National Film Awards
-
ఏడ్చే సన్నివేశాల్లో సులభంగా నటించేదాన్ని
‘‘కెరీర్ తొలి రోజుల్లో నేను ఎప్పుడూ విచారంగా ఉండేదాన్ని. అందుకేనేమో ఏడ్చే సన్నివేశాలు, భావోద్వేగ సన్నివేశాల్లో సులభంగా నటించేదాన్ని. ఇప్పుడు అలాంటి సన్నివేశాలు చేయడం కొంచెం కష్టంగా మారింది. బహుశా నేనిప్పుడు చాలా ఆనందంగా ఉంటున్నానేమో’’ అన్నారు హీరోయిన్ నిత్యా మీనన్. అందం, అభినయంతో నటనకుప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు మలయాళ బ్యూటీ నిత్యా మీనన్ . తమిళ చిత్రం ‘తిరుచిత్రంబళం’(తెలుగులో తిరు) సినిమాలో తన అద్భుతమైన నటనకుగాను ఇటీవల జరిగిన 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు నిత్యా మీనన్.కాగా ప్రస్తుతం గోవాలో జరుగుతున ్న ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా’(ఇఫీ)లో పాల్గొన్న నిత్యామీనన్ .. సినిమాల్లో తన పాత్రల ఎంపిక గురించి మాట్లాడారు. ‘‘నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నటనకు అంతప్రాధాన్యం లేని పాత్రలు ఎంచుకున్నాను. ఆ సమయంలో చాలా మంది నన్ను విమర్శించారు. ఆ తర్వాత కథలను ఎంపిక చేసుకునే విధానాన్ని మార్చుకున్నా. నటనకిప్రాధాన్యం ఉన్న క్యారెక్టర్లే ఎంచుకున్నాను. నటన అనేది భావోద్వేగానికి సంబంధించినది.దానికి వ్యక్తిగత అనుభవం అవసరం లేదు. సినిమాలో తల్లి పాత్ర పోషించడానికి అనుభవం అవసరం లేదు.. అందులో ఉండే భావోద్వేగాన్ని తెరపై చూపగలిగితే చాలు. మనం చేసే పాత్రలపై మనకు పూర్తి విశ్వాసం ఉండాలి. ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే వాటిని ఎంచుకుంటే మంచి ఆదరణ లభిస్తుంది. మనసు ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. లేదంటే ఆ ప్రభావం చేసే పాత్రపై పడుతుంది’’ అని పేర్కొన్నారు నిత్యా మీనన్. ప్రస్తుతం ఆమె ధనుష్తో ‘ఇడ్లీ కడై’, విజయ్ సేతుపతితో ఓ సినిమా, ‘గోల్డెన్ వీసా’ చిత్రంలోనూ నటిస్తున్నారు. -
70వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన
-
జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుక.. వేదికపై మెరిసిన అల్లు అర్జున్ (ఫొటోలు)
-
జాతీయ ఉత్తమ నటుడు పురస్కారం అందుకున్న అల్లు అర్జున్
-
అల్లు అర్జున్కు కంగ్రాట్స్: సీఎం కేసీఆర్
హైదరాబాద్: 69వ జాతీయ సినీ అవార్డుల్లో తెలుగు చిత్రాలు సత్తా చాటడంపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. జాతీయ ఉత్తమ నటుడి అవార్డు సాధించిన నటుడు అల్లు అర్జున్ను సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. తొలిసారిగా తెలుగు నటుడికి బెస్ట్ యాక్టర్ అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు. అలాగే.. అవార్డులు సాధించిన ఆర్ఆర్ఆర్, పుష్ప చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. అలాగే.. నల్లగొండకు చెందిన ముడుంబై పురుషోత్తమాచార్యులుకి జాతీయ ఉత్తమ సినీ విమర్శకుడిగా అవార్డు దక్కడంపైనా సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు. తాజాగా.. రెండు రోజుల కిందట 69వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు సుకుమార్డైరెక్షన్లో వచ్చిన ‘పుష్ప ది రైజ్’ పార్ట్ 1 చిత్రానికిగానూ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు దక్కింది. దీంతో తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డ్ దక్కించుకున్న తొలి యాక్టర్గా బన్నీ చరిత్ర సృష్టించాడు. ఇక ఆరు అవార్డులతో రాజమౌళి మల్లీస్టారర్ ఆర్ఆర్ఆర్ సత్తా చాటింది. ఉప్పెన ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నెగ్గింది. మొత్తంగా తెలుగు సినిమాకు పదకొండు అవార్డులు దక్కాయి. జాతీయ అవార్డ్ విజేతలకు దక్కే ప్రైజ్మనీ ఎంతో తెలుసా? -
కశ్మీర్ ఫైల్స్కు జాతీయ సమైక్యత అవార్డా?.. తప్పు పట్టిన సీఎం
కేంద్ర ప్రభుత్వం గురువారం 69వ సినీ జాతీయ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈసారి తెలుగు చిత్ర పరిశ్రమ అత్యధిక అవార్డులను కై వసం చేసుకుంది. అదేవిధంగా తమిళ చిత్ర పరిశ్రమ ఆశాజనకమైన అవార్డులను గెలుచుకుంది. నటుడు కమల్ హాసన్ వంటి పలువురు సినీ ప్రముఖులు దక్షిణాది చిత్ర పరిశ్రమ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధికి ఈ అవార్డులు చిహ్నంగా పేర్కొన్నారు. అదేవిధంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ జాతీయ ఉత్తమ అవార్డులకు ఎంపికైన చిత్రాలకు, దర్శక నిర్మాతలకు ట్విటర్ వేదికగా అభినందనలు తెలిపారు. అందులో కశ్మీర్ ఫైల్స్ చిత్రానికి నర్గీస్దత్ పేరుతో జాతీయ సమైక్యత అవార్డును ప్రకటించడాన్ని తప్పుపట్టారు. పలు విధాలుగా వివాదాలను ఎదుర్కొన్న కశ్మీర్ ఫైల్స్ లాంటి చిత్రాలకు ఇలాంటి అవార్డులకు ప్రకటించడం దేశ సమైక్యతను దెబ్బ తీస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇకపోతే ఉత్తమ చిత్రంగా రాకెట్రీ:ది నంబి ఎఫెక్ట్ను ప్రకటించగా.. ప్రాంతీయ భాషలో ఉత్తమ చిత్రంగా ఉప్పెనకు జాతీయ అవార్డు అనౌన్స్ చేశారు. ఉత్తమ నటుడిగా పుష్ప:పార్ట్ 1 సినిమాకు అల్లు అర్జున్, ఉత్తమ నటిగా గంగూబాయి కతియావాడి సినిమాకుగానూ ఆలియా భట్, మిమీ చిత్రానికిగానూ కృతి సనన్ ఎంపికయ్యారు. #69thNationalFilmAwards -இல் தமிழில் சிறந்த படமாகத் தேர்வாகியிருக்கும் #கடைசிவிவசாயி படக்குழுவினருக்கு என் பாராட்டுகள்! @VijaySethuOffl #Manikandan #நல்லாண்டி மேலும், #இரவின்நிழல் படத்தில் ‘மாயவா சாயவா’ பாடலுக்காகச் சிறந்த பின்னணிப் பாடகி விருதை வென்றுள்ள @shreyaghoshal,… pic.twitter.com/Bc2veRY5gs — M.K.Stalin (@mkstalin) August 24, 2023 జాతీయ అవార్డుల పూర్తి జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి చదవండి: అమ్మా, నాన్న పెళ్లి చేసుకోమంటున్నారు.. కానీ: విజయ్ దేవరకొండ -
National film awards 2023 :అల్లు అర్జున్... ఉత్తమ నటుడు
జాతీయ చలన చిత్ర అవార్డుల్లో తొలిసారి తెలుగు సినిమాలు దుమ్ము రేపాయి. మొత్తం పది అవార్డులతో ‘ఎత్తర జెండా’ అంటూ తెలుగు సినిమా సత్తా చాటింది. 69 ఏళ్ల జాతీయ అవార్డుల చరిత్రలో తెలుగు నుంచి జాతీయ ఉత్తమ నటుడిగా ‘పుష్ప... ఫైర్’ అంటూ అల్లు అర్జున్ రికార్డ్ సాధించారు. ఆస్కార్ అవార్డుతో చరిత్ర సృష్టించిన ‘ఆర్ఆర్ఆర్’ ఆరు అవార్డులతో సిక్సర్ కొట్టింది. వీటిలో ‘హోల్సమ్ ఎంటర్టైనర్’ అవార్డు ‘ఆర్ఆర్ఆర్’ సొంతం అయింది. 2021 జనవరి 1 నుంచి 2021 డిసెంబరు 31 లోపు సెన్సార్ అయి, అవార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న సినిమాలను పరిగణనలోకి తీసుకుని జ్యూరీ సభ్యులు అవార్డులను ప్రకటించడం జరిగింది. జాతీయ ఉత్తమ నటీమణులుగా ‘గంగూబాయి కతియావాడి’లో వేశ్య పాత్ర చేసిన ఆలియా భట్, ‘మిమి’ చిత్రంలో గర్భవతిగా నటించిన కృతీ సనన్ నిలిచారు. ఖగోళ శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితం ఆధారంగా ఆర్. మాధవన్ టైటిల్ రోల్ చేసి, స్వీయదర్శకత్వంలో రూపొందించిన ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ ఉత్తమ చిత్రంగా, ఉత్తమ దర్శకుడిగా మరాఠీ ఫిల్మ్ ‘గోదావరి’కి గాను నిఖిల్ మహాజన్ అవార్డు సాధించారు. ఇంకా పలు విభాగాల్లో కేంద్ర ప్రభుత్వం గురువారం జాతీయ అవార్డులను ప్రకటించింది. ఆ విశేషాలు ఈ విధంగా... 69వ జాతీయ అవార్డులకు గాను 28 భాషలకు చెందిన 280 చలన చిత్రాలు పోటీపడ్డాయి. మొత్తం 31 విభాగాల్లో అవార్డులను ప్రకటించారు. సుకుమార్ దర్శకత్వంలోని ‘పుష్ప: ది రైజ్’ సినిమాలోని నటనకుగాను అల్లు అర్జున్కు ఉత్తమ జాతీయ నటుడిగా తొలి అవార్డు లభించింది. ఇదే చిత్రానికి సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ జాతీయ అవార్డు సాధించారు. ఇక ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘రౌద్రం..రణం..రుధిరం’ (ఆర్ఆర్ఆర్) సినిమాకు ఆరు విభాగాల్లో అవార్డులు దక్కాయి. జాతీయ హోల్సమ్ ఎంటర్టైనర్గా ‘ఆర్ఆర్ఆర్’ నిలిచింది. ఇదే చిత్రానికి ఉత్తమ నేపథ్య సంగీతానికి గాను ఎంఎం కీరవాణి, ఇదే చిత్రానికి స్పెషల్ ఎఫెక్ట్స్కి వి. శ్రీనివాస్ మోహనన్, ‘నాటు నాటు..’ పాట కొరియోగ్రఫీకి ప్రేమ్ రక్షిత్, ‘ఆర్ఆర్ఆర్’లోని ‘కొమురం భీముడో..’ పాటకు మేల్ ప్లే బ్యాక్ సింగర్గా కాలభైరవ, ఇదే చిత్రానికి స్టంట్ కొరియోగ్రాఫర్గా కింగ్ సాల్మన్లకు జాతీయ అవార్డులు దక్కాయి. ఇక ‘నాటు.. నాటు’కి రచయితగా తొలి ఆస్కార్ అవార్డు అందుకున్న చంద్రబోస్ ‘కొండపొలం’లోని ‘ధంధం ధం.. తిరిగేద్దాం...’ పాటకు జాతీయ అవార్డు అందుకోనున్నారు. దర్శకుడిగా తన తొలి చిత్రానికి జాతీయ అవార్డు దక్కిన ఆనందంలో ఉన్నారు ‘ఉప్పెన’ను తెరకెక్కించిన బుచ్చిబాబు సన. మైత్రీ మూవీ మేకర్స్పై వై. రవిశంకర్, నవీన్ ఎర్నేని నిర్మించిన ‘ఉప్పెన’ ప్రాంతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా నిలిచింది. ఉత్తమ సినీ విమర్శకుడిగా నల్గొండ జిల్లాకి చెందిన ఎం. పురుషోత్తమాచార్యులకు అవార్డు దక్కింది. రెండేళ్లుగా ‘మిసిమి’ మాస పత్రికలో సినిమా పాటల్లో శాస్త్రీయ సంగీతంపై పరిశోధనలు చేస్తూ, పలు వ్యాసాలు రాశారు పురుషోత్తమాచార్యులు. ఇక ఆలియా భట్కి ‘గంగూబాయి కతియావాడి’ జాతీయ ఉత్తమ నటిగా అవార్డు దక్కేలా చేయడంతో పాటు మరో నాలుగు విభాగాల్లో (బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్, మేకప్, ఎడిటింగ్) అవార్డులు వచ్చేలా చేసింది. అలాగే విక్కీ కౌశల్ హీరోగా నటించిన బయోగ్రఫికల్ డ్రామా ‘సర్దార్ ఉద్దమ్’కు ప్రాంతీయ ఉత్తమ హిందీ చిత్రంతో పాటు మొత్తం నాలుగు విభాగాల్లో (సినిమాటోగ్రఫీ, ఆడియోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్, కాస్ట్యూమ్ డిజైన్) అవార్డులు దక్కాయి. ఈ చిత్రానికి సూజిత్ సర్కార్ దర్శకుడు. తమిళ ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘కడైసీ వివసాయి’, మలయాళంలో ‘హోమ్’, కన్నడంలో ‘777 చార్లీ’ అవార్డులు గెలుచుకున్నాయి. ఇంకా పలు భాషల్లో పలు చిత్రాలకు అవార్డులు దక్కాయి. ఇదొక చరిత్ర – నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ అల్లు అర్జున్గారికి జాతీయ అవార్డు రావడం ఎంతో ఆనందంగా, గర్వంగా ఉంది. ఇదొక చరిత్ర ‘పుష్ప’ షూటింగ్ సమయంలోనే అల్లు అర్జున్ తప్పకుండా నేషనల్ అవార్డ్ కొడతారని సుకుమార్గారు అనేవారు.. అది ఈ రోజు నిజమైంది. మాకు ఇంత మంచి సినిమా ఇచ్చిన అల్లు అర్జున్, సుకుమార్ గార్లకు థ్యాంక్స్. దేవిశ్రీ ప్రసాద్కి జాతీయ అవార్డ్ రావడం హ్యాపీ. అలాగే మా ‘ఉప్పెన’కి ఉత్తమ తెలుగు సినిమాగా జాతీయ అవార్డు రావడం గర్వంగా ఉంది. దర్శకుడు బుచ్చిబాబు, టీమ్కి అభినందనలు. అలాగే ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి ఆరు అవార్డులు రావడం సంతోషంగా ఉంది. – నవీన్ యెర్నేని, నిర్మాత మా మైత్రీ మూవీస్ బ్యానర్లో ‘ఉప్పెన, పుష్ప’ చాలా ప్రతిష్టాత్మక చిత్రాలు. జాతీయ అవార్డు అందుకున్న తొలి తెలుగు నటుడిగా అల్లు అర్జున్గారు చరిత్ర సృష్టించారు. తెలుగు సినిమా చరిత్రలో ఇది చిరకాలం గుర్తుండిపోతుంది. దేవిశ్రీ ప్రసాద్కి అవార్డు రావడం ఆనందంగా ఉంది. ‘ఉప్పెన, పుష్ప’ రెండు విజయాల్లో సింహ భాగం సుకుమార్గారిదే. ‘ఆర్ఆర్ఆర్, కొండపొలం’ చిత్రాలకు జాతీయ అవార్డులు రావడం ఆనందాన్నిచ్చింది. – వై. రవిశంకర్, నిర్మాత ‘‘నా తొలి సినిమాకే జాతీయ అవార్డు రావడం హ్యాపీగా ఉంది. నిర్మాతలు నవీన్గారికి, రవిగారికి, మా గురువుగారు సుకుమార్ గారికి కృతజ్ఞతలు. సినిమా చూడ్డానికి మా ఇంట్లో నన్ను పంపించేవాళ్లు కాదు. అలాంటిది నేను ఒక సినిమాకి డైరెక్ట్ చేయడం, నా ఫస్ట్ సినిమాకే నేషనల్ అవార్డు రావడం అంటే ఏం మాట్లాడాలో అర్థం కావడంలేదు. మా అమ్మగారికి నేషనల్ అవార్డు అంటే ఏంటో కూడా తెలియదు. ఈ అవార్డు గురించి ఆమెకి చెప్పాలంటే. ‘ఇండియాలోనే పెద్ద అవార్డు వచ్చింది’ అని చెప్పాలి’’ అంటున్న బుచ్చిబాబు సనని తదుపరి చిత్రం గురించి అడగ్గా.. ‘‘రామ్చరణ్గారి కోసం మంచి రా అండ్ రస్టిక్ స్టోరీ రాశాను. నా మనసుకి బాగా నచ్చి, రాసుకున్న కథ ఇది. జనవరిలో షూటింగ్ ఆరంభిస్తాం’’ అన్నారు. – బుచ్చిబాబు సన, దర్శకుడు పది అవార్డులతో తొలి రికార్డ్ ఈసారి తెలుగు పరిశ్రమ ఎక్కువ జాతీయ అవార్డులు సొంతం చేసుకోవడంతో పాటు మరో విశేషమైన రికార్డ్ సాధించింది. అదేంటంటే.. 27వ జాతీయ చలన చిత్ర అవార్డ్స్లో ‘శంకరాభరణం’ (1980) సినిమాకు నాలుగు జాతీయ అవార్డులు లభించాయి. 30వ జాతీయ చలన చిత్ర అవార్డ్స్లో ‘మేఘ సందేశం’ (1982)కి నాలుగు అవార్డులు వచ్చాయి. అలాగే ‘దాసి’ (1988) చిత్రం 36వ జాతీయ అవార్డ్స్లో ఐదు విభాగాల్లో అవార్డులను దక్కించుకుంది. ఆ తర్వాత తెలుగు సినిమాలకు ఐదుకు మించి అవార్డులు రాలేదు. 35 ఏళ్లకు రెండు ఐదులు.. అంటే పది అవార్డులు దక్కించుకుని తెలుగు చిత్రసీమ తొలి రికార్డ్ని సాధించింది. 69వ చలనచిత్ర జాతీయ అవార్డు విజేతలు ఉత్తమ నటుడు: అల్లు అర్జున్ (పుష్ప) ఉత్తమ నటి: ఆలియా భట్ (గంగూబాయి..) – కృతీసనన్ (మిమీ) ఉత్తమ చిత్రం: రాకెట్రీ: ద నంబీ ఎఫెక్ట్ (హిందీ) ఉత్తమ దర్శకుడు: నిఖిల్ మహాజన్ (గోదావరి– మరాఠీ సినిమా) ఉత్తమ పిల్లల చిత్రం: గాంధీ అండ్ కో (గుజరాతీ) ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ (నేపథ్య సంగీతం): ఆర్ఆర్ఆర్æ– ఎమ్ఎమ్ కీరవాణి ఉత్తమ సంగీత దర్శకుడు (పాటలు): పుష్ప– దేవిశ్రీ ప్రసాద్ ఉత్తమ కొరియోగ్రఫీ: ఆర్ఆర్ఆర్ –ప్రేమ్ రక్షిత్ ఉత్తమ మేల్ ప్లేబ్యాక్ సింగర్: కాలభైరవ (ఆర్ఆర్ఆర్ – కొమురం భీముడో..) ఉత్తమ లిరిక్స్: చంద్రబోస్– కొండపొలం ఉత్తమ యాక్షన్ డైరెక్షన్ అవార్డ్ (స్టంట్ కొరియోగ్రఫీ): ఆర్ఆర్ఆర్– కింగ్ సాల్మన్ ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్: ఆర్ఆర్ఆర్– శ్రీనివాస్ మోహనన్ ఉత్తమ సహాయ నటి: పల్లవీ జోషి (ద కశ్మీరీ ఫైల్స్– హిందీ) ఉత్తమ సహాయ నటుడు: పంకజ్ త్రిపాఠీ (మిమీ– హిందీ) ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్: ప్రీతిశీల్ సింగ్ డిసౌజా (గంగూబాయి కతియావాడి–హిందీ) ఉత్తమ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్: శ్రేయా ఘోషల్ (ఇరవిన్ నిళల్– తమిళ్) ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్: వీరా కపూర్ ఏ (సర్దార్ ఉద్ధమ్–హిందీ) ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ : ది మిత్రీ మాలిక్ – మాన్సి ధ్రువ్ మెహతా (సర్దార్ ఉద్ధమ్) (హిందీ) ఉత్తమ ఎడిటింగ్: సంజయ్ లీలా భన్సాలీ (గంగూబాయి కతియావాడి–హిందీ) ఉత్తమ ఆడియోగ్రఫీ (లొకేషన్ సౌండ్ రికార్డిస్ట్): అరుణ్ అశోక్ – సోనూ కేపీ (చవిట్టు మూవీ–మలయాళం) ఉత్తమ స్క్రీన్ప్లే(అడాప్టెడ్): సంజయ్లీలా భన్సాలీ, ఉత్కర్షిణి వశిష్ట (గంగూబాయి కతియావాడి– హిందీ) ఉత్తమ స్క్రీన్ ప్లే (ఒరిజినల్): షాహీ కబీర్ (నాయట్టు సినిమా–మలయాళం) ఉత్తమ స్క్రీన్ ప్లే (డైలాగ్ రైటర్): ప్రకాశ్ కపాడియా – ఉత్కర్షిణి వశిష్ట (గంగూబాయి కతియావాడి– హిందీ) ఉత్తమ సినిమాటోగ్రఫీ: అవిక్ ముఖోపాధ్యాయ్ (సర్దార్ ఉద్ధమ్ మూవీ–హిందీ) ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్: భవిన్ రబరీ (ఛెల్లో షో – గుజరాతీ) ఉత్తమ ఫిలిం ఆన్ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ : అవషావ్యూహం (మలయాళం) ఉత్తమ ఫిలిం ఆన్ సోషల్ ఇష్యూస్: అనునాద్–ద రెజోనెన్ ్స (అస్సామీ) ఉత్తమ పాపులర్ ఫిలిం ఆన్ ప్రొవైడింగ్ హోల్సమ్ ఎంటర్టైన్ మెంట్: ఆర్ఆర్ఆర్ ఉత్తమ ఆడియోగ్రఫీ (సౌండ్ డిజైనర్): అనీష్ బసు (జీలీ మూవీ– బెంగాలీ) ఉత్తమ ఆడియోగ్రఫీ (రీ రికార్డిస్ట్ ఆఫ్ ద ఫైనల్ మిక్స్డ్ ట్రాక్): సినోయ్ జోసెఫ్ (సర్దార్ ఉద్ధమ్–హిందీ) ఇందిరాగాంధీ అవార్డ్ ఫర్ బెస్ట్ డెబ్యూ ఫిలిం ఆఫ్ ఎ డైరెక్టర్: మెప్పాడియన్ (మలయాళం) స్పెషల్ జ్యూరీ అవార్డ్: షేర్ షా (హిందీ) (డైరెక్టర్ విష్ణువర్థన్) నర్గీస్ దత్ అవార్డ్ ఫర్ బెస్ట్ ఫిల్మ్ ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్: ద కశ్మీరీ ఫైల్స్ (హిందీ) ఉత్తమ ప్రాంతీయ చిత్రాలు ఉత్తమ తెలుగు చిత్రం : ఉప్పెన ఉత్తమ తమిళ్ చిత్రం : కడైసి వివసాయి (ద లాస్ట్ ఫార్మర్) ఉత్తమ కన్నడ చిత్రం : 777 చార్లి ఉత్తమ మలయాళ చిత్రం : హోమ్ ఉత్తమ హిందీ చిత్రం : సర్దార్ ఉద్దామ్ ఉత్తమ గుజరాతీ చిత్రం : లాస్ట్ ఫిల్మ్ షో (ఛెల్లో షో) ఉత్తమ మరాఠీ చిత్రం : ఏక్డా కే జాలా ఉత్తమ మీషింగ్ చిత్రం : బూంబా రైడ్ ఉత్తమ అస్సామీస్ చిత్రం : అనూర్ (ఐస్ ఆన్ ది సన్ షైన్) ఉత్తమ బెంగాలీ చిత్రం : కల్కొకో–హౌస్ ఆఫ్ టైమ్ ఉత్తమ మైథిలీ చిత్రం : సమాంతర్ ఉత్తమ ఒడియా చిత్రం : ప్రతీక్ష్య (ద వెయిట్) ఉత్తమ మెయిటిలాన్ చిత్రం : ఈఖోయిగీ యమ్ (అవర్ హోమ్) ‘పుష్ప’ చిత్రంలో నటనకుగాను అల్లు అర్జున్కి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు దక్కడం సంతోషం. తొలిసారి ఈ అవార్డు అందుకోనున్న అల్లు అర్జున్కి అభినందనలు. 69వ జాతీయ అవార్డులు తెలుగు చిత్ర పరిశ్రమకు బొనాంజాగా నిలిచాయి. అదే విధంగా పాన్ ఇండియా కాన్వాస్లో దూసుకుపోతున్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి ఆరు విభాగాల్లో ఈ అవార్డులు దక్కటం ప్రశంసనీయం. డైరెక్టర్ రాజమౌళితో పాటు చిత్ర యూనిట్కి అభినందనలు. ఉత్తమ సంగీత దర్శకునిగా దేవీశ్రీ ప్రసాద్ (పుష్ప), ఉత్తమ సాహిత్యానికి చంద్రబోస్ (కొండపొలం) జాతీయ అవార్డుకు ఎంపికవడం అభినందనీయం. – వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. తెలుగు సినిమా గర్వపడే క్షణాలివి. జాతీయ ఉత్తమ నటుడిగా నిలిచిన బన్నీ (అల్లు అర్జున్)కి శుభాకాంక్షలు. చాలా గర్వంగా ఉంది. రాజమౌళి విజన్లో ఆరు అవార్డులు సాధించిన ‘ఆర్ఆర్ఆర్’ టీమ్కు, రెండు అవార్డులు సాధించిన ‘పుష్ప’కు, ‘ఉప్పెన’ టీమ్కు, సినీ విమర్శకులు పురుషోత్తమచార్యులకు శుభాకాంక్షలు. – చిరంజీవి ఇట్స్ సిక్సర్.. జాతీయ అవార్డులు సాధించినందుకు ‘ఆర్ఆర్ఆర్’ యూనిట్ అందరికీ శుభాకాంక్షలు. ఎంపిక చేసిన జ్యూరీకి ధన్యవాదాలు. ‘పుష్ప’.. తగ్గేదేలే... బన్నీకి, దేవిశ్రీ ప్రసాద్లతో పాటు ‘పుష్ప’ టీమ్కి శుభాకాంక్షలు. బోస్ (చంద్రబోస్)గారికి మళ్లీ శుభాకాంక్షలు. ‘గంగూబాయి కతియావాడి’తో అవార్డు గెల్చుకున్న మా ‘సీత’ (‘ఆర్ఆర్ఆర్’లో ఆలియా భట్ సీత పాత్రలో నటించారు)కు కంగ్రాట్స్. ‘ఉప్పెన’ టీమ్తో పాటు జాతీయ స్థాయిలో అవార్డులు గెల్చుకున్నవారికీ శుభాకాంక్షలు. – రాజమౌళి నా నేపథ్య సంగీతాన్ని గుర్తించి, నాకు జ్యూరీ సభ్యులు అవార్డును ప్రకటించడాన్ని గౌరవంగా భావిస్తున్నాను . చంద్రబోస్గారికి, దేవిశ్రీ ప్రసాద్, కాలభైరవ.. మా ‘ఆర్ఆర్ఆర్’ టీమ్కు శుభాకాంక్షలు. – కీరవాణి ఈ జాతీయ అవార్డు మీదే (సంజయ్ సార్, గంగూబాయి.. టీమ్.. ముఖ్యంగా ప్రేక్షకులు). ఎందుకంటే... మీరు లేకుంటే నాకు ఈ అవార్డు దక్కేదే కాదు. చాలా సంతోషంగా ఉంది. ఈ క్షణాలను గుర్తుపెట్టుకుంటాను. మిమ్మల్ని ఎంటర్టైన్ చేసేందుకు ఇంకా కష్టపడతాను. ‘మిమి’ సినిమాలో నీ ( కృతీ సనన్ని ఉద్దేశించి) నటన నిజాయితీగా, పవర్ఫుల్గా ఉంది. ఆ సినిమా చూసి నేను ఏడ్చాను. ఉత్తమ నటి అవార్డుకు నువ్వు అర్హురాలివి. – ఆలియా భట్. ఏఏఏ 69 సంవత్సరాలుగా తెలుగు ఇండస్ట్రీకి రాని ఆ అద్భుతాన్ని తీసుకొచ్చిన ప్రేక్షకులకు, నిర్మాతలకు, దర్శకుడికి, ముఖ్యంగా మా ఫ్యామిలీని పతాకస్థాయికి తీసుకుని వెళ్లిన మా అబ్బాయికి (అల్లు అర్జున్ ) కృతజ్ఞతలు. – అల్లు అరవింద్ ఇంకా వెంకటేశ్, మహేశ్బాబు, ఎన్టీఆర్, రామ్చరణ్ తదితరులు తమ ఆనందం వ్యక్తం చేశారు. పది అవార్డులతో తొలి రికార్డ్ ఈసారి తెలుగు పరిశ్రమ ఎక్కువ జాతీయ అవార్డులు సొంతం చేసుకోవడంతో పాటు మరో విశేషమైన రికార్డ్ సాధించింది. అదేంటంటే.. 27వ జాతీయ చలన చిత్ర అవార్డ్స్లో ‘శంకరాభరణం’ (1980) సినిమాకు నాలుగు జాతీయ అవార్డులు లభించాయి. 30వ జాతీయ చలన చిత్ర అవార్డ్స్లో ‘మేఘ సందేశం’ (1982)కి నాలుగు అవార్డులు వచ్చాయి. అలాగే ‘దాసి’ (1988) చిత్రం 36వ జాతీయ అవార్డ్స్లో ఐదు విభాగాల్లో అవార్డులను దక్కించుకుంది. ఆ తర్వాత తెలుగు సినిమాలకు ఐదుకు మించి అవార్డులు రాలేదు. 35 ఏళ్లకు రెండు ఐదులు.. అంటే పది అవార్డులు దక్కించుకుని తెలుగు చిత్రసీమ తొలి రికార్డ్ని సాధించింది. ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ భారతదేశ ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్త నంబియార్ నారాయణన్ జీవిత చరిత్ర ఆధారంగా ‘రాకెట్రీ: ‘ది నంబి ఎఫెక్ట్’ సినిమా రూపొందింది. ఇస్రోలో చేరిన నారాయణన్ స్వదేశీ రాకెట్లను అభివృద్ధి చేసే ప్రాజెక్ట్లో భాగంగా రష్యా డెవలప్ చేసిన క్రయోజెనిక్ ఇంజ¯Œ ్సని భారత్కి తీసుకురావాలనుకుంటారు. ఇదే సమయంలో పాకిస్తా¯Œ కు భారత రాకెట్ సాంకేతిక విషయాలను చేరవేశారనే నెపంతో అరెస్ట్ అవుతారు నారాయణన్. అరెస్ట్ తర్వాత కేరళ పోలీసుల విచారణలో ఆయన ఎలాంటి చిత్రహింసలు అనుభవించారు? ఆ తర్వాత ఆయన జీవితం ఎలా మలుపు తిరిగింది? తనపై వచ్చిన తప్పుడు ఆరోపణల నుంచి నారాయణన్ ఎలా విముక్తి పొందారు? అనే నేపథ్యంలో ‘రాకెట్రీ: ‘ది నంబి ఎఫెక్ట్’ సినిమా రూపొందింది. నంబియార్ నారాయణన్ పాత్ర చేయడంతో పాటు మాధవన్ దర్శకత్వం వహించారు. నారాయణన్ సతీమణి మీన క్యారెక్టర్లో హీరోయిన్ సిమ్రాన్ చక్కగా నటించారు. ప్రత్యేకించి ఆమె పండించిన భావోద్వేగాలు సినిమాకి హైలైట్. హీరో సూర్య అతిథి పాత్రలో మెరవడం కూడా ఈ సినిమాకి ప్లస్ అయ్యింది. ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. నా అభిప్రాయాన్ని బలంగా చెప్పాను – ఎంఎం శ్రీలేఖ ‘‘ప్రతి ఏడాది తెలుగు సినిమాలంటే కొంచెం నిర్లక్ష్యం. కంటి తుడుపుగా ఒకటో రెండో అవార్డులు ఇస్తున్నారు. దీనిపై జ్యూరీలో గట్టిగా మాట్లాడేవారు కావాలి. తెలుగుకు ఎందుకు ఇవ్వరు? అని మాట్లాడ గలగాలి. అయితే ఆ సినిమాలో విషయం ఉండాలి.. లేకుంటే మాట్లాడలేం’’ అన్నారు సంగీత దర్శకురాలు ఎంఎం శ్రీలేఖ. 69వ జాతీయ అవార్డుల్లో దక్షిణాది తరఫున జ్యూరీలో శ్రీలేఖతో పాటు రచయిత్రి బలభద్రపాత్రుని రమణి ఉన్నారు. అవార్డులు ప్రకటించిన అనంతరం ఎంఎం శ్రీలేఖ ‘సాక్షి’తో మాట్లాడుతూ ‘‘మామూలుగా ఫైనల్ ప్యానల్లో భోజ్పురి వాళ్లు ఉంటారు. వారికి మహానటి సావిత్రి గురించి ఏం తెలుస్తుంది? అందుకే జ్యూరీలో ఉన్న తెలుగువారు తెలుగు సినిమాల గురించి గట్టిగా చెప్పాలి. ఓ జ్యూరీ సభ్యురాలిగా నా అభిప్రాయాన్ని నేను బలంగా చెప్పాను. ఈసారి నేను ఏవైతే రావాలనుకున్నానో దాదాపు వాటికే వచ్చాయి. తొలిసారి తండ్రీ కొడుకులు కీరవాణి అన్నయ్య– కాలభైరవ ఒకే వేదికపై అవార్డులు తీసుకోనుండటం నాకో గొప్ప అనుభూతి. ఇక జ్యూరీ సభ్యులకు ఒత్తిడి ఉంటుందనుకుంటారు.. అలాంటిదేమీ లేదు. నిజాయతీగా నాకు ఏది అనిపిస్తే అది చెప్పాను’’ అన్నారు. ఉప్పెన మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన హీరోల్లో వైష్ణవ్ తేజ ఒకరు. ఆయన నటించిన తొలి చిత్రం ‘ఉప్పెన’. ఈ సినిమా ద్వారా బుచ్చిబాబు సన డైరెక్టర్గా, కృతీశెట్టి హీరోయిన్గా పరిచయమయ్యారు. ఈ ముగ్గురూ తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్నారు. సముద్ర తీరాన ఉప్పాడ అనే పల్లెటూరు. స్కూల్ డేస్ నుంచే బేబమ్మ (కృతీశెట్టి) మీద ఇష్టం పెంచుకున్న మత్స్యకార కుటుంబానికి చెందిన ఆశీర్వాదం (వైష్ణవ్ తేజ్) నిత్యం తననే ఆరాధిస్తూ ప్రేమిస్తుంటాడు. ప్రాణం కంటే పరువు ముఖ్యం అనుకునే పెద్ద మనిషి శేషారాయనం (విజయ్ సేతుపతి). ఆయన కూతురు బేబమ్మ కాలేజీలో చదువుకుంటూ ఉంటుంది. ఆ సమయంలో తన మనసులోని ప్రేమను బేబమ్మకి చెబుతాడు ఆశీర్వాదం. తన స్వచ్ఛమైన ప్రేమను అర్థం చేసుకున్న బేబమ్మ కూడా ఆశీర్వాదాన్ని ప్రేమిస్తుంది. ఇద్దరూ ప్రేమలో ఉన్న విషయం శేషారాయనంకి తెలుస్తుంది. దీంతో ఆశీర్వాదం–బేబమ్మ కలిసి ఊరి నుంచి వెళ్లిపోతారు. ఈ విషయం బయటకి తెలిస్తే తన పరువు పోతుందని ఆర్నెళ్ల పాటు తన కూతుర ు ఇంట్లోనే ఉందని ఊరి జనాలను నమ్మిస్తాడు రాయనం. ఆరు నెలల తర్వాత అయినా బేబమ్మ ఇంటికి తిరిగొచ్చిందా? తన కులం కానివాడు తన కూతురిని ప్రేమించాడన్న కోపంతో ఆశీర్వాదంని శేషారాయనం ఏం చేశాడు? ఆశీర్వాదం–బేబమ్మ ప్రేమకథ ఎలాంటి మలుపు తీసుకుంటుంది? చివరికి వారిద్దరూ ఒక్కటయ్యరా ? లేదా అనేది ‘ఉప్పెన’ కథ. 2021 ఫిబ్రవరి 12న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్గా నిలిచింది. -
మన సత్తా ఇప్పుడే తెలిసిందా?
తెలుగు సినిమాను చాలాకాలం పాటు కేంద్ర ప్రభుత్వ అవార్డుల కమిటీ సభ్యులు, క్రిటిక్స్ తక్కువ చేసి చూపించడానికి ప్రయత్నించారు. కానీ, ఇప్పుడు తెలుగు సినిమా జూలు విదిలిస్తోంది. 2021కి గాను ప్రకటించిన 69వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాకు 11 అవార్డులు దక్కాయి. నేషనల్ ఫిల్మ్ అవార్డుల చరిత్రలో తొలిసారిగా ఒక తెలుగు నటుడికి జాతీయ ఉత్తమ నటుడు అవార్డ్ రావడం అభిమానులనే కాదు – పరిశ్రమనూ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తెలుగు వాడికి టాలెంట్ ఎప్పుడూ ఉంది, కానీ ప్రపంచం ఇప్పుడే తెలుగు సినిమా ప్రతిభ తెలుసుకుంటోంది. ఆగస్ట్ 23న చంద్రయాన్–3 ప్రయోగం విజయవంతం కావడంతో భారతదేశం, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులు అందరూ గర్వపడ్డారు. ఆ మరుసటి రోజునే తెలుగు సినిమా చంద్ర మండలం ఎక్కినంతగా సంబరం చేసుకుంటోంది. కారణం అందరికీ తెలిసిందే! 2021వ సంవత్సరానికి గాను ప్రకటించిన 69వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాకు ఏకంగా 11 అవార్డులు దక్కాయి. సంఖ్యా పరంగానే కాకుండా – 69 సంవత్సరాల నేషనల్ ఫిల్మ్ అవార్డుల చరిత్రలో తొలిసారిగా ఒక తెలుగు నటుడికి జాతీయ ఉత్తమ నటుడు అవార్డ్ రావడం తెలుగు సినిమా అభిమానులనే కాదు– తెలుగు సినిమా పరిశ్రమను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇక్కడ మౌలికంగా ఓ ప్రశ్న తలెత్తుతుంది. తెలుగు సినిమా రంగంలో ఎందరో మహా నటులున్నారు. వారెవరికీ దక్కని గౌరవం, గుర్తింపు– అభిమానుల చేత ‘ఐకాన్ స్టార్’ అని పిలిపించుకునే అల్లు అర్జున్కు రావడం సంతోషదాయకం. అలాగని ముందు తరాల నటుల గురించి, ఏ మాత్రం తక్కువగా ఆలోచించినా మహాపరాధం! ఒక నిజం ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా – తెలుగు సినిమాను చాలాకాలం పాటు కేంద్ర ప్రభుత్వ అవార్డుల కమిటీ సభ్యులు, మిగి లిన భాషా చిత్రాల మార్కెట్లు, క్రిటిక్స్ తక్కువ చేసి చూపించడానికి ప్రయత్నించారు. ఎన్.టి. రామారావు గారి ‘పాతాళ భైరవి’, అక్కినేని నాగేశ్వరరావు గారి ‘సువర్ణ సుందరి’ – హిందీలోనూ ఏడాది పైన ఆడిన చరిత్ర ఈ జనరేషన్కి తెలియకపోవచ్చు. అలాగే జకార్తా ఇంటర్ నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్లో ‘నర్తన శాల’ సినిమాలో ఎస్.వి. రంగా రావు పోషించిన కీచక పాత్రకు ఉత్తమ నటుడిగా లభించిన గౌరవం కొందరికే గుర్తుండవచ్చు. పైగా పది, పదిహేనేళ్ళ క్రితం వరకూ అవార్డులను... నేచురల్గా ఉండే సినిమాలు అనండి, ఆర్ట్ ఫిలిమ్స్ అనండి... వాటికి మాత్రమే ఇవ్వాలనే ఒక ప్రత్యేక ధోరణి ఉండేది. బాక్సాఫీస్ దగ్గర డబ్బులు వసూలు చేసిన సినిమాలకూ, అందులో పని చేసినవాళ్ళకూ ఎక్కువ శాతం అవార్డులు వచ్చేవి కాదు. వచ్చేవి కాదు అనే కన్నా ఇచ్చేవాళ్ళు కాదనడం కరెక్ట్! పక్క భాషల నటులు ఒక్కొక్కరికి 2–3 అవార్డులు వచ్చిన సందర్భాలున్నాయి. అదే సమయంలో మన తెలుగు నటు లను గుర్తించడం లేదేంటని బాధ పడుతుండేవాళ్ళు. అందుకే 30 ఏళ్ళ నుంచి ఉత్తమ వినోదాత్మక చిత్రం అవార్డ్ ప్రవేశపెట్టి, కమర్షియల్ సినిమా కన్నీరు తుడిచే ప్రయత్నం చేశారు. అయిదారేళ్ళ క్రితం వరకూ భారతీయ వినోదాత్మక రంగం నుంచి వచ్చే ఆదాయంలో తెలుగు సినిమా వాటా 18–19 శాతం ఉండేది. బాలీవుడ్ రెవిన్యూ తర్వాత స్థానం తెలుగు సినిమాదే. ఇప్పుడు ఈ వాటా 30 శాతం వరకూ పెరిగిందని విన్నాను. కేవలం ప్రభుత్వానికి ఆదాయం రావడమే కాదు! అన్ని వందల, వేల కోట్ల ఆదాయం ఎన్ని వేల కుటుంబాలకు ఉపాధి కలిగిస్తోందో అన్న విషయం ప్రధానంగా గమనించాలి. ముఖ్యంగా ఇవాళ ఆర్ట్ ఫిలిమ్స్ తీసేవాళ్ళు, ఆదరించేవాళ్ళు తగ్గి పోయారు. అవతల ఆస్కార్ అవార్డుల్లో (మన వాళ్ళందరికీ అదే కొలమానం కాబట్టి) బాక్సాఫీస్ సక్సెస్ అయిన సినిమాలకూ, క్రైమ్ డ్రామాలకూ అవార్డులు ఇస్తున్నప్పుడు కమర్షియల్ సినిమాలు భారత దేశంలో ఏం పాపం చేసుకున్నాయి? జనం బాగా ఆదరించిన సిని మాల్లో కళాత్మక విలువలు ఉండవా? అత్యద్భుతమైన ప్రతిభా పాట వాలు ఉండవా? ఎన్ని పదుల, వందల కోట్ల పారితోషికాలు తీసు కున్నా, ప్రతి కళాకారుడూ కోరుకునేది తన పనిని ఎక్కువ మంది మెచ్చుకోవాలని! మేధావులు, అవార్డుల కమిటీల్లో గొప్పవాళ్ళ నుంచి ప్రశంసలు, సత్కారాలు అందుకోవాలని! ఇందులో తప్పేం ఉంది? అమితాబ్కి ఉత్తమ నటుడు అవార్డ్ వచ్చినప్పుడూ, రజనీ కాంత్కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ప్రదానం చేసినప్పుడు కూడా కొన్ని విమర్శలు వచ్చాయి. వాళ్ళు దేశవ్యాప్తంగా పాపులర్ స్టార్స్ అయినంత మాత్రాన ప్రతిభావంతులు కారా? ఎవరు అవునన్నా, కాదన్నా – రాజమౌళి ‘బాహుబలి’తో ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ రీ–సౌండ్ తెలుగు సినిమా వినిపించింది. అప్పటి నుంచి తెలుగు సినిమా రంగం గురించి మన దేశంలోనే కాదు... ప్రపంచంలోని సినిమా అభిమానులందరికీ తెలిసింది. ఈ రోజు జాతీయ స్థాయిలో తెలుగు సినిమా పనితనం, ప్రతిభ తెలిసిందంటే... తెలుగు సినిమా తనని తాను పెంచుకున్న స్థాయి. లాబీయింగ్ అంటే ఇదే! తెలుగు సినిమా తన టాలెంట్తో భారతదేశంలోని సినిమా అభిమానులు, కమిటీ సభ్యుల దగ్గర లాబీయింగ్ చేసింది! భారీ స్థాయిలో – ఊహకందని విజువల్స్తో, మార్కెట్ రిస్క్ చేసి సంపాదించుకున్న రెస్పెక్ట్ ఇది! రాజమౌళి ‘ఆర్.ఆర్.ఆర్.’ ఆస్కార్ స్థాయిలో అందుకున్న అవార్డులకూ, గుర్తింపునకూ ఈ జాతీయ అవార్డులు ఓ కొనసాగింపు! అలాగే శ్రీశ్రీ, వేటూరి, సుద్దాల అశోక్ తేజ సరసన ఇప్పుడు చంద్ర బోస్ జాతీయ ఉత్తమ గీత రచయిత అవార్డును అందుకున్నారు. ప్రేమకథల్లో ఓ షాకింగ్ పాయింట్తో వచ్చిన ‘ఉప్పెన’ సినిమా తెలుగులో ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డ్ గెలుచుకోవడం అభినందనీయం! ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును అందుకున్న తొలి తెలుగు నటుడిగా చరిత్రలో నిలిచిపోతున్న అల్లు అర్జున్ గురించి రెండు మాటలు చెప్పాలి. ప్రతి నటుడూ కష్టపడతారు. అల్లు అర్జున్ తనకు అసాధ్యం అనుకున్నది కూడా కసిగా సాధించి తీరుతారు. అల్లు అర్జున్తో మూడు సినిమాలకు ఓ రచయితగా పని చేసినప్పుడు ఆయ నలో గమనించిన కొన్ని లక్షణాల గురించి చెప్పుకోవాలి. క్యారెక్టర్ కోసం తన శరీరాన్ని మలుచుకోవడమే కాదు... డిక్షన్, బాడీ లాంగ్వేజ్ కోసం తనకు రానిది కూడా ఆయన కష్టపడి నేర్చుకుంటారు. ‘రుద్రమ దేవి’లో గోన గన్నా రెడ్డి పాత్ర చేసిన సాహసం, ‘దువ్వాడ జగన్నాథం (డి.జె.)’లో పురుష సూక్తం పలకడానికి చేసిన ప్రయత్నం, ఇప్పుడు ‘పుష్ప’లో ఓ పక్కకు భుజం వంచి (గూని లాంటిది) మరీ చేసిన అభినయం, చిత్తూరు జిల్లా యాస నేర్చుకోవడానికి చూపిన పట్టుదల – ఇవన్నీ అవార్డ్ అందుకోవడానికి కారణాలయ్యాయి. చివరగా ఓ మాట! తెలుగు సినిమా పుట్టినప్పటి నుంచి (92 సంవత్సరాల కాలం) తన ప్రతిభను చాటి చెబుతూనే ఉంది. అయితే ఆ వెలుగు, వినోదం తెలుగు నేలకే పరిమితమైంది. ఇప్పుడు మన సినిమా ఎల్లలు దాటింది, రిస్క్ గేమ్ ఆడుతోంది. దానికి తగ్గ ప్రతి ఫలాలూ అందుకుంటోంది. తెలుగు వాడికి టాలెంట్ ఎప్పుడూ ఉంది, కానీ ప్రపంచం ఇప్పుడే తెలుగు సినిమా ప్రతిభ తెలుసుకుంటోంది. అందుకే ఇన్ని వందల కోట్ల వసూళ్ళు, అవార్డులు, సత్కారాలు, మర్యాదలు! తెలుగు సినిమా ఏం చేస్తోందనేది మిగిలిన భాషా చిత్రాలు, మార్కెట్లు ఇప్పుడు గమనిస్తున్నాయి. కానీ, తెలుగు ప్రేక్ష కుల అభిరుచిని ఏనాడో కొందరు గొప్ప దర్శకులు గుర్తించారు. తెలుగు సినిమాకు దగ్గర కావాలని ప్రయత్నించారు. 1970ల చివరలో శ్యామ్ బెనెగల్ ‘అనుగ్రహం’, మృణాల్ సేన్ ‘ఒక ఊరి కథ’, గౌతమ్ ఘోష్ ‘మా భూమి’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. ఇప్పుడు కమర్షియల్ ప్యాన్– ఇండియా సినిమా కోసం, క్వాలిటీ మేకింగ్ కోసం దేశం తెలుగు సినిమా వైపు తొంగిచూస్తోంది. పాపులర్ సినిమాలకు అన్ని విధాలా పట్టాభిషేకాలు ఇప్పుడిప్పుడే మొదల య్యాయి. తెలుగు సినిమా జైత్రయాత్రకు ఇది శుభారంభం! ప్రసాద్ నాయుడు వ్యాసకర్త ప్రముఖ సినిమా రచయిత, సినీ విశ్లేషకులు PrasaadNaidu5@gmail.com -
సిక్స్ కొట్టిన ఆర్ఆర్ఆర్.. ప్చ్.. ఆ ముగ్గురికి రాలేదే!
ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజైనప్పటి నుంచి ఒకటే రికార్డుల మోత.. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ.. అంతర్జాతీయ స్థాయిలో అవార్డుల పరంపర.. అబ్బో.. ఇలా చాలానే ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీ అత్యున్నత పురస్కారంగా భావించే ఆస్కార్ సైతం ఆర్ఆర్ఆర్ వశమైంది. జక్కన్న చెక్కిన ఈ కళాఖండానికి ప్రపంచవ్యాప్తంగా రీసౌండ్ వచ్చింది. ఇండియన్ సినిమాను చూసి హాలీవుడ్ సైతం నోరెళ్లబెట్టింది. అంతటి కీర్తిప్రతిష్టలు సొంతం చేసుకున్న ఆర్ఆర్ఆర్ తాజాగా 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లోనూ సత్తా చాటింది. అత్యధికంగా ఆర్ఆర్ఆర్కు 6 అవార్డులు రాగా పుష్ప సినిమాకు 2 అవార్డులు వచ్చాయి. ఆర్ఆర్ఆర్కు 6 అవార్డులు బెస్ట్ పాపులర్ ఫిలిం ప్రొవైడింగ్ వోల్సమ్ ఎంటర్టైన్మెంట్ విభాగంలో ఆర్ఆర్ఆర్ సినిమాకు జాతీయ అవార్డు దక్కింది. ఉత్తమ కొరియోగ్రఫీ విభాగంలో ప్రేమ్ రక్షిత్కు, ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ కేటగిరీలో వి.శ్రీనివాస్ మోహన్, ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్గా కీరవాణి, బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్గా కాలభైరవ, బెస్ట్ యాక్షన్ స్టంట్ కొరియోగ్రాఫర్గా కింగ్ సోలోమన్కు జాతీయ అవార్డులు ప్రకటించారు. ఉత్తమ నటుడిగా రామ్చరణ్, జూనియర్ ఎన్టీఆర్లలో ఎవరో ఒకరికి పురస్కారం ప్రకటించడం ఖాయం అనుకున్నారు ఫ్యాన్స్. ఈ ముగ్గురిలో ఒక్కరికీ రాలే కానీ వారి అంచనాలను తారుమారు చేస్తూ పుష్పరాజ్ బన్నీకి కట్టబెట్టారు. అటు రాజమౌళి పరిస్థితి కూడా అంతే.. ఉత్తమ డైరెక్టర్గా ఈయన పేరు ప్రకటించడం ఖాయం అనుకుంటే మరాఠీ డైరెక్టర్ నిఖిల్ మహాజన్(గోదావరి సినిమా)కు పురస్కారం వరించింది. దీంతో అభిమానులు నిరాశ చెందారు. ముగ్గురు ఆర్లలో ఏ ఒక్కరికీ అవార్డు కైవసం కాలేదని ఫీలవుతున్నారు. వీళ్లు ఏళ్ల తరబడి పడిన కష్టం అవార్డు కమిటీకి కనిపించలేదా? అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జక్కన్నకు వచ్చినా బాగుండేది! ఆర్ఆర్ఆర్కు బోలెడన్ని అవార్డులు వచ్చాయి. సినిమాకు పనిచేసిన అందరినీ దాదాపు ఏదో ఒక అవార్డు వరించింది కానీ ఈ ముగ్గురికి మాత్రం ఒక్క పురస్కారం రాలేదు. వీళ్లకు ప్రపంచవ్యాప్తంగా పేరు, గుర్తింపు వచ్చిందే తప్ప అవార్డులు రావడం లేదెందుకని అభిమానులు తల పట్టుకుంటున్నారు. జక్కన్నకు వచ్చినా మనసు తృప్తి చేసుకునేవాళ్లమని అభిప్రాయపడుతున్నారు. భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా విషయానికి వస్తే.. రామ్చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్గా యాక్ట్ చేశారు. విజయేంద్రప్రసాద్ కథ అందించగా రాజమౌళి దర్శకత్వం వహించాడు. ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై డీవీవీ దానయ్య దాదాపు రూ.500 కోట్ల పైచిలుకు భారీ బడ్జెట్తో నిర్మించాడు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1300 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. THE PROUD TEAM FLOURISHED AGAIN… 💥💥💥💥💥💥 It’s a SIXERRR at the National Awards 🔥🌊 #RRRMovie pic.twitter.com/GOjsY4IHRl — RRR Movie (@RRRMovie) August 24, 2023 చదవండి: జాతీయ అవార్డు.. బన్నీని పట్టుకుని కంటతడి పెట్టిన సుకుమార్ -
కంగ్రాట్స్ బావా.. ఈ అవార్డు నీకు రావాల్సిందే: తారక్
ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు మన తెలుగు హీరోకు వరిస్తుందా? లేదా? అన్న ఉత్కంఠకు తెరపడింది. ఎందరో స్టార్ హీరోలను వెనక్కి నెడుతూ అల్లు అర్జున్కు బెస్ట్ యాక్టర్ అవార్డు వరించింది. 68 ఏళ్లుగా ఏ హీరోకూ దక్కని అరుదైన గౌరవం బన్నీకి దక్కింది. దీంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తాజాగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బన్నీని అభినందిస్తూ ట్వీట్ చేశాడు. కంగ్రాచ్యులేషన్స్ బావా.. పుష్ప సినిమాకుగానూ ఈ విజయం, అవార్డులు నీకు దక్కి తీరాల్సిందే అని రాసుకొచ్చాడు. ఈ ట్వీట్ క్షణాల్లో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్లు.. పార్టీ లేదా పుష్ప డైలాగ్ మిస్ చేశారు సర్.. అని కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే 69వ జాతీయ చలనచిత్ర అవార్డులు 2021లో వచ్చిన సినిమాలకుగానూ ప్రకటించారు. ఉత్తమ చిత్రంగా ఉప్పెన, బెస్ట్ పాపులర్ ఫిలిం ప్రొవైడింగ్ వోల్సమ్ ఎంటర్టైన్మెంట్గా ఆర్ఆర్ఆర్ అవార్డులు ఎగరేసుకుపోయాయి. ఇంకా ఏయే సినిమాకు ఏయే అవార్డులు వచ్చాయంటే.. ♦ ఉత్తమ యాక్షన్ డైరెక్షన్(స్టంట్ కొరియోగ్రఫీ) - కింగ్ సాల్మన్ (ఆర్ఆర్ఆర్) ♦ ఉత్తమ కొరియోగ్రఫీ - ప్రేమ్ రక్షిత్ (ఆర్ఆర్ఆర్) ♦ ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ - వి.శ్రీనివాస్ మోహన్ (ఆర్ఆర్ఆర్) ♦ ఉత్తమ లిరిక్స్- చంద్రబోస్ (ధమ్ ధమా ధమ్- కొండపొలం) ♦ ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్(సాంగ్స్) - దేవి శ్రీప్రసాద్ (పుష్ప 1) ♦ ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ (బ్యాగ్రౌండ్ స్కోర్) - ఎమ్ఎమ్ కీరవాణి (ఆర్ఆర్ఆర్) ♦ ఉత్తమ మేల్ ప్లేబ్యాక్ సింగర్ - కాల భైరవ (కొమురం భీముడో.. - ఆర్ఆర్ఆర్) ♦ బెస్ట్ తెలుగు ఫిలిం క్రిటిక్- పురుషోత్తమాచార్యులు Congratulations @alluarjun bava. You deserve all the success and awards you get for #Pushpa. — Jr NTR (@tarak9999) August 24, 2023 చదవండి: చరణ్, తారక్ను వెనక్కు నెట్టి అవార్డు కొట్టేసిన బన్నీ.. టాలీవుడ్కు మొత్తంగా ఎన్ని అవార్డులు వచ్చాయంటే? -
జాతీయ అవార్డుల్లో 'ఆర్ఆర్ఆర్' హవా.. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్
69వ జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమా సత్తా చాటింది. చాలామంది ఊహించినట్లే.. ఉత్తమ నటుడు కేటగిరీలో అల్లు అర్జున్ అవార్డు గెలుచుకున్నాడు. తద్వారా 69 ఏళ్ల సినీ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి తెలుగు నటుడిగా రికార్డ్ సృష్టించాడు. అలానే బోలెడెన్ని విభాగాల్లో మనవాళ్లు అవార్డులు గెలుచుకున్నారు. మరి ఇంతకీ ఏయే విభాగాల్లో ఎవరెవరికీ అవార్డులు గెలుచుకున్నారనేది ఫుల్ లిస్ట్ చూసేద్దాం. విభాగాల వారీగా అవార్డు గ్రహీతలు ఉత్తమ నటుడు: అల్లు అర్జున్ (పుష్ప) ఉత్తమ నటి: ఆలియా భట్ (గంగూబాయి) & కృతిసనన్ (మిమీ) ఉత్తమ సహాయ నటి: పల్లవి జోషి (ద కశ్మీరీ ఫైల్స్ - హిందీ) ఉత్తమ సహాయ నటుడు: పంకజ్ త్రిపాఠీ (మిమీ- హిందీ) ఉత్తమ దర్శకుడు: నిఖిల్ మహాజన్ (గోదావరి - మరాఠీ సినిమా) ఉత్తమ సంగీత దర్శకుడు (సాంగ్స్): పుష్ప- దేవిశ్రీ ప్రసాద్ ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ (బీజీఎమ్) : ఆర్ఆర్ఆర్- ఎమ్.ఎమ్ కీరవాణి బెస్ట్ ఫీచర్ ఫిలిం: రాకెట్రీ: ద నంబీ ఎఫెక్ట్ (హిందీ) ఉత్తమ పిల్లల చిత్రం: గాంధీ & కో (గుజరాతీ) ఉత్తమ కొరియోగ్రఫీ: ఆర్ఆర్ఆర్-ప్రేమ్ రక్షిత్ ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్: ప్రీతిశీల్ సింగ్ డిసౌజా (గంగూబాయి కతియావాడి) ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్: ఆర్ఆర్ఆర్-శ్రీనివాస్ మోహన్ బెస్ట్ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్: శ్రేయా ఘోషల్ (ఇరవిన్ నిహాల్ - తమిళ మూవీ) బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్: కాలభైరవ (ఆర్ఆర్ఆర్ - కొమురం భీముడో) ఉత్తమ లిరిక్స్: చంద్రబోస్-కొండపొలం మూవీ (తెలుగు) ఉత్తమ యాక్షన్ డైరెక్షన్ అవార్డ్(స్టంట్ కొరియోగ్రఫీ): ఆర్ఆర్ఆర్- కింగ్ సోలమన్ ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్: వీరా కపూర్ ఏ (సర్దార్ ఉద్దామ్-హిందీ) ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: దిమిత్రీ మాలిక్ & మాన్సి ధ్రువ్ మెహతా (సర్దార్ ఉద్దామ్) ఉత్తమ ఎడిటింగ్: సంజయ్ లీలా భన్సాలీ (గంగూబాయి కతియావాడి మూవీ) బెస్ట్ ఆడియోగ్రఫీ (లొకేషన్ సౌండ్ రికార్డిస్ట్): అరుణ్ అశోక్ & సోనూ కేపీ (చవిట్టు మూవీ-మలయాళం) బెస్ట్ ఆడియోగ్రఫీ (సౌండ్ డిజైనర్) : అనీష్ బసు (జీలీ మూవీ- బెంగాలీ) బెస్ట్ ఆడియోగ్రఫీ (రీరికార్డిస్ట్ ఆఫ్ ద ఫైనల్ మిక్స్డ్ ట్రాక్): సినోయ్ జోసెఫ్ (సర్దార్ ఉద్దామ్-హిందీ) బెస్ట్ స్క్రీన్ప్లే (ఒరిజినల్): షాహీ కబీర్ (నాయట్టు సినిమా-మలయాళం) బెస్ట్ స్క్రీన్ప్లే (డైలాగ్ రైటర్) : ప్రకాశ్ కపాడియా & ఉత్కర్షిణి వశిష్ట (గంగూబాయి కతియావాడి) బెస్ట్ సినిమాటోగ్రఫీ: అవిక్ ముఖోపాధ్యాయ్ (సర్దార్ ఉద్దామ్ మూవీ-హిందీ) ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్: భవిన్ రబరీ (ఛెల్లో షో - గుజరాతీ సినిమా) బెస్ట్ ఫిలిం ఆన్ ఎన్వైర్మెంట్ కంజర్వేషన్: అవషావ్యూహం (మలయాళం) బెస్ట్ ఫిలిం ఆన్ సోషల్ ఇష్యూస్: అనునాద్-ద రెజోనెన్స్ (అస్సామీస్) బెస్ట్ పాపులర్ ఫిలిం ఆన్ ప్రొవైడింగ్ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్: ఆర్ఆర్ఆర్ ఇందిరాగాంధీ అవార్డ్ ఫర్ బెస్ట్ డెబ్యూ ఫిలిం ఆఫ్ ఎ డైరెక్టర్: మెప్పాడియన్ (మలయాళం) స్పెషల్ జ్యూరీ అవార్డ్: షేర్ షా (హిందీ సినిమా) నర్గీస్ దత్ అవార్డ్ ఫర్ బెస్ట్ ఫిల్మ్ ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్: ద కశ్మీరీ ఫైల్స్ (హిందీ) భాషల వారీగా ఉత్తమ చిత్రాలు బెస్ట్ మీషింగ్ ఫిల్మ్: బూంబా రైడ్ బెస్ట్ అస్సామీస్ ఫిల్మ్: అనుర్ బెస్ట్ బెంగాలీ ఫిల్మ్: కల్కొకో-హౌస్ ఆఫ్ టైమ్ బెస్ట్ హిందీ ఫిల్మ్: సర్దార్ ఉద్దామ్ బెస్ట్ గుజరాతీ ఫిల్మ్: లాస్ట్ ఫిల్మ్ షో బెస్ట్ కన్నడ ఫిల్మ్: చార్లి 777 బెస్ట్ మైథిలీ ఫిల్మ్: సమాంతర్ బెస్ట్ మరాఠీ ఫిల్మ్: ఏక్ దా కై ఝాలా బెస్ట్ మలయాళ ఫిల్మ్: హోమ్ బెస్ట్ మెయిటెయిలోన్ ఫిల్మ్: ఏక్ హోయిగీ యమ్ (అవర్ హౌమ్) బెస్ట్ ఒడియా ఫిల్మ్: ప్రతిక్ష్య (ద వెయిట్) బెస్ట్ తమిళ్ ఫిల్మ్: కడైసి వివసై (ద లాస్ట్ ఫార్మర్) బెస్ట్ తెలుగు ఫిల్మ్: ఉప్పెన నాన్ ఫీచర్ ఫిలింస్ బెస్ట్ నాన్ ఫీచర్ ఫిల్మ్: ఏక్ థా గావ్ (గర్హివాలీ - హిందీ) బెస్ట్ వాయిస్ ఓవర్: కులదా కుమార్ భట్టాచారి (హాథీ బందూ) బెస్ట్ మ్యూజిక్ డైరెక్షన్: ఇషాన్ దీవేచా (సక్కలెంట్) బెస్ట్ ఎడిటింగ్: అబ్రో బెనర్జీ (ఇఫ్ మెమొరీ సెర్వ్స్ మీ రైట్) బెస్ట్ ఆన్లొకేషన్ సౌండ్ రికార్డిస్ట్: సురుచి శర్మ (మీన్ రాగా) బెస్ట్ ఆడియోగ్రఫీ(ఫైనల్ మిక్స్డ్ ట్రాక్): ఉన్ని కృష్ణన్ (ఏక్ థా గావ్) బెస్ట్ సినిమాటోగ్రఫీ: బిట్టూ రావత్ (పాతాళ్ తీ) ఉత్తమ డైరెక్షన్: బకుల్ మతియానీ (స్మైల్ ప్లీజ్) ఉత్తమ కుటుంబ కథా చిత్రం: చాంద్ సాన్సీ (హిందీ) ఉత్తమ షార్ట్ ఫిక్షన్ ఫిలిం: దాల్ బాత్ (గుజరాతీ) స్పెషల్ జ్యూరీ అవార్డ్: రేఖా మూవీ (మరాఠీ) బెస్ట్ ఏనిమేషన్ ఫిల్మ్: కండిట్టుండూ (మలయాళం) బెస్ట్ ఇన్వెస్టిగేటివ్ ఫిలిం: లుకింగ్ ఫర్ చలాన్ (ఇంగ్లీష్) బెస్ట్ ఎక్స్ప్లోరేషన్ ఫిలిం: ఆయుష్మాన్ (ఇంగ్లీష్-కన్నడ) బెస్ట్ ఎడ్యుకేషనల్ ఫిలిం: సిర్పంగిలన్ సిర్పంగల్ (తమిళం) బెస్ట్ ఫిలిం ఆన్ సోషల్ ఇష్యూస్(షేర్డ్): మీతూ దీ (ఇంగ్లీష్) & త్రీ టూ వన్ (మరాఠీ-హిందీ) బెస్ట్ ఎన్వైర్మెంట్ ఫిలిం: మున్నం వలవు (మలయాళం) బెస్ట్ ప్రమోషనల్ ఫిలిం: వర్లీ ఆర్ట్ (ఇంగ్లీష్) బెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫిలిం: ఇథోస్ ఆఫ్ డార్క్నెస్ (హిందీ-బెంగాలీ) బెస్ట్ ఆర్ట్స్ అండ్ కల్చర్ ఫిలింస్: టీఎన్ కృష్ణన్ బౌ స్ట్రింగ్స్ టూ డివైన్ బెస్ట్ బయోగ్రాఫికల్ ఫిలిం(షేర్డ్): రుఖు మతిర్ దుఖు మహీ (బెంగాలీ) & బియాండ్ బ్లాస్ట్ (మణిపురి) బెస్ట్ ఎత్నోగ్రాఫిక్ ఫిలిం: ఫైర్ ఆన్ ఎడ్జ్ (టివా) బెస్ట్ డెబ్యూ నాన్ ఫియేచర్ ఫిలిం ఆఫ్ ఎ డైరెక్టర్: పాంచిక (గుజరాతీ- డైరెక్టర్ అంకిత్ కొఠారీ) -
జాతీయ చలన చిత్ర పురస్కారాల ప్రదానం.. ఉత్తమ చిత్రంగా 'సూరారై పోట్రు'
దేశ రాజధాని ఢిల్లీలో 68వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం వైభవంగా జరిగింది. దేశవ్యాప్తంగా చిత్ర పరిశ్రమలో సత్తా చాటిన నటీనటులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆవార్డులు ప్రదానం చేశారు. డిల్లీలోని విఘ్నయన్ భవన్లో జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర ప్రసార, సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ హాజరయ్యారు. 2020వ సంవత్సరానికి గాను 68వ జాతీయ చలన చిత్ర పురస్కారాలను గతంలోనే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకులు జి.ఆర్.గోపినాథ్ జీవిత కథను స్ఫూర్తిగా తీసుకుని తెలుగు దర్శకురాలు సుధా కొంగర తమిళంలో తెరకెక్కించిన 'సూరరై పోట్రు' జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. ఇందులో ప్రధాన పాత్రల్లో నటించిన సూర్య ఉత్తమ నటుడిగా, అపర్ణా బాలమురళి ఉత్తమ నటిగా పురస్కారాన్ని కైవసం చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి తన భార్యతో జ్యోతిక కలిసి హాజరయ్యారు తమిళ హీరో సూర్య. సమాజంలోని కుల వివక్షను కళ్లకు కడుతూ తెరకెక్కిన 'కలర్ ఫొటో' తెలుగులో ఉత్తమ చిత్రంగా అవార్టు గెలుచుుకంది. సంప్రదాయ నృత్యానికి పట్టం కడుతూ.. రూపొందించిన తెలుగు చిత్రం 'నాట్యం' ఉత్తమ నృత్యాలు, మేకప్ విభాగాల్లో పురస్కారాలు అందుకుంది. పాటలతో అలరించిన 'అల వైకుంఠపురములో' చిత్రం సంగీత విభాగంలో అవార్డు కైవసం చేసుకుంది. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ సైన్యాధిపతి తాన్హాజీ జీవిత గాథతో హిందీలో తెరకెక్కిన 'తాన్హాజీ: ది అన్ సంగ్ వారియర్' ఉత్తమ సమగ్ర వినోదాత్మక చిత్రంగా అవార్డు సొంతం చేసుకుంది. అందులో తానాజీ పాత్రలో నటించిన అజయ్ దేవగణ్, సూర్యతో కలసి ఉత్తమ నటుడి పురస్కారం అందుకున్నారు. -
అడగకపోతే... అవార్డులూ రావు!
2020వ సంవత్సరానికి గాను తాజా 68వ జాతీయ అవార్డుల ప్రకటన తెలుగు సినీ రంగానికి కొంత సంతోషమిచ్చినా, తమిళం (10 అవార్డులు), మలయాళం (9 అవార్డులు)తో పోలిస్తే, మన ఫీచర్ ఫిల్మ్లకు నాలుగే అవార్డులు దక్కాయన్న అసంతృప్తినీ మిగిల్చింది. సంఖ్యాపరంగా, బాక్సాఫీస్ లెక్కల పరంగా దేశాన్ని ఊపేస్తున్న తెలుగు సినిమాకు తగిన న్యాయం జరగలేదా? తాజా జాతీయ అవార్డుల తుది నిర్ణాయక సంఘంలో ఏకైక తెలుగు సభ్యుడు – ప్రముఖ దర్శకుడు వి.ఎన్. ఆదిత్యతో ‘సాక్షి’ ప్రత్యేక భేటీ... ► ఈ అవార్డుల ఎంపికలో మీ పాత్ర ఏమిటి? జాతీయ అవార్డ్స్లో రెండు విడతల వడపోతతో ఫీచర్ ఫిల్మ్ల అవార్డుల నిర్ణయం ఉంటుంది. ఈసారి తొలి వడపోతలో నార్త్, ఈస్ట్, వెస్ట్లకు ఒక్కొక్కటీ, సౌత్కు రెండు – మొత్తం 5 ప్రాంతీయ జ్యూరీలున్నాయి. ప్రతి జ్యూరీలో అయిదుగురు సభ్యులు. ఇలా 25 మంది వచ్చిన మొత్తం ఎంట్రీల నుంచి బాగున్న ఆయా భాషా చిత్రాలను ప్రాథమికంగా ఎంపిక చేశారు. అలా తొలి వడపోతలో మిగిలిన ఎంట్రీలను ఫైనల్ జ్యూరీ రెండో వడపోత చేసి, తుది అవార్డులు ప్రకటించింది. ఫీచర్ ఫిల్మ్స్ విభాగంలో 30 భాషల్లో కలిపి 305 దాకా ఎంట్రీలొచ్చాయి. ప్రాంతీయ జ్యూరీల దశ దాటి ఫైనల్స్కు వచ్చినవి 67 సినిమాలే. ఫైనల్ జ్యూరీలో ప్రాంతీయ జ్యూరీల ఛైర్మన్లు అయిదుగురు, మరో ఆరుగురు కొత్త సభ్యులుంటారు. వారిలో ఒకరు ఛైర్మన్గా వ్యవహరిస్తారు. ఆ ఫైనల్ జ్యూరీ 11 మందిలో ఏకైక తెలుగువాడిగా బాధ్యత నిర్వహించా. ► మీ బాధ్యత, పాత్ర మీకు తృప్తినిచ్చాయా? చిన్నప్పుడు బెజవాడలో సినిమాపై పిచ్చిప్రేమతో టికెట్ల కోసం హాళ్ళ దగ్గర కొట్టుకొని చూసిన సామాన్య ప్రేక్షకుడి స్థాయి నుంచి ఇవాళ ప్రభుత్వ సౌకర్యాలతో రోజూ ఉదయం 8 నుంచి రాత్రి 10 దాకా దేశంలోని ఉత్తమ సినిమాలెన్నో చూసే స్థాయికి రావడం ఫిల్మ్ లవర్గా నాకు మరపురాని అనుభూతి, అనుభవం. ► తమిళ, మలయాళాలతో పోలిస్తే బాగా తక్కువగా తెలుగుకు నాలుగు అవార్డులే వచ్చాయేం? ప్రాంతీయ జ్యూరీకి మొత్తం ఎన్ని తెలుగు ఎంట్రీలు వచ్చాయో తెలీదు. ఫైనల్స్లో మా ముందుకొచ్చినవి ‘కలర్ ఫోటో’, ‘నాట్యం’, ‘ప్లేబ్యాక్’, ‘సీజన్ ఆఫ్ ఇన్నోసెన్స్’, అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’, నితిన్ ‘భీష్మ’, విష్వక్సేన్ ‘హిట్–1’, – ఇలా ఏడెనిమిది తెలుగు సినిమాలే. ఆ లెక్కన 4 అవార్డులు మరీ తక్కువేం కాదు. ఒకప్పుడు ఉత్తమ ప్రాంతీయ చిత్రం మినహా మరే అవార్డూ దక్కని తెలుగు సినిమాకు ఇప్పుడిన్ని రావడం గమనార్హం. ► తప్పు ఎక్కడ జరిగిందంటారు? అవార్డుల ఎంపికలో అయితే కానే కాదు. కరోనాతో 2020లో సినిమాలు, ఎంట్రీలూ తగ్గాయి. కాకపోతే, సౌత్ ప్రాంతీయ జ్యూరీలు రెండిట్లోనూ తెలుగువారెవరూ లేకపోవడంతో, ఫైనల్స్కు మనవి ఎక్కువ చేరలేదేమో! బయట నేను చూసిన కొన్ని బాగున్న సినిమాలు కూడా ఫైనల్స్ పోటీలో రాలేదు ఎందుకనో! రెండు తెలుగు రాష్ట్రాలున్నా, ఇన్ని సినిమాలు తీస్తున్నా... ఒకే సభ్యుణ్ణి తీసుకోవడం తప్పే! ఇద్దరేసి వంతున రెండు రాష్ట్రాలకూ కలిపి నలుగురుండాలని చెప్పాను. కొన్ని రాష్ట్రాల నుంచి అవగాహన ఉన్న మంచి జర్నలిస్టులూ సభ్యులుగా వచ్చారు. అలా మన నుంచి ఎందుకు పంపరు? ► మన భాషకు న్యాయం జరగలేదని ఒప్పుకుంటారా? నా వాదన ఎంట్రీలు చూసిన సభ్యుల సంఖ్య విషయంలోనే! అవార్డుల సంగతికొస్తే కాసేపు తెలుగును పక్కనపెట్టి చూడండి. ఈసారి ప్రమాణాలు లేవని ఉత్తమ క్రిటిక్, గుజరాతీ, ఒడియా భాషల్లో ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డులే ఇవ్వలేదు. బాగున్న కొన్ని మారుమూల భాషలకూ అవార్డులిచ్చారు. ప్రోత్సహించాలంటూ ప్రమాణాలు లేకున్నా ప్రతి కేటగిరీలో ఎవరో ఒకరికి అవార్డులు ఇవ్వడం సరికాదని ఛైర్మన్ మొదటి నుంచీ గట్టిగా నిలబడ్డారు. జ్యూరీ పారదర్శకంగా, నిజాయతీగా చర్చించి అర్హులైనవారికే అవార్డులిచ్చింది. ► ఇతర భాషలతో పోలిస్తే మనం ఎక్కడున్నాం? ఇతర భాషలకు ఎక్కువ అవార్డులొచ్చాయి గనక మనమేమీ చేయట్లేదనుకోవడం తప్పు. మనం ఎక్కువ వినోదం, వసూళ్ళ మోడల్లో వెళుతున్నాం. ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసే అంశంలో మనమే ముందున్నాం. సాంకేతికంగా, నిర్మాణపరంగా, ఈస్థటికల్గా, ప్రేక్షకుల కిచ్చే వినోదపరంగా మన తెలుగు సినిమా చాలా బాగుంది. మనకు ప్రతిభకు కొదవ లేదు కానీ, అవార్డుల మీద ఫోకస్సే లేదు. కొన్నిసార్లు హీరో ఇమేజ్ కోసం కథలో కాంప్రమైజ్ కావడం, పాటలు, ఫైట్లు పెట్టడం లాంటివి మనకు ఎక్కువ. అలా చేయని మల యాళ, తదితర భాషా చిత్రాలకు మనకన్నా అవార్డులు ఎక్కువ రావచ్చు. అయినా, అవార్డు అనేది ఆ ఒక్క సినిమాకే వర్తిస్తుంది. మొత్తం పరిశ్రమకు కాదు. సహజత్వానికి దగ్గరగా తీసే సినిమాలకు వసూళ్ళు వచ్చే మోడల్ తమిళ, మలయాళాల్లో లాగా మన దగ్గరుంటే, మనమూ అలాంటి సినిమాలు తీయగలం. ► అవార్డుల్లోనూ దేశం తెలుగు వైపు తలతిప్పేలా చేయాలంటే...? (నవ్వుతూ...) మరిన్ని మంచి సినిమాలు తీయాలి. వాటిని అవార్డ్స్కు ఎంట్రీలుగా పంపాలి. ‘జాతీయ అవార్డులు మనకు రావులే’ అని ముందుగానే మనకు మనమే అనేసుకుంటే ఎలా? అప్లయ్ చేస్తేనేగా అవార్డొచ్చేది! తమిళ, మలయాళ, కన్నడ, చివరకు అస్సామీకి వచ్చినన్ని ఎక్కువ ఎంట్రీలు మనకు రాలేదు. ప్రయత్నలోపం మనదే! మనకు నాలుగే అవార్డులు రావడానికి అదే కారణం. అలాగే, అవార్డులకు అప్లికేషన్ సరిగ్గా నింపకపోవడం, పూర్తి వివరాలు ఇవ్వకపోవడం, సరైన కేటగిరీకి ఎంట్రీగా పంపకపోవడం, పంపిన సినిమాల్లోనూ టెక్నికల్ సమస్యల వల్ల కూడా తెలుగు సినిమాలు ఛాన్స్ పోగొట్టుకుంటున్నాయి. దీనిపై మన ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ద్వారా విస్తృత ప్రచారం చేసి, అవగాహన పెంచాలని నా అభ్యర్థన. నా వంతుగా నేనూ పరిస్థితులు వివరించేందుకు కృషి చేస్తా! ► మీరు ఒంటరి కాబట్టి, నేషనల్ అవార్డులకై కొట్లాడాల్సి వచ్చిందా? జ్యూరీ అంతా సినీ అనుభవజ్ఞులే. ప్రతి ఒక్కరి అభిప్రాయం తీసుకుంటారు. ఓటింగ్ కూడా ఉంటుంది. స్నేహంగానే ఎవరి పాయింట్ వారు వినిపించాం. ప్రతి తెలుగు ఎంట్రీకీ దానికి తగ్గ కేటగిరీలో అవార్డు వచ్చేందుకు నా వాదన నేనూ వినిపించా. సహజత్వానికీ దగ్గరగా ఉన్నందుకు అత్యధిక ఓట్లతో ‘కలర్ ఫోటో’కూ, స్క్రీన్ప్లేలో భాగమయ్యేలా పాటలకు సంగీతాన్నిచ్చి కోట్లమందికి చేరిన ‘అల వైకుంఠపురములో...’కూ, పాశ్చాత్య – సంప్రదాయ రీతుల మేళవింపుగా పూర్తి డ్యాన్స్ ఫిల్మ్ తీసి, మేకప్లోనూ వైవిధ్యం చూపిన ‘నాట్యం’కి – ఇలా 4 అవార్డులొచ్చాయి. సహజంగానే అన్నిటికీ రావుగా! అయితే, మన గొంతు మనం బలంగా వినిపించకపోతే, మనకు రావాల్సినవి కూడా రావు. అవార్డుల్లోనే కాదు అన్నిటా అది చేదు నిజం! – రెంటాల జయదేవ -
ఈసారి నేషనల్ అవార్డ్స్లో టాలీవుడ్కు బిగ్ డిజప్పాయింట్మెంట్
-
జాతీయ సినిమా అవార్డులు: ఆకాశం మెరిసింది
‘‘ఆశలు నెరవేర్చుకోవడానికి ఆకాశమే హద్దు అవ్వాలి.. అప్పుడే ఆకాశం వరకూ ఎగిరే రెక్కలు దక్కుతాయి’’... ‘సూరరై పోట్రు’ (తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా!) స్టోరీలైన్ ఇది. సూర్య, అపర్ణ బాలమురళి జంటగా సుధ కొంగర దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి జాతీయ ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు (సూర్య), నటి (అపర్ణ), స్క్రీన్ ప్లే (సుధ కొంగర), నేపథ్య సంగీతం (జీవీ ప్రకాశ్కుమార్).. ఇలా మొత్తం ఐదు అవార్డులు దక్కాయ అలా జాతీయ అవార్డుల్లో ‘ఆకాశం..’ మెరిసింది. కాగా ఉత్తమ నటుడి అవార్డుకి సూర్యతో పాటు అజయ్ దేవగన్ (‘తన్హాజీ’)ని ఎంపిక చేశారు. ఇక తెలుగుకి నాలుగు అవార్డులు దక్కాయి. జాతీయ ఉత్తమ సంగీతదర్శకుడిగా తమన్ (‘అల.. వైకుంఠపురములో’), ‘నాట్యం’ చిత్రకథానాయిక సంధ్యారాజుకి ఉత్తమ కొరియోగ్రఫీకి, ఇదే చిత్రానికిగాను టీవీ రాంబాబుకి ఉత్తమ మేకప్ అవార్డులు దక్కాయి. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘కలర్ ఫొటో’ ఎంపికైంది. ఇంకా శుక్రవారం వెలువడిన 68వ జాతీయ అవార్డుల వివరాలు ఈ విధంగా... 68వ జాతీయ అవార్డులను ఐదు విభాగాలుగా విభజించడం విశేషం. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు, ఫీచర్ ఫిల్మ్, నాన్ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ రైటింగ్ సెక్షన్, మోస్ట్ ఫిల్మ్ ఫ్రెండ్లీ స్టేట్... ఇలా ఐదు భాగాలుగా అవార్డులను ప్రకటించారు. 30 భాషల్లో దాదాపు 305 చిత్రాలు ఫీచర్ ఫిల్మ్ స్క్రీనింగ్కు, నాన్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో దాదాపు 148 చిత్రాలు అవార్డుల కోసం పోటీ పడ్డాయి. ఈ అవార్డుల్లో తమిళ చిత్రం ‘సూరరై పోట్రు’ (తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా..!) హవా కనిపించింది. ఈ చిత్రం ఐదు విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకుంది. తెలుగు చిత్రపరిశ్రమకు నాలుగు అవార్డులు దక్కాయి. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వం వహిం చిన ‘అల.. వైకుంఠపురుములో...’ చిత్రానికిగాను జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడిగా నిలిచారు తమన్. సుహాస్, చాందినీ చౌదరి జంటగా సందీప్ రాజ్ దర్శకత్వంలో సాయి రాజేశ్ నిర్మించిన ‘కలర్ ఫోటో’ ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా ఎంపికైంది. రేవంత్ దర్శకత్వంలో సంధ్యారాజు నటించిన ‘నాట్యం’ ఉత్తమ కొరియోగ్రఫీ, మేకప్ విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకోగలిగింది. మరోవైపు మలయాళ హిట్ ఫిల్మ్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ నాలుగు విభాగాల్లో (ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సహాయనటుడు, ఉత్తమ నేపథ్య గానం, స్టంట్ కొరియోగ్రఫీ)లను దక్కించు కుంది. అలాగే తమిళ చిత్రం ‘శివరంజనియుం ఇన్నుమ్ సిల పెన్గళుమ్’కు మూడు విభాగాల్లో (ఉత్తమ ప్రాంతీయ చిత్రం, ఎడిటింగ్, ఉత్తమ సహాయ నటి), ‘హిందీ చిత్రం ‘తన్హాజీ: ది అన్సంగ్ వారియర్’కు మూడు (బెస్ట్ యాక్టర్, బెస్ట్ పాపులర్ ఫిల్మ్, బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్) జాతీయ అవార్డులు దక్కాయి. తమిళ పరిశ్రమకు మొత్తం 10 (సూరరైపోట్రుకి 5, ‘శివరంజనియుం ఇన్నుమ్ సిల పెన్గళుమ్’కి 3, మండేలాకి 2) అవార్డులు దక్కడం విశేషం. అలాగే మధ్యప్రదేశ్ మోస్ట్ ఫ్రెండ్లీ ఫిల్మ్ స్టేట్ అవార్డును దక్కించుకుంది. ‘ద లాంగెస్ట్ కిస్’కు ‘ది బెస్ట్ బుక్ ఆన్ సినిమా అవార్డు దక్కింది. ఇక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును మరో సందర్భంలో ప్రకటించనున్నట్లు జ్యూరీ మెంబర్స్ పేర్కొన్నారు. ఈ ఏడాది ఫిల్మ్ క్రిటిక్ అవార్డు విభాగంలో ఎవర్నీ ఎంపిక చేయలేకపోయామని జ్యూరీ పేర్కొంది. సేమ్ సీన్! 67వ జాతీయ అవార్డుల్లోని సీన్ ఒకటి 68వ జాతీయ అవార్డుల్లోనూ రిపీట్ అయ్యింది. 67వ జాతీయ అవార్డుల్లో ఉత్తమ నటుడు విభాగాన్ని తమిళ నటుడు ధనుష్ (‘అసురన్’ చిత్రానికి గాను..). హిందీ నటుడు మనోజ్ బాజ్పాయ్ (భోన్స్లే)లు షేర్ చేసుకున్నారు. ఈసారి కూడా ఉత్తమ నటుడు విభాగాన్ని తమిళ నటుడు సూర్య (‘సూరరై పోట్రు’ చిత్రానికిగాను..), హిందీ నటుడు అజయ్ దేవగన్ (హిందీ చిత్రం ‘తన్హాజీ: ది అన్సంగ్ వారియర్’ చిత్రానికిగాను..) బెస్ట్ యాక్టర్ అవార్డును షేర్ చేసుకున్నారు. ఇక కెరీర్లో సూర్యకు తొలిసారి జాతీయ అవార్డు దక్కగా, అజయ్ దేవగన్కు మాత్రం ఇది మూడో అవార్డు. ఇంతకు ముందు ‘జఖ్మ్’ (1998), ‘ది లెజండ్ ఆఫ్ భగత్సింగ్’ (2002) చిత్రాలకుగాను ఉత్తమ నటుడు విభాగంలో అజయ్ దేవగన్ జాతీయ అవార్డులను సొంతం చేసుకున్నారు. దివంగత దర్శకుడికి అవార్డు మలయాళ హిట్ ఫిల్మ్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ నాలుగు జాతీయ అవార్డులు దక్కించుకుంది. ఈ నాలుగు అవార్డుల్లో ఉత్తమ దర్శకుడు విభాగం కూడా ఉంది. ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’కిగాను దర్శకుడు కేఆర్ సచ్చిదానందన్ అవార్డుకి ఎంపికయ్యారు. అయితే 2020 జూన్లో ఆయన గుండెపోటుతో మరణించడం ఓ విషాదం. దీంతో ఈ సంతోషకర సమయంలో ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ చిత్రయూనిట్కు ఓ లోటు ఉండిపోయింది. ఇక ఈ నాలుగుతో పాటు ఉత్తమ ప్రాంతీయ చిత్రం, ప్రొడక్షన్ డిజైన్, యాక్షన్, ఆడియోగ్రఫీ, ఉత్తమ పుస్తకం.. ఇలా మలయాళ పరిశ్రమకు తొమ్మిది అవార్డులు దక్కాయి. ఓటీటీ చిత్రాల హవా! 68వ జాతీయ అవార్డుల్లో డైరెక్ట్గా ఓటీటీలో రిలీజైన చిత్రాల జోరు కనిపించింది. ఐదు అవార్డులను గెల్చుకున్న ‘సూరరైపోట్రు’, తెలుగు ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నిలిచిన ‘కలర్ ఫోటో’ చిత్రాలు డైరెక్టర్గా ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన సంగతి గుర్తుండే ఉంటుంది. అలాగే రెండు అవార్డులను గెల్చుకున్న తమిళ చిత్రం ‘మండేలా’ ముందుగా టీవీలో ప్రదర్శితమై, ఆ తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్కు వెళ్లింది. అవార్డులు సాధించిన వాటిలో మరికొన్ని ఓటీటీ చిత్రాలు ఉన్నాయి. తొమ్మిదో అవార్డు కెరీర్లో తొమ్మిదో జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు తెలుగు సీనియర్ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్. 68వ జాతీయ అవార్డుల్లో తమిళ చిత్రం ‘శివరంజనియుం ఇన్నుమ్ సిల పెన్గళుమ్’కిగాను ఎడిటింగ్ విభాగంలో శ్రీకర్ ప్రసాద్కు అవార్డు దక్కింది. ఇది ఆయనకు 9వ అవార్డు. గతంలో ‘రాక్’ (1989), ‘రాగ్ బైరాగ్’ (1997), ‘నౌకా కరిత్రము’ (1997), ‘ది టెర్రరిస్ట్’ (1998), ‘వనప్రస్థం’ (2000), ‘కన్నత్తిల్ ముత్తమిట్టాల్’ (2002), ‘ఫిరాక్’ (2008), 2010లో ‘కుట్టి స్రాంక్’, ‘కమినీ’, ‘కేరళ వర్మ పళస్సి రాజా’లకు గాను స్పెషల్ జ్యూరీ అవార్డులను దక్కించుకున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఈ క్రెడిట్ నాది కాదు ► ‘నీ కాళ్లను చూడు’ అన్నారు.. ‘బుట్ట బొమ్మ’ అన్నారు.. ‘రాములో’ అన్నారు.. జాతీయ అవార్డుని బుట్టలో వేసుకున్నారు.. మీ ఆనందాన్ని షేర్ చేసుకుంటారా? నిజానికి ‘అల వైకుంఠపురము’లో విజయాన్ని నేను వ్యక్తిగతంగా తీసుకోలేదు. మొత్తం క్రెడిట్ అంతా త్రివిక్రమ్గారిదే. ఈ జాతీయ అవార్డు క్రెడిట్ కూడా ఆయనదే. ► ట్యూన్స్ ఇచ్చింది మీరు కదా.. (నవ్వుతూ). నేనే. కానీ నిర్ణయాలు తీసుకునే వ్యక్తి చేతుల్లోనే అంతా ఉంటుంది. కరెక్ట్గా పిక్ చేయగల డైరెక్టర్ కాబట్టే కరెక్ట్ ట్యూన్స్ని త్రివిక్రమ్గారు ఎంచుకున్నారు. అలాగే లిరిక్స్ విషయంలోనూ చాలా శ్రద్ధ తీసుకున్నారు. ‘సామజవరగమన.. నిను చూసి ఆగగలనా..’, ‘బుట్ట బొమ్మ’, ‘రాములో రాములా..’ ఇవన్నీ క్యాచీగా ఉన్నాయి కాబట్టే ట్యూన్ ఎలివేట్ అయిందంటాను. ► ఈ సినిమా విషయంలో మీరేమైనా ఒత్తిడికి గురయ్యేవారా? ఏమాత్రం టెన్షన్ పడలేదు. త్రివిక్రమ్గారు మమ్మల్నందర్నీ కూల్గా ముందుకు నడిపించారు. ఆయన ప్రపంచలోకి వెళ్లి మేం పని చేశాం. అందుకే క్రెడిట్ ఆయనకే ఇస్తున్నాను. ► మరి.. పూర్తి క్రెడిట్ని మీరెప్పుడు తీసుకుంటారు? ‘ఇండిపెండెంట్ మ్యూజిక్’కి అవార్డు దక్కినప్పుడు తీసుకుంటాను. విదేశాల్లో ‘గ్రామీ అవార్డ్స్’ ఉన్నాయి. మ్యూజికల్ అవార్డ్స్ అవి. ఇండిపెండెంట్ మ్యూజిక్కి అవార్డులు ఇస్తారు. ఇండియాలో నాకు తెలిసి అలాంటి అవార్డులు లేవు. అందుకే మావరకూ ‘సినిమా ఈజ్ బిగ్’. ఏడాదికి ఓ పది సినిమాలు చేస్తాం. అంటే దాదాపు అరవై పాటలు ఇస్తాం. వాటిలో ఒక పాటకు అవార్డు రావడం అంటే ఆనందించదగ్గ విషయమే. అయితే సినిమా అనేది కలెక్టివ్ ఎఫర్ట్. అందుకే అవార్డు క్రెడిట్ని ఒక్కడినే తీసుకోవడంలేదు. – తమన్ బాధ్యత పెరిగింది – సాయి రాజేష్ నిజంగా మా ప్రేమకథ (‘కలర్ ఫోటో’ను ఉద్దేశించి...) ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ స్థాయిలో అవార్డు సాధిస్తుందని నేను అస్సలు ఊహించలేదు. నాతో పాటు చిత్రయూనిట్ అంతా చాలా సంతోషంగా ఉన్నాం. నా జీవితంలోని కొన్ని ఘటనల ఆధారంగా ‘కలర్ ఫోటో’ కథను రాసుకున్నాను. నేను నల్లగా ఉంటానని నాకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండేది. ఈ అంశాన్ని కూడా సినిమాలో ప్రస్తావించాం. రైటింగ్, ప్రొడక్షన్, దర్శకత్వం విభాగాల్లో ఈ అవార్డు నా బాధ్యతను మరింత పెంచిందనే నమ్ముతున్నాను. అయితే ‘కలర్ ఫోటో’ సినిమా రిలీజ్కు ముందే మా నాన్నగారు మాకు దూరమయ్యారు. ఆయన ఇప్పుడు ఉండి ఉంటే ఇంకా హ్యాపీ ఫీలయ్యేవాడిని. అవార్డుల విజేతల వివరాలు ∙ఉత్తమ చిత్రం: సూరరై పోట్రు ∙ఉత్తమ నటుడు: సూర్య (సూరరై పోట్రు), అజయ్ దేవగన్ (తన్హాజీ: ది అన్సంగ్ వారియర్) ∙ఉత్తమ నటి: అపర్ణ బాలమురళి (సూరరై పోట్రు) ∙ఉత్తమ సహాయ నటుడు: బీజూ మీనన్ (అయ్యప్పనుమ్ కోషియుమ్) ∙ఉత్తమ సహాయ నటి: లక్ష్మీ ప్రియా చంద్రమౌళి (శివరంజనియుం ఇన్నుమ్ సిల పెన్గళుమ్) ∙ఉత్తమ దర్శకుడు: దివంగత కేఆర్ సచ్చిదానందన్ (అయ్యప్పనుమ్ కోషియుమ్) ∙ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్ విభాగంలో అనిశ్ మంగేశ్ గోస్వామి (టక్టక్), ఆకాంక్షా పింగ్లే, దివ్వేష్ తెందుల్కర్ (సుమీ) ∙ఉత్తమ తెలుగు చిత్రం: కలర్ ఫోటో ∙ఉత్తమ తమిళ చిత్రం: శివరంజనియుం ఇన్నుమ్ సిల పెన్గళుమ్ ∙ఉత్తమ కన్నడ చిత్రం: డోలు ∙ఉత్తమ మలయాళం చిత్రం: తింకలచ్చ నిశ్చయమ్ ∙ఉత్తమ హిందీ చిత్రం: తులసీదాస్ జూనియర్ ∙ఉత్తమ బాలల చిత్రం: సుమి (మరాఠి) ∙ఇందిరాగాందీ అవార్డు ఫర్ బెస్ట్ డెబ్యూ ఫిలిం డైరెక్టర్: మండోన్నా అశ్విన్ (మండేలా తమిళ ఫిల్మ్) ∙ఉత్తమ వినోదాత్మక చిత్రం: తన్హాజీ: ది అన్సంగ్ వారియర్ ∙పర్యావరణ పరిరక్షణపై చిత్రం: తలెండా (కన్నడ) ∙బెస్ట్ ఫిల్మ్ ఆన్ సోషల్ ఇష్యూ: ఫ్యూర్నల్ (మరాఠి) ∙ఉత్తమ స్క్రీన్ ప్లే: షాలిని ఉషా నయ్యర్, సుధా కొంగర (సూరరైపోట్రు – తమిళం) ∙ఉత్తమ కొరియోగ్రఫీ: సంధ్యారాజు (నాట్యం) ∙ఉత్తమ మేకప్: టీవీ రాంబాబు (నాట్యం) ∙ఉత్తమ కాస్ట్యూమ్స్: నచికేత్ బార్వే, మహేశ్ శర్లా (హిందీ చిత్రం తన్హాజీ: ది అన్సంగ్ వారియర్) ∙ఉత్తమ సంగీతం (పాటలు): ఎస్ఎస్ తమన్ (అల...వైకుంఠపురములో...) ∙ఉత్తమ సంగీతం (నేపథ్యం): జీవీ ప్రకాశ్కుమార్ (సూరరైపోట్రు – తమిళం) ∙ఉత్తమ గీత రచన : మనోజ్ ముంతిషిర్ (సైనా – హిందీ) ∙ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: అనీష్ నదోడి (కప్పెలా– మలయాళం ఫిల్మ్) ∙ఉత్తమ సౌండ్ డిజైనర్: అనుమోల్ భవే (ఎమ్ఐ వసంతరావు – మరాఠి) ∙ఉత్తమ ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్ (శివరంజనీయుం ఇన్నుమ్ సిల పెన్గళుమ్– తమిళం) ∙ఉత్తమ ఆడియోగ్రఫీ: జాబిన్ జయాన్ (డోలు– కన్నడ) ∙ఉత్తమ సౌండ్ డిజైనింగ్ (ఫైనల్ మిక్స్): విష్ణు గోవింద్, శ్రీశంకర్ (మాలిక్ –మలయాళం) ∙ఉత్తమ సంభాషణలు: మడొన్నే అశ్విన్ (మండేలా– తమిళం) ∙ఉత్తమ నేపథ్య గాయని: నంజియమ్మ (అయ్యప్పనుమ్ కోషియుమ్ –మలయాళం) ∙ఉత్తమ నేపథ్య గాయకుడు: రాహుల్ దేశ్ పాండే (మీ వసంతరావు– మరాఠి) ∙ఉత్తమ సినిమాటోగ్రఫీ: సుప్రతిమ్ భోల్ (అవిజాత్రిక్– బెంగాలీ). -
ఏం మాట్లాడాలో తెలియటం లేదు.. ఫస్ట్ రియాక్షన్ విత్ సాక్షి
-
తెలుగు సినిమాలకు అవార్డుల పంట
-
‘కలర్ ఫోటో’కు జాతీయ అవార్డు.. స్పందించిన హీరో సుహాస్
కేంద్ర ప్రభుత్వం 68వ జాతీయ చలన చిత్ర అవార్డులను శుక్రవారం ప్రకటించింది. జాతీయ అవార్డుల్లో తెలుగు చిత్రాలు సత్తా చాటాయి. మూడు సినిమాలకు నాలుగు జాతీయ అవార్డులు దక్కాయి. నాట్యం సినిమాకు రెండు, కలర్ ఫోటో, అల వైకుంఠపురం సినిమాకు ఒక్కో అవార్డు లభించింది. ఉత్తమ తెలుగు చిత్రంగా ‘కలర్ ఫోటో’ అవార్డు గెలుచుకుంది. ఒక చిన్న సినిమా జాతీయ అవార్డును అందుకోవడం హాట్టాపిక్గా మారింది. కాగా 2020లో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. కలర్ ఫోటోకు జాతీయ అవార్డు దక్కిన సందర్భంగా సినిమా హీరో సుహాస్ తన ఆనందాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. కలర్ ఫోటోకు జాతీయ స్థాయిలో అవార్డు లంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. సినిమాకు అవార్డు వస్తుందని ఊహించలేదని, హీరోగా చేసిన మొదటి సినిమాకే అవార్డు దక్కడం మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉందన్నారు. ఈ అవార్డు సినిమాకే దక్కుతుందని, ఎప్పుడైనా సినిమానే గెలుస్తుందన్నారు. అవార్డు వచ్చిన విషయం తనకు తెలియదని, ముందుగా డైరెక్టర్ సందీప్యే కాల్ చేసి కంగ్రాట్స్ చెప్పారని అన్నారు. ప్రస్తుతం మిగతావారు కూడా కాల్ చేస్తున్నారని సుహాస్ తెలిపారు. సినిమా విడుదలైన సమయంలో దక్కిన ఆనందం.. ఇప్పుడు నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత అంతే ఆనందంగా ఫీల్ అవుతున్నట్లు పేర్కొన్నారు. క్రెడిట్ అంతా డైరెక్టర్కే చెందుతున్నారన్నారు. సినిమాకు పనిచేసిన వాళ్లందరికి ఈ అవార్డు అంకితమని అన్నారు. చదవండి: కలర్ ఫోటో సినిమాకు జాతీయ అవార్డు -
కలర్ ఫోటో సినిమాకు జాతీయ అవార్డు
కేంద్ర ప్రభుత్వం 68వ జాతీయ సినిమా అవార్డులను ప్రకటించింది. 2020 సంవత్సరంలో వచ్చిన సినిమాలకు ఈ పురస్కారాలను ప్రకటించింది. ఈసారి 400 సినిమాలు అవార్డుల కోసం పోటీపడగా 15 ప్రాంతీయ భాషా చిత్రాలకు అవార్డులు వరించాయి. ఉత్తమ తెలుగు చిత్రంగా సందీప్ రాజ్ దర్శకత్వం వహించిన కలర్ ఫొటో ఎంపికైంది. ఉత్తమ సంగీత దర్శకుడిగా అల వైకుంఠపురములో చిత్రానికి గానూ తమన్కు అవార్డు వరించింది. ఇక ముందుగా ఊహించినట్లుగానే సూర్య సూరరై పొట్రు(ఆకాశమే నీ హద్దురా) చిత్రానికి ఏకంగా ఐదు అవార్డులు వచ్చి పడ్డాయి. మోస్ట్ ఫిలిం ఫ్రెండ్లీ స్టేట్గా మధ్యప్రదేశ్ నిలిచింది. బెస్ట్ క్రిటిక్ అవార్డు ప్రకటనను మాత్రం కేంద్రం వాయిదా వేసింది. ► మోస్ట్ ఫిలిం ఫ్రెండ్లీ స్టేట్ - మధ్యప్రదేశ్ ► ఉత్తమ సంగీత దర్శకుడు (సాంగ్స్): - తమన్ (అల వైకుంఠపురములో) ► ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ (బీజీఎమ్) : జీవీ ప్రకాశ్ కుమార్ (సూరరై పోట్రు -తమిళ్) ► బెస్ట్ ఫీచర్ ఫిలిం: సూరరై పోట్రు ► బెస్ట్ స్టంట్స్ - అయ్యప్పనుమ్ కోషియమ్ ► ఉత్తమ కొరియోగ్రఫీ: సంధ్యారాజు (నాట్యం -తెలుగు) ► ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్: టీవీ రాంబాబు - నాట్యం ► ఉత్తమ సహాయ నటి: లక్ష్మీ ప్రియ చంద్రమౌళి (శివరంజనీయం ఇన్నుమ్ శిల పెంగళమ్) ► ఉత్తమ సహాయ నటుడు: బిజు మీనన్ (అయ్యప్పనుమ్ కోషియుమ్- మలయాళం) ► ఉత్తమ నటి: అపర్ణ బాలమురళి (సూరరై పోట్రు- తమిళ్) ► ఉత్తమ నటుడు: సూర్య (సూరరై పోట్రు) ► ఉత్తమ నటుడు (షేర్డ్): అజయ్ దేవ్గణ్ (తానాజీ: ది అన్సంగ్ వారియర్- హిందీ) ► ఉత్తమ దర్శకుడు: సచ్చిదానందన్ కేఆర్ (అయ్యప్పనుమ్ కోషియుమ్) ► ఉత్తమ పిల్లల చిత్రం: సుమి(మరాఠి) ► బెస్ట్ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్: నాంచమ్మ (అప్పయ్యప్పనుమ్ కోషియమ్- మలయాళం) ► బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్: రాహుల్ దేశ్పాండే (మీ వసంతరావు - మరాఠీ) ► ఉత్తమ తమిళ చిత్రం: శివరంజనీయం ఎన్నుమ్ శిల పెంగల్లమ్ (తమిళ్) ► ఉత్తమ మలయాళ చిత్రం: థింకలియా నిశ్చయమ్ ► ఉత్తమ కన్నడ చిత్రం: డొల్లు ► ఉత్తమ హిందీ చిత్రం: తులసీదాస్ జూనియర్ ► ఉత్తమ యాక్షన్ డైరెక్షన్ అవార్డ్(స్టంట్ కొరియోగ్రఫీ): అయ్యప్పనుమ్ కోషియమ్ (మలయాళం) ► ఉత్తమ లిరిక్స్: సైనా(హిందీ) - మనోజ్ ముంతషిర్ ► ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్: నచికెత్ బర్వె, మహేశ్ షెర్లా (తానాజీ: ది అన్సంగ్ వారియర్) ► ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: అనీస్ నాడోడి (కప్పేలా -మలయాళం) ► ఉత్తమ ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్ (శివరంజనీయం ఎన్నుమ్ శిల పెంగల్లమ్ -తమిళ్) ► బెస్ట్ ఆడియోగ్రఫీ (లొకేషన్ సౌండ్ రికార్డిస్ట్): జాబిన్ జయన్ (డోలు- కన్నడ) ► బెస్ట్ ఆడియోగ్రఫీ (సౌండ్ డిజైనర్) : అన్మూల్ భావే (మీ వసంతరావు- మరాఠీ) ► బెస్ట్ ఆడియోగ్రఫీ (రీరికార్డిస్ట్ ఆఫ్ ద ఫైనల్ మిక్స్డ్ ట్రాక్: విష్ణు గోవింద్, శ్రీశంకర్ (మలిక్- మలయాళం) ► బెస్ట్ స్క్రీన్ప్లే (ఒరిజినల్):షాలిని ఉషా నాయర్, సుధా కొంగర (సూరరై పోట్రు - తమిళ్) ► బెస్ట్ స్క్రీన్ప్లే (డైలాగ్ రైటర్) : మడోన్నా అశ్విన్ (మండేలా- తమిళ్) ► బెస్ట్ సినిమాటోగ్రఫీ: సుప్రతీమ్ భోల్ (అవిజాత్రిక్- బెంగాలీ) ► ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్: అనీష్ మంగేశ్ గోసావి (టక్ టక్- మరాఠీ), ఆకాంక్ష పింగ్లే, దివఏశ్ ఇందుల్కర్ (సుమీ- మరాఠీ) ► బెస్ట్ ఫిలిం ఆన్ ఎన్వైర్మెంట్ కంజర్వేషన్: తాలెడండ(కన్నడ) ► బెస్ట్ ఫిలిం ఆన్ సోషల్ ఇష్యూస్: ఫ్యునెరల్ (మరాఠి) ► బెస్ట్ పాపులర్ ఫిలిం ఆన్ ప్రొవైడింగ్ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్: తానాజీ: ది అన్సంగ్ వారియర్ ► ఇందిరాగాంధీ అవార్డ్ ఫర్ బెస్ట్ డెబ్యూ ఫిలిం ఆఫ్ ఎ డైరెక్టర్: మడోన్న అశ్విన్ (మండేలా- తమిళ్) నాన్ ఫీచర్ ఫిలింస్ ► బెస్ట్ వాయిస్ ఓవర్: శోభా రాప్సోడీ ఆఫ్ రెయిన్స్- మాన్సూన్స్ ఆఫ్ కేరళ (ఇంగ్లీష్) ► బెస్ట్ మ్యూజిక్ డైరెక్షన్: విశాల్ భరద్వాజ్ (1232 కి.మీ: మరేంగే తో వహీన్ జాకర్) (హిందీ) ► బెస్ట్ ఎడిటింగ్: అనాదీ అతలే (బార్డర్ ల్యాండ్స్) ► బెస్ట్ ఆన్లొకేషన్ సౌండ్ రికార్డిస్ట్- సందీప్ భాటి, ప్రదీప్ లెహ్వార్ (జాదూయ్ జంగల్) (హిందీ) ► బెస్ట్ ఆడియోగ్రఫీ(ఫైనల్ మిక్స్డ్ ట్రాక్): అజిత్ సింగ్ రాథోడ్ (పర్ల్ ఆఫ్ ద డిసర్ట్ ) (రాజస్థానీ) ► బెస్ట్ సినిమాటోగ్రఫీ: నిఖిల్ ఎస్ ప్రవీణ్ (శబ్దికున్ కలప్ప) (మలయాళం) ► ఉత్తమ డైరెక్షన్: ఆర్వీ రమణి (ఓ దట్స్ భాను- ఇంగ్లీష్, తమిళ్, మలయాళం, హిందీ) ► ఉత్తమ కుటుంబ కథా చిత్రం: కుంకుమార్చన్ (మరాఠి) ► ఉత్తమ షార్ట్ ఫిక్షన్ ఫిలిం: కచీచినుతు (అస్సాం) ► స్పెషల్ జ్యూరీ అవార్డ్: అడ్మిటెడ్ (హిందీ, ఇంగ్లీష్) ► బెస్ట్ ఇన్వెస్టిగేటివ్ ఫిలిం: ద సేవియర్: బ్రిగేడియర్ ప్రీతమ్ సింగ్ (పంజాబీ) ► బెస్ట్ ఎక్స్ప్లోరేషన్ ఫిలిం: వీలింగ్ ద బాల్ (ఇంగ్లీష్, హిందీ) ► బెస్ట్ ఎడ్యుకేషనల్ ఫిలిం: డ్రీమింగ్ ఆఫ్ వర్డ్స్ (మలయాళం ) ► బెస్ట్ ఫిలిం ఆన్ సోషల్ ఇష్యూస్: జస్టిస్ డిలేయ్డ్ బట్ డెలివర్డ్ (హిందీ), 3 సిస్టర్స్ (బెంగాలీ) ► బెస్ట్ ఎన్వైర్మెంట్ ఫిలిం: మాన అరు మానుహ్ (అస్సామీస్) ► బెస్ట్ ప్రమోషనల్ ఫిలిం: సర్మొంటింగ్ చాలెంజెస్ (ఇంగ్లీష్) ► బెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫిలిం: ఆన్ ద బ్రింక్ సీజన్ 2- బ్యాట్స్ (ఇంగ్లీష్) ► బెస్ట్ ఆర్ట్స్ అండ్ కల్చర్ ఫిలింస్: నాదదా నవనీతా ► బెస్ట్ బయోగ్రాఫికల్ ఫిలిం: పబుంగ్ శ్యామ్ ► బెస్ట్ ఎత్నోగ్రాఫిక్ ఫిలిం: మందల్ కె బోల్ (హిందీ) ► బెస్ట్ డెబ్యూ నాన్ ఫియేచర్ ఫిలిం ఆఫ్ ఎ డైరెక్టర్: విశేష్ అయ్యర్ (పరాయా- మారాఠీ, హిందీ) చదవండి: కిస్, అత్యాచార సీన్లు మాత్రమే చేయమంటున్నారు: నటి -
ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ ఈ స్టార్ హీరో
సాక్షి, హైదరాబాద్: ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ తమిళ స్టార్ హీరో ధనుష్. సమాజంలోని అమానవీయ కోణాన్నిప్రయోగాత్మకంగా ఆవిష్కరించి బాక్సాఫీసును షేక్ చేయడమే కాదు జాతీయ అవార్డును సైతం దక్కించుకున్న గొప్ప నటుడు ధనుష్. సినిమా చూసిన వెంటనే జాతీయ అవార్డు ఖాయమనే నమ్మకాన్ని ప్రేక్షకుల్లో కలిగించిన అసామాన్య హీరో. అంతేకాదు ఒకే వేదికపై పిల్లనిచ్చిన మామతో కలిసి అత్యుత్తమ పురస్కారాన్ని అందుకుని కొత్త చరితను లిఖించాడు ధనుష్. తమిళ మూవీ ‘అసురన్’ ద్వారా జాతీయ ఉత్తమనటుడు అవార్డు గెల్చుకున్న సందర్భంగా స్పెషల్ వీడియో. (National Film Awards: వాళ్లు..నావాళ్లు, ఇది చరిత్ర: ఐశ్వర్య) -
రజనీకాంత్ను అభినందించిన సీఎం, గవర్నర్
Rajinikanth: అత్యుత్తమ దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని అందుకున్న నటుడు రజనీకాంత్కు ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్, గవర్నర్ ఆర్.ఎన్.రవి అభినందనలు తెలియజేశారు. సోమవారం ఢిల్లీలో జరిగిన జాతీయ అవార్డుల ప్రదానోత్సవంలో నటు డు రజనీకాంత్ను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు శాలువాతో సత్కరించి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని అందజేశారు. వెండితెర సూర్యుడు.. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రజినీకాంత్ను ట్విట్టర్లో అభినందించారు. అందులో అత్యుత్తమ పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకుంటున్న ప్రియ మిత్రుడు, సూపర్ స్టార్ రజనీకాంత్కు హృదయపూర్వక శుభాకాంక్షలు. వెండితెర సూర్యుడు రజినీకాంత్ తమిళ సినిమాను తదుపరి ఘట్టానికి తీసుకుపోయారని, ఆయన ప్రపంచ స్థాయిలో పలు అవార్డులను పొందాలని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. ఆనందకరమైన రోజు.. రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్.రవి రజనీకాంత్కు శుభాకాంక్షలు అందించారు. ఆయన మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ‘‘ భారతీయ సినిమాకు మీరు అందించిన అసాధారణ సేవలకుగాను అత్యుత్తమ పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కేను కేంద్రం ప్రకటించింది. అవార్డు అందుకున్న మీకు.. దేశ ప్రజల తరఫున, నా తరఫున శుభాకాంక్షలు. సినిమాలను ప్రేమించే అందరికీ ఆనందకరమైన రోజు ఇది. భారతీయ సినిమాకు ఉన్నత సేవలతోనూ, వ్యక్తిగతంగా సంస్కారవంతమైన జీవితంతో మన దేశం ప్రజలను ఆకట్టుకున్నారు. అలాంటి మీరు పలు ఏళ్లపాటు సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను’’ అని పేర్కొన్నారు. -
యువకులకు రజనీకాంత్ జీవితం ఓ ప్రేరణ: ఉప రాష్ట్రపతి
‘సినిమాల్లో హింస, అశ్లీలతలవంటివి చూపించడాన్ని తగ్గించాలి. సినిమాల ప్రభావం సమాజంపై ఎక్కువగా ఉంటుంది. ప్రజల్లో బాధ్యత పెంపొందించే విధంగా సినిమాలు ఉండాలి. భారతదేశ సినీ పరిశ్రమలో ఉన్న అపారమైన నైపుణ్యానికి ఈ అవార్డులు ఓ మచ్చుతునక మాత్రమే. మరింతమంది ఔత్సాహిక యువ దర్శకులు, కళాకారులు, సాంకేతిక సిబ్బందిని చిత్రపరిశ్రమ పెద్దలు ప్రోత్సహించాలి. సినీరంగంలో అవకాశాలు వెతుక్కుంటున్న యువకులకు రజనీకాంత్ సినీ జీవితం ప్రేరణాత్మకంగా నిలుస్తుంది’ అని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. సోమవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన 67వ జాతీయ సినిమా అవార్డుల కార్యక్రమంలో ప్రముఖ సినీనటుడు రజనీకాంత్కు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారంతో పాటు పలువురు కళాకారులకు వెంకయ్యనాయుడు అవార్డులను ప్రదానం చేశారు. తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఉత్తమ వినోదాత్మక చిత్రంగా ‘మహర్షి’ ఎంపిక కాగా ఆ చిత్రదర్శకుడు వంశీ పైడిపల్లి, నిర్మాత ‘దిల్’ రాజు అవార్డులు స్వీకరించారు. తెలుగులో ఉత్తమ సినిమాగా ఎంపి కైన ‘జెర్సీ’ అవార్డును నిర్మాత సూర్యదేవర నాగవంశీ, డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి, అదే సినిమాకుగాను ఎడిటర్ నవీన్ నూలి అవార్డు అందుకున్నారు. జాతీయ ఉత్తమ నటుడి అవార్డును ‘భోంస్లే’కి మనోజ్ బాజ్పాయ్, ‘అసురన్ ’ చిత్రానికి ధనుష్ ఇద్దరూ అందుకున్నారు. ‘మణికర్ణిక’, ‘పంగా’ చిత్రాలకుగాను కంగనా రనౌత్ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు. నన్ను నటుడిగా తీర్చిదిద్దిన నా గురువు బాలచందర్గారికి ధన్యవాదాలు. నా అన్నయ్య సత్యనారాయణరావు గైక్వాడ్ నా తండ్రిలాంటివారు. గొప్ప విలువలు నేర్పించిన ఆయనకు ధన్యవాదాలు. నా మిత్రుడు, డ్రైవర్, ట్రాన్స్పోర్ట్ సహోద్యోగి రాజ్ బహుదూర్ నాలో నటుడు ఉన్నాడని గుర్తించి, నన్ను ప్రోత్సహించారు. వీరితో పాటు నా సినిమా నిర్మాతలు, దర్శకులు, సహ నటీనటులు, సాంకేతిక నిపుణులు, పంపిణీదారులు, థియేటర్ల యజమానులు, మీడియా మిత్రులు, అభిమానులు, తమిళ ప్రజలకి ఈ పురస్కారాన్ని అంకితమిస్తున్నాను. – రజనీకాంత్ మంచి చిత్రాలు తీస్తూ ఉండాలని ఈ పురస్కారం గుర్తు చేస్తూ ఉంటుంది. వినోదంతో పాటు సందేశం ఇవ్వడం సినిమాతో సాధ్యమవుతుంది. మహేశ్బాబు లాంటి సూపర్ స్టార్తో సినిమా చేసినప్పుడు మరింతమంది చూస్తారు. – వంశీ పైడిపల్లి రైతులకు నగర ప్రజలు ఏ విధంగా సాయం చేయాలనే అంశంతో ‘మహర్షి’ సినిమా తీశాం. మహేశ్ బాబు కమర్షియల్ స్టార్. ఆయనకు తగ్గట్టు సినిమాలో పాటలు, ఫైట్లతో దర్శకుడు వంశీ పైడిపల్లి చక్కటి సినిమా తీశాడు. – ‘దిల్’ రాజు ‘జెర్సీ’కి పని చేసిన అందరికీ ధన్యవాదాలు. ఈ అవార్డు రావడానికి ముఖ్యకారణం హీరో నానీ. – గౌతమ్ తిన్ననూరి – నవీన్ నూలి – సూర్యదేవర నాగవంశీ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా బాబాయి(చినబాబు), డైరెక్టర్కు ధన్యవాదాలు. కథను నమ్మి నటించిన నానీకి ప్రత్యేక ధన్యవాదాలు. – సూర్యదేవర నాగవంశీ ఎడిటింగ్లో చాలా సంవత్సరాల తర్వాత తెలుగు సినిమాకు అవార్డు రావడం సంతోషంగా ఉంది. – నవీన్ నూలి అవార్డు విజేతల వివరాలు.. ఉత్తమ చిత్రం: ‘మరక్కర్: ది అరేబియన్ కడలింటె సింహం’ (మలయాళం) ఉత్తమ నటుడు: ధనుష్ (‘అసురన్’), మనోజ్ బాజ్పాయ్ (‘భోంస్లే’), ఉత్తమ నటి: కంగనా రనౌత్ (మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ, పంగా) ఉత్తమ సహాయ నటుడు: విజయ్ సేతుపతి (తమిళ ‘సూపర్ డీలక్స్’) ఉత్తమ సహాయ నటి: పల్లవీ జోషి (హిందీ ‘తాష్కెంట్ ఫైల్స్’) ఉత్తమ బాల నటుడు: నాగ విశాల్ (తమిళ చిత్రం – ‘కె.డి’) ఉత్తమ దర్శకుడు: సంజయ్ పూరణ్ సింగ్ చౌహాన్ (హిందీ ‘బహత్తర్ హూరేన్ ’) ఉత్తమ వినోదాత్మక చిత్రం: ‘మహర్షి’ ఉత్తమ తెలుగు చిత్రం: ‘జెర్సీ’ ఎడిటింగ్: నవీన్ నూలి (జెర్సీ) కొరియోగ్రాఫర్: రాజుసుందరం (మహర్షి) ఉత్తమ సంగీత దర్శకుడు: డి. ఇమాన్ (తమిళ చిత్రం ‘విశ్వాసం’) ఉత్తమ గాయకుడు: బి. ప్రాక్ (హిందీ ‘కేసరి’) ఉత్తమ గాయని: సావనీ రవీంద్ర (మరాఠీ ‘బర్దో’) ఉత్తమ సినిమాటోగ్రఫీ: గిరీశ్ గంగాధరన్ (మలయాళ చిత్రం – ‘జల్లికట్టు’) ఉత్తమ యాక్షన్ డైరెక్షన్: విక్రమ్ మోర్ (కన్నడ ‘అవనే శ్రీమన్నారాయణ’) ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్: సిద్ధార్థ్ ప్రియదర్శన్ (మలయాళ ‘మరక్కర్: ది అరేబియన్ ’) ఉత్తమ కాస్ట్యూమ్స్: సుజిత్ సుధాకరన్, వి. సాయి (‘మరక్కర్...’) ఉత్తమ తమిళ చిత్రం: ‘అసురన్ ’ ఉత్తమ మలయాళ చిత్రం: ‘కల్ల నోట్టమ్’ ఉత్తమ కన్నడ చిత్రం: ‘అక్షి’ ఉత్తమ హిందీ చిత్రం: ‘ఛిఛోరే’ ఉత్తమ జాతీయ సమగ్రతా చిత్రం: ‘తాజ్మహల్’ (మరాఠీ) స్పెషల్ జ్యూరీ అవార్డు: ‘ఒత్త సెరుప్పు సైజ్ 7’ (తమిళం) చదవండి: అరాచకంగా ‘అన్నాత్తే’ టీజర్.. వింటేజ్ రజనీ ఆన్ ది వే -
67వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం
-
నేషనల్ అవార్డ్స్ అందుకున్న విజేతలు వీళ్లే..
అత్యంత ప్రతిష్ఠత్మకమైన 67వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రధానోత్సవం ఢిల్లీలో జరిగింది. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా పలువురు అవార్డులు అందుకున్నారు. 67వ జాతీయ చలన చిత్ర అవార్డుల విజేతలు వీళ్లే.. ఉత్తమ తెలుగు చిత్రం- జెర్సీ ఉత్తమ పాపులర్ చిత్రం- మహర్షి ఉత్తమ నటి -కంగనా రనౌత్ (మణికర్ణిక) ఉత్తమ నటుడు- మనోజ్ బాజ్పాయీ (భోంస్లే), ధనుష్ (అసురన్) ఉత్తమ హిందీ చిత్రం- చిచ్చోరే ఉత్తమ తమిళ చిత్రం- అసురన్ ఉత్తమ మలయాళ చిత్రం- మరక్కర్ ఉత్తమ దర్శకుడు- సంజయ్ పూరన్ సింగ్ చౌహాన్ (బహత్తర్ హూరైన్) ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్: మరక్కర్ (మలయాళం) ఉత్తమ సహాయ నటుడు: విజయ్ సేతుపతి(సూపర్ డీలక్స్) ఉత్తమ సహాయ నటి- పల్లవి జోషి(ది తాష్కెంట్ ఫైల్స్) ఉత్తమ కొరియోగ్రాఫర్: రాజు సుందరం (మహర్షి) ఉత్తమ యాక్షన్ కొరియోగ్రఫీ: అవనే శ్రీమన్నారాయణ(కన్నడ) ఉత్తమ సంగీత దర్శకుడు (పాటలు): డి.ఇమ్మాన్ (విశ్వాసం) ఉత్తమ నేపథ్య సంగీత దర్శకుడు: ప్రబుద్ధ బెనర్జీ (జ్యేష్టపుత్రో) ఉత్తమ గాయకుడు: బ్రి. ప్రాక్ (కేసరి చిత్రంలోని ‘తేరీ మిట్టీ...’) ఉత్తమ గాయని: శావని రవీంద్ర (బర్దో-మరాఠీ) ఉత్తమ మేకప్: రంజిత్ (హెలెన్) ఉత్తమ ఎడిటింగ్- నవీన్ నూలి (జెర్సీ) -
67th National Film Awards: ఉత్తమ పాపులర్ చిత్రంగా 'మహర్షి'..
-
67వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం..
67th National Film Awards: అత్యంత ప్రతిష్ఠత్మకమైన 67వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం ఢిల్లీలో జరిగింది. సినీ రంగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులతో పాటు ప్రేక్షకుల మన్ననలు పొందిన చిత్రాలకు అవార్డులు అందజేశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా పలువురు అవార్డులు అందుకున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ‘మణికర్ణిక’ చిత్రానికి గానూ కంగనా రనౌత్ జాతీయ ఉత్తమ నటిగా అవార్డు దక్కించుకున్నారు. ఉత్తమ నటుడిగా ధనుష్(అసురన్), మనోజ్ బాజ్పాయ్(భోంస్లే) అవార్డులు అందుకున్నారు. ఉత్తమ సహాయ నటుడిగా విజయ్ సేతుపతి(సూపర్ డీలక్స్)కి అవార్డు దక్కింది. ఇక జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా 'జెర్సీ' నిలిచింది. ఎడిటింగ్ విభాగంలోనూ జెర్సీ సినిమాకు అవార్డు దక్కింది. బెస్ట్ తెలుగు పాపులర్ ఫిల్మ్గా 'మహర్షి' సినిమాకు నేషనల్ అవార్డు వరించింది. మొత్తంగా తెలుగులో జెర్సీ సినిమాకు రెండు అవార్డులు రాగా, మహర్షికి సినిమాకు మూడు అవార్డులు దక్కాయి. బెస్ట్ కొరియోగ్రాఫర్గా రాజుసందరం మాస్టర్కు జాతీయ అవార్డు లభించింది. -
రిలీజ్ కాకముందే జాతీయ అవార్డు, అలా ఎలా?
సాక్షి, న్యూఢిల్లీ: 67వ జాతీయ చలన చిత్ర అవార్డులను కేంద్రం సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే. కరోనావైరస్ మహమ్మారి కారణంగా అవార్డులను ఒక సంవత్సరం పాటు నిలిపివేశారు. ఈ నేపథ్యంలో మోహన్లాల్ నటించిన మరక్కార్ మళయాళ చిత్రానికి గాను ఉత్తమ ఫీచర్ ఫిల్మ్, స్పెషల్ ఎఫెక్ట్స్, కాస్ట్యూమ్స్ కేటగిరీల్లో అవార్డు లభించింది. అసలు విషయమేంటంటే.. ఈ చిత్రం ఇంకా రిలీజ్ అవ్వలేదు. విడుదల కాకముందే అవార్డును ఎలా ప్రకటించారని అందరు నివ్వెరపోయారు. ఈ చిత్రం గత ఏడాది మార్చి 26న విడుదలకావాల్సింది. లాక్ డౌన్ కారణంగా చిత్రం విడుదలకు నోచుకోలేదు. గత ఏడాదే సెన్సార్ బోర్డు నుంచి క్లియరెన్స్ రావడంతో ఈ చిత్రాన్ని 2020లో వచ్చిన చిత్రంగా జ్యూరీ పరిగణించింది. ఈ ఏడాది మే 19న మూవీని చిత్ర బృందం రిలీజ్ చేయనుంది. కాగా, జాతీయ చలన చిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాకు 4 అవార్డులు దక్కాయి. జాతీయ స్థాయిలో వినోదం అందించిన బెస్ట్ పాపులర్ ఫిల్మ్గా మహేశ్ బాబు నటించిన ‘మహర్షి’ ఎంపికైంది. తెలుగులో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నాని నటించిన ‘జెర్సీ’ (దర్శకత్వం గౌతమ్ తిన్ననూరి) అవార్డు గెలిచింది. ‘మహర్షి’ చిత్రానికి నృత్యాలు సమకూర్చిన రాజు సుందరం ఉత్తమ కొరియోగ్రాఫర్గా, ‘జెర్సీ’కి ఎడిటింగ్ చేసిన నవీన్ నూలి ఉత్తమ ఎడిటర్గా జాతీయ అవార్డులకు ఎంపికయ్యారు. (చదవండి: మోహన్ లాల్ కసరత్తులు.. నెటిజన్లు ఫిదా) -
జాతీయ సినీ అవార్డు విజేతలకు సీఎం జగన్ అభినందనలు
సాక్షి, అమరావతి: జాతీయ సినిమా అవార్డు విజేతలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. జాతీయ అవార్డులు గెలుచుకున్న తెలుగు సినిమా నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణులకు ఆయన శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు సీఎంవో అధికారులు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. -
మహర్షి... జెర్సీకి డబుల్ ధమాకా
67వ జాతీయ సినిమా అవార్డుల్లో తెలుగు సినిమా మెరుపులు మెరిపించింది. 2019వ సంవత్సరానికి గాను సోమవారం ఢిల్లీలో ప్రకటించిన ఈ అవార్డుల్లో తెలుగు సినిమా 4 అవార్డులు దక్కించుకుంది. జాతీయ స్థాయిలో సకుటుంబ వినోదం అందించిన బెస్ట్ పాపులర్ ఫిల్మ్గా మహేశ్ బాబు నటించిన ‘మహర్షి’ ఎంపికైంది. తెలుగులో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నాని నటించిన ‘జెర్సీ’ (దర్శకత్వం గౌతమ్ తిన్ననూరి) అవార్డు గెలిచింది. ‘మహర్షి’ చిత్రానికి నృత్యాలు సమకూర్చిన రాజు సుందరం ఉత్తమ కొరియోగ్రాఫర్గా, ‘జెర్సీ’కి ఎడిటింగ్ చేసిన నవీన్ నూలి ఉత్తమ ఎడిటర్గా జాతీయ అవార్డులకు ఎంపికయ్యారు. ఉత్తమ చిత్రంగా చారిత్రక కథాంశంతో మోహన్లాల్ నటించిన మలయాళ చిత్రం ‘మరక్కర్ – అరేబియన్ కడలింటె సింహం’ (మరక్కర్ – లయన్ ఆఫ్ ది అరేబియన్ సీ), ఉత్తమ నటిగా కంగనా రనౌత్ (‘మణికర్ణిక’, ‘పంగా’) ఎంపికైతే, ఉత్తమ నటుడి అవార్డును తమిళ నటుడు ధనుష్ (చిత్రం ‘అసురన్’) – హిందీ నటుడు మనోజ్ బాజ్పాయ్ (‘భోన్స్లే’)లకు సంయుక్తంగా ప్రకటించారు. ఉత్తమ దర్శకుడిగా సంజయ్ పూరణ్ సింగ్ చౌహాన్ (హిందీ ‘బహత్తర్ హూరేన్’) ఎంపికయ్యారు. ఉత్తమ తమిళ చిత్రం అవార్డు కూడా వెట్రిమారన్ దర్శకత్వంలోని ‘అసురన్’కే దక్కగా, సుశాంత్ సింగ్ రాజ్పుత్, తెలుగు నటుడు నవీన్ పొలిశెట్టి నటించిన ‘చిఛోరే’ ఉత్తమ హిందీ చిత్రంగా ఎంపికైంది. సినిమాల నిర్మాణానికి అనుకూలమైన ‘మోస్ట్ ఫిల్మ్ ఫ్రెండ్లీ స్టేట్’ అవార్డును సిక్కిమ్ దక్కించుకుంది. ఇటీవల ‘ఉప్పెన’లో అందరినీ ఆకట్టుకున్న తమిళ నటుడు విజయ్ సేతుపతి తమిళ చిత్రం ‘సూపర్ డీలక్స్’తో ఉత్తమ సహాయ నటుడిగా ఎంపికయ్యారు. పార్తీబన్ నటించి, రూపొందించగా, వివిధ దేశ, విదేశీ చలనచిత్రోత్సవాలకు వెళ్ళిన తమిళ చిత్రం ‘ఒత్త సెరుప్పు సైజ్ 7’ (ఒక చెప్పు సైజు 7) స్పెషల్ జ్యూరీ అవార్డును గెలిచింది. అజిత్ నటించిన తమిళ ‘విశ్వాసం’కు ఇమాన్ ఉత్తమ సంగీత దర్శకుడిగా నిలిచారు. ఈసారి ఆస్కార్కు అఫిషియల్ ఇండియన్ ఎంట్రీగా వెళ్ళిన మలయాళ ‘జల్లికట్టు’ సినిమాటోగ్రఫీ విభాగం (గిరీశ్ గంగాధరన్)లో అవార్డు దక్కించుకుంది. కరోనా కారణంగా విడుదల ఆలస్యమైనా, ఉత్తమ చిత్రంగా నిలిచిన మోహన్లాల్ ‘మరక్కర్’ స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలోనూ అవార్డు సాధించింది. నిజానికి, గత ఏడాది మే నాటికే ఈ 2019 అవార్డుల ప్రదానం జరగాల్సి ఉంది. కానీ, కరోనా విజృంభణ నేపథ్యంలో అవార్డుల ప్రకటన – ప్రదానం ఇప్పటి దాకా ఆలస్యమైంది. జయహో... మలయాళం ఈ 2019 జాతీయ అవార్డుల్లో మలయాళ సినిమా పంట పండింది. ఫీచర్ఫిల్మ్ విభాగంలో ఉత్తమ చిత్రం, స్పెషల్ ఎఫెక్ట్స్, కాస్ట్యూమ్స్, గీతరచన, మేకప్, సినిమాటోగ్రఫీ సహా 9 అవార్డులు, నాన్–ఫీచర్ఫిల్మ్ విభాగంలో 2 అవార్డులు – మొత్తం 11 జాతీయ అవార్డులు మలయాళ సినిమాకు దక్కడం విశేషం. ఒకటికి రెండు తాజా నేషనల్ అవార్డుల్లో మలయాళ ‘మరక్కర్...’కు 3, మలయాళ ‘హెలెన్’కు 2, తమిళ ‘అసురన్’, ‘ఒత్త సెరుప్పు సైజ్ 7’కు చెరి రెండేసి, హిందీ ‘తాష్కెంట్ ఫైల్స్’కు 2, తెలుగు చిత్రాలు ‘మహర్షి’, ‘జెర్సీ’ లకు చెరి రెండేసి అవార్డులు, మరాఠీ ‘ఆనందీ గోపాల్’కు 2, బెంగాలీ చిత్రం ‘జ్యేష్ఠ పుత్రో’కు 2 అవార్డులు రావడం గమనార్హం. అవార్డు మిస్సయ్యాం అనుకున్నాం – నాని ‘‘గత ఏడాది అంతా కరోనాతో గడిచిపోయింది. అవార్డ్స్ ఫంక్షన్లు ఏమీ లేవు. ‘జెర్సీ’కి అవార్డ్స్ మిస్ అయిపోయాం అనుకున్నాం. కానీ, ఇప్పుడు 67వ జాతీయ అవార్డుల్లో ఉత్తమ ప్రాంతీయ చిత్రం, ఉత్తమ ఎడిటింగ్ విభాగాల్లో ‘జెర్సీ’కి రెండు అవార్డులు వచ్చినందుకు సంతోషంగా ఉంది. ‘జెర్సీ’తో పాటు అవార్డులు గెలుచుకున్న ‘మహర్షి’ చిత్ర బృందానికి కూడా కంగ్రాట్స్. జాతీయ అవార్డులు వచ్చిన ప్రతిసారీ వాటిలో మన తెలుగు సినిమాల సంఖ్య పెరగడం సంతోషంగా ఉంది.’’ శిల్పకు ధన్యవాదాలు ‘‘నాకీ అవార్డు రావడానికి కారణం దర్శకుడు కుమారరాజా. అలాగే శిల్ప (‘సూపర్ డీలక్స్’లో సేతుపతి చేసిన ట్రాన్స్జెండర్ పాత్ర పేరు). ఏ పాత్ర చేసినా అవార్డులు వస్తాయా? అని ఆలోచించను. శిల్ప రెగ్యులర్ పాత్ర కాదు. అలాగని నన్నేం ఇబ్బంది పెట్టలేదు. ‘నేను శిల్ప’ అనుకుని, లీనమైపో యా. అందుకే, కుమారరాజాకి, శిల్పకి థ్యాంక్స్.’’ – ఉత్తమ సహాయ నటుడు విజయ్ సేతుపతి ఆయనకు ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పాను ‘‘నేను డైరెక్టర్ కావడానికి ఏడేళ్లు పట్టింది. రాహుల్గారు నన్ను నమ్మి ‘మళ్ళీ రావా’కి చాన్స్ ఇచ్చారు. నిర్మాతగా ఆయనకు అది తొలి సినిమా. ఒక కొత్త దర్శకుడికి అవకాశం ఇవ్వడం గ్రేట్. అందుకే ఆయనకు ఫోన్ చేసి ‘థ్యాంక్స్’ చెప్పాను. ‘జెర్సీ’ తీస్తున్నప్పుడు నా మనసులో ఒకటే ఉంది. ‘మంచి సినిమా తీయాలి’... అంతే. నేను రాసిన కథ ప్రేక్షకుల దగ్గరకు వెళ్లాలంటే మంచి నటుడు చేయాలి. నా కథను నానీ, శ్రద్ధా శ్రీనాథ్, బాలనటుడు రోనిత్... ఇలా ఇతర నటీనటులందరూ తమ నటనతో ఎలివేట్ చేశారు. సాంకేతిక నిపుణులు కూడా న్యాయం చేశారు.’’ – ‘జెర్సీ’ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి మాకు ఇది హ్యాపీ మూమెంట్ – ‘దిల్’ రాజు ‘‘మహేశ్ వంటి స్టార్ని పెట్టుకుని వాణిజ్య అంశాలు మిస్ అవకుండా సందేశాత్మక చిత్రం తీయడం కష్టమైన పని. టీమ్ అంతా కష్టపడి చేశారు. అవార్డులకు వచ్చే ప్రైజ్ మనీని మంచి కార్యక్రమాలకు విరాళంగా ఇస్తా. మాకిది హ్యాపీ మూమెంట్’’ అన్నారు ‘మహర్షి’ నిర్మాతల్లో ఒకరైన ‘దిల్’ రాజు. ‘‘ఈ కథ విన్నప్పుడు మహేశ్ నా కెరీర్లోనే బెస్ట్ మూవీ అని, విడుదలయ్యాక నేను గర్వపడే సినిమా ‘మహర్షి’ అని ట్వీట్ చేశారు. ‘మహర్షి’కి బీజం వేసింది రచయిత హరి. నాతో పాటు హరి, అహిషోర్ సాల్మన్ రెండేళ్లు కష్టపడ్డారు’’ అన్నారు ‘మహర్షి’ దర్శకుడు వంశీ పైడిపల్లి. -
నాలుగోసారి అవార్డు: ఫుల్ ఖుషీలో బాలీవుడ్ ఐరన్ లేడీ
అష్టకష్టాలు పడి సినీ పరిశ్రమకు వచ్చి హీరోయిన్గా సుస్థిర స్థానం సంపాదించుకున్న కంగనా రనౌత్ తన నటనతో ప్రేక్షకులను అలరిస్తూనే విమర్శకుల ప్రశంసలు కూడా పొందుతోంది. ఆమె నటనకు అందరూ ఫిదా అవుతున్నారు. దీంతో ఆమె ఇంటికి అవార్డులు పరుగెత్తుకుంటూ వెళ్తున్నాయి. తాజాగా ప్రకటించిన జాతీయ సినిమా అవార్డుల్లో నాలుగోసారి ఉత్తమ నటిగా కంగనా అవార్డు దక్కించుకుంది. హిమాచల్ ప్రదేశ్కు చెందిన కంగనా రనౌత్ ముంబైలో స్థిరపడడానికి ఎంతో కష్టపడింది. తనలోని నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమాలు చేస్తూనే కథలకు కూడా కంగనా పెద్దపీట వేస్తుంటుంది. హీరోకు పోటీగా తన పాత్ర ఉండేలా చూసుకుంటోంది. ఈ విధంగా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకు కంగనా కేరాఫ్ అడ్రస్గా నిలుస్తోంది. ఆమె నటనకు మెచ్చి జాతీయ అవార్డులతో పాటు ఇతర అవార్డులు ఆమెను వరిస్తున్నాయి. మధుర్ భండార్కర్ దర్శకత్వంలో ‘ప్యాషన్’ సినిమాలో నటించగా కంగనాకు తొలిసారి జాతీయ ఉత్తమ సహాయ నటి అవార్డు లభించింది. అనంతరం ‘క్వీన్’ సినిమాతో ప్రేక్షకులందరినీ ఆకట్టుకున్న కంగనా జాతీయ ఉత్తమ నటి అవార్డు తొలిసారి సొంతం చేసుకుంది. ఆ తర్వాత ‘తను వెడ్స్ మను రిటర్న్స్’ సినిమాకు రెండోసారి జాతీయ ఉత్తమ నటిగా కంగనా నిలిచింది. ఇప్పుడు మణికర్ణిక, పాంగా సినిమాల్లో నటనకు గాను ఆమెకు మరోసారి భారత ప్రభుత్వం జాతీయ ఉత్తమ నటిగా గుర్తించి అవార్డు ప్రకటించింది. వీటితో కలిపి మూడుసార్లు ఉత్తమ నటిగా, ఒకసారి ఉత్తమ సహాయ నటిగా కంగనా అవార్డులు సొంతం చేసుకుంది. అవార్డు వచ్చిన సందర్భంగా ట్విటర్లో కంగనా స్పందించారు. తనను ఆదరిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. జాతీయ అవార్డులు 2008 ప్యాషన్ (సహాయ నటి) 2014 క్వీన్ 2015 తను వెడ్స్ మను రిటర్న్స్ 2021 మణికర్ణిక, పాంగా కంగనా సినిమాలతో పాటు దేశంలో జరిగే పరిణామాలపై తరచూ స్పందిస్తుంటింది. ఆమెపై రాజకీయ వివాదాలు కూడా ఉన్నాయి. భారత ప్రభుత్వం గతంలో పద్మశ్రీ కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. ఫిల్మ్ ఫేర్ అవార్డులు ఎన్నో సొంతం చేసుకోగా.. ఫోర్బ్స్ జాబితాలో టాప్ 100లో కంగనా చోటు సంపాదించుకుంది. చదవండి: జాతీయ అవార్డులు: దుమ్మురేపిన మహేశ్బాబు, నాని #NationalFilmAwards #NationalAwards2019 #Manikarnika #Panga pic.twitter.com/nNlF7YEa3E — Kangana Ranaut (@KanganaTeam) March 22, 2021 -
జాతీయ అవార్డులు: దుమ్మురేపిన మహేశ్బాబు, నాని
జాతీయ సినిమా అవార్డుల్లో తెలుగు పరిశ్రమకు చెందిన రెండు సినిమాలు సత్తా చాటాయి. తాజాగా ప్రకటించిన అవార్డుల్లో తెలుగు చిత్రసీమకు సంబంధించి మొత్తం ఐదు అవార్డులు వచ్చాయి. సూపర్ స్టార్ మహేశ్బాబు నటించిన ‘మహర్షి’కి మూడు అవార్డులు, న్యాచురల్ స్టార్ నాని సినిమా ‘జెర్సీ’కి రెండు అవార్డులు దక్కాయి. వంశీ పైడిపల్లి దర్శకత్వంతో మహేశ్బాబు నటించిన ‘మహర్షి’ ఉత్తమ వినోదాత్మక చిత్రంగా అవార్డు లభించింది. దీంతో పాటు ఈ సినిమాకు సంబంధించే ఉత్తమ కొరియోగ్రాఫర్గా రాజు సుందరం, ఉత్తమ నిర్మాణ సంస్థగా దిల్రాజుకు చెందిన శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ అవార్డులు పొందాయి. ఈ అవార్డు దక్కడంపై శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ హర్షం వ్యక్తం చేసింది. ఇక ఉత్తమ తెలుగు చిత్రంగా నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కించిన ‘జెర్సీ’ ఎంపికైంది. దీంతోపాటు ఉత్తమ ఎడిటర్గా నవీన్ నూలి జాతీయ అవార్డు దక్కించుకున్నారు. మొత్తం ఐదు అవార్డులు రావడంతో తెలుగు చిత్ర పరిశ్రమ హర్షం వ్యక్తం చేసింది. దీనిపై ఆయా చిత్రబృందాలు సంతోషంలో మునిగాయి. గతేడాది ‘మహానటి’ చిత్రానికి కీర్తి సురేశ్ ఉత్తమ నటిగా జాతీయ అవార్డు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. We are happy to share that a very special film #Maharshi has won the National Award for Best Film Providing Wholesome Entertainer. Thank you @urstrulyMahesh garu, @DirectorVamshi, @allarinaresh, @hegdepooja, @thisisdsp and the entire team for making this an unforgettable film ! pic.twitter.com/tKV1B9ojr6 — Sri Venkateswara Creations (@SVC_official) March 22, 2021 -
సినిమాల్లో హింసకు తావివ్వొద్దు
సాక్షి, న్యూఢిల్లీ: సినిమాల్లో అశ్లీలత, అసభ్యత, హింసకు తావివ్వరాదని, ప్రజలపై సినిమా చూపే ప్రభావాన్ని దర్శక నిర్మాతలు తెలుసుకోవాలని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చిత్రరంగానికి పిలుపునిచ్చారు. 66వ జాతీయ చలన చిత్ర పురస్కారాలను ఉపరాష్ట్రపతి సోమవారం ఇక్కడ ప్రదానం చేసి ప్రసంగించారు. ‘సినిమా శక్తిమంతమైన మాధ్యమం. సామాజిక మార్పునకు సాధనంగా వినియోగించాలి. ముఖ్యంగా యువత మనసుపై సినిమా ప్రభావం చూపుతుంది. అందువల్ల విలువలను పెంచేదిగా సినిమా ఉండాలి’ అని పేర్కొన్నారు. ‘మహిళలపై అత్యాచారం, హింస ప్రబలుతోంది. ఈ ధోరణిని ఎదుర్కోవడానికి సామాజిక సందేశం సినిమాల ద్వారా ప్రజలకు చేరాలి’ అని పిలుపునిచ్చారు. మన సినిమాలు భారతీయతను ప్రపంచానికి చాటి చెప్పా లని సందేశం ఇస్తూ అవార్డు గ్రహీతలను అభినందించారు. ఇతర సామాజిక అంశాల కేటగిరీలో ఉత్తమ చిత్రంగా ఎంపికైన హిందీ చిత్రం ‘ప్యాడ్మ్యాన్’కుగాను అక్షయ్కుమార్ అవార్డును స్వీకరించారు. అవార్డులు అందుకున్న తెలుగు సినీ ప్రముఖులు.. మహానటి చిత్రంలో అత్యుత్తమ అభినయానికి కీర్తి సురేష్ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు. ఈ అవార్డు కింద ఆమె రజత కమలం, రూ. 50 వేల నగదు అందుకున్నారు. ఉత్తమ తెలుగు చిత్రంగా ‘మహానటి’ ఎంపికైనందుకు ఆ చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ పురస్కారాన్ని అందుకున్నారు. రూ. లక్ష నగదు పురస్కారాన్ని ఈ అవార్డుతోపాటు అందుకున్నారు. ఉత్తమ స్క్రీన్ప్లే అవార్డుకు ‘చి.ల.సౌ’ చిత్రం ఎంపికైనందున చిత్ర దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రజత కమలం, రూ. 50 వేల పురస్కారం అందుకున్నారు. ఉత్తమ ఆడియోగ్రఫీ అవార్డు రంగస్థలం చిత్రానికిగాను ఎం.ఆర్.రాజాకృష్ణన్ అందుకున్నారు. ఈ అవార్డుతోపాటు ఆయన రజత కమలం, రూ. 50 వేల నగదు పురస్కారం అందుకున్నారు. ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ అవార్డును మహానటి చిత్రానికిగాను ఇంద్రాణీ పట్నాయక్, గౌరవ్షా, అర్చనా రావ్ అందుకున్నారు. ఈ పురస్కారంతోపాటు రజత కమలం, రూ. 50 వేల నగదు అందుకున్నారు. ‘అ’ చిత్ర మేకప్ ఆర్టిస్ట్ రంజిత్ ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ అవార్డు స్వీకరించారు. రజత కమలం, రూ. 50 వేల నగదు అందుకున్నారు. ‘అ’ చిత్రానికిగాను సృష్టి క్రియేటివ్ స్టూడియో, యునిఫై మీడియా స్పెషల్ ఎఫెక్ట్స్ అవార్డు అందుకున్నారు. ఈ పురస్కారం కింద రజత కమలం, రూ. 50 వేల నగదు అందుకున్నారు. -
జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం
-
ఢిల్లీలో 66వ జాతీయ అవార్డు ప్రదానోత్సవం
-
నేను రాలేకపోతున్నాను: బిగ్ బీ
బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఆనారోగ్య కారణంగా ‘జాతీయ అవార్డు’ల కార్యాక్రమానికి హాజరు కావడం లేదని తెలిపారు. కాగా కేంద్ర ప్రభుత్వం 2018గానూ అమితాబ్ బచ్చన్కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించిన విషయం తెలసిందే. ఈ అవార్డును ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అందించనున్నారు. అయితే జ్వరం కారణంగా ఈ అవార్డును అందుకోలేకపోతున్నట్లు అమితాబ్ ట్విటర్లో పేర్కొన్నారు. ‘ప్రస్తుతం నేను జ్వరంతో బాధపడుతున్నాను. అస్వస్థతగా కారణంగా వైద్యులు ప్రయాణం చేయకూడదని సలహా ఇచ్చారు. అందువల్ల నేను సోమవారం ఢిల్లీలో జరిగే అవార్డుల కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నాను. దీనికి నేను చింతిస్తున్నాను’ అంటూ బిగ్ బీ ట్విట్ చేశారు. కాగా గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుత్ను అమితాబ్ చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఇక అక్టోబర్లో ఆసుపత్రి నుంచి వచ్చిన ఆయన దాదాపు 5 కిలోల బరువు తగ్గినట్లు తన ట్విటర్ రాసుకొచ్చారు. ‘గత కొన్ని రోజుల నుంచి నేను క్రమంగా బరువును కోల్పోతున్నాను. డాక్టర్లు నాకు ముందే చెప్పారు నేను బరువు తగ్గడం జరుగుతుందని. ఇలా బరువు తగ్గడం నాకు అద్బుతంగా ఉంది’ అంటూ అభిమానులతో ట్విటర్ వేదికగా ఆయన పంచుకున్నారు.‘చెహ్రే’లో నటించిన బిగ్ బీ నవంబర్లో గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 50వ ఎడిషన్ ప్రారంభోత్సవానికి హజరయ్యారు. -
అవార్డు విన్నర్లకు సీఎం జగన్ అభినందనలు
సాక్షి, అమరావతి : 66వ జాతీయ చలనచిత్ర అవార్డులను శుక్రవారం ప్రకటించారు. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ‘మహానటి’, ‘రంగస్థలం’, ‘అ!’, ‘చిలసౌ’ చిత్రాలకు పలు అవార్డులు దక్కాయి. తెలుగు నుంచి ఉత్తమ చిత్రంగా మహానటి ఎంపికైంది. ఉత్తమ నటిగా కీర్తి సురేష్, ఉత్తమ కాస్ట్యూమ్స్ డిజైనర్ విభాగంలోనూ మహానటి ఖాతాలో అవార్డులు చేరాయి. ఈ నేపథ్యంలో పురస్కారాలకు ఎంపికైన తెలుగు సినిమా నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. తెలుగు సినిమా మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని సీఎం ఆకాక్షించారు. (చదవండి : తెలుగు సినిమాలకు జాతీయ అవార్డుల పంట) -
మెగాస్టార్ చెప్పినట్టే జరిగింది!
న్యూఢిల్లీ : ప్రతిష్టాత్మక 66వ జాతీయ చలన చిత్ర అవార్డులను ఢిల్లీలో శుక్రవారం ప్రకటించారు. 2018లో దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లోని చిత్రాలను పరిగణనలోకి తీసుకుని అవార్డు విజేతలను ప్రకటించారు. కాగా, ఈసారి జాతీయ పురస్కారాల్లో తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ‘మహానటి’, ‘రంగస్థలం’, ‘అ!’, ‘చిలసౌ’ చిత్రాలకు అవార్డులు దక్కాయి. తెలుగు నుంచి ఉత్తమ చిత్రంగా మహానటి ఎంపికైంది. ఉత్తమ నటిగా కీర్తి సురేష్, ఉత్తమ కాస్ట్యూమ్స్ డిజైనర్ విభాగంలోనూ మహానటి ఖాతాలో అవార్డులు చేరాయి. (చదవండి : తెలుగు సినిమాలకు జాతీయ అవార్డుల పంట) ఇక నాన్ బాహుబలి రికార్డులను తిరగరాసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన `రంగస్థలం` బెస్ట్ సౌండ్ మిక్సింగ్ విభాగం నుంచి అవార్డుకు ఎంపికైంది. బెస్ట్ ఒరిజినల్ స్ర్కీన్ ప్లే నుంచి చిలసౌ కు, ఉత్తమ మేకప్, విభాగంలో, ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో ‘అ..!` చిత్రానికి అవార్డులు దక్కాయి. లోక్సభ ఎన్నికల కారణంగా ఈ ఏడాది పురస్కారాలను ఆలస్యంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి అవార్డులు పొందిన వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. `మహానటి`, `రంగస్థలం` చిత్రాలకు జాతీయ అవార్డలు వస్తాయని ఆయన రిలీజ్ కు ముందుగానే చెప్పిన సంగతి తెలిసిందే. మహానటి రిలీజ్ అనంతరం చిరంజీవి యూనిట్ సభ్యులను ఇంటికి పిలిపించి ఘనంగా సన్మానించిన సంగతి విదితమే. ఆయన చెప్పినట్టు ఆయా చిత్రాలకు అవార్డులు రావడంతో సంతోషం వ్యక్తం చేశారు. తనయుడు రామ్ చరణ్ నటించిన `రంగస్థలం`కు జాతీయ అవార్డు రావడం. అలాగే ఇతర భాషల నుంచి అవార్డులకు ఎంపికైన వారందరికీ మెగాస్టార్ అభినందనలు తెలిపారు. -
'ఈ అవార్డులు మా బాధ్యతను పెంచాయి'
వాల్ పోస్టర్ సినిమా పతాకంపై ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కాజల్ అగర్వాల్, నిత్యామీనన్, రెజీనా కసండ్ర, ఈషా రెబ్బా, ప్రియదర్శి, శ్రీనివాస అవసరాల, మురళీ శర్మ తదితరులు ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం `అ!`. హీరో నాని, ప్రశాంతి తిపిర్నేని ఈ చిత్రాన్ని నిర్మించారు. గత ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని దక్కించుకోవడమే కాదు.. విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 66 జాతీయ అవార్డుల్లో `అ!` చిత్రం మేకప్, వి.ఎఫ్.ఎక్స్ విభాగాల్లో ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా..నిర్మాత నాని మాట్లాడుతూ ``కొత్త టాలెంట్ను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో మా వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ను స్టార్ట్ చేశాం. తొలి ప్రయత్నంలో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సరికొత్త కథాంశంతో `అ!` సినిమాను రూపొందించాం. సినిమా మంచి విజయాన్ని సాధించడమే కాదు.. ప్రశంసలను కూడా అందుకుంది. ఇప్పుడు మేకప్, వి.ఎఫ్.ఎక్స్ విభాగాల్లో జాతీయ అవార్డులు రావడం మాకెంతో ఉత్సాహానిచ్చింది. నిర్మాతగా మా బాధ్యతను మరింత పెంచింది. మా ఎంటైర్ యూనిట్ తరపున జ్యూరీకి థ్యాంక్స్`` అన్నారు. -
‘మహానటి’కి జాతీయ అవార్డులు
న్యూఢిల్లీ: సావిత్రి జీవితకథ ఆధారంగా తెరకెక్కించిన ‘మహానటి’ సినిమాకు జాతీయ పురస్కారం లభించింది. ఈ సినిమాలో ప్రధానపాత్ర పోషించిన కీర్తి సురేశ్ ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. ఉత్తమ తెలుగు సినిమాగా ‘మహానటి’ ఎంపికైంది. 66వ జాతీయ చలనచిత్ర అవార్డులను శుక్రవారం ప్రకటించారు. లోక్సభ ఎన్నికల కారణంగా ఈ ఏడాది పురస్కారాలను ఆలస్యంగా ప్రకటించారు. ఉతమ నటుడు అవార్డును ఆయుష్మాన్ ఖురానా, నిక్కీ కౌశల్లకు సంయుక్తంగా ప్రకటించారు. సాంకేతిక విభాగాల్లో ఈసారి తెలుగు సినిమాలకు ఎక్కువ పురస్కారాలు లభించాయి. హిందీలో ఉత్తమ చిత్రంగా అంధాధున్ ఎంపికైంది. పద్మావత్ చిత్రానికి సంగీతం అందించిన దర్శకుడు సంజయ్లీలా భన్సాలీ ఉత్తమ సంగీత దర్శకుడి అవార్డు దక్కించుకున్నారు. జాతీయ పురస్కారాలు ఉత్తమ నటుడు: ఆయుష్మాన్ ఖురానా ఉత్తమ నటి: కీర్తి సురేశ్ (మహానటి) ఉత్తమ దర్శకుడు: ఆదిత్య ధర్(ఉడి) బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్: మహానటి బెస్ట్ మేకప్, విజువల్ ఎఫెక్ట్: అ! ఒరిజినల్ స్క్రీన్ ప్లే: చి.ల.సౌ ఉత్తమ ఆడియోగ్రఫీ: రంగస్థలం ఉత్తమ తమిళ చిత్రం: బారమ్ ఉత్తమ కన్నడ సినిమా: నాతిచరామి ఉత్తమ యాక్షన్ సినిమా: కేజీఎఫ్ ఉత్తమ సినిమాటోగ్రఫీ: పద్మావత్ ఉత్తమ ఉర్దూ చిత్రం: హమీద్ ఫిల్మ్ ఫ్రెండ్లీ స్టేట్: ఉత్తరాఖండ్ జాతీయ ఉత్తమ హిందీ సినిమా: అంధాధున్ ప్రజాదరణ పొందిన సినిమా: బదాయిహో (హిందీ) ఉత్తమ సామాజిక చిత్రం: ప్యాడ్మాన్ (హిందీ) ఉత్తమ సహాయనటి: సురేఖ సిక్రీ(బదాయిహో) ఉత్తమ సహాయ నటుడు: స్వానంద్ కిర్కిరే (చంబక్) ఉత్తమ గాయకుడు: అరిజిత్ సింగ్(పద్మావత్) ఉత్తమ గాయని: బిందు మాలిని (నాతిచరామి) ఉత్తమ సాహిత్యం: నాతిచరామి (కన్నడ) బెస్ట్ ఎడిటింగ్: నాతిచరామి (కన్నడ) బెస్ట్ డైలాగ్స్: తరీఖ్ బెస్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్: ఉడి (హిందీ) ఉత్తమ బాల నటులు: పీవీ రోహిత్ (కన్నడ), సందీప్ సింగ్(పంజాబీ), తల్హా అర్షాద్(ఉర్దూ), శ్రీనివాస్ పొకాలే(మరాఠి) ఉత్తమ బాలల చిత్రం: సర్కారీ హిరియా ప్రాథమిక శాల, కాశరగోడు(కన్నడ) ఉత్తమ సినీ విమర్శకులు: బ్లాసే జానీ(మలయాళం), అనంత్ విజయ్(హిందీ) -
పదేళ్ల క్రితం వచ్చిన ఆలోచన ఇది
‘‘కళాకారులకు జాతీయ స్థాయిలో ఫిల్మ్ అవార్డులు ఇవ్వాలని పదేళ్ల కిత్రం నాకో ఆలోచన వచ్చింది. అదీ ప్రజాభిప్రాయం తెలుసుకుని ఇవ్వాలని. ప్రజాభిప్రాయ సేకరణకు టీవీ చానల్ ఉంటే బాగుంటుందని టీ వీ9తో కలిసి ‘టీఎస్ఆర్ టీవీ9 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్’ని స్థాపించా’’ అని కళాబంధు, ‘టీఎస్ఆర్ టీవీ9 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్’ చైర్మన్ టి.సుబ్బరామి రెడ్డి అన్నారు. 2017, 2018 సంవత్సరాలకు ‘టీఎస్ఆర్ టీవీ9 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్’కి ఎంపికైన వారి వివరాలను గురువారం సుబ్బరామిరెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘ఈ అవార్డ్స్ ఫంక్షన్ని ఈ నెల 17న విశాఖపట్నంలోని పోర్ట్ స్టేడియంలో నిర్వహిస్తున్నాం. తెలుగు, హిందీ, పంజాబీ, భోజ్పురి, తమిళ్, కన్నడ, మలయాళం.. ఇలా భారతదేశంలోని అన్ని భాషల నటీనటులకు అవార్డులు ఇస్తున్నాం. ఈ అవార్డుల జ్యూరీ మెంబర్లుగా నగ్మా, జీవితా రాజశేఖర్, మీనా, పరుచూరి గోపాలకృష్ణ, కేఎస్ రామారావు, నరేశ్, రఘు రామకృష్ణంరాజు, పింకీ రెడ్డి, శోభన కామినేని వ్యవహరించారు. వేలాది మంది ప్రజలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. అన్ని భాషల నుంచి దాదాపు 60మంది ఫిల్మ్ స్టార్స్ అవార్డులు తీసుకోనున్నారు’’ అన్నారు. జీవిత సాఫల్య పురస్కారానికి ఎంపికైన నటి నగ్మా మాట్లాడుతూ –‘‘నా లైఫ్ ఇంకా చాలా ఉంది.. ఇంకా చాలా సినిమాలు చేయాలి. అప్పుడే మీరు (సుబ్బరామిరెడ్డి) లైఫ్టైమ్ ఎచీవ్మెంట్ అవార్డు ప్రకటించారు (నవ్వుతూ). ఈ అవార్డుతో పాటు సామాజిక సేవ చేసినందుకు మార్చిలో ‘రాజీవ్గాంధీ’ అవార్డుకూడా అందుకోబోతున్నా. తెలుగులో నా సినీ ప్రయాణం ఇంకా కొనసాగాలి’’ అన్నారు. పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ– ‘‘అందరికంటే కష్టమైన పని ఏంటంటే జ్యూరీ సభ్యునిగా ఉండటం. నక్షత్రాల్లో చంద్రుడ్ని చూపించి ఇందులో ఎవరు పెద్ద, గొప్ప అంటే చంద్రుడ్ని చూపిస్తాం. అందరి చంద్రుల్ని చూపించి ఇందులో ఏ చంద్రుడు గొప్ప అంటే ఏం చెబుతాం? అలా ఈ హీరోలు, హీరోయిన్లందరూ చందమామలే. మా అదృష్టం ఏంటంటే కొన్ని వేలమంది చక్కగా ఓటింగ్లో పాల్గొన్నారు. మేం రెండు మూడుసార్లు చర్చించుకుని ఫైనల్ లిస్ట్ తయారు చేశాం. వర్షం పడితే రైతుకు ఆనందం. కళాకారుల ముఖం ఆనందంతో తడిస్తే మా సుబ్బరామిరెడ్డిగారికి ఆనందం. మహాభారతంలో ధర్మరాజును అజాతశత్రువు అంటారు. ఈ భారతదేశంలో నాకు సజీవంగా కనిపిస్తున్న ఏకైక అజాత శత్రువు సుబ్బరామిరెడ్డిగారు’’ అన్నారు. జ్యూరీ సభ్యులు శోభన కామినేని, రఘురామ కృష్ణంరాజు పాల్గొన్నారు. -
సారీ.. నిన్ను ఓడిపోయేలా చేశాను
గతేడాది రిలీజైన ‘కేరాఫ్ కంచరపాలెం’ ఆడియన్స్కు ఎంతగా నచ్చిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. 2018లో వచ్చిన ఉత్తమ చిత్రమంటూ పొగడ్తల వర్షాలు కురిపించారు. రానా సమర్పించిన ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు మహా వెంకటేశ్ డైరెక్ట్ చేయగా, తెలుగు మూలాలున్న అమెరికన్ డాక్టర్ పరుచూరి ప్రవీణ నిర్మించారు. ఈ ఏడాది నేషనల్ అవార్డ్స్ లిస్ట్లో ‘కేరాఫ్ కంచరపాలెం’ సెలెక్ట్ కాలేదు. కారణం నిర్మాత అమెరికన్ కావడమే. ఈ విషయాన్ని ట్వీటర్లో పేరొన్నారు ప్రవీణా పరుచూరి. ‘‘సారీ వెంకటేశ్ మహా. కేవలం నా వల్ల నీ కష్టాన్ని, శ్రమని నేషనల్ అవార్డ్ వాళ్లు అనర్హంగా భావించారు. నా వల్లే నువ్వోడిపోయావ్. నేనే నిన్ను ఓడిపోయేలా చేశాను’’ అని తన బాధను వ్యక్తపరిచారు. దీనికి దర్శకుడు వెంకటేశ్ మహా సమాధానమిస్తూ – ‘‘అది మీ తప్పు కాదు. ఇంకా ఆ పాత రూల్స్తోనే నడుస్తున్న మన దేశానిది. ఒక ఇండియన్ డైరెక్టర్, ఇండియన్ యాక్టర్స్తో ఇండియా వాళ్ల కోసం తీసిన సినిమా ఇండియన్ నేషనల్ అవార్డ్స్కు అర్హత సాధించకపోవడమేంటో నాకు అర్థం కావడం లేదు. మార్పుకు సమయం ఆసన్నమైంది’’ అని పేర్కొన్నారు. -
డబ్బు వాపసు చేస్తేనే నిజమైన నిరసన
ఇటీవల నేషనల్ అవార్డ్స్లో రాష్ట్రపతి పరిమిత సమయం కారణంగా అందరికీ అవార్డ్స్ ప్రదానం చేయరని తెలిసి పలువురు విజేతలు నేషనల్ అవార్డ్స్ను బాయ్కాట్ చేసిన సంగతి తెలిసిందే. అవార్డ్ ఫంక్షన్ బాయ్కాట్ చేసినవాళ్లను ఉద్దేశిస్తూ.. 2018 నేషనల్ అవార్డ్ అందుకున్న మలయాళ దర్శకుడు జయరాజ్ మాట్లాడుతూ– ‘‘కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి స్మృతీ ఇరానీ చేతుల మీదగా అవార్డ్ అందుకోవటం మాకు ఇష్టం లేదు అని బాయ్కాట్ చేసిన నిరసనకారులంతా కేవలం అవార్డ్ ఫంక్షన్ని బాయ్కాట్ చేయడమే కాదు నేషనల్ అవార్డ్తో పాటుగా మీకు అందే క్యాష్ ప్రైజ్ను కూడా తిరిగి ఇవ్వాలి. అదే నిజమైన నిరసన’’ అన్నారు. పాయింటే కదా. -
సెల్ఫీ కాదు సెల్ఫిష్
స్మార్ట్ ఫోన్ యుగంలో అందరికీ ఫాస్ట్గా కనెక్ట్ అయిన ట్రెండ్ సెల్ఫీ. ఇదివరకు సెలబ్రిటీలు కనిపిస్తే ఆటోగ్రాఫ్లు అడిగేవారు. ఇప్పుడంతా సెల్ఫీమయం. కానీ స్టార్ సింగర్ ఏసుదాస్కి ఈ సెల్ఫీ ట్రెండ్ నచ్చినట్టు లేదు. అందుకేనేమో ‘సెల్ఫీ కాదు సెల్ఫిష్’ అన్నారాయన. ఇటీవల నేషనల్ అవార్డ్ అందుకోవడానికి ఢిల్లీ వెళ్లారు ఏసుదాస్. ఆయన కనపడటంతో మీడియా, అభిమానులు చుట్టుముట్టారు. ఆ సమయంలో ఓ అభిమాని తన ఫేవరెట్ సింగర్తో ఓ సెల్ఫీ తీసుకుందాం అనుకుని సెల్ఫీ తీసుకున్నాడు. వెంటనే ఏసుదాస్ ఆ సెల్ఫీ తీసుకున్న అభిమానిని ఫొటో డిలిట్ చేయమని అడిగారు. అతని చేతిలో ఉన్న ఫోన్ లాక్కుని ఆ ఫొటో డిలిట్ చేస్తూ ‘ఇది సెల్ఫీ కాదు సెల్ఫిష్’ అన్నారు. దీన్నిబట్టి ఏసుదాస్కి సెల్ఫీ అంటే ఏమాత్రం ఇష్టం లేదని అర్థం చేసుకోవచ్చు. -
కోవింద్ మంచి వ్యక్తే, కానీ...
సాక్షి, ముంబై: నేషనల్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం పెట్టిన చిచ్చు ఇప్పట్లో ఆరేలా కనిపించటం లేదు. విజేతలందరికీ రాష్ట్రపతి అవార్డులు ఇవ్వకపోవటంపై యావత్ సినీ పరిశ్రమ అసంతృప్తితో ఉంది. విషయం ముందుగా తెలియటంతో సుమారు 60 మంది విజేతలు కార్యక్రమాన్ని బహిష్కరించిన విషయం తెలిసిందే. ఇక ఈ వ్యవహారంపై వెటరన్ నటుడు, బీజేపీ సీనియర్ నేత శతృఘ్నసిన్హా తనదైన శైలిలో స్పందించారు. శుక్రవారం ఓ జాతీయ మీడియాతో ఆయన మాట్లాడుతూ... ‘రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నాకు వ్యక్తిగతంగా కూడా తెలుసు. గతంలో ఆయన బిహార్ గవర్నర్గా పని చేసిన సమయంలో చాలా దగ్గరగా చూశాను. ఆయన చాలా మంచి వ్యక్తి. కానీ, ఇలా జరగాల్సింది కాదు. ఎక్కడో పొరపాటు జరగటంతో కొందరి మనోభావాలు దెబ్బతిన్నాయి. కానీ, ఇలా జరగాల్సింది కాదు. నటులు అంటే దేశ గౌరవానికి ప్రతీకలు. అలాంటి వారిని అవమానించటం మంచి పద్ధతి కాదు’ అని సిన్హా తెలిపారు. ‘రాష్ట్రపతి చేతుల మీదుగా ఇవ్వాల్సిన అవార్డులను వేరే ఎవరో ఇవ్వటం సరైంది కాదు. అలాగని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని నేను తక్కువ చేయడం లేదు(మిగతా అవార్డులు ఆమె ప్రదానం చేశారు). ఆమె మంచి నేత. కానీ, ఈ అవార్డులను ఆమె ఇవ్వటాన్ని నేను అంగీకరించను. భోజనానికి పిలిచి ఒకరికి ఒకరకమైన భోజనాన్ని.. మరొకరికి ఒకరకమైన భోజనాన్ని పెడితే ఎలా ఉంటుంది? ఈ వ్యవహారం కూడా అలాగే ఉంది. గతంలో రాష్ట్రపతులంతా చాలా ఓపికగా అవార్డులను ఇచ్చారు. మహిళ అయి ఉండి కూడా ప్రతిభా పాటిల్ మినహాయింపు తీసుకోలేదు. కానీ, కోవింద్ మాత్రం ఎందుకు ఆ సంప్రదాయాన్ని పాటించలేదో అర్థం కావట్లేద’ని శతృఘ్నసిన్హా ఆక్షేపించారు. ఇదిలా ఉంటే జరిగిన పరిణామాలపై రాష్ట్రపతి కార్యాలయం అసంతృప్తి వ్యక్తం చేసింది. మార్చి నెల నుంచే తాము ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి(సాంకేతిక మరియు సమాచార మంత్రిత్వ శాఖ) సమాచారం అందిస్తూ వస్తున్నామని, అయిన విషయాన్ని గోప్యంగా ఉంచి చివరి నిమిషంలో వెల్లడించటంతో ఈ వివాదం చెలరేగిందని పేర్కొంటూ ఓ లేఖను రాష్ట్రపతి కార్యాలయం కేంద్రానికి రాసింది. -
తల్లి చీరలో జాన్వీ కపూర్
రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్నవారిలో దివంగత నటి శ్రీదేవి కుటుంబం ఉంది. ‘మామ్’ చిత్రానికి ఉత్తమ నటిగా శ్రీదేవిని జాతీయ అవార్డుకి ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ అవార్డును అందుకోవడానికి శ్రీదేవి భర్త బోనీకపూర్, ఆమె కూమార్తెలు జాన్వీ అండ్ ఖుషీ ఢిల్లీ వెళ్లారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. ‘‘ఇది మేం గర్వపడాల్సిన సమయం. ఈ మంచి క్షణాల్లో శ్రీదేవి బతికి ఉంటే చాలా సంతోషపడేవారు. సినిమాలో ఆమె పడిన కష్టానికి ఫలితం దక్కింది’’ అన్నారు బోనీ కపూర్. జాన్వీ పట్టు చీర కట్టుకుని వెళ్లారు. తాను కట్టుకున్న చీర తల్లిదేనని ఆమె పేర్కొన్నారు. -
అవార్డు అందుకున్న శ్రీదేవి కుటుంబం
న్యూఢిల్లీ: గతేడాది విజయవంతమైన మామ్ చిత్రంలోని నటనకు గానూ శ్రీదేవికి జాతీయ ఉత్తమ నటి అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డును శ్రీదేవి కుటుంబ సభ్యులు బోనీ కపూర్, జాన్వీ, ఖుషీలు అందుకున్నారు. గురువారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. 65వ జాతీయ చలనచిత్రోత్సవం అవార్డులను ఏప్రిల్ 13న ప్రకటించిన విషయం విదితమే. ముందుగానే నిర్ణయించిన షెడ్యుల్ కారణంగా... రామ్నాథ్ కోవింద్ ఈ కార్యక్రమం మధ్యలోనే వెళ్లిపోయారు. రాష్ట్రపతి చేతుల మీదుగా ఏఆర్ రెహ్మాన్ ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డు అందుకున్నారు. ప్రతి ఏడాది రాష్ట్రపతి చేతుల మీదుగానే అవార్డుల ప్రధానోత్సవం జరుగుతుంది. అయితే దీనికి భిన్నంగా రాష్ట్రపతి కోవింద్ మాత్రం గంట సమయాన్నే వెచ్చించారు. మిగతా అవార్డులను సంబంధింత మంత్రిత్వ శాఖ మంత్రి స్మృతీ ఇరానీ ప్రదానం చేస్తారని తెలిపారు. దీంతో కార్యక్రమానికి వచ్చిన అవార్డు గ్రహీతలు కంగుతిన్నారు. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు ప్రదానం చేస్తారు కాబట్టే వీటికి అంత ప్రాముఖ్యం ఉంటుంది. అలాంటిది రాష్ట్రపతి కార్యక్రమంలో మధ్యలోనే వెళ్లిపోవడంతో అవార్డు గ్రహీతలు నిరసన వ్యక్తం చేశారు. కేవలం 11 మందికి మాత్రమే రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు ప్రదానం జరిగింది. -
రాష్ట్రపతి కోవింద్ నిర్ణయం.. తీవ్ర దుమారం
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్(72) తీసుకున్న ఓ నిర్ణయం వివాదాస్పదంగా మారింది. 65వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రధానం వేడుక గురువారం సాయంత్రం విజ్ఞాన్ భవన్లో జరగనుంది. రాష్ట్రపతి చేతుల మీదుగా విజేతలందరూ అవార్డులను స్వీకరించాల్సి ఉంటుంది. అయితే ఈ కార్యక్రమానికి కోవింద్ గంట మాత్రమే అపాయింట్మెంట్ మాత్రమే ఇవ్వటంపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలో కొందరు విజేతలు తాము ఈ కార్యక్రమాన్ని బహిష్కరించటం దుమారం రేపింది. ఈ ఏడాది మొత్తం 140 మంది అవార్డులు గెలుచుకున్న విషయం తెలిసిందే. ‘రాష్ట్రపతి గంట మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొంటారని, కేటాయించిన సమయంలో 11 అవార్డులు మాత్రమే అందిస్తారని, మిగిలిన అవార్డులను కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అందిస్తారని’ రాష్ట్రపతి కార్యాలయం.. నిర్వాహకులకు తెలిపింది. ఈ నిర్ణయంపై విజేతల్లో చాలా మంది అభ్యంతరం తెలిపారు. గతేడాది జరిగిన కార్యక్రమంలో ప్రణబ్ ముఖర్జీ(82) ఎంతో ఓపికగా విజేతలకు అవార్డులను అందజేశారని.. అలాంటిది ఇప్పుడు కోవింద్కు వచ్చిన అభ్యంతరం ఏంటని కొందరు నిర్వాహకులను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అవార్డుల వేడుకను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. అలాగని తాము అవార్డులను అగౌరవపరచటం లేదని వారు చెప్పినట్లు సమాచారం. ఈ వ్యవహారం ఇప్పుడు మీడియాలో చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఏడాది నుంచి రాష్ట్రపతి కేవలం ఒకే ఒక్క అవార్డు మాత్రమే బహుకరిస్తారని, మిగతావి మంత్రులతో ప్రధానం చేయించాలని రాష్ట్రపతి కార్యాలయం ఓ ప్రకటనలో కేంద్రానికి తెలియజేసింది. ఏప్రిల్ 13న ప్రకటించిన 65వ జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. మరణానంతరం దిగ్గజ నటుడు వినోద్ ఖన్నాకు దాదాసాహెచ్ పాల్కే అవార్డును.. నటి శ్రీదేవికి ఉత్తమ నటిగా మామ్ చిత్రానికి అవార్డులను ప్రకటించారు. -
పాపులార్టీకి.. ప్రయోగానికి పట్టం
తెలుగు చిత్రసీమ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన చిత్రం ‘బాహుబలి’. 63వ జాతీయ అవార్డుల్లో ‘బెస్ట్ ఫీచర్ ఫిల్మ్’, ‘స్పెషల్ ఎఫెక్ట్స్’ విభాగంలో అవార్డులు దక్కించుకుంది. 65వ జాతీయ అవార్డుల్లో ‘బాహుబలి–2’ మూడు అవార్డులను సొంతం చేసుకుంది. ‘బెస్ట్ పాపులర్ ఫిల్మ్’గా జాతీయ అవార్డు దక్కించింది. అంతేకాదు.. బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్కి, బెస్ట్ యాక్షన్ డైరెక్షన్కి కూడా జాతీయ అవార్డులు దక్కాయి. మరో తెలుగు సినిమా ‘ఘాజీ’ ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డుకి ఎంపికైంది. దర్శకుడు సంకల్ప్ రెడ్డికి ఇది తొలి చిత్రం కావడం విశేషం. ఇక.. ఇతర భాషల విషయానికొస్తే అస్సామీ ఫిల్మ్ ‘విలేజ్ రాక్స్టార్స్’ ‘బెస్ట్ ఫీచర్ ఫిల్మ్’ అవార్డు దక్కించుకుంది. దివంగత నటుడు వినోద్ ఖన్నాకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించారు. ఇతర అవార్డు విజేతల వివరాలు, అవార్డు దక్కించుకున్న పలువురి ప్రముఖుల స్పందన ఈ విధంగా... విలేజ్ రాక్స్టార్స్ 65వ జాతీయ అవార్డులు అస్సామ్వారికి చాలా ప్రత్యేకం. ఎందుకంటే గడచిన 29 ఏళ్లల్లో అస్సామ్కి జాతీయ అవార్డు అందని ద్రాక్షే అయింది. ఈసారి ఏకంగా ‘ఉత్తమ జాతీయ చిత్రం’ అవార్డుని దక్కించుకుంది ఓ అస్సామీ ఫిల్మ్. పేరు ‘విలేజ్ రాక్స్టార్స్’. కథ చాలా చిన్నది. ‘జెన్యూన్ మూవీ’. అందుకే అవార్డు దక్కించుకుంది. 29 ఏళ్ల నుంచి నేషనల్ అవార్డు లేని లోటుని తీర్చిన సినిమా ‘విలేజ్ రాక్స్టార్స్. చివరిగా ఒక అస్సామీ సినిమా నేషనల్ అవార్డ్ అందుకున్నది 1987లో. జానూ బరువా తెరకెక్కించిన ‘హలోదియా చొరయా బావోధాన్ కాయ్’కు అప్పట్లో అవార్డు దక్కింది.అది కూడా ప్రాంతీయ చిత్రం విభాగంలో. 29 ఏళ్ల తర్వాత ఏకంగా బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డు దక్కడం విశేషం. ‘విలేజ్ రాక్స్టార్స్’ దర్శకురాలు ‘రిమా దాస్’ సెల్ఫ్మేడ్ ఫిల్మ్ మేకర్. ఈ చిత్రాన్ని గౌహతిలోని తన స్వగ్రామం చాయగన్లోనే కేవలం హ్యాండీ కెమెరాతో దాదాపు 150 రోజులు తెరకెక్కించడం విశేషం. సినిమా కథ చాలా సింపుల్ లైన్స్లో ఉంటుంది. దును అనే చిన్నారి చయాగాన్ గ్రామంలో తన తల్లి, తమ్ముడుతో కలిసి ఉంటుంది. సంతలో అమ్మకు స్నాక్స్ అమ్మే పనిలో సాయంగా ఉంటుంది. ఒకసారి గ్రామంలో జరిగిన బ్యాండ్ పర్ఫార్మెన్స్ చూసి మంత్రముగ్ధురాలైన దును ఎలా అయినా గిటార్ కొనుక్కోవాలనుకుంటుంది. అట్లీస్ట్ సెకండ్ హ్యాండ్దైనా ఫర్వాలేదనుకుంటుంది. కామిక్స్ బుక్ చదివి తను కూడా ఓ బ్యాండ్ ఏర్పాటు చేయాలనుకుంటుంది. రూపాయి రూపాయి పోగేసుకుంటుంది. ఇంతలో వరదలు వారి పంటను నాశానం చేస్తాయి. అప్పుడు దునుకి తన ప్రియారిటీ ఏంటో చూస్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తెలివిగా దును ఏం చేసిందనేదే సినిమా కథ. దునుగా ప్లే చేసిన బనితా దాస్ ‘బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్’గా అవార్డు పొందింది. ఈ విలేజ్ రాక్స్టార్స్, మొత్తం దేశాన్నే తమ గ్రామం వైపు తిరిగేలా చేసింది. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలోనే కాకుండా ఎడిటింగ్, సౌండ్ రికార్డింగ్, బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ విభాగాల్లో కూడా అవార్డు గెలుచుకోవడం విశేషం. 65వ జాతీయ అవార్డుల ఎంపికలో బెస్ట్ పాపులర్ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ విభాగంలో మా ‘బాహుబలి 2’ సెలెక్ట్ అయినందుకు టీమ్ అందరికీ శుభాకాంక్షలు. అలాగే మా టీమ్ వర్క్ని గుర్తించి ఇదే చిత్రానికి యాక్షన్, విజువల్ ఎఫెక్ట్స్ విభాగాల్లో అవార్డులు ప్రకటించినందుకు కమిటీకి ధన్యవాదాలు. బెస్ట్ రీజినల్ తెలుగు ఫిల్మ్గా సెలెక్ట్ అయిన ‘ఘాజీ’ చిత్రబృందానికి శుభాకాంక్షలు. – రాజమౌళి టీమ్ వర్క్ని గుర్తించి ‘బాహుబలి–2’ చిత్రానికి బెస్ట్ పాపులర్ ఫిల్మ్, బెస్ట్ యాక్షన్ అండ్ స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగాల్లో అవార్డులకు ఎంపిక చేసిన జ్యూరీ మెంబర్స్కు కృతజ్ఞతలు. తెలుగులో ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డు సొంతం చేసుకున్న ‘ఘాజీ’ చిత్రబృందం రానా, సంకల్ప్రెడ్డి తదితరులకు శుభాకాంక్షలు. జాతీయ అవార్డులు గెలుచుకున్న అందరికీ... ముఖ్యంగా అస్సామీ చిత్రం ‘విలేజ్ రాక్స్టార్స్’కి శుభాకాంక్షలు. – ‘బాహుబలి’ నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ శ్రీదేవిగారు అందరికీ ఓ తీయని జ్ఞాపకం – రవి ఉడ్యవర్ ► ‘మామ్’ సినిమాకు బెస్ట్ యాక్ట్రెస్గా శ్రీదేవికి అవార్డు రావాటం డైరెక్టర్గా మీకెలా అనిపిస్తోంది? మిక్స్ ఫీలింగ్స్. నా ఫస్ట్ సినిమాకే శ్రీదేవిగారికి నేషనల్ అవార్డు రావడం చాలా హ్యాపీ. ఇప్పుడు ఆ హ్యాపీనెస్ని సెలెబ్రేట్ చేసుకోవటానికి ఆమె మన మధ్య లేరని బాధగా ఉంది. ఆమె కూడా మనతో ఉండి ఈ అవార్డును సెలబ్రేట్ చేసుకుంటే బావుండు అనే చిన్న బాధ లోపల ఉంది. ఆమె ఫిజికల్గా మనతో లేకపోయినా మన మదిలో ఎప్పుడూ ఓ తీయని జ్ఞాపకంలా ఉంటారు. ► మామ్ మీకు ఫస్ట్ మూవీ, శ్రీదేవిగారికి 300వ సినిమా? ఆమె ఈ కథను అంగీకరిస్తారని అనుకున్నారా? ఈ కథ సిద్ధం చేసుకున్నాక బోనీగారు ఒకసారి శ్రీకి కలిసి చెప్పు అన్నారు. కొంచెం భయంగానే ఉన్నా శ్రీదేవి గారు వద్దూ అనకూడదు అనేలాగా స్క్రిప్ట్ తీసుకువెళ్లాను. న్యారేషన్ అయ్యాక శ్రీదేవిగారు చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. ఇది ఛాలెంజింగ్ ఫిల్మ్, నేను చేస్తున్నాను అన్నారు. నా బెస్ట్ మూమెంట్స్లో అదొకటి. ► ఏదైనా సీన్లో శ్రీదేవిగారు కచ్చితంగా రెండు మూడు రీటేక్స్ తీసుకుంటారని మీరు అనుకొని ఆమె సింగిల్ టేక్లో చేసిన సీన్స్ ఉన్నాయా? సినిమాలో ఒక హాస్పిటల్ సన్నివేశం ఉంటుంది. చాలా ఎమోషనల్ సీన్ అది. ఆ సీన్కు రెండు మూడు టేక్స్ తీసుకుంటారనుకున్నాను. జస్ట్ సింగిల్ టేక్లో చేసేశారు శ్రీదేవి గారు. ► మీ ఫస్ట్ సినిమానే శ్రీదేవిగారి ఆఖరి సినిమా అవ్వడం పట్ల మీ ఫీలింగ్? నేను అలా ఆలోచించొద్దని డెసైడ్ అయ్యాను. ఈ సినిమా తర్వాత శ్రీదేవి గారు ఇంకా మంచి సినిమాలు చేస్తారనుకున్నాను. ఫ్రెష్ స్టార్ట్ నా సినిమా ద్వారా అవుతుందని ఆనంద పడ్డాను. ఎప్పటికీ ఆ ఆలోచనతోనే ఉంటాను. ► జాన్వీ, ఖుషీ వాళ్ల మామ్ను ‘మామ్’లో చూసుకున్నాక ఎలా ఫీల్ అయ్యారు? ఖుషీ సినిమా చూసినప్పుడు నేను పక్కన లేను, కానీ జాన్వీ చూసిన వెంటనే చాలా ఎమోషనల్ అయింది. కన్నీళ్లు పెట్టుకుంటూ నన్ను గట్టిగా హగ్ చేసుకుంది. ► ఇప్పుడు జాన్వీ కూడా డెబ్యూ చేస్తున్నారు. తన గురించి ఏమైనా ? షీ విల్ బీ అమేజింగ్. శ్రీదేవిగారిలాగే తను కూడా ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. శ్రీదేవిగారికి సాంబార్ అన్నం అంటే ఇష్టం – కోన వెంకట్ ► ‘మామ్’ ఒప్పుకున్నప్పుడు శ్రీదేవిగారు మీతో ఏమన్నారు? ‘ఇంగ్లిష్–వింగ్లిష్’ తర్వా త ఆమె ఎన్నో కథలు విన్నా ఏదీ ఒప్పుకోలేదు. ‘చేస్తే మంచి సినిమా చేయాలి, నా పిల్లలు గర్వపడేలా ఆ సినిమా ఉండాలనుకుంటున్నాను’ అని కథ చెప్పడానికి వెళ్లినప్పుడు అన్నారు. ‘మామ్’ కథ విన్న వెంటనే చేయడానికి ఒప్పుకున్నారు. కొన్ని కథలు కొంతమంది ఆర్టిస్టులను వెతుక్కుంటూ వెళతాయి. అలా ‘మామ్’ శ్రీదేవిగారిని వెతుక్కుంటూ వెళ్లింది. ► అంటే..? నాలుగేళ్ల క్రితం నేను న్యూయార్క్ వెళ్లినప్పుడు శ్రీదేవిగారి ఫ్యామిలీ అక్కడ ఉంది. అక్కడ అనుకోకుండా ఆ ఫ్యామిలీని కలిశాను. వాళ్లు తాము ఉంటున్న అపార్ట్మెంట్కి ఆహ్వానిస్తే వెళ్లాను. అప్పుడే ఓ స్టోరీ లైన్ ఉందంటూ ‘మామ్’ లైన్ చెప్పాను. ఆవిడ ఈ సినిమా ఒప్పుకున్నప్పుడు నిజజీవితంలో పరిపూర్ణమైన తల్లిగా తన పిల్లల పట్ల చాలా బాధ్యతగా ఉంటున్నారు. పిల్లలే ప్రపంచంగా బతుకుతున్నారు. ఆవిడే ‘మామ్’కి కరెక్ట్ అనుకున్నాను. శ్రీదేవిగారు ఈ సినిమాలో జీవించేశారు. ఏ లోకంలో ఉన్నా ఈ అవార్డుకి ఆమె ఆనందపడతారు. ► ఈ సందర్భంగా శ్రీదేవిగారి గురించి ఎవరికీ తెలియని కొన్ని విషయాలు చెబుతారా? నమ్మరేమో. ఆవిడ చాలా బిడియస్తురాలు. అపరిచితులు ఉంటే అస్సలు మాట్లాడరు. కొత్త వ్యక్తులు పరిచయమైనప్పుడు వాళ్ల కళ్లల్లో కళ్లు పెట్టి చూస్తూ మాట్లాడరు. ఇన్ని సినిమాలు చేసిన ఈవిడ ఇలా ఉన్నారేంటి? అనుకున్నాను. అదే సన్నిహితులతో అయితే చాలా బాగా మాట్లాడతారు. జోకులు వేస్తుంటారు. ‘ఫన్ లవింగ్ పర్సన్’. హైదరాబాద్ వస్తున్నారంటే చాలు.. నాకు ఫోన్ చేస్తారు. ‘‘మీకు ‘ఉలవచారు’ హోటల్ ఉందట కదా. సాంబార్ అన్నం, గోంగూర అన్నం’ తెప్పిస్తారా’ అనేవారు. ఆ హోటల్ మాది కాదండి, నా ఫ్రెండ్ది అని, తెప్పించాను. ఆవిడకు అవి బాగా నచ్చేశాయ్. ఇక్కడికి ఎప్పుడు వచ్చినా అవే తినేవారు. శ్రీదేవిగారు వెజిటేరియన్. ఫుడ్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండేవారు. మనకున్న గొప్ప నటీమణుల్లో ఆమె ఒకరు. చాలా త్వరగా వెళ్లిపోయారు. బట్... తాను చేసిన సినిమాల ద్వారా ఎప్పటికీ నిలిచిపోతారు. నీకు చాలా త్వరగా జాతీయ అవార్డు వచ్చిందన్నారు ‘కాట్రు వెలియిడై’కి ఉత్తమ సంగీతదర్శకుడిగా, ‘మామ్’ బ్యాగ్రౌండ్ స్కోర్కి ఏఆర్ రెహమాన్కి రెండు జాతీయ అవార్డులు దక్కాయి. ఈ సందర్భంగా రెహమాన్ మాట్లాడుతూ – ‘‘కాట్రు వెలియిడై’కి జాతీయ అవార్డు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నా గురువు, అన్నయ్య, గైడ్ మణిరత్నం నాకు చాలా స్పెషల్. ఆయనొక ఆలోచనల గని. మణిరత్నంతో మనం ఏ ఐడియా చెప్పినా దాన్ని ఏదో ఒక రకంగా ఉపయోగించుకుంటారు. అంత టాలెంట్ ఉంది. ‘రోజా’తో మా ప్రయాణం మొదలైంది. ఆ సినిమాకి నాకు జాతీయ అవార్డు వస్తే ‘నీకు చాలా త్వరగా వచ్చింది’ అని కొందరు అన్నారు. కానీ, నేనలా అనుకోలేదు. ప్రజలు, నన్ను నమ్మిన దర్శక–నిర్మాతలు, హీరోలు, నా టీమ్.. అందరికీ ధన్యవాదాలు. ఇక ‘మామ్’ విషయానికొస్తే.. ఈ సినిమాకి మ్యూజిక్ చేయాలని బోనీజీ, శ్రీదేవిజీ చెన్నై వచ్చినప్పుడు నన్ను అడిగారు. నేను ఆనందంగా అంగీకరించాను. ఇలాంటి సినిమా నేనిప్పటివరకూ చేయలేదు. మంచి మెసేజ్ ఉన్న సినిమా. పైగా ఇప్పుడున్న పరిస్థితులకు చాలా అవసరమైన సినిమా. నాకీ సినిమా చేసే అవకాశం ఇచ్చిన బోనీజీ, శ్రీదేవిజీలకు ధన్యవాదాలు. ఆమె అద్భుతమైన నటి. శ్రీదేవిగారి ఆత్మ మనతోనే ఉందని నమ్ముతున్నాను’’ అన్నారు. ఉత్తమ గాయనిగా ‘కాట్రు వెలియిడై’ సినిమాకు జాతీయ అవార్డు దక్కించుకున్న శాషా తిరుపతికి శుభాకాంక్షలు తెలిపారు రెహమాన్. ఈ క్షణాలు ప్రత్యేకమైనవి ‘మామ్’ సినిమాలో శ్రీదేవి నటనకు బెస్ట్ యాక్ట్రస్ అవార్డును జ్యూరీ కమిటీ కన్ఫార్మ్ చేసినప్పుడు మేం ఎంతగానో సంతోషించాం. ఈ క్షణాలు మాకు ఎంతో ప్రత్యేకమైనవి. శ్రీదేవి నటించిన 300 సినిమాల్లోనూ సేమ్ ఫర్ఫెక్షన్ను చూపించారు. ఆమె కేవలం సూపర్ యాక్టర్ మాత్రమే కాదు. సూపర్ మామ్ అండ్ సూపర్ వైఫ్ కూడా. ఆమె జీవితంలో సాధించిన విజయాలను సెలబ్రేట్ చేసుకునే టైమ్ ఇది. ప్రస్తుతం ఆమె మాతో లేకపోవచ్చు. కానీ ఆమె వారసత్వం, జ్ఞాపకాలు మా వెంట ఇంకా జీవించే ఉన్నాయి. ఈ అవార్డుతో శ్రీదేవిని గౌరవించినందుకు భారత ప్రభుత్వానికి జ్యూరీ మెంబర్స్కు ధన్యవాదాలు. – బోనీ కపూర్ అన్నవరం టు వైజాగ్.. ఓ ‘ఘాజీ’ ఐడియా – సంకల్ప్ రెడ్డి ► దర్శకుడిగా మొదటి సినిమాకే నేషనల్ అవార్డ్ కొట్టేశారు.. హ్యాపీగా ఉండి ఉంటారు.. అఫ్కోర్స్. ఒక ఎక్స్పరీమెంటల్ మూవీని ముందు ప్రజలు గుర్తించారు. ఇప్పుడు ప్రభుత్వం కూడా మెచ్చుకుంది. ఐ యామ్ హ్యాపీ. ► ఇండియాలో ఫస్ట్ సబ్మెరైన్ మూవీ ‘ఘాజీ’. వర్కౌట్ అవుతుందా? అని కొందరు.. కొత్త కుర్రాడు సరిగ్గా తీయగలుగుతాడా? అని కొందరు.. ఈ మాటలు మీ వరకూ వచ్చాయా? ఏదైనా ట్రై చేస్తున్నప్పుడు ఇలాంటి మాటలు వస్తాయి. అయితే రానాగారు, పీవీపీగారు నమ్మారు. నా స్క్రిప్ట్ని నేను బలంగా నమ్మాను. డిఫరెంట్ మూవీ ఇస్తే ప్రేక్షకులు చూస్తారనుకున్నాను. అది నిజమైంది. ► ఈ సినిమాని పీవీపీగారు నిర్మించే ముందు మీరే నిర్మించాలని కొంచెం డబ్బులు కూడా ఇన్వెస్ట్ చేశారు కదా? అవును. పాకిస్తాన్ సబ్మెరైన్ సెట్ కూడా వేయించాను. అయితే సినిమా కంప్లీట్ చేసేంత మనీ లేదు. అప్పటికే నా దగ్గర ఉన్న డబ్బంతా అయిపోయింది. అలాంటి పరిస్థితిలో రానా ఈ సినిమాని నమ్మడం, పీవీపీగారు ముందుకు రావడంతో ‘ఘాజీ’ స్క్రీన్ మీదకు వచ్చింది. ► అసలు ‘ఘాజీ’ థాట్ ఎలా వచ్చింది? 2012లో నా పెళ్లయింది. అప్పుడు నా వైఫ్ (కీర్తీ రెడ్డి) బలవంతం చేస్తే అన్నవరం వెళ్లాం. అక్కణ్ణుంచి హైదరాబాద్ ట్రైన్ మిస్సవడంతో వైజాగ్ వెళ్లాం. అక్కడ బీచ్ రోడ్డులో సబ్మెరైన్ చూసినప్పుడు ఈ సినిమా థాట్ వచ్చింది. ► పెళ్లయిన వెంటనే సొంత డబ్బులు పెట్టి సినిమా తీయాలనుకోవడం, అది కూడా ప్రయోగం. మరి.. మీ మిసెస్ వద్దనలేదా? (నవ్వుతూ). తను కూడా కొంత అమౌంట్ ఇచ్చింది. అమ్మానాన్న కూడా ఎంకరేజ్ చేశారు. వీళ్లతో పాటు ‘ఘాజీ’కి వర్క్ చేసిన టీమ్ చాలా కష్టపడ్డారు. అందువల్లే ఇంత మంచి ప్రాజెక్ట్ ఇవ్వగలిగా. నేనే ఈ సినిమా నిర్మించాలనుకున్నప్పుడు మనీ ఎరేంజ్ చేయడం నాకు పెద్ద సవాల్ అయింది. అంతకు మించి నాకేదీ సవాల్ అనిపించలేదు. ఒకవేళ అవార్డు రాకపోయినా మంచి థాట్ వస్తే కచ్చితంగా ఎక్స్పరీమెంటల్ మూవీ చేస్తాను. అయితే అవార్డ్ అనేది ఒక బూస్ట్ లాంటిది. అవార్డ్స్ లిస్ట్ దాదా సాహేబ్ ఫాల్కే అవార్డ్ – వినోద్ ఖన్నా బెస్ట్ డైరెక్టర్ : జయరాజ్ (‘భయానకం’ – మలయాళం) ఉత్తమ ప్రాంతీయ చిత్రాలు బెస్ట్ రీజనల్ ఫిల్మ్ : లడఖ్ మరాఠి : కచ్చ లింబు తెలుగు : ఘాజీ మలయాం : తొండిముత్తాలుం ద్రిక్శాక్షయుం హిందీ : న్యూటన్ బెంగాలీ : మయూరాక్షి అస్సామీ : ఇషూ తమిళ్ : టు లెట్ గుజరాతీ: డీ హెచ్ హెచ్ కన్నడ : హె బెట్టు రామక్క బెస్ట్ యాక్షన్ డైరెక్టర్ : పీటర్ హెయిన్ (బాహుబలి –2) బెస్ట్ కొరియోగ్రాఫర్ : గణేష్ ఆచార్య (టాయిలెట్ ఏక్ ప్రేమకథా) బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ : ‘బాహుబలి 2’ స్పెషల్ జ్యూరీ అవార్డ్స్ : నగర్ కిర్టన్ చిత్రం బెస్ట్ లిరిక్స్ : ముత్తూ రత్న (కన్నడ– ‘మార్చి22’) బ్యాగ్రౌండ్ స్కోర్ : ఏఆర్ రెహమాన్ (మామ్), బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ : ఏఆర్ రెహమాన్ (కాట్రు వెలియిడై) బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ : రామ్ రజాక్ (నగర్ కిర్టన్) బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ : సంతోష్ రాజన్ (మలయాళం) బెస్ట్ ఎడిటింగ్ : రీమా దాస్ బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే : తొండిముత్తాలుం ద్రిక్శాక్షయుం బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే : భయానకం బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ : శాషా తిరుపతి బెస్ట్ మేల్ ప్లే బ్యాక్ సింగర్ : ఏసుదాస్ బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ : దివ్య దత్తా (ఇరాదా) బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ : ఫాహద్ ఫాజిల్ బెస్ట్ యాక్ట్రెస్ : శ్రీదేవి (మామ్) బెస్ట్ యాక్టర్ : రిద్దీ సేన్ (నగర్ కిర్టన్) బెస్ట్ నేషనల్ ఇంటిగ్రేషన్ మూవీ: దప్పా (మరాఠీ) బెస్ట్ పాపులర్ ఫిల్మ్ : ‘బాహుబలి 2’ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్: ‘విలేజ్ రాక్స్టార్స్’ -
జాతీయ రత్నాలు
-
జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రకటన
-
అబ్బాస్ అలీ ఎవరు..? : బాహుబలి నిర్మాత
నేడు ప్రకటించిన జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటనలో తప్పిదం చోటుచేసుకుంది. బాహుబలి 2 మూడు విభాగాల్లో అవార్డులు సాధించినట్టుగా జ్యూరీ ప్రకటించింది. అందుకు సంబంధించిన వివరాలను అధికారిక ట్విటర్లో వెల్లడించారు. ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం, పోరాట సన్నివేశాలు, స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగాల్లో అవార్డులు వచ్చాయని వెల్లడించారు. అంతా బాగానే ఉంది. కానీ బాహుబలి 2లో ఉత్తమ పోరాట సన్నివేశాలను రూపొందించినందుకు గానూ అబ్బాస్ అలీ మొఘల్కు అవార్డు దక్కినట్టుగా ప్రకటించారు. బాహుబలి పోరాటలను రూపొందించింది ప్రముఖ ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్. కానీ బ్రాడ్ కాస్టింగ్ మినిస్టరీ ట్విటర్ ఖాతాలో అబ్బాస్ అలీ మొఘల్ అవార్డ్ వచ్చినట్టుగా ట్వీట్ చేశారు. అయితే ఈ అవార్డు ప్రకటనపై చిత్ర నిర్మాత శోభు యార్లగడ్డ స్పందిస్తూ...‘అబ్బాస్ అలీ మొఘల్ ఎవరు? అతను బాహుబలి సిరీస్లో పనిచేయలేదు’అంటూ ట్వీట్ చేశారు. దీంతో ప్రసార మంత్రిత్వ శాఖ.. తమ అధికారిక ఖాతాల్లోంచి దానికి సంబంధించిన ట్వీట్ను తొలగించారు. -
ఉత్తమ తెలుగు చిత్రం ‘ఘాజీ’
జాతీయ స్థాయిలో సినిమా రంగానికిచ్చే అవార్డులను ఈ రోజు(శుక్రవారం) ప్రకటించారు. 65వ జాతీయ చలన చిత్రం అవార్డుల్లో... శ్రీదేవి నటించిన మామ్ సినిమాతో పాటు టాలీవుడ్ విజువల్ వండర్ బాహుబలి2 సినిమాలకు అవార్డుల పంట పండింది. ఎన్నో సంచలనాలు సృష్టించిన బాహుబలి 2 కు మూడు అవార్డులు లభించాయి. రానా నటించిన ఘాజీ చిత్రం జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైంది. సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. తెలుగులో మొదటిసారిగా సబ్ మెరైన్ కాన్సెప్ట్తో రూపొందిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలనే కాక ఇప్పుడు ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ స్థాయిలో ఎంపికైంది. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ : వినోద్ ఖన్నా ఉత్తమ చిత్రం : విలేజ్ రాక్స్టార్స్ (అస్సామీ) హిందీ ఉత్తమ చిత్రం : న్యూటన్ జాతీయ ఉత్తమ నటి : శ్రీదేవీ (మామ్) జాతీయ ఉత్తమ నటుడు : రిద్ది సేన్ (మామ్) ఉత్తమ దర్శకుడు : జయరాజ్ (భయానకమ్) ఉత్తమ పోరాట సన్నివేశ చిత్రం : బాహుబలి2 ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ అవార్డు : బాహుబలి2 ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం : బాహుబలి2 ఉత్తమ నృత్య దర్శకుడు : గణేష్ ఆచార్య (టాయిలెట్ ఏక్ ప్రేమ్కథ) ఉత్తమ సంగీత దర్శకుడు : ఎఆర్ రెహ్మాన్ (కాట్రు వెలియదై) ఉత్తమ నేపథ్య సంగీతం : ఎఆర్ రెహ్మాన్( మామ్) ఉత్తమ గాయకుడు : జేసుదాసు ఉత్తమ గాయని : షా షా తిరుపతి (కాట్రు వెలియదైలోని వాన్ వరువన్ ) ఉత్తమ తమిళ చిత్రం : టు లెట్ ఉత్తమ మరాఠీ చిత్రం : కచ్చా నింబూ ఉత్తమ కన్నడ చిత్రం : హెబ్బెట్టు రామక్క ఉత్తమ బెంగాలీ చిత్రం : మయురాక్షి ఉత్తమ సహాయ నటుడు : ఫహాద్ ఫాసిల్ (తొండిముత్తలం ద్రిసాక్షియుం) ఉత్తమ సహాయ నటి : దివ్య దత్ (ఇరాదా) -
పెళ్లి చూపులు టీమ్కు ఎంపీ కవిత అభినందనలు
హైదరాబాద్: జాతీయ అవార్డులను అందుకున్న ‘పెళ్లిచూపులు’ సినిమా యూనిట్ను నిజామాబాద్ ఎంపీ కవిత అభినందించారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ కుటుంబ కథా చిత్రాలకు ఎప్పుడు ఆదరణ ఉంటుందన్నారు. మంచి సినిమాలు తీసేవారికి తెలంగాణ ప్రభుత్వం సహకారం ఎప్పుడూ ఉంటుందని ఆమె తెలిపారు. కాగా ఎంపీని కలిసినవారిలో చిత్ర నిర్మాతలు యాష్ రంగినేని, రాజ్ కందుకూరిలతో పాటు దర్శకుడు దాస్యం తరుణ్ భాస్కర్ , హీరో విజయ్ దేవరకొండ తల్లిదండ్రులు మాధవి, వర్ధన్ దేవరకొండ, మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్, అభయ్ బేచిగంటిలు తదితరులు ఉన్నారు. 64వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో పెళ్లిచూపులు సినిమాకు ఉత్తమ తెలుగు చిత్రంతో పాటు, ఉత్తమ సంభాషణల కేటిగిరి అవార్డు వరించింది. నిన్న ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి చేతుల మీదగా చిత్ర యూనిట్ ఆ అవార్డులను అందుకున్నారు. -
‘పెళ్లిచూపులు’ టీమ్కు కేసీఆర్ అభినందన
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ’పెళ్లిచూపులు’ టీమ్ను అభినందించారు. పెళ్లి చూపులు సినిమా జాతీయ ఉత్తమ భాషాచిత్రంగా ఎంపిక కావడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. చిత్ర దర్శక, నిర్మాతలను, నటీనటులను, సాంకేతిక సిబ్బందికి కేసీఆర్ అభినందనలు తెలిపారు. అలాగే ఉత్తమ మాటల రచయితగా ఎంపికైన తరుణ్ భాస్కర్కు కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. చిత్ర పరిశ్రమకు చెందిన తెలంగాణ పౌరులు అత్యంత ప్రతిభ ప్రదర్శిస్తూ జాతీయ స్థాయి గుర్తింపు పొందడం రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణమన్నారు. అలాగే సమగ్ర వినోదాత్మక చిత్రంగా ‘శతమానం భవతి’ ఎంపికతో పాటు, ‘జనతా గ్యారేజ్’ సినిమాలో నృత్యాలకు గాను ఉత్తమ నృత్య దర్శకుడుగా రాజు సుందరం ఎంపిక కావడం పట్ల సీఎం హర్షం తెలిపారు. ఇదే స్పూర్తితో తెలుగు చిత్ర పరిశ్రమ మరిన్ని విజయాలు అందుకోవాలని ఆయన ఆకాంక్షించారు. కాగా శుక్రవారం ప్రకటించిన 64వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ‘పెళ్లిచూపులు’ ఉత్తమ తెలుగు చిత్రం కేటగిరి కింద ఎంపిక అయింది. ఉత్తమ సంభాషణల కేటిగిరి అవార్డు తరుణ్ భాస్కర్ (పెళ్లిచూపులు)ను వరించింది. దాస్యం తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రాజ్ కందుకూరి, యాశ్ రంగినేని నిర్మించిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, రీతూ వర్మ నటించారు.ఇక ఉత్తమ నృత్య దర్శకుడిగా రాజుసుందరం (జనతా గ్యారేజ్)ను, ఉత్తమ ప్రజాదరణ చిత్రంగా శతమానం భవతి ఎంపిక అయిన విషయం తెలిసిందే. -
జాతీయ అవార్డుల జ్యూరీపై డైరెక్టర్ ఫైర్
సినీరంగానికి సంబంధించి ఇచ్చే అవార్డులు ఎప్పుడు వివాదాస్పదమవుతూనే ఉంటాయి. జ్యూరీ సభ్యులు తమకు సంబంధించిన వారికే అవార్డులు ఇచ్చారన్న వాదన ప్రధానంగా వినిపిస్తుంటుంది. ఇటీవల ప్రకటించిన జాతీయ అవార్డులపై కూడా ఇలాంటి విమర్శలే వినిపిస్తున్నాయి. కొంత మంది ప్రముఖులు జ్యూరీ నిర్ణయం పై సంతృప్తి వ్యక్తం చేయగా మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ మరో అడుగు ముందుకేసి జ్యూరీ సభ్యులు పక్షపాత బుద్ధితో వ్యవహరిస్తున్నారంటూ విమర్శలకు దిగారు. జాతీయ అవార్డుల ప్రకటన తరువాత తన సోషల్ మీడియా పేజ్ లో స్పందించిన మురుగదాస్ జ్యూరీ సభ్యులపై ఒత్తిళ్లు ఉన్నాయని, పక్షపాతం తోనే అవార్డుల ఎంపిక జరిగిందనట్టుగా స్పష్టమవుతుందని విమర్శించాడు. మురుగదాస్ ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా ఓ యాక్షన్ థ్రిల్లర్ ను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే 80 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా జూన్ 23న రిలీజ్ అవుతోంది. #NationalAwards Can clearly witness the influence & partiality of people in jury, it's biased. — A.R.Murugadoss (@ARMurugadoss) 8 April 2017 -
'పెళ్లిచూపులు'కు జాతీయ అవార్డులు
-
'పెళ్లిచూపులు'కు జాతీయ అవార్డులు
న్యూఢిల్లీ: తెలుగు సినిమా 'పెళ్లి చూపులు'కు జాతీయ అవార్డు దక్కింది. శుక్రవారం ప్రకటించిన 64వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఈ సినిమాను ఉత్తమ తెలుగు చిత్రం కేటగిరి కింద ఎంపిక చేశారు. ఉత్తమ సంభాషణల కేటిగిరి అవార్డు తరుణ్ భాస్కర్ (పెళ్లిచూపులు)ను వరించింది. దాస్యం తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రాజ్ కందుకూరి, యాశ్ రంగినేని నిర్మించిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, రీతూ వర్మ నటించారు. ఈ లోబడ్జెట్ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ విజయం సాధించింది. ఇక ఉత్తమ నృత్య దర్శకుడిగా రాజుసుందరం (జనతా గ్యారేజ్)ను, ఉత్తమ ప్రజాదరణ చిత్రంగా శతమానం భవతిని ఎంపిక చేశారు. ఉత్తమ నటుడిగా అక్షయ్ కుమార్ (రుస్తుం), ఉత్తమ హిందీ చిత్రంగా నీర్జాను ప్రకటించారు. అవార్డుల వివరాలు: ఉత్తమ నటుడు - అక్షయ్కుమార్ (రుస్తుం) ఉత్తమ తెలుగు చిత్రం- పెళ్లిచూపులు ఉత్తమ హిందీ చిత్రం - నీర్జా ఉత్తమ సామాజిక చిత్రం - పింక్ ఉత్తమ కన్నడ చిత్రం - రిజర్వేషన్ ఉత్తమ తమిళ చిత్రం - జోకర్ ఉత్తమ ప్రజాదరణ చిత్రం - శతమానం భవతి ఉత్తమ బాలల చిత్రం - ధనక్ ఉత్తమ ఫైట్ మాస్టర్ - పీటర్ హెయిన్స్ (పులిమురుగన్) ఉత్తమ నృత్యదర్శకుడు - రాజు సుందరం (జనతా గ్యారేజ్) ఉత్తమ సంగీత దర్శకుడు - బాపు పద్మనాభ (అల్లమ-కన్నడ) ఉత్తమ సంభాషణలు: తరుణ్ భాస్కర్ (పెళ్లిచూపులు) ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ - శివాయ్ సినిమాలకు స్నేహపూర్వక రాష్ట్రంగా యూపీ ఎంపిక -
వైభవంగా సినీ అవార్డుల ప్రదానం
పురస్కారాలు అందుకున్న అమితాబ్, కంగనా, రాజమౌళి ‘ఫాల్కే’ అందుకున్న మనోజ్కుమార్ న్యూఢిల్లీ: 63వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానం కన్నులపండువగా జరిగింది. మంగళవారమిక్కడ నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ అవార్డులను ప్రదానం చేశారు. జాతీయ ఉత్తమనటుడు పురస్కారాన్ని అమితాబ్బచ్చన్ (పికూ చిత్రం), ఉత్తమనటి అవార్డును కంగనా రనౌత్ (తను వెడ్స్ మను రిటర్న్స్) అందుకున్నారు. వీరికి రజత కమలంతోపాటు రూ.50 వేల చొప్పుననగదును అందించారు. అలాగే దేశ సినీ చరిత్రలో సంచలనం సృష్టించి ఈ ఏటి ఉత్తమ చిత్రంగా ఎంపికైన బాహుబలి చిత్రానికిగాను దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని పురస్కారం అందుకున్నారు.స్వర్ణకమలం, ప్రశంసాపత్రంతోపాటు రూ.2.5 లక్షల నగదును రాష్ట్రపతి నుంచి స్వీకరించారు.దేశ సినీ పురస్కారాల్లో అత్యున్నతమైన ‘దాదాసాహెబ్ ఫాల్కే’ను బాలీవుడ్ అలనాటి నటుడు మనోజ్ కుమార్ స్వీకరించారు. వీల్చైర్లో వచ్చిన ఆయన స్వర్ణ కమలంతోపాటు రూ.10 లక్షల నగదును అందుకున్నారు. కాగా, తెలుగులో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఎంపికైన ‘కంచె’ చిత్రానికి దర్శకుడు క్రిష్ అవార్డు అందుకున్నారు. హాలీవుడ్పై ఆసక్తి లేదు.. రాజమౌళి: బాహుబలిఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలోనూ అవార్డు సొంతం చేసుకుంది. హాలీవుడ్ స్థాయి స్పెషల్ ఎఫెక్ట్స్తో బాహుబలిని చిత్రించినప్పటికీ హాలీవుడ్కు వెళ్లే ఆలోచన లేదని రాజమౌళి చెప్పారు. తనకు ఇక్కడ సినిమాలు తీయడమే సంతోషంగా ఉందన్నారు. చిన్నప్పుడు అమ్మమ్మ చెప్పిన కథలు తనకు ఎంతో స్ఫూర్తినిచ్చాయన్నారు. అశోకా, అక్బర్, మహారానా ప్రతాప్ లాంటి రాజుల కథలతో సినిమాలు చేయాలని ఆసక్తి ఉందని తెలిపారు. -
కనువిందుగా పద్మ అవార్డుల ప్రదానం
-
జాతీయ అవార్డుల విజేతలు వీరే
రికార్డుల మీద రికార్డులు సృష్టించుకుంటూ వెళ్తున్న బాహుబలి సినిమా సిగలో మరో అరుదైన గౌరవం చేరింది. 63వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఈ సినిమా జాతీయ ఉత్తమ చలనచిత్రంగా ఎంపికైంది. దీంతోపాటు జాతీయస్థాయిలో ఉత్తమ స్పెషల్ ఎఫెక్టుల అవార్డు కూడా ఈ సినిమాకే దక్కింది. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, రమ్యకృష్ణ, సత్యరాజ్, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన ఈ సినిమా 600 కోట్ల రూపాయల వసూళ్లు సాధించడంతో పాటు ఇప్పుడు జాతీయ స్థాయిలో ఉత్తమ చలనచిత్రంగా ఎంపికై, తెలుగు సినిమా కీర్తి ప్రతిష్ఠలను పతాక స్థాయికి తీసుకెళ్లింది. ఇంతకుముందు జాతీయ స్థాయిలో శంకరాభరణం సినిమాకు స్పెషల్ జ్యూరీ అవార్డు వచ్చింది. ఆ తర్వాత ఇప్పటివరకు జాతీయ స్థాయిలో తెలుగు సినిమాకు గుర్తింపు రావడం ఇదే ప్రథమం. ఇతర జాతీయ అవార్డులు ఇలా ఉన్నాయి... ఉత్తమ నటుడు: అమితాబ్ బచ్చన్ (పికు) ఉత్తమ నటి: కంగనా రనౌత్ (తను వెడ్స్ మను రిటర్న్స్) ఉత్తమ దర్శకుడు: సంజయ్ లీలా భన్సాలీ (బాజీరావ్ మస్తానీ) ఉత్తమ కొరియోగ్రాఫర్: రెమో డిసౌజా (బాజీరావు మస్తానీ) ఉత్తమ హిందీ చిత్రం: దమ్ లగాకే హైసా ఉత్తమ తెలుగు చిత్రం: కంచె ఉత్తమ తొలిచిత్ర దర్శకుడు: నీరజ్ ఘేవాన్ (మసాన్) ఉత్తమ స్పెషల్ ఎఫెక్టులు: బాహుబలి ఉత్తమ సినిమాటోగ్రఫీ: సుదీప్ చటర్జీ (బాజీరావు మస్తానీ) ఉత్తమ సహాయనటుడు: సముద్రకని (విసారనై) ఉత్తమ సహాయనటి: తన్వీ అజ్మీ (బాజీరావ్ మస్తానీ) ఉత్తమ బాల నటుడు: గౌరవ్ మీనన్ (బెన్) ఉత్తమ బాలల చలనచిత్రం: దురంతో జాతీయ సమగ్రతపై ఉత్తమ చిత్రం: నానక్ షా ఫకీర్ పర్యావరణ పరిరక్షణపై ఉత్తమచిత్రం: వాలియా చారకుల్ల పక్షికల్ ఉత్తమ గాయని: మోనాలి ఠాకూర్ (మోహ్ మోహ్ కే ధాగే.. దమ్ లాగాకే హైసా) ఉత్తమ వినోదాత్మక చిత్రం: బజరంగీ భాయీజాన్ ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే: విశాల్ భరద్వాజ్ ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే: జుహు చతుర్వేది (పికు), హిమాన్శు శర్మ (తను వెడ్స్ మను రిటర్న్స్) ఉత్తమ కొరియోగ్రఫీ: రెమో డిసౌజా (బాజీరావ్ మస్తానీలో 'దివానీ మస్తానీ' పాట) ఉత్తమ చలనచిత్రం (నర్గీస్ దత్ జాతీయ సమైక్యత పురస్కారం): నానక్ షా ఫకీర్ ఉత్తమ మలయాళ సినిమా: పథేమరి ఉత్తమ సామాజిక చిత్రం: నిర్ణయకం పర్యావరణం పరిరక్షణపై ఉత్తమ చిత్రం: వలియ చిరుకుల్లా పక్షికల్ ఉత్తమ బాలల చిత్రం: దురంతో ఉత్తమ తమిళ సినిమా: విసారనై ఉత్తమ తెలుగు సినిమా: కంచె ఉత్తమ సంస్కృత సినిమా: ప్రియమానసం ఉత్తమ కన్నడ సినిమా: థిథీ ఉత్తమ పంజాబీ సినిమా: చౌథీ కూట్ ఉత్తమ కొంకణి సినిమా: ఎనిమీ ఉత్తమ అస్సామీ సినిమా: కొథానొడి ఉత్తమ హర్యాన్వి సినిమా: సత్రంగి ఉత్తమ ఖాసి సినిమా: ఒనాటా ఉత్తమ మణిపురి సినిమా: ఐబసు యావోహన్బియూ ఉత్తమ మిజో సినిమా: కిమస్ లోడ్ బియాండ్ ద క్లాస్ ఉత్తమ ఒడియా సినిమా: పహడ ర లుహా స్పెషల్ మెన్షన్: 'ఇరుధి సుత్రు'కు గాను రితికాసింగ్ -
'మలయాళీ' డామినేషన్ తగ్గిపోయిందా?
తిరువనంతపురం: ప్రయోగాలకు పెద్దపీట వేస్తూ.. కథాబలమున్న చిత్రాలు తీసే మలయాళీ చిత్ర పరిశ్రమ ప్రభ ఈ మధ్య కాలంలో తగ్గిపోతున్నట్టు కనిపిస్తోంది. ఒకప్పుడు జాతీయ అవార్డులంటే మలయాళ సినిమానే గుర్తుకొచ్చేది. ప్రధాన పురస్కారాల్లో ఎక్కువభాగం మలయాళ చిత్రాలకే దక్కేవి. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా తలకిందులైనట్టు కనిపిస్తోంది. ఈ ఏడాది కేవలం నాలుగు పురస్కారాలు మాత్రమే దక్కాయి. 63వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో మలయాళ చిత్రాలు అంతంతమాత్రం గుర్తింపును మాత్రమే తెచ్చుకున్నాయి. ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ బాల నటుడు, ఫీచర్ సినిమాల కేటగిరీల్లో ప్రత్యేక ప్రస్తావనలు తప్ప ఈ ఏడాది చెప్పుకోదగ్గ అవార్డులు లభించలేదు. 'ఎన్ను నింతే మొదీన్' చిత్రంలో 'కథుయిరున్నే కథుయిరున్నే' పాటకు సంగీతమందించినందుకు ఎం జయచంద్రన్ కు ఉత్తమ సంగీత దర్శకుడి అవార్డు లభించింది. 'బెన్' చిత్రంలో అద్భుతమైన భావోద్వేగాలు పండించిన పదేళ్ల బాలుడి పాత్ర పోషించినందుకు గౌరవ్ మీనన్ కు ఉత్తమ బాలనటుడి అవార్డు దక్కింది. 'లక్క చుప్పి', 'సు.. సు.. సుధి వథ్మీకం' సినిమాల్లో నటనకుగాను నటుడు జయసూర్య స్పెషల్ మెన్షన్కు నామినేట్ అయ్యారు. పర్యావరణం మీద తీసిన ఉత్తమ చిత్రంగా 'వలియా చిరాకుల్ల పక్షికల్' (పెద్ద రెక్కల పక్షి) నిలిచింది. నాన్ ఫీచర్ సెక్షన్ 'అమ్మ' సినిమా దర్శకుడు నీలన్ కూడా స్పెషల్ మెన్షన్కు నామినేట్ అయ్యారు. ఇక ఉత్తమ షార్ట్ ఫిలింగా మలయాళ చిత్రం 'కముకి' నిలిచింది. గత ఏడాది కూడా జాతీయ పురస్కారాల్లో మలయాళ చిత్రసీమకు పెద్దగా పురస్కారాలు లభించలేదు. కేవలం నాలుగు పురస్కారాలతోనే సరిపెట్టుకుంది. ఇప్పుడు కూడా పెద్దగా ప్రధాన పురస్కారాలు రాకపోవడంపై పరిశ్రమ వర్గాలు అసంతృప్తిగా ఉన్నాయి. ప్రయోగాలు, కథాబలమున్న చిత్రాల సంఖ్య తగ్గిపోవడమే జాతీయ చలనచిత్రాల్లో మలయాళ ప్రభ తగ్గిపోవడానికి కారణమని పలువురు భావిస్తున్నారు. -
ఢిల్లీలో జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానం
ఢిల్లీ: 2014 సంవత్సరానికి గాను 62వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అవార్డు గ్రహీతలను అభినందించారు. భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వ ప్రణాళికలను ఆయన ఈ సందర్భంగా వివరించారు. భారత చలనచిత్ర సృజనాత్మకత మరింతగా వ్యాపించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి రాజ్య వర్ధన్ సింగ్ రాధోడ్, బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీలు పాల్గొన్నారు. దాదా సాహెబ్ అవార్డుతో పాటు ఉత్తమ చిత్రం,ఉత్తమ జాతీయ నటుడు,ఉత్తమ జాతీయ నటి తదితర అవార్డులను రాష్ట్రపతి తన చేతుల మీదుగా ప్రదానం చేశారు. ఉత్తమ నటుడు కేటగిరీలో కన్నడ నటుడు విజయ్ కుమార్ బి అవార్డు అందుకోగా, ఉత్తమ నటి కేటగిరీలో కంగనా రనౌత్ అవార్డును స్వీకరించింది. ఉత్తమ నటి అవార్డును అందుకుంటున్న కంగనా రనౌత్ ఉత్తమ నటుడు అవార్డు అందుకుంటున్న కన్నడ నటుడు విజయ్ కుమార్ బి ఉత్తమ నేపథ్య గాయకుడు అవార్డు అందుకుంటున్న సుఖ్ విందర్ సింగ్ ఉత్తమ బాల నటుడు అవార్డు అందుకుంటున్న విఘ్నేష్ -
హైదర్ చిత్రానికి ఐదు జాతీయ అవార్డులు
-
అద్వితీయ నటనకు రెండోసారి గుర్తింపు
ఉత్తమ నటి - కంగనా రనౌత్ (హిందీ చిత్రం ‘క్వీన్’) ‘క్వీన్’ చిత్రం ద్వారా జాతీయస్థాయిలో అందరి దృష్టినీ ఆకర్షించిన కంగనా రనౌత్ మరోసారి దేశమంతటా వార్తల్లో నిలిచారు. వికాస్ బహ్ల్ దర్శకత్వంలో రూపొందిన ఆ చిత్రంలో రాజౌరీ ప్రాంతానికి చెందిన రాణిగా ఆమె చేసిన అభినయం తాజాగా జాతీయ అవార్డు తెచ్చిపెట్టింది. కంగనా రనౌత్కు జాతీయ అవార్డు రావడం ఇది రెండోసారి. మధుర్ భండార్కర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఫ్యాషన్’ (2008) చిత్రంలో మాదక ద్రవ్యాలకు బానిసైన మోడల్గా చూపిన అభినయానికి గతంలో ఆమె ఉత్తమ సహాయ నటిగా జాతీయ అవార్డును గెల్చుకున్నారు. ఇప్పుడు ‘క్వీన్’తో ఏకంగా ఉత్తమ నటి కిరీటం అందుకోనున్నారు. సర్వసాధారణంగా హిందీ సినీ అవార్డు షోలకు హాజరయ్యే అలవాటు లేని కంగన ఈ సారి జాతీయ అవార్డు రేసులో తాను ఉన్న సంగతే తెలియదన్నారు. ఈ ఏడాది ఉత్తమ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చినా, పురస్కారం అందుకోవడానికి వెళ్ళని ఆమె జాతీయ అవార్డును తీసుకోవడానికి వ్యక్తిగతంగా హాజరవుతానన్నారు. -
'చందమామ కథలు'కు జాతీయ అవార్డు
-
'చందమామ కథలు'కు జాతీయ అవార్డు
ఉత్తమ ప్రాంతీయ చిత్రం (తెలుగు)గా ఎంపిక జాతీయ ఉత్తమచిత్రం.. క్వీన్ ఉత్తమ నటి.. కంగనా రనౌత్ ప్రజాదరణ పొందిన చిత్రం.. మేరీకోమ్ న్యూఢిల్లీ 'చందమామ కథలు' సినిమా ఉత్తమ ప్రాంతీయ చిత్రం (తెలుగు)గా జాతీయ అవార్డు అందుకుంది. దీంతో ఆ సినిమాలో నటించిన మంచు లక్ష్మి హర్షం వ్యక్తం చేశారు. ''ఓ మై గాడ్.. ఓ మై గాడ్.. నా సినిమాకు జాతీయ అవార్డు వచ్చిన విషయం ఇప్పుడే తెలిసింది. యాయాయాయా...'' అంటూ ఆనందం ప్రకటించారు. బ్రహ్మాండమైన కలెక్షన్లు సాధించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్న క్వీన్ చిత్రం జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. అందులో అద్భుతమైన నటనను ప్రదర్శించిన కంగనా రనౌత్ జాతీయ ఉత్తమనటిగా కూడా ఎంపికయ్యారు. 62వ జాతీయ సినిమా అవార్డులను మంగళవారం న్యూఢిల్లీలో ప్రకటించారు. ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా ప్రియాంకా చోప్రా నటించిన 'మేరీకోమ్' నిలిచింది. చైతన్య తమ్హానే తీసిన కోర్ట్ సినిమా ఉత్తమ ఫీచర్ ఫిలింగా ఎంపికైంది. కన్నడ చిత్రం నాను అవనల్ల అవలు అనే సినిమాలో నటించిన హీరో విజయ్ జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. Omg omg omg #chandamamaKathalu just won the national award for the best regional film. Yayayayayayayyayayayayay. ???????????? — Lakshmi Manchu (@LakshmiManchu) March 24, 2015