Michael
-
రక్షణ, భద్రతలపై ఫలవంతమైన చర్చలు
వాషింగ్టన్: అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మైఖేల్ వాల్జ్(Michael Waltz)తో ప్రధాని మోదీ(Narendra Modi) గురువారం భేటీ అయ్యారు. రక్షణ, సాంకేతికత, భద్రత వంటి అంశాలపై వారు చర్చించారు. మైఖేల్ వాల్ట్జ్తో ఫలవంతమైన చర్చ జరిగిందని ‘ఎక్స్’లో మోదీ పేర్కొన్నారు. భారత్కు ఆయన గొప్ప స్నేహితుడు అని కొనియాడారు. భారత్– అమెరికా సంబంధాల్లో రక్షణ, సాంకేతికత, భద్రత.. అత్యంత ముఖ్యమైన కోణాలని, వీటిపై తమ మధ్య ఫలప్రదమైన చర్చ జరిగిందని మోదీ తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(Artificial Intelligence), సెమీకండక్టర్స్, అంతరిక్ష రంగంలో పరస్పర సహకారానికి ఎన్నో అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ఈ భేటీలో భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సైతం పాల్గొన్నారు. ఫ్రాన్స్ పర్యటన ముగించుకున్న మోదీ స్థానిక కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం 5.30 గంటలకు అమెరికా రాజధాని వాషింగ్టన్ డి.సి.కి చేరుకున్నారు. ప్రవాస భారతీయులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. భారత్ మాతాకీ జై, వందేమాతరం, మోదీ మోదీ అంటూ నినదించారు. చలి వణికిస్తున్నా, వర్షం పడుతున్నా లెక్కచేయకుండా మోదీకి స్వాగతం పలకడానికి తరలివచ్చారు. నగరం నడిబొడ్డున ఉన్న చరిత్రాత్మక బ్లెయిర్ హౌస్లో మోదీ బస చేశారు. రాజధానిలో అడుగుపెట్టిన తర్వాత మోదీ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. భారత్–అమెరికా మధ్య సమగ్ర అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవడానికి అధ్యక్షుడు ట్రంప్తో సమావేశం కోసం ఆసక్తి ఎదురు చూస్తున్నానని పేర్కొన్నారు. భారత్, అమెరికా ప్రయోజనాలు కాపాడడంతోపాటు మన భూగోళానికి మంచి జరిగేలా పని చేస్తామన్నారు.భారత్–అమెరికా బంధానికి మద్దతుదారు తులసి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో ‘డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్’గా నియమితులైన హిందూ–అమెరికన్ తులసి గబార్డ్తో మోదీ సమావేశమయ్యారు. బ్లెయిర్ హౌస్లో ఈ భేటీ జరిగింది. భారత్–అమెరికా సంబంధాలపై వారు చర్చించారు. ఉగ్రవాద వ్యతిరేక పోరాటం, సైబర్ సెక్యూరిటీలో ఇంటెలిజెన్స్ సహకారం మరింత పెంపొందించుకోవాలని నిర్ణయించుకున్నారు. రెండు దేశాల మధ్య స్నేహం మరింత బలపడాలని తులసి గబార్డ్ కోరుకుంటున్నారని మోదీ చెప్పారు. భారత్–అమెరికా బంధానికి ఆమె గట్టి మద్దతుదారు అని పేర్కొన్నారు. ‘డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్’గా అత్యున్నత పదవి చేపట్టినందుకు తులసి గబార్డ్కు అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు మోదీ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ప్రధాని మోదీ రెండు రోజులపాటు అమెరికాలో పర్యటిస్తారు. భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఆయన సమావేశమవుతారు. ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ట్రంప్ ‘అమెరికా ఫస్టు’ అనే విధానంతో ముందుకెళ్తూ అక్రమ వలసలపై కఠినంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఈ భేటీపై ఆసక్తి నెలకొంది. ప్రధానంగా భారతీయ అక్రమ వలసదార్లపై కరుణ చూపేలా తన మిత్రుడైన ట్రంప్ను మోదీ ఒప్పిస్తారా? అనే చర్చ సాగుతోంది. భారత ఉత్పత్తులపై టారిఫ్లు పెంచక తప్పదని ట్రంప్ ఇప్పటికే సంకేతాలిచ్చారు. టారిఫ్ల మోత మోగించకుండా ఉపశమనం లభించేలా చూడడం ఇప్పుడు మోదీ ముందున్న కర్తవ్యం అని నిపుణులు చెబుతున్నారు.త్వరలో అమెరికా నుంచి మరో 487 మంది వలసదారులున్యూఢిల్లీ: మరో 487 మంది అక్రమ వలస దారులను అమెరికా ప్రభుత్వం వెనక్కి పంపించనుందని కేంద్రం శుక్రవారం వెల్లడించింది. ట్రంప్ ప్రభు త్వం చేపట్టిన వలసదారుల ఏరివేతలో భాగంగా మొదటి విడతగా ఈ నెల 5న 104 మంది అక్రమ వలసదారులతో కూడిన అమెరికా వైమానిక దళ ప్రత్యేక విమానం అమృతసర్కు రావడం తెలిసిందే. భారతీ యులుగా భావిస్తున్న మరో 487 మందిని గుర్తించిన అమెరికా అధికారులు వెనక్కి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. మరికొంతమందికి సంబంధించిన సమాచారం అమెరికా అధికారులు వెల్లడించనందున అక్రమ వలసదారుల సంఖ్య మరింత పెరిగే అవకాశా లున్నాయని ఆయన పేర్కొన్నారు. అమెరికా అధికారులు పంపించిన 487 మంది వలసదారుల పేర్లు, ఇతర వివరాల జాబితాను పరిశీలిస్తున్నామని చెప్పారు. మొదటి విడతలో పంపించిన 104 మందిలో పంజాబ్, హరియాణాలకు చెందిన వారు అత్యధికులుండటం తెలిసిందే. తమను వెనక్కి పంపే సమయంలో అమె రికా అధికారులు విమానంలో సుదీర్ఘ ప్రయాణ సమయంలో నేరస్తుల మాదిరిగా చేతులు, కాళ్లకు బేడీలు వేసి ఉంచారని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై అమెరికా అమెరికాకు ఆందోళన తెలుపుతామన్నారు. -
Mystery: షార్ట్ కుటుంబాన్ని చంపినదెవరు?
ఉదయం తొమ్మిదయ్యేసరికి క్రిస్ థాంప్సన్ తన ఓనర్ మైకేల్ షార్ట్ కోసం రోడ్డుపక్క నిలబడి ఎదురు చూస్తున్నాడు. పదే పదే టైమ్ చూసుకుంటున్నాడు. ఎంతసేపటికీ మైకేల్ రాకపోయేసరికి, ‘ఇదేంటి? తొమ్మిదికల్లా క్రిస్టియన్స్బర్గ్లో డెలివరీకి బయలుదేరదామన్న మనిషి ఇంకా రాలేదు? ఇల్లు దగ్గరే కదా, వెళ్లి చూద్దాం’ అనుకుని మైకేల్ ఇంటి వైపు అడుగులేశాడు క్రిస్.క్రిస్ వెళ్లేసరికి మైకేల్ ఇంటి తలుపులు తెరిచే ఉన్నాయి. హాల్లో కాస్త దూరంలో సోఫాలో నిద్రపోతున్నట్లు కనిపించిన తన ఓనర్ని మొదట ‘సార్.. సార్!’ అని బయట నుంచే పిలిచాడు. ఎంత పిలిచినా ఇంట్లో ఎవరూ పలుకకపోయేసరికి, దగ్గరకు వెళ్లి లేపుదామన్నట్లు ఇంటి లోపలికి అడుగులేశాడు. సోఫా దగ్గరకు వెళ్లేసరికి మైకేల్ ప్రాణాలతో లేడు. అతడి నుదుటిపైన తుపాకీతో కాల్చిన గాయం క్రిస్ని గజగజ వణికించేసింది. పైగా ఇల్లంతా ఆవహించిన నిశ్శబ్దం అతడ్ని మరింతగా భయపెట్టింది. వెంటనే బయటికి పరుగుతీసి, పోలీసులకు సమాచారమందించాడు.క్రైమ్ టేప్స్ చుట్టి, ఇల్లంతా తమ అధీనంలోకి తెచ్చుకున్న పోలీసులు. ఆ ఇంట్లో మైకేల్ మృతదేహంతో పాటు మరో శవాన్ని గుర్తించారు. అది మైకేల్ భార్య మేరీ షార్ట్ది. ఆమెను కూడా పైన బెడ్రూమ్లో నిద్రలో ఉండగానే ఎవరో కాల్చి చంపేశారు. అంటే ఒకేరాత్రి జంట హత్యలు జరిగాయి. మరి కిల్లర్ ఎవరు? అనే దిశగా విచారణ మొదలైంది. ఆ సమయంలో అధికారులకు క్రిస్ కీలక సాక్షిగా మారాడు.‘మైకేల్ సార్ది మొబైల్ హోమ్ మూవింగ్ బిజినెస్. నాలానే చాలామంది వర్కర్స్ అతని దగ్గర పనిచేస్తున్నారు. ముందురోజు రాత్రి పది దాటే వరకూ డెలివరీ పని మీద సార్ నాతోనే ఉన్నాడు. ఈరోజు ఉదయాన్నే తొమ్మిదికిక్రిస్టియన్స్బర్గ్లో డెలివరీకి వెళ్దాం, రెడీగా ఉండు అన్నాడు. ఎప్పుడూ పది నిమిషాలు ముందుండే మనిషి ఎంతకూ రాకపోయేసరికి డౌట్ వచ్చి ఇంటికి వెళ్లాను’ అని క్రిస్ చెప్పాడు. నిజానికి మైకేల్ శవాన్ని మొదటిగా చూసిన వ్యక్తి, మైకేల్ సజీవంగా ఉన్నప్పుడు చివరిసారిగా చూసిన వ్యక్తి క్రిస్ మాత్రమే!‘అసలు రాత్రికి రాత్రి మైకేల్ ఇంట్లో ఏమైంది?’ అనే ప్రశ్నతో పోలీసులు తలలు పగలగొట్టుకుంటుంటే.. మైకేల్, మేరీల బంధువులంతా ‘జెన్నిఫర్ ఎక్కడ?’ అని ప్రశ్నించారు. విచారణ అధికారులంతా తెల్లబోయారు. వారి నుంచి ‘జెన్నిఫర్ ఎవరు?’ అనే ప్రశ్న అప్రయత్నంగానే వచ్చింది.జెన్నిఫర్.. మైకేల్, మేరీల ఏకైక కుమార్తె. తొమ్మిదేళ్ల పాప. లేకలేక పుట్టిన సంతానం. చాలా అందంగా, క్యూట్గా ఉండే తెలివైన పిల్ల. ‘జంట హత్యల తర్వాత పాప కనిపించడం లేదంటే, కిల్లర్ టార్గెట్ జెన్నిఫర్ని ఎత్తుకెళ్లడమేనా?’ అనే ప్రశ్న అందరిలోనూ తలెత్తింది.నిజానికి ఆ రాత్రి మైకేల్ పది దాటాక ఇంటికి వెళ్లాడని క్రిస్ చెప్పాడు. అదే రాత్రి పదిన్నరకు మేరీ డిన్నర్ ఐటమ్స్ కొని ఇంటికి తీసుకెళ్లిందని ఇంటి సమీపంలోని ఫాస్ట్ ఫుడ్ దుకాణదారుడు చెప్పాడు. ‘సాధారణంగా రాత్రి సమయంలో తన గురక కారణంగా మేరీ నిద్ర చెడిపోకూడదని చాలాసార్లు అదే సోఫాలో నిద్రపోతుంటాడట మైకేల్. పైన బెడ్రూమ్లో మేరీ నిద్రపోతుంది. ఆ రాత్రి అదే జరిగినట్లుంది’ అని క్లారిటీ ఇచ్చింది మేరీ సోదరి.ఇంట్లో అంతా నిద్రపోయాక దుండగుడు.. మైకేల్, మేరీలను చాలా సులభంగా చంపి, పాపను ఎత్తుకుపోయాడనేది అప్పటికే స్పష్టమైంది. అంటే బహుశా ఆ కిల్లర్ ఆ ఇంటికి అతిథిగా వచ్చి ఉంటాడా? ఆ దంపతులకు సుపరిచితుడేనా? ఇలా చాలా అనుమానాలు తలెత్తాయి.మైకేల్ ఇంటి సమీపంలో ఆ రాత్రి ఎప్పుడూ చూడని తెల్లటి కారు ఒకటి చూశామని కొందరు సాక్ష్యం చెప్పారు. అదే తెల్లటి కారులో మరునాడు తెల్లవారుజామున (మృతదేహాలను చూసిన రోజు) 40 ఏళ్ల అపరిచిత వ్యక్తి వెళ్లడం చూశామని మరికొందరు ఇరుగు పొరుగువారు చెప్పారు. దాంతో కిల్లర్ ఊహాచిత్రాన్ని గీయించే పనిలో పడ్డారు అధికారులు. పాప కోసం దగ్గర్లోని అడవిని, చుట్టుపక్కల ప్రదేశాలను జల్లెడపట్టారు. అయినా ఆచూకీ దొరకలేదు.2002 ఆగస్ట్ 15న వర్జీనియా, హెన్రీ కౌంటీలో జరిగిన ఈ ఉదంతం అమెరికా వ్యాప్తంగా సంచలనంగా మారింది. హత్యలు జరిగిన ఆరు వారాల తర్వాత మైకేల్ ఇంటికి సుమారు 35 మైళ్ల దూరంలో ఉన్న స్టోన్ విల్ క్రీక్ అనే ప్రాంతంలోని అల్బర్ట్ అనే వ్యక్తి ఇంటి ముందు కుళ్లిన దవడ భాగం దొరికింది. మొదట దాన్ని గమనించిన అల్బర్ట్ ఫ్యామిలీ ఏదో జంతు కళేబరాన్ని కుక్కలు తెచ్చి పడేసి ఉంటాయని భావించారు. పరిశీలనగా చూస్తే అది పిల్లల దవడ అని తేలడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. డీఎన్ఏ టెస్ట్లో అది జెన్నిఫర్దని తేలింది. వెంటనే మృతదేహం కోసం సమీపంలో వెతికించారు. పాడుబడిన ఒక వంతెన కింద కుళ్లిపోయిన పాప శవం కనిపించింది. అయితే స్టో¯Œ విల్ క్రీక్కి గతంలో మైకేల్ చాలా మొబైల్ హోమ్స్ డెలివరీ చేశాడని తేలింది. పైగా అక్కడ చాలామంది డీలర్స్తో అతడికి స్నేహ సంబంధాలున్నాయి.పాప మృతదేహం దొరికిన చోట క్షుణ్ణంగా పరిశోధన చేసినా, ఎలాంటి ఆధారమూ దొరకలేదు. అయితే ఆ విచారణలో గ్యారిసన్ బౌమన్ అనే ఒక నేరచరిత కలిగిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. చివరికి సరైన ఆధారాలు లేకపోవడంతో అతణ్ణి విడిచిపెట్టారు. రాత్రికి రాత్రి ఎవరైనా సీరియల్ కిల్లర్ రహస్యంగా ఇంట్లోకి దూరి ఈ ఘాతుకానికి ఒడిగట్టాడా? లేక నిజంగానే ఆ క్రూరుడు పథకం ప్రకారం మైకేల్ ఫ్యామిలీని మోసం చేసి మట్టుపెట్టాడా? అనేది తేలలేదు. దాంతో ఇరవై రెండేళ్లు గడచిపోయినా ఈ ఉదంతం నేటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. ∙సంహిత నిమ్మన -
డిజిటల్ విప్లవంలో భారత్ ముందంజ
జైపూర్: డిజిటల్ విప్లవంలో భారతదేశం ముందంజలో ఉందని రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేబబ్రత పాత్ర తెలిపారు.ఆర్థిక సాంకేతికత డిజిటల్ చెల్లింపులను వేగవంతం చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ‘‘ఈ–మార్కెట్లు పురోగమిస్తున్నాయి. వాటి పరిధి విస్తరిస్తోంది. డిజిటల్ ఎకానమీ ప్రస్తుతం భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో పదో వంతుగా అంచనా. గత దశాబ్దంలో గమనించిన వృద్ధి రేటు ప్రకారం, 2026 నాటికి జీడీపీలో ఐదవ వంతుకు డిజిటల్ ఎకానమీ చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి’’ అని ఈ అంశంపై జరిగిన డీఈపీఆర్ సదస్సులో డిప్యూటీ గవర్నర్ పేర్కొన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ⇒ కొత్త వృద్ధి మార్గాలను అన్వేíÙంచడానికి, ఇప్పటికే ఉన్న మార్గాలను పటిష్టం చేసుకోడానికి భారత్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ)ని పటిష్టం చేసుకుంటోంది. శక్తివంతమైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం, యువత అధికంగా ఉండడం, అతిపెద్ద ఆరి్టఫిషీయల్ ఇంటిలిజెన్స్ టాలెంట్ బేస్ భారత్కు సానుకూల అంశం. ⇒ ఫైనాన్స్ రంగాన్ని డిజిటలైజేషన్ చేయడంపై దేశం ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. దేశంలో బ్యాంకులు మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ను పటిష్టంగా అమ లుచేస్తున్నాయి. ఆన్లైన్ ఖాతా తెరవడం, డిజిటల్ కేవైసీ, ఇంటి వద్దేకే డిజిటల్ అనుసంధాన బ్యాకింగ్ సేవలు వంటి అంశాల్లో గణనీయమైన పురోగతి కనిపిస్తోంది. సాంకేతికత అనుసంధానంలో బ్యాంకింగ్ పురోగమిస్తోంది. ⇒ ఐదు ప్రధాన అంశాలపై ఆర్బీఐ ప్రధానంగా దృష్టి సారిస్తోంది. అందరికీ డిజిటల్ ఫైనాన్షియల్ వ్యవస్థను అందుబాటులోనికి తీసుకురావడం, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్టర్ పురోగతి, సైబర్ సెక్యూరిటీ, సుస్థిర ఫైనాన్స్, అంతర్జాతీయ సహకారం, సమన్వయం ఇందులో ఉన్నాయి. ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంకులు కీలకమైనవి: ఆర్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్లను 2024కు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి దేశీయ వ్యవస్థాత్మకంగా ముఖ్యమైన బ్యాంకులు (డీ–ఎస్ఐబీలు)గా పేర్కొంది. బ్యాంకుల నుండి సేకరించిన డేటా ఆధారంగా 2024 వరకూ ఈ వర్గీకరణ అమల్లో ఉంటుందని ఆర్బీఐ తెలిపింది. ఆర్బీఐ మొదట 2014లో డీ–ఎస్ఐబీలకు సంబంధించిన ఫ్రేమ్వర్క్ను ప్రకటించింది. 2015, 2016 జాబితాలో ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్లను చేర్చింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ను 2017లో ఈ లిస్ట్లో చేర్చింది. డీ–ఎస్ఐబీ ఫ్రేమ్వర్క్ ప్రకారం, ఈ జాబితాలోని బ్యాంకులు ఎకానమీ పురోగతిలో కీలకపాత్ర పోషిస్తాయి. అందరికీ ఆర్థిక ఫలాలు అందడంలో ఈ బ్యాంకుల సేవల కీలకమైనవి. మున్సిపల్ కార్పొరేషన్ల ఆదాయాలు పెరగాలి... ఇదిలావుండగా, ఆస్తిపన్ను సంస్కరణలు, వినియోగదారు చార్జీల హేతుబద్ధికరణ, మెరుగైన వసూళ్ల విధానాల ద్వారా మున్సిపల్ కార్పొరేషన్లు తమ ఆదాయ వనరులను పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఆర్బీఐ నివేదిక సూచించింది. పెరుగుతున్న పట్టణ జనాభాతో పట్టణ ప్రాంతాల్లో అధిక–నాణ్యత ప్రజా సేవలకు డిమాండ్ వేగంగా పెరుగుతోందని ‘ము నిసిపల్ ఫైనాన్సెస్’ పేరుతో విడుదలైన ఈ నివేదికలో ఆర్బీఐ తెలిపింది. స్థానిక పన్నుల సంస్కరణలు, ఈ విషయంలో మెరుగైన అమలు విధానాలు, సంస్థాగత సామర్థ్యాన్ని పెంపొందించడం, పారదర్శక ఆర్థిక నిర్వహణ ద్వారా మునిసిపల్ కార్పొరేషన్ల ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేయాలని నివేదిక పేర్కొంది. ఈ విషయంలో ఆయా రాష్ట్రాలు నిర్దిష్ట వ్యూహాలు అవలంభించాలని పేర్కొంది. -
Michael D Patra: 2031 నాటికి రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ
ముంబై: భారత్ 2031 నాటికి ప్రంపచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మైకేల్ డి పాత్ర పేర్కొన్నారు. 2060 నాటికి ప్రంపచ నంబర్ 1 ఆర్థిక వ్యవస్థగా మారుతుందన్నారు. కాకపోతే ఈ దిశగా కొన్ని సవాళ్లను అధిగమించాల్సి ఉందన్నారు. కారి్మక ఉత్పాదకత, మౌలిక వసతులు, జీడీపీలో తయారీ రంగం వాటాను పెంచడం, ఆర్థిక వ్యవస్థను పర్యావరణం అనుకూలంగా మార్చడం తదితర సవాళ్లను ప్రస్తావించారు. ముస్సోరిలో ఐఏఎస్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో భాగంగా పాత్ర మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ ఏటా 9.6 శాతం చొప్పున దశాబ్ద కాలం పాటు వృద్ధిని సాధిస్తే దిగువ మధ్యాదాయ ఉచ్చు నుంచి బయట పడి, అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా అవతరించొచ్చని చెప్పారు. ‘‘4516–14005 డాలర్ల తలసరి ఆదాయ స్థాయి అన్నది మధ్యాదాయ దేశం హోదాకు సంబంధించినది. ఇది దాటితేనే అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థ హోదాకు చేరుకుంటాం. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా గుర్తింపునకు తలసరి ఆదాయ పరిమితి 34,000 డాలర్లకు చేరుకోవచ్చు’’అని పాత్ర పేర్కొన్నారు. కరెన్సీల విలువలు అస్థిరంగా ఉన్నాయంటూ.. దేశాల మధ్య పోలికకు ఇవి తగినవి కాదని పాత్ర అభిప్రాయపడ్డారు. దీనికి ప్రత్యామ్నాయ కొలమానం ‘కొనుగోలు శక్తి సమానత’ (పీపీపీ) అని చెప్పారు. ఆర్థిక సహాకార, అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ) పీపీపీ ప్రకారం భారత్ 2048 నాటికి రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందన్నది చెప్పడం గమనార్హం. -
Virgil: WWE సూపర్స్టార్ కన్నుమూత
వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ సూపర్స్టార్ మైకేల్ జోన్స్ కన్నుమూశాడు. డబ్ల్యుడబ్ల్యుఈ ప్రపంచంలో వర్జిల్గా ప్రసిద్ధి పొందిన అతడు 61 ఏళ్ల వయసులో అనారోగ్యంతో తుదిశ్వాస విడిచాడు. ఈ విషయాన్ని మైకేల్ జోన్స్ స్నేహితుడు, ప్రొ- రెజ్లింగ్ రిఫరీ మార్క్ చార్ల్స్ III సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ‘‘మనందరం ఎంతగానో ప్రేమించే మైకేల్ జోన్స్.. వర్జిల్, విన్సెంట్, సౌల్ ట్రెయిన్గా సుపరిచితుడైన మన స్నేహితుడు ఇక లేరనే విషాద వార్తను బాధాతప్త హృదయంతో మీతో పంచుకుంటున్నా. వర్జిల్ ప్రశాంతంగా ఆస్పత్రిలోనే కన్నుమూశాడు. అతడి ఆత్మకు శాంతి చేకూరాలి’’ అని మార్క్ చార్ల్స్ సంతాపం వ్యక్తం చేశాడు. డబ్ల్యుడబ్ల్యుఈ కూడా మైకేల్ జోన్స్ మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ అతడి కుటుంబం, అభిమానులకు సానుభూతి ప్రకటించింది. WWE is saddened to learn that Michael Jones, known to WWE fans as Virgil, has passed away. WWE extends its condolences to Jones’ family, friends and fans. pic.twitter.com/i9QDodn9BD — WWE (@WWE) February 28, 2024 కాగా 1962లో అమెరికాలోని పెన్సిల్వేనియాలో జన్మించిన మైక్ జోన్స్ 1980వ దశకంలో సౌల్ ట్రైన్ జోన్స్ పేరిట ప్రొఫెషనల్ రెజ్లర్గా మారాడు. 1986లో డబ్ల్యుడబ్ల్యుఈలో లూయిస్ బ్రౌన్గా అడుగుపెట్టి.. ఆ తర్వాత వర్జిల్గా కొనసాగాడు. ఈ క్రమంలో 1994లో డబ్ల్యుడబ్ల్యుఈ నుంచి బయటకు వచ్చిన జోన్స్ రెండేళ్లపాటు ఆ తర్వాత ఇండిపెండెంట్ సర్య్కూట్లో పలు పోటీల్లో పాల్గొన్నాడు. ఇక తరచూ అనారోగ్యం బారిన పడటం మూలాన వైద్య పరీక్షలు చేయించుకోగా తనకు కొలన్ క్యాన్సర్(పెద్ద పేగు క్యాన్సర్) ఉన్నట్లు తేలిందని మైక్ జోన్స్ 2022లో ప్రకటించాడు. అదే విధంగా డిమోన్షియా(మతిమరుపు)తో బాధపడుతున్నట్లు తెలిపాడు. కాగా గతంలో రెండుసార్లు అతడికి మైల్డ్ స్ట్రోక్ కూడా వచ్చినట్లు సమాచారం. RIP to Michael Jones, known to #WWE fans as Virgil. Here’s him beating Ted DiBiase for the Million Dollar title at SummerSlam 1991! pic.twitter.com/3PURPeKGzC — Nick Lombardi 💻✍ (@NickLombardiSK) February 28, 2024 -
ఏపీలో విద్యా విధానం భేష్
మధురవాడ (భీమిలి): ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా విధానం, పాఠ్య ప్రణాళిక (కరికులమ్)బాగున్నాయని ఐబీ సిలబస్ అంతరాత్జీయ ప్రతినిధులు యూఎస్ఏకి చెందిన సీనియర్ కరికులమ్ డిజైన్ మేనేజర్ ఆర్డర్, యూకేకి చెందిన అసోసియేట్ మేనేజర్ మైఖేల్ ప్రశంసలు కురిపించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో ఐబీ సిలబస్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో నార్త్ డివిజన్లో 10 రోజుల పర్యటనలో భాగంగా విశాఖ మహానగరంలోని చంద్రంపాలెం జెడ్పీ హైస్కూల్ను బుధవారం సందర్శించారు. ఇక్కడ కరికులమ్, కంప్యూటర్ విద్య, వసతులను పరిశీలించారు. ఉపాధ్యాయులు ఎలా బోధిస్తున్నారు, విద్యార్థులు పాఠాలను ఎలా అర్థం చేసుకుంటున్నారనే తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఐఎఫ్పీ ప్యానల్స్, ట్యాబ్స్ ఉపయోగం, పిల్లల టాలెంట్స్ను పరిశీలించారు. బైలింగ్యువల్ టెక్ట్స్బుక్స్ పిల్లలకు ఎలా ఉపయోగపడుతున్నాయనే విషయాలతోపాటు బోధన తీరును కూడా పరిశీలించారు. సైన్స్డేని పురస్కరించుకుని విద్యార్థులు తయారు చేసిన మోడల్స్, వాటి గురించి వివరిస్తున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఎస్ఈఆర్టీ ఆచార్యులు శ్రీనివాసరావు, డీఈఓ ఎల్.చంద్రకళ మాట్లాడుతూ.. ఐబీ సిలబస్ ప్రతినిధులు ఇక్కడి విద్యావిధానం బాగుందని చెప్పారన్నారు. రాష్ట్రంలో విద్యా విధానాన్ని పరిశీలించి ఆకళింపు చేసుకున్న ఐబీ ప్రతినిధులు క్షేత్రస్థాయి పర్యటనకు వచ్చినట్టు చెప్పారు. ఇందులో భాగంగా వేర్వేరు పాఠశాలలు, తరగతులను పరిశీలిస్తున్నారన్నారు. -
చదువు గొప్పదనం నేపథ్యంలో...
‘‘రాక్షస కావ్యం’ బడ్జెట్ పరంగా చిన్న సినిమా. కానీ, కథ పరంగా పెద్ద సినిమా. పురాణాల్లోని జయవిజయ పాత్రల్ని స్ఫూర్తిగా తీసుకుని, కలియుగంలో వారు జన్మిస్తే ఎలా ఉంటుంది? అనే ఊహతో ‘రాక్షస కావ్యం’ తీశా’’ అని డైరెక్టర్ శ్రీమాన్ కీర్తీ అన్నారు. అభయ్ నవీన్, అన్వేష్ మైఖేల్, పవన్ రమేష్, దయానంద్ రెడ్డి, కుశాలిని, రోహిణి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రాక్షస కావ్యం’. దాము రెడ్డి, శింగనమల కల్యాణ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 13న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో దామురెడ్డి మాట్లాడుతూ–‘‘ఇదొక వైవిధ్యమైన ప్రయోగాత్మక చిత్రం. ఈ మూవీలో ఫ్యామిలీ డ్రామా, భావోద్వేగాలతో పాటు చదువు గొప్పదనాన్ని చెబుతున్నాం’’ అన్నారు. ‘‘ఇటీవల వేసిన ప్రీమియర్స్కి మంచి స్పందన వచ్చింది’’ అన్నారు అభయ్ నవీన్. నటీనటులు కుశాలిని, దయానంద్ రెడ్డి, యాదమ్మ రాజు, అన్వేష్ మైఖేల్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: నవీన్ రెడ్డి, వసుంధరా దేవి, ఎగ్జిక్యూటివ్ప్రోడ్యూసర్: ఉమేష్ చిక్కు. -
2027 నాటికి మూడో స్థానానికి భారత్
ముంబై: భారత్ 2027 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మైకేల్ డీ పాత్ర అంచనా వేశారు. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందన్నారు. ప్రస్తుతం మన ఆర్థిక వ్యవస్థ 3.3 ట్రిలియన్ డాలర్లతో ప్రపంచంలో ఐదో స్థానంలో ఉండడం గమనార్హం. నేషనల్ బ్యాంక్ ఆఫ్ కంబోడియా నిర్వహించిన ఓ కార్యక్రమాన్ని ఉద్దేశించి పాత్రా ప్రసంగించారు. వచ్చే రెండు దశాబ్దాల్లో అంతర్జాతీయ ఆర్థిక కేంద్రం తూర్పు ఆసియావైపు మళ్లుతుందన్నారు. 2023లో ప్రపంచ వృద్ధిలో ఈ ప్రాంతం మూడింట రెండొంతులు ఆక్రమించిందని, ప్రపంచ ఉత్పత్తిలో భారత్ 16.66 శాతం వాటా పోషించినట్టు చెప్పారు. ‘‘మార్కెట్ ఎక్సే్ఛంజ్ రేట్ల పరంగా భారత్ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కాగా, కొనుగోలు శక్తి పరంగా ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. ప్రపంచంలో 140 కోట్లతో అతిపెద్ద జనాభా కలిగిన దేశం భారత్. 28 ఏళ్లలోపు యువ జనాభా ఎక్కువ. భారత పురోగతికి ఇతర ముఖ్య ప్రేరణ ఏమిటంటే ఫైనాన్షియల్ రంగం నాణ్యత పెరగడం’’అని పాత్రా వివరించారు. భారత్ వృద్ధి ఆకాంక్షలకు కావాల్సిన వనరులు సమకూర్చుకునేందుకు వీలుగా ఆధునికంగా, సమర్థవంతంగా, బలంగా పనిచేసే ఆర్థిక రంగం అవసరమని అభిప్రాయపడ్డారు. -
ఏపీ విద్యాసంస్కరణలు అద్భుతం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో విద్యాసంస్కరణలు అద్భుతంగా ఉన్నాయని నోబెల్ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ మైకెల్ రాబర్ట్ క్రేమెర్ ప్రశంసించారు. ఆయన గురువారం చికాగో యూనివర్సిటీలోని డెవలప్మెంట్ ఇన్నోవేషన్ ల్యాబ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎమిలీ క్యుపిటో బృందంతో కలిసి రాష్ట్రానికి వచ్చారు. సెంట్రల్ స్క్వేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పర్సనలైజ్డ్ అండ్ అడాప్టివ్ లెర్ణింగ్ (పాల్) ప్రాజెక్టు అమలు చేస్తున్న పాఠశాలలను ఈ బృందం పరిశీలించనుంది. సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన ఈ బృందం పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేశ్కుమార్, సమగ్ర శిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావుతో విద్యాసంబంధ అంశాలపై చర్చించింది. విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను అధికారులు ఆ బృందానికి వివరించారు. ఈ బృందం మూడురోజుల పాటు ఏలూరు జిల్లాలో వివిధ పాఠశాలలను సందర్శించనుంది. ఈ సందర్భంగా పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేశ్కుమార్ మాట్లాడుతూ.. ఏపీ విద్యావ్యవస్థపై చికాగో యూనివర్సిటీ బృందం పరిశోధించడం అభినందనీయమన్నారు. ఇలాంటి పరిశోధనలు రాష్ట్రంలో విద్యాభివృద్ధికి మరింత దోహదపడతాయని చెప్పారు. రాష్ట్రంలో విద్యార్థుల అభ్యాస ఫలితాలను మెరుగుపరిచేందుకు పర్సనలైజ్డ్ అండ్ అడాప్టివ్ లెర్ణింగ్ (పాల్) బాగుందని సమగ్ర శిక్ష ఎస్పీడీ శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఏఎస్పీడీ డాక్టర్ కె.వి.శ్రీనివాసులురెడ్డి, శామో జాయింట్ డైరెక్టర్ బి.విజయ్భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
ఘన్ను భాయ్ వినోదం
ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ అభిషేక్ నామా నిర్మిస్తున్న తాజా చిత్రం ‘ఘన్ను భాయ్’. ‘ఇస్మార్ట్ కా బాప్’ అనేది ట్యాగ్లైన్. ఈ సినిమా ద్వారా ఆదిత్య గంగసాని హీరోగా పరిచయమవుతున్నారు. ప్రణయ్ మైకల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ని విడుదల చేశారు. ‘‘పూర్తి వినోదాత్మకంగా రూపొందుతున్న చిత్రం ‘ఘన్ను భాయ్’. ఈ సినిమాని వచ్చే ఏడాది మార్చి 8న విడుదల చేస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. -
ఓటీటీలోకి వచ్చేసిన సందీప్ కిషన్ 'మైఖేల్' చిత్రం
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన తాజా చిత్రం మైఖేల్. యాక్షన్ ఎంటర్టైనర్గా విడుదలైన ఈ సినిమాలో సందీప్కు జోడీగా దివ్యాంశ కౌశిక్ నటించింది. విజయ్ సేతుపతి, వరలక్ష్మీ శరత్కుమార్ కీలక పాత్రల్లో నటించారు.రంజిత్ జయకోడి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈనెల3న విడుదలైంది. చాన్నాళ్లుగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న సందీప్కు మైఖేల్ కూడా నిరాశ పరిచిందనే చెప్పొచ్చు. పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. దీంతో నెల కూడా గడవక ముందే ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫాం ఆహాలో నేడు(శుక్రవారం)నుంచే స్ట్రీమింగ్ అవుతుంది. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. మరి థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయినవాళ్లు ఇప్పుడు ఓటీటీలో చూసేయండి మరి. Roses are red but soaked in blood. The Ultimate Gangsters Love story!! 🔥⚡#MichaelOnAHA Streaming Now ▶️ https://t.co/OJuM7oP6SN pic.twitter.com/TZHVcEseRl — ahavideoin (@ahavideoIN) February 23, 2023 -
ఈ వారం థియేటర్స్లో చిన్న చిత్రాలు..ఓటీటీలో బ్లాక్ బస్టర్స్
టాలీవుడ్లో ప్రస్తుతం చిన్న చిత్రాల హవా నడుస్తోంది. సంక్రాంతి పండగా కారణంగా జనవరిలో అన్ని పెద్ద చిత్రాలే విడుదలయ్యాయి. చిన్న సినిమాలకు థియేటర్స్ దొరకడం కష్టంగా మారింది. దీంతో ఫిబ్రవరి నెలలో వరుసగా చిన్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. అయితే వాటిలో రైటర్ పద్మభూషన్.. సార్, వినరో భాగ్యము విష్ణు కథ లాంటి సినిమాలు పాజిటివ్ టాక్ సంపాదించుకోగా.. పెద్ద చిత్రాలుగా వచ్చిన అమిగోస్, మైఖేల్ లాంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తాపడ్డాయి. ఇక ఈ నెల చివరి వారంలో థియేటర్స్ సందడి చేసేందుకు చిన్న చిత్రాలు రెడీ అయితే.. ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి పెద్ద చిత్రాలు రాబోతున్నాయి. మరి ఈ వారం ఓటీటీ, థియేటర్స్లో సందడి చేసే చిత్రాలపై ఓ లుక్కేద్దాం. మిస్టర్ కింగ్ సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి మరో నటుడు టాలీవుడ్కి పరిచయం కాబోతున్నాడు. దివంగత దర్శకురాలు విజయ నిర్మల మనవడు శరణ్ కుమార్ హీరోగా శశిధ్ చావలి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మిస్టర్ కింగ్’. యశ్విక నిష్కల, ఊర్వి సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 24న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కోససీమ థగ్స్ ప్రముఖ కొరియోగ్రాఫర్ బృందా తెరకెక్కించిన ఇంటెన్స్ యాక్షన్ తమిళ చిత్రం ‘థగ్స్’. హ్రిదు హరూన్ హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో సింహ, ఆర్కే సురేష్, మునిష్కాంత్, అనస్వర రంజన్ కీ రోల్స్ చేశారు. హెచ్ఆర్ పిక్చర్స్ పతాకంపై జీయో స్టూడియోస్ భాగస్వామ్యంతో రియా షిబు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. తెలుగులో ‘కోనసీమ థగ్స్’పేరుతో ఈ చిత్రం రిలీజ్ రాబోతుంది. డెడ్లైన్ అజయ్ ఘోష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం డెడ్ లైన్. బొమ్మారెడ్డి.వి.ఆర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 24న థియేటర్స్లో విడుదల కాబోతుంది. ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న పెద్ద చిత్రాలు వారసుడు తమిళస్టార్ విజయ్, నేషనల్ క్రష్ రష్మిక జంటగా నటించిన లేటెస్ట్ మూవీ వారిసు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగులో వారసుడు పేరుతో విడుదలై భారీ విజయం సాధించింది. ది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి రాబోతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఫిబ్రవరి 22 నుంచి అందుబాటులోకి రానుంది. వీరసింహారెడ్డి నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం 'వీరసింహారెడ్డి'. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. ఇప్పుడీ చిత్రం ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అయింది. ఫిబ్రవరి 23నుంచి ప్రముఖ ఓటీటీ హాట్ స్టార్లో వీరసింహారెడ్డి స్ట్రీమింగ్ కానుంది. మైఖేల్ సందీప్ కిషన్ హీరోగా నటించిన తొలి పాన్ ఇండియా చిత్రం మైఖేల్. రంజిత్ జయకోడి దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య ఫిబ్రవరి 3న విడుదలై బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడింది. దీంతో అనుకున్న సమయానికంటే ముందే ఓటీటీలోకి ఈ చిత్రం వచ్చేస్తుంది. ఫిబ్రవరి 24 నుంచి ఆహాలో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రంలో దివ్యాంశ కౌశిక్ హీరోయిన్గా నటించగా, విజయ్ సేతుపతి, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. వాల్తేరు వీరయ్య మెగాస్టార్ చిరంజీవి, శృతిహాసన్ జంటగా నటించిన చిత్రం‘వాల్తేరు వీరయ్య’. సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ని షేక్ చేసింది. దాదాపు రూ.250 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి మెగాస్టార్ సత్తా ఏంటో మరోసారి ప్రపంచానికి తెలియజేసింది. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఈ నెల 27 నుంచి ప్రముఖ ఓటీటీ నెట్ఫ్లిక్స్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. -
ఆయనతో చేసిన చాలా సీన్స్ తొలగించారు, బాధగా అనిపించింది: మైఖేల్ హీరోయిన్
చాలా గ్యాప్ తర్వాత సందీప్ కిషన్ హీరోగా నటించిన తొలి పాన్ ఇండియా చిత్రం మైఖేల్. రంజిత్ జయకోడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నటి దీప్శిక హీరోయిన్గా నటించింది. ఈ చిత్రంతో ఆమె టాలీవుడ్కు పరిచయమైంది. ఇక ఈ మూవీ రిలీజ్ అనంతరం ఆమె రీసెంట్గా ఓ చానల్తో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మూవీ విశేషాలతో పాటు పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ చిత్రంలో తను నటించిన అనేక సన్నివేశాలను తొలగించారని ఆమె విచారం వ్యక్తం చేసింది. చదవండి: తారకరత్న మృతి.. బాలకృష్ణ కీలక నిర్ణయం ‘నా పాత్రకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. అయితే ఇది నేను చేయాల్సింది కాదు. ఈ మూవీ కోసం మొదట మరో నటి నటించాల్సి ఉంది. కానీ ఆమె చివరి నిమిషంలో తప్పుకోవడంతో ఆ అవకాశం నాకు వచ్చింది. దర్శకుడు రంజిత్ జయకొడి నాకు ఒక్కలైన్ స్టోరీనే చెప్పారు. నాకు నచ్చడంతో వెంటనే ఓకే చెప్పాను. ఈ మూవీ మొత్తం నా పాత్ర చుట్టూనే తిరుగుతుంది. అందుకే స్టోరీ వినగానే మరో ఆలోచనకు లేకుండా నటించేందుకు ఒప్పుకున్నా. ఇందులో విజయ్ సేతుపతికి, నాకు మధ్య అనేక సన్నివేశాలను చిత్రీకరించారు. కానీ, మూవీ లెంగ్త్ను దృష్టిలో ఉంచుకుని వాటిని తొలగించారు. ఇది చాలా బాధ కలిగించింది’ అని ఆమె చెప్పుకొచ్చింది. -
ఓటీటీలోకి సందీప్ కిషన్ మైఖేల్..స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే
సందీప్ కిషన్ హీరోగా నటించిన తొలి పాన్ ఇండియా చిత్రం మైఖేల్. రంజిత్ జయకోడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్ హీరోయిన్గా నటించింది. విజయ్ సేతుపతి, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. భారీ అంచనాల మధ్య ఫిబ్రవరి 3న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ని రాబట్టుకోలేకపోయింది.ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ అనుకున్నంతగా సక్సెస్ అయితే కాలేదు. థియేటర్లలో ఓ మోస్తారుగా విడుదలైన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్కు రెడీ అయ్యింది. 'మైఖేల్' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ను 'ఆహా' ఓటీటీ వేదిక సొంతం చేసుకుంది. ఈ నెల 24న ఈ సినిమా ఆహాలోకి రానుంది.దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. The non-stop action entertainer Michael is all ready to set your screens on fire. Ready ga undandi picchekinche action tho rabothunnadu mana Michael.#MichaelOnAHA Premieres Feb 24. @sundeepkishan @VijaySethuOffl @Divyanshaaaaaa @menongautham @jeranjit @SamCSmusic @Dir_Lokesh pic.twitter.com/3573UmkClD — ahavideoin (@ahavideoIN) February 17, 2023 -
ఆ హీరోయిన్ స్థానంలో నాకు చాన్స్ వచ్చింది : 'మైఖేల్' నటి
పుట్టి పెరిగింది తమిళనాడులో అయినా నటిగా తెలుగు చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న నటి దీప్శిక. తాజాగా మైఖెల్ చిత్రంతో కోలీవుడ్ ప్రేక్షకులను పలకరింంది. సందీప్ కిషన్ కథానాయకుడుగా నటించిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి ముఖ్య పాత్ర పోషించారు. అదేవిధంగా దర్శకుడు గౌతమ్ మీనన్ ప్రధాని పాత్ర పోషించారు. నటి దివ్యాంశ కౌశిక్ కథానాయకిగా నటించిన ఈ సినిమాలో దీప్శిక కీలక పాత్రలో నటించారు. రంజిత్ జయక్కొడి తెరకెక్కించిన ఈ చిత్రం ఇటీవలే పాన్ ఇండియా స్థాయిలో విడుదలై సక్సెస్ఫుల్గా ప్రదర్శింబడుతోంది. ఈ సందర్భంగా నటి దీప్శిక తన ఆనందాన్ని పంచుకుంటూ చెన్నైలో పుట్టి పెరిగి చదువుకున్న తాను తమిళ చిత్రాల్లో నటిస్తుండగానే తెలుగులో అవకాశం వచ్చిందని తెలిపింది. అలా ఇప్పుడు అక్కడ అరడజను చిత్రాల్లో నటిస్తున్నట్లు తెలిపారు. ఇందులో తాను పోషింన జెనీఫర్ పాత్రకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయని చెప్పారు. ఇందుకు దర్శకుడు రంజిత్ జయక్కొడికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానన్నారు. నిజానికి ఈ పాత్రను వేరే ప్రముఖ నటి చేయాల్సి ఉందని, అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆమె వైదొలగడంతో దర్శకుడు తనకు అవకాశం కల్పించారని చెప్పారు. ఇందులో గౌతమ్ మీనన్ సరసన నటించడం మంచి అనుభవంగా పేర్కొన్నారు. ప్రస్తుతం తమిళంలో ఒక చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్నానని దానికి సంబంధింన వివరాలు త్వరలోనే వెలువడతాయని చెప్పారు. అదేవిధంగా తెలుగులో ఉద్వేగం అనే చిత్రంలో కూడా నటిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా తాను నటించిన రమణ కల్యాణం చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతుందని ఇది తెలుగు, తమిళం, కన్నడం, హిందీ భాషల్లో రూపొందినట్లు చెప్పారు. అదేవిధంగా తెలుగులో నటుడు రవితేజ నిర్మిస్తున్న చిత్రంలో కూడా హీరోయిన్గా నటిస్తున్నట్లు దీప్శిక వెల్లడించారు. -
అప్పుడే ఓటీటీలోకి పాన్ ఇండియా మూవీ ‘మైఖేల్’?
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన తొలి పాన్ ఇండియా చిత్రం మైఖేల్. రంజిత్ జయకోడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్ హీరోయిన్గా నటించింది. విజయ్ సేతుపతి, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. భారీ అంచనాల మధ్య ఫిబ్రవరి 3న విడుదలైన ఈ చిత్రం..తొలిరోజే నెగెటివ్ టాక్ని సంపాదించుకుంది. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ని రాబట్టుకోలేకపోయింది. ఇక థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్కు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ని ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా కొనుగోలు చేసింది. మాములూగా అయితే 8 వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలని ఒప్పందం కుదుర్చుకున్నారట. కానీ సినిమాకు యావరేజ్ టాక్ రావడంతో.. త్వరలోనే ఓటీటీలో విడుదల చేయబోతున్నారట. ఫిబ్రవరి చివరి వారంలో ఈ సినిమా ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. . కరణ్ సి ప్రొడక్షన్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ సంయుక్తంగా నిర్మించి ఈ చిత్రానికి సామ్ సీఎస్ సంగీతం అందించారు. -
Michael Movie Review: మైఖేల్ మూవీ రివ్యూ
టైటిల్: మైఖేల్ నటీనటులు: సందీప్ కిషన్, దివ్యాంశ కౌషిక్, విజయ్ సేతుపతి, గౌతమ్ మీనన్, వరలక్ష్మీ శరత్ కుమార్, వరుణ్ సందేశ్,అనసూయ తదితరులు నిర్మాతలు: భరత్ చౌదరి, పుస్కూర్ రామ్మోహన్ రావు సమర్పణ: నారాయణ్ దాస్ కె. నారంగ్ దర్శకత్వం: రంజిత్ జయకొడి సంగీతం: శ్యామ్ సీఎస్ సినిమాటోగ్రఫీ: కిరణ్ కౌశిక్ విడుదల తేది: ఫిబ్రవరి 3, 2023 కథేంటంటే.. మైఖేల్(సందీప్ కిషన్) చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో అనాథలా పెరుగుతాడు. పదేళ్ల వయసులో ముంబైలోనే అతి పెద్ద డాన్గా చలామణి అవుతున్న గురునాథ్(గౌతమ్ మీనన్)కు దగ్గరవుతాడు. రెండు సార్లు అతని ప్రాణాలు కాపాడడంతో మైఖేల్ని తన ప్రధాన అనుచరుడిగా నియమించుకుంటాడు. అయితే ఇది గురునాథ్ భార్య చారు(అనసూయ), కొడుకు అమర్ నాథ్(వరుణ్ సందేశ్)కు నచ్చదు. కొడుకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వడం లేదనే కోపం ఇద్దరికీ ఉంటుంది. మరోవైపు తనపై దాడి చేసిన ఆరుగురిలో ఐదుగురిని దారుణంగా చంపేస్తాడు గురునాథ్. మిగిలిన ఒక్కడు ఢిల్లీలో ఉన్నట్లు తెలుసుకొని అతన్ని చంపే బాధ్యత మైఖేల్కి ఇస్తాడు. ఢిల్లీ వెళ్లి మైఖేల్ ..అక్కడ తీర(దివ్యాంశ కౌశిక్)తో ప్రేమలో పడతాడు. అసలు తీర ఎవరు? గురునాథ్ని చంపడానికి ప్లాన్ చేసిన ఆరో వ్యక్తి ఎవరు? బాస్ అప్పగించిన పనిని మైఖేల్ పూర్తి చేశాడా లేదా? గురునాథ్కు, మైఖేల్కు ఉన్న సంబంధం ఏంటి? ఈ కథలో విజయ్ సేతుపతి, వరలక్ష్మీల పాత్ర ఏంటి అనేది తెరపై చూడాల్సిందే. ఎలా ఉందంటే.. అనాథలా పెరిగే ఓ కుర్రాడు ఓ పెద్ద డాన్ని దగ్గరవ్వడం... ప్రధాన అనుచరుడిగా ఉంటూ ఒకనొక దశలో అతనికే ఎదురు తిరుగుతాడు. తర్వాత ఒక ఫ్లాష్ బ్యాక్.. చివర్లో ఓ ట్విస్ట్... ఈ తరహా కథలు తెలుగు ప్రేక్షకులకు కొత్తేమి కాదు. ఇదే కాన్సెఫ్ట్కి మదర్ సెంటిమెంట్ జోడించి తెరకెక్కించిన కేజీయఫ్ చిత్రం రికార్డులు సృష్టించింది. బహుశా ఈ చిత్రాన్ని దృష్టిలో పెట్టుకొనే మైఖేల్ కథను అల్లుకున్నాడేమో దర్శకుడు రంజిత్ జయకొడి. కేజీయఫ్ తరహాలోనే హీరో గురించి ఓ వ్యక్తి వాయిస్ ఓవర్ ఇవ్వడం.. పెద్ద పెద్ద డైలాగ్స్..ఎలివేషన్స్తో సినిమాను ప్రారంభించాడు. అయితే ఇవన్నీ చెప్పుకోవడానికి బాగానే ఉన్నా.. కేజీయఫ్ తరహాలో తెరపై పండలేదు. పైగా అతి చేశారనే భావనే కలుగుతుంది తప్పా.. ఎక్కడా వావ్ మూమెంట్స్ ఉండవు. సినిమా చూసినంత సేపు కేజీయఫ్, పంజా, బాలు చిత్రాల తాలుకు సీన్స్ గుర్తుకు వస్తాయి. కథ, కథనంలో కొత్తదనం ఉండదు. రెట్రో స్టైల్లో సినిమాను తెరకెక్కించారు. విజువల్స్ పరంగా, యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించే సందర్భంలోనూ దర్శకుడు హ్యండిల్ చేసిన పద్ధతి ఆకట్టుకుంటుంది. విజయ్ సేతుపతి, వరలక్ష్మీ శరత్ కుమార్ లాంటి స్టార్స్ని సరిగా వాడుకోలేకపోయారు. సినిమా నిడివి కూడా ఎక్కువైన ఫీలింగ్ ఉంటుంది. గ్యాంగ్స్టర్ సినిమాలు ఇష్టపడేవారికి మైఖేల్ నచ్చే అవకాశం ఉంది. ఎవరెలా చేశారంటే.. మైఖేల్ పాత్ర కోసం సందీప్ చాలా కష్టపడ్డాడు. ఆ కష్టమంతా తెరపై కనపడింది. మైఖేల్ పాత్రకు సందీప్ కిషన్ సాధ్యం అయినంత వరకు న్యాయం చేసేందుకు ప్రయత్నించాడు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ లో ఆకట్టుకున్నాడు. నటుడిగా సందీప్ కిషన్ని ఒక మెట్టు ఎక్కించే సినిమా ఇది. ఇందులో గౌతమ్ మీనన్ చాలా ప్రాధాన్యత ఉన్న పాత్రను పోషించాడు. గ్యాంగ్స్టర్ గురునాథ్ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. తీర పాత్రకు దివ్యాంశ కౌశిక్ న్యాయం చేసింది. నెగిటివ్ షేడ్ ఉన్న అమర్నాథ్ పాత్రలో వరుణ్ సందేశ్ తనలోని మరో కోణాన్ని చూపించాడు.సెకండాఫ్లో వచ్చే విజయ్ సేతుపతి, వరలక్ష్మి శరత్ కుమార్ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. గురునాథ్ భార్య చారుగా అనసూయ తన పాత్ర పరిధిమేర చక్కగా నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. శ్యామ్ సీఎస్ సంగీతం పర్వాలేదు. కొన్ని సన్నివేశాల్లో నేపథ్య సంగీతం చాలా ఫ్రెష్గా ఉంటుంది.సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
పద్దెనిమిది రోజులు ఫుడ్ తీసుకోలేదు!
‘‘సందీప్లో ప్రతిభ, కష్టం కనిపించాయి కానీ అదృష్టం కనిపించలేదు’ అని హీరో నాని అన్నారు. నిజంగానే నాకు అదృష్టం కలసిరాలేదని, రావాల్సినంత పేరు రాలేదని చాలామంది అంటుంటారు. నాని చెప్పినట్లు ‘మైఖేల్’తో నాకు అదృష్టం కూడా కలిసొస్తుందని నమ్ముతున్నా’’ అని హీరో సందీప్ కిషన్ అన్నారు. రంజిత్ జయకొడి దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘మైఖేల్’. నారాయణ్ దాస్ కె. నారంగ్ సమర్పణలో భరత్ చౌదరి, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా సందీప్ చెప్పిన విశేషాలు. ► ఇప్పుటివరకూ నేను చేయాలనుకుని చేయలేకపోయినది ఏంటి? అని ఆలోచించినప్పుడు ‘మైఖేల్’ ఐడియా వచ్చింది. నా ఆలోచన రంజిత్కి చెప్పాను. ఆ ఆలోచన తీసుకుని తను చెప్పిన ‘మైఖేల్’ కథ బాగా నచ్చింది. భరత్ చౌదరి, రామ్మోహన్ రావు, సునీల్ నారంగ్ వంటి నిర్మాతలు తోడవ్వడంతో ఈ సినిమా స్థాయి భారీగా పెరిగింది. ఈ చిత్రకథకి, విజువల్ నెరేటివ్కి, సినిమాకి పాన్ ఇండియా స్థాయి ఉంది.. అందుకే పాన్ ఇండియా మూవీగా తీశాం. ► ‘మైఖేల్’ యూనిక్ స్టోరీ. చెడ్డవాళ్ల మధ్య జరిగే ప్రేమకథ ఇది. యాక్షన్, ఎమోషన్స్, డార్క్ కామెడీ ఉంటుంది. మైఖేల్ చాలా వైల్డ్. గ్యాంగ్స్టర్ కాకపోయినా నా పాత్ర ఎగ్రెసివ్గా ఉంటుంది. ► ఈ సినిమాలోని ఓ సన్నివేశం కోసం దాదాపు 18 రోజులు పాటు ఫుడ్ తీసుకోకుండా నీళ్లు మాత్రమే తాగేవాణ్ణి. ఒక దశలో కుడి కాలు పని చేయడం మానేసింది. అయినా ఒక ఫైట్ షూట్ చేసి, ప్యాకప్ చెప్పాం. తమిళ సంస్కృతి, భాష నాకు తెలుసు. అందుకే తమిళ ప్రేక్షకుల నుంచి నాకు మంచి ప్రేమ లభించింది.. అలాగే విజయ్ సేతుపతిగారు ‘మైఖేల్’లో భాగమయ్యారు. ధనుష్గారు ‘కెప్టెన్ మిల్లర్’లో నన్ను తీసుకున్నారు. ‘మైఖేల్’కి తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో నేనే డబ్బింగ్ చెప్పాను. ► ‘మైఖేల్’ నాకు చాలా స్పెషల్ జర్నీ. ఈ ప్రయాణంలో బరువు తగ్గాను, స్కూబా డైవింగ్ నేర్చుకున్నాను. అండర్ వాటర్లోనూ షూటింగ్ చేశాం. ప్రస్తుతం ‘భైరవ కోన, కెప్టన్ మిల్లర్, బడ్డీ’ సినిమాలు చేస్తున్నాను. అలాగే ‘ఫ్యామిలీ మ్యాన్ 3’ వెబ్ సిరీస్ ఉంది. -
వెనక్కి తగ్గిన స్టార్స్.. దూసుకెళ్తున్న యంగ్ హీరోలు
స్టార్ హీరోలే పాన్ ఇండియా సినిమాలు చేయటానికి వెనకడుగు వేస్తుంటే.. కుర్ర హీరోలు మాత్రం టాలీవుడ్ హద్దులు దాటుతున్నారు. పాన్ ఇండియా హీరోలం అనిపించుకోటానికి తహ తహ లాడిపోతున్నారు. ప్రయత్నిస్తే పోయేది ఏముంది చెప్పు..మహా అయితే మరో సారి ట్రై చేస్తాం అనుకుంటు..పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. ఒకేసారి తెలుగుతో పాటు..ఇతర భాషల్లో విజయం సాధించాలి అనుకుంటున్న ఈ హీరోలపై ఓ లుక్కేయండి మేజర్ మూవీతో పాన్ ఇండియా సినిమా చేసాడు అడివి శేష్. ఇక కార్తికేయా 2 తో నిఖిల్ కూడా పాన్ ఇండియా విజయం అందుకున్నాడు. ఇప్పుడు మరికొందరు యువ హీరోలు కూడా ..పాన్ ఇండియా సినిమాలతో లక్ పరిక్షించుకోబోతున్నారు. సందీప్ కిషన్ మైఖేల్ సినిమాతో వస్తున్నాడు. ఈ మూవీ తెలుగు,తమిళ్,హిందీ,కన్నడ,మలయాళ భాషలలో రిలీజ్ కాబోతుంది. నాని శ్యామ్ సింగరాయ్ సౌత్లోని అన్ని భాషల్లో రిలీజ్ అయింది. ఈ సారి ‘దసరా’తో మాత్రం పాన్ ఇండియా ప్రయత్నం చేస్తున్నాడు. సౌత్ భాషలతో పాటు హిందీలో కూడా ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. అలాగే కళ్యాణ్ రామ్ ఫస్ట్ పాన్ ఇండియా సినిమాగా డెవిల్ సినిమా రాబోతుంది. విశ్వక్ సేన్ రెండో సారి మెగాఫోన్ పట్టుకొని దాస్ క ధమ్కీ మూవీ రూపొందించాడు. ఈ సారి తనను తాను దర్శకుడిగా,హీరోగా పాన్ ఇండియా రేంజ్లో ప్రమోట్ చేసుకుంటున్నాడు. కుర్ర హీరో తేజా సజ్జా,దర్శకుడు ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో రాబోతున్న హనుమాన్ కూడా పాన్ ఇండియా రిలీజ్ కాబోతుంది. మరోవైపు టాలీవుడ్ స్టార్ హీరోలు మాత్రం ఇక్కడ సత్తా చాటుతున్నా.. పాన్ ఇండియాపై మాత్రం ఫోకస్ పెట్టడం లేదు. వరుస విజయాలతో దూసుకెళ్తున్న సూపర్ స్టార్ మహేశ్ బాబు..ఇప్పటి వరకు పాన్ ఇండియా హిట్ కోసం ట్రై చేయలేదు. త్రివిక్రమ్ కాంబో సినిమా కూడా..తెలుగులో మాత్రమే రిలీజ్ కాబోతుందట. అలాగే పలువురు సీనియర్ హీరోల సినిమాలు కూడా స్వచ్చంగా తెలుగులోనే విడుదల అవుతున్నాయి. అయితే యువ హీరోలు మాత్రం పాన్ ఇండియా రిలీజులపై జోరు చూపిస్తున్నారు. -
‘మైఖేల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ : రెడ్ డ్రెస్ లో మెరిసిన హీరోయిన్ దివ్యాంశా కౌశిక్ (ఫొటోలు)
-
సందీప్ కిషన్ ‘మైఖేల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
నాపై వచ్చిన విమర్శలకు సమాధానం ఇదే: సందీప్ కిషన్
‘‘నేను, నాని మా కెరీర్ ప్రారంభం నుంచి ఫ్రెండ్స్. కానీ, నా సినిమా వేడుకల్లో నాని పాల్గొన్న తొలి ఈవెంట్ ఇదే. ఒక సినిమా కోసం ఎంత చేయగలనో ‘మైఖేల్’ కోసం అంత చేశా. నాపై వచ్చిన విమర్శలకు ఈ సినిమానే సమాధానం’’ అన్నారు సందీప్ కిషన్. రంజిత్ జయకొడి దర్శకత్వంలో సందీప్ కిషన్, దివ్యాంశ కౌశిక్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘మైఖేల్’. నారాయణ్ దాస్ కె.నారంగ్ సమర్పణలో భరత్ చౌదరి, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 3న విడుదలకానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో నాని మాట్లాడుతూ.. ‘‘సినిమా ఇండస్ట్రీలో కష్టం, అదృష్టం, ప్రతిభ ఉంటే చాలా పైస్థాయికి చేరుకుంటారు.. సందీప్లో నాకు కష్టం, ప్రతిభ కనిపించింది.. కానీ అదృష్టం కనిపించలేదు.. అది ‘మైఖేల్’తో తనకి మొదలవుతుంది. ‘మైఖేల్’ టీజర్, ట్రైలర్ చూసినప్పుడు ఈ మూవీతో ఓ కొత్త ఒరవడి ప్రారంభం కానుందని తెలుస్తోంది. ‘శివ’ సినిమా వచ్చినప్పుడు కొత్తగా ఉందనిపించింది.. అలాంటి ఓ సినిమా ‘మైఖేల్’ కావాలని కోరుకుంటున్నాను. సునీల్, రామ్మోహన్, భరత్గార్లకు ఈ సినిమా ఒక మైలురాయిగా నిలవాలి’’ అన్నారు. చదవండి: చేతులారా ప్రాణాలు తీసుకున్నాడు.. అసలు మాట వినలేదు: వేణు మాధవ్ తల్లి ఆవేదన ‘‘మైఖేల్’ని ఇండియాలో 1500 థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు పుస్కూర్ రామ్మోహన్ రావు. ‘‘యూనివర్శల్ సబ్జెక్ట్ ఇది.. నిర్మాతలుగా మేము సంతోషంగా ఉన్నాం’’ అన్నారు భరత్ చౌదరి. ‘‘నాది చెన్నై.. నేను హైదరాబాద్ వచ్చి సినిమా తీస్తున్నాను అనే అనుభూతి నాకు కలగకుండా నాదీ హైదరాబాదే అనేలా చూసుకున్న ఈ చిత్ర నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు రంజిత్ జయకొడి. -
రిలీజ్కు రెడీ అయిన సందీప్ కిషన్ పాన్ ఇండియా మూవీ మైఖేల్
నటుడు సందీప్ కిషన్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం మైఖేల్. దివ్యాంష కౌషిక్ హిరోయిన్గా చేస్తున్నారు. విజయ్ సేతుపతి, గౌతమ్ మీనన్, టాలీవుడ్ నటుడు వరుణ్ సందేశ్, అయ్యప్ప శర్మ, అనసయ భరద్వాజ్, వరలక్ష్మి శరత్ కువర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. రంజిత్ జయక్కొడి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని భరత్ చౌదరి, పుష్కర్ రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మించారు. శ్యాం సీఎస్ సంగీతాన్ని, కిరణ్ కౌశిక్ చాయాగ్రహణం అందించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియాచిత్రంగా ఫిబ్రవరి 3వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ స్థానిక చెట్పేట్లోని లేడీ అండ్ స్కల్ ఆవరణలో మీడియాసమావేశాన్ని నిర్వహింంది. దర్శకుడు రంజిత్ జయక్కొడి మాట్లాడుతూ.. తనకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఈ చిత్రాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది నిర్మాతలేనని పేర్కొన్నారు. ఈ చిత్రంలో మైఖేల్ పాత్రకు ఎలాంటి ఎమోషనల్, డైలాగులు లేకుండా రూపొందించాలని భావించామన్నారు. దానికి నటుడు సందీప్ కిషన్ అద్భుతంగా నటించారన్నారు. అదేవిధంగా యాక్షన్ సన్నివేశాలు శక్తివంతంగా ఉండటానికి ఫైట్ మాస్టర్ చాలా శ్రమించారన్నారు. ఇందులో ఒక క్యామియో పాత్ర ఉందని దానికి అన్ని భాషలకు తెలిసిన నటుడు అవసరమయ్యారని దీంతో తన మిత్రుడు విజయ్ సేతుపతిని నటించమని కోరగా ఆయన వెంటనే అంగీకరించాలని చెప్పారు. చిత్ర కథానాయకుడు సందీప్ కిషన్ మాట్లాడుతూ.. ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొనడం సంతోషంగా ఉందన్నారు. నిర్మాత భరత్ చౌదరినే తమకు ఉద్వేగాన్ని కలిగించారన్నారు. తమ కలను ఇప్పుడు మైఖేల్గా మార్చింది కూడా ఆయనేనని పేర్కొన్నారు. సంగీత దర్శకుడు శ్యామ్ సీఎస్ ఈ చిత్రం కోసం కఠినంగా శ్రమించారని అన్నారు. దర్శకుడు రంజిత్ జయక్కొడి మం వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అని, ఆయనతో కలిసి పని చేయడం సంతోషంగా ఉందన్నారు. విజయ్ సేతుపతి మంచి మిత్రుడు అని సందీప్ కిషన్ పేర్కొన్నారు. -
మా నమ్మకం నిజమైంది : సందీప్ కిషన్
‘‘మైఖేల్’ కథని, దర్శకుడు రంజిత్ని బలంగా నమ్మాం. ట్రైలర్కి వచ్చిన అద్భుతమైన స్పందన మా నమ్మకాన్ని నిజం చేసింది. కథ, కంటెంట్, మేకింగ్ పరంగా ‘మైఖేల్’ యూనివర్సల్గా రీచ్ అయ్యే సినిమా’’ అని హీరో సందీప్ కిషన్ అన్నారు. రంజిత్ జయకొడి దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా రూపొందిన చిత్రం ‘మైఖేల్’. విజయ్ సేతుపతి, వరలక్ష్మీ శరత్ కుమార్, దివ్యాంశా కౌశిక్, వరుణ్ సందేశ్, గౌతమ్ మీనన్ కీలక పాత్రల్లో నటించారు. నారాయణ్ దాస్ కె. నారంగ్ సమర్పణలో భరత్ చౌదరి, పుసూ్కర్ రామ్మోహన్ రావు నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 3న విడుదలకానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రంజిత్ జయకొడి మాట్లాడుతూ– ‘‘నేను తమిళ్లో మూడు సినిమాలు తీశాను. తెలుగులో ‘మైఖేల్’ నా మొదటి చిత్రం. యాక్షన్, రొమాన్స్, ఎమోషన్.. ఇలా అన్ని అంశాలున్న చిత్రమిది’’ అన్నారు. ‘‘సందీప్ కిషన్కి సినిమా తప్ప మరో తపన ఉండదు. ఈ మూవీ కోసం ఆయన ఎంత కష్టపడ్డారో ట్రైలర్లోనే తెలుస్తోంది. ‘మైఖేల్’తో సక్సెస్ కొడతామనే నమ్మకం ఉంది’’ అన్నారు భరత్ చౌదరి. ‘‘రంజిత్ ‘మైఖేల్’ కథ చెప్పిన వెంటనే మరో ఆలోచన లేకుండా సినిమా చేద్దామని చెప్పా’’ అన్నారు పుస్కూర్ రామ్మోహన్ రావు. ‘‘మైఖేల్’ లాంటి మంచి సినిమాలో భాగం కావడం ఆనందంగా ఉంది’’ అన్నారు దివ్యాంశా కౌశిక్, వరుణ్ సందేశ్. -
స్టార్ వార్.. ఇక బాక్సాఫీస్ బద్దలే..!
బాక్సాఫీస్ వసూళ్ల కోసం గ్యాంగ్వార్కు రంగం సిద్ధమవుతోంది. ఆల్రెడీ కొందరు స్టార్స్ వార్ డిక్లేర్ చేసి సెట్స్లో బిజీగా ఉన్నారు. మరికొందరు రెడీ అవుతున్నారు. ఈ బాక్సాఫీస్ గ్యాంగ్వార్ పై ఓ లుక్ వేద్దాం. పోలీసాఫీసర్గా ప్రభాస్ నటించనున్న సినిమా ‘స్పిరిట్’. ‘అర్జున్రెడ్డి’ ఫేమ్ సందీప్రెడ్డి వంగా దర్శకత్వం వహించనున్న ఈ సినిమా పనులు ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానున్నాయి. ప్రభాస్ కెరీర్లో 25వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ ‘స్పిరిట్’ ముంబైలో జరిగే గ్యాంగ్వార్ బ్యాక్ డ్రాప్లో ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. అలాగే సందీప్రెడ్డి ప్రస్తుతం తెరకెక్కిస్తున్న హిందీ ‘యానిమల్’ కూడా ఇలాంటి తరహా చిత్రమే. రణ్బీర్ కపూర్ హీరోగా రూపొందుతున్న కంప్లీట్ గ్యాంగ్స్టర్ ఫిల్మ్ ఇది. తండ్రి కోసం ఓ యువకుడు గ్యాంగ్వార్లో ఎలా చిక్కుకున్నాడు? అనే కోణంలో ఈ సినిమా సాగుతుందని బాలీవుడ్ టాక్. ఈ ఏడాది ఆగస్టులో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇక దర్శకుడు సుజిత్ తెరకెక్కించనున్న సినిమాలో పవన్ కల్యాణ్ హీరోగా నటించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అనౌన్స్మెంట్ టైమ్లో ‘దే కాల్ హిమ్ ఓజీ’ అనే ట్యాగ్లైన్ తెరపైకి వచ్చింది. ‘ఓజీ’ అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అని ప్రచారం జరిగింది. దీంతో పవన్–సుజిత్ కాంబినేషన్లోని మూవీ గ్యాంగ్స్టర్ బ్యాక్డ్రాప్ అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఎర్రచందనం స్మగ్లింగ్ సిండికేట్ బ్యాక్డ్రాప్లో రూపొందిన సినిమా ‘పుష్ప’. ఆల్రెడీ విడుదలైన ‘పుష్ప’ తొలి భాగం ‘పుష్ప: ది రైజ్’లో కొన్ని గ్యాంగ్వార్ సీన్స్ చూశాం. అలాగే ‘పుష్ప: ది రైజ్’కు కొనసాగింపుగా రానున్న ‘పుష్ప: ది రూల్’లోనూ కొన్ని గ్యాంగ్ వార్ సన్నివేశాలు ఉంటాయనుకోవచ్చు. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కాగా సీనియర్ యాక్టర్ రాజశేఖర్ సైతం ఈ వెండితెర గ్యాంగ్వార్లో భాగమయ్యారు. పవన్ సాధినేని దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా తెరకెక్కుతున్న ‘మాన్స్టర్’ గ్యాంగ్స్టర్ బ్యాక్డ్రాప్ ఫిల్మ్. ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. అలాగే యువ హీరో సందీప్ కిషన్ టైటిల్ రోల్లో, విజయ్ సేతుపతి ఓ లీడ్ రోల్లో నటించిన ‘మైఖేల్’ కూడా గ్యాంగ్స్టర్ డ్రామానే. ఇంకోవైపు ‘మాస్టర్’ చిత్రం తర్వాత తమిళ ప్రముఖ హీరో విజయ్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో తాజాగా మరో సినిమా రూపొందనుంది. ముంబై నేపథ్యంలో సాగే గ్యాంగ్వార్గా ఈ సినిమా ఉంటుందనే టాక్ ఆల్రెడీ కోలీవుడ్లో మొదలైంది. ఈ సినిమాలో సంజయ్ దత్, ఫాహద్ ఫాజిల్ కీలక పాత్రలు చేయనున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. ఈ సినిమా షూటింగ్ను వీలైనంత త్వరగా పూర్తి చేసి ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు లోకేష్ అండ్ కో. అదే విధంగా ఈ సినిమా తర్వాత కార్తీతో ‘ఖైదీ’కి సీక్వెల్గా ‘ఖైదీ 2’ తీయనున్నారు లోకేష్. డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో సాగిన ‘ఖైదీ’ సినిమాకు సీక్వెల్గా రానున్న ‘ఖైదీ 2’ గ్యాంగ్వార్ ఫిల్మ్ అట. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా సెట్స్పైకి వెళ్లనుంది. అటు కన్నడంలో ఉపేంద్ర, కిచ్చా సుదీప్, శ్రియ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘కబ్జా’. ఆర్. చంద్రు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా 1960–1984 బ్యాక్డ్రాప్లోని గ్యాంగ్స్టర్ ఫిల్మ్ అని తెలుస్తోంది. కాగా, ‘సీతారామం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైన దుల్కర్ సల్మాన్ చేస్తున్న మలయాళ చిత్రం ‘కింగ్ ఆఫ్ కోతా’. పీరియాడికల్ గ్యాంగ్స్టర్ నేపథ్యంలో సాగే ఈ సినిమాకు అభిషేక్ జోషి దర్శకుడు. దుల్కర్ కెరీర్లో భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ కానున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలతో పాటు మరికొన్ని చిత్రాలు గ్యాంగ్వార్ నేపథ్యంలో ప్రేక్షకులను అలరించనున్నాయి. -
సందీప్ కిషన్ తొలి పాన్ ఇండియా చిత్రం 'మైఖేల్' ట్రైలర్ విడుదల
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన తొలి పాన్ ఇండియా చిత్రం మైఖేల్. రంజిత్ జయకోడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్ హీరోయిన్గా నటించింది. విజయ్ సేతుపతి ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు. భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఫిబ్రవరి3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ ట్రైలర్ను బాలయ్య రిలీజ్ చేశారు. కరణ్ సి ప్రొడక్షన్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో వరుణ్ సందేశ్, అనసూయ, వరలక్ష్మీ శరత్ కుమార్లు కీలక పాత్రలు పోషించారు. -
మరో పాన్ ఇండియా చిత్రంలో అనసూయ... పోస్టర్ అవుట్
యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఓవైపు స్టార్ యాంకర్గా కొనసాగుతూనే, మరోవైపు వరుస సినిమాలతో సత్తా చాటుతోంది. రంగస్థలం, పుష్ప సినిమాలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను సొంతం చేసుకున్న ఈ బ్యూటీ తాజాగా మరో పాన్ ఇండియా సినిమాలో కీలక పాత్ర పోషిస్తుంది. యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా మైఖేల్ అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈయనతో పాటు అనసూయ కూడా ముఖ్య పాత్రలో కనిపించనుంది. ఈ మేరకు స్పెషల్ పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్. మ్యాడ్ ఆఫ్ క్వీన్ అంటూ పవర్ ఫుల్ గెటప్లో అనసూయ కనిపిస్తుంది. మరి ఈ సినిమా అనసూయ కెరీర్కు ఎంతవరకు ప్లస్ అవుతుందన్నది చూడాల్సి ఉంది. -
మైకేల్ లేకుంటే పదుల సంఖ్యలో ప్రాణాలు పోయేవే!
శ్రీనగర్: జమ్ము కశ్మీర్ రాజౌరీలో కొత్త సంవత్సరం వేడుకల సమయంలో హిందూ కుటుంబాలుండే చోటుని లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులు.. మారణకాండకు తెగబడి ఆరుగురిని బలిగొన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ ఉగ్రవాదుల ఎరివేత కోసం రెండు వేల మంది సిబ్బందితో భారీ ఎత్తున్న సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది అక్కడ. అయితే.. ఉగ్రవాదుల కదలికలను పసిగట్టి అప్రమత్తమై మరికొందరి ప్రాణాలు పోకుండా కాపాడాడు మైకేల్. వాడొక పెంపుడు కుక్క!. స్థానికంగా నివాసం ఉంటున్న నిర్మలా దేవి కుటుంబం ఓ కుక్కను పెంచుకుంటోంది. అయితే దాడి జరిగిన రోజు (ఆదివారం).. ముసుగులు తుపాకులతో ఉగ్రవాదుల రాకను దూరం నుంచే గమనించిన మైకేల్.. ఏకధాటిగా మొరుగుతూనే ఉంది. సాధారణంగా కంటే గట్టిగా అది మొరగడం గమనించిన నిర్మలా దేవి మనవరాలు.. ఏం జరిగిందా? అని బయటకు వచ్చి చూసింది. కాలనీ చివరి నుంచి తుపాకులతో ఇద్దరు ఇంటి వైపు వస్తుండడం గమనించింది. వెంటనే విషయాన్ని నిర్మలా దేవికి చెప్పడంతో ఆమె మరో గదిలోకి పరిగెత్తుకెళ్లి తలుపులు వేసుకుంది. ఈలోపు ఆ ఇంటి హాలులోకి వచ్చిన ఉగ్రవాదులు.. ఎవరూ కనిపించపోయేసరికి టీవీ, ఫర్నీచర్పై కాల్పులు జరిపి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే కుక్క మొరగడం, ఆపై తుపాకుల మోతతో చుట్టుపక్కల వాళ్లు కూడా అప్రమత్తమై ఇళ్లలోనే ఉండిపోయారు. అంతా అలా అప్రమత్తం కావడానికి కారణం మైకేల్గా భావించి.. దాని మీదకు పలు రౌండ్ల కాల్పులు జరిపారు ఉగ్రవాదులు. అయితే మైకేల్ మాత్రం అక్కడి నుంచి పారిపోయి ప్రాణాలు కాపాడుకుంది. సమయానికి అప్రమత్తమై ప్రాణాలతో తాము ఉండడానికి మైకేల్ కారణమని భావించిన కాలనీవాసులు దానికి ఘనంగా సన్మానం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఇక రాజౌరీలో రెండు రోజుల వ్యవధిలో జరిగిన ఉగ్ర దాడుల్లో(కాల్పుల ఘటన, ఐఈడీ బ్లాస్ట్) ఆరుగురు మరణించారు. ఇందులో ఇద్దరు చిన్నారులు ఉండడం గమనార్హం. తమ ప్రాణాలకు భద్రత కరువైందని హిందువులు రోడ్డెక్కి నిరసన చేపట్టగా.. వాళ్లను భద్రతా అధికారులు శాంతింపజేసి పంపించారు. -
సందీప్ కిషన్ తొలి పాన్ ఇండియా సినిమా 'మైఖేల్' రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న తాజా చిత్రం మైఖేల్. రంజిత్ జేయకొడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర సినిమాస్ మరియు కరణ్ సి ప్రొడక్షన్స్ పతాకాలపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సందీప్ కిషన్ కెరీర్లో తొలిసారి పాన్ ఇండియా స్థాయిలో తెరెకెక్కిన ఈ సినిమాలో విజయ్ సేతపతి, గౌతమ్ మీనన్లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈమూవీ నుంచి వచ్చిన ఫస్ట్లుక్ పోస్టర్స్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమాపై ఇప్పటికే పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం నుంచి క్రేజీ అప్డేట్ వదిలారు మేకర్స్. ఈ సినిమా రిలీజ్ డేట్ను అనౌన్స్ చేస్తూ కొత్త పోస్టర్ను రిలీజ్ చేశారు. ఫిబ్రవరి 3న దక్షిణాది భాషలతో పాటు హిందీలో ఏకకాలంలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.మైఖేల్ సినిమాలో సందీప్కిషన్కు జోడీగా మజిలీ ఫేమ్ దివ్యాంశ కౌషిక్ హీరోయిన్గా నటిస్తోంది. Meet the Man who Loved the Hardest #MICHAEL 🖤 Worldwide only in Theatres on Feb 3rd, 2023 🔥#MichaelfromFEB3rd 👊🏾@VijaySethuOffl @Divyanshaaaaaa @menongautham @anusuyakhasba @jeranjit @itsvarunsandesh @SamCSmusic @SVCLLP @KaranCoffl #NarayandasNarang pic.twitter.com/5NEnI0KZgW — Sundeep MICHAEL Kishan (@sundeepkishan) January 3, 2023 -
'మైఖేల్' మూవీ నుంచి సిద్ శ్రీరామ్ పాడిన రొమాంటిక్ సాంగ్ విన్నారా?
హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా బ్లాక్ టు బ్యాక్ చిత్రాలతో దూసుకుపోతున్న హీరోల్లో సందీప్ కిషన్ ఒకరు. తాజాగా ఆయన నటిస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రం మైఖేల్. దివ్యా కౌశిక్ ఇందులో హీరోయిన్గా నటిస్తుండగా, విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషిస్తున్నారు. రణ్ సీ ప్రొడక్షన్స్ ఎల్ఎస్పీ శ్రీ వేంకటేశ్వర సినిమాస్ సంస్థల అధినేతలు భరత్ చౌదరి, పుష్కర్ రాయ్ మోహన్రావ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. రంజిత్ జయకొడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలె ఈ మూవీ ఫస్ట్లుక్ పోస్టర్ను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా కాగా తాజాగా ఈ మూవీలోని ఫస్ట్ సింగిల్ ‘నువ్వుంటే చాలు’ సాంగ్ను విడుదల చేశారు. సిద్ శ్రీరామ్ పాడిన ఈ మెలోడీ సాంగ్ ఎంతగానో ఆకట్టుకుంటుంది. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న మేకర్స్ త్వరలోనే విడుదల తేదీని వెల్లడించనున్నారు. -
సందీప్ కిషన్ పాన్ ఇండియా మూవీ నుంచి రొమాంటిక్ సాంగ్ అప్పుడే!
సందీప్ కిషన్, దివ్యాంశా కౌశిక్ ‘నువ్వుంటే చాలు...’ అని ప్రేమ పాట పాడుకున్నారు. ఈ ఇద్దరూ జంటగా నటించిన ‘మైఖేల్’ చిత్రంలోని పాట ఇది. సినిమాలోని ఈ తొలి పాటను ఈ 28న విడుదల చేయనున్నారు. ఆదివారం ఈ విషయాన్ని ప్రకటించి, పాటలోని ఓ పోస్టర్ని చిత్రబృందం విడుదల చేసింది. రంజిత్ జయకొడి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్ఎల్పితో కలిసి డిస్ట్రిబ్యూటర్ భరత్ చౌదరి, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మించిన ఈ చిత్రానికి నారాయణ్ దాస్ కె. నారంగ్ సమర్పకులు. ‘‘సందీప్ కిషన్కి తొలి పాన్ ఇండియా చిత్రం ఇది. ఈ సినిమా కోసం సందీప్ అద్భుతంగా మేకోవర్ అయ్యారు. సామ్ సీఎస్ మంచి పాటలు ఇచ్చారు. రొమాంటిక్ సాంగ్ ‘నువ్వుంటే చాలు..’ని తెలుగు, తమిళ భాషల్లో ఈ 28న విడుదల చేయనున్నాం. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని నిర్మాతలు తెలిపారు. డైరెక్టర్ గౌతమ్ మీనన్ విలన్గా నటించిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, వరలక్ష్మీ శరత్కుమార్, వరుణ్ సందేశ్ కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రానికి కెమెరా: కిరణ్ కౌశిక్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యుసర్: కె. సాంబశివరావు. -
మైఖేల్ సినిమా కోసం 24కిలోల బరువు తగ్గాను : సందీప్ కిషన్
సందీప్ కిషన్ హీరోగా నటించిన తాజా చిత్రం మైఖేల్. రంజిత్ జయకొడి దర్శకత్వం వహించిన ఈ సినిమాను నారాయణ్దాస్ కె.నారంగ్ సమర్పణలో భరత్ చౌదరి, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. దివ్యాంశా కౌశిక్ హీరోయిన్. తాజాగా ఈ సినిమా టీజర్ను విడుదల చేశారు. మాస్ యాక్షన్ సీన్స్తో సందీప్ కిషన్ అదరగొట్టాడు. మొదటిసారి పూర్తిగా యాక్షన్ సినిమా చేస్తున్న సందీప్ కిషన్ ఈ సినిమాలో సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించారు. ఈ సందర్భంగా టీజర్ లాంచ్ ఈవెంట్లో సందీప్ కిషన్ మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం మూడు సంవరత్సరాల నుంచి కష్టపడుతున్నాను. ఇందుకోసం దాదాపు 24 కిలోల బరువు తగ్గాను. మైఖేల్ సినిమా మీద అంచనాలు చాలానే ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చారు. -
కాలర్ ఎగరేసుకునే సమయం ఇది
సందీప్ కిషన్ హీరోగా, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో రంజిత్ జయకొడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘మైఖేల్’. దివ్యాంశా కౌశిక్ హీరోయిన్. నారాయణ్దాస్ కె.నారంగ్ సమర్పణలో భరత్ చౌదరి, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్ను గురువారం విడుదల చేశారు. సందీప్ కిషన్ మాట్లాడుతూ–‘‘నాకు నేను పెట్టుకున్న అతి పెద్ద పరీక్ష మైఖేల్. మూడుసంవత్సరాల క్రితం ‘మైఖేల్’ వర్క్ను స్టార్ట్ చేశాం. ఈ సినిమా కోసం దాదాపు 24 కేజీల బరువు తగ్గాను. సినిమాలను ఆదరించడంలో తెలుగు ప్రేక్షకులు నంబరవన్ అని నంబర్స్ చెబుతున్నాయి. తెలుగు ఇండస్ట్రీ కాలర్ ఎగరేసుకునే సమయం ఇది’’ అన్నారు. ‘‘మైఖేల్’ చేసేందుకు ఒప్పుకున్న సందీప్ కిషన్, విజయ్ సేతుపతిలతో పాటు నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు రంజిత్. ‘‘మైఖేల్’ పట్ల హ్యాపీగా ఉన్నాం’’ అన్నారు రామ్మోహన్ రావు, భరత్ చౌదరి. -
సందీప్ కిషన్ 'మైఖేల్' మూవీ టీజర్ లాంఛ్ ఈవెంట్ (ఫొటోలు)
-
సందీప్ కిషన్ 'మైఖేల్' టీజర్ డేట్ ఫిక్స్
సందీప్ కిషన్, విజయ్ సేతుపతి, గౌతమ్ మీనన్, దివ్యాంశా కౌశిక్, వరలక్ష్మీ శరత్కుమార్, వరుణ్ సందేశ్ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మైఖేల్’. రంజిత్ జయకొడి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్ఎల్పీపై భరత్ చౌదరి, పుసుకర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమా టీజర్ని ఈ నెల 20న రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ‘‘భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న చిత్రం ‘మైఖేల్’. సందీప్ కిషన్ చేస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా ఇది. విజయ్ సేతుపతి యాక్షన్ రోల్ చేస్తున్నారు. డైరెక్టర్ గౌతమ్ మీనన్ విలన్గా చేస్తున్నారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: కిరణ్ కౌశిక్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యుసర్: శివచెర్రీ. -
సందీప్ కిషన్ 'మైఖేల్' ఫస్ట్లుక్ చూశారా?
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న తాజా చిత్రం మైఖేల్. రంజిత్ జేయకొడి దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర సినిమాస్ మరియు కరణ్ సి ప్రొడక్షన్స్ పతాకాలపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కతున్న ఈ సినిమాలో విజయ్ సేతపతి, గౌతమ్ మీనన్లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా శనివారం(మే7)న సందీప్ కిషన్ బర్త్డే సందర్భంగా ఈ సినిమా ఫస్ట్లుక్ పోస్టర్ను విడుదల చేశారు. ఇందులో సిక్స్ప్యాక్ బాడీతో చేతిలో గన్ పట్టుకొని పవర్ఫుల్గా కనిస్తున్నాడు.తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ తదితర భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. సందీప్ సరసన దివ్యాంశ కౌశిక్ హీరోయిన్గా నటిస్తుంది. వరలక్ష్మి శరత్కుమార్, వరుణ్ సందేశ్లు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. Happy to share the Fiery 1st Look of my Dear most director @jeranjit ‘s #Michael 👊🏽@Dir_Lokesh presents 🌟#HBDSundeepKishan ❤️@sundeepkishan @menongautham @varusarath5 @itsdivyanshak @SVCLLP @KaranCoffl @SamCSmusic @adityamusic @sivacherry9 @proyuvraaj pic.twitter.com/N6qZc498Jz — VijaySethupathi (@VijaySethuOffl) May 7, 2022 -
గోవా బీజేపీకి షాక్
పణజి: గోవాలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర మంత్రి మైఖేల్ లోబో, మరో ఎమ్మెల్యే ప్రవీణ్ జాంతే బీజేపీకి సోమవారం రాజీనామా చేశారు. కలంగుటే నియోజక వర్గం నుంచి మైఖేల్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. నౌకాశ్రయాలు, వ్యర్థ్యాల నిర్వహణ శాఖకు మంత్రిగా ఉన్నారు. బీజేపీ ప్రజల పక్షాన లేదని అందుకే పార్టీని వీడుతున్నట్లు మైఖేల్ తెలిపారు. మైఖేల్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు మయం నియోజక వర్గం ఎమ్మెల్యే ప్రవీణ్ జాంతే చెప్పారు. తన నియోజకవర్గాన్ని నిరుద్యోగ సమస్య పట్టి పీడిస్తోందని, సమస్యకు బీజేపీ సర్కార్ ఎలాంటి పరిష్కారం చూపలేకపోయిందని ప్రవీణ్ ఆరోపించారు. -
'మైఖేల్'గా సందీప్ కిషన్.. పోస్టర్ రిలీజ్
యంగ్ హీరో సందీప్ కిషన్ యమ జోరుమీదున్నాడు. ఇప్పటికే గల్లీ రౌడీతో రెడీగా ఉన్న ఆయన మరో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సందీప్ కెరీర్లో 29వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు రంజిత్ జయకొడి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి బ్యానర్పై భరత్ చౌదరి, పుష్కర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. తాజాగా ఈ సినిమాకు 'మైఖేల్' అనే టైటిల్ను ప్రకటించి పోస్టర్ను రిలీజ్ చేశారు. రక్తంతో తడిసిన చేతులకు బేడీలు వేసినట్లున్న పోస్టర్ ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి. Making our Special Day a reMARKable one🙌 Proudly Presenting our Pan India film 🇮🇳 Titled #MICHAEL 🌟ing Young & Promising🌟 @sundeepkishan💥 & MakkalSelvan @VijaySethuOffl🔥 🎬 @jeranjit @KaranCoffl #SundeepKishan29 మైఖేల్ மைக்கேல் माइकल ಮೈಕೆಲ್ മൈക്കിൾ#HBDSunielNarang pic.twitter.com/4LniqalbAD — Sree Venkateswara Cinemas LLP (@SVCLLP) August 27, 2021 చదవండి : తల్లిదండ్రులకు మళ్లీ పెళ్లి చేసిన బుల్లితెర నటి అమితాబ్ బాడీగార్డు జీతం ఎంతో తెలిస్తే గుడ్లు తేలేయాల్సిందే! -
ఆసక్తి రేపుతున్న ‘మైకెల్’ట్రైలర్
సాయి చరణ్ తేజ్ , ఆదిత్య శివ, శేఖర్ జిఎంఎస్, చిరంజీవి, మారుతీ సాకారం, మణిరాజ్, పవన్.జి, చిన్న నరసింహులు, అవినాష్ ప్రధాన పాత్రలలో యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న చిత్రం ‘మైకెల్’. ఈ చిత్రానికి కిరణ్ దర్శకత్వం వహిస్తున్నారు. వన్ మీడియా బ్యానర్ పై పార్ధు రెడ్డి నిర్మిస్తున్నారు. నవీన్ ప్రకాష్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా ప్రవీణ్ కుమార్ అడిషనల్ స్క్రీన్ ప్లే , డైలాగ్స్ అందించారు.. పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.. ఇటీవలే విడుదలైన చిత్రం ఫస్ట్ లుక్ మంచి రెస్పాన్స్ రాగా శుక్రవారం ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు చిత్ర బృందం. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత పార్థు రెడ్డి మాట్లాడుతూ.. ‘సినిమాను చూశాను చాలా బాగా వచ్చింది. దర్శకుడు చెప్పిన దానికన్నా చాలా బాగా సినిమా ని తెరకెక్కించాడు. అందరు కొత్తవాళ్లే అయినప్పటికీ ఎంతో అనుభవం ఉన్న నటుల్లా నటించారు.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకున్న మా సినిమాను త్వరలోనే విడుదల చేస్తాం’ అన్నారు. -
కరోనాను జయించాడు.. కానీ!
సియాటిల్: అమెరికాలోని సియాటిల్కు చెందిన మైఖేల్ ఫ్లార్ పేరు మీద ఇప్పుడు చాలా రికార్డులున్నాయి. ఒకటి, ఆయన 70 ఏళ్ల వయస్సులో కరోనాను జయించారు. రెండు, చాలా ఎక్కువ కాలం కోవిడ్–19తో పోరాడి, మృత్యువుపై విజయం సాధించారు. మూడు, కరోనా చరిత్రలోనే అత్యధిక మొత్తం బిల్ను ఆసుపత్రి నుంచి పొందారు. ఫ్లార్కు చికిత్స అందించిన ఇసాఖ్లోని స్వీడిష్ మెడికల్ సెంటర్, ఆయన చికిత్సకుగానూ 1.1 మిలియన్ డాలర్ల బిల్లు వేసింది. అంటే మన రూపాయల్లో దాదాపు 8.35 కోట్లు. మరో రికార్డు కూడా ఉంది. ఆయన చికిత్స, అందుకైన ఖర్చు వివరాలను మొత్తం 181 పేజీల్లో పొందుపరిచి, ఒక పుస్తకంలా ఆయనకు అందించారు. ఫ్లార్ దాదాపు మృత్యు ముఖం వరకు వెళ్లి వచ్చాడు. ప్రాణాలతో బయటపడే అవకాశాలు లేవని డాక్టర్లు భార్య, పిల్లలకు చెప్పేశారు. నైట్ డ్యూటీ నర్స్ చివరి కాల్ అని చెప్పి, కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడించింది. కానీ, కరోనాకు అంత ఈజీగా లొంగిపోదలచుకోలేదు ఫ్లార్. కరోనాతో 62 రోజుల పాటు పోరాడి విజయం సాధించాడు. ఆయనను వైద్యులు, ఇతర పేషెంట్లు అంతా ‘మిరాకిల్ చైల్డ్’ అనడం ప్రారంభించారు. డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చిన తరువాత.. 181 పేజీల పుస్తకాన్ని ఆసుపత్రి సిబ్బంది ఆయనకు పంపించారు. ఆ పుస్తకంలో చికిత్సకు సంబంధించిన పూర్తి వివరాలతో పాటు 1.1 మిలియన్ డాలర్ల బిల్లు వివరాలు కూడా ఉన్నాయి. ఆ భారీ బిల్లు చూసి ఫ్లార్ అవాక్కయ్యారు. బిల్లు చూసి హార్ట్ అటాక్ వచ్చినంత పనయిందన్నారు. ‘బిల్లు భారీగా ఉంటుందనుకున్నాను కానీ.. ఇంత భారీగా ఉంటుందనుకోలేద’న్నారు. ఐసీయూలో ఫ్లార్ ఉన్న గది అద్దె రోజుకు 9,736 డాలర్లు. ఆ ఐసోలేషన్ చాంబర్లో ఆయన 42 రోజులున్నారు. అలాగే, 29 రోజులు వెంటిలేటర్పై ఉన్నారు. ఆ బిల్లు రోజుకు 2,835 డాలర్లు. మెడిసిన్స్ ఖర్చు మొత్తం బిల్లులో దాదాపు నాలుగో వంతు. కిడ్నీలు, గుండె, ఊపిరితిత్తులు.. ఇలా మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ దిశగా వెళ్తున్న సమయంలో రెండు రోజుల పాటు అందించిన చికిత్స ఖర్చు లక్ష డాలర్లు. ఇలా అన్ని కలిసి మొత్తం బిల్లు 11 లక్షల డాలర్లయింది. అదృష్టవశాత్తూ, ఫ్లార్కు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది. దాంతో, బిల్లులో ఎక్కువ భాగం చెల్లించాల్సిన పనిలేదు. అలాగే, అది కోవిడ్–19 కనుక మొత్తం బిల్లు చెల్లించాల్సిన అవసరం రాకపోవచ్చు. బిల్లును చూడగానే ఎలా ఫీల్ అయ్యారన్న ప్రశ్నకు.. ‘బతికినందుకు సిగ్గుగా అనిపించింది’అని జవాబిచ్చారు ఫ్లార్. -
అలెక్సా బూతులు తిడుతోంది!
29 ఏళ్ల మైఖేల్ స్లడే ఎప్పటిలాగే ఇంటికొచ్చి అలెక్సాని ఆన్ చేసి ఏదైనా మంచి సంగీతం వినిపించమని అడిగాడు. అయితే అది సంగీతం వినిపించడానికి బదులు బూతులు తిట్టడం మొదలెట్టింది. ఎప్పుడడిగినా పాటలు వినిపించే ఈ వర్చువల్ అసిస్టెంట్... ఉన్నట్టుండి బూతులందుకోవడంతో మైఖేల్ షాక్ తిన్నాడు. ఏం జరిగిందో తెలియక కంగారు పడ్డాడు. అంతకు ముందురోజే మైఖేల్ తన అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం రద్దు చేసుకున్నాడు. దాని విషయమై కస్టమర్ కేర్కు చెందిన వ్యక్తితో మాట్లాడాడు. సభ్యత్వం రద్దు చేసుకున్నప్పటి నుంచి అలెక్సా ఇలా వింతగా ప్రవర్తించడంతో దానికీ దీనికీ ఏదైనా సంబంధం ఉందేమోనని అనుమానించాడు. అమెజాన్ను సంప్రదిస్తే అలాంటిదేమీ లేదన్నారు. అలెక్సా ఎందుకలా అనుచిత పదాలు వాడుతోందో తమకూ అర్థం కావడం లేదన్నారు. అలెక్సా ఖాతా వివరాలు ఇస్తే ఏం జరిగిందో పరిశీలించి చెబుతామని చెప్పారు. జరిగిన పొరపాటుకు పరిహారంగా అమెజాన్ మైఖేల్కు 5 పౌండ్ల నగదు, ఏడాది అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం ఉచితంగా ఇచ్చింది.‘ఇంటికొచ్చాకా రోజూలాగే అలెక్సాను ఏదైనా సంగీతం వినిపించమని అడిగాను. ‘తప్పకుండా. మీ పాటల జాబితా ఇది......(అని ఓ బూతు పదం వాడింది). తర్వాత క్షమించండి ఏదో పొరపాటు జరిగింది’ అని అలెక్సా చెప్పే సరికి షాక్ తిన్నా. అలెక్సా అలా మాట్లాడటం నమ్మలేకపోయా’ అన్నాడు సౌత్వేల్స్కు చెందిన మైఖేల్. అమెజాన్ సాంకేతిక నిపుణులు కూడా ఇలా ఎందుకు జరిగిందో చెప్పలేకపోయారన్నాడు. -
మైఖేల్గా ఇళయదళపతి?
ఇళయదళపతి విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రానికి మైఖేల్ టైటిల్ను చిత్ర వర్గాలు పరిశీలిస్తున్నట్లు తాజా సమాచారం. విజయ్, దర్శకుడు అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇంతకు ముందు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన తెరి, మెర్శల్ చిత్రాలు సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. ఆ రెండు చిత్రాలకు పూర్తి భిన్నమైన కథాంశంతో తాజాగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. ఇది విజయ్కు 63వ చిత్రం. నయనతార నాయకిగా నటిస్తోంది. విల్లు చిత్రం ఈ జంట హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ఇదే. కదిర్, వివేక్, యోగి బాబు ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్. రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఏజీఎస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫుట్బాల్ క్రీడ నేపథ్యంలో రూపొందుతోందని సమాచారం. ఇందులో విజయ్ ఫుట్బాల్ క్రీడ శిక్షకుడిగా నటిస్తున్నట్లు తెలిసింది. చిత్రంలో ఆయన పేరు మైఖేల్ అని సమాచారం. హీరో పేర్లతో ఇంతకు ముందు చాలా చిత్రాలు వచ్చాయి. దీంతో విజయ్ 63వ చిత్రానికి కూడా మైఖేల్ పేరును చిత్ర వర్గాలు పరిశీలిస్తున్నట్లు సమాచారం. చిత్రాన్ని దీపావళికి తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. -
అగస్టా కేసు : సీబీఐ కస్టడీకి మైకేల్
సాక్షి, న్యూఢిల్లీ : అగస్టా వెస్ట్ల్యాండ్ కేసులో మధ్యవర్తిగా భావిస్తున్న క్రిస్టియన్ మైకేల్ను సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానం బుధవారం ఐదు రోజుల పాటు సీబీఐ కస్టడీకి అనుమతించింది. అగస్టా కేసులో విచారణ కొనసాగుతోందని, ఈ డీల్లో రెండు దుబాయ్ ఖాతాలకు సొమ్మును చేరవేసినందున మైకేల్ కస్టడీ తమకు అవసరమని సీబీఐ న్యాయవాది కోర్టుకు నివేదించారు. మరోవైపు ప్రత్యేక న్యాయస్ధానంలో బెయిల్ కోరుతూ మైకేల్ పిటిషన్ దాఖలు చేసుకోగా ఆయనను ఐదు రోజులు సీబీఐ కస్టడీకి అనుమతిస్తూ బెయిల్ పిటిషన్పై విచారణ తదుపరి చేపడతామని న్యాయస్ధానం పేర్కొంది. మైకేల్ను ఉదయం, సాయంత్రం గంట పాటు కలుసుకునేందుకు ఆయన న్యాయమూర్తికి కోర్టు అనుమతించింది. అగస్టా ఒప్పందంలో అభియోగాలు ఎదుర్కొంటున్న బ్రిటన్ పౌరుడు మైకేల్ను మంగళవారం రాత్రి దుబాయ్ ప్రభుత్వం భారత్కు అప్పగించిన సంగతి తెలిసిందే. అగస్టా కేసులో విచారణ జరుపుతున్న ముగ్గురు దళారీల్లో ఆయన ఒకరు. మరో ఇద్దరు మధ్యవర్తులు గైడో హస్కే, కార్లో గెరోసాలను ఈడీ, సీబీఐ విచారిస్తున్నాయి. మైకేల్కు కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన తర్వాత ఆయనపై సీబీఐ, ఈడీ రెడ్కార్నర్ నోటీసు జారీచేయాలని కోరుతూ ఇంటర్పోల్ను ఆశ్రయించాయి. కాగా, బ్రిటన్ జాతీయుడైన మైకేల్ అగస్టా వెస్ట్ల్యాండ్ కంపెనీ నుంచి రూ.225 కోట్ల ముడుపులు స్వీకరించినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) 2016లో చార్జిషీటు దాఖలు చేసింది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పర్యవేక్షణలో చేపట్టిన ఆపరేషన్ మూలంగానే మైఖేల్ను భారత్కు అప్పగించేందుకు యూఏఈ అంగీకరించిందని సీబీఐ తెలిపింది -
అమెరికాపై హరికేన్ మైఖేల్ పంజా
-
శాంతిస్తోన్న హరికేన్ మైఖేల్
పనామా సిటీ: అమెరికాలోని ఫ్లోరిడా తీరాన్ని హరికేన్ మైఖేల్ వణికించింది. గంటకు 155 మైళ్ల వేగంతో వీచిన గాలులు తీరప్రాంత వాసులను బెంబేలెత్తించాయి. వందేళ్లలో ఈ ప్రాంతంలో ఇంతటి విపత్తు సంభవించటం ఇదే తొలిసారని తెలిపారు. ప్రచండ గాలుల ధాటికి చెట్లు, స్తంభాలు దెబ్బకు కూలిపోయాయి. తీరం దాటే సమయంలో గల్ఫ్ ఆఫ్ మెక్సికోను వణికించింది. ఆ ప్రాంతంలో అనేక ఇళ్లు నీటి మునిగాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు కుప్పకూలిపోయాయి. ప్రస్తుతానికి హరికేన్ ప్రభావం క్రమంగా తగ్గుతూ వస్తోంది. కొంతమేర బలహీనపడి కేటగిరీ 4 నుంచి కేటగిరీ–1 తుపానుగా మారింది. అయినా దీని ప్రభావంతో ఇప్పటికీ 90 మైళ్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అక్కడి అధికారులు చెబుతున్నారు. హరికేన్ తీరం దాటే సమయంలో వీచిన గాలులు మెక్సికో బీచ్ ప్రాంతంలో తీవ్ర బీభత్సం సృష్టించినట్లు స్థానికులు తెలిపారు. హరికేన్ కారణంగా తల్లాహసీ ప్రాంతంలో ఓ వ్యక్తి మృతి చెందినట్లు అధికారికంగా ప్రకటించారు. 20 కౌంటీల్లోని సుమారు 3,75,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భారీ ఎత్తున వరదనీరు ఇళ్లల్లోకి చేరింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త్వరలోనే ఫ్లోరిడాలో పర్యటించనున్నట్లు ప్రకటించారు. -
‘సినిమాల్లోనే నటించాలా? వేరే పనులు లేవా?’
సాక్షి, చెన్నై: సినిమాల్లో నటించకపోతే పెళ్లికి సిద్ధం అవుతున్నట్లేనా అంటూ సంచన నటి శ్రుతిహాసన్ ప్రశ్నిస్తున్నారు. ఈ బ్యూటీ పెళ్లిపై ఇటీవల చాలానే ప్రచారం జరుగుతోంది. అందుకు కారణం కూడా లేకపోలేదు. శ్రుతిని తెరపై చూసి చాలా కాలమే అవుతోంది. తమిళం, తెలుగు భాషల్లో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన శ్రుతి అనూహ్యంగా నటనకు దూరం అయితే ఎవరికైనా ఏమైందనే ప్రశ్న తలెత్తడం సహజమే. అంతేకాక లండన్కు చెందిన బాయ్ఫ్రెండ్ మైఖైల్తో విందులు, విహారాలకు తిరిగారు. అందుచేత పెళ్లికి లగ్నం పెట్టేసుకుంటున్నా రేమోనన్న అనుమానం రాకమానదు. వరించిన అవకాశాన్ని కాలదన్నడం.. సంఘమిత్రలో కోరి వచ్చిన అవకాశాన్ని కాలదన్నుకోవడంతో శ్రుతి నట జీవితంపై రకరకాల ప్రచారానికి ఆస్కారం కలుగుతోంది. అయితే ఏ విషయంలోనైనా చాలా బోల్డ్గా వ్యవహరించే శ్రుతిహాసన్ తనపై వస్తున్న వదంతులపై కాస్త ఘాటుగానే స్పందించారు. వదంతులపై శ్రుతి ఫైర్.. వదంతులపై శుత్రి మాట్లాడుతూ.. ‘ నా జీవితంలో నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. దయచేసి నా వివాహాన్ని, సినిమాను కలిసి మాట్లాడకండి. వెండితెరపై మిమ్మల్ని చాలా కాలంగా చూడలేకపోతున్నామే, సినిమాలను వదిలేశారా ? అని చాలా మంది అడుగుతున్నారు. సినిమాల్లోనే నటించాలా ? నాకు వేరే పనులు లేవా? నా జీవితం సినిమాలతో పాటు పలు విషయాలతో ముడిపడి ఉంది. శ్రుతి పెళ్లికి సిద్ధం అవుతున్నారు వంటి ప్రచారాన్ని చేయకండి. నాకు సంగీత పరిజ్ఞానం ఉంది. అదే విధంగా నటన మాత్రమే కాక నచ్చిన విషయాలు చాలా ఉన్నాయని’ ఆమె తెలిపారు. హీరోయిన్ అవుతానని ఊహించనేలేదు.. అంతేకాక హీరోయిన్ కావడంపై కూడా ఆమె స్పందించారు. ’ నిజం చెప్పాలంటే నేను హీరోయిన్ అవుతానని ఊహించనేలేదు. అవకాశం వచ్చింది చేసి చూద్దాం అని భావించాను. ఆ తర్వాత అదే దారిలో ఉన్నత స్థాయికి ఎదిగాను. ఆ స్థాయిని నిలదొక్కుకున్నాను. ఇప్పుడు మంచి కథా చిత్రాలనే ఎంచుకోవాలని నిర్ణయించుకున్నాను. నా మనసు ఏం చెబుతుందో అదే చేస్తాను. నటనతో పాటు నేను చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఇప్పుడు నాకు లభించిన సమయాన్ని మనస్ఫూర్తిగా అనుభవిస్తున్నాను’ అని శ్రుతి హాసన్ చెప్పారు. -
శృతి పెళ్లి వార్త నిజమేనా?
-
ఇతడి కోసం గూగుల్, ఫేస్బుక్ ఫైట్
వాషింగ్టన్: కేవలం 21 ఏళ్ల యువకుడి కోసం దిగ్గజ కంపెనీలు గూగుల్, ఫేస్బుక్లు పోటీ పడుతున్నాయి. మైఖేల్ సేమన్ అనే కుర్రాడ్ని అతడికి 17 ఏళ్ల వయసులోనే ఇంటర్న్షిప్ కోసం, 18 ఏళ్లు రాగానే ఫుల్టైమ్ ఇంజనీరింగ్ జాబ్ ఇచ్చేలా ఫేస్బుక్ రిక్రూట్ చేసుకుంది. ఇంటర్న్షిప్కు ముందే అతడు ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్బర్గ్తోనూ భేటీ అయ్యాడు. ఫేస్బుక్ను యువతకు మరింత చేరువయ్యేలా చేయడంలో సేమన్ చొరవ చూపాడు. టీనేజ్ యువతకు నచ్చేలా వినూత్న ఉత్పత్తులపై కీలక సూచనలు చేశాడు. అయితే గత వారం 21 ఏళ్లు వచ్చిన సేమన్ ఫేస్బుక్కు బైబై చెప్పేసి గూగుల్లో చేరాడు. సేమన్ గూగుల్లో అత్యంత పిన్నవయస్కుడైన ప్రోడక్ట్ మేనేజర్గా బాధ్యతలు చేపట్టాడు.సేమన్ 13 ఏళ్ల వయసులో యూట్యూబ్ ట్యుటోరియల్ వీడియోలు వీక్షిస్తూ స్వయంగా మొబైల్ యాప్స్ రూపొందించడం నేర్చుకున్నాడు. -
కొట్టిందొకడు.. గెలిచిందొకడు!
రియో: ఒలింపిక్స్ బాంటమ్వెయిట్ బాక్సింగ్ క్వార్టర్స్లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఇరాన్ బాక్సర్ మైకేల్ కోన్లన్కు.. రష్యా బాక్సర్ వ్లాదిమిర్ నికితిన్కు మధ్య బౌట్ జరిగింది. ప్రత్యర్థిపై మైకేల్ పంచ్ల వర్షం కురిపించి రక్తం వచ్చేలా కొట్టాడు. దీంతో మైకేల్ గెలుస్తాడని అందరూ అనుకున్నారు. కానీ జడ్జీలు మాత్రం వ్లాదిమిర్ గెలిచినట్లు ప్రకటించారు. దీంతో చిర్రెత్తిన ఇరాన్ బాక్సన్ అక్కడికక్కడే జడ్జీలను, ఏఐబీఏను బండ బూతులు తిట్టాడు. బంగారు పతకం గెలవాలన్న తన ఆశలపై నీళ్లు చల్లారని, తనను మోసం చేశారని ధ్వజమెత్తాడు. -
ఆరేళ్లకు తగ్గిన బ్లాటర్, ప్లాటిని నిషేధం
జ్యూరిచ్: ఫిఫా అధ్యక్షుడు సెప్ బ్లాటర్, యూఈ ఎఫ్ఏ అధ్యక్షుడు మైకేల్ ప్లాటినిలపై నిషేధం ఎనిమిదేళ్ల నుంచి ఆరేళ్లకు తగ్గింది. బుధవారం ఫిఫా అప్పీల్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 2011లో 2 మిలియన్ డాలర్లను ప్లాటినికి చెల్లించేం దుకు బ్లాటర్ అంగీకరించడం ఈ వివాదానికి కారణం. ఫిఫా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచి గెలవాలని భావించిన ప్లాటినికి ఈ నిషేధంతో దారులు మూసుకుపోయినట్టే. శుక్రవారం ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. నిషేధాలను ఎత్తివేయాల్సిందిగా కోరుతూ క్రీడా మధ్యవర్తిత్వ కోర్టు (సీఏఎస్)కు వెళతామని ఇరువురు తెలిపారు. అలాగే అధ్యక్ష ఓటింగ్కు పారదర్శక బూత్లను ఏర్పాటు చేయాలన్న అభ్యర్థి ప్రిన్స్ అలీ విజ్ఞప్తిని సీఏఎస్ తోసిపుచ్చింది. -
ముఖాన్ని చూడకు.. గొంతు విను
సినిమా / ఫేస్ ఆఫ్ గిరగిరా తిరుగుతున్న రంగుల రాట్నం. అక్కడే కొడుకు మైఖేల్ను ఆడిస్తున్నాడు ప్రముఖ ఎఫ్బీఐ ఏజెంట్ సీన్ ఆర్చర్ (జాన్ ట్రవోల్టా). ఇద్దరి ముఖాల్లో ఆనందం వెల్లివిరిస్తోంది. ఇంతలో సడన్గా ఓ బుల్లెట్ ఆర్చర్ వీపులోకి దూసుకెళ్లింది. ఆర్చర్తో పాటు మైఖేల్ కూడా కింద పడ్డాడు. తలకు గాయమవడంతో ఆ పిల్లాడు చనిపోయాడు. కట్ చేస్తే, ఆ బుల్లెట్ దింపింది మోస్ట్ వాంటెడ్ టైస్ట్ కాస్టర్ ట్రాయ్ (నికోలాస్ కేజ్). ఆర్చర్ను చంపుదామనుకున్నాడు. కానీ అతను చావలేదు గానీ కొడుకు మాత్రం చనిపోయాడు. ఇంతలో ఆరేళ్లు గడిచిపోయాయి. తన కొడుకు చావుకు కారణమైన క్యాస్టర్ కోసం ఈ ఆరేళ్లూ ప్రపంచమంతా జల్లెడ పడుతూనే ఉన్నాడు అతని గురించి పూర్తిగా తెలుసుకున్నాడు. కానీ దొరకలేదు. సిటీలోని ఓ ఆడిటోరియంలోకి క్యాస్టర్ ట్రాయ్(నికోలాస్ కేజ్) ఓ పాస్టర్ వేషంలో ఎంటరై, ఫస్ట్ ఫ్లోర్కు వెళ్లి పెద్ద పెద్ద సూట్కేసుల్లో బాంబ్ ప్లాంట్ చేశాడు. ఓ పది రోజుల కౌంట్ డౌన్. క్యాస్టర్ సిటీలోకి వచ్చాడని ఆర్చర్ (జాన్ ట్రవోల్టా)కు ఇన్ఫర్మేషన్. వెంటనే తన సిబ్బందిని అలర్ట్ చేశాడు. విమాన ంలో క్యాస్టర్ తన తమ్ముడితో కలిసి ఇంకొంచెం సేపటిలో లాస్ ఏంజెల్స్ను వదలి ఎగిరిపోవాలి. రన్వే నుంచి విమానం టేకాఫ్ కావడానికి సిద్ధంగా ఉంది. సడన్గా విమానానికి ఎదురుగా రన్వే మీద కారులో ఆర్చర్! మొత్తానికి ఆర్చర్ తన ప్రయత్నంతో క్యాస్టర్ ఉన్న విమానాన్ని ఎగరకుండా చేస్తాడు. ఓ పదినిమిషాల ఫైట్లో కొంత మంది ఎఫ్బీఐ అధికారులు, టైస్టుల ప్రాణాలు గాల్లో కలిశాక క్యాస్టర్ పట్టుబడతాడు. అయితే కోమాలోకి వెళిపోతాడు. అతని తమ్ముడిని అరెస్ట్ చేస్తారు. అంతా బాగానే ఉంది కేసు క్లోజ్ చేసేసిన ఆర్చర్కు ఓ షాకింగ్ న్యూస్. క్యాస్టర్ ప్లాంట్ చేసిన బాంబ్ గురించి తెలుస్తుంది. కానీ ఎక్కడో ఏమిటో తెలీదు. ఆర్చర్ కోమాలో. అతని తమ్ముడు జైల్లో. ఆర్చర్ లేచి చెప్పలేడు. అతని తమ్ముడు అవసరమైతే చచ్చిపోతాడు గానీ నోరు మాత్రం విప్పడు. కానీ క్యాస్టర్ సీక్రెట్స్ తెలిసిన వ్యక్తి ఇతనే. ఇంతలో తన పై అధికారి ఐడియా చెప్పింది. కానీ రిస్కే. ఏ మాత్రం తేడా వచ్చినా అతని జీవితం గల్లంతే. మొదట్లో ఒప్పుకోలేదు. కానీ క్యాస్టర్ గురించి పూర్తిగా తెలిసిన అతనే ఇది చేయడానికి కరెక్టేనని పై ఆధికారి కన్విన్స్ చేయడంతో సరేనన్నాడు ఆర్చర్. అదే ఫేస్ ట్రాన్స్ప్లాంటేషన్. అంటే కోమాలో ఉన్న క్యాస్టర్ ముఖాన్ని తీసి ఆర్చర్కు పెట్టి సర్జరీ చేయాలి. ఈ రహస్యం తెలిసింది ఆ డిపార్ట్మెంట్లో ఇద్దరికే. ఒకరు అతని పై అధికారి, ఇంకొకతను ఆర్చర్ సహోద్యోగి. ఆపరేషన్ సక్సెస్. ఇక నుంచి ఆర్చర్ (జాన్ ట్రవోల్టా)కి కొత్త రూపం. ప్రపంచానికి అతను క్యాస్టర్ ట్రాయ్ (నికోలాస్ కేజ్). క్యాస్టర్ తమ్ముడున్న జైల్లోకి ఆర్చర్ను పంపించారు. బాంబ్ విషయం రాబట్టాలి అదీ ప్లాన్. మొత్తానికి సక్సెస్ అయ్యాడు ఆర్చర్ . ఈ ఆనందం ఎంతో కాలం నిలువలేదు. జైలుకి తనను కలవడానికి వచ్చిన వ్యక్తిని చూసి షాకయ్యాడు. అతను తన ముఖంతో ఉన్న క్యాస్టర్ ట్రాయ్(జాన్ ట్రవోల్టా)ను చూసి షాక్ అయ్యాడు. ఇంతలో కోమా నుంచి సడన్గా లేచిన క్యాస్టర్ ట్రాయ్(నికోలాస్ కేజ్) తన ముఖానికి జరిగిన సర్జరీని ఆ హాస్పిటల్లోని వీడియోలో చూశాడు. ఆ డాక్టర్ను బెదిరించి ఆర్చర్(జాన్ ట్రవోల్టా) ముఖాన్ని తనకు ప్లాంట్ చేయించుకున్నాడు. ఈ సర్జరీ విషయం తెలిసిన అందరినీ చంపేశాడు క్యాస్టర్. ఇక నుంచి పోలీసు ముసుగలో టైస్టు. ఆ ఉగ్రవాది ముసుగులో పోలీసాఫీసర్. సీన్ రివర్స్ అయింది. ఆర్చర్ ముసుగులో ఉన్న క్యాస్టర్ తన అధికారాన్ని ఉపయోగించి జైల్లో ఉన్న తన తమ్ముడిని విడిపించాడు. టైస్టుగా చేసే పనులు, ఎఫ్బీఐ అధికారి ఆర్చర్గా చేసే చాన్స్. ఎవరికీ ఏ మాత్రం సందేహం రాదు. బాంబ్ను కూడా తానే డిస్కనెక్ట్ చేసి ప్రజల దృష్టిలో హీరో అయ్యాడు క్యాస్టర్. ఆర్చర్ మాత్రం జైలు నుంచి తప్పించుకుని తన పాత జీవితాన్ని వెనక్కి తీసుకోవడానికి యుద్ధం ప్రారంభిస్తాడు. క్యాస్టర్గా ఆర్చర్ నేర ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. మరో వైపు ఆర్చర్ లా క్యాస్టర్ జీవించడం స్టార్ట్ చేశాడు. ఇద్దరి జీవితాలు మారిపోయాయి. అంటే హీరో...విలన్గా, విలన్ హీరోగా మారిపోయారు. కానీ స్వభావాలు మారవు కదా! క్యాస్టర్ కు అబ్బాయి ఉన్నాడని తెలుస్తుంది. ఇంతలో ఆర్చర్ను చంపడానికి వేసిన కుట్రలో క్యాస్టర్ తమ్ముడు చనిపోతాడు. అందుకే ఇక ఆర్చర్ను చంపాలన్న కసితో ఉంటాడు కాస్టర్. ఈ బాధ, కోపంలోనే తన మీద అరిచిన ఓ అధికారిని చంపేశాడు కూడా. తన కుటుంబాన్ని చూడాలన్న ఆశతో ఇంటికి వెళతాడు ఆర్చర్. ఆర్చర్ను చూడగానే ఒక్కసారిగా ఉలిక్కిపడుతుంది. భార్య అతన్ని గుర్తుపట్టదు. ‘‘నా ముఖాన్ని చూడకు... నా గొంతు విను. దాన్ని అర్థం చేసుకో’’ అంటూ అసలు విషయం చెబుతాడు. ఇది నిజమా ? కాదా? అని క్యాస్టర్ బ్లడ్ను టెస్ట్ చేస్తుంది ఆర్చర్ భార్య. నిజం ఆమెకూ అర్థమవుతుంది. తన చేతిలోనే చనిపోయిన అంత్యక్రియలకు క్యాస్టర్ వెళ్తాడు. అక్కడే ఆర్చర్, క్యాస్టర్ తలపడతారు. చివరికి క్యాస్టర్ చనిపోవడంతో ఆర్చర్కి తన పాత రూపం తిరిగివస్తుంది. క్యాస్టర్ కొడుకు ఆడమ్ను ఆర్చర్ దత్తత తీసుకోవడంతో సినిమా ముగుస్తుంది. - బి. శశాంక్ ఫేస్ ఆఫ్... ఇలా మొదలైంది! తొంభైలలో ఫిల్మ్ స్కూల్ నుంచి గ్రాడ్యుయేషన్ తీసుకుని సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టే ప్రయత్నంలో మైక్ వెర్బ్, మైఖేల్ కొలెరీ అనే స్క్రీన్ రైటర్స్ రాసిన సైన్స్ ఫిక్షన్ స్టోరీ ‘ఫేస్ ఆఫ్’. అప్పట్లో హాలీవుడ్ను ఏలుతున్న ఆర్నాల్డ్, స్టాలోన్ లు ఇందులో హీరో, విలన్. పారామౌంట్ పిక్చర్స్ సంస్థ వీరి స్క్రిప్ట్ను ఓకే చేసింది. వీరి స్క్రిప్ట్ ఓకే కావడానికి ఏడేళ్లు పట్టింది. దర్శకునిగా రోబర్ట్ కొహెన్ ఫిక్స్. కానీ,షూటింగ్ లేట్ కావడంతో ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు. మళ్లీ ఈ సినిమా భవిష్యత్తు డైలమాలో పడింది. దర్శకునిగా జాన్ వూని లాక్ చేసిందా సంస్థ. స్క్రిప్ట్ అంతా విన్న జాన్ వూ మళ్లీ దాంట్లో మార్పులు సూచించాడు. భవిష్యత్తులో జరిగే సైన్స్ ఫిక్షన్ అంటే సినిమాలో భావోద్వేగాలకు చోటు ఉండదని, ట్రెండ్కు తగ్గట్టు మార్చమన్నాడు జాన్ వూ. ఆర్నాల్డ్, స్టాలోన్లు అప్పుడు తమ సినిమాలతో బిజీ బిజీ. దాంతో హీరోగా జాన్ ట్రవోల్టా, విలన్గా నికోలాస్ కేజ్ను అనుకున్నాడు జాన్. అప్పటికే హీరోగా నికోలాస్, విలన్గా జాన్ ట్రవోల్టా మంచి స్వింగ్ మీద ఉన్నారు. నికోలాస్ మొదట విలన్ అనగానే చేయనన్నాడు. కానీ ఈ స్క్రిప్ట్ పూర్తిగా విన్నాక మాత్రం ఓకే అన్నాడు. ఈ కథలో ఉన్న గొప్పదనం ఏంటంటే, సినిమా ప్రథమార్థంలోనే హీరో విలన్గా, విలన్ హీరోగా మారిపోతారు. అదే ఈ స్క్రిప్ట్లో కిక్ ఇచ్చే అంశం. అదే ఈ చిత్రాన్ని బ్లాక్బస్టర్ను చేసింది! -
ఘోస్ట్ కారు
కాలిఫోర్నియా, 1956.‘‘వావ్... ఏముందిరా ఈ కారు! నాకిదే కావాలి’’... ఎదురుగా కనిపిస్తోన్న స్పోర్ట్స్ కారుని చూసి మురిసిపోతూ అన్నాడు మైఖేల్. ‘‘అవున్రా. భలే స్టైల్గా ఉంది. ఇదే తీసుకో. ఇక ఈ రేసులో నిన్ను కొట్టేవాడే ఉండడు’’... ప్రోత్సహించాడు స్నేహితుడు జోనా. దాంతో మరీ హుషారొచ్చేసింది మైఖేల్కి. వెంటనే సేల్స్మేన్ని పిలిచి బేరమాడాడు. తనకు ఆ కారు కావాలని ఆర్డర్ ఇచ్చేశాడు. వారం తిరిగేసరికి ఆ కారు మైఖేల్ ఇంటి ముందుంది. మరో వారం రోజుల్లో జరిగే రేస్కి ముస్తాబయ్యింది. తన కొత్త కారులో కూర్చుని రేస్లో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాడు మైఖేల్. సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నాడు. అతడు ఇప్పటికే చాలా రేసుల్లో పాల్గొన్నాడు. చాలా వాటిలో విజయం కూడా సాధించాడు. అయితే ఎందుకో ఎప్పుడూ లేనిది ఈసారి చాలా ఉద్విగ్నతకు లోనవుతున్నాడు. ఇంతలో సిగ్నల్ వచ్చింది. రేస్ ప్రారంభమయ్యింది. తనదైన వేగంతో దూసుకుపోతున్నాడు మైఖేల్. అందరినీ దాటుకుంటూ ముందుకు పోతున్నాడు. మరో ఐదు నిమిషాల్లో గమ్యాన్ని చేరుకునేవాడే. కానీ అంతలో అనుకోకుండా జరిగింది ఓ సంఘటన. వేగంగా పోతోన్న కారు పట్టు తప్పింది. పల్టీలు కొట్టింది. గిరగిరా తిరుగుతూ వెళ్లి గోడకు గుద్దుకుని పచ్చడైపోయింది. క్షణాల్లో మైఖేల్ ప్రాణాల్ని గాలిలో కలిపేసింది. అందరూ అవాక్కయిపోయారు. కళ్లముందే ఓ మంచి రేసర్ ప్రాణాలు కోల్పోతున్నా ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉండిపోయారు. వార్త అందుకుని పోలీసులొచ్చారు. తమ డ్యూటీ తాము చేయడంలో మునిగిపోయారు. ‘‘ఇదిగో ఇటు చూడు... ఈ కారు గురించి నీకు తెలుసా? ఇది జేమ్స్ డీన్ కారు ఇంజిన్తో తయారు చేసింది. దీన్ని తయారు చేసిన ఇంజినీర్ నా బెస్ట్ ఫ్రెండ్. దీన్ని చేశాక నాకు చూపించాడు కూడా’’... యాక్సిడెంట్ అయిన కారును పరిశీలిస్తూ తన పక్కనున్న సబార్డినేట్తో అన్నాడు ఇన్స్పెక్టర్. ‘‘ఏమంటున్నారు సర్? జేమ్స్ డీన్ కారా? అతను కూడా ఇలాగే యాక్సిడెంట్లో...’’ సబార్డినేట్ మాట పూర్తి కాకుండానే అవునన్నట్టు తలూపాడు ఇన్స్పెక్టర్. మరుక్షణం సబార్డినేట్ ముఖంలో రంగులు మారాయి. ‘‘ఇది చాలా విచిత్రంగా ఉంది సర్. అచ్చం డీన్ విషయంలో ఏం జరిగిందో ఇతని విషయంలోనూ అదే జరిగింది. కొంపదీసి ఇదంతా కారు వల్ల కాదు కదా?’’ చురుక్కున చూశాడు ఇన్స్పెక్టర్. ఇంతవరకూ అతని మనసులో అలాంటి సందేహం కలగలేదు. అలా అని ఇప్పుడైనా సందేహ పడవచ్చో లేదో అర్థం కాలేదు. దాంతో ఓ క్షణం ఆలోచించి ఆ విషయాన్ని వదిలేశాడు. అలా వదలకుండా ఉండివుంటే ఆ తర్వాత జరిగే ఎన్నో అనర్థాలను అతడు ఆపగలిగి ఉండేవాడు. జేమ్స్ డీన్ శాపానికి గురి కాకుండా కొన్ని ప్రాణాలను నిలబెట్టగలిగి ఉండేవాడు. ఇంతకీ అసలు ఎవరా జేమ్స్ డీన్? ఏమిటా శాపం? జేమ్స్ డీన్... ఒకప్పుడు అమ్మాయిలంతా మనసు పారేసుకున్న హాలీవుడ్ నటుడు. ఎంతో అందంగా ఉండేవాడు. చలాకీగా కనిపించేవాడు. అతడు మాట్లాడితే అందరికీ వినాలనిపించేది. అతడు నవ్వుతుంటే అలా చూస్తూనే ఉండాలనిపించేది. జేమ్స్ కేవలం నటుడే కాదు... మంచి రేసర్ కూడా. చాలా రేసుల్లో పాల్గొన్నాడు. విజయాలనూ చవిచూశాడు. ముఖ్యంగా రేసుల కోసం అతడు ఎంచుకునే కార్లు అతణ్ని అందరిలోకీ ప్రత్యేకంగా నిలబెట్టేవి. మార్కెట్లోకి ఏ కొత్త కారు వచ్చినా వెంటనే కొనేసేవాడు. ఆ అలవాటే అతణ్ని ‘లిటిల్ బాస్టర్డ్’ని కొనేలా చేసింది. మార్కెట్లోకి ‘పోర్షా 550 స్పైడర్’ కారు కొత్తగా వచ్చింది. దాన్ని తయారు చేసిన జార్జ్ బ్యారిస్ ఆ కారుకి లిటిల్ బాస్టర్డ్ అని పేరు పెట్టాడు. దాన్ని ఎంతో ఇష్టపడి కొనుక్కున్నాడు డీన్. దాన్ని చూసి చాలా మురిసిపోయాడు. కానీ ఆ కారే తన పాలిట శాపమవుతుందని అతడు ఊహించలేదు. అది సెప్టెంబర్ 30, 1955. త్వరలో తాను పాల్గొనబోయే రేస్ కోసం ప్రాక్టీస్ చేసేందుకు తన ‘లిటిల్ బాస్టర్డ్’లో బయలుదేరాడు డీన్. అతడితో పాటు మెకానిక్, ఓ ఫొటోగ్రాఫర్, తాను అప్పటికి చేస్తోన్న ‘రెబెల్ వితవుట్ ఎ కాజ్’ చిత్ర స్టంట్మ్యాన్ బిల్ హిక్మ్యాన్ కూడా అతడితో ఉన్నారు. కొంత దూరం వెళ్లాక నలుగురూ రోడ్డు పక్కన ఉన్న ఓ రెస్టారెంటు దగ్గర ఆగారు. అక్కడ బిల్ అన్నాడు... ‘‘చాలా వేగంగా డ్రైవ్ చేస్తున్నావు డీన్, అదంత మంచిది కాదు, కాస్త మెల్లగా నడుపు’. సరే అన్నాడు డీన్. కానీ మళ్లీ రోడ్డు మీదికి వెళ్లగానే ఆ మాట మర్చిపోయాడు. వేగాన్ని పెంచాడు. ఎంతో.. మరెంతో వేగంగా నడపసాగాడు. కొంత దూరం పోయాక మలుపు తీసుకునే క్రమంలో కారు అదుపు తప్పింది. ముందు వెళ్తోన్న ఓ కారును ఢీకొని నలభై తొమ్మిది అడుగుల ఎత్తుకు లేచి నేలమీద పడింది. డీన్ శరీరాన్ని పచ్చడి చేసేసింది. మిగతా వారి ఎముకలను ముక్కలు చేసింది. చరిత్రలో ఓ పెద్ద విషాదాన్ని లిఖించింది. ఒక్క తప్పు చాలు... జీవితాలను సమాధి చేయడానికి. ఆ తప్పు డీన్ చేశాడు. అందుకే మిగతావారు ప్రాణాలతో బయటపడినా డీన్ మాత్రం మృత్యు ఒడికి చేరుకున్నాడు. అయితే కథ అక్కడితో ముగిసి పోలేదు. అక్కడే మొదలైంది. ప్రమాదంలో లిటిల్ బాస్టర్డ్ తుక్కు తుక్కు అయినా దాని ఇంజిన్ మాత్రం చెక్కు చెదరలేదు. దాంతో ఆ ఇంజిన్ని ఉపయోగించి మరో కారును తయారు చేశారు. దాన్ని మైఖేల్ కొన్నాడు. యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయాడు. ఆ తర్వాత కాస్త మాత్రమే పాడయిన ఇంజిన్ని రిపేర్ చేసి మరో కారుకు అమర్చారు. ఆ కారును ఓ డబ్బున్న వ్యక్తి కొనుగోలు చేశాడు. అతడు తన కుటుంబంతో పాటు ప్రయాణిస్తు న్నప్పుడు ఘోర ప్రమాదం జరిగింది. కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోయింది. అప్పుడు ఇంజిన్ పూర్తిగా డ్యామేజ్ అయినా కారులోని మిగతా భాగాలు కొన్ని బాగుండటంతో వాటిని వేర్వేరు కార్ల తయారీలో ఉపయోగించారు. విచిత్రమేమిటంటే ఆ కార్లు అన్నీ ప్రమాదానికి గురయ్యాయి. ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకున్నాయి. మరెందరినో జీవచ్ఛవాలుగా మిగిల్చాయి. దాంతో అందరికీ ఓ క్లారిటీ వచ్చింది. ఇది కచ్చితంగా జేమ్స్ డీన్ శాపమే, అందుకే అతడి కారుతో సంబంధం ఉన్న ప్రతి వారూ ప్రాణాలు కోల్పోతున్నారు అనే నమ్మకం బలపడింది. కొందరైతే డీన్ దెయ్యమై ఆ కారును ఆవహించాడన్నారు. దాంతో లిటిల్ బాస్టర్డ్తో సంబంధం ఉన్న కార్లు, వాటి విడి భాగాలన్నిటినీ ఏరి ఓ చోట పడేశారు. వాటిని మళ్లీ ముట్టుకోకూడదని తీర్మానించుకున్నారు. అయితే ఇది నిజంగా డీన్ శాపమేనా అంటే అవును అని కచ్చితంగా చెప్పగలిగే వారు లేరు. కానీ శాపం కాకపోతే ఇంత మందికి ఇలా ఎందుకు జరుగుతుంది అనే ప్రశ్న మాత్రం అడుగుతారు. దానికి సమాధానం చెప్పేవాళ్లు లేకపోవడంతో ఆ ప్రశ్న ఇప్పటికీ ప్రశ్నగానే మిగిలిపోయింది. మరణించడానికి రెండు వారాల క్రితమే ప్రభుత్వ రూపొందించిన ఓ యాడ్లో నటించాడు డీన్. ఆ యాడ్లో డీన్ ఓ మాట చెప్తాడు... ‘‘మెల్లగా డ్రైవ్ చేయండి. మీరు కాపాడే ఓ ప్రాణం బహుశా నాదే అయి ఉండొచ్చు, గుర్తు పెట్టుకోండి’’ అని. ఆ యాడ్ చూసి డీన్ అభిమానులు ఉర్రూతలూగారు. కానీ అతడు తాను చెప్పిన మాటల్ని తానే మర్చిపోతాడని, తన ప్రాణాలను పోగొట్టుకుంటాడని వాళ్లు ఊహించలేకపోయారు. - మీరా -
నయవంచన
నమ్మకంతో ప్రేమిస్తారు. ఆ నమ్మకంతోనే జీవితాన్ని పంచుకోవడానికి సిద్ధపడతారు. కానీ ఒక్కసారి కూడా ఆలోచించరు... ఆ వ్యక్తి నమ్మదగినవాడేనా అని! చాలామంది అమ్మాయిలు చేసే తప్పే ఇది. క్లేర్ ఉడ్ కూడా ఈ తప్పే చేసింది. ఫలితంగా జీవితాన్నే కోల్పోయింది. తనే లోకంగా బతుకుతోన్న తండ్రికి కన్నీటిని మిగిల్చి వెళ్లిపోయింది! ‘‘డాడ్... ఇతను జార్జ్. నేను తనని ప్రేమిస్తున్నాను. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను... ఈ మాటలు అంటున్నప్పుడు నా చిట్టితల్లి క్లేర్ కళ్లలో మెరుపులు కనిపించాయి నాకు. సిగ్గుతో తన చెంపలు కందిపోయాయి. నావైపు సూటిగా చూడలేక నేల చూపులు చూడసాగింది. నేను జార్జ్వైపు చూశాను. పలకరింపుగా నవ్వాడు. చప్పున నా చేయి అందుకుని షేక్హ్యాండ్ ఇచ్చాడు. ఎందుకోగానీ... అతని స్పర్శ, చూపు, నవ్వు... ఏదీ నాకు నచ్చలేదు. అలా అనలేకపోయాను. కనీసం నా అయిష్టాన్ని ముఖ కవళికల ద్వారా కూడా వ్యక్తం చేయలేకపోయాను. ఎందుకంటే... ఎదురుగా నా కూతురు ఉంది. నేను కాదనను అన్న నమ్మకం కనిపిస్తోంది తనలో. అందుకే ధైర్యం చేయలేకపోయాను. ఎక్కువగా ఆలోచించకుండా ‘నీ ఇష్టం బేబీ’ అనేశాను. తను సంతోషంతో గంతులు వేసింది. ‘చూశావా జార్జ్... నేను చెప్పానుగా మా డాడీ గురించి. నా ఇష్టాన్ని ఎప్పుడూ కాదనరు’ అంది సంబరపడిపోతూ. జార్జ్ నవ్వాడు. అప్పుడు కూడా ఆ నవ్వులో స్వచ్ఛత కనిపించలేదు నాకు. జైలర్గా పని చేసిన అనుభవం ఎక్కడో నన్ను హెచ్చరిస్తున్నట్టుగా అనిపించింది. కానీ క్లేర్ మీద ఉన్న ప్రేమ నా విచక్షణను జయించింది. అలా జరగకుండా ఉండివుంటే... ఈ రోజు నా క్లేర్ నా దగ్గర ఉండివుండేది.’’ ‘‘నిజమే. ఆరోజే మీరు జాగ్రత్తపడివుంటే మీ కూతుర్ని కాపాడుకునేవారు.’’రిపోర్టర్ అన్న మాటకు కళ్ల నిండా నీళ్లు వచ్చేశాయి మైఖేల్కి. మాట్లాడలేకపోయాడు. మనసు గతంలోకి పరుగెత్తింది. జరిగిన దారుణం మదిలో మెదిలింది. 2009, ఫిబ్రవరి 2... స్టడీ రూమ్లో ఉన్న ఫోన్ రింగవుతోంది. వంటగదిలో కాఫీ కలుపుకోవడంలో మునిగిపోయిన మైఖేల్, వడివడిగా స్టడీరూమ్కి వెళ్లాడు. ఫోన్ తీసి హలో అన్నాడు. అవతలి వ్యక్తి చెప్పింది వినగానే అతడి ముఖం మ్లానమయ్యింది. చేతిలోని కప్పు జారి నేలమీద పడి భళ్లున బద్దలయ్యింది. దాని సంగతి పట్టించుకోలేదు. గబగబా తయారయ్యాడు. పర్స్ తీసి జేబులో పట్టుకుని, ఇల్లు తాళం వేసి బయలుదేరాడు. అరగంట తిరిగేసరికల్లా తన కూతురు క్లేర్ ఇంటి దగ్గర ఉన్నాడు. ఇంటి ముందు కారు దిగుతూనే అక్కడి దృశ్యాన్ని చూసి అవాక్కయిపోయాడు మైఖేల్. బోలెడంతమంది జనం గుమిగూడి ఉన్నారు. క్లేర్ ఇంటివైపు చూస్తూ ఏదో చర్చించుకుంటున్నారు. మైఖేల్ మనసు ఏదో కీడు శంకించింది. ఎవరో ఒక వ్యక్తి ఫోన్ చేసి వెంటనే మీ అమ్మాయి ఇంటికి రండి అన్నాడు తప్ప ఏం జరిగిందో చెప్పలేదు. కానీ ఇక్కడి పరిస్థితి చూస్తుంటే ఏదో జరిగినట్టే ఉంది. అందరినీ తోసుకుంటూ ముందుకు వెళ్లాడు మైఖేల్. లోపలికి అడుగు పెడుతుంటే కాలిన వాసన గుప్పుమంది. కడుపులో దేవినట్టయ్యింది. ఖర్చీఫ్ తీసి ముక్కుకు అడ్డు పెట్టుకున్నాడు. రెండు అడుగులు ముందు వేశాడో లేదో ఇన్స్పెక్టర్ ఎదురొచ్చాడు. ‘‘మైఖేల్ బ్రౌన్ అంటే మీరేనా?’’ అన్నాడు మైఖేల్ని పైనుంచి కిందకు పరికిస్తూ. అవునన్నట్టు తలూపాడు మైఖేల్. ఏం జరిగింది అని అడిగేలోపు ఇన్స్పెక్టరే అన్నాడు... ‘‘సారీ మిస్టర్ మైఖేల్. మీ అమ్మాయి క్లేర్ చనిపోయింది. ఎవరో హత్య చేశారు. మీకు ఫోన్ చేసింది నేనే. ఫోన్లో చెబితే తట్టుకోలేరని చెప్పలేదు.’’ హతాశుడయ్యాడు మైఖేల్. ఇన్స్పెక్టర్ ఇంకా ఏదేదో చెబుతున్నాడు. కానీ అతడి చెవులను అవి చేరడం లేదు. మౌనంగా నడుచుకుంటూ బెడ్రూమ్లోకి వెళ్లాడు. అక్కడ... మంచం మీద... నల్లగా... కాలిపోయి... గుర్తు పట్టలేనట్టుగా ఉంది క్లేర్ మృతదేహం. దాన్ని చూస్తూనే ‘బేబీ’ అంటూ కుప్పకూలిపోయాడు. రెండు రోజుల తర్వాత... ‘‘ఎలా ఉన్నారు మైఖేల్?’’ ఇన్స్పెక్టర్ అడిగిన ప్రశ్నకు బాగున్నాను అన్నట్టు తలాడించాడు మైఖేల్. ‘‘నన్నెందుకు రమ్మన్నారు?’’ అన్నాడు నిర్లిప్తంగా. ‘‘జార్జ్ ఆపిల్టన్ ఆత్మహత్య చేసుకున్నాడు’’ ‘‘ఆత్మహత్య చేసుకున్నాడా?’’ అన్నాడు నమ్మలేనట్టుగా. ‘‘అవును. ఓ బార్లో అతని మృతదేహం దొరికింది.’’ ‘‘నో. నా కూతురిని ఘోరంగా చంపిన ఆ నీచుడు అంత సులభంగా చచ్చిపోవడానికి వీల్లేదు’’ అంటూ వెక్కివెక్కి ఏడుస్తోన్న మైఖేల్ని ఎలా ఓదార్చాలో తెలియలేదు ఇన్స్పెక్టర్కి. నిట్టూర్చి అన్నాడు.. ‘‘కంట్రోల్ యువర్సెల్ఫ్ మిస్టర్ మైఖేల్. మేము తనని అరెస్ట్ చేయాలని అనుకున్నాం. కానీ అంతలోనే ఇలా జరిగింది.’’అంతవరకూ ఏడ్చినవాడు, ఒక్కసారిగా వెర్రిగా నవ్వాడు మైఖేల్. ‘‘నా కూతుర్ని వాడు చిత్రహింసలు పెట్టాడు. తను ఎన్నిసార్లు కంప్లయింట్లు ఇచ్చిందో, ఎన్నిసార్లు తనని కాపాడమని మీ కాళ్లా వేళ్లా పడిందో ఈ రెండు రోజుల్లో నాకు తెలిసింది. మీరు నా కూతుర్ని నాకు కాకుండా చేశారు. ఇప్పుడు నేనేం చేస్తానో చూడండి’’ అనేసి ఆవేశంగా వెళ్లిపోతోన్న మైఖేల్ వైపు బిత్తరపోయి చూస్తూండిపోయాడు ఇన్స్పెక్టర్.అంతకంటే ఏం చేస్తాడు? తప్పు తనదే. క్లేర్ బాధను ఒక్కసారైనా అర్థం చేసుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఆమె ప్రాణం పోయేదీ కాదు. క్లేర్కి ఇంటర్నెట్ ద్వారా పరిచయమయ్యాడు జార్జ్. ఇద్దరూ మనసులు ఇచ్చిపుచ్చుకున్నారు. అతడిని తన తండ్రికి పరిచయం చేసింది క్లేర్. నిజానికతడికి జార్జ్ నచ్చలేదు. కానీ ఆ విషయం చెప్పలేక పోయాడు. అప్పటికే భార్యను, కొడుకును ప్రమాదవశాత్తూ పోగొట్టుకుని ఉన్నాడు. దాంతో ఉన్న కూతురినైనా సంతోషంగా ఉంచాలనుకున్నాడు. సరే అన్నాడు. సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యింది క్లేర్. కొన్నాళ్లు సంతోషంగా గడిపి అప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంది. కానీ సంవత్సరం తిరిగే సరికల్లా జార్జ్ నిజస్వరూపం తెలిసి వచ్చిందామెకి. తనలాగే మరో ముగ్గురు అమ్మాయిలతో ఇంటర్నెట్ ద్వారానే ప్రేమాయణం నడుపుతున్నాడని తెలిసి షాకయ్యింది. ఇదేంటని నిలదీసింది. అతడు లెక్క చేయలేదు. దాంతో మనసు విరిగి, అతడికి దూరమైపోయింది. అది జార్జ్ తట్టుకోలేకపోయాడు. క్లేర్ని ముప్పుతిప్పలు పెట్టాడు. ఎంత రహస్యంగా బతుకుదామన్నా ఆమె జాడ కనుక్కునేవాడు. ఎక్కడుంటే అక్కడికి వెళ్లి మాటలు, చేతలతో హింసించేవాడు. తలుపు తీయకపోతే బద్దలు కొట్టేవాడు. తనతో మళ్లీ కలవమని పోరు పెట్టేవాడు. శారీరకంగా, మానసికంగా, లైంగికంగా వేధించేవాడు. అది తట్టుకోలేక పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది క్లేర్. వాళ్లు కొన్నిసార్లు జార్జ్ని అరెస్ట్ చేశారు. కానీ అతడు సాయంత్రానికల్లా బెయిల్ తీసుకుని బయటికొచ్చేసేవాడు. మరికొన్నిసార్లు పోలీసులే లెక్కలేనట్టుగా ఉండేవారు. తనకు ప్రాణహాని ఉందని క్లేర్ మొత్తుకున్నా వాళ్లు ఆమెకి సెక్యూరిటీ ఇచ్చిన పాపాన పోలేదు. దాంతో ఘోరం జరిగిపోయింది. ఎప్పటిలాగే క్లేర్ ఇంటి మీద దాడి చేసిన జార్జ్... ఆమెను హింసించి, అత్యాచారం చేసి చంపేశాడు. ఆపైన పెట్రోలు పోసి కాల్చేశాడు. జరిగిన విషయాలన్నీ కూతురి డైరీ చూసినప్పుడు తెలిశాయి మైఖేల్కి. ‘నాన్నను బాధపెట్టడం ఇష్టం లేక తనకేమీ చెప్పడం లేదు’ అని రాసుకున్న మాటలు చదివి అల్లాడిపోయాడు. తన బిడ్డ పడిన నరకయాతన తలచుకుని కుమిలిపోయాడు. కూతురిని కాపాడుకోలేకపోయానే అని విలవిల్లాడాడు. అంతకంటే అతడిని బాధించిన విషయం మరొకటుంది. జార్జ్కి నేరచరిత్ర ఉందని, అంతకుముందే ఓ అమ్మాయిని ప్రేమలోకి దించాడని, ఆమెకి తన నిజస్వరూపం తెలిసిపోవడంతో కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టాడని, ఆ కేసులో అరెస్టయ్యి ఆరు నెలలు జైల్లో కూడా ఉన్నాడని తెలిసింది. జార్జ్ గురించి ముందే ఎంక్వయిరీ చేసివుంటే ఇలా జరిగివుండేది కాదు అనిపించింది. తన కూతురు కంప్లయింట్ ఇచ్చినప్పుడయినా అతడి గురించి విచారించని పోలీసుల మీద కోపం ముంచు కొచ్చింది. వెంటనే కోర్టులో పిటిషన్ వేశాడు. తన కూతురి చావుకి పోలీసులే కారణమని ఆరోపించాడు. అతడి నవ్వుకు కారణం అప్పుడు అర్థం అయింది ఇన్స్పెక్టర్కి. మైఖేల్ పిటిషన్ పెద్ద సంచ లనమే సృష్టించింది. బ్రిటన్ ప్రభుత్వాన్ని కదిలించింది. ఆడపిల్లల సంరక్షణ కోసం ‘క్లేర్ వుడ్’ పేరుతోనే ఓ చట్టం రూపొందింది. దీని ప్రకారం ఏ ఆడపిల్ల అయినా ఒక వ్యక్తితో అనుబంధం ఏర్పరచుకునే ముందు, పోలీసుల దగ్గరకు వెళ్లి, ఆ వ్యక్తి పూర్తి వివరాలు కావాలని అడగ వచ్చు. పోలీసులు నో చెప్పడానికి వీల్లేదు. వారం తిరిగేసరికల్లా ఆ వ్యక్తి గురించి విచారణ చేసి, నేర చరిత్ర ఉందేమో తిరగదోడి, పూర్తి వివరాలను సదరు అమ్మాయికి తెలియజెయ్యాలి. క్లేర్ మాదిరిగా మరే అమ్మాయీ పోలీసుల నిర్లక్ష్యానికి బలి అవ్వకూడదనే ఈ చట్టాన్ని తెచ్చారు. కూతురి ప్రాణాలను కాపాడుకోలేకపోయినా, తన కూతురులాంటి ఎంతోమంది ఆడపిల్లల జీవితాలను కాపాడేందుకు మైఖేల్ పడిన తపనకు, చేసిన పోరాటానికి ఫలితమిది. అయితే దీనికి గర్వపడటం లేదు మైఖేల్. కూతురి ఫొటోను చూసినప్పుడల్లా తనను కాపాడుకోలేకపోయానన్న అపరాధ భావంతో కుమిలిపోతున్నాడు. బహుశా ఆ బాధ ఎప్పటికీ తీరకపోవచ్చు. ఎంతయినా కన్నతండ్రి కదా! - సమీర నేలపూడి