Manju Warrier
-
విజయ్ సేతుపతి ‘విడుదల 2’ మూవీ రివ్యూ
టైటిల్: విడుదల 2నటీనటులు: విజయ్ సేతుపతి, మంజు వారియర్, సూరి, కిశోర్, గౌతర్ వాసుదేవ్ మీనన్, అనురాగ్ కశ్యప్ తదితరులునిర్మాతలు: ఎల్ రెడ్ కుమార్, చింతపల్లి రామారావు (తెలుగు వెర్షన్)దర్శకత్వం: వెట్రీమారన్సంగీతం: ఇళయరాజాసినిమాటోగ్రఫీ: వేల్ రాజ్ఎడిటింగ్: ఆర్. రామర్విడుదల తేది: డిసెంబర్ 20, 2024విజయ్ సేతుపతి, వెట్రీమారన్ కాంబినేషన్లో వచ్చిన 'విడుదల -1' చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్గా 'విడుదల-2' తెరకెక్కింది. ఇళయారాజా సంగీతం అందించిన ఈ చిత్రం నేడు(డిసెంబర్ 20) ప్రేక్షకులు ముందుకు వచ్చింది. మహారాజా లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ సేతుపతి నుంచి వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. ప్రజాదళం నాయకుడు పెరుమాళ్(విజయ్ సేతుపతి) అరెస్ట్తో 'విడుదల -1' ముగుస్తుంది. కస్టడీలో ఉన్న పెరుమాళ్ విచారణతో పార్ట్ 2 ప్రారంభం అవుతుంది. పెరుమాళ్ అరెస్ట్ విషయం బయటకు తెలియడంతో అతన్ని మరో క్యాంపుకు తరలించి, అక్కడే ఎన్కౌంటర్ చేయాలని ప్లాన్ చేస్తారు. ఆ క్యాంపుకి అడవి మార్గం ద్వారానే వెళ్లాలి. కొమరన్(సూరి)తో కలిసి మరికొంత మంది పోలీసులు పెరుమాళ్ని తీసుకెళ్తారు. మార్గమధ్యలో పెరుమాళ్ తన ఫ్లాష్బ్యాక్ స్టోరీ చెబుతాడు. స్కూల్ టీచర్గా ఉన్న పెరుమాళ్ దళంలోకి ఎలా చేరాడు? జమిందారి వ్యవస్థ చేసే అరచకాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న కేకే(కిశోర్) పరిచయం పెరుమాళ్ జీవితాన్ని ఎలా మలుపు తిప్పింది? తను పని చేసే ఫ్యాక్టరీ యజమాని కూతురు మహాలక్ష్మి(మంజు వారియర్)తో ప్రేమాయణం ఎలా సాగింది? ప్రజాదళం ఆశయం ఏంటి? ప్రజల కోసం పెరుమాళ్ చేసిన పోరాటం ఏంటి? ప్రజాదళాన్ని అంతం చేసేందుకు ప్రభుత్వంతో కలిసి జమీందార్లు చేసిన కుట్ర ఏంటి? పార్ట్ 1లో జరిగిన రైలు ప్రమాదం వెనుక ఉన్న అసలు నిజం ఏంటి? పోలీసు కస్టడీ నుంచి పెరుమాళ్ తప్పించుకున్నాడా లేదా? సూరి తీసుకున్న సంచలన నిర్ణయం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. వెట్రిమారన్ సినిమాలు అంటేనే వాస్తవికానికి దగ్గరగా ఉంటుంది. అణచివేత, పెత్తందార్లపై పోరాటాలే ఆయన కథలు. విడుదల పార్ట్ 2 నేపథ్యం కూడా అదే. అణగారిన వర్గాల నుంచి ఉద్భవించిన ఓ విప్లవ కెరటం.. పెట్టుబడిదారీ వ్యవస్థ నుంచి ప్రజలను ఎలా బయటపడేలా చేశారు అనేది ఈ సినిమా కథ. విడుదల పార్ట్ 1 చూసిన వారికి పార్ట్ 2 కథనం ఎలా ఉంటుందనేది అర్థమైపోతుంది. పార్ట్ 1లో సూరి పాత్రలో ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. అమాయకత్వం, వృత్తి పట్ల నిబద్ధత, నిజాయితీ గల సూరి స్టోరీ అందరి మనసులని కలిచి వేస్తుంది. అయితే పార్ట్ 2లో మాత్రం సూరి పాత్ర నిడివి చాలా తక్కువ. కథనం మొత్తం విజయసేతుపతి పాత్ర చుట్టే తిరుగుతుంది. చాలా తమిళ సినిమాల్లో చూసిన దళితభావానికి ఎర్రజెండా వాదాన్ని జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు వెట్రిమారన్. ఎప్పటి ప్రతి చిన్న విషయాన్ని చాలా కూలంకషంగా రీసెర్చ్ చేసి అందరికి అర్థమయ్యేలా సినిమాను తీర్చిదిద్దాడు. పెత్తందారీ వ్యవస్థను ప్రశ్నిస్తూనే మావోయిస్ట్ ఆవిర్భావం, ఎర్రజెండా వాదం వెనుక ఉన్న ఉద్దేశం వివరించాడు. నక్సలైట్స్ ఎలా కలుసుకుంటారు? సమాచారాన్ని ఎలా చేరవేస్తారు? బడుగు బలహీన వర్గాలతో వారి సంబంధం.. ప్రతీది కళ్లకు కట్టినట్లుగా చూపించారు. ఎక్కడా కూడా కృత్రిమత్వం లేకుండా.. నిజ జీవితాన్ని తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు. అయితే ప్రతి విషయాన్ని చాలా డీటేయిల్డ్గా చూపించడంతో సాగదీతగా అనిపిస్తుంది. దళితులపై దాడి మొదలు పోలీసుల, నక్సల్స్ మధ్య జరిగే పోరు వరకు చాలా సన్నివేశాలు గత సినిమాలను గుర్తుకు చేస్తాయి. అయితే ఓ ఉద్యమ కథకి చక్కని ప్రేమ కథను జోడించడంలో దర్శకుడు సఫలం అయ్యాడు. పెరుమాళ్, మహాలక్ష్మిల ప్రేమ కథ ఆకట్టుకుటుంది. కరుప్పన్ ఎపిసోడ్ ఎమోషనల్కు గురి చేస్తుంది. స్కూల్ టీచర్గా ఉన్న పెరుమాళ్ నక్సలైట్గా మారడానికి దారితీసిన పరిస్థితులు తెరపై చూస్తున్నప్పడు.. ఆ పాత్రపై జాలీతో పాటు పెత్తందారి వ్యవస్థపై అసహ్యం కలుగుతుంది. ఇంటర్వెల్ సీన్ ఆకట్టుకుంటుంది. ఇక సెకండాఫ్లో కథనం అక్కడడక్కడే తిరుగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. పోలీసులకు, నక్సల్స్ మధ్య జరిగే ఎన్కౌంటర్ ఎపిసోడ్ అయితే విసుగు తెప్పిస్తుంది. ఒకనొక దశలో ఓ డాక్యూమెంటరీ ఫిల్మ్ చూసినట్లుగా అనిపిస్తుంది. క్లైమాక్స్ సన్నివేశాలు భావోద్వేగానికి గురి చేస్తాయి. పార్ట్ 3 కోసం తీసుకున్న లీడ్ బాగుంది. వామపక్ష భావజాలం ఉన్నవారికి ఈ చిత్రం కచ్చితంగా నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే.. విజయ్ సేతుపతి నటన గురించి అందరికి తెలిసిందే. ఎలాంటి పాత్రలో అయినా ఆయన జీవించేస్తాడు. పెరుమాళ్ పాత్రకు ఆయన పూర్తి న్యాయం చేశాడు. పోలీసు స్టేషన్లో నగ్నంగా ఉండే సీన్ అయినా.. ఇంట్లో భార్య ముందు స్నానం చేసే సన్నివేశం అయినా.. ఎక్కడ కూడా ఆయన నటించనట్లు అనిపించదు. ఆయన నటన అంత సహజంగా ఉంది. మంజు వారియర్కి కూడా బలమైన పాత్ర లభించింది. అభ్యుదయ భావజలం గల మహాలక్ష్మి పాత్రలో ఆమె ఒదిగిపోయారు. పోలీస్ డ్రైవర్ కొమరన్గా సూరి చక్కగా నటించాడు. అయితే పార్ట్ 2లో ఆయన పాత్ర నిడివి చాలా తక్కువ. కిశోర్, గౌతర్ వాసుదేవ్ మీనన్, అనురాగ్ కశ్యప్తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. ఇళయరాజా నేపథ్య సంగీతం సినిమాకి మరో ప్రధాన బలం. ఓ ఉద్యమ కథకి కావాల్సిన బీజీఎం అందించాడు. పాటలు పర్వాలేదు. డబ్బింగ్ బాగోలేదు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సెంకడాఫ్లో చాలా సన్నివేశాలను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
విజయ్ సేతుపతి ‘విడుదల-2’ మూవీ ప్రెస్మీట్ (ఫొటోలు)
-
విజయ్ సేతుపతి 'విడుదల 2' సాంగ్ రిలీజ్
విజయ్ సేతుపతి, సూరి ప్రధాన పాత్రధారులుగా వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం విడుదల2. తాజాగా ఈ చిత్రం నుంచి తొలి సాంగ్ ' పావురమా పావురమా' మేకర్స్ విడుదల చేశారు. గతేడాదిలో రిలీజైన విడుదల చిత్రానికి సీక్వెల్గా ఈ మూవీని తెరకెక్కించారు. అయితే, ఈ మూవీ డిసెంబర్ 20న విడుదల కానుంది. తెలుగు హక్కులను ప్రముఖ నిర్మాత , శ్రీ వేధాక్షర మూవీస్ అధినేత చింతపల్లి రామారావు దక్కించుకున్నారు.ఈ సందర్భంగా నిర్మాత చింతపల్లి రామారావు మాట్లాడుతూ.. 'సంగీత మాంత్రికుడు ఇళయరాజా స్వరపరిచిన 'విడుదల 2' చిత్రంలోని తొలిపాటను తాజాగా విడుదల చేయడం ఆనందంగా ఉంది. కాసర్ల శ్యామ్ కలం నుంచి వెలువడిన ఈ పాటను తెలుగు ప్రేక్షకులు ఇంత స్పీడుగా ఆదరిస్తున్నందుకు సంతోషంగా ఉంది. విజయ్ సేతుపతి, సూరి నటన హైలైట్గా విడుదల2 ప్రేక్షకులను కనువిందు చేయబోతోంది.ఏడు సార్లు నేషనల్ అవార్డు పొందిన ఏకైక దర్శకుడు వెట్రిమారన్, ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన ఆర్ ఎస్ ఇన్ఫోటైన్మెంట్ అధినేత ఎల్రెడ్ కుమార్తో కలిసి ఈ చిత్రాన్ని అత్యద్భుతంగా తెరకెక్కించారు. మంచి కమర్షియల్ వాల్యూస్ ఉన్న ఈ చిత్ర హక్కులను మేము దక్కించుకున్నందుకు సంతోష పడుతున్నాం. డిసెంబర్ 20న ఇండియన్ సెల్యూలాయిడ్ పై ప్రేక్షకులంతా చూసి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం.' అని ఆయన తెలిపారు.విజయ్ సేతుపతి, మంజు వారియర్ విజయ్ సేతుపతి, మంజు వారియర్, సూరి, భవాని శ్రీ, గౌతమ్ వాసుదేవ్ మీనన్, సూర్య సేతుపతి, అనురాగ్ కశ్యప్,రాజీవ్ మీనన్, ఇలవరసు , బాలాజీ శక్తివేల్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం ఇళయరాజా అందించారు. -
ప్రముఖ జ్యువెలర్స్ చొరవ.. ‘హాస్పిటల్ ఆన్ వీల్స్’
త్రిస్సూర్: భారత గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలను మెరుగుపరిచే దిశగా ప్రముఖ జ్యువెలరీ సంస్థ జోస్ ఆలుక్కాస్ ముందడుగు వేసింది. చైర్మన్ జోస్ ఆలుక్కా 80వ పుట్టినరోజు సందర్భంగా త్రిస్సూర్ జూబ్లీ మిషన్ హాస్పిటల్ భాగస్వామ్యంతో ‘హాస్పిటల్ ఆన్ వీల్స్’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. కోటి రూపాయల ఈ సంచార వైద్య కేంద్రాన్ని ప్రముఖ నటి మంజు వారియర్ ప్రారంభించారు.ఇందులో ఈసీజీ, మల్టీ పారా మోనిటర్లు, మినీ ల్యాబ్ ఉన్నాయి. ఒకేసారి ఆరుగురు రోగులకు చికిత్స చేయవచ్చు. ఆరోగ్య సంరక్షణలో అంతరాన్ని తగ్గించడం, అధునాతన వైద్యాన్ని మారుమూల ప్రజలకు చేర్చడమే ‘హాస్పిటల్ ఆన్ వీల్స్’ ముఖ్య లక్ష్యమని జోస్ ఆలుక్కా తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో సంస్థ ఎండీలు వర్ఘీస్ ఆలుక్కాస్, పాల్ జె ఆలుక్కాస్, జాన్ ఆలుక్కాస్, జూబ్లీ మిషన్ ఆసుపత్రి అసిస్టెంట్ డైరెక్టర్ సింటో కరేపరంబన్, సీఈవో డాక్టర్ బెన్నీ జోసెఫ్ నీలంకవిల్ తదితరులు పాల్గొన్నారు. -
సోషల్మీడియాలో ట్రెండింగ్ సాంగ్.. వీడియో చూశారా..?
రజనీకాంత్ వేట్టయాన్ సినిమాలో సూపర్ హిట్ అయిన సాంగ్ 'మనసిలాయో'. తాజాగా ఈ పాట వీడియోను యూట్యూబ్లో విడుదల చేశారు. టి.జె.జ్ఞానవేల్ తెరకెక్కించిన ఈ చిత్రంలో అమితాబ్, ఫహద్ ఫాజిల్, రానా, మంజు వారియర్, రితికా సింగ్, దుషారా విజయన్ కీలక పాత్రలు పోషించారు. చాలా సింపుల్ కొరియోగ్రఫీతో దినేశ్ ఈ సాంగ్ను క్రియేట్ చేశారు. ఈ పాట మీద చాలా రీల్స్ వచ్చాయి. సోషల్మీడియాలో ఇప్పటికీ ఈ సాంగ్ ట్రెండ్ అవుతూనే ఉంది.ఈ పాటలో రజనీకాంత్తో మంజు వారియర్ వేసిన స్టెప్పులకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. మలయాళంలో చాలా పాటలు ఆమె చేసినప్పటికీ ఇంత క్రేజ్ రాలేదని చెప్పవచ్చు. తన కెరీర్లో ఇంత పెద్ద హిట్ అయిన పాట ఇదేనని మంజు కూడా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. -
రజనీకాంత్ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాను
‘‘రజనీకాంత్ గారిని ఎలా చూపించాలో, ఎలా చూపిస్తే అభిమానులు సంతోషిస్తారో అనే అవగాహన నాకు ఉంది. ఫ్యాన్స్ని అలరించే అంశాలతో పాటు ఆకట్టుకునే కంటెంట్తో ‘వేట్టయాన్: ది హంటర్’ సినిమాను రూపొందించడమే నా ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాను. రజనీకాంత్గారు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాను’’ అని డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ అన్నారు. రజనీకాంత్ లీడ్ రోల్లో అమితాబ్ బచ్చన్, ఫాహద్ ఫాజిల్, రానా, మంజు వారియర్, రితికా సింగ్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘వేట్టయాన్: ది హంటర్’. లైకా ప్రొడక్షన్స్పై సుభాస్కరన్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న విడుదలైంది. తెలుగులో ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పీ బ్యానర్పై రిలీజైంది. తమిళ్, తెలుగులో ఈ సినిమాకి మంచి స్పందన వస్తోందని యూనిట్ పేర్కొంది. ఈ సందర్భంగా టీజే జ్ఞానవేల్ పంచుకున్న విశేషాలు.→ ‘జైలర్’ సినిమా తర్వాత రజనీకాంత్గారి కుమార్తె సౌందర్య నాతో ‘మా నాన్నకి సరి΄ోయే కథలు ఉన్నాయా’ అని అడిగారు. రజనీకాంత్గారు నా శైలిని అర్థం చేసుకుని, కావాల్సినంత క్రియేటివ్ ఫ్రీడమ్ ఇచ్చారు. నిజ జీవిత ఎన్కౌంటర్ల నుంచి స్ఫూర్తి పొంది ‘వేట్టయాన్: ది హంటర్’ కథ రాశాను. అయితే ఈ చిత్రంలో అనేక అంశాలపై లోతుగా చర్చించినప్పటికీ రజనీకాంత్గారి అభిమానులు ఇష్టపడే ఆ ఐకానిక్ మూమెంట్స్ను పెట్టడం, ఈ కథకి ఆయన స్టైల్, మేనరిజమ్ను జోడించడం నాకు సవాల్గా అనిపించింది. → దేశవ్యాప్తంగా జరిగిన ఎన్కౌంటర్ హత్యల గురించి అనేక వార్తలు చదివాను. ఎర్రచందనం స్మగ్లర్లు అంటూ చెట్లు నరికే వారిని ఎన్కౌంటర్ చేసిన ఘటన నన్ను కదిలించింది. పేదలు తరచూ ఇటువంటి ఎన్కౌంటర్ల బాధితులవుతున్నారని, సంపన్నులు తప్పించుకుంటున్నారని నా పరిశోధనల్లో తెలిసింది. ఎన్కౌంటర్లలో ఎంత వాస్తవం ఉంది? అసలు ఇలా చేయడం కరెక్టేనా? నిజమైన దోషులనే శిక్షిస్తున్నామా? అనే వాటిని ‘వేట్టయాన్: ది హంటర్’లో చూపించాను. విద్యా వ్యవస్థ లోపాలను కూడా టచ్ చేశాం. → ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, రజనీకాంత్గార్లను బ్యాలెన్స్ చేయడంపై దృష్టి పెట్టలేదు. వారి పాత్రల భావజాలాన్ని బ్యాలెన్స్ చేయడంపైనే దృష్టి పెట్టాను. ΄్యాట్రిక్ పాత్రకు ఫాహద్ ఫాజిల్ కరెక్ట్ అనిపించింది. అలాగే నటరాజ్ పాత్రని రాస్తున్నప్పుడు రానా దగ్గుబాటినే అనుకున్నాను. అనిరుథ్ రవిచందర్ అద్భుతమైన సంగీతం, నేపథ్య సంగీతం అందించాడు. ‘వేట్టయాన్: ది హంటర్’ సినిమాకి ప్రీక్వెల్ చేయాలనే ఆలోచన ఉంది. ఇక నవంబరు మొదటి వారంలో నా కొత్త సినిమాల గురించి చెబుతాను. -
'వేట్టయాన్' భారీ ఆఫర్.. టికెట్ల రేట్లు తగ్గింపు
సూపర్స్టార్ రజనీకాంత్ నటించిన ‘వేట్టయాన్’ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో సత్తా చాటుతుంది. ఇప్పటి వరకు సుమారు రూ. 300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. దసరా సెలవులు ఈ చిత్రానికి బాగా కలిసొచ్చాయని చెప్పవచ్చు. అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రాన్ని TJ జ్ఞానవేల్ తెరకెక్కించారు. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్తో నిర్మించింది. ఈ సినిమాలో మంజు వారియర్, ఫహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, కిశోర్, అభిరామి, రితికా సింగ్, దుషారా విజయ్, రోహిణి ముఖ్యపాత్రల్లో కనిపించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.దసరా సెలవులు ముగియడంతో వేట్టయాన్ సినిమా టికెట్ల రేట్లు తగ్గించారు. ఈమేరకు అధికారికంగా తెలిపారు. ఈ రేట్లు అక్టోబర్ 18 నుంచి అందుబాటులోకి రానున్నాయి. దీంతో వేట్టయాన్కు మళ్లీ కలెక్షన్స్ పెరిగే ఛాన్స్ ఉంది. మల్టీ ప్లెక్స్లలో రూ. 200, సిటీ సింగిల్ స్క్రీన్లలో రూ. 150, డిస్ట్రిక్ట్ సింగిల్ థియేటర్లలో రూ. 110గా టికెట్ రేట్లు ఉండనున్నాయి. అయితే, ఈ ఆఫర్ తెలంగాణలో మాత్రమే ఉండనుంది. ఏసియన్ ఎంటర్టైన్మెంట్, దిల్ రాజు సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేశారు. సీడెడ్ ఏరియాలో మాత్రం శ్రీ లక్ష్మీ మూవీస్ రిలీజ్ చేశారు.కథేంటంటే.. ఎస్పీ అదియన్ (రజనీకాంత్) ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. తప్పు చేసిన వాళ్లకు వెంటనే శిక్ష పడాలని భావిస్తాడు. అతనికి ఓ దొంగ ఫ్యాట్రిక్ (ఫహద్ ఫాజిల్) సహాయం చేస్తుంటాడు. ఓ సారి స్కూల్ టీచర్ శరణ్య(దుషారా విజయన్)ఇచ్చిన ఫిర్యాదుతో గంజాయి మాఫియా లీడర్ని అదియన్ ఎన్కౌంటర్ చేస్తాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు శరణ్య హత్యకు గురవుతుంది. ఓ వ్యక్తి స్కూల్లోనే ఆమెను హత్యాచారం చేసి దారుణంగా చంపేస్తాడు. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఎస్సీ హరీశ్ కుమార్(కిశోర్)కి అప్పగిస్తారు.ఈ కేసులో బస్తీకి చెందిన యువకుడు గుణను అరెస్ట్ చేయగా.. తప్పించుకొని పారిపోతాడు. దీంతో ఉపాధ్యాయ సంఘాలతో సామాన్య ప్రజల నుంచి కూడా తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. దీంతో డీజీడీ శ్రీనివాస్(రావు రమేశ్) ఈ కేసును ఎస్పీ అదియన్కి అప్పగిస్తాడు. ఆయన 48 గంటల్లోనే గుణను పట్టుకొని ఎన్కౌంటర్ చేస్తాడు. ఇది బూటకపు ఎన్కౌంటర్ అంటూ మానవ హక్కుల సంఘం కోర్టు మెట్లు ఎక్కగా.. సీనియర్ న్యాయమూర్తి సత్యదేవ్(అమితాబ్ బచ్చన్) నేతృత్వంలో విచారణ కమిటీ వేస్తారు. సత్యమూర్తి విచారణలో గుణ ఈ హత్య చేయలేదని తెలుస్తుంది. మరి శరణ్యను హత్య చేసిందెవరు? ఎందుకు చేశారు? హంతకుడిని ఎస్పీ అదియన్ ఎలా కనిపెట్టాడు? ఈ కథలో రానా దగ్గుబాటి పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే -
'వేట్టయాన్'కు ఎవరి రెమ్యునరేషన్ ఎంత..?
సూపర్స్టార్ రజనీకాంత్ నటించిన ‘వేట్టయాన్’ బాక్సాఫీస్ వద్ద వీకెండ్లో మంచి కలెక్షన్లతో సత్తా చాటుతుంది. TJ జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ముఖ్యంగా మూడు దశాబ్దాల తర్వాత ఈ ఇద్దరు సినీ దిగ్గజాలు రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ ఈ ప్రాజెక్ట్లో భాగమయ్యారు. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్తో నిర్మించింది. ఈ సినిమాలో మంజు వారియర్, ఫహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, కిశోర్, అభిరామి, రితికా సింగ్, దుషారా విజయ్, రోహిణి ముఖ్యపాత్రల్లో కనిపించారు. అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం ఈ సినిమాకు ప్లస్గా మారింది.‘వేట్టయాన్’ సినిమాను సుమారు రూ. 300 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించారు. అయితే, కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 148 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఈ చిత్రం కోసం రజనీకాంత్ రూ. 125 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటే.. అమితాబ్ బచ్చన్ మాత్రం కేవలం రూ. 7 కోట్లు తీసుకున్నట్లు ఒక వార్త ట్రెండ్ అవుతుంది. బచ్చన్ కంటే తలైవా 17 రెట్లు ఎక్కువ పారితోషికం అందుకున్నారని తెలుస్తోంది. ఇద్దరూ సూపర్ స్టార్స్గా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. అయితే, రెమ్యునరేషన్లో ఇంత వ్యత్యాసం ఉండటంతో ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.సపోర్టింగ్ కాస్ట్ రెమ్యూనరేషన్వేట్టయాన్ సినిమాలో చాలామంది స్టార్స్ సపోర్టింగ్ రోల్స్లో మెప్పించారు. మలయాళ స్టార్ నటుడు ఫహాద్ ఫాజిల్ ఈ చిత్రం కోసం రూ. 3కోట్లు రెమ్యునరేషన్గా తీసుకుంటే.. మంజు వారియర్ ఆమె పాత్ర కోసం రూ. 2.5 కోట్లు అందుకున్నట్లు సమాచారం. అయితే, టాలీవుడ్ స్టార్ రానా దగ్గుబాటి మాత్రం తన రోల్ కోసం రూ.5 కోట్లు ఛార్జ్ చేశారట. వేట్టయాన్లో తనదైన స్టైల్లో దుమ్మురేపిన రితికా సింగ్ మాత్రం కేవలం రూ. 25 నుంచి 35 లక్షలు మాత్రమే తీసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. -
రజనీకాంత్ "వేట్టయన్" మూవీ రివ్యూ
టైటిల్: ‘వేట్టయన్- ది హంటర్’నటీనటులు:రజనీకాంత్, అమితాబ్ బచ్చన్, మంజు వారియర్, ఫాహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, రోహిణి, అభిరామి, రితికా సింగ్, దుషారా విజయన్ తదితరులునిర్మాణ సంస్థ: లైకా ప్రొడక్షన్స్ దర్శకత్వం: టి.జె.జ్ఞానవేల్సంగీతం:అనిరుధ్ రవిచందర్సినిమాటోగ్రఫీ: ఎస్.ఆర్.కదిర్ఎడిటర్: ఫిలోమిన్ రాజ్విడుదల తేది: అక్టోబర్ 10, 2024కథేంటంటే.. ఎస్పీ అదియన్ (రజనీకాంత్) ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. తప్పు చేసిన వాళ్లకు వెంటనే శిక్ష పడాలని భావిస్తాడు. అతనికి ఓ దొంగ ఫ్యాట్రిక్ (ఫహద్ ఫాజిల్) సహాయం చేస్తుంటాడు. ఓ సారి స్కూల్ టీచర్ శరణ్య(దుషారా విజయన్)ఇచ్చిన ఫిర్యాదుతో గంజాయి మాఫియా లీడర్ని అదియన్ ఎన్కౌంటర్ చేస్తాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు శరణ్య హత్యకు గురవుతుంది. ఓ వ్యక్తి స్కూల్లోనే ఆమెను హత్యాచారం చేసి దారుణంగా చంపేస్తాడు. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఎస్సీ హరీశ్ కుమార్(కిశోర్)కి అప్పగిస్తారు. ఈ కేసులో బస్తీకి చెందిన యువకుడు గుణను అరెస్ట్ చేయగా.. తప్పించుకొని పారిపోతాడు. దీంతో ఉపాధ్యాయ సంఘాలతో సామాన్య ప్రజల నుంచి కూడా తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. దీంతో డీజీడీ శ్రీనివాస్(రావు రమేశ్) ఈ కేసును ఎస్పీ అదియన్కి అప్పగిస్తాడు. ఆయన 48 గంటల్లోనే గుణను పట్టుకొని ఎన్కౌంటర్ చేస్తాడు. ఇది బూటకపు ఎన్కౌంటర్ అంటూ మానవ హక్కుల సంఘం కోర్టు మెట్లు ఎక్కగా.. సీనియర్ న్యాయమూర్తి సత్యదేవ్(అమితాబ్ బచ్చన్) నేతృత్వంలో విచారణ కమిటీ వేస్తారు. సత్యమూర్తి విచారణలో గుణ ఈ హత్య చేయలేదని తెలుస్తుంది. మరి శరణ్యను హత్య చేసిందెవరు? ఎందుకు చేశారు? హంతకుడిని ఎస్పీ అదియన్ ఎలా కనిపెట్టాడు? ఈ కథలో రానా దగ్గుబాటి పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..'సత్వర న్యాయం'పేరుతో పోలీసులు చేసే ఎన్కౌంటర్లు ఎంతవరకు కరెక్ట్? అనే సీరియస్ పాయింట్తో వేట్టయన్ అనే సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు జ్ఞానవేల్. జైభీమ్ సినిమా మాదిరే ఇందులో కూడా పేదవాడికి జరుగుతున్న అన్యాయాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపించాడు. అలా అని ఈ సినిమా కథనం జైభీమ్ మాదిరి నెమ్మదిగా, ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా సాగదు. రజనీకాంత్ ఫ్యాన్స్కి కావాల్సిన మాస్ ఎలిమెంట్స్ అన్ని ఈ చిత్రంలో ఉన్నాయి. అయితే ఎమోషనల్గా మాత్రం ఈ చిత్రం ఆకట్టుకోలేకపోయింది. ఈ కథలో చాలా డెప్త్ ఉంది. కేవలం ఎన్కౌంటర్పై మాత్రమే కాకుండా ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న విద్య దోపిడిపై కూడా దర్శకుడు ఈ చిత్రంలో చర్చించాడు. స్మార్ట్ ఎడ్యుకేషన్ పేరుతో ప్రైవేట్ సంస్థలు పేద విద్యార్థులను ఎలా దోచుకుంటున్నాయి? అనేది తెరపై కళ్లకు కట్టినట్లుగా చూపించాడు. కానీ ప్రేక్షకులను ఎమోషనల్గా కనెక్ట్ అయ్యేలా చేయడంలో విఫలం అయ్యాడు. బలమైన భావోధ్వేగాలు పండించే సీన్లను కూడా సింపుల్గా తీసేశారు. విలన్ పాత్రను కూడా బలంగా రాసుకోలేకపోయాడు. అలాగే ఉత్కంఠను పెంచే సన్నివేశాలేవి ఇందులో ఉండవు. పోలీసుల ఇన్వెస్టిగేషన్ కూడా అంతగా ఆకట్టుకోదు. కొన్ని చోట్ల రజనీకాంత్ తనదైన మ్యానరిజంతో ఆ తప్పులను కప్పిపుచ్చాడు. ఇంటర్వెల్కి 20 నిమిషాల ముందు వరకు కథనం సాదాసీదాగా సాగినా.. పహద్ పాత్ర చేసే చిలిపి పనులు, రజనీకాంత్ మాస్ ఎలిమెంట్స్తో ఫస్టాఫ్ బోర్ కొట్టదు. ఇంటర్వెల్ బ్యాంగ్ ఆకట్టుకుటుంది. ఇక సెకండాఫ్లోనే మెయిన్ స్టోరీ అంతా ఉంటుంది. అయితే బలమైన సీన్లు లేకపోవడంతో కొన్ని చోట్ల బోర్ కొడుతుంది. క్లైమాక్స్ బాగున్నా.. ‘పేదవాడిని అయితే ఎన్కౌంటర్ చేస్తారు కానీ డబ్బున్న వాడిని చేయరు’ అని అమితాబ్ పాత్రతో డైరెక్టర్ చెప్పించిన డైలాగ్కి ‘న్యాయం’ జరగలేదనిపిస్తుంది. ఎవరెలా చేశారంటే.. రజనీకాంత్ మ్యానరిజం, స్టైల్ని దర్శకుడు జ్ఞానవేల్ కరెక్ట్గా వాడుకున్నాడు. అభిమానులు అతన్ని తెరపై ఎలా చూడాలనుకుంటారో అలాగే ఎస్పీ అదియన్ పాత్రను తీర్చిదిద్దాడు. ఆ పాత్రకు రజనీ పూర్తి న్యాయం చేశాడు. వయసుతో సంబంధం లేకుండా తెరపై స్టైలీష్గా కనిపించాడు. ‘గురి పెడితే ఎర పడాల్సిందే’అంటూ ఆయన చేసే యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటాయి. ఇక న్యాయమూర్తి సత్యదేవ్గా అమితాబ్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. తెరపై హుందాగా కనిపిస్తాడు. అదియన్ భార్యగా మంజువారియర్ పాత్ర పరిది తక్కువే అయినా ఉన్నంతలో చక్కగా నటించింది. ఇక ఫహద్ ఫాజిల్ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాలి. అదియన్ తర్వాత అందరికి గుర్తుండే పాత్ర ప్యాట్రిక్. ఒకప్పుడు దొంగగా ఉండి ఇప్పుడు పోలీసులకు సహాయం చేసే ప్యాట్రిక్ పాత్రలో ఫహద్ ఒదిగిపోయాడు. రానా విలనిజం పర్వాలేదు. కానీ ఆ పాత్రను మరింత బలంగా రాసి ఉంటే బాగుండేది. రోహిణి, అభిరామి, రితికా సింగ్, దుషారా విజయన్ తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమాగా బాగుంది. అనిరుధ్ నేపథ్య సంగీతం బాగుంది. ‘మనసిలాయో’ పాట మినహా మరేవి అంతగా గుర్తుండవు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
వారం రోజులు అక్కర్లేదు!
‘‘ఖైదు చెయ్ ఖైదు చెయ్... నేరస్తుణ్ణి ఖైదు చెయ్... ఖైదు చెయ్ ఖైదు చెయ్... నేరస్తుణ్ణి ఖైదు చెయ్’’ అంటూ మొదలవుతుంది ‘వేట్టయాన్: ద హంటర్’ సినిమా తెలుగు ట్రైలర్. రజనీకాంత్ హీరోగా ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వేట్టయాన్’. అమితాబ్ బచ్చన్, ఫాహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్, రితికా సింగ్ ఇతర లీడ్ రోల్స్లో నటించారు. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ నిర్మించిన ఈ చిత్రం తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో ఈ నెల 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘వేట్టయాన్’ ట్రైలర్ను బుధవారం విడుదల చేశారు. ‘ఈ దేశంలో ఆడపిల్లలకు భద్రత లేదు. కానీ పోరంబోకులకు బాగా భద్రత ఉంది’, ‘నేరస్తుణ్ణి వెంటనే పట్టుకోవాలి. అందుకు ఏ యాక్షన్ అయినా తీసుకోండి’, ‘ఒక వారంలో ఎన్కౌంటర్ జరిగిపోవాలి’ (రావు రమేశ్), ‘అక్కర్లేదు సార్... వారం రోజులు అక్కర్లేదు... మూడే రోజుల్లో డిపార్ట్మెంట్కు మంచి పేరు వస్తుంది’ (రజనీకాంత్), ‘కాలం విలువ తెలిసిన మనిషి మాత్రమే ఏదైనా సాధించగలడు’ (రానా), ‘న్యాయం అన్యాయం అయినప్పుడు న్యాయంతోనే సరిచేయాలి. అంతేకానీ... ఇంకో అన్యాయంతో కాదు’ (అమితాబ్ బచ్చన్), ‘నన్ను ఏ పోస్ట్లోకి తిప్పికొట్టినా నేను మాత్రం పోలీస్వాడినే సార్... నా నుంచి వాడిని కాపాడటం ఎవ్వరి వల్ల కాదు (రజనీకాంత్)’ అన్న డైలాగ్స్ ఈ ట్రైలర్లో ఉన్నాయి. -
మరో ఛాన్స్ ఇస్తానని దర్శకుడు మాటిచ్చాడు: మంజు వారియర్
మలయాళ భామ మంజు వారియర్కు కోలీవుడ్లో అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయనే చెప్పాలి. మాతృభాషలో అగ్ర కథానాయకిగా రాణిస్తున్న ఈ బ్యూటీ ధనుష్ భార్యగా అసురన్ చిత్రంతో కోలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించింది ఆ తర్వాత అజిత్ సరసన తుణివు (తెగింపు) చిత్రంలో యాక్షన్ హీరోయిన్గా నటించారు. అది మంచి విజయాన్ని సాధించింది. తాజాగా రజనీకాంత్ సరసన వేట్టైయాన్ చిత్రంలో నటించారు. ఈ చిత్రం అక్టోబర్ 10వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెరపైకి రానుంది. కాగా ఇందులో రజనీకాంత్తో కలిసి 'మనసిలాయో' అనే కలర్ ఫుల్ సాంగ్లో అదిరిపోయే స్టెప్పులు వేశారు. ఈ క్రమంలో తాజాగా నటుడు విజయ్ సరసన నటించడానికి సిద్ధమవుతున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో అవుతోంది. రాజకీయ పార్టీని ప్రారంభించిన విజయ్ చివరిగా తన 69వ చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కెవిఎన్ పిక్చర్స్ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది. అక్టోబర్ నెలలో ఈ చిత్రం సెట్ పైకి వెళ్లనుంది. ఇది నటుడు విజయ్ రాజకీయ భవిష్యత్తుకు దోహదపడే విధంగా ఎంటర్టైన్మెంట్ అంశాలతో పాటు రాజకీయ నేపథ్యంలో సాగే కథా చిత్రంగా ఉంటుందని సమాచారం. ఇకపోతే ఇందులో నటించే హీరోయిన్ ఎవరన్న విషయంలో పెద్ద చర్చే జరుగుతోంది. నటీమణుల లిస్ట్ పెరుగుతోంది. ముఖ్యంగా నటి సమంత, శ్రీలీల, సిమ్రాన్, పూజా హెగ్డే పేర్లు ప్రచారంలో ఉన్నాయి. తాజాగా నటి మంజు వారియర్ పేరు వెలుగులోకి వచ్చింది. తుణివు చిత్రంలో నటిస్తున్నప్పుడే దర్శకుడు హెచ్ వినోద్ తనకు మరో చిత్రంలో అవకాశం కల్పిస్తానని చెప్పినట్లు నటి మంజు వారియర్ ఇటీవల ఓ భేటీలో పేర్కొన్నారు. దీంతో ఆమె విజయ్ సరసన నటించటం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో క్లారిటీ రావాలంటే చిత్రవర్గాలు అధికారికంగా ప్రకటించాల్సిందే. -
కబాలినే టెన్షన్ పెడ్తున్న హీరోయిన్స్...
-
రజనీకాంత్తో హుక్ స్టెప్.. డబుల్ హ్యాపీ: మంజు వారియర్
రజనీకాంత్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘వేట్టయాన్’. ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీని టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో సుభాస్కరన్ నిర్మించారు. ఇందులో అమితాబ్ బచ్చన్, రానా, ఫాహద్ ఫాజిల్, మంజు వారియర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ‘వేట్టయాన్’ చిత్రం దసరా సందర్భంగా అక్టోబరు 10న రిలీజ్ కానుంది. రీసెంట్గా ఈ సినిమా నుంచి ‘మెరుపై వచ్చాడే’ అంటూ సాగే ‘మనసిలాయో...’ సాంగ్ విడుదలైంది. ఈ పాటకు శ్రోతల నుంచి మంచి స్పందన లభించింది. అంతేకాదు... ఈ పాటలో అదిరి పోయే స్టెప్పులేసి మంజు వారియర్ స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచారు.(చదవండి: ఒక్కసారి ఫిక్స్ అయితే ఎంత కష్టపడటానికైనా రెడీ!)ఇక ‘వేట్టయాన్’ సినిమాలో తన పాత్ర గురించి మంజు వారియర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ– ‘‘మనసిలాయో...’ పాటకు శ్రోతల నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి సెలబ్రేషన్ సాంగ్ను నేను చాలా సినిమాల్లో చూశాను. ఇప్పుడు ఈ తరహా సాంగ్లో డ్యాన్స్ చేయడం నాకు చాలా సరదాగా అనిపించింది. అంతమంది డ్యాన్సర్స్ సెట్స్లో ఉన్నప్పుడు ఒకే రిథమ్లో హుక్ స్టెప్ చేయడం నాకు చాలా బాగా అనిపించింది.(చదవండి: ఆడది అబల కాదు సబల అని నిరూపించిన సినిమా)అలాగే అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్లో నేను చేసిన తొలి పాట కూడా ఇదే. ఇక జ్ఞానవేల్గారి ‘జై భీమ్’ సినిమా చూసిన తర్వాత ఆయన దర్శకత్వంలో ఓ సినిమా చేస్తే బాగుంటుందనిపించింది. ఆ సమయంలో ‘వేట్టయాన్’ సినిమాతో ఆయన నన్ను అ్రప్రోచ్ అయ్యారు. పైగా రజనీకాంత్గారు కూడా ఉంటారని చెప్పారు. దీంతో డబుల్ హ్యాపీ ఫీలయ్యాను. రజనీగారితో స్క్రీన్ షేర్ చేసుకోవడాన్ని గౌరవంగా భావిస్తున్నాను. ఈ చిత్రంలో నేను రజనీగారి భార్య తారగా కనిపిస్తాను. ఇంకా విజయ్ సేతుపతి ‘విడుదలై 2’, మోహన్లాల్ ‘ఎల్: ఎంపురాన్’ (లూసిఫర్ సీక్వెల్) చిత్రాల్లో నటిస్తున్నాను’’ అన్నారు. ఇక అక్టోబరులో ‘వేట్టయాన్’తో, డిసెంబరులో ‘విడుదలై 2’తో రెండు నెలల గ్యాప్తో తెరపై కనిపిస్తారు మంజు. -
రజినీకాంత్ కి షాక్ ఇచ్చిన మంజు వారియర్
-
త్రిష బాటలో మరో హీరోయిన్ రీఎంట్రీతో దుమ్మురేపుతున్న బ్యూటీ
-
ఛాన్సులే రావనుకుంటే రీఎంట్రీతో దుమ్మురేపుతున్న వెటరన్ బ్యూటీ
ప్రతిభ కలిగిన వారికి సినీ రంగంలో గ్యాప్ వస్తుందేమో గానీ, మళ్లీ రాణించడం మాత్రం పక్కా. ఇందుకు ఉదాహరణ నటి త్రిష. ఇండియన్ కథానాయకిగా పేరు గాంచిన ఈమె ఆ మధ్య వరుస పరాజయాలతో సతమతమయ్యారు. త్రిష పని అయిపోయిందీ అనే మాట కూడా చిత్ర వర్గాల్లో వినిపించింది. అలాంటిది పొన్నియిన్ సెల్వన్ చిత్రంతో ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగిశారు. అంతే ఇప్పటికీ విజయ్, అజిత్, కమలహాసన్ వంటి సీనియర్ స్టార్స్కు జంటగా నటిస్తూ బిజీగా ఉన్నారు. అదేవిధంగా తెలుగు, మలయాళం భాషల్లోనూ నటిస్తున్నారు.మలయాళ భామ మంజువారియర్ది దాదాపు ఇదే పరిస్థితి. ఈమె కూడా మలయాళంలో టాప్ హీరోయిన్గా వెలుగొందుతున్న సమయంలోనే నటుడు దిలీప్ను 1998లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తరువాత నటనకు గ్యాప్ ఇచ్చారు. వీరికి ఒక కూతురు కూడా ఉంది. అయితే ఆ తరువాత మనస్పర్థల కారణంగా భర్త నుంచి విడిపోయారు. అలా 15 ఏళ్ల తరువాత మంజువారియర్ నటిగా రీఎంట్రీ ఇచ్చారు. ఈ 46 ఏళ్ల బ్యూటీ ఇప్పుడు సీనియర్ నటులకు ఆప్షన్ కథానాయకిగా మారారు. తమిళంలో బిజీగా నటిస్తున్నారు.ఇదీ చదవండి: అమెరికా ఎన్నికల్లో వైరల్ అవుతున్న ఎన్టీఆర్ సాంగ్ఇంతకుముందు అజిత్కు జంటగా తుణివు. ధనుష్ సరసన అసురన్ చిత్రాలలో నటించారు. తాజాగా వెట్రిమారన్ దర్శకత్వంలో విడుదలై 2 చిత్రంలోనూ, రజనీకాంత్ సరసన వేట్టైయాన్ చిత్రంలోనూ నటించారు. వీటిలో వేట్టైయాన్ చిత్రం అక్టోబర్ 10న తెరపైకి రానుంది. ఈ చిత్రంలో రజనీకాంత్తో మంజువారియర్ స్టెప్స్ వేసిన పాట ఇటీవల విడుదలై సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అంతేకాకుండా ఈ పాటలో మంజువారియర్ చాలా గ్లామర్గా కనిపిస్తున్నారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. -
రమ్యకృష్ణ తర్వాత ఆ ఛాన్స్ మంజు వారియర్కు ఇచ్చిన రజనీకాంత్
సీనియర్ హీరోలు కమలహాసన్, రజనీకాంత్, అజిత్ వంటి వారు తమ వయసుకు తగ్గ కథాపాత్రల్లో నటించడం మొదలెట్టి చాలా కాలమే అయ్యింది. నటుడు విజయ్ కూడా లియో చిత్రంతో ఆ తరహా పాత్రల్లో నటించడం మొదలెట్టారు. అలాగు ఈ హీరోలు తమ వయసుకు తగ్గ హీరోయిన్లతోనే నటిస్తున్నారు. అలా నటుడు రజనీకాంత్ సమీపకాలంలో సీనియర్ నటీమణులతోనే నటిస్తున్నారు. ఈయన పీక్ టైమ్లో నటించలేని నేటి సీనియర్ నటీమణులు సిమ్రాన్, త్రిష, ఈశ్వరీరావు, రమ్యకృష్ణ వంటి వారికి ఇప్పుడు అవకాశాలు వరిస్తున్నాయి. కాగా తాజాగా నటుడు రజనీకాంత్ వేట్టైయాన్ అనే చిత్రాన్ని పూర్తి చేశారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జైభీమ్ చిత్రం ఫేమ్ జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ఇంతకు ముందు నటించని నటుడు ఫాహత్ఫాజిల్, రానా దగ్గుపాటి, నటి మంజువారియర్, రిత్వికా సింగ్, దుషారా విజయన్ తదితరులు నటిస్తున్నారు. ముఖ్యంగా నటుడు ఫాహత్ ఫాజిల్ చిత్రంలో రజనీకాంత్తో కలిసి చిత్రం అంతా ఉండే వినోదభరిత పాత్రలో నటించినట్లు సమాచారం. అలాగే నటి మంజువారియర్ ఇందులో రజనీకాంత్కు భార్యగా నటించనట్లు తనే ఒక కార్యక్రమంలో చెప్పారు. మలయాళంలో ప్రముఖ కథానాయకిగా రాణిస్తున్న ఈమె ఇంతకు ముందు తమిళంలో నటుడు అజిత్ సరసన తుణివు, ధనుష్కు జంటగా అసురన్ వంటి చిత్రాల్లో నటించారన్నది గమనార్హం. కాగా వేట్టైయాన్ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. -
నారి వారియర్
మంజు వారియర్....పేరులోనే కాదు ఆమె వేసే ప్రతి అడుగులో సాహసం ఉంటుంది. కళకు సామాజిక స్పృహ జోడించి ముందుకు వెళుతోంది. యాక్టర్, రైటర్, డ్యాన్సర్, బ్రాండ్ అంబాసిడర్, ప్రొడ్యూసర్, సోషల్ యాక్టివిస్ట్గా బహుముఖ ప్రజ్ఞను సొంతం చేసుకుంది... కేరళలోని తిరువనంతపురం కల్పాక అపార్ట్మెంట్ కాంప్లెక్స్లోని మహిళా సభ్యులు సొంతంగా కూరగాయలు పండించడం ప్రారంభించారు. అందరూ ఆశ్చర్యపోయేలా పెద్ద వెజిటెబుల్ గార్డెన్ను సృష్టించారు. ‘కల్పాక క్వీన్స్’గా పేరు గాంచారు. వెజిటెబుల్ గార్డెన్ సృష్టించడానికి కల్పాక క్వీన్స్కు ‘హౌ వోల్డ్ ఆర్ యూ’ అనే సినిమా స్ఫూర్తి ఇచ్చింది. సమాజాన్ని సినిమా ప్రభావితం చేస్తుందా? సినిమాను సమాజం ప్రభావితం చేస్తుందా?... అనే చర్చ మాట ఎలా ఉన్నా సమాజంపై సినిమా చూపే ప్రభావం తక్కువేమీ కాదు. మంచి లక్ష్యానికి మంచి సినిమా వెన్నుదన్నుగా నిలుస్తుంది. మంజు వారియర్ రీఎంట్రీ మూవీ ‘హౌ వోల్డ్ ఆర్ యూ’ ఈ కోవకు చెందిన సినిమానే. మంజు వారియర్ ఈ సినిమాలో నిరూపమ రాజీవ్ అనే పాత్ర పోషించింది. నిరూపమ రాజీవ్ అనే వివాహిత టెర్రస్ ఫార్మింగ్కు సంబంధించిన ప్రయాణం సినిమా మూల కథ. ‘స్త్రీలు తమలో ఉన్న శక్తి సామర్థ్యాలపై దృష్టి సారించి వెలికి తీస్తే ఎన్నో అద్భుతాలు సాధించవచ్చు అని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి’ అంటుంది వారియర్. ‘హౌ వోల్డ్ ఆర్ యూ’ సినిమా విడుదలైన తరువాత మంజు వారియర్ ఎక్కడికి వెళ్లినా మహిళలు దగ్గరికి వచ్చి ‘మీ సినిమా స్ఫూర్తితో టెర్రస్ ఫార్మింగ్ మొదలు పెట్టాం’ అని చెప్పేవాళ్లు. ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రాజెక్ట్ ‘కుటుంబశ్రీ’కి బ్రాండ్ అంబాసిడర్గా ఎంతో మంది మహిళలను ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు నడిపిస్తోంది మంజు వారియర్. పదిహేడు సంవత్సరాల వయసులో ‘సాక్ష్యం’ సినిమాతో మలయాళ చిత్రసీమలోకి అడుగు పెట్టిన వారియర్ ‘తూవల్’ ‘కొట్టరం’ ‘సల్లాపం’...మొదలైన సినిమాలతో నటిగా మంచి పేరు తెచ్చుకుంది. చిత్రసీమలోకి రావడానికి ముందు దూరదర్శన్ సీరియల్స్లో నటించింది. జెండర్–ఈక్వాలిటీని దృష్టిలో పెట్టుకొని కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘జెండర్ పార్క్’ ప్లాట్ఫామ్ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్న వారియర్ క్యాన్సర్ పేషెంట్ల కోసం హెయిర్ డొనేషన్ డ్రైవ్లను నిర్వహిస్తుంటుంది. ‘చతర్ముఖం’ అనే మలయాళం సినిమాతో నిర్మాతగా తొలి అడుగు వేసింది మంజు. అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్లో ఈ చిత్రానికి అద్భుతమైన స్పందన వచ్చింది. ‘సినిమా నిర్మాణంలో రిస్క్లు, బాధ్యతలు ఉంటాయి. నా చుట్టుపక్కల వాళ్ల సహకారంతో నిర్మాతగా ఎలాంటి సవాళ్లు, ఒత్తిడి ఎదుర్కోలేదు. ‘కాయట్టం’ సినిమాకు సహనిర్మాతగా ఉన్నప్పుడు చిత్ర నిర్మాణం గురించి సీరియస్గా ఆలోచించడం మొదలు పెట్టాను. నా జీవితంలో ఏది ప్లాన్ చేసుకోలేదు. ఆ సమయానికి ఏది ఆసక్తిగా ఉంటే అది చేస్తూ పోయాను. సినిమా నిర్మాణాన్ని నా జీవితంలో కొత్త ప్రయోగంగా భావిస్తాను’ అంటుంది మంజు వారియర్. క్లాసికల్ డ్యాన్సర్గా మంజు వారియర్ తెచ్చుకున్న పేరు తక్కువేమీ కాదు. స్కూల్లో చదువుకుంటున్న రోజుల నుంచి వారియర్ నాట్యప్రతిభ గురించి ప్రముఖ నాట్యకారుడు ఎన్వీ క్రిష్ణన్కు తెలుసు. ‘మంజు గిఫ్టెడ్ డ్యాన్సర్. మన దేశంలోని అద్భుతమైన భరతనాట్య కళాకారులలో ఆమె ఒకరు’ అంటాడు క్రిష్ణన్. భరతనాట్యంలో పేరు తెచ్చుకున్న మంజు వారియర్ తన కూతురు మీనాక్షి డ్యాన్స్ టీచర్ గీతా పద్మకుమారన్ నుంచి కూచిపూడి నాట్యం నేర్చుకుంది. ‘వారియర్కు కూచిపూడి నేర్పడం ఒక అద్భుత అనుభవం. తక్కువ సమయంలోనే డ్యాన్స్ నేర్చుకుంది. అద్భుతమై ఎక్స్ప్రెషన్స్ ఆమె సొంతం’ అంటుంది గీత. ‘సల్లాపం’ అనే పుస్తకంతో రైటర్గా కూడా తన ప్రతిభ చాటుకుంది వారియర్. ‘సల్లాపం’ తన జ్ఞాపకాల సమాహారం. వీణ వాయించడం నేర్చుకున్న వారియర్ ఎన్నో వీడియోలను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. మంజు వారియర్ బహుముఖ ప్రతిభకు మరోసారి ఫిదా అయ్యారు అభిమానులు. సంతోషమే నా బలం ప్రాజెక్ట్ సక్సెస్ అయినా ఫెయిల్ అయినా... ఫలితంతో సంబంధం లేకుండా ఎప్పుడూ సంతోషంగా ఉండడానికే ప్రయత్నిస్తాను. సంతోషమే నా బలం. నా జీవితంలో ఎప్పుడూ ఏది ప్లాన్ చేసుకోలేదు. అయితే మంచి విషయాలు నా దారిలో ముందుకు వచ్చి కనిపిస్తాయి. వాటితో కలిసి ప్రయాణిస్తాను. సాహిత్య కార్యక్రమాల్లో మాట్లాడడానికి ముందు నేను ఎక్కడికి వెళ్తున్నానో, ఏం చెప్పబోతున్నానో, ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో... ఇలా రకరకాలుగా ఆలోచిస్తుంటాను. – మంజు వారియర్ -
మాజీ భర్త గురించి ప్రశ్న.. క్లారిటీ ఇచ్చేసిన స్టార్ హీరోయిన్
మలయాళ స్టార్ హీరోయిన్ మంజూ వారియర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ఓ మాదిరిగా తెలుసు. సొంత భాషలో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు తమిళంలోనూ సీనియర్ హీరోల సరసన నటిస్తోంది. ధనుష్ 'అసురన్' మూవీతో కోలీవుడ్కు పరిచయమైన మంజు.. ఆ తర్వాత అజిత్తోనూ నటించి సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం రజనీకాంత్ కొత్త మూవీలో యాక్ట్ చేస్తోంది. (ఇదీ చదవండి: 12 ఏళ్ల తర్వాత విడాకులు తీసుకున్న హీరోయిన్.. కారణమేంటి?) ఇలా పలు సినిమాలతో బిజీగా ఉన్న మంజూ వారియర్.. గతంలో మలయాళ నటుడు దిలీప్ని పెళ్లి చేసుకుంది. కానీ మనస్పర్థల కారణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరు.. కొంతకాలం తర్వాత విడిపోయారు. వీరికి ఓ కొడుకు కూడా ఉన్నాడు. ప్రస్తుతం అతడు మంజూ వారియర్ దగ్గరే ఉంటున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన మాజీ భర్త గురించి మంజూ వారియర్కి ప్రశ్న ఎదురైంది. దీనికి సమాధానమిచ్చిన ఈ హీరోయిన్.. 'ఆ ఒక్కటి అడగొద్దు' అని క్లారిటీ ఇచ్చేసింది. తన బిడ్డతో కలిసి తాను చాలా సంతోషంగా ఉన్నానని, ఎవరి సహాయ సహకారాలు అవసరం లేదని అభిప్రాయపడింది. ప్రస్తుతం ఈమె తమిళంలో పాటు మలయాళ చిత్రాలు చేస్తూ బిజీగా ఉంది. (ఇదీ చదవండి: అందుకే ఇన్నేళ్ల తర్వాత బిడ్డకు జన్మనిచ్చాం: ఉపాసన) -
సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్.. విజయ్ సేతుపతికి జోడీగా మలయాళ బ్యూటీ
మలయాళ నటి మంజు వారియర్కు కోలీవుడ్లోకి అవకాశాలు వరుస కడుతున్నాయి. మాలీవుడ్లో ప్రముఖ కథానాయకిగా రాణించిన ఈ భామ అక్కడ ఒక సమస్యలో ఇరుక్కోవడంతో నటనకు చిన్న గ్యాప్ వచ్చింది. ఆ సమస్య నుంచి బయట పడడంతో మళ్లీ నటనపై దృష్టి సారించింది. ఇలా ధనుష్కు జంటగా అసురన్ చిత్రంలో నటించింది. ఆ చిత్రం విజయం సాధించడంతో మంజు వారియర్ ఇక్కడ మంచి మార్కెట్ వచ్చింది. ఆ తరువాత తుణివు తదితర చిత్రాల్లో నటించిన ఈమె తాజాగా రెండు తమిళ చిత్రాల్లో నటిస్తోంది. అందులో ఒకటి సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న 170 చిత్రం కాగా రెండోది విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటిస్తున్న విడుదలై 2. హాస్య నటుడు సూరిని హీరోగా పరిచయం చేస్తూ వెట్రిమారన్ దర్శకత్వం వహించిన విడుదలై చిత్రంలో విజయ్ సేతుపతి ప్రధాన పాత్రను పోషించిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం విడుదలై 2 చిత్ర షూటింగ్ జరుగుతోంది. తొలి భాగంలో నటుడు సూరి పాత్రకు ప్రాధాన్యతనిచ్చిన దర్శకుడు వెట్రిమారన్ రెండో భాగంలో విజయ్ సేతుపతి పాత్రను హైలైట్ చేసి షూటింగ్ను నిర్వహిస్తున్నారని తెలిసింది. కాగా ఇందులో ఆయనకు జంటగా నటి మంజు వారియర్ను ఎంపిక చేశారు. ఇందులో ఈమె పల్లెటూరి యువతిగా నటిస్తోంది. ఈ జంటకు సంబంధించిన సన్నివేశాలను దర్శకుడు ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు. విడుదలై 2 చిత్రాన్ని 2024లో సమ్మర్ స్పెషల్గా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. -
రజనీకాంత్ సినిమాలో యంగ్ హీరోయిన్స్కు ఛాన్స్
నటుడు రజినీకాంత్ జైలర్ చిత్ర విజయాన్ని బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా ఈ చిత్ర 50 రోజుల వేడుకల్లోనూ పాల్గొన్నారు. తర్వాత తన 170వ చిత్రానికి రెడీ అవుతున్నారు. దీన్ని లైకా ప్రొడక్షనన్స్ సంస్థ భారీ ఎత్తున నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. దీనికి జైభీమ్ చిత్రం టీజే. జ్ఞానవేల్ కథ దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఇది ఒక యదార్థ సంఘటన ఆధారంగా రూపొందిస్తున్న చిత్రమని ఆయన ఇదివరకే తెలిపారు. ఇందులో రజనీకాంత్ మరోసారి పోలీస్ అధికారిగా నటించటానికి సిద్ధమవుతున్నారు. (ఇదీ చదవండి: మీనాక్షి చౌదరి ఫేట్ మార్చేసిన మహేశ్ బాబు) ఆ మధ్య దర్బార్ చిత్రంలో పోలీస్ అధికారిగా నటించిన రజనీకాంత్ ఇటీవల విడుదలైన జైలర్ చిత్రంలో జైలు అధికారిగా నటించిన విషయం తెలిసిందే. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రంలో పనిచేసే నటీనటులు సాంకేతిక వర్గం గురించి రోజుకో ప్రకటన విడుదల చేస్తూ వెల్లడిస్తున్నారు. అలా ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందించినట్లు తెలిపారు. జైలర్ వంటి సూపర్ హిట్ తర్వాత మళ్లీ రజనీకాంత్, అనిరుధ్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం కావడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. తాజాగా ఇందులో నటి దుషారా విజయన్, రిత్విక సింగ్ వంటి యంగ్ హీరోయిన్స్ నటించనున్నట్లు ప్రకటించారు. కాగా ఇందులో రజనీకాంత్ సరసన మలయాళ నటి మంజు వారియర్ నటించనున్నట్లు ప్రచారం జరుగుతుంది. దీంతో ఈ క్రేజీ చిత్రంపై ఇప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా రజనీకాంత్ ముఖ్యపాత్రను పోషించిన లాల్ సలామ్ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని దీపావళికి తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. విష్ణు విశాల్, విక్రాంత్ నటించిన ఈ చిత్రానికి రజనీకాంత్ పెద్దకూతురు ఐశ్వర్య దర్శకురాలు కావడం గమనార్హం. -
పాన్ ఇండియాను టార్గెట్ చేసిన ఆర్య
కోలీవుడ్ నటుడు ఆర్య కథానాయకుడిగా నటిస్తున్న నూతన చిత్రం 'మిస్టర్ ఎక్స్'. గతేడాదిలో విడుదల అయిన 'కెప్టెన్' సినిమా అంతగా మెప్పించలేదు. ఆ సినిమా తర్వాత వస్తున్న 'మిస్టర్ ఎక్స్' సినిమాను పాన్ ఇండియా రేంజ్లో విడుదల చేసి హిట్ కొట్టాలని ప్లాన్లో ఆయన ఉన్నారు. ఇందులో నటుడు గౌతమ్ కార్తీక్ ప్రతి నాయకుడిగా నటించడం విశేషం. నటుడు శరత్ కుమార్, నటి మంజూవారియర్, తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇంతకు ముందు ఎఫ్ఐఆర్ వంటి సక్సెస్ ఫుల్ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన ఆనంద్నే ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహిస్తున్నారు. (ఇదీ చదవండి: అవమానాలు భరించి వెండితెరపై సత్తా చాటిన అల్లు అర్జున్) ప్రిన్స్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. దౌనోకి దీపు నీనన్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. కొంతమంది వల్ల దేశానికి ప్రమాదం ఏర్పడితే దేశాన్ని రక్షించే హీరోగా అర్య కనిపించనున్నారు.చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది విభిన్న యాక్షన్ థ్రిల్లర్ కథాచిత్రంగా ఉంటుందన్నారు. ముఖ్య సన్నివేశాలను ఉగాండా, సిరియా దేశాల్లో చిత్రీకరించనున్నట్లు చెప్పారు. కాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ను చిత్ర వర్గాలు విడుదల చేశాయి. మిస్టర్ ఎక్స్ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను తదుపరి వెల్లడించనున్నట్లు దర్శకుడు చెప్పారు. -
ఒక్క సినిమా.. నాలుగు భాషలు.. ఐదుగురు స్టార్స్!
సూపర్స్టార్ రజినీకాంత్ 'జైలర్' రిలీజ్కు రెడీగా ఉంది. ఆగస్టు 10న థియేటర్లలోకి రానుంది. ట్రైలర్, పాటలు చూస్తుంటే ఈసారి తలైవా హిట్ కొట్టేలా కనిపిస్తున్నారు. ఈ సినిమా గురించి అలా వదిలేస్తే.. రజినీ తర్వాత మూవీ కోసం భారీ సెటప్ సిద్ధమవుతోంది. యాక్టర్స్, టెక్నీషియన్స్, ప్లానింగ్ అదీ చూస్తుంటే పెద్దగానే కనిపిస్తుంది. ప్రస్తుతం ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది. స్టార్స్ ఎవరెవరు? రజినీకాంత్ గత కొన్నేళ్లుగా ఒకే మూసలో సినిమాలు చేస్తున్నారు. వీటిలో ఒక్కటి కూడా సక్సెస్ కాలేదని చెప్పొచ్చు. 'జైలర్' మీద పెద్దగా అంచనాల్లేవు. కానీ ఏం జరుగుతుందో చూడాలి. దీని తర్వాత 'జై భీమ్' ఫేమ్ దర్శకుడు టీజే జ్ఞానవేల్ తో కలిసి ఓ మూవీ చేయబోతున్నారు. ఈ న్యూస్ ఎప్పుడో బయటకొచ్చింది. అయితే ఇందులో రజినీతోపాటు అమితాబ్ బచ్చన్(హిందీ), ఫహాద్ ఫాజిల్, మంజు వారియర్(మలయాళం), నాని (తెలుగు) కూడా కీలకపాత్రల్లో నటించబోతున్నారట. (ఇదీ చదవండి: రెండు వారాల్లోనే ఓటీటీలోకి థ్రిల్లర్ సినిమా.. కాకపోతే!) నిజమైతే మాత్రం! ప్రస్తుతానికి రూమర్ అయినప్పటికీ.. దాదాపు ఇదే నిజం కావొచ్చని తెలుస్తోంది. అయితే ఒక్క సినిమాలో ఇంతమంది అద్భుతమైన స్టార్స్ ఉన్నారనే విషయం ఇప్పుడు అన్ని ఇండస్ట్రీల్లో చర్చనీయాంశంగా మారింది. అలానే ఈ మూవీ కాన్సెప్ట్ కూడా సమ్థింగ్ డిఫరెంట్ అనేలా ఉంది. దశాబ్దాల క్రితం దేశంలో సంచలనం రేపిన ఓ ఎన్కౌంటర్ ఆధారంగా ఈ సినిమా తీయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ గురించి మరో రెండు వారాల్లో ప్రకటన రానుందని సమాచారం. అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్ కాగా, సెప్టెంబరు నుంచి షూటింగ్ మొదలు కానున్నట్లు తెలుస్తోంది. ఇందులో రజినీ పోలీస్ గా కనిపిస్తారట. అందులో భాగంగా తాజాగా హెయిర్ కట్ చేయించుకుని లుక్ మార్చేశారు. నానికి లక్కీ ఛాన్స్? ఒకవేళ ఈ రూమర్స్ గనుక నిజమైతే మాత్రం తెలుగు హీరో నాని లక్కీ ఛాన్స్ కొట్టేసినట్లే. ఎందుకంటే రజినీకాంత్, అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్స్తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం రావడం అంటే ఆషామాషీ విషయం కాదు. ఒకవేళ ఇది నిజమైతే నాని.. పాన్ ఇండియా ఆశలు కూడా నెరవేరుతాయని చెప్పొచ్చు. మరి ఈ న్యూస్పై ఫుల్ క్లారిటీ రావాల్సి ఉంది. (ఇదీ చదవండి: 'జైలర్'.. ఆ హాలీవుడ్ సినిమాకు కాపీనా?) -
ప్లాన్ మారింది.. స్టార్ హీరోయిన్ వచ్చింది!
విజయ్ సేతుపతి పేరు చెప్పగానే వైర్సటైల్ నటుడు అనే పదం గుర్తొస్తుంది. ఎందుకంటే హీరో అని మాత్రమే కాకుండా విలన్, సైడ్ క్యారెక్టర్స్, గెస్ట్ రోల్స్.. ఇలా ఒకటేమిటి ప్రతిదీ చేస్తూ ప్రేక్షకులకు బాగా దగ్గరైపోతున్నాడు. ప్రస్తుతం అటు సినిమాలు.. ఇటు ఓటీటీలో వెబ్ సిరీసులు అన్నీ కవర్ చేస్తున్నాడు. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 22 సినిమాలు) ఈ ఏడాది విజయ్ సేతుపతి నటించిన సినిమాల్లో 'విడుదలై-1' ఒకటి. కమెడియన్ సూరిని హీరోగా పరిచయం చేస్తూ వెట్రిమారన్ తీసిన మూవీ ఇది. ఇందులో సేతుపతి నటించాడు కాకపోతే ఒకటి రెండు సీన్లకే పరిమితం చేశారు. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందిస్తున్నట్లు చాలారోజుల క్రితమే ప్రకటించారు. రెండో భాగాన్ని చాలావరకు షూట్ చేసిన వెట్రిమారన్.. ఇప్పుడు చిన్నచిన్న మార్పులు, చేర్పులు చేసి మళ్లీ చిత్రీకరణ జరుపుతున్నాడట. సీక్వెల్లో విజయ్ సేతుపతికి జోడీని చేర్చారు. ఆ పాత్రని మలయాళ నటి మంజు వారియర్ చేస్తున్నారు. ఈ జంటకి సంబంధించిన సీన్స్ని చిరుమలై ప్రాంతంలో తీస్తున్నారు. త్వరలో థియేటర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయబోతున్నారని సమాచారం. (ఇదీ చదవండి: వివాదంలో 'బిగ్ బాస్'.. మొదలవడానికి ముందే!) -
బీఎండబ్ల్యూ అంటే... బ్యూటీఫుల్ మంజు వారియర్!
అందాల కథానాయిక మంజు వారియర్కు బైక్ రైడింగ్ సాహసాలు అంటే ఇష్టం. తాజాగా ఒక అడవిలో తన బీఎండబ్ల్యూ బైక్ రైడింగ్కు సంబంధించిన ఫోటోలను ‘యూ గాట్ ఇట్ గర్ల్’ కాప్షన్తో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తే వైరల్ అయ్యాయి. సెలబ్రిటీ–నాన్ సెలబ్రిటీ అనే తేడా లేకుండా మంజు వారియర్ను ప్రశంసలతో ముంచెత్తారు. ‘ఐరన్ గర్ల్ ఆఫ్ సౌత్ ఇండియా’ ‘వావ్ అమేజింగ్. కీప్ ఇట్ అప్’లాంటి ప్రశంసల మాట ఎలా ఉన్నా, కొద్దిమంది మాత్రం మంజూకు జాగ్రత్తలు కూడా చెప్పారు. ‘నేను కూడా రైడర్ని. మీకు ఒక సలహా ఇవ్వాలనుకుంటున్నాను. ఫుల్ఫేస్ హెల్మెట్ ధరించండి’ అని శ్రీరామ్గోపాలక్రిష్ణన్ అనే యాజర్ సలహా ఇచ్చారు. మరి కొందరు ఫారెస్ట్ ఏరియాలో ఎలాంటి రైడింగ్ బూట్స్ ధరించాలనే దాని గురించి చెప్పారు. బైక్ రైడింగ్లో మంజు వారియర్కు హీరో అజిత్ స్ఫూర్తి. ఆయనతో కలిసి బైక్ రైడింగ్ చేస్తుంటుంది. -
Social Hulchul: అందాల ప్రదర్శనలో అనుపమతో తమన్నా పోటీ
► బ్లాక్ డ్రెస్లో డోస్ పెంచుతున్న అనుపమ పరమేశ్వరన్.. ఘాటైన పోజులతో లేటెస్ట్ ఫోటలు వైరల్ ► భూమిపై నిజమైన స్వర్గం ఇదేనేమో అంటూ.. కుటుంబంతో పాటు స్నేహితులతో ఎంజాయ్ చేస్తున్న హనీరోజ్ ► ఎవర్గ్రీన్ అందంతో మెరిసిపోతున్న టబు ► లగ్జరీ బైక్పై సింగిల్గా రైడ్ చేస్తూ తగ్గేదెలే అంటున్న మంజు వారియర్ ►లస్ట్ స్టోరీస్-2 వెబ్ సిరీస్ ఫోటో షూట్లో రెచ్చిపోయిన తమన్నా View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) View this post on Instagram A post shared by Manju Warrier (@manju.warrier) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Suhasini Hasan (@suhasinihasan) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) -
లగ్జరీ బైక్పై హీరోయిన్ సందడి, లుక్స్లో ఎక్కడా తగ్గేదెలే!
గత నెలలో టూ వీలర్ లైసెన్స్ టెస్టుకు హాజరై వార్తల్లో నిలిచిన మంజు వారియర్, తాజాగా రూ. 21 లక్షల బైక్ కొనుగోలు చేసి మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా నిలిచింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో వైరల్ అయ్యాయి. తునివు సినిమాలో అజిత్ సరసన నటించిన ఈ మలయాళీ భామ ఆయన స్ఫూర్తితోనే ఖరీదైన 'బిఎండబ్ల్యు ఆర్ 1250 జిఎస్' బైక్ కొనుకోలు చేసింది. ఈ విషయాన్ని మంజు వారియర్ స్వయంగా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపింది. ఇందులో బైక్ డెలివరీ తీసుకోవడం, రైడింగ్ చేయడం వంటి దృష్ట్యాలు చూడవచ్చు. బిఎండబ్ల్యు ఆర్ 1250 జిఎస్ బైక్ భారతీయ మార్కెట్లో లభిస్తున్న అత్యంత ఖరీదైన బైకుల జాబితాలో ఒకటి. అజిత్ వంటి సెలబ్రిటీలు ఈ బైక్ కొనుగోలు చేశారు. బహుశా ఇంతటి ఖరీదైన బైక్ కొనుగోలు చేసిన మొదటి సినీ నటి మంజు వారియర్ కావచ్చు. ఇప్పటికే ఈమె వద్ద ల్యాండ్ రోవర్, మారుతి బాలెనొ కార్లతో పాటు మినీ కూపర్ ఎలక్ట్రిక్ కారు కూడా ఉన్నాయి. సుదూర ప్రాంతాలకు రైడింగ్ చేయడానికి ప్రత్యేకంగా ఈ బైక్స్ రూపొందించబడ్డాయి. ఈ బైక్ ట్విన్-సిలిండర్ 1254సిసి ఇంజన్ 134 బిహెచ్పి పవర్ 143 ఎన్ఎమ్ టార్క్ని జనరేట్ చేస్తుంది. ఇది 20 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ కలిగి 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో జతచేయబడి ఉంటుంది. డిజైన్, ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ పరంగా ఈ బైక్ తనకు తానే సాటిగా ఉంటుంది. A tiny step of courage is always a good place ❤️ P.S : Got to go a looooong way before I become a good rider, so if you see me fumbling on the roads, please be patient with me 😊🙏 Thank you for being an inspiration to many like me #AK #AjithKumar sir ❤️🙏#bmw #gs1250 #bmwkochi pic.twitter.com/XoiB9vZUVO — Manju Warrier (@ManjuWarrier4) February 17, 2023 -
ఆడియెన్స్ మధ్యలో కూర్చొని సినిమాల చూడాలనుంది: హీరోయిన్
తమిళ సినిమా: అజిత్ కథానాయకుడిగా నటించిన చిత్రం తుణివు. మలయాళ నటి మంజు వారియర్ నాయకి. హెచ్.వినోద్ దర్శకత్వంలో జీ.సినివతో కలిసి బోణీకపూర్ నిర్మించారు. బ్యాంక్ రాబరీ నేపథ్యంలో రపొందిన ఈ చిత్రం పొంగల్ సందర్భంగా ఈనెల 11వ తేదీ ప్రపంచ వ్యాప్తంగా విడుదలై ప్రేక్షకాదరణ పొందుతోంది. కాగా మంజు వారియర్ కేరళలో తుణివు చిత్రాన్ని విడుదలైన రోజునే థియేటర్లో ప్రేక్షకుల మధ్య తిలకించారట. ఈ సినిమాను తమిళ ప్రేక్షకుల మధ్య చూడాలని ఆశ పడుతున్నట్లు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. తాను మొదటిసారిగా కేరళలో ప్రేక్షకుల మధ్య థియేటర్లో తుణివు చూసి ఆనందించానని తెలిపారు. ప్రేక్షకులతో కలిసి చూడడం థ్రిల్లింగా ఫీలయ్యానని అంది. అదేవిధంగా తమిళ పేక్షకుల మధ్య చూడాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. తాను ఈ చిత్రంలో తొలిసారిగా యాక్షన్ హీరోయిన్గా నటించినట్లు చెప్పారు. ఇలాంటి చాలెంజింగ్ పాత్రలో నటించడానికి శిక్షణ అవసరమనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాంటి పాత్రలో తాను నటించడం సంతోషంగా ఉందన్నారు. ఈ చిత్రాన్ని కేరళలో ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. కాగా, తుణివు చిత్ర ప్రచార కార్యక్రమంలో పాల్గొనడానికి ఈ నెల 20వ తేదీ ఆమె చెన్నైకు రానున్నారు. అదే రోజున ఆమె నటించిన మలయాళం చిత్రం ఆయిషా తెరపైకి రానుంది. ఇందులో మంజు వారియర్ నటించిన పాత్ర తుణివు చిత్రంలోని పాత్రకు పూర్తి భిన్నంగా ఉంటుందని ఆమె తెలిపారు. కాగా స్వతహాగా భరతనాట్య కళాకారిని అయిన మంజు వారియర్ ఈ నెల 20న చెన్నైలో జరగనున్న సర్య అనే వేడుకలో రాదే శ్యామ్ నృత్య రూపకాన్ని ప్రదర్శించనున్నారు. -
Thegimpu Review: ‘తెగింపు’ మూవీ రివ్యూ
టైటిల్: తెగింపు నటీనటులు: అజిత్, మంజు వారియర్, జాన్ కొక్కెన్, యోగి బాబు, సముద్రఖని, మహానది శంకర్ తదితరులు నిర్మాత : బోనీ కపూర్ దర్శకుడు: హెచ్.వినోద్ సంగీతం: జిబ్రాన్ సినిమాటోగ్రఫీ: నిరవ్ షా విడుదల తేది: జనవరి 11, 2022 కథేంటంటే.. బ్యాంకు దోపిడి ఇతివృత్తంగా ‘తెగింపు’సినిమా కథనం సాగుతుంది. విశాఖపట్నంలోని ‘యువర్ బ్యాంక్’లో రూ.1000 కోట్ల మాత్రమే నిల్వ ఉంచడానికి అనుమతి ఉండగా.. నిబంధనలకు విరుద్దంగా మరో 500 కోట్లను డిపాజిట్ చేస్తారు. ఆ 500 కోట్ల రూపాయలను కొట్టేయడానికి ఏసీపీ ప్రవీణ్(అజయ్) ప్లాన్ చేస్తాడు. అతని మనుషులు బ్యాంక్లోకి వెళ్లగా..అక్కడ అప్పటికే డార్క్ డెవిల్ చీఫ్(అజిత్) ఉంటాడు. అతను కూడా తన టీమ్తో కలిసి డబ్బును కొట్టేసేందుకు బ్యాంకుకు వస్తాడు. అతని టీమ్లో మొత్తం ఐదుగురు ఉంటారు. వారిలో రమణి(మంజు వారియర్) ఒకరు. ఆమె బయట ఉండి టెక్నాలజీ సాయంతో అజిత్కు అన్ని విషయాలు చేరవేస్తుంది. అసలు డార్క్ డెవిల్ గ్యాంగ్ యువర్ బ్యాంకుని ఎందుకు టార్గెట్ చేసింది? డబ్బులను కొట్టేయాలనే ప్లాన్ ఎవరిది? ఏసీపీ ప్రవీణ్ వెనుక ఉన్నదెవరు? బ్యాంకు యజమాని క్రిష్ (జాన్ కొక్కెన్) అధినేతగా ఉన్న యువర్ బ్యాంక్లోకి రూ.25000 కోట్ల రూపాయలు ఎలా వచ్చి చేరాయి? ఈ స్కామ్లో ఉన్నదెవరు? చివరకు అజిత్ టీమ్ ఇచ్చిన ట్విస్ట్ ఏంటి? అనేది తెలియాలంటే థియేటర్స్లో ‘తెగింపు’ సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. బ్యాంకు దోపిడి నేపథ్యంలో గతంలో చాలా సినిమాలే వచ్చాయి. తెగింపు కూడా ఆ కోవలోకి చెందిన సినిమానే. బ్యాంకులను అడ్డం పెట్టుకొని కొంతమంది ఎలాంటి స్కామ్లు చేస్తున్నారనేది ఈ సినిమాలో చూపించారు. ఈ పాయింట్తో ఇటీవల మహేశ్ బాబు సర్కారువారి పాట సినిమా కూడా వచ్చింది. అయితే ఈ సినిమా కథనం వేరేలా సాగుతుంది. ఫుల్ యాక్షన్ థ్రిల్లర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు వినోద్. ఫస్టాఫ్లో కథ ఏమి ఉండదు కానీ.. ఒక్కో పాత్రని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ పోవడంతో అసలు బ్యాకింగ్ రాబరీ వెనక ఉన్నదెరనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో పెరుగుతుంది. మొత్తం మూడు గ్యాంగ్లు బ్యాంక్ దోపిడికి ప్లాన్ చేయడం.ఒక్కో గ్యాంగ్ వెనుక ఊహించని వ్యక్తులు ఉండడంతో కథనం చాలా ఆసక్తికరంగా సాగుతుంది. అయితే ఫస్టాఫ్లో కథ కంటే..ఫైటింగ్ సీన్సే ఎక్కువ. బ్యాంకులోకి వెళ్లడానికి పోలీసులు ప్లాన్ చేయడం..దానిని హీరో గ్యాంగ్ తిప్పికొట్టడం..ఇలానే సాగుతుంది. ఆ ఫైటింగ్ సీన్స్ చూస్తే విజయ్ ‘బీస్ట్’ సినిమా గుర్తొస్తుంది. అక్కడ హీరో షాపింగ్మాల్లో ఫైట్ చేస్తే..ఇక్కడ బ్యాంకులో చేస్తాడు. భారీ యాక్షన్ సీన్స్తో ఫస్టాఫ్ని కొంత ఆసక్తికరంగా తీర్చిదిద్దారు.ఇక సెకండాఫ్లో కథ మాత్రం చాలా రోటీన్గా సాగుతుంది. ఫ్లాష్ బ్యాక్ సీన్స్ సినిమాకు మైనస్. ఎమోషనల్ సన్నివేశాలు కూడా వర్కౌట్ కాలేదు. క్లైమాక్స్ కూడా చాలా రొటీన్గా ఉంటుంది. దర్శకుడు కథను పట్టించుకోకుండా హీరోయిజంపైనే ఎక్కువ దృష్టి పెట్టినట్లు అనిపిస్తుంది. అజిత్ సినిమాలు చాలా కాలంగా కేవలం హీరోయిజాన్ని, స్టంట్ లను నమ్ముకుని తీసేస్తున్నారు. ఈ ‘తెగింపు’ కూడా అలాంటిదే. అజిత్ వీరాభిమానులకు నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే.. అజిత్ ఎప్పటిలాగే యాక్షన్ సీక్వెన్స్ అదరగొట్టేశాడు. తెరపై చాలా స్టైలీష్గా కనిపించాడు. మంజు వారియర్కి మంచి పాత్ర లభించింది. డార్క్ డెవిల్ టీమ్ మెంబర్గా ఆమె తెరపై కనిపించేది కొద్ది నిమిషాలే అయినా..తనదైన నటనతో ఆకట్టుకుంది. యాక్షన్ సీస్స్లో అదరగొట్టేసింది. కమిషనర్ పాత్రలో సముద్రఖని ఒదిగిపోయాడు. కానీ అతని పాత్రకి సరైన జస్టిఫికేషన్ ఇవ్వకపోవడంతో సినిమాపై ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. నెగెటివ్ షేడ్ ఉన్న ఏసీపీ ప్రవీణ్గా అజయ్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు.మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేరనటించారు. ఇక సాంకేతిక విషయానికి వస్తే.. జిబ్రాస్ సంగీతం సినిమాకు ప్రధాన బలం. పాటలు అంతంత మాత్రమే అయినా.. నేపథ్య సంగీతం మాత్రం అదిరిపోయింది. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. అలాగే నిరవ్ షా సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు చాలా ప్లస్. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. -
ఆ హీరో తుపాకీ కాల్చడం నేర్పించాడు : మంజు వారియర్
తమిళసినిమా: అజిత్ కథానాయకుడిగా నటించిన తుణివు చిత్రం సంక్రాంతి సందర్భంగా ఈ నెల 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. హెచ్ వినోద్ దసరా, జీ సినిమాతో కలిసి బోనీకపూర్ నిర్మించిన ఈ చిత్రానికి అనిరుద్ సంగీతాన్ని అందించారు. ఇందులో అజిత్ సరసన మలయాళీ స్టార్ నటి మంజు వారియర్ తొలిసారిగా నటించారు. అదేవిధంగా ఈమె తమిళంలో నటించిన రెండవ చిత్రం ఇది. ఇంతకు ముందు ధనుష్తో కలిసి అసురన్ చిత్రంలో నటించారు. ఈ సందర్భంగా తుణివు చిత్రంలో నటించిన అనుభవాన్ని మంజు వారియర్ ఒక భేటీలో పేర్కొంటూ ఈ చిత్రం కొత్త అనుభవమని పేర్కొన్నారు. ఇంతకుముందు అసురన్ చిత్రంలో చేసిన ప్రాత్రకు.. తుణివు చిత్రంలోని క్యారెక్టర్కు పోలికే ఉండదన్నారు. ఇందులో యాక్షన్ హీరోయిన్గా నటించినట్లు చెప్పారు. కణ్మణి అనే యువతిగా ఒక చేతితో తుపాకీ కాల్చడం కష్టతరం కావడంతో హీరో అజిత్ నేర్పించారన్నారు. తాను ఇంతకుముందు అనేక చిత్రాల్లో నటించాను కానీ, యాక్షన్ పాత్రలో నటించడం ఇదే తొలిసారి అని చెప్పారు. అసురన్ చిత్రం తరువాత మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో తుణివు చిత్రంలో నటించే అవకాశం వచ్చిందన్నారు. కథ నచ్చడంతోనే ఇందులో నటించడానికి అంగీకరించినట్లు చెప్పారు. అసురన్ చిత్రంలోని పచ్చయమ్మాళ్ పాత్రను ప్రేక్షకులు ఎలా ఆదరించారో ఈ చిత్రంలోని కణ్మణి పాత్రను కూడా అలాగే ప్రోత్సహిస్తారని భావిస్తున్నట్లు చెప్పారు. -
Manju Warrier: వాటిని ఎంజాయ్ చేస్తున్నా.. అభిమానానికి థ్యాంక్స్!
మాలీవుడ్లో అగ్ర కథానాయికగా వెలుగొందుతున్న నటి మంజువారియర్. ఈమె తమిళంలో అజిత్ సరసన నటిస్తున్న చిత్రం తుణివు. హెచ్ వినోద్ కథా, కథనం, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమాని జీసినిమాతో కలిసి బోనీకపూర్ నిర్మిస్తున్నారు. జిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. పొంగల్ సందర్భంగా విడుదలకు ముస్తాబవుతోంది. ఈ చిత్రాన్ని ఉదయనిధి స్టాలిన్కు చెందిన రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ తమిళనాడులో భారీ ఎత్తున రిలీజ్కు సన్నాహాలు చేస్తోంది. కాగా ఇప్పటికే ఈ చిత్రంలోని మూడు పాటలు విడుదలై అజిత్ అభిమానులను ఖుషీ చేస్తున్నాయి. అందులో ఒకటి కాసేదాన్ కడవులడా పల్లవితో సాగే పాట. ఈ పాటను సంగీత దర్శకుడు జిబ్రాన్తో కలిసి నటి మంజు వారియర్ పాడటం విశేషం. అయితే ఇటీవల విడుదలైన ఈ పాటలో నటి మంజువారియర్ సెట్ కాలేదని కోరస్లో కలిసిపోయిందని నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. వాటిపై స్పందించిన ఆమె తుణివు చిత్రంలో తాను పాడిన పాటలో తన గొంతు బాగోలేదని నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారని.. తన పాటపై వారు చూపిస్తున్న అభిమానానికి థ్యాంక్స్ అని, తన గొంతు బాగోలేదని మీరేమీ బాధ పడాల్సిన అవసరం లేదని, తాను వీడియో వెర్షన్ కోసమే పాడినట్లు పేర్కొన్నారు. ట్రోలింగ్స్ను బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు మంజువారియర్ పేర్కొన్నారు. -
స్టార్ హీరో అజిత్ సినిమా కోసం పాట పాడిన మంజూ వారియర్
తమిళసినిమా: నటుడు అజిత్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం తుణివు. జీ సినిమా సంస్థతో కలిసి బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ నిర్మిస్తున్న చిత్రం ఇది. హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. నేర్కండ పారై్వ, వలిమై వంటి సక్సెస్ఫుల్ చిత్రాల తర్వాత వీరి కాంబినేషన్లో రూపొందుతున్న మూడవ చిత్రం తుణివు.. షూటింగ్ పూర్తి చేసుకుని పొంగల్ సందర్భంగా తెరపైకి రావడానికి రెడీ అవుతోంది. మలయాళ సూపర్ స్టార్ మంజు వారియర్ ఇందులో నాయకిగా నటిస్తున్న ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. అదేవిధంగా విజయ్ కథానాయకుడిగా నటించిన వారీసు చిత్రం కూడా పొంగల్ రేస్కే సిద్ధమవుతుంది. రష్మిక మందన్నా నాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్ర విడుదలపై ఇప్పటికే టాలీవుడ్లో పెద్ద చర్చ జరుగుతోంది. అదే విధంగా కోలీవుడ్లో వారీసు చిత్రం కూడా పొంగల్ రేస్కే సిద్ధమవుతుంది. రష్మిక మందన్నా నాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్ర విడుదలపై ఇప్పటికే టాలీవుడ్లో పెద్ద చర్చ జరుగుతోంది అదే విధంగా కోలీవుడ్లోనూ వారీసు, తుణివు చిత్రాలపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. కారణం విజయ్, అజిత్ చిత్రాల మధ్య పోటీ ఉండడమే.గతంలో అజిత్ నటించిన వీరం, విజయ్ నటించిన జిల్లా చిత్రాలు ఒకేసారి విడుదలై రెండూ మం విజయాన్ని సాధించాయి. ఆ తర్వాత ఇప్పటివరకు అలాంటి పోటీ పరిస్థితి రాలేదు. అలాంటిది ఎన్నాళ్లకు మళ్లీ ఈ ఇద్దరు స్టార్ చిత్రాలు మధ్య పోటీ తప్పడం లేదు. అజిత్ నటిస్తున్న తుణివు చిత్రం విడుదల హక్కులను ఉదయనిధి స్టాలిన్కు చెందిన రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ పొందడం విశేషం. దీంతో అజిత్ గానీ.. ఆయన అభివనులు గానీ.. ఎలాంటి టెన్షన్ పడటం లేదు.తమ అభిమాన నటుడు చిత్రానికే అధిక థియేటర్లు.. లభిస్తాయనే ధీమాతో వారు ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తుణివు చిత్రానికి సంబంధించిన ఒక అప్డేట్ను ఆ చిత్ర హీరోయిన్ మంజు వారియర్ వెల్లడించారు. ఈ చిత్రం కోసం ఆమె ఒక పాట పాడిందన్నదే ఆ అప్డేట్. ఈ విషయాన్ని ఆమె సంగీత దర్శకుడు జిబ్రాన్తో కలిసి ఉన్న ఫొటోను పోస్ట్ చేస్త తెలియజేశారు. Thrilled to have sung for @GhibranOfficial !!! Happy to be part of a very interesting song in #Thunivu! Waiting for you all to hear it! ❤️#ajithkumar #AK #hvinoth pic.twitter.com/G934UX79sg — Manju Warrier (@ManjuWarrier4) November 26, 2022 -
స్టార్ హీరోయిన్ను వేధింపులకు గురి చేసిన డైరెక్టర్ అరెస్ట్
మలయాళ స్టార్ హీరోయిన్ మంజు వారియర్ను వేధింపులకు గురి చేసిన కేసులో డైరెక్టర్ సనల్ కుమార్ శశిధరన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. తిరువనంతపురంలో మే5న ఆయన్ను కేరళ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివకాల్లోకి వెళితే.. సనల్ కుమార్ దర్శకత్వంలో మంజు వారియర్ కయాట్టం అనే సినిమాలో నటించింది. అయితే సినిమా అయిపోయిన తర్వాత కూడా సనల్ కుమార్ అదే పనిగా తనకు మెసేజ్లు పంపిస్తూ వేధింపులకు గురిచేరాడని హీరోయిన్ ఆరోపించింది. పలుమార్లు వార్నింగ్ ఇచ్చినా తీరు మార్చికోకుండా వేధింపులు గురి చేస్తున్నాడంటూ మంజు వారియర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో తిరువనంతపురంలో ఉన్న సనల్ కుమార్ ఇంటికి మఫ్టీలో వెళ్లిన పోలీసులు అతడిని అరెస్ట్ చేసి కొచ్చికి తరలించారు. ప్రస్తుతం ఈ వార్త మలయాళ చిత్ర పరిశ్రమలో సంచలనంగా మారింది. కాగా కేరళ ప్రభుత్వం నుంచి సనల్ కుమార్ అనేక అవార్డులను సొంతం చేసుకున్నాడు. అలాంటి డైరెక్టర్ ఇలాంటి నీచమైన పనులు చేయడం ఏంటని నెటిజన్లు సనల్కుమార్పై దుమ్మెత్తిపోస్తున్నారు. -
4 భాషల్లో మంజు వారియర్ సినిమా రీమేక్
తిరువనంతపురం : ప్రముఖ మలయాళ నటి మంజు వారియర్ ఇటీవల నటించిన చిత్రం ప్రతీ పూవన్కోజి. 2019లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించి విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం ఈ మూవీని తెలుగు, తమిళ్, కన్నడం,హిందీ భాషల్లో రీమేక్ చేయనున్నారు. హిందీలో ప్రతీ పూవన్కోజి సినిమాను బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ నిర్మించనున్నారు. దీనికి సంబంధించిన హిందీ రీమేక్ హక్కులను ఇప్పటికే బోనీ కపూర్ కొనుగోలు చేసినట్లు సమాచారం. అదే విధంగా తెలుగు, తమిళ్, కన్నడలో కూడా వివిధ ప్రొడక్షన్ హౌజ్లు రీమేక్ హక్కులను స్వాధీనం చేసుకున్నాయి. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. చదవండి: ఆర్చ... అదరహా కథ రచయిత ఉన్ని ఆర్ రచించిన ‘సంకడం’ కథా ఆధారంగా ఈ సినిమాను రోషన్ ఆండ్సూస్ డైరెక్ట్ చేశారు. ప్రతీ పూవన్కోజి సినిమాకు రోషన్ ఆండ్రూస్ దర్శకత్వం వహించడమే కాకుండా విలన్గా కూడా నటించారు. ఇది నటుడిగా రోషన్ తొలి సినిమా. కాగా వస్త్ర దుకాణంలో సేల్స్ వుమన్ పాత్ర పోషించిన మంజు వారియర్ ఆమె నటనకు ప్రశంసలు అందుకుంది. .మాధురి పాత్రలో లీనమై తనను బస్సులో వేధించిన ఓ గ్యాంగ్పై ప్రతీకారం తీర్చుకోవడమే ఈ సినిమా కథాంశం. ప్రస్తుతం మంజు వారియర్ మోహన్లాల్ నటిస్తున్న మరక్కమ్ సినిమాలో కనిపించనున్నారు. చదవండి: డ్యాన్సర్పై కొరియోగ్రాఫర్ అనుచిత ప్రవర్తన.. -
ఆర్చ... అదరహా
మోహన్లాల్ హీరోగా నటిస్తున్న తాజా హిస్టారికల్ మలయాళ మూవీ ‘మరక్కర్: అరబికడలింటే సింహం’. ఈ చిత్రానికి ప్రియదర్శన్ దర్శకత్వం వహించారు. అర్జున్, కీర్తీ సురేష్, మంజు వారియర్, సునీల్ శెట్టి, కల్యాణీ ప్రియదర్శన్ ముఖ్య పాత్రలు చేస్తున్నారు. 16వ శతాబ్దానికి చెందిన కుంజాలి మరక్కర్ అనే నావికుడి జీవితం ఆ«ధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. మోహన్లాల్ యంగ్ పాత్రలో ఆయన కొడుకు ప్రణవ్ మోహన్లాల్ నటించారు. ఆర్చ అనే పాత్రలో కనిపించనున్నారు కీర్తీ సురేష్. ఆమె క్యారెక్టర్ లుక్ను విడుదల చేసింది చిత్రబృందం. ఆర్చ లుక్ ఆదరహా అంటోంది మాలీవుడ్. ఈ ఏడాది మార్చి 26న ఈ చిత్రం విడుదల కానుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కూడా చిత్రాన్ని రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. -
జోడీ కుదిరిందా?
వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. తమిళంలో ధనుష్, మంజువారియర్ నటించిన సూపర్హిట్ మూవీ ‘అసురన్’కు ఇది తెలుగు రీమేక్. ఈ చిత్రాన్ని డి.సురేష్బాబు, కళైపులి యస్. థాను నిర్మించనున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ఈ నెలలో ప్రారంభం కానుందని తెలిసింది. అయితే తమిళంలో మంజు వారియర్ పోషించిన పాత్రకు తెలుగు రీమేక్లో ప్రియమణిని తీసుకోవాలనుకుంటున్నారట. ఇటీవల ప్రియమణిని సంప్రదించారని టాక్. మరి.. వెంకీ, ప్రియమణి జోడి కుదురుతుందా? వెయిట్ అండ్ సీ. ఇదిలా ఉంటే 2016లో ‘మన ఊరి రామాయణం’లో కనిపించిన తర్వాత ప్రియమణి తెలుగు తెరపై కనిపించలేదు. ప్రస్తుతం దివంగత నటి, మాజీ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తమిళంలో రూపొందుతోన్న ‘తలైవి’లో శశికళ పాత్ర చేస్తున్నారు. ఇది కాకుండా కన్నడ, మలయాళ చిత్రాలు చేస్తున్నారు ప్రియమణి. -
దర్శకుడిపై హీరోయిన్ ఫిర్యాదు
తిరువనంతపురం : ప్రముఖ మలయాళ నటి మంజు వారియర్ ఫిర్యాదు మేరకు దర్శకుడు శ్రీకుమార్ మీనన్పై కేసు నమోదైంది. మంజు వారియర్ వాంగ్మూలం తీసుకున్న తర్వాత.. ఐపీసీ 509 సెక్షన్తో పాటు వివిధ సెక్షన్ల కింద శ్రీకుమార్పై కేసు నమోదు చేసినట్లు కేరళ డీజీపీ లోక్నాథ్ బెహరా తెలిపారు. త్రిసూర్ ఈస్ట్ పోలీసు స్టేషనులో కేసు నమోదైందని... ఈ మేరకు క్రైం బ్రాంచ్ పోలీసులు విచారణ చేపట్టారని పేర్కొన్నారు. కాగా తన భర్త, నటుడు దిలీప్ నుంచి విడాకులు తీసుకున్న అనంతరం మంజు వారియర్ కెరీర్ నెమ్మదించింది. ఈ నేపథ్యంలో తాను దర్శకత్వం వహించిన షార్ట్ ఫిల్మ్, అడ్వర్టయిజ్మెంట్ల ద్వారా శ్రీకుమార్ ఆమె కెరీర్కు బ్రేక్ ఇచ్చాడు.ఈ క్రమంలో ఇద్దరూ కలిసి వివిధ సినిమాలకు పనిచేశారు. అయితే కొన్ని రోజుల క్రితం వీరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తాయి. శ్రీకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఒడియన్ సినిమాలో మంజు వారియర్ కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో సినిమా షూటింగ్ సమయంలో శ్రీకుమార్ తనను అసభ్యంగా దూషించాడని.. తనను ఎంతో మానసిక వేదనకు గురిచేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇండస్ట్రీ నుంచి వెళ్లగొడతానని... ఆ తర్వాత చంపేస్తానని శ్రీకుమార్ బెదిరించాడని ఆమె ఆరోపించారు. అదే విధంగా సోషల్ మీడియాలో తన గురించి అసత్యాలు ప్రచారం చేసి పరువుకు భంగం కలిగించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక తమిళ స్టార్హీరో ధనుష్ సరసన మంజు వారియర్ హీరోయిన్గా నటించిన ‘అసురన్’ సినిమా ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. కాగా కేసు విషయంపై స్పందించిన శ్రీకుమార్ కఠిన సమయాల్లో తోడుగా ఉండి.. మంజు వారియర్కు అండగా నిలిచానని.. అయినా ఆమె తనపై ఫిర్యాదు చేయడం బాధాకరం అన్నాడు. తనపై కేసు నమోదైన విషయం మీడియా ద్వారానే తెలుసుకున్నానని.. పోలీసులకు సహకరిస్తానని తెలిపాడు. ఇక మంజు వారియర్ భర్త దిలీప్పై లైంగిక వేధింపుల ఆరోపణల్లో కేసు నమోదైన విషయం తెలిసిందే. ప్రముఖ మలయాళ హీరోయిన్ను అపహరించి.. ఆమెపై అత్యాచారయత్నానికి పాల్పడ్డారనే ఆరోపణలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. -
వరదల్లో చిక్కుకున్న హీరోయిన్
మూడు రోజుల నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో హిమాచల్ ప్రదేశ్ కుదేలయ్యింది. భారీ వరదలు, కొండ చరియలు విరిగి పడుతుండటం, రోడ్లు కొట్టుకుపోతుండటం వల్ల జనాలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మలయాళ హీరోయిన్ మంజు వారియర్తో పాటు చిత్ర బృందం హిమాచల్ ప్రదేశ్ వరదల్లో చిక్కుకున్నారు. దాదాపు 30 మంది ఉన్న ఈ బృందం చట్రూ కొండ ప్రాంతంలో చిక్కుకుపోయారు. అవార్డు విన్నింగ్ దర్శకుడు సనల్ కుమార్ శశిధరన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం షూటింగ్ నిమిత్తం వీరంతా హిమాచల్ ప్రదేశ్ వెళ్లారు. అయితే భారీ వరదల మూలానా షూటింగ్ జరుగుతున్న ప్రాంతంలో రోడ్డు కొట్టుకుపోవడంతో మంజు, ఇతర సభ్యులు అక్కడే చిక్కుకుపోయినట్లు సమాచారం. దీని గురించి మంజు వారియర్ సోదరుడు మధు మాట్లాడుతూ.. ‘సనల్ కుమార్, మంజు, ఇతర చిత్ర బృందం హిమాచల్ ప్రదేశ్ వరదల్లో చిక్కుకుపోయారు. దీన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో.. ఆయన ఆదేశాల మేరకు అధికారులు వారిని సురక్షిత ప్రాంతానికి చేర్చారు. ప్రస్తుతం అక్కడ టెలిఫోన్, సెల్ఫోన్ లైన్స్ ఏం పని చేయడం లేదు. సోమవారం రాత్రి నా సోదరి నాకు శాటిలైట్ ఫోన్ నుంచి కాల్ చేసింది. తామంతా క్షేమంగానే ఉన్నామని చెప్పింది. కానీ సరిపడా ఆహారం లేదు. కేవలం ఒక్క రోజుకు మాత్రమే సరిపోయే ఆహారం ఉంది. తక్షణమే తమకు సాయం అందేలా చూడమని కోరింది. ఈ విషయాన్ని మంత్రి వి మురళీధరన్ దృష్టికి తీసుకెళ్లాను. ఆయన సాయం చేస్తానని హామీ ఇచ్చారు. దీని గురించి హిమాచల్ ప్రదేశ్ సీఎంతో సంప్రదింపులు జరుపుతున్నాను అన్నారు’ అని తెలిపాడు. -
అసురుడు
పాత్రల్లోకి ఇట్టే మారిపోయే నటుల్లో తమిళ నటుడు ధనుష్ ఒకరు. లేటెస్ట్గా వయసు మళ్లిన వ్యక్తిగా మారిపోయారు. ధనుష్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘అసురన్’. వెట్రీమారన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో తండ్రీ కొడుకుల్లా డబుల్ యాక్షన్ చేస్తున్నారు ధనుష్. రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో మలయాళ నటి మంజు వారియర్ హీరోయిన్గా కనిపిస్తున్నారు. తమిళ నవల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇందులో ధనుష్ కొత్త స్టిల్ను రిలీజ్ చేశారు. పొలిటికల్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ చిత్రం ఈ ఏడాది రిలీజ్ కానుంది. -
ఇంకొక్కడున్నాడు
సినిమా ముఖ్యంగా తమిళ సినిమా వైవిధ్యాన్ని వెతుక్కుంటూ పోతోందని చెప్పవచ్చు. కథానాయకులు, దర్శకులు కొత్తదనం కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. దర్శకుడు వెట్రిమారన్ వైవిధ్యానికి చిరునామా అని చెప్పడం అతిశయోక్తి కాదు. ఆయన చిత్రాల్లో ఇతర చిత్రాలకు భిన్నంగా పాత్రలు చోటు చేసుకుంటాయి. నటులను అందుకు తగ్గట్టుగానే మార్చేస్తారు. వెట్రిమారన్ ఇంతకు ముందు తెరకెక్కించిన ఆడుగళం, పొల్లాదవన్, వడచెన్నై లాంటి చిత్రాలను గమనిస్తే ఆ వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ మూడు చిత్రాల్లోనూ ధనుషే కథానాయకుడు. అందులో ఆయన పోషించిన పాత్రలు ఒకదానికి ఒకటి పోలికే ఉండదు. తాజాగా ఈ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం అసురన్. ఇందులో ధనుష్కు జంటగా మలయాళ నటి మంజువారియర్ నటించడం మరో విశేషం. వి.క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్.థాను నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో ధనుష్ ద్విపాత్రాభినయం చేస్తున్నారన్నది తాజా సమాచారం. అదే విధంగా ఇందులో ఆయన గెటప్ చూస్తుంటే రైతుగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. అసురన్ చిత్రంలో ధనుష్ తండ్రీ కొడుకులుగా నటిస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. ఇందులో 45 ఏళ్ల తండ్రి పాత్ర కొంచెం సేపే ఉన్నా దాని ప్రభావం కథపై చాలానే ఉంటుందని చెప్పారు. అదే విధంగా తండ్రీ కొడుకులుగా ధనుష్ చూపిస్తున్న వైవిధ్యభరిత నటన అందరినీ ఆకర్షిస్తుందని దర్శకుడు అన్నారు. ఇందులో ఒక కొండ ప్రాంతంలో జరిగే సన్నివేశాన్ని దాదాపు 6 గంటల పాటు చిత్రీకరించాం. అయినా ఎలాంటి అసహనం చెందకుండా ధనుష్ నటించారని దర్శకుడు వెట్రిమారన్ తెలిపారు. ధనుష్ ఈ చిత్రంతో పాటు దురై సెంథిల్కుమార్ దర్శకత్వంలోనూ నటిస్తున్నారు. ఇందులోనూ ఆయన ద్విపాత్రాభినయం చేస్తుండడం విశేషం. ఇలా ఒకే సారి రెండు చిత్రాల్లో ద్విపాత్రాభినయం చేస్తున్న నటుడు ఈయనే అవుతారేమో. -
కోలీవుడ్ ఎంట్రీ
మాలీవుడ్ అగ్ర కథానాయికల్లో ఒకరిగా కొనసాగుతున్న మంజు వారియర్ ఇప్పుడు కోలీవుడ్కి ఎంట్రీ ఇవ్వనున్నారు. వెట్రిమారన్ దర్శకత్వంలో ధనుశ్ హీరోగా ‘అసురన్’ అనే సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్ పాత్రకు మంజు వారియర్ను తీసుకున్నారు టీమ్. ఈ నెల 26న ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం అవుతుంది. ‘‘మా సినిమాలో ఫీమేల్ లీడ్ క్యారెక్టర్ కోసం ఎవర్గ్రీన్ మంజు వారియర్ను తీసుకున్నాం. ఆమెతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నందుకు ఆనందంగా ఉంది. అద్భుతమైన ప్రతిభాశాలి అయిన ఆమె నుంచి కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నాను’’ అని ధనుశ్ పేర్కొన్నారు. -
ధనుష్కు జోడీగా సీనియర్ హీరోయిన్
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న తాజా చిత్రం అసురన్. ఇటీవల మారి 2తో మరో సూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్న ధనుష్ అసురన్ సినిమాలో డిఫరెంట్ లుక్లో అలరించనున్నాడు. ధనుష్ హీరోగా వడా చెన్నై సిరీస్ను తెరకెక్కిస్తున్న వెట్రీ మారన్ ఈసినిమాకు దర్శకుడు. ఈ సినిమాలో ధనుష్కు జోడిగా ఓ సీనియర్ నటి కనిపించనుందట. వెక్కై నవల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మంజు వారియర్ హీరోయిన్గా నటించనుంది. సెకండ్ ఇన్నింగ్స్లో విభిన్న పాత్రలతో దూసుకుపోతున్న మంజు.. తనకన్నా చిన్నవాడైన ధనుష్కు జోడిగా నటిస్తుండటం ఇప్పుడు కోలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతమందిస్తున్నాడు. -
అప్పుడు జింకలా మారతా!
మోహన్లాల్... నటుడిగా 41 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం. వయసేమో 58కి పైనే. పాత్ర ప్రేమగా అడిగితే పాతికేళ్ల యువకుడిగానూ మారిపోతారు. భాష తెలియదంటే నేర్చుకుని మరీ నటిస్తారు. అభిమానులు అభిమానంగా ‘కంప్లీట్ యాక్టర్’ అని పిలుచుకుంటారు. నా సినిమాలు, నా దర్శకులే ఆ కంప్లీట్నెస్కి కారణం అని మోహన్లాల్ అంటారు. మోహన్లాల్ హీరోగా వీఏ శ్రీకుమార్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఒడియన్’. ప్రకాష్రాజ్, మంజు వారియర్ కీలక పాత్రలు చేసిన ఈ సినిమా గత శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా మోహన్లాల్ పంచుకున్న పలు విశేషాలు.... ► ‘ఒడియన్’ సినిమాకు ఎలాంటి స్పందన లభిస్తోంది? కేరళ నుంచి మంచి స్పందన వస్తోంది. మంచి ఒపెనింగ్స్ వస్తున్నాయి. హైదరాబాద్లో కూడా వస్తోందని అనుకుంటున్నాను. ఒక నటుడిగా సంతృప్తినిచ్చిన సినిమా ఇది. ► శ్రీకుమార్మీనన్కు దర్శకునిగా పెద్దగా అనుభవం లేదు. ఆయన ఇంత పెద్ద సినిమాను తీయగలరని ఎలా నమ్మారు? శ్రీకుమార్ మీనన్ ఫీచర్ ఫిల్మ్ ఏదీ తీయకపోయినా అతను చాలా యాడ్ ఫిల్మ్స్ చేశాడు. నాతో కూడా కొన్ని యాడ్స్ చేశాడు. తను చేయగలడనే నమ్మకంతోనే ఈ సినిమా చేశాను. ► ‘ఒడియన్’ కోసం ఎలాంటి పరిశోధన చేశారు? ప్రత్యేకంగా ఏ పరిశోధన చేయలేదు. కానీ సినిమా కోసం కష్టపడ్డాం. కాన్సెప్ట్ గురించి బాగా ఆలోచించాం. ఇది యాక్షన్ సినిమా కాదు. ఎమోషనల్ సినిమా. స్పిరిచ్యువల్ డెస్టినేషన్ ఉంది. ఎద్దు, పులి.. ఇలా ఎలా కావాలంటే ఆ విధంగా మారిపోయే శక్తులు ఉన్న ఒడియన్ అనే వ్యక్తి కథ. ► సినిమాలో ఎలా కావాలనుకుంటే అలా మారిపోతారు. ఒకవేళ నిజంగా అలా మారిపోవాలనుకుంటే? (నవ్వేస్తూ).. సినిమాలో చేసినట్టు మారే విషయం గురించి నేను ఆలోచించలేదు. అది మిలియన్ డాలర్ ప్రశ్న. (కాసేపు మౌనం) జింకలా మారతాను. ► నటుడిగా 41 ఏళ్ళుగా ఇండస్ట్రీలో ఉన్నారు. ఇంత సుదీర్ఘ కెరీర్కు ఇన్స్పిరేషన్ ఏంటి? ఇంత సుదీర్ఘ ప్రయాణం ఆశీర్వాదం అని నమ్ముతాను. నేను ఇలా చేశాను. అలా చేశాను.. దాని వల్లే ఇలా కొనసాగుతున్నాను అనుకోను. మంచి పాత్రలు లభించాయి. మంచి దర్శకులతో పని చేశాను. ఇవన్నీ నన్ను నిలబెట్టాయి. ఆదరిస్తున్నందుకు ప్రేక్షకులకు, ఇండస్ట్రీకు థ్యాంక్స్. ► ఈ ఏజ్లో కూడా యాక్షన్ సినిమాలు చేస్తున్నారు? రిస్క్ అనిపించడంలేదా? యాక్షన్ సినిమాలంటే నాకు ఇష్టం. నా కెరీర్లో ఎన్నో యాక్షన్ సినిమాలు చేశాను. రీసెంట్గా ‘పులిమురుగన్’ (తెలుగులో ‘మన్యంపులి’) చేశాను. అందులో పులులతో యాక్షన్ ఉంటుంది. ‘ఒడియన్’ క్యారెక్టర్ యాక్షన్ సన్నివేశాలను చేసి తీరాలి.. లేదా సినిమా చేయలేనని చెప్పాలి. యాక్షన్ సినిమాలు నేను చేయలేను అని నాకు అనిపించినప్పుడు తప్పకుండా ఆపేస్తాను. కానీ ఇప్పుడు చేయగలనన్న నమ్మకం ఉంది. సో.. చేస్తూనే ఉంటాను. ► ఈ మధ్య భాషా బేధాలు తొలగిపోయాయి అనిపిస్తోంది. అన్ని భాషల సినిమాలను అందరూ చూస్తున్నారు... కేరళలో ఇతర భాషల సినిమాలకు ఆదరణ ఉంది. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ప్లాట్ఫామ్స్ కూడా పెరిగాయి. నా కెరీర్ స్టార్టింగ్లో కేరళలో ఇతర భాషల సినిమాలు కూడా అనువాదం అయి విడుదలయ్యేవి. చిరంజీవిగారి సినిమాలు వచ్చేవి. బాగా ఆడేవి. ఈ మధ్య ఆ హద్దులు పూర్తిగా తొలగిపోయాయి అనిపిస్తోంది. ► తెలియని భాషలో నటించనని కొన్ని సందర్భాల్లో చెప్పారు. తెలుగులో నటిస్తున్నారు కదా? అవును. ఇప్పుడు తెలుగులో సినిమా చేస్తున్నప్పుడు తెలుగు భాష పై కమాండ్ ఉంటే నటించడం సులభంగా ఉంటుంది. కొంచెం ఫ్రీగా ఉంటుంది. క్యారెక్టర్పై కమాండ్ కూడా వస్తుంది. యాక్ట్ చేసేటప్పుడు ట్రైనింగ్ తీసుకుంటాం కాబట్టి పెద్ద ప్రాబ్లమ్ అనిపించదు. ఇప్పుడు మాట్లాడమంటే మలయాళంలో అనర్గళంగా మాట్లాడతాను. కానీ తెలుగులో సినిమా చేసేప్పుడు డైలాగ్లు మాత్రమే చెప్పగలం. అంతవరకూ అయినా కమాండ్ ఉంది కాబట్టే చేస్తున్నాను. ► ఇటీవల మీరు వరుసగా హిస్టారికల్ బ్యాక్డ్రాప్ సినిమాలు చేస్తున్నట్లున్నారు? ప్లాన్ చేయలేదు. అలా జరుగుతున్నాయి అంతే. అయినా ‘ఒడియన్’ హిస్టారికల్ ఫిల్మ్ కాదు. నివిన్ పౌలితో ‘కాయమ్కులమ్ కొచ్చిన్’ సినిమా చేశాను. అది హిస్టారికల్ మూవీ. ఇప్పుడు ప్రియదర్శన్ దర్శకత్వంలో ‘మరాక్కర్’ అనే హిస్టారికల్ మూవీ. చేస్తున్నాను. ► ఆర్టిస్టుల దాహం తీరదంటారు. మీ ఫ్యాన్స్ అంతా మిమ్మల్ని ‘కంప్లీట్ యాక్టర్’ అని సంబోధిస్తారు. మిమ్మల్ని మీరు కంప్లీట్ యాక్టర్గా భావిస్తారా? కంప్లీట్ యాక్టర్ అనేది ఫ్యాన్స్ పిలుచుకునేది. అలాంటి బిరుదులు ఇచ్చేశారని పరిపూర్ణంగా అయిపోయాం అనుకోకూడదు. లక్కీగా నాకు మంచి పాత్రలు వస్తున్నాయి. దర్శకులు నా కోసం అలాంటి పాత్రలు ఇస్తుండటాన్ని బ్లెసింగ్గా భావిస్తున్నాను. ప్రేక్షకులు ఆదరించే ఆసక్తికరమైన సినిమాలు చేస్తున్నప్పుడు పేర్లు అవే వస్తాయి. నాకు ఫలానా పాత్రలు కావాలనుకుంటే రావు. వచ్చిన పాత్రలనే బాగా చేస్తున్నాను అంతే. ► ఈ వయసులోనూ స్పీడ్గా సినిమాలు చేస్తున్నారు? ఒక సినిమాను కంప్లీట్ చేసిన వెంటనే ఇంకో సినిమాను స్టార్ట్ చేస్తున్నాను. సినిమాలను ప్రేమిస్తాను. నాకు యాక్టింగ్ అంటే ఇష్టం. నేను వర్క్హాలిక్ని (అతిగా పని చేసే వ్యక్తి) సెట్లో సీన్ ఎంత ఆలస్యం అయినా వెయిట్ చేయాలి. ఒక నటుడిగా దర్శక–నిర్మాతలకు మనం ఇచ్చే గౌరవం అది. నా వర్క్ని ఎంజాయ్ చేస్తాను. నీ పనిని నువ్వు ప్రేమించనప్పుడు అందులో ఎక్కువకాలం ఎలా కొనసాగుతావు? పనిని ఎంజాయ్ చేయలేకపోతున్నాను అని అనిపించినప్పుడు చేయకపోవడమే మంచిది. ► టాలీవుడ్తో మీకు ఉన్న అనుబంధం? ‘గాంఢీవం’ సినిమాలో చిన్న గెస్ట్ రోల్ చేశాను. ఎన్టీఆర్తో ‘జనతా గ్యారేజ్’ చేశాను. ‘మనమంతా’ చేశాను. నా సినిమాలు కొన్ని తెలుగులో డబ్ అవుతుంటాయి. అలాగే కొన్ని సినిమాలను రీమేక్ చేశారు. మోహన్బాబు, చిరంజీవిలతో మంచి రిలేషన్ ఉంది. వెంకటేశ్, జూనియర్ ఎన్టీఆర్ ఇలా ఇంకొందరితో మంచి స్నేహం ఉంది. ► ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలు పెరుగుతున్నాయి. వాటి గురించి మీ అభిప్రాయం ఏంటి? హాలీవుడ్ సినిమాలు చూస్తుంటాం. ఎందుకు? భారీ బడ్జెట్, భారీ కాన్వాస్, లార్జర్ దాన్ లైఫ్లా ఆ సినిమాలు ఉంటాయని. ప్రపంచవ్యాప్తంగా ఆదరణ దొరుకుతుంది. మంచి మార్కెట్ క్రియేట్ అవుతంది. ఆ విషయాన్ని ‘బాహుబలి’ నిరూపించింది. ఇప్పుడు ‘మరాక్కర్’ అనే చిత్రం చేస్తున్నాం. బిగ్ బడ్జెట్ సినిమాలు తప్పనిసరిగా రావాలి. అవకాశం, సామర్థ్యం ఉన్నప్పుడు చేయడంలో తప్పు లేదు. ► మీ తనయుడు ప్రణవ్ మోహన్లాల్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు.. ప్రణవ్ చైల్డ్ ఆర్టిస్టుగా కూడా చేశాడు. ఫస్ట్ సినిమా ‘ఆది’లో హీరోగా బాగా నటించాడు. మంచి హిట్ అయింది. ఇప్పుడు రెండో సినిమా షూటింగ్ కూడా జరుగుతోంది. ‘మరాక్కర్’లో నా చిన్ననాటి పాత్ర చేస్తున్నాడు. అయితే సినిమాల్లో కొనసాగలని ప్రణవ్ ఇంకా నిర్ణయించుకోలేదు. ఇంకో 3,4 సినిమాలు చేసి ఒక నిర్ణయానికి వస్తాడేమో. ► మమ్ముట్టి, మీ మధ్య ఎలాంటి అనుబంధం ఉంది? మేము మంచి మిత్రులం. ఇద్దరం కలిసి దాదాపు 54 సినిమాలు చేశాం. ‘ఒడియన్’ చిత్రానికి వాయిస్ ఓవర్ కూడా ఇచ్చారాయన. ► మాలీవుడ్ యంగ్ హీరోలు (దుల్కర్ సల్మాన్, నివిన్ పౌలి) కూడా తెలుగులో ఫ్యాన్స్ సంపాదించుకోవడంపై మీ ఒపీనియన్? మంచి మంచి పాత్రలు చేస్తూ వాళ్లను వారు నిరూపించుకుంటున్నారు. వారికి మరిన్ని ఆసక్తికరమైన పాత్రలు రావాలని నేనూ కోరుకుంటున్నాను. ► ప్రస్తుతం మలయాళంలో ‘అమ్మ’ అసోసియేషన్లో నటుల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. దాని గురించి... అక్కడ ఏం జరిగిందో బయట వాళ్ళకు పూర్తిగా అవగాహన లేదు. అందుకే దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. ఒడియన్లో.. -
షూటింగ్లో గాయపడ్డ హీరోయిన్
సీనియర్ హీరోయిన్ మంజు వారియర్ షూటింగ్లో గాయపడ్డారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మలయాళ చిత్రం జాక్ అండ్ జిల్ షూటింగ్ సమయంలో ప్రమాదం జరిగింది. యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తుండగా మంజు గాయాలపాలవ్వటంతో వెంటనే ఆమెను దగ్గరల్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. తలకి బలమైన గాయం కావటంతో కుట్లు వేసినట్టుగా తెలుస్తోంది. మంజు పూర్తిగా కోలుకున్న తరువాతే తిరిగి షూటింగ్ హాజరవుతారని చిత్రయూనిట్ వెల్లడించారు. థిల్లర్ జానర్లో తెరకెక్కుతున్న జాక్ అండ్ జిల్ సినిమాలో కాళిదాస్ జయరామ్ హీరోగా నటిస్తున్నాడు. -
ఒడియన్ మ్యాజిక్
నాలుగు నెలలు ముగిసిపోయాయి ‘ఒడియన్’ మూవీ షూటింగ్ను మోహన్లాల్ కంప్లీట్ చేసి. ఇప్పుడు ఈ సినిమా లేటెస్ట్ టీజర్తో పాటు రిలీజ్ డేట్ను రీసెంట్గా అనౌన్స్ చేసింది చిత్రబృందం. అన్నట్లు మోహన్లాల్ సడన్గా దాదాపు 18 కేజీలు తగ్గి స్లిమ్ ఫిట్లోకి మారిపోయింది ఈ సినిమా కోసమే. మోహన్లాల్, మంజు వారియర్, ప్రకాశ్ రాజ్ ముఖ్య తారలుగా నటించిన సినిమా ‘ఒడియన్’. ఈ సినిమా ద్వారా వీఏ శశి కుమార్ మీనన్ దర్శకుడిగా పరిచయం కానున్నారు. ‘ఒడియన్ కాదు.. ఒడియన్ మాణిక్యన్ చేయబోయే ట్రిక్స్ చూడబోతున్నారు’ అని ఈ టీజర్లో ఉంటుంది. ఒకప్పుడు కేరళలోని పాలక్కాడ్– మలబార్ తీరంలో ఉన్న ఒడియన్ ట్రైబల్స్కి చెందిన వ్యక్తి నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని టాక్. ‘ఒడియన్’ సినిమా ఈ ఏడాది అక్టోబర్ 11న విడుదల కానుంది. ఈ సినిమా కాకుండా హీరోగా ‘డ్రామా, మరార్కర్’ సినిమాలు చేస్తున్నారు మోహన్లాల్. ప్రస్తుతం సూర్య హీరోగా కేవీ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమాలో కీలక పాత్ర చేస్తున్నారాయన. -
ఒకటి ముగిసింది.. మరొకటి మొదలైంది.
వయసు పెరుగుతున్నా సినిమాలు చేయడంలో మాలీవుడ్ స్టార్ మోహన్లాల్ స్పీడ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇంకా రెట్టింపు అవుతోంది. ఇలా ఒక సినిమా షూటింగ్ కంప్లీట్ అవ్వగానో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మోహన్లాల్ హీరోగా ప్రియదర్శన్ దర్శకత్వంలో రూపొందనున్న సినిమా ‘మార్కర్–అరబీ కదాలింటే సింహం’. శనివారం ఈ సినిమాను ప్రకటించారు మోహన్లాల్. ‘‘ప్రియదర్శన్ దర్శకత్వంలో ఆంటోని పెరంబవూర్ నిర్మాణంలో రూపొందనున్న నా కొత్త సినిమాలో నటించనున్నాను’’ అన్నారు మోహన్లాల్. ఈ సినిమా త్వరలోనే సెట్స్పైకి వెళ్లనుంది. ఈ సంగతి ఇలా ఉంచితే.. వీఏ శ్రీకుమార్ మీనన్ దర్శకత్వంలో మోహన్లాల్, ప్రకాశ్రాజ్, మంజు వారియర్ ముఖ్య తారలుగా రూపొందిన సినిమా ‘ఒడియన్’ కంప్లీట్ అయ్యింది. ‘‘ఒడియన్’ షూటింగ్ను కంప్లీట్ చేశాం. 123 రోజుల ఈ సినిమా జర్నీలో సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్స్’’ అన్నారు మోహన్లాల్. అంటే మోహన్లాల్ ఒక సినిమా పూర్తి చేయగానే మరో సినిమా మొదలుపెట్టేస్తారన్న మాట. మరోవైపు మోహన్లాల్ నటిస్తున్న మరో సినిమా ‘నీరళి’ మోషన్ పోస్టర్ను రీసెంట్గా రిలీజ్ చేశారు. అజయ్ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పార్వతి నాయర్ కథానాయికగా నటిస్తున్నారు. ‘నీరళి’ చిత్రాన్ని ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
భావన లైంగిక వేధింపుల కేసు.. కొత్త ట్విస్ట్
మళయాళ స్టార్ నటి భావన కిడ్నాప్.. లైంగిక వేధింపుల కేసులో మరో మలుపు. కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న స్టార్ హీరో దిలీప్.. ప్రధాన నిందితుడు పల్సర్ సునీలు కొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చారు. తమను ట్రాప్ చేసి ఇరికించారని వాళ్లు చెబుతున్నారు. ‘నా మాజీ భార్య మంజు వారియర్కు నాకు మధ్య విభేదాలు ఉన్నాయి. అలాగే లాల్(ప్రముఖ నటుడు-దర్శకుడు)కి నేనంటే పడదు. అందుకే వారిద్దరు కుట్ర పన్ని నన్ను ఇరికించారు’ అని దిలీప్ చెబుతున్నారు. ఇక పల్సర్ సునీ.. కిడ్నాప్ వ్యవహారంతో తనకేమాత్రం సంబంధం లేదని.. తనను దోషిగా నిలబెట్టే ప్రయత్నం జరిగిందని అంటున్నాడు. గత ఏడాది ఫిబ్రవరిలో భావన లైంగిక వేధింపులకు గురైంది. ఘటన జరిగిన కొద్ది రోజులకే పల్సర్ సునీ.. అతనికి సహకరించిన మిగతా వాళ్లను కేరళ పోలీసులు అరెస్టు చేశారు. ఆపై దిలీప్ పేరు తెరపైకి వచ్చి... విచారణకు కూడా హాజరయ్యాడు దిలీప్. తర్వాత అతడిని రిమాండుకు తరలించగా.. కొన్ని నెలల పాటు జైల్లోనే ఉండాల్సి వచ్చింది. పలుమార్లు బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురై.. చివరకు బెయిల్ లభించటంతో బయటకు వచ్చాడు. ఈ కేసులో ఇప్పుడు వీరిద్దరు ఎదురు దాడికి దిగుతుండటంతో కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి. -
సమ్థింగ్ స్పెషల్
అస్సలు అనిపించదు. జస్ట్... గెస్ కూడా చేయలేం.. మోహన్లాల్ ఏజ్ని. అంతలా ఆయన ‘ఒడియన్’ సినిమా కోసం స్పెషల్ ట్రైనింగ్ తీసుకుని ఆల్మోస్ట్ 20 కేజీల బరువు తగ్గారు. ఇంతగా కష్టపడి యంగ్ లుక్లోకి వచ్చారంటే.. సినిమాలో సమ్థింగ్ స్పెషల్ ఏదో ఉండే ఉంటుంది. అదేంటో సిల్వర్ స్క్రీన్పై చూడడానికి మరెంతో టైమ్ లేదు. ఎందుకంటే ‘ఒడియన్’ సినిమా ఫైనల్ షెడ్యూల్ స్టారై్టపోయింది. మోహన్లాల్, మంజు వారియర్, ప్రకాశ్ రాజ్ ముఖ్య తారలుగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు శివకుమార్ మీనన్ తెరకెక్కిస్తున్నారు. ఆల్రెడీ ఎంతో పేరు తెచ్చుకున్న ఆర్టిస్టులు ఓ కొత్త దర్శకుణ్ణి నమ్మి అవకాశం ఇచ్చారంటే కథలో మంచి దమ్ము ఉండి ఉంటుందని ఊహించవచ్చు. మేజికల్ థ్రిల్లర్గా 1950–2000 టైమ్ బ్యాక్డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. కొన్ని రోజుల క్రితం ఈ సినిమాలో మోహన్లాల్ లుక్ను విడుదల చేశారు. తాజాగా మరో లుక్ను రిలీజ్ చేశారు మోహన్లాల్. -
మాజీ భార్యే స్కెచ్ వేసి ఇరికించింది
సాక్షి, తిరువనంతపురం : భావన కిడ్నాప్, లైంగిక దాడి కేసు ఉదంతంలో నటుడు, ఎమ్మెల్యే పీసీ జార్జ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. దిలీప్ అమాయకుడని.. అతన్ని ఈ కేసులో అనవసరంగా ఇరికించారని అంటున్నారు. మనోరమ ఆన్లైన్ ఇంటర్వ్యూలో జార్జీ మాట్లాడుతూ.. అతని మాజీ భార్య మంజూ వారియర్ దీనంతటికి కారణమన్నారు. ‘‘ఆమెకు దిలీప్ నుంచి విడిపోవటం ఇష్టం లేదు. కానీ, వేరే మార్గం లేక విడిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు అవకాశం దొరకటంతో పథకం పన్ని దిలీప్ను ఇరికించి ప్రతీకారం తీర్చుకుంది. మంజు మంచి నటే కావొచ్చు. కానీ, అంతకు మించి కఠిన హృదయం కలది’’ అని జార్జ్ చెప్పారు. దిలీప్కు ఇంత అండగా ఎందుకు నిలుస్తున్నారన్న ప్రశ్నకు... ఏ తప్పు చెయ్యని ఓ వ్యక్తి 90 రోజులు జైలు శిక్ష అనుభవించాడు. ధర్మం గెలిచి తీరాలన్న ఒకే ఉద్దేశ్యంతో తాను అతని తరపున నిల్చున్నానని.. అందు కోసం ఎక్కడిదాకా అయినా వెళ్తానని జార్జ్ బదులిచ్చారు. కాగా, జార్జ్ ఆరోపణలపై స్పందించాల్సిన అవసరం లేదని మంజు అంటున్నారు. పుంజార్ ఎమ్మెల్యే పీసీ జార్జ్ ఈ కేసులో మొదటి నుంచి దిలీప్కు మద్దతుగా వ్యాఖ్యలు చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. అంతకు నటి భావనను లక్ష్యంగా చేసుకుని ఆయన మాటల దాడి చేశారు. అంత పెద్ద దాడి జరిగితే మరుసటి రోజు షూటింగ్ కు వెళ్లటమేంటని ఆయన ప్రశ్నించారు. దీంతో భావన తనను జార్జ్ అవమానిస్తున్నారంటూ ముఖ్యమంత్రి పినరయి విజయన్కు ఓ లేఖ రాసింది. -
ఫ్రెండ్ కోసం లాయర్గా మారిన అమల
ఒకప్పటి స్టార్ హీరోయిన్ అమల మరోసారి వెండితెర మీద కనిపించేందుకు రెడీ అవుతోంది. నాగార్జునతో పెళ్లి తరువాత సినిమాలకు దూరమైన అమల చాలా కాలం తరువాత లైఫ్ ఈజ్ బ్యూటి ఫుల్ సినిమాలో తెర మీద కనిపించింది. ఇప్పుడు మరోసారి వెండితెర మీద కనిపించేందుకు ఓకె చెప్పింది ఈ సీనియర్ హీరోయిన్. తెలుగు లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న అమల నటిగా పరిచయం అయ్యింది మలయాళ ఇండస్ట్రీలోనే.. అందుకే మాలీవుడ్ లో రీ ఎంట్రీకి సై అంది. ఇటీవల హౌ ఓల్డ్ ఆర్ యు..? సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన మాలీవుడ్ హీరోయిన్ మంజు వారియర్ కోసం అమల రీ ఎంట్రీకి అంగీకరించింది. మంజు వారియర్ కీలక పాత్రలో నటిస్తున్న కేరాఫ్ సైరాభాను సినిమాలో అమల లాయర్ గా నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాపై మరిన్ని విశేషాలను త్వరలోనే వెల్లడించనున్నారు. -
మెజీషియన్గా మారనున్న హీరోయిన్!
తిరువనంతపురం: మంజూ వారియర్ ఓ నటిగానే చాలా మందికి తెలుసు. కానీ ఆమె త్వరలో ఓ ఇంద్రజాలికురాలిగా మారబోతోంది. అయితే ఈ అవతారం ఎత్తుతోంది డబ్బులు సంపాదించడానికి మాత్రం కాదండోయ్.. పిల్లల సంరక్షణ కోసం ఈ పని చేయనుంది. ఐక్యరాజ్యసమితికి చెందిన బాలల అత్యవసర నిధి విభాగమైన యూనిసెఫ్ కోసం ప్రముఖ ఇంద్రజాలికుడు, యూనిసెఫ్ ప్రచారకర్త గోపీనాథ్ ముథ్కద్ ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పుట్టినప్పటి నుంచి 1000 రోజుల లోపు వయసున్న చిన్నారుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తల్లిదండ్రులకు ఈ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పించనున్నారు. సహజంగానే సేవాకార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే మంజు కూడా ఇందులో తనవంతు సహకారాన్ని అందిస్తున్నారు. గోపీనాథ్తో కలిసి మ్యాజిక్ కూడా చేయనున్నారు. ఇందుకోసం అమె ఇంద్రజాల పాఠాలు కూడా నేర్చుకుంటున్నారట. మ్యాజిక్ ద్వారానే తల్లులకు అవగాహన కల్పిస్తానని మంజూ చెబుతున్నారు. -
సూర్యకు పచ్చజెండా?
సూర్యకు మంజువారియర్ నటన తెగనచ్చేసిందట. ఆయనిప్పుడు మాస్ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో నయనతార, ప్రణీత నాయికలుగా నటిస్తున్నారు. వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకుంది. కాగా సూర్య మలయాళంలో ఘన విజయం సాధించిన హౌ ఓల్డ్ ఆర్ యు చిత్రం తమిళం, తెలుగు, హిందీ రీమేక్ హక్కులను పొందిన విషయం తెలిసిందే.15 ఏళ్ల తరువాత నటి మంజువారియర్ రీ ఎంట్రీ అయిన చిత్రం అది. ఇంతకుముందు మలయాళంలో ప్రముఖ నాయకిగా విరాజిల్లిన మంజువారియర్ నటుడు దిలీప్ను ప్రేమ వివాహం చేసుకుని నటనకు దూరంగా ఉన్నారు. అయితే ఈ మధ్య దిలీప్తో మనస్పర్థల కారణంగా విడిపోయారు. ఆ తరువాత మంజువారియర్ నిర్మించిన చిత్రం హౌ ఓల్డ్ ఆర్ యు. ఈ చిత్రం తమిళంలో జ్యోతిక హీరోయిన్గా పునర్ నిర్మాణం అవుతోంది. ఈ విషయం అటుంచితే మలయాళంలో మంజువారియర్ నటన తెగ నచ్చేయడంతో సూర్య ఆమెను తన చిత్రంలో నటించమని కోరారట. అందుకామె పచ్చజెండా ఊపినట్లు తెలిసింది. కాగా ప్రస్తుతం మాస్ చిత్రంలో నటిస్తున్న సూర్య తదుపరి ఎ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో నటి మంజువారియర్ ఒక ముఖ్యపాత్రలో నటించే అవకాశం ఉంది. -
రీ ఎంట్రీకి సిద్ధం
జీవితం ఎటు పరిగెడుతుందో ఎక్కడ ఎలాంటి మలుపు తిరుగుతుందో ఎవరికీ తెలియదు. అలా నటీమణులుగా సాధించి ఇక చాలు అనుకుని సంసార జీవితంలో స్థిరపడిన ముగ్గురు మరోసారి ముఖానికి రంగేసుకుని విజయానికి దగ్గరవుతున్నారు. అయితే ఆ ముగ్గురి రీ ఎంట్రీకి ఒక కథ కారణం కావడం విశేషం. ఇంతకీ వారెవరో వారి కథేంటో చూద్దామా! మలయాళ నటి మంజువారియర్ ఒకప్పుడు ప్రముఖ హీరోయిన్గా వెలుగొందారు. ఆ తరువాత వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టి సినిమాలకు దూరం అయ్యారు. అలాంటి నటి చాలా గ్యాప్ తరువాత నటించిన చిత్రం హౌ ఓల్డ్ ఆర్ యు. ఈ చిత్రం ఇటీవల విడుదలై ఘన విజయం సాధించింది. ఈ చిత్రం ద్వారా రీ ఎంట్రీ అయిన మంజువారియర్కి మలయాళంలో అవకాశాలు క్యూ కడుతున్నాయి. అయితే ఈ హౌ ఓల్డ్ ఆర్ యు చిత్రం అంతటితో ఆగలేదు. తమిళంలో పునర్నిర్మాణానికి సిద్ధమవుతోంది. విశేషం ఏమిటంటే ఈ చిత్రంలో మంజువారియర్ పాత్రను జ్యోతిక పోషిస్తున్నారు. ఈ నటి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఉత్తరాదికి చెందిన ఈ బ్యూటీ దక్షిణాదిలో ముఖ్యంగా తమిళ చిత్ర పరిశ్రమను ప్రముఖ కథానాయికిగా ఏలారు. మంచి ఫామ్లో ఉండగానే నటుడు సూర్యను ప్రేమించి పెళ్లి చేసుకుని నటనకు దూరమయ్యూరు. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన జ్యోతిక హౌ ఓల్డ్ ఆర్ యు చిత్రం ద్వారా రీ ఎంట్రీ అవుతున్నారు. ఈ చిత్రాన్ని ఆమె జీవిత భాగస్వామి సూర్య నిర్మించడం విశేషం. మలయాళం చిత్రానికి దర్శకత్వం వహించిన రోషన్ ఆండ్రూస్నే ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక ఇదే చిత్రంతో బాలీవుడ్ బ్యూటీ కాజోల్ తన రెండో ఇన్నింగ్ ప్రారంభించనున్నారు. కాజోల్ భారతీయ సినీ చరిత్రలో చెరగని ముద్రవేసుకున్న నటి అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈమె కూడా ప్రముఖ నటిగా వెలుగొందుతున్న సమయంలోనే సహ నటుడు అజయ్ దేవగణ్ను ప్రేమించి పెళ్లాడారు. ఆ తరువాత నటనకు దూరమవుతూ వచ్చారు. అలాంటి నటి హౌ ఓల్డ్ ఆర్ యు చిత్రంతో నటనకు పునరంకితం అవుతున్నారు. ఈ చిత్రాన్ని హిందీలో ఆమె భర్త అజయ్ దేవగన్ నిర్మించడం విశేషం. ఇలా ముగ్గురు ప్రముఖ నటీమణుల్ని మళ్లీ తెరపైకి చూడడానికి కారణమైన చిత్రం హౌ ఓల్డ్ ఆర్ యుకు హేట్సాప్ చెప్పాల్సిందే. -
జ్యోతిక ... హౌ ఓల్డ్ ఆర్ యూ
చెన్నై: ప్రముఖ నటి జ్యోతిక తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నారా అంటే అవుననే అంటున్నాయి తమిళ సినీ పరిశ్రమ వర్గాలు. మలయాళంలో సూపర్ హిట్ అయిన 'హౌ ఓల్డ్ ఆర్ యూ' చిత్రం తమిళంలో అదే పేరుతో రీమేక్ చేయనున్నారు. 'హౌ ఓల్డ్ ఆర్ యూ' చిత్ర నిర్మాణ హక్కులను జ్యోతిక భర్త, ప్రముఖ హీరో సూర్య సొంత నిర్మాణ సంస్థ '2డీ ఎంటర్టైన్మెంట్' సొంతం చేసుకుంది. మలయాళంలో నిర్మించిన హౌ ఓల్డ్ ఆర్ యూ చిత్రంలో మంజూ వారియర్ ముఖ్య భూమిక పోషించారు. తమిళంలో రీమేక్ అవుతున్న ఆ చిత్రంలోని మంజూ పాత్రలో జ్యోతిక ఒదిగిపోనున్నారు. మలయాళంలో ఆ చిత్రానికి దర్శకత్వం వహించిన రోషన్ అండ్రూస్ తమిళంలో నిర్మిస్తున్న చిత్రానికి కూడా దర్శకత్వ వహించనున్నారు. హీరోహీరోయిన్ జ్యోతిక, సూర్యలు ఒకరినోకరు ప్రేమించుకున్నారు. పెద్దల అనుమతితో ఆ ఇద్దరు ఏడు అడుగులు నడిచారు. అనంతరం జ్యోతిక ఇద్దరు చిన్నారులు దివ్య, దియాలకు జన్మ నిచ్చింది. ఏడేళ్ల విరామం తర్వాత జ్యోతిక మరోసారి తెరంగేట్రం చేయనున్నారు. 2007లో మణికందా తమిళ చిత్రంలో జ్యోతిక నటించారు. ఇదే అమె చివరి చిత్రం అన్న సంగతి తెలిసిందే.