నుంచి దుర్వాసన రావడంతో స్దానికులు పోలీసులకు సమాచారం అందించగా ఈ ఉదంతం బయటకు వచ్చింది. మధ్యప్రదేశ్కు చెందిన బాధితురాలు (23), నిందితుడు (26) ఇద్దరూ హరిద్వార్లో ఒకే కంపెనీలో పనిచేస్తున్నారని పోలీసులు తెలిపారు నిందితుడు బీహార్లోని వైశాలి జిల్లాకు చెందిన వాడని హరిద్వార్ ఎస్పీ కమలేష్ ఉపాథ్యాయ్ వెల్లడించారు. హతురాలు, నిందితుడికి ఎప్పటినుంచో పరిచయం ఉందని..గ్వాలియర్, ఢిల్లీలో ఒకేచోట కలిసి పనిచేసిన సమయంలో వీరి పరిచయం సహజీవనానికి దారితీసిందని చెప్పారు. గత ఏడాది డిసెంబర్లో వీరు గతంలో పనిచేసిన సంస్ధకు చెందిన సిబ్బందితో కలిసి హరిద్వార్లోని ఓ కంపెనీలో చేరారని, వారంతా కంపెనీ సమీపంలోనే నివసిస్తున్నారని వెల్లడించారు. హతురాలు, నిందితుడు కూడా ఆ ప్రాంతంలో ఓ అపార్ట్మెంట్లో కలిసి ఉంటున్న క్రమంలో నిందితుడు అదే భవనంలో మరో మహిళతో సన్నిహితంగా ఉండేవాడని చెప్పారు. చదవండి : ఇవాంకను ఆకట్టుకున్న జ్యోతి కథ దీంతో హతురాలు, నిందితుడికి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని తెలిసిందని అన్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఇరువురి మధ్య ఘర్షణ చెలరేగడంతో నిందితుడు ఆగ్రహంతో మహిళ గొంతునులిమి మృతదేహాన్ని సూట్కేసులో కుక్కి పారిపోయాడని చెప్పారు. అదే భవనంలో మరో మహిళ ఆచూకీ గల్లంతవడంతో నిందితుడితో కలిసి ఆమె పారిపోయినట్టు తెలిసిందని వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశామని, పారిపోయిన ఇద్దరినీ త్వరలోనే పట్టుకుంటామని ఎస్పీ ఉపాధ్యాయ్ తెలిపారు. -
సహజీవనం: మరొకరితో సన్నిహితంగా ఉందనే నెపంతో..
సాక్షి, మిర్యాలగూడ: కొబ్బరి బొండాలు నరికే కత్తితో ఓ వ్యక్తి యువకుడిపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం మిర్యాలగూడలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాడుగుపల్లి మండలం కల్వలపాలెం గ్రామానికి చెందిన బొల్లెపల్లి వజ్రం గతంలో అబ్దుల్లాపూర్మెట్లో ఒక మిల్క్ సెంటర్లో పని చేసేవాడు. అక్కడ ఓ భర్త లేని మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. కొంత కాలం తర్వాత వారిద్దరూ మిర్యాలగూడకు వచ్చి టాకారోడ్డులో నివాసముంటూ సహజీవనం చేస్తున్నారు. వజ్రం పట్టణంలోని ఎన్నెస్పీ క్యాంపులో పండ్ల వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలో వారు అద్దెకు ఉండే ఇంట్లోనే మరో గదిలో అద్దెకు ఉంటున్న నకిరేకల్కు చెందిన తాండు రాజు ఆ మహిళతో సన్నిహితంగా ఉంటున్నట్లు వజ్రం గమనించాడు. అప్పటి నుంచి ఆమె అనుమానం పెంచుకుని తరుచూ కొట్టసాగాడు. దీంతో కొద్ది రోజుల క్రితం ఆ మహిళ ఇక్కడి నుంచి తన తల్లి గారి ఊరు భూదాన్పోచంపల్లికి వెళ్లిపోయింది. దీంతో తాండు రాజు కారణంగానే తాను సఖ్యతగా మెలుగుతున్న మహిళ తనను విడిచి వెళ్లిపోయిందని ఇటీవల వన్టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ విషయంపై విచారణ చేసిన సీఐ ఆ మహిళను మూడు రోజుల క్రితం పిలిపించి వివరాలు సేకరించారు. ఆ మహిళ తాను ఎవరిని వివాహం చేసుకోలేదని, ఎవరితోనూ తనకు సంబంధం లేదని తేల్చి చెప్పి తిరిగి వెళ్లిపోయింది. దీంతో తాండు రాజుపై కక్ష పెంచుకున్న బొల్లెపల్లి వజ్రం పథకం ప్రకారం రోడ్డుపై నడిచి వెళుతున్న రాజుపై కొబ్బరి బొండాలు నరికే కత్తితో వెనుకనుంచి నరికాడు. మరో సారి మరో వేటు వేసేందుకు ప్రయత్నిస్తుండగా స్థానికులు అడ్డుకోవడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గయపడిన రాజును స్థానికులు పట్టణంలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు .. పట్టణంలో రద్దీగా ఉండే రోడ్డుపై యువకుడిపై కత్తితో దాడి చేయడంతో పట్టణ ప్రజలు ఒక్కసారిగా హడలిపోయారు. ఏం జరుగుతుందోనని కొందరు పరుగులు పెట్టారు. విషయం తెలుసుకున్న సీఐ దొంతిరెడ్డి శ్రీనివాస్రెడ్డి సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. అనంతరం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తాండు రాజును వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిందితుడు వజ్రం పరారీలో ఉన్నాడని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. కాగా రాజు ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. -
వృద్ధాప్యంలో లివ్ఇన్రిలేషన్స్..
సహజీవనం అనేది ఆధునికుల మాట. పెళ్లిని ఇష్టపడని నవ యువత ఎంచుకున్న కొత్త బాట. అయితే దీన్ని అంతకు మించిన విస్తృత ప్రయోజనకారిగా, తమకు సంబంధించిన అత్యుత్తమ సేవా మార్గంగా మార్చుకుంది నగరానికి చెందిన తోడు నీడ సంస్థ. ఒంటరితనాన్ని అనుభవిస్తున్న సీనియర్ సిటిజన్స్ని జంటగా మారుస్తున్న ఈ స్వఛ్చంద సంస్థ స్థాపించి పదేళ్లవుతున్న సందర్భంగా నిర్వాహకురాలు రాజేశ్వరి (70) విశేషాలను ఇలా పంచుకున్నారు సాక్షి, సిటీబ్యూరో: మా ప్రయాణానికి పదేళ్లు. ఎటువంటి అంగబలం, అర్ధబలం లేని సంస్థ మాది. తొలిసారి మా సంస్థ తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా తెలిసేలా చేసింది సాక్షి. ఆ తర్వాత అన్ని మీడియా సంస్థల మద్దతు వల్ల ముందుకు వెళ్లగలిగాం. ఈ క్రమంలో సమాజానికి, కట్టుబాట్లకు వ్యతిరేకంగా పనిచేసే సంస్థగా దీన్ని ముద్రవేసే ప్రయత్నం చేశారు. వృద్ధాప్యంలో లివ్ ఇన్ రిలేషన్ షిప్ తప్పు అని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇలాంటి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాం. ఇప్పుడిప్పుడే పరిస్థితి మారుతోంది. మొదట్లో ఈ తరహా పెద్దల పెళ్లిళ్లకు పిల్లలే బాగా వ్యతిరేకించేవారు. అయితే ఇప్పుడిప్పుడు వారే తల్లిదండ్రులను తీసుకొస్తున్నారు. ఇది చాలా శుభపరిమాణం. 20న వార్షికోత్సవం తోడు నీడ సంస్థ ప్రారంభించి పదేళ్లయిన సందర్భంగా వార్షికోత్సవాలను ఈ నెల 20న నిర్వహిస్తున్నామని రాజేశ్వరి తెలిపారు. హబ్సిగూడలోని టేస్ట్ ఆఫ్ ఇండియా హోటల్లో ఉదయం నుంచి సాయంత్రం దాకా జరిగే ఈ వేడుకల్లో భాగంగా కొత్త సభ్యుల పరిచయ వేదిక, ఉచిత సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటందన్నారు. అలాగే సీనియర్ సిటిజన్స్కు సంబంధించిన సమస్యలుపై అవగాహన కల్పించనున్నామన్నారు. పాత/కొత్త సభ్యులు అందరూ ధృవీకరణ పత్రాలతో మాత్రమే హాజరవ్వాలని కోరారు. వివరాలకు 8106367014 నెంబరుకు ఫోన్ చేయాలన్నారు. లివ్ ఇన్ ఎందుకంటే... వృద్ధాప్యంలో పెళ్లిళ్లపై ఆయా వ్యక్తుల కుటుంబాల్లో ఉండే సందేహాల్లో ఆస్తులు, పిల్లలకు దూరమవుతారు అనేవి ప్రధానమైనవి. ఈ సందేహాలను పోగొట్టడానికే మేం లివ్ ఇన్ రిలేషన్స్ను ప్రోత్సహిస్తున్నాం. తొలుత మేం సహజీవనాన్ని ప్రతిపాదిస్తాం... కాదంటే వారిష్ట ప్రకారం పెళ్లి కూడా చేసుకోవచ్చు. ఎంచుకున్న మార్గం ఏదైనా సరే ఒంటరి వృద్ధులకు తోడు ఏర్పడాలనేదే మా ఆశయం. పెళ్లి/లివిన్ ఏదైనా సరే ఇప్పటికి 200పైగా వృద్ధులను ఒకటి చేశాం. హైదరాబాద్లోనే 15 జంటలకు పైగా ఉన్నారు. లివిన్ రిలేషన్ షిప్ని సేవా మార్గంలో ప్రారంభించిన ఏకైక ఎన్జిఒ మాది. ప్రచారం కావాలి...ప్రయోజనం కలగాలి... ఈ పెద్దల పెళ్లిళ్లకు సంబంధించి మరింత ప్రచారం చేయాల్సి ఉంది. ఇంకా సామాజిక మూఢనమ్మకం పూర్తిగా పోవడం లేదు.అందుకే మారుమూల జిల్లాల్లో కూడా వీటిని విస్తరించాలని ఆశిస్తున్నాం. దీని కోసం లయన్స్ క్లబ్లు, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్స్ సహకారం తీసుకుని ముందుకెళ్లాలని అనుకుంటున్నాం. తోడు తప్పని‘సిరి’... ఏ వయసులోనైనా మనిషికి తోడు అవసరం. వృద్ధాప్యంలో మరింత తప్పనిసరి. మొత్తం దేశ జనాభాలో 12శాతం వృద్ధులుంటే అందులో 40శాతం ఒంటరిగా ఉంటున్నారు. మరోవైపు ఇప్పుడు ఉమ్మడి కుటుంబాల్లేవు. న్యూక్లియర్ ఫ్యామిలీ సిస్టమ్లో ఎవరికి వారే యమునా తీరే. భార్యా భర్త ఇద్దరూ ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితిలో పిల్లలకి వృద్ధుల బాధ్యతలు మోసే తీరికా ఓపికా ఉండడం లేదు. ఈ పరిస్థితి ఓల్డేజ్ హోమ్లవైపు ఒంటరి వృద్ధుల్ని నడిపిస్తోంది, అయితే ఓల్డేజ్ హోమ్లో ఉన్నప్పటికీ మన అనే మనిషి లేకపోవడం అనే వెలితి ఎప్పటికీ తీరేది కాదు. ఇంకోవైపు పిల్లలు విదేశాల్లోనో మరో చోట ఉంటున్నప్పుడు ఒంటరి తనం మరింత దుర్భరం... ఒంటరి వృద్ధుడి ఆత్మహత్య, వృద్ధులపై దాడులు, దోపిడీలు... ఇలాంటివి మనం పేపర్లలో తరచు చదువుతున్నాం. పెద్దల కోసం...మరింత సాయం... తోడు అంటే భార్య భర్తలు మాత్రమే కాదు ఇద్దరు ఆడవాళ్లు, ఇద్దరు మగవాళ్లు కూడా కలిసి జీవించవచ్చు. అలాగే తమ వయసు వారితో కలిసి మెలిసి సరదాగా గడపాలనుకునేవారి కోసం మరికొన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో బృందంగా ఏర్పడి చేసే ఆనంద యాత్ర ఒకటి. మంచి మంచి ప్రాంతాలకు పర్యటించే అవకాశం దీనిలో ఉంటుంది. అంతేకాకుండా టూర్లలో ఒకరినొకరు పరిశీలించుకుని నచ్చిన వ్యక్తిని సహచరి/సహచరునిగా ఎన్నుకునే అవకాశం ఉంటుంది. అలాగే పిల్లలకు ఉన్నట్టే పెద్దల కోసం పొద్దుటి నుంచి సాయంత్రం దాకా కాలక్షేపం అయ్యేలా డే కేర్ సెంటర్స్ పెట్టాం. అలాగే పెళ్లి గురించి పెద్దగా ఆసక్తి లేనివారు కొంత మందితో కలిసి నివసించడాన్ని ప్రోత్సహిస్తూ కమ్యూనిటీ లివింగ్ సెంటర్స్ ఫర్ అడల్ట్స్ను ఏర్పాటు చేశాం. -
ప్రియురాలిపై కత్తితో దాడి..
చిలకలూరిపేట: ఏడేళ్లుగా సహజీవనం చేస్తున్న ప్రియురాలిని అనుమానించిన ప్రియుడు ఆమెపై కత్తితో దాడిచేసి హత్య చేయాలని ప్రయత్నించాడు. ఆపై తాను కూడా గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఆదివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... సత్తెనపల్లికి చెందిన కాటేపల్లి రాముకు వినుకొండకు చెందిన కరణం లక్ష్మీప్రసన్నతో ఏడేళ్ల కిందట పరిచయం ఏర్పడింది. ఇరువురూ కలిసి తిరుపతిలో ఐదేళ్ల పాటు సహజీవనం చేశారు. రెండేళ్ల కిందట చిలకలూరిపేట పట్టణానికి చేరుకొని సుబ్బయ్యతోటలో ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. రాము వంట మాస్టర్గా పనిచేస్తుండగా, లక్ష్మీ ప్రసన్న ఓ సూపర్ మార్కెట్లో సూపర్వైజర్గా పనిచేస్తోంది. గత ఐదు నెలలుగా లక్ష్మీ ప్రసన్న వేరొకరితో సన్నిహితంగా మెలుగుతున్నట్టు రాము అనుమానిస్తూ వచ్చాడు. సెల్ఫోన్లో వేరొకరితో మాట్లాడటం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసేవాడు. ఆదివారం లక్ష్మీప్రసన్న వేరొకరితో మోటార్ బైక్పై రావటం గమనించి ఆగ్రహం వ్యక్తం చేయటంతో ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది. ఆగ్రహించిన రాము కూరగాయలు కోసే కత్తితో ఆమెపై దాడి చేశాడు. దీంతో ఆమె ఎడమ చెయ్యి, నడుము, వెనుక భాగంలో తీవ్రగాయాలయ్యాయి. అనంతరం తాను కూడా గొంతుకోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు ఇరువురినీ 108 ద్వారా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇరువురికీ తీవ్ర గాయాలు కావడంతో స్థానిక వైద్యులు ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్కు తరలించారు. -
సహజీవనం: జంట బలవన్మరణం
సాక్షి, సంగారెడ్డి రూరల్: సహజీవనం చేస్తున్న ఓ జంట ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా రూరల్ మండల పరిధిలోని హనుమాన్నగర్లో సోమవారం చోటుచేసుకుంది. రూరల్ ఎస్సై శ్రీకాంత్ కథనం ప్రకారం కర్ణాటకలోని బీదర్కు చెందిన బత్తిని దత్తు (30) హైదరాబాద్లో డ్రైవర్గా పని చేస్తున్నాడు. హనుమాన్ నగర్కు చెందిన బత్తిని భారతి(34)కి నాలుగేళ్ల క్రితం దత్తుతో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి వీరు కలిసి ఉంటున్నారు. భారతికి ఇద్దరు పిల్లలు ఉండగా 14 ఏళ్ల క్రితం భర్తను వదిలేసింది. దత్తుకు వివాహం కాలేదు. ఈ క్రమంలో కొంతకాలంగా హనుమాన్నగర్లో రూం కిరాయికి తీసుకుని ఉంటూ సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి ఈ నెల 8న దత్తు హనుమాన్ నగర్కు వచ్చాడు. అతడి తండ్రి బాలయ్య కుమారుడిని వెతుక్కుంటూ హనుమాన్నగర్కు చేరుకున్నాడు. కొడుకు కోసం వెతుకుతూ ఒక ఇంటి ముందు దత్తుకు చెందిన ద్విచక్ర వాహనాన్ని చూసి ఆరా తీశాడు. వారుంటున్న గది దగ్గరకు వెళ్లి దత్తును పిలిచినా సమాధానం రాకపోవడం, తలుపులు మూసి ఉండటంతో అనుమానం వచ్చిన బాలయ్య గ్రామస్తుల సహకారంతో తలుపులను బద్దలు కొట్టాడు. గదిలోకి చూడగా దత్తు, భారతి ఇద్దరూ ఉరి వేసుకుని మృతి చెంది కనిపించారు. బాలయ్య ఫిర్యాదు మేరుకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. -
సహజీవనం చేస్తూ శవమై తేలి..
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలోని గోకల్పురిలోని ఫ్లాట్లో కుళ్లిన పాతికేళ్ల మహిళ మృతదేహాన్ని ఆమె అల్మారాలో పోలీసులు గుర్తించారు. పెళ్లైన వ్యక్తితో ఆమె సహజీవనం చేస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.భార్యకు విడాకులిచ్చి తనను పెళ్లిచేసుకోవాల్సిందిగా బాధితురాలు ఆమె ప్రియుడిపై ఒత్తిడి తెచ్చినట్టు భావిస్తున్నారు. పెళ్లైన వ్యక్తితో సహజీవనం చేయడాన్ని వ్యతిరేకించిన కుటుంబ సభ్యులకు దూరంగా బాధితురాలు అదే ఫ్లాట్లో విడిగా ఉంటున్నారని పోలీసులు చెప్పారు. తాను సహజీవనం చేస్తున్న మహిళ ఇంట్లోంచి పొగ వస్తోందని ప్రియుడు అందించిన సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకోగా అల్మారాలో మహిళ శవాన్ని గుర్తించారు. ఆమెను కొద్దిరోజుల కిందటే గొంతునులిమి హతమార్చిఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితురాలు సహజీవనం చేస్తున్న వ్యక్తితో పాటు ఇతరులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. -
సహజీవనం సరి కాదు
స్టార్ స్టేటస్ని ఎంజాయ్ చేస్తున్న హీరోయిన్లు పెళ్లి గురించి ప్రస్తావించడానికి ఎక్కువగా ఇష్టపడరు. కెరీర్ గ్రాఫ్ గురించో.. లేదా పర్శనల్ విషయాలు ప్రైవేట్గా ఉండటం కోసమో పెళ్లి ఊసెత్తితే చాలు మాట దాటేయటమో లేదా మౌనవ్రతం చేస్తుంటారు. కానీ ఆలియా భట్ అలా కాదు. 30కి ముందే మూడు ముళ్లు వేయించుకుంటానేమో? అంటున్నారు. పెళ్లి విషయం గురించి ఆలియా మాట్లాడుతూ – ‘‘ప్రస్తుతం పెళ్లి మీద ఎటువంటి ఆలోచనలు లేవు. హానెస్ట్గా చెప్పాలంటే ఈ విషయం ఇప్పుడు జరగాలి.. అది అప్పుడు జరగాలి అని ప్లాన్ చేసుకునే టైప్ కాదు నేను. ఆ క్షణంలో చేయాలనిపించింది చేసేస్తా. నా ఉద్దేశంలో ఏదైనా ఎక్స్పెక్ట్ చేయనప్పుడు జరిగితేనే అసలు కిక్కు. అందరూ నేను ముప్ఫై ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకుంటాననుకుంటారేమో. దాని కంటే ముందే చేసుకొని సర్ప్రైజ్ చేస్తానేమో. నాకు లివ్ ఇన్ రిలేషన్షిప్ మీద మంచి ఒపీనియన్ లేదు. సహజీవనం సరి కాదనన్నది నా అభిప్రాయం. అందుకే నాకు నచ్చినవాడు దొరికితే ‘ఐలవ్ యు. మనం పెళ్లి చేసుకుందాం, కలిసుందాం. పెళ్లి తర్వాత కూడా నేను వర్క్ చేస్తాను’ అని చెప్పేస్తాను’’ అని పేర్కొన్నారు ఆలియా భట్. ప్రస్తుతం బాలీవుడ్ యంగ్హీరో రణ్బీర్తో లవ్లో ఉన్నారని టాక్. ఈ రిలేషన్షిప్ని ఉద్దేశిస్తూ ఆలియా ఇలా మాట్లాడి ఉంటారా? అంటే సన్నాయి మేళం వినిపించేదాకా చెప్పలేం. -
సహజీవనం చేసి నరికి చంపాడు.. ఆపై!
సాక్షి, చిత్తూరు: భర్త చనిపోయి ఒంటరిగా ఉన్న మహిళ మరో వ్యక్తితో విహహేతర సంబంధం కొనసాగించడమే చివరికి ఆమె ప్రాణాలనే తీసింది. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. రధం మండంలోని తొప్పత్తిపల్లి పంచాయతీ మర్రిగుంటకు చెందిన పురుషోత్తం అనే వ్యక్తితో గుంటూరుకు చెందిన వనితకు వివాహం జరిగింది. వారికి సంతానం ఇద్దరు పిల్లలు ఉన్నారు. నాలుగేళ్ల క్రితం కుటుంబ కలహాలతో పురుషోత్తం ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త ఆత్మహత్య చేసుకోవడంతో వనిత పుట్టింటికి వెళ్లిపోయింది. వనితకు అదే గ్రామానికి చెందిన భరత్ కుమార్ (23)తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా సహజీవనానికి దారి తీసింది. కొన్ని రోజుల తర్వాత వారి మధ్య కలహాలు మొదలైయ్యాయి. గోడవలు ఎక్కువ కావడంతో భరత్.. వనితను, ఆమె కుమారుడిని అత్యంత దారుణంగా హత్యచేశాడు. శనివారం రాత్రి వనిత మవయ్య ఇంటికి వచ్చి చూడగా ఇంట్లో తల్లీకొడుకులు రక్తపు మడుగులో కనిపించారు. వెంటనే ఇరుగు పొరుగు వాళ్లకు సమాచారం ఇవ్వడంతో తలుపులు పగలకొట్టి చూడగా భరత్ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉన్నాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. తల్లీ, కొడుకుని హత్యచేసిన నిందితుడు భరత్ ఆత్మహత్య చేసుకున్నాడని గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
సంచలన తీర్పు: పెళ్లి చేసుకోకపోయినా కలిసుండొచ్చు
కొచ్చి: పెళ్లి చేసుకోకపోయినా ఓ 18 ఏళ్ల యువకుడు, 19 ఏళ్ల యువతి కలిసి ఉండవచ్చని కేరళ హైకోర్టు శుక్రవారం సంచలన తీర్పు ఇచ్చింది. సహ జీవనాన్ని తప్పుబట్టలేమని కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. యుక్త వయసులో ఉన్న యువతీ యువకులకు చట్టబద్ధంగా పెళ్లి చేసుకునే వయసు రాకపోయినా సహ జీవనం చేసే హక్కు ఉంటుందని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ తీర్పు వెలువడిన నెల రోజుల్లోనే కేరళ హైకోర్టు ఈ తీర్పు చెప్పింది. జస్టిస్ వీ చితంబరేష్, జస్టిస్ కేపీ జ్యోతీంద్రనాథ్లతో కూడిన ధర్మాసనం ఆ యువతి తండ్రి వేసిన హెబియస్ కార్పస్ రిట్ పిటిషన్ను విచారించి కొట్టేసింది. ఈ పిటిషన్తో వాళ్లను విడదీయలేమని ఈ సందర్బంగా స్పష్టం చేసింది. ఇది సమాజ సాంప్రదాయాలకు విరుద్ధంగా అనిపించినా.. మేజర్లు కావడంతో రాజ్యాంగబద్ధంగా వాళ్లకు సంక్రమించిన హక్కులను గౌరవించాల్సిన అవసరం ఉన్నదని కోర్టు తెలిపింది. సదరు యువకుడికి చట్టబద్ధంగా పెళ్లి చేసుకొనే వయసు వచ్చే వరకు అతనితో స్వేచ్ఛగా జీవించే హక్కు ఆ యువతికి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. -
ఆస్తి కోసం ప్రియుడితో కలిసి..
ఘజియాబాద్ : ఆస్తి వివాదంలో 38 ఏళ్ల మహిళను అత్యంత కిరాతకంగా చంపి ఖాళీగా ఉన్న ఫ్లాట్లో పడేసిన ఉదంతం దేశ రాజధానిలో వెలుగుచూసింది. ఎనిమిది నెలల కిందట దారుణ ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీలోని లోని ప్రాంతంలో కుళ్లిపోయిన మహిళ శవాన్ని వెలికితీసిన పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..జౌరీపూర్కు చెందిన బేబీ ఆగస్ట్ 29 నుంచి అదృశ్యమైంది. ఈ కేసుకు సంబంధించి తాజాగా బయటపడ్డ ఆధారాల ప్రకారం బేబీ సోదరి రేఖతో సహజీవనం చేస్తున్న జాన్ మహ్మద్ను పోలీసులు ప్రశ్నించగా దిగ్భ్రాంతికర వాస్తవాలు వెలుగుచూశాయి. బేబీ సోదరి రేఖ తన ప్రియుడు, మరో నలుగురు ఇతరులతో కలిసి బేబీని హతమార్చినట్టు స్వయంగా జాన్ మహ్మద్ అంగీకరించినట్టు పోలీసులు వెల్లడించారు. తమ పుట్టింటి ఆస్తికి సంబంధించి రేఖ, బేబీ మధ్య వివాదం నడిచింది. రేఖతో పాటు వారి సోదరుడు ఆస్తిని అమ్మాలని ప్రయత్నించగా బాధితురాలు బేబీ వారిని వారించేది. దీంతో రక్తంపంచుకుని పుట్టిన సోదరి బేబీని ప్రియుడు, మరో నలుగురి సహకారంతో రేఖ అంతమొందించింది. తాజా ఆధారాలతో రేఖతో పాటు నిందితులను అరెస్ట్ చేసినట్టు పోలీస్ అధికారి త్యాగి తెలిపారు. మృతదేహాన్ని వెలికితీసి పోస్ట్మార్టంకు పంపామని, కేసు విచారణ చేపట్టామని పోలీసులు తెలిపారు. -
పెళ్లి చేసుకోకపోయినా కలిసుండొచ్చు
న్యూఢిల్లీ : యుక్త వయస్సు వచ్చిన వారికి వివాహంతో సంబంధం లేకుండా తమకు నచ్చిన వారితో జీవించే హక్కు ఉన్నదని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ప్రస్తుతం గృహహింస నిరోధక చట్టం 2005 కింద ‘లివ్ ఇన్ రిలేషన్షిప్స్’(సహజీవనాన్ని)ను శాసన సభ గుర్తించిందని తెలిపింది. చట్ట బద్దమైన వివాహ వయసు కంటే ముందే పెళ్లి చేసుకున్నారని కేరళకు చెందిన ఓ మేజర్ దంపతుల వివాహాన్ని కేరళ హైకోర్టు కొట్టివేసింది. దాంతో తనకు న్యాయం చేయాల్సిందిగా ఆ యువకుడు సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. ఈ విన్నపం విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు వివాహంతో సంబంధం లేకుండా యుక్త వయసుకు వచ్చిన వారు తమకు నచ్చిన వారితో జీవించే హక్కు ఉందని తీర్పు వెలువరించింది. అప్పీలు వివరాలు... కేరళకు చెందిన నందకుమార్ అనే వ్యక్తి తుషారా అనే యువతిని వివాహం చేసుకున్నాడు. వివాహం నాటికి వీరిరువురు మేజర్లు అయినప్పటికి నందకుమార్కు మాత్రం 21 ఏళ్లు నిండలేదు. బాల్య వివాహ నిరోధక చట్టం ప్రకారం అమ్మాయికి 18 ఏళ్లు, అబ్బాయికి 21 ఏళ్లు నిండిన వారు మాత్రమే వివాహానికి అర్హులు. దీనిని ఆధారంగా చేసుకుని కేరళ హైకోర్టు నందకుమార్, తుషార్ల వివాహం చెల్లదని తీర్పునిచ్చింది. అంతేకాక తుషార్ను ఆమె తల్లిదండ్రులకు అప్పగించింది. కేరళ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ నందకుమార్ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. సుప్రీం కోర్టు ఈ అప్పీలును విచారించడానికి జస్టిస్ ఏ కే సిక్రీ, జస్టిస్ అశోక్ భూషణ్ అధ్వర్యంలో ఒక బెంచ్ను ఏర్పాటు చేసింది. నందకుమార్, తుషార్ ఇద్దరు హిందూవులే కనుక హిందూ వివాహ చట్టం సెక్షన్ 12 ప్రకారం వీరి వివాహం చెల్లుబాటు అవుతుందని, అంతేకాక ఇద్దరు మేజర్లు అయిన కారణంగా వారికి కలిసి జీవించే హక్కుందని తీర్పునిచ్చింది. ఈ సందర్భంగా ‘లవ్ జీహాద్’గా పేరు గాంచిన వైకోమ్కు చెందిన ‘హదియా’ కేసును ఉదహరించింది. కేరళ వైకోమ్కు చెందిన 24 ఏళ్ల హోమియో వైద్య విద్యార్థిని హదియా తాను ప్రేమించిన జహన్ను వివాహం చేసుకోవడానికి ఇస్లాం మతంలోకి మారింది. ఈ కేసు సందర్భంగా సుప్రీం కోర్టు ఇద్దరు యుక్త వయస్కుల వివాహ విషయంలో కోర్టు జోక్యం చెల్లదని తీర్పునిచ్చిన సంగతిని గుర్తు చేసింది. అందువల్ల నందకుమార్, తుషార్ల వివాహం చెల్లుతుందని, వారిరువురికి కలిసి జీవించే హక్కు ఉందని తీర్పు నిచ్చింది. నందకుమార్కి ఈ నెల 31 నాటికి 21 ఏళ్లు నిండుతాయి. -
సహజీవనానికి అడ్డొస్తున్నాడని ఆవేశంలో..
చెల్లెలితో సహజీవనం చేస్తున్న వ్యక్తిని హెచ్చరించిన ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఢిల్లీలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఢిల్లీలోని విజయ్ విహార్ ఏరియాలో అన్నా, చెల్లెలు నివాసం ఉండేవారు. అయితే తన చెల్లెలిని అదే ప్రాంతంలో ఉండే ఓ యువకుడు ప్రేమించాడు. ఈ క్రమంలో ఆమెను కొన్ని రోజుల కిందట కిడ్నాప్ చేశాడని, అప్పటినుంచీ ఆమెతో సహజీవనం చేస్తున్నాడని పోలీసులు చెప్పారు. గత శనివారం బాధితురాలు అతడి నుంచి తప్పించుకుని వారి ఇంటికి వచ్చింది. ఈ విషయాన్ని గ్రహించిన నిందితుడు ఎలాగైనా సరే తాను కోరుకున్న అమ్మాయిని దక్కించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఒకరోజు వారి ఇంటికి వెళ్లి తుపాకీతో బెదిరించాడు. బాధితురాలి సోదరుడు వారి రిలేషన్ షిప్ ను అంగీకరించలేదు. యువతితో తన సంబంధానికి అడ్డుచెప్పినందుకు నిందితుడు తీవ్ర ఆవేశానికి లోనయ్యాడు. తన వెంట తెచ్చుకున్న తుపాకీతో తాను ప్రేమించిన యువతి సోదరుడిపై కాల్పులు జరిపాడు. బాధితురాలి సోదరుడు తీవ్రంగా గాయపడ్డాడు. దగ్గర్లోని ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించగా మృతిచెందాడని పోలీసులు వివరించారు. కాల్పులు జరిపిన అనంతరం నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు, బాధితుల పేర్లను వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించారు. -
దిల్ రాజు ఫోన్ నెంబరే తెలియదు: షీలా
'పరుగు' సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన హీరోయిన్ షీలా తనపై వచ్చిన రూమర్లను తీవ్రంగా ఖండించింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు షీలాకు మధ్య లివ్ ఇన్ రిలేషన్ ఉన్నట్లు టాలీవుడ్లో పుకార్లు షికార్లు చేసిన విషయం తెలిసిందే. ఈ రూమర్లపై స్పందించిన షీలా....తనకు దిల్ రాజు ఫోన్ నెంబరే తెలియదని, అలాంటప్పుడు ఆయనతో ఎలా లింక్లు కడతారని ప్రశ్నించింది. తెలుగులో తాను నటించిన సినిమా విడుదలై సుమారు మూడేళ్లు అవుతుందని, అప్పటి నుంచి మంచి స్ర్కిప్ట్ దొరకనందున నటించటం లేదని తెలిపింది. చిత్ర పరిశ్రమతో తాను ప్రస్తుతం టచ్లో కూడా లేనని షీలా ఓ ఆంగ్ల దినపత్రికతో తెలిపింది. గత ఏడాదిగా యూకేలో ఉంటున్నానని, హైదరాబాద్ అడుగుపెట్టక మూడేళ్లు అయినట్లు ఆమె చెప్పింది. అలాంటప్పుడు ఇటువంటి వార్తలు ఎలా పుడతాయో అర్ధం కావటం లేదని షీలా వాపోయింది. తనకు హైదరాబాద్లో ఎవరూ స్నేహితులు లేరని స్పష్టం చేసింది. గతంలో హైదరాబాద్లో షూటింగ్ ఉంటే... అది పూర్తయిన వెంటనే చెన్నై వెళ్లిపోయేదాన్ని అని తెలిపింది. తనది కలివిడిగా ఉండే మనస్తత్వం కానందున బయట ఫంక్షన్లకు కూడా వెళ్లేదాన్ని కాదని, అంతేకాకుండా చిత్ర పరిశ్రమకు సంబంధించిన వారితో మాట్లాడిన దాఖలాలు కూడా లేవని స్పష్టం చేసింది. నిర్మాత దిల్ రాజుతో టచ్లో లేనని చెప్పిన షీలా...."ఒకసారి మాత్రమే దిల్ రాజుతో మాట్లాడాను. అది కూడా ఎన్టీఆర్ హీరోగా నటించిన అదుర్స్ సినిమా ఆడియో కార్యక్రమంలో. ఆయన ఫోన్ నెంబర్ కూడా తెలియదు. దిల్ రాజును చూసి కూడా చాలా కాలమైంది. మరి ఎందుకు ఇలాంటి రూమర్లు వస్తాయో అనవసరంగా ఈ వివాదంలోకి లాగారు'' అని పేర్కొంది. పరుగు సినిమా గురించి షీలా మాట్లాడుతూ ఆ సినిమాకు దిల్ రాజు నిర్మాత అయినా....తనను సెలెక్ట్ చేసింది అల్లు అరవింద్ అని, ఫోటో షూట్ అనంతరం తాను ఎంపిక అయినట్లు చెప్పింది. ఇక చిత్ర పరిశ్రమకు దూరంగా వున్న విషయంపై ఆమె మాట్లాడుతూ మంచి స్క్రిప్ట్ తో ఎవరైనా తనను సంప్రదిస్తే...అప్పుడు ఆలోచిస్తానంది. అది కూడా ఆ సినిమా ఎన్ని నెలల్లో పూర్తవుతుందనే దానిపైనే నిర్ణయం తీసుకుంటానని షీలా తెలిపింది. ప్రస్తుతం రెండు స్క్రిప్ట్ లు పై చర్చలు జరుగుతున్నాయని చెప్పింది. మరోవైపు ఈ పుకార్లుపై దిల్ రాజు స్పందిస్తూ ....హీరోయిన్ షీలాతో మాట్లాడి చాలా కాలమైందని, నిరాధారమైన వార్తలపై తానెలా కామెంట్ చేస్తానన్నారు. -
సహజీవనం చేస్తానని.. మహిళ హత్య
అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. సహజీవనం చేస్తానని చెప్పి ఓ వివాహితను తీసుకెళ్లిన ఓ యువకుడు, ఆమెను దారుణంగా హతమార్చాడు. సిద్ధ అనే యువకుడు ఈ ఘెరానికి పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే ఇంతవరకు ఆ మహిళ మృతదేహం మాత్రం పోలీసులకు లభ్యం కాలేదు. ఈ కేసులో ఇప్పటివరకు ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన వెనక ఇంకా ఎవరైనా ఉన్నారా, అతనొక్కడేనా అనే కోణంలో పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.