NDTV
-
ప్రపంచానికి భారత్ ఆశాకిరణం
న్యూఢిల్లీ: అద్భుత ప్రగతి పథంలో దూసుకెళ్తూ ప్రపంచానికి భారత్ సరికొత్త ఆశాకిరణంలా కనిపిస్తోందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. సోమవారం ఢిల్లీలో ఎన్డీటీవీ వరల్డ్ సదస్సులో ప్రధాని ప్రారం¿ోపన్యాసం చేసి పలు అంశాలపై ప్రసంగించారు. ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. డబుల్ ఏఐ ప్రయోజనాలు ‘‘మూడోసారి అధికారంలోకి వచ్చి దేశాన్ని అద్భుతమైన ప్రతిపథంలో నడిపిస్తున్నాం. యుద్దాలు, సంక్షోభాలుసహా ప్రపంచాన్ని పలు సమస్యలు పట్టిపీడిస్తున్న ఈ తరుణంలో ప్రపంచ దేశాలకు భారత్ ఆశాకిరణంలా మారింది. రెండు ఏఐల అదనపు ప్రయోజనాలు భారత్సొంతం. ఒకటి ఆశావహ ఇండియా(ఏఐ), కాగా మరోకటి కృత్రిమమేథ(ఏఐ). ఈ రెండింటి కలయికతో భారత్ వేగవంతమైన అభివృద్ధిని సాధిస్తుంది. ఆపత్కాలాల్లో ప్రపంచం భారత్ను ఒక స్నేహితునిలా చూస్తుంది. కోవిడ్ మహమ్మారివేళ ఎన్నో దేశాలకు భారత్ కరోనా వ్యాక్సిన్లను సరఫరాచేసింది. ఏ దేశంతోనూ భారత్ బంధం గాలివాటంగా ఏర్పడలేదు. ఎంతో నమ్మకం, సత్సంబంధాలతో బలోపేతమైంది. భారత్ బాగుపడితే అసూయపడే దేశాలు లేవు. ఎందుకంటే భారత దేశ అభివృద్ధి ఫలాలు ప్రపంచదేశాలకూ పనికొస్తాయని అందరికీ తెలుసు. చంద్రయాన్ మిషన్ విజయవంతమైతే ప్రపంచమే సంబరాలు చేసుకుంది. చరిత్రలోకి తొంగిచూస్తే ప్రపంచఅభివృద్ధిలో భారతపాత్ర ఎనలేనిదని స్పష్టమవుతోంది. అయితే గత దశాబ్దాల్లో వలసపాలన కారణంగా ప్రపంచ పారిశ్రామిక విప్లవ ప్రయోజనాలను భారత్ అందుకోలేకపోయింది. ఇప్పుడు ఇండస్ట్రీ 4.0 యుగం మొదలైంది. అవసరమైన మౌలిక సదుపాయాలను పెంచుకుంటూ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటోంది’’ అని అన్నారు. డిజిటల్ ఆవిష్కరణలు, ప్రజాస్వామ్యవిలువల్ని మేళవించాం ‘‘ డిజిటల్ ఆవిష్కరణలు, ప్రజాస్వామ్య విలువల్ని సమ్మిళితం చేశాం. అలాంటి సాంకేతికతే సాధికారత, పారదర్శకతలకు పనిముట్టుగా మారుతుంది. సాంకేతిక దన్నుతో ఎదిగిన యూపీఐ, పీఎం గతి శక్తి, ఓఎన్డీసీ వంటివి ఇందుకు మేలిమి తార్కాణాలు. ఇప్పుడు భారత్ అభివృద్ధి చెందడం మాత్రమేకాదు ఒక శక్తిగా అవతరిస్తోంది. పేదరికం వంటి సవాళ్లు ఉన్నాయని తెలుసు. త్వరితగతిన నూతన విధాననిర్ణయాలను అమలుచేస్తూ సంస్కరణలు తీసుకొస్తున్నాం’’ అని అన్నారు. ప్రజలు సుస్థిర పాలనను కోరుకుంటున్నారు ‘‘మానవాళి చరిత్రలో 21 శతాబ్దపు ఈ కాలం ఎంతో ముఖ్యమైంది. సమస్యలను పరిష్కరించుకుంటూనే సుస్థిరాభివృద్ధిని సాధించాలి. మానవాళికి మెరుగైన భవిష్యత్తు అవసరం. అందుకోసం భారత్ పాటుపడుతోంది. దేశంలో గత ఆరుదశాబ్దాల్లో తొలిసారిగా వరుసగా మూడుసార్లు ఒకే ప్రభుత్వానికి ప్రజలుపట్టంకట్టారు. ప్రజలు సుస్థిర పాలనను కోరుకుంటున్నారని హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలూ రుజువుచేశాయి. మూడోదఫా కేంద్రంలో అధికారంలోకి వచ్చాక మేం రూ.9 లక్షల కోట్ల విలువైన మౌలికవసతుల ప్రాజెక్టులను ప్రారంభించాం. ఈ 125 రోజుల్లో స్టాక్మార్కెట్ సైతం ఆరేడు శాతం వృద్ధిని చూపిస్తోంది’’ అని మోదీ అన్నారు. మోదీ తర్వాత బ్రిటన్ మాజీ ప్రధాని డేవిడ్ కామెరూన్ సదస్సులో మాట్లాడారు. ‘‘ బ్రిటన్లో మార్గరేట్ థాచర్, టోనీ బ్లెయిర్ కాలం నుంచి చూసినా మా దేశంలో ఎవరూ మూడోసారి ప్రధాని కాలేదు. మీరు(మోదీ) మూడోసారి అధికారంలోకి వచ్చి మరింత ఉత్సాహంతో పనిచేస్తున్నారు’’ అని కామెరూన్ పొగిడారు. -
మరో మీడియా సంస్థను కొనుగోలు చేసిన గౌతమ్ అదానీ
ప్రముఖ వ్యాపార వేత్త, అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ మరో మీడియా సంస్థను కొనుగోలు చేశారు. ఇప్పటికే పలు మీడియా సంస్థల కొనుగోళ్లు,పెట్టుబడులు పెట్టిన ఆయన తాజాగా న్యూస్ ఏజెన్సీ ఐఏఎన్ఎస్లో మెజారిటీ వాటాని చేజిక్కించుకున్నారు. ఐఏఎన్ఎస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో 50.50 శాతం మెజారిటీ వాటాను తమ సబ్సిడరీ ఏఎంజీ మీడియా నెట్వర్క్స్ (ఏఎంఎన్ఎల్) కొనుగోలు చేసినట్టు అదానీ ఎంటర్ప్రైజెస్ తెలిపింది. గత ఏడాది మార్చిలో ఫైనాన్షియల్ న్యూస్ డిజిటల్ ప్లాట్ఫామ్ బీక్యూ ప్రైమ్ను నిర్వహించే క్వింటిల్లియన్ బిజినెస్ మీడియాను టేకోవర్ చేయడం ద్వారా మీడియా వ్యాపారంలోకి అడుగుపెట్టారు. అదే ఏడాది డిసెంబర్లో న్యూస్ టెలివిజన్ చానల్ ఎన్డీటీవీలో 65 శాతం వాటాను కొన్నది. ఇప్పుడు ఐఏఎన్ఎస్లో వాటా కొనుగోలు చేసి మీడియా రంగంలో తన ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. -
9 భాషల్లో ఎన్డీటీవీ న్యూస్ ఛానల్స్
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్లో భాగమైన మీడియా దిగ్గజం న్యూఢిల్లీ టెలివిజన్ (ఎన్డీటీవీ) తొమ్మి ది భారతీయ భాషల్లో న్యూస్ ఛానల్స్ను మొదలుపెట్టే యోచనలో ఉంది. దశలవారీగా వీటిని ప్రారంభించనున్నట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు సంస్థ తెలియజేసింది. ఇందుకోసం సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అనుమతులు తీసుకోవాలన్న ప్రతిపాదనకు గురువారం జరిగిన సమావేశంలో బోర్డు ఆమోదముద్ర వేసినట్లు వివరించింది. అనుమతులు వచ్చాక చానళ్ల ప్రారంభ తేదీలను స్టాక్ ఎక్సే్చంజీలకు తెలియజేస్తామని పేర్కొంది. ఎన్డీటీవీ వ్యవస్థాపకులు ప్రణయ్ రాయ్, రాధికా రాయ్ల వాటాలను కూడా కొనుగోలు చేసిన తర్వాత అదానీ గ్రూప్ గతేడాది డిసెంబర్లో కంపెనీని పూర్తిగా దక్కించుకుంది. 2023 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఎన్డీటీవీ రూ. 221 కోట్ల ఆదాయం నమోదు చేసింది. -
'రావడం అంత ఈజీ కాదు; అప్పుల ఊబి నుంచి బయటపడ్డాం'
రింకూ సింగ్.. ఇప్పుడొక సంచలనం. ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా శనివారం గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో ఆఖరి ఓవర్లో ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు కొట్టి కేకేఆర్కు సంచలన విజయం అందించాడు. ఈ ఒక్క ఇన్నింగ్స్ రింకూ సింగ్ను ఓవర్నైట్ స్టార్ను చేసేసింది. ఎంతలా అంటే రెండు రోజుల నుంచి రింకూ సింగ్ ఇంకా ట్విటర్లో ట్రెండింగ్ లిస్ట్లోనే కనబడేంతలా. ఒక్క మ్యాచ్ అతని దశను మారుస్తుందని బహుశా అతను కూడా ఊహించి ఉండడు. Photo: IPL Twitter తాజాగా ఎన్డీటీవీకి రింకూ సింగ్ ఇంటర్య్వూ ఇచ్చాడు. ఈ ఇంటర్య్వూలో అతను పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. తాను చాలా కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నానని చెప్పాడు. మేము సంపాదించడం మొదలెట్టాకా కూడా నాన్న తన సొంతకాళ్లపై నిలబడడానికే ఆసక్తి చూపిస్తున్నారని పేర్కొన్నాడు. క్రికెటర్ కాకముందు కుటుంబం మొత్తం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని.. దేవుడి దయ వల్ల ఇప్పుండంతా బాగానే ఉందని తెలిపాడు. ''నా కుటుంబం సంతోషంగా ఉండడం కోసం ఎంతో చేస్తున్నా. గతంలో ఉన్న కష్టాలన్నీ తొలిగిపోయాయి. మేము ఎదిగాకా నాన్నను జాబ్ మానేయాలని చెప్పాం. ఆయన 30 ఏళ్లుగా ఇంటింటికి తిరిగి గ్యాస్ సిలిండర్లు సరఫరా చేస్తున్నారు. కానీ ఆయన తన సొంతకాళ్లమీదే బతకాలని నిర్ణయించుకొని జాబ్ వదలడానికి విముఖత వ్యక్తం చేశారు. ఇక కెరీర్లో ఎదగకముందు సోదరుడితో కలిసి నాన్నతో వెళ్లి గ్యాస్ సిలిండర్లు సరఫరా చేసేవాళ్లం. Photo: IPL Twitter నాన్నకు నేను క్రికెట్ ఆడడం ఇష్టం ఉండేది కాదు. నాకు డబ్బు కావాలంటే నాన్నతో పాటు వెళ్లి సిలిండర్లు వేసేవాడిని. కానీ ఇంట్లో అమ్మ ఇచ్చిన సపోర్ట్తో ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా. ఐపీఎల్లోకి అడుగుపెట్టడం చాలా కష్టం. ముందు మనల్ని మనం డొమొస్టిక్ క్రికెట్లో నిరూపించుకోవాల్సిందు. గత 6-7 ఏళ్లుగా క్రికెట్ ఆడుతున్నా. కేకేఆర్ ఫ్రాంచైజీ నన్ను నమ్మి అవకాశమిచ్చింది. దానిని నిలబెట్టుకుంటా'' అని పేర్కొన్నాడు. ఇక రింకూ సింగ్ తమ్ముడు కూడా అన్న బాటలోనే నడుస్తున్నాడు. ఇప్పటికే ప్రొఫెషనల్ క్రికెట్లో అడుగుపెట్టిన రింకూ సింగ్ తమ్ముడు జిల్లా స్తాయి క్రికెట్ ఆడుతూ మంచి పేరు తెచ్చుకునే పనిలో ఉన్నాడు. ఇక ఐపీఎల్లో రింకూ సింగ్ ఇప్పటివరకు 20 మ్యాచ్లాడి 349 పరుగులు సాధించాడు. #NDTVExclusive | "Family Was In Debt, Problems Over Now," KKR Hero Rinku Singh Tells NDTV pic.twitter.com/m6BF1pPMpo — NDTV Videos (@ndtvvideos) April 11, 2023 చదవండి: RCB Vs LSG: మ్యాచ్ ఓడిపోతే ఇంతలా ఏడుస్తారా! 5 బంతుల్లో 5 సిక్సర్లు.. గుజరాత్కు ఊహించని షాక్! ఎవరీ రింకూ సింగ్? -
సోషల్ మీడియా స్టార్, అన్స్టాపబుల్ టైకూన్ దిపాలీ: రతన్టాటా కంటే ఖరీదైన ఇల్లు
వెల్స్పన్ ఇండియా సీఈవో సోషల్ మీడియా స్టార్ దిపాలి గోయెంకా ఎన్డీటీవీ స్వత్రంత్ర డైరెక్టర్గా నియమితులయ్యారు. సెబీ మాజీ ఛైర్మన్ యూకే సిన్హాతో పాటు మార్చి 27, 2023 నుండి రెండు సంవత్సరాల పాటు ఆ పదవిలో కొనసాగుతారు. నాన్-ఎగ్జిక్యూటివ్, స్వతంత్ర మహిళా డైరెక్టర్గా దిపాలి ఎంపిక కావడం విశేషంగా నిలిచింది. దీంతో ఫోర్బ్స్ ఆసియా అండ్ ఇండియాలో అత్యంత శక్తివంతమైన మహిళల్లో ఒకరిగా గుర్తింపు పొందిన దిపాలి గోయెంకా ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది. ఎవరీ దిపాలి గోయెంకా ? ప్రపంచంలోని అతిపెద్ద గృహ వస్త్ర కంపెనీలలో ఒకటైన వెల్స్పన్ ఇండియా లిమిటెడ్ సీఎండీ టెక్స్టైల్ మాగ్నెట్ దిపాలి గోయెంకా సైకాలజీలో గ్రాడ్యుయేట్, హార్వర్డ్ పూర్వ విద్యార్థి. దిపాలి గోయెంకా భర్త బీకే గోయెంకా వెల్స్పన్ గ్రూప్ చైర్మన్. 18 సంవత్సరాల వయస్సులో బీకే గోయెంకాను వివాహం చేసుకున్నారు దిపాలి. బీకే గోయెంకా ఇటీవల ముంబైలో రూ.240 కోట్లతో ఒక లగ్జరీ ఫ్లాట్ను కొనుగోలు చేశారు. రతన్ టాటా ఇంటి విలువ రూ.150 కోట్లు కావడంతో ఆ ఇంటి విలువ రతన్ టాటా ఇంటి కంటే ఖరీదైన ఇల్లుగా నిలిచింది. రూ.19 వేల కోట్ల కంపెనీకి సీఎండీగా రూ. 19000 కోట్ల కంపెనీకి సారధి, అన్స్టాపబుల్ టైకూన్ దిపాలి గోయెంకా సోషల్ మీడియా స్టార్ కూడా. ఆమె ట్విటర్, ఇన్స్టాలో చాలా యాక్టివ్గా ఉంటారు. ఇన్స్టాగ్రామ్లో ఆమెకు 191కే ఫాలోవర్లు ఉన్నారంటే ఆమె స్టార్ రేంజ్ను అర్థం చేసుకోవచ్చు. వెల్స్పన్ గ్రూప్లో 25వేల ఉద్యోగులతో 2.3 బిలియన్ల డాలర్ల ఆదాయంతో టాప్ టెక్స్టైల్ కంపెనీగా దూసుకుపోతోంది. ఇన్నోవేషన్, బ్రాండ్స్ అండ్ సస్టైనబిలిటీపై దృష్టి సారించి వెల్స్పన్ హోమ్ టెక్స్టైల్ వ్యాపారాన్ని బిలియన్ డాలర్లతో ప్రపంచస్థాయికి చేర్చడంలో ఆమెది కీలక పాత్ర. అసోచామ్ ఉమెన్స్ కౌన్సిల్ చైర్పర్సన్గా పనిచేసిన దిపాలీ ప్రస్తుతం వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్లో ఉన్నారు. చిన్నతనంలోనే పెళ్లి సాంప్రదాయ మార్వాడీ నేపథ్యం నుండి వచ్చిన తనకు సాధారణంగానే చిన్న వయస్సులో పెళ్లి అయిందని, అయినా మరింత నేర్చుకోవాలనే పట్టుదలతో దేన్నీ ఆపలేదని చెప్పారు. తన కుమార్తెలకు 10, 7 ఏళ్లు నిండిన తర్వాత తిరిగి కరియర్ మీద దృష్టిపెట్టినట్టు స్వయంగా దిపాలి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. డిజైన్ స్టూడియోతో ప్రారంభించి, 2003లో, దిపాలి గోయెంకా స్పేసెస్, ప్రీమియం బెడ్ అండ్ బాత్ బ్రాండ్ను ప్రారంభించారు. తనకెదురైన ప్రతీ చాలెంజ్ను ఒక అవకాశంగా తీసుకొని ఎదిగారు. సీఈవో విత్ సోల్ 2008లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం కారణంగా ఆమె వస్త్ర వ్యాపారంలోకి అడుగుపెట్టారు. 2016, ఆగస్టు ఒక పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంది. కంపెనీ సరఫరా చేసిన ప్రీమియం ఈజిప్షియన్ కాటన్ షీట్లు చౌకగా ఉన్నాయనే ఆరోపణలతో అమెరికన్ రిటైలర్ టార్గెట్ వెల్స్పన్ ఇండియాతో అన్ని డీల్స్ను ముగించింది. అపుడు వ్యాపారాన్ని తిరిగి గాడిలో పెట్టేలా సాహసంగా ముందుకు సాగారు. ప్రస్తుతం వెల్స్పన్ ఇండియా అమెరికాకు బెడ్ అండ్ బాత్, రగ్గు ఉత్పత్తుల అతిపెద్ద సరఫరాదారు. కస్టమర్-ఫస్ట్ అప్రోచ్ సూత్రాన్ని ఫాలో అయ్యే దిపాలి కూడా దాతృత్వంలో కూడా ముందే ఉన్నారు. అందుకే తన ప్రొఫైల్ బయోలో సీఈవో విత్ సోల్ రాసుకున్నారామె. -
అదానీ పవర్పై ఎక్స్ఛేంజీల కన్ను
న్యూఢిల్లీ: స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజాలు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ తాజాగా అదానీ పవర్ కౌంటర్ను స్వల్పకాలిక అదనపు పర్యవేక్షణ చర్యల(ఏఎస్ఎం) మార్గదర్శకాలలోకి తీసుకువచ్చాయి. వెరసి ఈ నెల 23 నుంచి అదానీ పవర్ స్వల్పకాలిక ఏఎస్ఎం మార్గదర్శకాల తొలి దశ జాబితాలోకి చేరింది. ఈ అంశాన్ని రెండు ఎక్సే్ఛంజీలు విడిగా పేర్కొన్నాయి. సోమవారమే అదానీ గ్రూప్లోని అదానీ గ్రీన్ ఎనర్జీ, ఎన్డీటీవీ స్టాక్స్ను ఎక్సే్ఛంజీలు దీర్ఘకాలిక ఏఎస్ఎం రెండో దశ నుంచి స్టేజ్–1కు బదిలీ చేశాయి. ఇక ఈ నెల 8న అదానీ పవర్, అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ విల్మర్లను స్వల్పకాలిక ఏఎస్ఎంలో చేర్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ నెల 17 నుంచి వీటిని స్వల్పకాలిక ఏఎస్ఎం నుంచి తప్పించాయి. ఏఎస్ఎం పరిధిలోకి చేర్చేందుకు గరిష్ట, కనిష్ట వ్యత్యాసాలు, క్లయింట్ల దృష్టి, సర్క్యూట్ బ్రేకర్లను తాకడం, పీఈ నిష్పత్తి తదితర అంశాలను స్టాక్ ఎక్సే్ఛంజీలు పరిగణించే విషయం విదితమే. స్వల్పకాలిక ఏఎస్ఎంలో చేర్చిన స్టాక్లో ఓపెన్ పొజిషన్లకు 50 శాతం లేదా ప్రస్తుత మార్జిన్ ఏది ఎక్కువైతే అది వర్తిస్తుంది. గరిష్టంగా 100 శాతం మార్జిన్ రేటు పరిమితి ఉంటుంది. -
అదానీ గ్రూప్ గూటిలో ఎన్డీటీవీ
న్యూఢిల్లీ: వార్తా చానళ్ల దిగ్గజం న్యూఢిల్లీ టెలివిజన్ (ఎన్డీటీవీ)లో అదానీ గ్రూప్ తాజాగా 27.26 శాతం వాటాను సొంతం చేసుకుంది. వ్యవస్థాపకులు ప్రణయ్ రాయ్, రాధికా రాయ్ల నుంచి ఈ వాటాను కొనుగోలు చేసినట్లు అదానీ గ్రూప్ పేర్కొంది. దీంతో మీడియా సంస్థలో అదానీ గ్రూప్ వాటా 64.71 శాతానికి ఎగసింది. వెరసి ఎన్డీటీవీపై పూర్తి నియంత్రణను సాధించింది. గత వారం రాయ్ జంట తమకుగల 27.26 శాతం వాటాను అదానీ గ్రూప్నకు విక్రయించనున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఎన్డీటీవీలో రాయ్లకు సంయుక్తంగా 32.26 శాతం వాటా ఉంది. తాజా లావాదేవీ తదుపరి రాయ్ల వాటా(2.5 % చొప్పున) 5 శాతానికి పరిమితమైంది. షేరుకి రూ. 342.65 ధరలో 1.75 కోట్ల షేర్లను చేజిక్కించుకున్నట్లు అదానీ గ్రూప్ వెల్లడించింది. మైనారిటీ వాటాదారులకు చెల్లించిన(ఓపెన్ ఆఫర్) ధరతో పోలిస్తే ఇది 17 శాతం అధికంకాగా.. తద్వారా రాయ్ జంట రూ. 602 కోట్లు అందుకుంది. అనుబంధ సంస్థ ఆర్ఆర్పీఆర్ హోల్డింగ్స్ ద్వారా వాటా కొనుగోలును పూర్తి చేసినట్లు అదానీ గ్రూప్ తెలియజేసింది. రాయ్ల రాజీనామాలు యాజమాన్య నియంత్రణ పూర్తిస్థాయిలో చేతులు మారిన నేపథ్యంలో వ్యవస్థాపకులు ప్రణవ్ రాయ్, రాధికా రాయ్సహా మరో నలుగురు డైరెక్టర్లు బోర్డుకు రాజీనామా చేసినట్లు ఎన్డీటీవీ పేర్కొంది. అంతేకాకుండా కనీస వాటా మాత్రమే మిగిలిన మాజీ ప్రమోటర్లు కంపెనీలో తమను పబ్లిక్ కేటగిరీ వాటాదారులుగా పరిగణించమంటూ బోర్డుని అభ్యర్థించారు. ఇందుకు బోర్డు అనుమతించగా.. స్టాక్ ఎక్సే్ఛంజీలు, వాటాదారులు ఆమోదముద్ర వేయవలసి ఉన్నట్లు ఎన్డీటీవీ తెలియజేసింది. బోర్డు నుంచి తప్పుకున్న డైరెక్టర్లలో డారియస్ తారాపోర్వాలాతోపాటు, స్వతంత్ర డైరెక్టర్లు కౌశిక్ దత్తా, ఇంద్రాణి రాయ్, జాన్ మార్టిన్ ఓలోన్ ఉన్నారు. ఇప్పటివరకూ ప్రణవ్ రాయ్, రాధికా రాయ్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ కోచైర్పర్శన్ పదవిలో ఉన్న విషయం విదితమే. మరోవైపు అమన్ కుమార్ సింగ్ను నాన్ఎగ్జిక్యూటివ్ అదనపు డైరెక్టర్గా, సునీల్ కుమార్ను స్వతంత్ర నాన్ఎగ్జిక్యూటివ్ అదనపు డైరెక్టర్గా బోర్డు ఎంపిక చేసినట్లు ఎన్డీటీవీ వెల్లడించింది. ఈ వార్తల నేపథ్యంలో ఎన్డీటీవీ షేరు 2.6% లాభపడి రూ. 348 వద్ద ముగిసింది. -
ఎన్డీటీవీపై అదానీ పట్టు
న్యూఢిల్లీ: వార్తా చానళ్ల దిగ్గజం న్యూఢిల్లీ టెలివిజన్ (ఎన్డీటీవీ)లో అదానీ గ్రూప్ మెజారిటీ వాటాదారుగా ఆవిర్భవించనుంది. మీడియా సంస్థ వ్యవస్థాపకులు ప్రణయ్ రాయ్, ఆయన భార్య రాధికా రాయ్ 5 శాతం మినహా మిగిలిన తమ వాటాను విక్రయించేందుకు సంసిద్ధతను వ్యక్తం చేశారు. ఇందుకు అదానీ గ్రూప్ దాదాపు రూ. 648 కోట్లు వెచ్చించనుంది. దేశీయంగా అతిపెద్ద, తొలి ప్రయివేట్ రంగ వార్తా చానళ్ల సంస్థ ఎన్డీటీవీని ఏర్పాటు చేసిన రాయ్ దంపతుల వాటాను ఇటీవల అదానీ గ్రూప్ అధిగమించిన సంగతి తెలిసిందే. రాయ్ల సంస్థ ఆర్ఆర్పీఆర్ హోల్డింగ్స్ను సొంతం చేసుకోవడం ద్వారా ఎన్డీటీవీలో తొలుత 29.18% వాటాను అదానీ గ్రూప్ చేజిక్కించుకుంది. ఓపెన్ మార్కెట్ ద్వారా మరికొంత వాటాను సొంతం చేసుకోవడంతో అదానీ గ్రూప్ ఎన్డీటీవీలో అతిపెద్ద వాటాదారుగా ఆవిర్భవించింది. ప్రస్తుతం ఎన్డీటీవీలో అదానీ వాటా 37.44% కాగా.. రాయ్ల వాటా 32.26%. దీనిలో 27.26% వాటాను అదానీ గ్రూప్నకు విక్రయించనుంది. ఈ వాటాను ఈ నెల 30 తదుపరి ఒకేసారి లేదా దశలవారీగా విక్రయించనున్నట్లు ఎన్డీటీవీ ఎక్ఛ్సేంజీలకు సమాచారమిచ్చింది. దీంతో ఎన్డీటీవీలో అదానీ గ్రూప్ వాటా 69.71%కి జంప్చేయనుంది. రాయ్ వాటా విక్రయ వార్తలతో ఎన్డీటీవీ షేరు 2.5% బలపడి రూ.340 వద్ద ముగిసింది. చదవండి: బీభత్సమైన ఆఫర్: జస్ట్ కామెంట్ చేస్తే చాలు.. ఉచితంగా రూ.30 వేల స్మార్ట్ఫోన్! -
ఎలా ఉంటే స్వతంత్రత?
జర్నలిజంలో సాహసం అంటే, ఆ పదం ప్రభుత్వానికి విరోధిగా ఉండాలన్న ఒత్తిడి చేస్తుంది. అది నిజం కాదు. జర్నలిస్టులు వాస్తవికంగా ఉండాలి. ప్రతి కథనాన్ని దాని యోగ్యతను బట్టి మాత్రమే మదింపు చేయాలి. ప్రభుత్వాన్ని పొగడటం చాలా సులభం. కానీ విమర్శించడమే కష్టం. ఇక్కడ తెగువ, సాహసం ముందుకొస్తాయి. ఎన్డీటీవీ ఛానల్లో గౌతమ్ అదానీ మెజారిటీ వాటాదారుగా మారిన నేపథ్యంలో ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్న మవుతున్నాయి. ఛానల్ను స్వాధీనపర్చుకోవడాన్ని ఒక వ్యాపార అవకాశంలా కాక ఒక ‘బాధ్యత’గా చూస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రాథమికంగా చూస్తే ఇది చక్కటి హామీని ధ్వనింపజేస్తోంది. అయితే మీడియా స్వాతంత్య్రం పట్ల ఆయన అభిప్రాయాలను బట్టి దీన్ని చూడాల్సి ఉంటుంది. భారతదేశంలోని 400 వార్తా ఛానల్స్లో నేను ఎక్కువగా చూసేది ఎన్డీటీవీ. అయితే తరచుగా దానిలో వచ్చే అంశాల పట్ల, ఆ ఛానల్ యాంకరింగ్ పట్ల నేను విమర్శనాత్మకంగా ఉంటున్నప్పటికీ, అదే సమయంలో ఆ రెండింటినీ ఆరాధిస్తుంటాను. కాబట్టే ఛానల్ని గణనీయంగా మార్చేసే అధికారంతో అతి త్వరలో గౌతమ్ అదానీ ఎన్డీటీవీ మెజారిటీ వాటాదారుగా మారుతుండటం ఆందోళన కలిగించే విషయం. ఇది మనకు తెలిసిన రూపంలోని ఎన్డీటీవీకి ముగింపు పలకనుందా? ‘ద ఫైనాన్షియల్ టైమ్స్’కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అదానీ తన భవిష్యత్ పథకాల గురించి మాట్లాడారు. నాకు తెలిసి నంతవరకూ, ఆయన ఈ ఒక్కసారి మాత్రమే ఈ విషయం మీద ఇలా మాట్లాడారు. ఎన్డీటీవీని స్వాధీనపర్చుకోవడాన్ని ఒక వ్యాపార అవకాశంలా కాక ఒక ‘బాధ్యత’గా చూస్తున్నట్లు చెప్పారు. ప్రాథమి కంగా చూస్తే ఇది చక్కటి హామీని ధ్వనింపజేస్తోంది. కానీ అది నిజమేనా? మిగిలిన ఇంటర్వ్యూ విశ్వసనీయ సందేహాల కోసం మంచి కారణాలనే ప్రతిపాదిస్తుంది. మీడియా స్వతంత్రతపై అదానీ భావన నుంచి అవి పుట్టుకొస్తున్నాయి. ‘‘స్వాతంత్య్రం అంటే, ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే అది తప్పు అని నువ్వు చెప్పడం అన్నమాట. ఎవరూ దానిపై తగవులాడరు. కానీ అదే సమయంలో, ప్రభుత్వం ప్రతిరోజూ సరైన పని చేస్తున్నప్పుడు దాని గురించి చెప్పే సాహసం నీకు ఉండాలి’’ అని అదానీ జోడించారు. ప్రతిరోజూ మంచి పని చేస్తున్న ప్రభుత్వం ఏది? అలాంటి ప్రభుత్వం ఏదీ నాకు తెలీదు. అలాంటి పనిని గుర్తించడానికి మీకు సాహసం ఎందుకు కావాలి? ఆ పదం జర్నలిజపు విస్తృత సముదాయాన్ని బట్టి మిమ్మల్ని కేవలం విరోధిగా మాత్రమే ఉండాలని ఒత్తిడి చేస్తుంది. కానీ అది నిజం కాదు. జర్నలిస్టులు వాస్తవికంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రతి కథనాన్ని దాని యోగ్యతను బట్టి మాత్రమే వారు మదింపు చేయవలసి ఉంటుంది. ఒక పక్షం వహించకూడదు లేదా తటస్థంగా కూడా ఉండకూడదు. ప్రభుత్వాన్ని పొగడటం నిజానికి చాలా సులభం. వారు దాన్ని ఇష్టపడతారు కూడా. కానీ ప్రభుత్వాన్ని విమర్శించడమే చాలా కష్టం. ఇక్కడ తెగువ, సాహసం ముందు కొస్తాయి. మీడియా స్వాతంత్య్రానికి సంబంధించిన అదానీ భావన దీన్ని స్వీకరిస్తుందని నేను చెప్పలేను. ఆయన పదజాలం అలా స్వీకరించదనే సూచిస్తుంది. అయినప్పటికీ అదానీకి ఎన్డీటీవీ కోసం పెద్ద పథకాలే ఉన్నాయి. ఆ ఛానల్కి అంతర్జాతీయ పాదముద్రను ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నారు. ‘ఫైనాన్షియల్ టైమ్స్’ లేదా ‘అల్ జజీరా’తో సరిపోల్చే స్థాయిలో భారతదేశానికి ఒక్క మీడియా సంస్థ కూడా లేదని కూడా ఆయన అన్నారు. ఇది రెండు విషయాలను సూచి స్తోంది. అదానీ ఎన్డీటీవీలో చాలా పెట్టుబడి పెట్టబోతున్నారు. బహుశా ఆయన ఆ ఛానల్ విశ్వసనీయతను కాపాడవచ్చు. ఎందు కంటే అలా కాపాడకపోతే, ఫైనాన్షియల్ టైమ్స్, అల్ జజీరా స్థాయిని అది సాధించలేదు మరి!. ఇక్కడ సమస్య ఏమిటంటే, మీడియా స్వాతంత్య్రంపై ఆయన భావనతో ఈ ప్రశంసించదగిన ఆకాంక్ష ఘర్షణ పడుతోంది. పైగా, ఇది ఆయనను ఒక భయంకరమైన సందిగ్ధంలో ఉంచుతోంది. లేదా రెండు సందిగ్ధాలు అని కూడా చెప్పవచ్చు. ఎన్డీటీవీ ప్రతిరోజూ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ ఉన్నట్లయితే దాన్ని ప్రభుత్వ ప్రచార అంగంగా మాత్రమే చూస్తారు. అప్పుడు అది ఫైనా న్షియల్ టైమ్స్, అల్ జజీరా స్థాయికి ఎన్నటికీ పెరగలేదు. అదానీకి అర్థం కానిది ఏమిటంటే, విమర్శనాత్మకంగా ఉండే దాని వస్తు గతతత్వం, సాహసమే ఫైనాన్షియల్ టైమ్స్ని గొప్ప పత్రికగా మలిచిందన్నదే! అల్ జజీరా విషయంలో కూడా ఇది నిజమే. కాక పోతే ఖతార్లో తన సొంత ప్రభుత్వ వార్తలను కవర్ చేసే విషయంలో మాత్రం ఇది నిజం కాకపోవడం విషాదం. మరొకటి జరగవచ్చు. ఎన్డీటీవీని గ్లోబల్గా మార్చడానికి తగి నంత డబ్బు అదానీ వద్ద ఉంది. దాన్ని ప్రపంచంలోని ప్రతి మూలకూ చేరుకోగలిగే ఉపగ్రహాలపై అదానీ వెచ్చించగలరు. అయితే ఆ టీవీ ఛానల్ విశ్వసనీయతనే నిర్లక్ష్యం చేసినప్పుడు ఎవరైనా దాన్ని చూడగలరా? బహుశా తాము వదిలిపెట్టి వెళ్లిన గడ్డ గురించి ఇప్పటికీ బాధపడుతున్న, పూర్తిగా స్వదేశంలో లేని కొద్దిమంది ప్రవాస భారతీయులు మాత్రమే ఆ ఛానల్ని చూడవచ్చు తప్ప మరెవరూ చూడబోరు. అదానీ చెప్పని మరో విషయం ఉంది. కానీ తన కొత్త ఛానల్ కోసం తన మనస్సులో ఉన్న ఏ విషయానికైనా నిజానికి అది కీలకమైంది. ఎన్డీటీవీకి విశిష్టమైన స్వభావం, విశ్వసనీయమైన వీక్షకులు, అత్యంత అధిక ప్రతిష్ఠ ఉన్నాయి. ఈ ఛానల్ని కొనడానికి వందలాది కోట్లు వెచ్చించిన తర్వాత (దాన్ని గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లడానికి వేల కోట్లు కూడా వెచ్చించవచ్చు) దాని ప్రతిష్ఠను దిగజార్చి నష్టం కలిగించేలా మార్పులు చేపట్టగలరా? అందుచేత ఆ ఛానల్ ఉత్తమ యాంకర్లు, కరెస్పాండెంట్లను ఆయన అట్టిపెట్టు కోవచ్చు. వీరే లేకుంటే ఎన్డీటీవీ ఉత్త హార్డ్వేర్ లాగా మాత్రమే ఉంటుంది. కానీ వారి వస్తుగత పనితత్వాన్ని, వారి వాక్ స్వాతంత్య్రాన్ని దెబ్బతీసినట్లయితే వారు సంస్థలో కొనసాగుతారా? బహుశా, ఇదే ఆయన ఆలోచనలను కాస్త పదును పెట్టవచ్చు. సంస్థ నుంచి వెళ్లిపోయేవారి స్థానంలో కొత్త జర్నలిస్టులను నియమించడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. కానీ మంచి జర్న లిస్టులను వెతకడమే చాలా కష్టమైన పని. అలాంటివారు ఇప్పటికే చక్కటి వేతనాలతో సురక్షిత స్థానాల్లో ఉండవచ్చు. తమకు సుపరిచితం కాని వ్యవహారంలోకి అడుగుపెట్టి వారు తమను తాము ఎందుకు బలిపెట్టుకుంటారు?. - కరణ్ థాపర్ సీనియర్ జర్నలిస్ట్ -
ఎన్డీటీవీలో అదానీ పైచేయి
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ ఇచ్చిన ఓపెన్ ఆఫర్లో భాగంగా ఇన్వెస్టర్లు 53.27 లక్షల షేర్లు విక్రయించేందుకు ఆసక్తి చూపినట్లు ఎన్డీటీవీ తాజాగా వెల్లడించింది. దీంతో మీడియా సంస్థలో అదానీ గ్రూప్ అతిపెద్ద వాటాదారుగా నిలవనుంది. ఎన్డీటీవీలో పరోక్షంగా 29.18 శాతం వాటాను పొందిన అదానీ గ్రూప్ మరో 26 శాతం వాటా కొనుగోలుకి ఓపెన్ ఆఫర్ ప్రకటించింది. షేరుకి రూ. 294 ధరలో 1.67 కోట్ల షేర్ల కొనుగోలుకి సిద్ధపడింది. శుక్రవారం(2న) ముగింపు ధర రూ. 415తో పోలిస్తే ఆఫర్ ధర 41 శాతం తక్కువకాగా.. షేర్ల కొనుగోలు నేడు(5న) ముగియనుంది. కార్పొరేట్ ఇన్వెస్టర్లు సై ఎన్ఎస్ఈ గణాంకాల ప్రకారం కార్పొరేట్ ఇన్వెస్టర్లు 39.34 లక్షల షేర్లు, రిటైలర్లు 7 లక్షలకుపైగా, అర్హతగల సంస్థాగత కొనుగోలుదారులు(క్విబ్) 6.86 లక్షల షేర్లు చొప్పున టెండర్ చేశారు. ఇవి ఆఫర్లో 32 శాతంకాగా.. 8.26 శాతం వాటాను అదానీ గ్రూ ప్ సొంతం చేసుకోనుంది. వెరసి ఎన్డీటీవీలో అదానీ గ్రూప్ వాటా 37.44 శాతానికి బలపడనుంది. తద్వారా ఎన్డీటీవీ వ్యవస్థాపకులు ప్రణవ్ రా య్, ఆయన భార్య రాధికా రాయ్ల సంయుక్త వా టా 32.26 శాతాన్ని మించనుంది. దీంతో చైర్మన్ పదవికి అదానీ గ్రూప్ అభ్యర్థిని నియమించే అవకాశమున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. చైర్మన్సహా ఇద్దరు డైరెక్టర్లను నియమించవచ్చని తెలియజేశాయి. ప్రస్తుతం ఎన్డీటీవీకి ప్రణవ్ రాయ్ (15.94 శాతం వాటా) చైర్పర్శన్గా, రాధిక(16.32 శాతం) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. వాటాల రీత్యా వీరిరువురూ డైరెక్టర్లుగా కొనసాగేందుకు వీలుంది. -
ఎన్డీటీవీ: ప్రణయ్ రాయ్, రాధిక గుడ్బై, కేటీఆర్ ఏం చేశారంటే?
సాక్షి,ముంబై: ప్రముఖ టీవీ ఛానల్ ఎన్డీటీవీని అదానీ గ్రూప్ టేకోవర్ చేయనున్న తరుణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్డీటీవీ వ్యవస్థాపకులు, ప్రముఖ జర్నలిస్టు ప్రణయ్ రాయ్, అతని భార్య రాధిక రాయ్ ప్రమోటర్ గ్రూప్ వెహికల్ ఆర్ఆర్పిఆర్ హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ల పదవికి రాజీనామా చేశారు. మంగళవారం ఆలస్యంగా స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ప్రకారం తక్షణమే అమలులోకి వచ్చేలా ఇద్దరూ డైరెక్టర్ పదవులకు గుడ్ బై చెపారు. అయితే 32.26 శాతం వాటా ఉన్న ప్రమోటర్లుగా ఛానెల్ బోర్డుకు రాజీనామా చేయలేదు. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో ట్విటర్లో ఎన్డీటీవీని అన్ఫాలో చేస్తున్నానంటూ తెలంగాణా మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇంతవరకూ చేసిన సేవకు వారికి ధన్యవాదాలు తెలిపారు. Unfollowing @ndtv Thanks for the good work thus far 👍 https://t.co/7IsU6TljjJ — KTR (@KTRTRS) November 30, 2022 కొత్త డైరెక్టర్లు ఈ క్రమంలో సుదీప్త భట్టాచార్య, సంజయ్ పుగ్లియా, సంథిల్ సమియా చంగళవరాయన్లు ఎన్డీటీవీకి కొత్త డైరెక్టర్లుగా నియమితులయ్యారు. ఇవి తక్షణమే అమలులోకి వస్తాయని ఆర్ఆర్పిఆర్ హోల్డింగ్ ప్రకటించింది. పుగాలియా అదానీ గ్రూప్లో మీడియా కార్యక్రమాలకు సీఈవో, ఎడిటర్-ఇన్-చీఫ్గా ఉన్నారు. ఎన్డీటీవీ షేరు జోరు మరోవైపు ఓపెన్ ఆఫర్ ప్రకటించిన దగ్గర్నించి జోరుమీదున్న ఎన్డీటీవీ స్టాక్ తాజా వార్తలతో 5 శాతం ఎగిసి అప్పర్ సర్క్యూట్ తాకింది. గత 5 రోజుల్లో 22 శాతానికి పైగా జంప్ చేయగా,ఆరు నెలల కాలంలో స్టాక్ 161 శాతం పెరిగింది. Radhika and Dr. Prannoy Roy have resigned from NDTV's holding company RRPR's board of directors, effectively immediately. pic.twitter.com/LX7J9QuJDx — Abhishek Baxi (@baxiabhishek) November 29, 2022 కాగా అదానీ గ్రూప్ ఎన్డీటీవీ వాటాను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈఏడాది ఆగస్ట్ 23న, అదానీ ఎంటర్ప్రైజెస్ పూర్తి-యాజమాన్య అనుబంధ సంస్థ ఏఎంజీ మీడియా నెట్వర్క్స్ లిమిటెడ్, విశ్వప్రదన్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్లో 100శాతం ఈక్విటీ వాటాలను రూ.113.74 కోట్లకు కొనుగోలు చేసింది. నెల తర్వాత,వీపీసీఎల్ ద్వారా ఎన్డీటీవీలో 29.18 శాతంవాటాను కొనుగోలు చేయనున్నట్లు అదానీ గ్రూప్ ప్రకటించింది. అయితే ఎలాంటి నోటీసు లేకుండానే టేకోవర్ జరిగిందని ఎన్డీటీవీ వాదించింది. దీంతో ఈ వివాదం కోర్టుకు చేరింది. చివరికి ఐపీవో కోసం అదానీకి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. నవంబర్ 22, డిసెంబర్ 5 మధ్య నిర్వహిస్తున్న ఓపెన్ ఆఫర్కు స్పందన బాగానే లభిస్తోంది -
ఎన్డీటీవీ ఓపెన్ ఆఫర్కు స్పందన
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం అదానీ గ్రూప్ ప్రకటించిన ఓపెన్ ఆఫర్లో భాగంగా మూడో రోజు గురువారాని(24)కల్లా దాదాపు 28 లక్షల ఎన్డీటీవీ షేర్లు టెండరయ్యాయి. ఎన్డీటీవీ వాటాదారుల నుంచి 1.67 కోట్ల షేర్లు(26 శాతం వాటా) కొనుగోలుకి అదానీ గ్రూప్ షేరుకి రూ. 294 ధరను నిర్ణయించింది. ఆఫర్ డిసెంబర్ 5న ముగియనుంది. బీఎస్ఈ గణాంకాల ప్రకారం ఆఫర్లో 16.54 శాతానికి సమానమైన 27,72,159 షేర్లు లభించాయి. అయితే గురువారం బీఎస్ఈలో ఎన్డీటీవీ షేరు ఆఫర్ ధరతో పోలిస్తే 25 శాతం అధికంగా రూ. 368కు ఎగువన ముగియడం గమనార్హం! క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఈ నెల 7న అదానీ గ్రూప్ ఓపెన్ ఆఫర్కు అనుమతించిన విషయం విదితమే. వెరసి ఎన్డీటీవీలో 26 శాతం అదనపు వాటాకు అదానీ గ్రూప్ రూ. 493 కోట్లు వెచ్చించనుంది. దశాబ్దకాలం క్రితం ఎన్డీటీవీకి రూ. 400 కోట్ల రుణాలు సమకూర్చిన వీసీపీఎల్ ఇందుకుగాను వారంట్లను పొందింది. వీసీపీఎల్ను సొంతం చేసుకోవడం ద్వారా అదానీ గ్రూప్ ఈ వారంట్లను ఈక్విటీగా మార్చుకునేందుకు నిర్ణయించింది. తద్వారా ఎన్డీటీవీలో 29.18 శాతం వాటాను సొంతం చేసుకుంది. దీంతో ఎన్డీటీవీ వాటాదారులకు ఓపెన్ ఆఫర్ను ప్రకటించింది. -
ఎన్డీటీవీకి అదానీ ఆఫర్ షురూ
న్యూఢిల్లీ: మీడియా కంపెనీ ఎన్డీటీవీలో అదనపు వాటా కొనుగోలుకి అదానీ గ్రూప్ ఓపెన్ ఆఫర్ నేటి(మంగళవారం) నుంచి ప్రారంభంకానుంది. షేరుకి రూ. 294 ధరలో పబ్లిక్ నుంచి 26 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. ఇందుకు దాదాపు రూ. 493 కోట్లు వెచ్చించనుంది. ఆఫర్ ఈ నెల 22న ప్రారంభమై డిసెంబర్ 5న ముగియనుంది. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఈ నెల 7న అదానీ గ్రూప్ ఓపెన్ ఆఫర్కు అనుమతించింది. దశాబ్దంక్రితం వీసీపీఎల్ అనే సంస్థ ఎన్డీటీవీ వ్యవస్థాపకులకు రూ. 400 కోట్ల రుణాలివ్వడం ద్వారా వారంట్లను పొందింది. వీసీపీఎల్ను సొంతం చేసుకున్న అదానీ గ్రూప్ వీటిని ఈక్విటీగా మార్పు చేసుకునేందుకు నిర్ణయించింది. తద్వారా న్యూస్గ్రూప్ సంస్థలో 29.18 శాతం వాటాను హస్తగతం చేసుకుంది. ఫలితంగా అక్టోబర్ 17న వాటాదారుల నుంచి 26 శాతం అదనపు వాటా కొనుగోలుకి ఓపెన్ ఆఫర్ను ప్రకటించింది. అయితే సెబీ నుంచి అనుమతులు ఆలస్యంకావడంతో తాజాగా ఇందుకు తెరతీసింది. వెరసి షేరుకి రూ. 294 ధరలో 1.67 కోట్ల ఎన్డీటీవీ ఈక్విటీ షేర్లను అదానీ గ్రూప్ కొనుగోలు చేయనుంది. ఆఫర్కు పూర్తి స్పందన లభిస్తే రూ. 492.81 కోట్లు వెచ్చించనుంది. ఈ వార్తల నేపథ్యంలో ఎన్డీటీవీ షేరు బీఎస్ఈలో 5 శాతం పతనమై రూ. 382 వద్ద ముగిసింది. ఈ ధరతో పోలిస్తే ఓపెన్ ఆఫర్ 23 శాతం తక్కువ! చదవండి: ఊహించని షాక్.. ఒకప్పుడు ఈ కారుకి ఫుల్ డిమాండ్, ఇప్పుడేమో ఒక్కరూ కొనట్లేదు! -
’అదానీ–ఎన్డీటీవీ’ ఓపెన్ ఆఫర్కు సెబీ ఓకే
న్యూఢిల్లీ: మీడియా సంస్థ ఎన్డీటీవీలో అదనంగా 26 శాతం వాటాల కోసం అదానీ గ్రూప్ ప్రతిపాదించిన ఓపెన్ ఆఫర్కు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఓపెన్ ఆఫర్ నవంబర్ 22న ప్రారంభమై డిసెంబర్ 5తో ముగియనుంది. షేరు ఒక్కింటికి రూ. 294 రేటుతో ఈ ఆఫర్ పరిమాణం రూ. 492.81 కోట్లుగా ఉండనుంది. ఎన్డీటీవీ వ్యవస్థాపకులకు దశాబ్దం క్రితం రూ. 400 కోట్ల రుణం ఇచ్చిన విశ్వప్రధాన్ కమర్షియల్ సంస్థను కొనుగోలు చేయడం ద్వారా అదానీ గ్రూప్ ఎన్డీటీవీలో పరోక్షంగా 29.15 శాతం వాటాలు దక్కించుకున్న సంగతి తెలిసిందే. మైనారిటీ షేర్హోల్డర్ల నుండి మరో 26 శాతం వాటాల కొనుగోలు చేసేందుకు ఓపెన్ ఆఫర్ ప్రకటించింది. సోమవారం ఎన్డీటీవీ షేర్లు దాదాపు 2 శాతం పెరిగి బీఎస్ఈలో రూ. 366 వద్ద క్లోజయ్యాయి. చదవండి: కేంద్రం భారీ షాక్: పది లక్షల రేషన్ కార్డులు రద్దు, కారణం ఏంటంటే. -
ఎన్డీటీవీ ఓపెన్ ఆఫర్కి కట్టుబడి ఉన్నాం
న్యూఢిల్లీ: ఎన్డీటీవీలో అదనంగా 26 శాతం వాటాలను కొనుగోలు చేసే దిశగా ఓపెన్ ఆఫర్ ప్రక్రియను పూర్తి చేసేందుకు కట్టుబడి ఉన్నామని అదానీ గ్రూప్ స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన ఓపెన్ ఆఫర్ లెటర్ ముసాయిదాను పరిశీలించి, అభిప్రాయాలు తెలపాల్సిందిగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీని కోరింది. ఎన్డీటీవీ వ్యవస్థాపకులకు రూ. 400 కోట్ల రుణాలిచ్చిన విశ్వప్రధాన్ కమర్షియల్ (వీసీపీఎల్) అనే సంస్థను ఈ ఏడాది ఆగస్టులో కొనుగోలు చేయడం ద్వారా ఎన్డీటీవీలో అదానీ గ్రూప్ 29.18 శాతం వాటాలు దక్కించుకున్న సంగతి తెలిసిందే. మైనారిటీ షేర్హోల్డర్ల నుండి మరో 26 శాతం వాటాలు కొనుగోలు చేసేందుకు అక్టోబర్ 17న ఓపెన్ ఆఫర్ ప్రకటించనున్నట్లు అప్పట్లో వీసీపీఎల్ తెలిపింది. కానీ డీల్పై ఎన్డీటీవీ ప్రమోటర్ అయిన ఆర్ఆర్పీఆర్ అనుసరిస్తున్న ప్రతికూల వైఖరి కారణంగా సాధ్యపడలేదని తాజాగా పేర్కొంది. ఓపెన్ ఆఫర్ ప్రకారం షేరు ఒక్కింటికి రూ. 294 చొప్పున దాదాపు 1.67 కోట్ల షేర్లను (26 శాతం) వీసీపీఎల్ కొనుగోలు చేస్తుందంటూ ఇష్యూని నిర్వహిస్తున్న జేఎం ఫైనాన్షియల్ గతంలో ఒక ప్రకటనలో పేర్కొంది. దీన్ని బట్టి ఓపెన్ ఆఫర్ అక్టోబర్ 17న ప్రారంభమై నవంబర్ 1న ముగియాలి. మరోవైపు, బుధవారం ఎన్డీటీవీ షేరు రూ. 332.90 వద్ద క్లోజయ్యింది. ఓపెన్ ఆఫర్ ధరతో పోలిస్తే ఇది 13 శాతం అధికం. -
ఎందుకు? ఐటీ అనుమతి అవసరంలేదు..ఎన్డీటీవీ వాటాపై అదానీ గ్రూప్!
న్యూఢిల్లీ: మీడియా సంస్థ ఎన్డీటీవీలో వాటా కొనుగోలుకి ఆదాయపన్ను(ఐటీ) శాఖ అనుమతి అక్కర్లేదని భావిస్తున్నట్లు అదానీ గ్రూప్ పేర్కొంది. ఐటీ నిపుణుల అభిప్రాయం ప్రకారం వాటా కొనుగోలుపై ఎలాంటి ఆంక్షలూ ఉండబోవని తెలియజేసింది. ఎన్డీటీవీ ప్రమోటర్ సంస్థ ఆర్ఆర్పీఆర్ హోల్డింగ్కు దశాబ్దంక్రితం వీసీపీఎల్ రూ. 403 కోట్ల రుణాలిచ్చింది. తదుపరి వీసీపీఎల్ను అదానీ గ్రూప్ సొంతం చేసుకుంది. ఆర్ఆర్పీఆర్కు అందించిన రుణాలకుగాను ఎప్పుడైనా ఈక్విటీగా మార్చుకోగల వారంట్లను వీసీపీఎల్ పొందింది. ఇటీవల ఈ వారంట్లను ఈక్విటీగా మార్చుకుంటున్నట్లు వెల్లడించింది. తద్వారా ఆర్ఆర్పీఆర్లో 99.5 శాతం వాటాను వీపీసీఎల్ పొందనుంది. వెరసి ఎన్డీటీవీలో ఆర్ఆర్పీఆర్కుగల 29.18 శాతం వాటాను చేజిక్కించుకోనుంది. అయితే ఇందుకు ఐటీ అధికారుల అనుమతి అవసరమంటూ ఎన్డీటీవీ అభ్యంతరాలు వ్యక్తం చేసిన విషయం విదితమే. చదవండి👉 అదానీకే ‘లంక’ ప్రాజెక్ట్లు! -
ఎన్డీటీవీ వాటా కొనుగోలు: కొనసాగుతున్న వివాదం
న్యూఢిల్లీ: ఎన్డీటీవీలో గల వాటాను గతంలో ఐటీ అధికారులు తాత్కాలిక అటాచ్మెంట్ చేపట్టిన నేపథ్యంలో ఈక్విటీ మార్పిడికి ఐటీ శాఖ నుంచి అనుమతులు పొందవలసి ఉంటుందని ప్రమోటర్ గ్రూప్ సంస్థ ఆర్ఆర్పీఆర్ హోల్డింగ్ తాజాగా పేర్కొంది. ఇందుకు ఆదాయపన్ను శాఖ అధికారులకు దాఖలు చేస్తున్న అప్లికేషన్కు జత కలవమంటూ అదానీ గ్రూప్ సంస్థ వీసీపీఎల్ను ఆహ్వానించింది. అయితే ఈ వివాదాన్ని వీసీపీఎల్ తప్పుపట్టింది. చెల్లించని రుణాలకుగాను వారంట్లను వెనువెంటనే ఈక్విటీగా మార్పు చేయమంటూ ఆర్ఆర్పీఆర్ను మరోసారి డిమాండ్ చేసింది. వారంట్లను ఈక్విటీగా మార్చుకోవడం ద్వారా ఆర్ఆర్పీఆర్లో వీసీపీఎల్ 99.5 శాతం వాటాను పొందేందుకు నిర్ణయించుకుంది. తద్వారా మీడియా సంస్థ ఎన్డీటీవీలో ఆర్ఆర్పీఆర్కుగల 29.18 శాతం వాటాను సొంతం చేసుకున్నట్లు ప్రకటించింది. దీంతో ఎన్డీటీవీ వాటాదారుల నుంచి మరో 26 శాతం వాటా కొనుగోలుకి ఓపెన్ ఆఫర్ను సైతం ప్రకటించింది. ఇందుకు షేరుకి రూ. 294 ధరలో రూ. 493 కోట్లు వెచ్చించేందుకు సన్నాహాలు చేసిన సంగతి తెలిసిందే. -
అదానీ దూకుడు, ఓపెన్ ఆఫర్ డేట్ ఫిక్స్, షేర్ ప్రైస్ ఎంతంటే?
న్యూఢిల్లీ: మీడియా సంస్థ ఎన్డీటీవీలో అదనంగా 26 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు అదానీగ్రూప్ మరింత వేగంగా అడుగులు వేస్తోంది. ఈ వాటా కొనుగోలుకు సంబంధించి తన ఓపెన్ ఆఫర్ను అక్టోబర్ 17న ప్రారంభించనుంది.1.67 కోట్ల ఈక్విటీ షేర్లను కొనుగోలుకు సంబంధించిన ఈ ఓపెన్ ఆఫర్లో ఒక్కో షేరు ధర రూ. 294గా నిర్ణయించిందని జేఎం ఫైనాన్షియల్ ప్రకటించింది. గౌతమ్ అదానీ నేతృత్వంలోని గ్రూప్ అనుబంధ సంస్థల ద్వారా బహుళ-లేయర్డ్ లావాదేవీలతో ఎన్డీటీవీలో మొత్తం 55శాతం వాటాను కొనుగోలు చేయాలని యోచిస్తోంది. అదానీ గ్రూప్, మీడియా సంస్థలో 29.18వాటాను కొనుగోలు చేయాలనే గ్రూప్ ప్రణాళికలకు అనుగుణంగా, ఓపెన్ ఆఫర్ కోసం తాత్కాలిక ప్రారంభ తేదీగా అక్టోబర్ 17ని నిర్ణయించింది.ఇష్యూకు మేనేజర్ జేఎం ఫైనాన్షియల్ పబ్లిక్ ప్రకటన ప్రకారం, ఆఫర్ తాత్కాలికంగా నవంబర్ 1న ముగియనుంది. ఓపెన్ ఆఫర్కు అనుగుణంగా, ఓపెన్ ఆఫర్లో పూర్తి అంగీకారం ఉందని భావించి, కొనుగోలుదారు, ఓటింగ్ షేర్ క్యాపిటల్లో 26శాతం వరకు పొందవలసి ఉంటుంది. ఒక్కో షేరుకు రూ. 294 ధరతో పూర్తిగా సబ్స్క్రైబ్ అయితే, ఓపెన్ ఆఫర్ మొత్తం రూ. 492.81 కోట్లుగా ఉంటుంది. (ఢిల్లీ టూ సిమ్లా: విమాన టికెట్ ధర కేవలం రూ. 2480) కాగా ఆగస్టు 23న, ఆర్ఆర్పీఆర్ హోల్డింగ్లో 99.99 శాతం వాటాను కలిగి ఉన్న విశ్వప్రధాన కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ కొనుగోలు ద్వారా ఎన్డీటీవీలో 29.18 శాతం వాటాను కొనుగోలు చేస్తున్నట్లు అదానీ గ్రూప్ ప్రకటించింది. అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్కు చెందిన ఏఎంజీ మీడియా నెట్వర్క్ లిమిటెడ్లో భాగమైన వీపీసీఎల్ వాటా తీసుకున్నామని వివరించింది. ఎన్డీటీవీలో ఆర్ఆర్పీఆర్ ప్రమోటర్ గ్రూప్ కంపెనీ. ఇందులో 29.18 శాతం వారికి వాటా ఉంది. ఎన్డీటీవీలో మరో 26 శాతం వాటా కొనుగోలుకు వీసీపీఎల్, ఏఎంఎన్ఎల్, ఏఈఎల్ కలిసి ఓపెన్ ఆఫర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. (Share Pledging Case: కోటక్ మహీంద్రా బ్యాంక్కు భారీ ఊరట!) -
అదానీ బిడ్పై సెబీకి ఎన్డీటీవీ.. స్పష్టత కోరిన ఆర్ఆర్పీఆర్ హోల్డింగ్
న్యూఢిల్లీ: బలవంతపు టేకోవర్ సవాళ్లు ఎదుర్కొంటున్న మీడియా సంస్థ ఎన్డీటీవీ తాజాగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీని ఆశ్రయించింది. వీసీపీఎల్కు జారీ చేసిన వారంట్లను ఈక్విటీగా మార్పుచేసే అంశంపై స్పష్టత కోసం ప్రమోటర్ సంస్థ ఆర్ఆర్పీఆర్ హోల్డింగ్ లిమిటెడ్ సెబీని అభ్యర్థించింది. అదానీ గ్రూప్ సంస్థ వీసీపీఎల్ వారంట్లను ఈక్విటీగా మార్పు చేసుకునేందుకు నిర్ణయించుకున్న నేపథ్యంలో ఆర్ఆర్పీఆర్ తాజా చర్యకు ప్రాధాన్యత ఏర్పడింది. వారంట్ల ద్వారా ఆర్ఆర్పీఆర్లో 99.5 శాతం వాటాను వీసీపీఎల్ పొందనుంది. తద్వారా ఎన్డీటీవీలో ఆర్ఆర్పీఆర్కుగల 29.18 శాతం వాటాను సొంతం చేసుకోనుంది. దీంతో సెబీ నిబంధనల ప్రకారం ఎన్డీటీవీ వాటాదారుల నుంచి మరో 26 శాతం వాటా కొనుగోలుకి షేరుకి రూ. 294 ధరలో ఇప్పటికే అదానీ గ్రూప్ ఓపెన్ ఆఫర్ను సైతం ప్రకటించింది. కాగా.. ఎన్డీటీవీ వ్యవస్థాపకులు ప్రణయ్ రాయ్, రాధికా రాయ్లను 2020 నవంబర్ 27న సెబీ రెండేళ్లపాటు సెక్యూరిటీల మార్కెట్ల నుంచి నిషేధించింది. ఈ నిషేధం ఇంకా కొనసాగుతున్నందున వారంట్లను ఈక్విటీగా మార్పు చేసేందుకు ఆర్ఆర్పీఆర్ సెబీ నుంచి స్పష్టతను కోరుతోంది. షేరు జూమ్ వాటాదారులకు అదానీ గ్రూప్ ఓపెన్ ఆఫర్ నేపథ్యంలో ఎన్డీటీవీ కౌంటర్కు కొద్ది రోజులుగా డిమాండ్ పెరిగింది. దీంతో మరోసారి బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో 5 శాతం అప్పర్ సర్క్యూట్ను తాకింది. ఎన్ఎస్ఈలో రూ. 21 బలపడి రూ. 449 వద్ద ముగిసింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. గత నాలుగు వారాల్లో ఈ షేరు రూ. 263 నుంచి 70 శాతంపైగా దూసుకెళ్లింది. రూ. 186 లాభపడింది. -
ఎన్డీటీవీ ఏజీఎం వాయిదా
న్యూఢిల్లీ: అదనంగా 26 శాతం వాటాల కొనుగోలు కోసం అదానీ గ్రూప్ ఓపెన్ ఆఫర్ నేపథ్యంలో ఎన్డీటీవీ తమ వార్షిక సర్వసభ్య సమావేశాన్ని (ఏజీఎం) సెప్టెంబర్ 27కు వాయిదా వేసింది. వాస్తవానికి ఇది సెప్టెంబర్ 20న జరగాల్సి ఉంది. అనుబంధ సంస్థ వీసీపీఎల్ ద్వారా ఎన్డీటీవీలో అదానీ గ్రూప్ పరోక్షంగా 29.18 శాతం వాటాలను దక్కించుకున్న సంగతి తెలిసిందే. దానికి కొనసాగింపుగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిబంధనల ప్రకారం మరో 26 శాతం వాటా కొనుగోలు కోసం ఓపెన్ ఆఫర్ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే నిర్దిష్ట నిబంధనల అమలు కోసం 34వ ఏజీఎంను వారం రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ఎన్డీటీవీ తెలిపింది. -
సెబీ అనుమతిపై ఎన్డీటీవీ ప్రమోటర్లకు అదానీ కౌంటర్
న్యూఢిల్లీ: ఎన్డీటీవీ ప్రమోటర్ సంస్థ ఆర్ఆర్పీఆర్లో వాటాను సొంతం చేసుకునేందుకు సెబీ అనుమతులు అవసరంలేదని అదానీ గ్రూప్ తాజాగా పేర్కొంది. ఆర్ఆర్పీఆర్ లేవనెత్తిన అంశాలు నిరాధారమని, న్యాయపరంగా ఆమోదనీయంకావని, సత్యదూరాలని వ్యాఖ్యానించింది. దీంతో వెనువెంటనే వారంట్ల స్థానే ఈక్విటీల కేటాయింపునకు డిమాండ్ చేస్తున్నట్లు తెలియజేసింది. ఆర్ఆర్పీఆర్కు ఇచ్చిన రుణాలకుగాను పొందిన వారంట్లను ఈక్విటీగా మార్పు చేసుకునేందుకు అదానీ గ్రూప్ సంస్థ వీసీపీఎల్ నిర్ణయించడం తెలిసిందే. తద్వారా ఎన్డీటీవీ ప్రమోటర్ సంస్థలో 99.5% వాటాను పొందనుంది. ఫలితంగా ఎన్డీటీవీలో ఆర్ఆర్పీఆర్కు గల 29.18% వాటాను సొంతం చేసుకోనుంది. కాగా నవంబర్ 2020లో క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ తన ప్రమోటర్లను షేర్లను కొనడం లేదా విక్రయించకుండా రెండేళ్లపాటు నిషేధించిందని, అందువల్ల నవంబర్ వరకు వీసీపీఎల్కు షేర్లను బదిలీ చేయడం సాధ్యం కాదని పేర్కొన్న ఎన్డిటివి స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్పై అదానీ గ్రూప్ స్పందించింది. -
సెబీ అనుమతి తప్పనిసరి
న్యూఢిల్లీ: కంపెనీకి చెందిన ప్రమోటర్ల వాటా కొనుగోలుకి క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అనుమతి తప్పనిసరి అంటూ వార్తా చానళ్ల మీడియా సంస్థ ఎన్డీటీవీ తాజాగా స్పష్టం చేసింది. చెల్లించని రుణాలస్థానే ప్రమోటర్ గ్రూప్ సంస్థ ఆర్ఆర్పీఆర్ లిమిటెడ్లో వాటాను చేజిక్కించుకునేందుకు వీసీపీఎల్.. సెబీ అనుమతి పొందవలసి ఉన్నట్లు పేర్కొంది. 2020 నవంబర్ 27న కంపెనీ వ్యవస్థాపక ప్రమోటర్లు ప్రణయ్, రాధికా రాయ్లను సెబీ రెండేళ్లపాటు సెక్యూరిటీ మార్కెట్ల నుంచి నిషేధించింది. తద్వారా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సెక్యూరిటీల కొనుగోలు, విక్రయం లేదా సెక్యూరిటీల మార్కెట్లలో ఏ ఇతర కార్యకలాపాలు చేపట్టకుండా ఆంక్షలు విధించింది. ఈ నిషేధం 2022 నవంబర్ 26న ముగియనున్నట్లు స్టాక్ ఎక్సే్ఛంజీలకు ఎన్డీటీవీ వివరించింది. దీంతో గడువుకంటే ముందుగానే ఆర్ఆర్పీఆర్లో వీసీపీఎల్ వాటాను సొంతం చేసుకునేందుకు సెబీ అనుమతి తప్పనిసరిగా తెలియజేసింది. మంగళవారం వీసీపీఎల్ ద్వారా ఎన్డీటీవీలో 29.18% వాటాను కొనుగోలు చేసినట్లు అదానీ గ్రూప్ వెల్లడించింది. దీంతో సాధారణ వాటాదారుల నుంచి మరో 26% వాటా కొనుగోలుకి షేరుకి రూ. 294 ధరలో ఓపెన్ ఆఫర్ను సైతం ప్రకటించిన విషయం విదితమే. వారెంట్ల నిబంధనలు కీలకం ఎన్డీటీవీ బలవంతపు టేకోవర్కు అదానీ గ్రూప్ చేస్తున్న ప్రయత్నాలలో వారెంట్ల జారీలో చోటుచేసుకున్న నిబంధనలు కీలకంగా నిలవనున్నట్లు న్యాయనిపుణులు అభిప్రాయపడ్డారు. అదానీ గ్రూప్నకు చెందిన వీసీపీఎల్ నుంచి వారెంట్ల జారీ ద్వారా ఎన్డీటీవీ ప్రమోటర్ సంస్థ ఆర్ఆర్పీఆర్ హోల్డింగ్ గతంలో దాదాపు రూ. 404 కోట్ల రుణాలు పొందింది. వీటిని ఈక్విటీగా మార్పిడి చేసుకోవడం ద్వారా ఆర్ఆర్పీఆర్లో 99.9 శాతం వాటాను పొందినట్లు అదానీ గ్రూప్ తెలియజేసింది. వెరసి ఎన్డీటీవీలో 29.18 శాతం వాటాను సొంతం చేసుకున్నట్లు వెల్లడించింది. అయితే ప్రమోటర్లకు ఈ విషయం తెలియదంటూ ఎన్డీటీవీ పేర్కొంది. దీంతో వారెంట్ల జారీలో అంగీకరించిన నిబంధనలు ఇకపై కీలక పాత్ర పోషించనున్నట్లు న్యాయనిపుణులు పేర్కొంటున్నారు. రేటింగ్పై ఎఫెక్ట్... బిలియనీర్ గౌతమ్ అదానీ గ్రూప్ ఇతర కంపెనీల కొనుగోళ్ల ద్వారా భారీగా విస్తరిస్తోంది. అయితే రుణాల ద్వారా చేపడుతున్న ఈ కొనుగోళ్లు కంపెనీ రేటింగ్పై ఒత్తిడిని పెంచుతుందని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ తాజాగా పేర్కొంది. 1988లో కమోడిటీల ట్రేడర్గా ప్రారంభమైన గ్రూప్ మైనింగ్, పోర్టులు, విద్యుత్ ప్లాంట్లు, విమానాశ్రయాలు తదితర పలు రంగాలలో భారీగా విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ బాటలో ఇటీవలే సిమెంట్ రంగంలో 10.5 బిలియన్ డాలర్ల విలువైన కొనుగోళ్లకు తెరతీసింది. -
అదానీ గ్రూప్ చేతికి ఎన్డీటీవీ.. మరి మాతో చర్చించ లేదు!
అటు సంపదలోనూ, ఇటు విభిన్న వ్యాపార విస్తరణలోనూ పోటీ పడుతున్న కార్పొరేట్ దిగ్గజాలు ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ తాజాగా మీడియా విభాగంలోనూ సై అంటున్నారు. రుణాలను ఈక్విటీగా మార్పు చేసుకోవడం ద్వారా ఎన్డీటీవీలో 29 శాతానికిపైగా వాటాను అదానీ గ్రూప్ సొంతం చేసుకుంది. మెజారిటీ వాటాపై కన్నేసింది. ఇప్పటికే బ్రాడ్క్యాస్టింగ్ సంస్థ నెట్వర్క్ 18ను ముకేశ్ అంబానీ చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే!! న్యూఢిల్లీ: వార్తా చానళ్ల మీడియా సంస్థ న్యూఢిల్లీ టెలివిజన్ లిమిటెడ్(ఎన్డీటీవీ)లో మెజారిటీ వాటాను సొంతం చేసుకునేందుకు ప్రయివేట్ రంగ దిగ్గజం అదానీ గ్రూప్ పావులు కదుపుతోంది. దీనిలో భాగంగా సాధారణ వాటాదారుల నుంచి 26 శాతం వాటా కొనుగోలుకి ఓపెన్ ఆఫర్ను ప్రకటించింది. ఇందుకు షేరుకి రూ. 294 ధరను నిర్ణయించింది. తద్వారా రూ. 4 ముఖ విలువగల దాదాపు 1.68 కోట్ల షేర్లను చేజిక్కించుకోవాలని చూస్తోంది. ఇందుకు రూ. 493 కోట్లు వెచ్చించనుంది. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిబంధనలకంటే ఆఫర్ ధర అధికమని ఈ సందర్భంగా కంపెనీ పేర్కొంది. ఎన్ఎస్ఈలో ఎన్డీటీవీ షేరు సోమవారం ముగింపు ధర రూ. 359కాగా.. ఈ వార్తల నేపథ్యంలో మంగళవారం షేరుకి భారీ డిమాండ్ నెలకొంది. దీంతో 5 శాతం అప్పర్ సర్క్యూట్ను తాకి (రూ. 18 లాభపడి) రూ. 377 వద్ద ముగిసింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. ఓపెన్ ఆఫర్ ధర కంటే 28% అధికం! 55 శాతానికి ఎన్డీటీవీలో వారంట్ల మార్పిడి ద్వారా అదానీ గ్రూప్ దాదాపు 30% వాటాను సొంతం చేసుకుంది. దీంతో పబ్లిక్ నుంచి మరో 26% వాటా కొనుగోలుకి ఓపెన్ ఆఫర్ను ప్రకటించింది. ఈ ఆఫర్ విజయవంతమైతే ఎన్డీటీవీలో 55%పైగా వాటాను అదానీ గ్రూప్ పొందే వీలుంది. ఏఎంజీ మీడియా నెట్వర్క్స్కు పూర్తి అనుబంధ సంస్థ విశ్వప్రధాన్ కమర్షియల్ ప్రయివేట్ లిమిటెడ్(వీసీపీఎల్) వారంట్లను మార్పిడి చేసుకోవడం ద్వారా ఆర్ఆర్పీఆర్ హోల్డింగ్ ప్రయివేట్లో 99.5% వాటాను చేజిక్కించుకుంది. దీంతో ఎన్డీటీవీలో ఆర్ఆర్పీఆర్కు గల 29.18% వాటాను పొందింది. ఎన్డీటీవీ ప్రమోటర్ కంపెనీ ఆర్ఆర్పీఆర్. వెరసి వీసీపీఎల్తో పాటు అదానీ మీడియా నెట్వర్క్స్, అదానీ ఎంటర్ప్రైజెస్ ఉమ్మడిగా ఓపెన్ ఆఫర్ను ప్రకటించాయి. 26% వాటాకు సమానమైన 1,67,62,530 షేర్లను వాటాదారుల నుంచి కొనుగోలు చేయనున్నాయి. ఎన్డీటీవీ వ్యవస్థాపకులు ప్రణయ్ రాయ్, రాధికా రాయ్లకు సంస్థలో సంయుక్తంగా 32.26% వాటా ఉంది. కాగా.. అదానీ గ్రూప్ రూ. 114 కోట్లకు కొనుగోలు చేసిన వీసీపీఎల్ గతంలో ముకేశ్ అంబానీ గ్రూప్ సంస్థ కావడం కొసమెరుపు! మాతో చర్చించ లేదు వారంట్ల మార్పిడి ద్వారా ఆర్ఆర్పీఆర్లో వాటా చేజిక్కించుకున్న విషయంపై ప్రమోటర్లతో వీసీపీఎల్ చర్చించలేదు. అనుమతి కోరలేదు. ఈ విషయం వీసీపీఎల్ జారీ నోటీసు ద్వారా ఈరోజే ప్రమోటర్లకు తెలిసింది. వాటా విక్రయించేందుకు ప్రమోటర్లు ఎవరితోనూ చర్చించడంలేదు’. – ఎన్డీటీవీ -
ప్రపంచంలోనే అతి పెద్ద ఫార్మసీ కేంద్రంగా భారత్
న్యూఢిల్లీ: స్వాతంత్య్రం వచ్చిన ఈ 75 ఏళ్లలో భారత్ ఆరోగ్య రంగంలో ఎనలేని పురోగతి సాధించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామి నాథన్ ప్రశంసించారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఫార్మసీ కేంద్రంగా అవతరించిందని అన్నారు. ఎన్డీటీవీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆది వారం ఆన్లైన్ ద్వారా ఆమె పాల్గొన్నారు. పోలియో నిర్మూలన, మాతా శిశు సంరక్షణ కోసం వేసే వ్యాక్సిన్ల ద్వారా భారత్ ఆరోగ్య రంగంలో అద్భుతమైన ఫలితాలు సాధించిందని కొనియా డారు. అయితే కరోనా దెబ్బతో ఇతర అనారోగ్య సమస్యలకు భారత్ సహా ఇతర దేశాల్లో కూడా చికిత్స దొరకక పోవడం విచారకరమని అన్నారు. భారత్లో పౌష్టికాహార లోపంతో అయిదేళ్ల లోపు చిన్నారులు అధికంగా మృత్యువాత పడుతున్నారని యూనిసెఫ్ నివేదికను ప్రస్తావించిన ఆమె కరోనా ఈ దుస్థితిని మరింత తీవ్రం చేసిందని అన్నారు. కరోనా సంక్షోభంతో భారత్ సహా చాలా దేశాల్లో పేదరికం పెరిగిపోయిందని, పౌష్టికాహారం లభిం చక ఎన్నో వ్యాధులు చుట్టుముడుతున్నాయన్నారు. -
అదానీ, అవన్ని వదంతులేనా? ఆ టీవీని అమ్మడం లేదట!
Gautham Adani And NDTV Issue: తమ టీవీ ఛానల్ యాజమాన్య మార్పుపై వస్తున్న వార్తలన్నీ నిరాధరామైనవని ఎన్డీటీవీ ప్రకటించింది. ఎన్డీటీవీ అమ్మకానికి సంబంధించి ప్రస్తుతం కానీ, గతంలో కానీ ఎవరితో చర్చలు జరగలేదని ఆ టీవీ ఛానల్ ఫౌండర్లు, మేజర్ షేర్ హోల్డర్లయిన ప్రణయ్రాయ్, రాధికలు ప్రకటించారు. రిలయన్స్కి పోటీగా పోర్టుల బిజినెస్లో దూసుకుపోతున్న అదాని గ్రూపు ఇటీవలే గ్రీన్ ఎనర్జీ రంగంలోనూ భారీ పెట్టుబడులు పెట్టబోతున్నట్టు ప్రకటించింది. గ్రీన్ ఎనర్జీలో భారీ లక్ష్యాలను రిలయన్స్ గ్రూపు ప్రకటించిన కొద్ది రోజులకే అదానీ గ్రూపు నుంచి గ్రీన్ ఎనర్జీ ప్రకటన వెలువడింది. తాజాగా అదే పరంపరలో రిలయన్స్ తరహాలోనే బిజినెస్ టైకూన్ గౌతమ్ అదానీ మీడియా రంగంలో అడుగు పెడుతున్నారంటూ గత వారం రోజులుగా వార్తలు వస్తున్నాయి. తెరపైకి సీనియర్ జర్నలిస్ట్ ఇటు బిజినెస్, అటు పొలిటికల్ సర్కిళ్లలో జరుగుతున్న ప్రచారానికి తగ్గట్టే పలు మీడియా సంస్థల్లో ఉన్నత హోదాలో పని చేసిన సీనియర్ జర్నలిస్టు సంజయ్ పుగాలియా ఇటీవల అదానీ గ్రూపులో చేరారు. దీంతో ఈ వాదనలకు మరింత బలం చేకూరింది. పెరిగిన షేర్ల ధర మీడియా రంగంలో అడుగు పెట్టాలనుకుంటున్న గౌతమ్ అదానీ ఎన్డీటీవీని కొనబోతున్నట్టు బిజినెస్ సర్కిళ్లలో ప్రచారం జరిగింది. రెండు రోజుల్లోనే ఈ ప్రచారం ఊపందుకోవడంతో ఒక్కసారిగా షేర్ మార్కెట్లో ఎన్డీటీవీ షేర్లు పది శాతం మేర పెరిగాయి. అంతా వదంతులే ప్రభుత్వం విధానాల్లో లోపాలను ఎత్తి చూపడంతో ఎన్డీటీవీది ప్రత్యేక శైలి. అలాంటి ఛానల్ యాజమాన్య మార్పులకు లోనవుతుందంటూ జరుగుతున్న ప్రచారం పెరిగిపోవడంతో ఆ టీవీ ఫౌండర్లు స్పందించారు. తమ ఛానల్ అమ్మడం లేదంటూ క్లారిటీ ఇవ్వడంతో పాటు... పుకార్లను కొట్టి పారేశారు. చదవండి : హైడ్రోజన్ ఉత్పత్తిలోకి అదానీ -
మీ షేర్లు, మార్కెట్ విలువను తెలపండి
న్యూఢిల్లీ: ఎన్డీటీవీ ప్రమోటర్లు ప్రణయ్ రాయ్ ఆయన భార్య రాధికా రాయ్ల షేర్లు, వాటి విలువను శుక్రవారం నాడు తెలియజేయాలని అత్యున్నత న్యాయస్థానం గురువారం ఆదేశించింది. కేసు వివరాల్లోకి వెళితే... కంపెనీ పునర్ వ్యవస్థీకరణ ప్రతిపాదనకు సంబంధించి తమ వద్ద ఉన్న అన్పబ్లిష్డ్ ప్రైస్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ (యూపీఎస్ఐ)ను దుర్వినియోగపరచి న్యూ ఢిల్లీ టెలివిజన్ లిమిటెడ్ (ఎన్డీటీవీ)షేర్ల విషయంలో ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా రూ.16.97 కోట్లకుపైగా అక్రమ లబ్ది పొందారన్నది వీరిపై ఆరోపణ. అక్రమంగా పొందిన ఈ డబ్బును 6 శాతం వడ్డీతోసహా సెబీ వద్ద 45 రోజులలోపు డిపాజిట్ చేయాలని సెబీ గత ఏడాది నవంబర్ చివర్లో ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఎన్డీటీవీ ప్రమోటర్లపై రెండేళ్లపాటు ఈక్విటీ మార్కెట్ లావాదేవీల నుంచి నిషేధించింది. 2006 సెప్టెంబర్– 2008 జూన్ మధ్య చోటుచేసుకున్న కార్యకలాపాలకు సంబంధించి సెబీ ఈ ఆదేశాలు ఇచ్చింది. ఆ సమయంలో ప్రణయ్ రాయ్ ఎన్డీటీవీకి చైర్మన్గా, హోల్ టైమ్ డైరెక్టర్గా ఉన్నారు. సెబీ ఆదేశాలపై ఎన్డీటీవీ ప్రమోటర్లు సెక్యూరిటీస్ అప్పీలేట్ ట్రిబ్యునల్ (శాట్)ని ఆశ్రయించారు. అయితే ఇన్సైడర్ లావాదేవీ ద్వారా అక్రమంగా పొందినట్లు సెబీ గుర్తించిన మొత్తంలో 50 శాతం డిపాజిట్ చేయాలని శాట్ ఆదేశాలు ఇచ్చింది. దీనిపై రాయ్ దంపతులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వీరి అప్పీల్స్పై సుప్రీంకోర్టు గురువారం విచారించింది. తమ వద్ద తగిన వేరే ఆదాయ వనరులు ఏవీ లేనందున, సెబీ జరిమానాకు ఎన్డీటీవీ షేర్లనే హామీగా పెడతామని రాయ్ దంపతుల తరఫు న్యాయవాది ముకుల్ రోతంగీ ఆఫర్ చేశారు.దీనిని పరిశీలించిన చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డీ నేతృత్వంలోని ధర్మాసనం షేర్ల విలువ స్టేట్మెంట్ను శుక్రవారం అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది. -
ఎన్డీటీవీ ప్రమోటర్లపై సెబీ కొరడా
న్యూఢిల్లీ: ఎన్డీటీవీ ప్రమోటర్లు ప్రణయ్ రాయ్, రాధికా రాయ్లపై సెబీ కొరడా ఝళిపించింది. రెండేళ్లపాటు ఈక్విటీ మార్కెట్ లావాదేవీల నుంచి నిషేధించింది. ఇన్సైడర్ ట్రేడింగ్ కేసులో సెబీ ఈ నిర్ణయం తీసుకుంది. కంపెనీ పునర్ వ్యవస్థీకరణ ప్రతిపాదనకు సంబంధించి తమ వద్ద ఉన్న అన్పబ్లిష్డ్ ప్రైస్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ (యూపీఎస్ఐ)ను దుర్వినియోగపరచి న్యూఢిల్లీ టెలివిజన్ లిమిటెడ్ (ఎన్డీటీవీ)షేర్ల విషయంలో ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా రూ.16.97 కోట్లకుపైగా అక్రమ లబ్ధి పొందారన్నది వీరిపై ఆరోపణ. అక్రమంగా పొందిన ఈ డబ్బును 6 శాతం వడ్డీతోసహా సెబీ వద్ద డిపాజిట్ చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. అప్పీల్కు కంపెనీ... అయితే ఈ ఆరోపణలను కంపెనీ తప్పుపట్టింది. తగిన ఆధారాలు లేకుండా సెబీ ఈ రూలింగ్ ఇచ్చిందని పేర్కొంది. ఈ రూలింగ్పై అప్పీల్కు వెళతామని ఒక ప్రకటనలో తెలిపింది. 2006 సెప్టెంబర్– 2008 జూన్ మధ్య చోటుచేసుకున్న కార్యకలాపాలకు సంబంధించి సెబీ ఈ ఆదేశాలు ఇచ్చింది. ఆ సమయంలో ప్రణయ్ రాయ్ ఎన్డీటీవీకి చైర్మన్గా, హోల్ టైమ్ డైరెక్టర్గా ఉన్నారు. రాధికా రాయ్ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. అక్రమ లబ్ధికి సంబంధించి మరికొందరు వ్యక్తులు, సంస్థలపైన కూడా సెబీ మార్కెట్ కార్యకలాపాల నుంచి నిషేధాజ్ఞలు విధించింది. అప్పట్లో సంస్థ సీఈఓ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేసిన విక్రమాదిత్య చంద్ర, సీనియర్ అడ్వైజర్ (ఎడిటోరియల్ అండ్ ప్రాజెక్ట్స్), ఈశ్వరీ ప్రసాద్ బాజ్పాయ్, ఫైనాన్స్ డైరెక్టర్, గ్రూప్ సీఎఫ్ఓ సౌరవ్ బెనర్జీలు వీరిలో ఉన్నారు. -
సరిహద్దులో చైనా కొత్త ఎత్తుగడ
న్యూఢిల్లీ: డోక్లాం పీఠభూమి ప్రాంతంలో అన్ని కాలాలలో రహదారి మార్గం సుగమం చేసుకోవడానికి రోడ్డు నిర్మాణ కార్యకలాపాలను చైనా వేగవంతం చేసినట్లు ఎన్డీటీవీ సేకరించిన ఉపగ్రహ చిత్రాల ఆధారంగా వెల్లడయ్యింది. ఈ ప్రాంతంలో 2017లో చైనా భారత్ మధ్య 70 రోజుల పాటు ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ ప్రాంతంలోని చైనా నిర్మాణ కార్మికులు ఉపరితల సొరంగమార్గాన్ని 500 మీటర్ల వరకు పొడిగించుకున్నట్లు ఉపగ్రహ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి. శీతాకాలంలో ఈ మార్గం అంతా మంచుతో కప్పబడి ఉంటుందని, దానికోసమే ఏ కాలంలోనైనా ప్రయాణించేలా ఈ రవాణా సౌకర్యాన్ని పెంచుకున్నట్లు స్పష్టమౌతోందని సైనిక నిపుణులు భావిస్తున్నారు. డోక్లాం పీఠభూమి తమ భూభాగంలోనిదేనంటూ చైనా, భూటాన్ ప్రకటించుకుంటున్నాయి. ఈ విషయంలో భారత్, భూటాన్కి మద్దతిస్తోంది. -
ఎల్లో మీడియాకు ఇది వినిపిస్తోందా?
సాక్షి, అమరావతి: కరోనా నియంత్రణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను జాతీయ మీడియా ప్రశంసించింది. ఈ విషయంపై వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తన ట్విటర్ ఖాతాలో.. 'యువ ముఖ్యమంత్రి తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలు, అత్యవసర వైద్య సదుపాయాల విస్తరణ వల్ల ఏపీలో కరోనా వ్యాధి అదుపులోకి వచ్చిందని ఎన్డీటీవీ ప్రత్యేకంగా ప్రస్తావించింది. మిగిలిన రాష్ట్రాల కంటే ఏపీలో నియంత్రణ కట్టుదిట్టంగా సాగుతోందని ప్రశంసించింది. ఎల్లో మీడియాకు ఇది వినిపిస్తోందా?' అంటూ ట్వీట్ చేశారు. చదవండి: 40 ఇయర్స్ ఇండస్ట్రీ.. వాటే గ్రేట్ ఫాల్! యువ ముఖ్యమంత్రి తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలు, అత్యవసర వైద్య సదుపాయాల విస్తరణ వల్ల ఏపీలో కరోనా వ్యాధి అదుపులోకి వచ్చిందని NDTV ప్రత్యేకంగా ప్రస్తావించింది. మిగిలిన రాష్ట్రాల కంటే ఏపీలో నియంత్రణ కట్టుదిట్టంగా సాగుతోందని ప్రశంసించింది. ఎల్లో మీడియాకు ఇది వినిపిస్తోందా? pic.twitter.com/PMFdZtGN4F — Vijayasai Reddy V (@VSReddy_MP) April 13, 2020 కాగా మరో ట్వీట్లో 'టీడీపీ పాలనలో దోచుకోవడమే కానీ ప్రజలకు పైసా విదిల్చింది లేదు. కరోనా కష్ట సమయంలో దానశీలులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు ప్రతి చోట అన్నార్తులకు నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నారు. దాచుకోవడమే తెలిసినవాళ్లు దొంగల్లా పొరుగు రాష్ట్రంలో తలదాచుకున్నారు' అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. చదవండి: కరోనాపై బ్రహ్మాస్త్రం ఇది : విజయసాయిరెడ్డి -
లాక్డౌన్ను విజయవంతంగా అమలు చేస్తూ..
-
ఎన్డీటీవీ ప్రమోటర్లపై సీబీఐ కేసు
న్యూఢిల్లీ: ప్రముఖ ఆంగ్ల టీవీ ఛానల్ ‘ఎన్డీ టీవీ’పై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) బుధవారం కొరడా ఝుళిపించింది. ఎన్డీ టీవీ ప్రమోటర్లు ప్రణయ్ రాయ్, రాధికారాయ్తో పాటు సీఈవో సీఈఓ విక్రమాదిత్య చంద్ర, గుర్తుతెలియని ప్రభుత్వాధికారులపై నేరపూరిత కుట్ర, మోసం, అవినీతి తదిరత సెక్షన్ల కింద కేసు నమోదుచేసింది. 2007–09 మధ్యకాలంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్డీఐ) సేకరణ సందర్భంగా ఈ కంపెనీ ఎఫ్ఐడీ నిబంధనల్ని ఉల్లంఘించిందని సీబీఐ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. రూ.కోట్ల పన్నులను ఎగ్గొట్టి నగదును భారత్లోకి అక్రమంగా తీసుకొచ్చేందుకు సంక్లిష్టమైన ఆర్థిక వ్యవహారాలు నడిపారు’ సీబీఐ తెలిపింది. కాగా, ఈ ఆరోపణలను ఎన్డీ టీవీ యాజమాన్యం ఖండించింది. భారత న్యాయవ్యవస్థపై తమకు పూర్తి నమ్మకముందనీ, జర్నలిజం విలువలకు తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. -
ఎన్డీటీవీ ప్రణయ్రాయ్పై సెబీ నిషేధం
న్యూఢిల్లీ: ఎన్డీటీవీ ప్రమోటర్ ప్రణయ్ రాయ్పై మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీ నిషేధం విధించింది. ఎన్డీటీవీ ప్రమోటర్లైన ప్రణయ్ రాయ్, ఆయన భార్య రాధికా రాయ్, హోల్డింగ్ కంపెనీలు రెండేళ్ల పాటు క్యాపిటల్ మార్కెట్ కార్యకలాపాల్లో పాల్గొనకుండా సెబీ నిషేధించింది. ఈ రెండేళ్లలో ప్రణయ్ రాయ్, రాధికా రాయ్లు బోర్డ్ పదవితో పాటు ఎలాంటి ఉన్నతోద్యోగాలు చేపట్టరాదని కూడా ఆదేశాలు జారీ చేసింది. అంతే కాకుండా ఏడాది కాలంలో ఏ లిస్టెడ్ కంపెనీలో కూడా డైరెక్టర్గా వ్యవహరించకూడదని పేర్కొంది. ఐసీఐసీఐ బ్యాంక్, ఇతర సంస్థల నుంచి రుణాలు తీసుకునే విషయంలో మైనారిటీ వాటాదారులకు తగిన వివరాలు వెల్లడించలేదని, అందుకే ఈ నిషేధం విధిస్తున్నామని సెబీ వివరించింది. -
వైరల్ : ఎన్డీ టీవీతో వైఎస్ జగన్ ఇంటర్వ్యూ
సాక్షి, హైదరాబాద్ : ప్రస్తుతం తాము ఎవ్వరితో పొత్తు పెట్టుకోలేదని, ఏపీకి ప్రత్యేక హోదా ఎవరిస్తే వారికే మద్దతు తెలుపుతామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఇటీవల కృష్ణాజిల్లా నందిగామ బహిరంగ సభలో (గురువారం) పాల్గొన్న ఆయన ఆ తర్వాత ఎన్డీ టీవీతో మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. చంద్రబాబు పాలనపై ఆగ్రహంతోనే ప్రజలు తన సభలకు అధిక సంఖ్యలో వస్తున్నారని వైఎస్ జగన్ తెలిపారు. ఎన్నికల ముందు చంద్రబాబు అనుభవం, ఆయన చేసే జిమ్మిక్కులకు తాను ఆందోళన చెందడం లేదని, దేవుడిని, ప్రజలను నమ్ముతున్నాని ఎన్డీ టీవీ ప్రతినిధి అడిగిన ప్రశ్నకు జగన్ సమాధానం ఇచ్చారు. ప్రత్యేకహోదా ఎవరిస్తే వారికే మా మద్దతు ఉంటుందని తాము తొలి నుంచి చెబుతున్నామని, మా స్టాండ్ను ప్రజలకు స్పష్టంగా తెలియజేశామన్నారు. తాము ఇప్పటి వరకు ఎవ్వరితో పొత్తు పెట్టుకోలేదని, ఎవరు హోదా ఇస్తే వారికే మద్దతిస్తామన్నారు. చంద్రబాబును ఓడించడానికి టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ డబ్బులు పంపిస్తున్నాడన్న ఆరోపణలను వైఎస్ జగన్ కొట్టిపారేశారు. తనకు డబ్బులు ఇస్తుంటే చంద్రబాబు చూశారా? లేక కేసీఆర్ ఫోన్ చేసి ఏమైనా చెప్పాడంటనా? అని వైఎస్ జగన్ ఎదురు ప్రశ్నించారు. ఈ విషయాన్ని చంద్రబాబునే అడగాలని అన్నారు. తనపై ఉన్న కేసుల గురించి ప్రజలందరికి తెలుసన్నారు. తన తండ్రి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నంత కాలం జగన్ మంచోడు.. ఎప్పుడైతే పార్టీలో నుంచి బయటకు వచ్చాడో అప్పుడే చెడ్డోడయ్యాడని, చంద్రబాబు, కాంగ్రెస్లు కుమ్మక్కై తనపై అన్యాయంగా కేసులు పెట్టారన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రాన్ని విడగొట్టి రాహుల్ గాంధీలు ఆంధ్రప్రదేశ్కు తీవ్ర అన్యాయం చేశారని, వారి ప్రభావం రాష్ట్రంలో ఏమాత్రం ఉండదని పేర్కొన్నారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు ఆడియో, వీడియో టేప్లతో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడితే ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. -
హోదాకు ఎవరు మద్దతిస్తే మేం వారికి మద్దతిస్తాం
-
ఎన్డీటీవీపై రిలయన్స్ ఇన్ఫ్రా కేసు
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇతరులు కలిసి తమకు వ్యతిరేకంగా రూ.10 వేల కోట్లకు పరువు నష్టం దావాను దాఖలు చేసినట్లు ఎన్డీటీవీ వార్తా సంస్థ తెలియజేసింది. అహ్మదాబాద్ సిటీ సివిల్ కోర్టులో ఇది దాఖలైందని, ఈ మేరకు అక్కడి నుంచి తమకు ఈ నెల 18న నోటీసులు అందాయని ఈ సంస్థ తెలిపింది. కంపెనీతోపాటు, ఎగ్జిక్యూటివ్ కో చైర్పర్సన్, మేనేజింగ్ ఎడిటర్లను బాధ్యులను చేస్తూ ఈ వ్యాజ్యం దాఖలైనట్టు స్టాక్ ఎక్సేంజ్లకు వెల్లడించింది. ఈ వ్యవహారాన్ని కోర్టులో ఎదుర్కొంటామని పేర్కొంది. ‘‘ప్రతీ వారం నిర్వహించే ‘ట్రూత్ వర్సెస్ హైప్ (వాస్తవం/కల్పితం)’ షోలో భాగంగా సెప్టెంబర్ 29న ప్రసారం చేసిన ‘ఐడియల్ పార్ట్నర్ ఇన్ రఫేల్ డీల్ (రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందంలో సరైన భాగస్వామి)’ కథనానికి సంబంధించి ఈ వ్యాజ్యం దాఖలైనట్టు ఎన్డీటీవీ తెలిపింది. ఆరోపణలను తాము పూర్తిగా తిరస్కరిస్తున్నామని, ఈ వ్యవహారానికి సంబంధించిన సమాచారాన్ని కోర్టుకు సమర్పిస్తామని సంస్థ తెలిపింది. ఈ వ్యాజ్యం ఈ నెల 26న విచారణకు రానుంది. -
ఎన్డీటీవీకి రాఫెల్ సెగ : రూ.10వేల కోట్ల దావా
సాక్షి,న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టిన రాఫెల్ డీల్ సెగ ఎన్డీటీవీని తాకింది. రాఫెల్ ఫైటర్ జెట్స్ కొనుగోలు వివాదంలో ఒక కార్యక్రమాన్ని ప్రసారం చేసినందుకు అనీల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ ఎన్డీటీవీపై కోట్ల రూపాయల దావా వేసింది. రాఫెల్ డీల్కు సంబంధించి అవాస్తవాలను, కట్టుకథలను ప్రసారం చేసిందని ఆరోపిస్తూ గుజరాత్లోని అహ్మదాబాద్ కోర్టులో రిలయన్స్ గ్రూపు పదివేల కోట్ల రూపాయలకు దావా వేసింది. అక్టోబరు 26న దీనిపై విచారణ జరగనుంది. ఎన్టీవీలో సెప్టెంబరు 29 న ప్రసారం చేసిన వీక్లీ ప్రోగ్రాం ‘ట్రూత్ వెర్సస్ హైప్స్’పై ఈ కేసు ఫైల్ చేసింది. అయితే దీనిపై ఎన్డీటీవీ స్పందించింది. న్యాయపరమైన పోరాటానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపింది. రిలయన్స్ చేసిన పరువు నష్టం ఆరోపణలను తిరస్కరించింది. ఒక వార్తా సంస్థగా సత్యాన్ని బయటపెట్టే బాధ్యత తమకుందనీ, స్వతంత్ర, న్యాయమైన జర్నలిజానికి తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. అంతేకాదు ఇది మీడియాకు ఒక హెచ్చరిక అని ఎన్డీటీవీ వ్యాఖ్యానించింది. కాగా రాఫెల్ ఒప్పందంపై అధికార, ప్రతిపక్షం మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం జోరుగా సాగుతోంది. దివాలా తీసిన అనిల్ అంబానీకి బిల్లియన్ల డాలర్లను కట్టబెట్టేందుకే ప్రభుత్వరంగ సంస్థను కాదని మరీ రిలయన్స్ డిఫెన్స్కు ఈ కాంట్రాక్టును అప్పగించిందని నరేంద్రమోదీ సర్కార్పై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ వివాదానికి ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలెండ్ వ్యాఖ్యలతో మరింత అగ్గి రగిలింది. ‘దేశ్ కీ చౌకీదార్, అనిల్ అంబానీ కా చౌకీదార్ బన్గయా’ అంటూ మోదీపై రాహుల్ విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. -
ఎన్డీటీవీకి ఈడీ నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ : విదేశీ మారక ద్రవ్య చట్ట (ఫెమా) ఉల్లంఘనలకు పాల్పడినందుకు ఎన్డీటీవీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం నోటీసులు జారీ చేసింది. ఎన్డీటీవీకి అందిన రూ 1637 కోట్ల విదేశీ పెట్టుబడులు, మరో రూ 2732 కోట్ల విదేశీ పెట్టుబడులకు సంబంధించి ఫెమా ఉల్లంఘనలకు పాల్పడినట్టు తమ విచారణలో వెల్లడైందని ఈడీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఫెమా చట్టంకింద ఎన్డీటీవీ వ్యవస్ధాపకులు, ఎగ్జిక్యూటివ్ కో చైర్పర్సన్స్ ప్రణయ్ రాయ్, రాధికా రాయ్, జర్నలిస్ట్ విక్రమ చంద్ర సహా ఇతరులకు షోకాజ్ నోటీసు జారీ చేశామని ఈడీ తెలిపింది. ఎన్డీటీవీ సమీకరించిన విదేశీ పెట్టుబడులకు సంబంధించి ఆయా నివేదికలు, సమాచారాన్ని ఆర్బీఐ ముందుంచడంలో జాప్యాలను నోటీసులో ఈడీ ప్రస్తావించింది. మరోవైపు రూ 600 కోట్లు మించిన ఎఫ్డీఐకి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదముద్ర అవసరమని, ఈ అనుమతి లేకుండానే ఎన్డీటీవీ గ్రూప్ రూ 725 కోట్ల ఎఫ్డీఐ సమీకరించిందని ఈడీ ఆరోపించింది. రూ 600 కోట్లకు తక్కువగా ఎఫ్డీఐని చూపడం భారీ కుట్రలో భాగమని ఈడీ ఆరోపించింది. -
జాతీయస్థాయిలోనూ వైఎస్ జగన్ ప్రకంపనలు!
-
జాతీయస్థాయిలోనూ వైఎస్ జగన్ ప్రకంపనలు!
-
జాతీయస్థాయిలోనూ వైఎస్ జగన్ ప్రకంపనలు!
సాక్షి, హైదరాబాద్ : తన పాదయాత్రకు వస్తున్న స్పందనను చూసి.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆందోళన చెందుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ‘ఆన్ రియాలిటీ చెక్’ కార్యక్రమంలో భాగంగా ఎన్డీటీవీ మేనేజింగ్ ఎడిటర్ శ్రీనివాసన్ జైన్.. పాదయాత్రలో ఉన్న వైఎస్ జగన్తో ముచ్చటించారు. సోమవారం రాత్రి 8.30 గంటలకు ప్రసారమైన ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ జైన్ అడిగిన పలు ప్రశ్నలకు వైఎస్ జగన్ సమాధానాలు ఇచ్చారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గతంలో చేసిన ప్రకటననే తాజాగా మరోసారి చేశారని, అయినా చంద్రబాబు ఎందుకు తన మంత్రులను కేంద్ర కేబినెట్ నుంచి ఉపసంహరించుకున్నారని ప్రశ్నించారు. బీజేపీతో లింక్స్ ఉన్నాయా? అని శ్రీనివాసన్ జైన్ ప్రశ్నించగా.. బీజేపీతో లింక్స్ ఉంటే.. ఆ పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ఎందుకు ప్రవేశపెడతామని ప్రశ్నించారు. గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, టీడీపీ చేతులు కలిపి తనను కేసులలో ఇరికించాయని, దివంగత నేత వైఎస్ఆర్ బతికి ఉన్నంతకాలం తనను గౌరవనీయుడిగా చూశారని, ఆయన చనిపోయిన తర్వాత క్షుద్రరాజకీయాల్లో భాగంగా తనను టార్గెట్ చేశారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని ప్రధాని మోదీ నెరవేర్చలేదని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన పాదయాత్ర.. జాతీయ రాజకీయాలను ప్రభావితం చేయబోతుందా? ఏపీ ప్రజలకు న్యాయం చేకూర్చేందుకు, ఒక ప్రభంజనంలా కొనసాగుతున్న వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర.. జాతీయ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతుందా? అన్నది తెలుసుకునేందుకు.. జననేత వైఎస్ జగన్తో ఎన్డీటీవీ ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించింది. ‘ఆన్ రియాలిటీ చెక్’ కార్యక్రమంలో భాగంగా ఎన్డీటీవీ మేనేజింగ్ ఎడిటర్ శ్రీనివాసన్ జైన్.. పాదయాత్రలో ఉన్న వైఎస్ జగన్తో ముచ్చటించారు. ఈ కార్యక్రమం గురించి శ్రీనివాసన్ జైన్ ట్వీట్ చేస్తూ.. ‘వైఎస్ఆర్ బతికి ఉన్నంతవరకు నన్ను గౌరవనీయుడిగానే చూశారు’ అన్న వైఎస్ జగన్ కామెంట్ను ఉటంకించారు. ఆయన రాజకీయ ప్రస్థానం జాతీయ రాజకీయాల్లో ప్రకంపనలు రేపే అవకాశముందని పేర్కొన్నారు. ఈ పాదయాత్ర జాతీయ రాజకీయాల్లో ప్రకంపనలు రేపనుందా? అని వైఎస్ జగన్ను ప్రశ్నించినట్టు తెలిపారు. -
నా వార్తల్లో నిజాయితే నన్ను ధైర్యంగా నిలబెట్టింది
-
ఎన్డీటీవీని అమ్మేశారా?
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్డీటీవీని (న్యూఢిల్లీ టెలివిజన్ లిమిటెడ్) స్పైస్జెట్ సహ వ్యవస్థాపకులు అజయ్ సింగ్ కొనుగోలు చేశారన్న వార్తలు ఒక్కసారిగా మీడియాలో గుప్పు మన్నాయి. టీవీలో మెజారిటీ వాటాను అజయ్ సింగ్ కొనుగోలు చేశారని వార్తలు వచ్చాయి. ఈ ఒప్పందం ప్రకారం అజయ సింగ్ 40శాతం వాటాను, ప్రణయ్రాయ్, రాధికా రాయ్ సుమారు 20శాతం వాటాను కలిగి వుంటారని అంచనాలు వెలువడ్డాయి. డీల్ లో భాగంగా ఎన్డీటీవీకి చెందిన రూ.400 కోట్లు అప్పును కూడా అజయ్ స్వీకరించారని, మొత్తం డీల్ విలువ రూ.600 కోట్ల అని మీడియాలో కథనాలు జోరుగా వ్యాపించాయి. దీంతో ఎన్డీటీవీ షేర్ భారీగా ఎగిసింది. ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో షేర్ ధర అప్పర్ సర్క్యూట్ను తాకడం విశేషం. ప్రణయ్ రాయ్, రాధికా రాయ్, ప్రమోటింగ్ సంస్థ ఆర్ఆర్పీఆర్ హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్లు సీబీఐ స్కానర్లో ఉండడంతో.. ఈ కంపెనీ చేతులు మారనుందనే వార్తలు హల్ చల్ చేశాయి. అయితే ఈ అంచనాలను ఎన్డీటీవీ కొట్టిపారేసింది. తాము ఎవరితోనూ, ఎలాంటి ఒప్పందాన్ని కుదుర్చుకోలేదని మార్కెట్ రెగ్యురేటరీ ఫైలింగ్ లో తెలిపింది. దీంతో మార్కెట్వర్గాల్లో గందరగోళం నెలకొంది. కాగా 1988లో ప్రణయ్రాయ్, ఆయన భార్య రాధికా రాయ్ ఎన్డీటీవీని స్థాపించారు. -
మీడియా పీక పిసికేయడం కొత్తకాదు
న్యూఢిల్లీ: భారత దేశంలో పాలకులకు, మీడియాకు మధ్య పోరాటం జరగడం, మీడియా గొంతు పిసికేయాలనుకోవడం బ్రిటీష్ పాలకుల నాటి నుంచే ఉంది. కోల్కతా నుంచి వెలువడుతున్న భారత్లో తొట్టతొలి, ఆ మాటకొస్తే ఆసియాలోనే మొట్టమొదటి పత్రికైనా ‘హికీస్ బెంగాల్ గెజిట్’ పత్రికను 1782, మార్చి 23వ తేదీన పాలకులు మూసివేయించారు. ఆ పత్రికను నడుపుతున్న ఆగస్టస్ హికీని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అప్పటి భారత గవర్నర్ జనరల్ వారెస్ హాస్టింగ్స్ను ఉద్దేశించి ‘లార్డ్ క్లైవ్కు దిక్కుమాలిన వారసుడు’ అని సంబోంధించినందుకు ఆయనపై కేసు పెట్టి అరెస్ట్ చేశారు. కొద్దికాలం జైలు జీవితం అనుభవించిన హికీ జైలు నుంచి, ఆ కేసు నుంచి బయటపడ్డారు. ఆ తర్వాత ఐదారు కేసుల్లో ఇరుక్కోవడంతో బ్రిటీష్ ప్రభుత్వం ఆయన పేపర్ను మూసివేసి ప్రెస్ను స్వాధీనం చేసుకొంది. పత్రికల నోరు నొక్కేందుకు బ్రిటీష్ పాలకులు దేశద్రోహం నేరం కింద తీసుకొచ్చిన 124 ఏ సెక్షన్ నేటికి కూడా అమల్లో ఉండడం ఆశ్చర్యం. నేడు ఎన్డీటీవీపై సీబీఐ నిర్వహించిన దాడుల నేపథ్యంలో ఈ అంశాలను గుర్తుచేసుకోవాల్సి వస్తోంది. నాడు ఆగస్టస్ హికీ, నాటి బ్రిటీష్ పాలకులను ఎలా పడితే అలా విమర్శించేవారు. నేటి మీడియా కూడా ఆ స్థాయిలో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా స్పందించడం లేదు. అయినా పత్రికలపై పరువు నష్టం కేసులు, దేశద్రోహం కేసులు పెడుతూనే ఉన్నారు. ఎన్డీటీవీపై ఏసీబీ దాడులకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి సంబంధం లేదని, తమ విధి నిర్వహణలో భాగంగానే ఏసీబీ దాడులు జరిపిందని పాలకపక్ష వర్గాలు చెబుతున్నాయిగానీ జరిగిన సమయాన్ని దృష్టిలో పెట్టుకుంటే అనుమానాలు రాకపోవు. ఎన్డీటీవీ ఛానల్కు ఓ ప్రత్యేకమైన ఎజెండా ఉందని ఆరోపించిన బీజేపీ అధికార ప్రతినిధిని చర్చా గోష్టి నుంచి అర్దాంతరంగా వెళ్లిపోవాల్సిందిగా ఛానెల్ కోరడం, ఆ తర్వాత ఢిల్లీ జర్నలిస్టులు భయం, భయంగా తమ విధులు నిర్వహించాల్సి వస్తోందని ఛానెల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రవిశ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిణామాల అనంతరమే ఏసీబీ దాడులు జరిగాయి. ఈ పరిణామాలకు సంబంధం లేదా పరిణామాలన్నీ కూడా యాదశ్చికమేనా? ప్రజాస్వామ్య వ్యవస్థలో నాలుగో స్తంభంగా పరిగణిస్తున్న మీడియా తమ విధుల నిర్వహణలో ఇలాంటి అవాంతరాలను, పోరాటాలను ఎదుర్కొంటూ ముందుకు సాగిపోవాల్సిందే. -ఓ సెక్యులరిస్ట్ కామెంట్ -
ప్రణయ్రాయ్ ఇంటిపై సీబీఐ దాడులు
ఓ ప్రైవేటు బ్యాంకుకు నష్టం చేకూర్చారని అభియోగం న్యూఢిల్లీ: రుణ మొత్తాన్ని తిరిగి చెల్లించ కుండా ఓ ప్రైవేటు బ్యాంక్కు నష్టం చేకూర్చారన్న అభియోగంపై ప్రముఖ వార్తా చానల్ ఎన్డీటీవీ వ్యవస్థాపకుడు ప్రణయ్ రాయ్ ఇంటిపై సీబీఐ దాడులు చేసింది. సంస్థకు చెందిన ఇతర కార్యాలయాల్లో కూడా తనిఖీలు నిర్వహించింది. ప్రణయ్రాయ్, ఆయన భార్య రాధిక, వారికి చెందిన ఆర్ఆర్పీఆర్ హోల్డింగ్స్, కొందరు ఐసీఐసీఐ బ్యాంకు అధికారులపై నేరపూరిత కుట్ర, అవినీతి, మోసం కింద కేసులు నమోదు చేసిన సీబీఐ సోమవారం ఈ దాడులు జరిపింది.ఢిల్లీలోని రెండు ప్రాంతాలు, డెహ్రాడూన్, ముస్సోరీల్లో తమ బృందాలు సోదాలు చేసినట్టు సీబీఐ ఎస్పీ సుజిత్కుమార్ తెలిపారు. నిబంధనల ఉల్లంఘనలతో ఐసీఐసీఐ బ్యాంక్కు రూ.48 కోట్లు నష్టం వాటిల్లగా.. పర్యవసానంగా ఆర్ఆర్పీఆర్ లాభం పొందిందని సీబీఐ ఎఫ్ఐఆర్లో పేర్కొంది. ఇది రాజకీయ దాడి: మీడియా స్వేచ్ఛను హరించి, దాని గొంతు నొక్కడానికి ప్రభుత్వం చేయించిన రాజకీయ దాడి ఇదని ఎన్డీటీవీ వెల్లడించింది. ఇలాంటి చర్యలతో అధికార పార్టీ నాయకులు తమను భయపెట్టలేరంది. ఐసీఐసీఐ నుంచి తీసుకున్న రూ.375 కోట్ల రుణాన్ని తిరిగి చెల్లించలేదని సీబీఐ ఆరోపిస్తోందని, కానీ ఏడేళ్ల కిందటే ఆ మొత్తాన్నీ బ్యాంక్కు జమచేశామంది. ఇందు లో రాజకీయ జోక్యం లేదని, మీడియాకు చెందిన వారైనంతమాత్రాన తప్పు చేస్తున్నా ప్రభుత్వం చూస్తూ కూర్చోదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. -
ఎన్డీటీవీనీ రాందేవ్ బాబా కొంటున్నారా?
ముంబై: ఒకవైపు ఎన్డీటీవీపై సీబీఐ లనూహ్య దాడులపై దుమారం రేగుతుండగా మరో సంచలన వార్త చక్కర్లు కొడుతోంది. ప్రముఖ యోగా గురు రాందేవ్ బాబా ఎన్డీవీని కొనుగోలు చేయనున్నారనే అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఈ మేరకు సంప్రదింపులు జరిగాయన్న పుకార్లు షికార్లు చేశాయి. అయితే ఈవార్తలను ఎన్డీటీవీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, ప్రముఖ యాంకర్ నిధి రాజ్దాన్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. అలాంటిదేమీ లేదని తేల్చి చెప్పారు. ఐసీఐసీఐ బ్యాంకుకు రూ.48 కోట్ల మేర నష్టం కలిగించారంటూ ఎన్డీటీవీ వ్యవస్థాపకుడు, సహ చైర్మన్ ప్రణయ్ రాయ్, అతని భార్య రాధికా రాయ్, ఆర్ఆర్ పీఆర్ (రాధికా రాయ్, ప్రణయ్ రాయ్) అనే ప్రైవేటు కంపెనీ, మరికొందరిపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కేసు నమోదు చేసింది. అనంతరం రాయ్ నివాసంలో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. దీంతోపాటు మరో నాలుగు ప్రాంతాల్లోనూ సోదాలు నిర్వహించారు.ఈ వార్తలతో ఎన్డీటీవీ షేరు దాదాపు 7 శాతానికిపైగా నష్టపోయింది. కాగా బ్యాంకును మోసం చేసిన కేసుల్లో భాగంగానే ఈ సోదాలు చేపట్టినట్టు సీబీఐ అధికార ప్రతినిధి తెలిపారు. విదేశీ యూనిట్ల ద్వారా భారీ స్థాయిలో నిధులు తరలింపునకు సహకరించడం ద్వారా ఎన్డీటీవీ ఫెమా నిబంధనలు ఉల్లంఘించిందంటూ 2015 నవంబర్ లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ 2,030 కోట్లకు నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ఈ దాడులపై వివిధ పత్రికాధిపతులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యదేశంలో ఇది ఒక చీకటి రోజని వ్యాఖ్యానించారు. పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్న ఈ పరిణామాలు ఎమర్జెన్సీ రోజులను తలపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. Fake news from @e4mtweets: https://t.co/sc9JdSKGxD — VISHAL (@VishalManve12) June 5, 2017 Hello people, Ramdev is not buying NDTV. Thank you — Nidhi Razdan (@RazdanNidhi) June 5, 2017 -
ఎన్డీటీవీ షేర్లకు సీబీఐ షాక్!
ముంబై: సీబీఐ అనూహ్య దాడుల నేపథ్యంలో ఎన్డీటీవీ షేర్లు ఇవాల్టి మార్కెట్లో కుప్పకూలిపోయాయి. ఐసీఐసీఐ బ్యాంకుకు రూ.48 కోట్ల మేర నష్టం కలిగించారన్న ఆరోపణలతో సీబీఐ సోదాల వార్తల కారణంగా ఈ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ఎన్డీటీవీ వ్యవస్థాపకుడు, సహ చైర్మన్ ప్రణయ్ రాయ్, అతని భార్య రాధికా రాయ్, ఆర్ఆర్ పీఆర్ (రాధికా రాయ్, ప్రణయ్ రాయ్) అనే ప్రైవేటు కంపెనీలపై సీబీఐ దాడుల వార్తలతో ఆందోళకు గురైన ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలు దిగారు. దీంతో ఈ షేరు దాదాపు 7 శాతానికి బాగా నష్టపోయింది. భారీ నష్టాలతో దీంతో 52 వారాల కనిష్ట స్థాయికి చేరింది. రాయ్, రాయ్ భార్య రాధిక, ఆర్ఆర్పీఆర్ హోల్డింగ్స్ తదితరాల వల్ల ఈ నష్టం వాటిల్లిందన్న ఆరోపణలపై సీబీఐ కేసులు నమోదు చేసింది. ఐసీఐసీఐ బ్యాంకుకు రూ.48 కోట్ల మేర నష్టం కలిగించారంటూ ఎన్డీటీవీ వ్యవస్థాపకుడు, సహ చైర్మన్ ప్రణయ్ రాయ్, అతని భార్య రాధికా రాయ్, ఆర్ఆర్ పీఆర్ (రాధికా రాయ్, ప్రణయ్ రాయ్) అనే ప్రైవేటు కంపెనీ, మరికొందరిపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కేసు నమోదు చేసింది. అనంతరం ఈ రోజు ఢిల్లీలోని గ్రేటల్ కైలాష్-1 ప్రాంతంలో ఉన్న రాయ్ నివాసంలో సీబీఐ అధికారులు సోదాలకు దిగారు. మరో నాలుగు ప్రాంతాల్లోనూ సోదాలు నిర్వహించారు. మరోవైపు ఈ దాడులను ఎన్డీటీవీ తీవ్రంగా ఖండించగా, వివిధ పత్రికాధిపతులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కాగా బ్యాంకును మోసం చేసిన కేసుల్లో భాగంగానే ఈ సోదాలు చేపట్టినట్టు సీబీఐ అధికార ప్రతినిధి తెలిపారు. విదేశీ యూనిట్ల ద్వారా భారీ స్థాయిలో నిధులు తరలింపునకు సహకరించడం ద్వారా ఎన్డీటీవీ ఫెమా నిబంధనలు ఉల్లంఘించిందంటూ 2015 నవంబర్ లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ 2,030 కోట్లకు నోటీసు జారీ చేసింది. -
మీడియా అధిపతికి సీబీఐ ఝలక్!
న్యూఢిల్లీ: అనూహ్యరీతిలో సీబీఐ సోమవారం ఉదయం జాతీయ న్యూస్ చానెల్ ఎన్టీటీవీ సహ యాజమానులైన ప్రణవ్ రాయ్, రాధికా రాయ్ ఇళ్లలో దాడులు నిర్వహించింది. ఓ బ్యాంకును మోసం చేసిన కేసు దర్యాప్తులో భాగంగా వీరి ఇళ్లలో సోదాలు నిర్వహించినట్టు సీబీఐ ధ్రువీకరించింది. అయితే, ఎన్టీటీవీ కార్యాలయంలో ఈ సోదాలు జరగలేదు. ఎన్టీటీవీ ప్రమోటర్ కంపెనీ అయిన ఆర్ఆర్పీఆర్ హోల్డింగ్స్ ప్రైవేటు లిమిటెడ్ కార్యాలయంలో సీబీఐ దాడులు నిర్వహించింది. ఢిల్లీ, డెహ్రాడూన్, ఉత్తరాఖండ్ ఇలా మొత్తం నాలుగుచోట్ల సీబీఐ దాడులు జరిగినట్టు తెలుస్తోంది. 2008లో ఐసీఐసీఐ బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించడంలో జరిగిన అక్రమాలకు సంబంధించిన గతవారం సీబీఐ కేసు నమోదుచేసిన సంగతి తెలిసిందే. ప్రణయ్రాయ్ కంపెనీ ఐసీఐసీఐ బ్యాంకు నుంచి రూ. 366 కోట్లు రుణంగా తీసుకొని.. రూ. 50 కోట్లు తక్కువ చెల్లించినట్టు సీబీఐ వర్గాలు చెప్తున్నాయి. -
పర్సనల్ ఫైనాన్స్ బ్రీఫ్స్
షేర్లపై డిజిటల్ రుణం: హెచ్డీఎఫ్సీ బ్యాంక్ హెడ్డీఎఫ్సీ బ్యాంక్ దేశంలోనే తొలిసారిగా సెక్యూరిటీస్పై తక్షణ డిజిటల్ రుణ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు కస్టమర్లు నెట్ బ్యాంకింగ్ ద్వారా మూడు సరళమైన దశల్లో షేర్లపై రుణం పొందొచ్చు. నెట్ బ్యాంకింగ్లో తాకట్టు పెట్టే షేర్లను ఎంపిక చేసుకొని, తర్వాత వన్టైమ్ పాస్వర్డ్ ద్వారా ఒప్పందాన్ని కుదుర్చుకొని, చివరగా ఓటీపీ ద్వారా నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ (ఎన్ఎస్డీఎల్)లో షేర్లను తాకట్టుపెట్టి రుణం పొందొచ్చు. షేర్లపై రుణానికి ప్రత్యేక కరెంట్ ఖాతా ద్వారా ఓవర్ డ్రాఫ్ట్ అందించే పూర్తి ప్రక్రియను ఆటోమేటిక్ చేసిన మొదటి బ్యాంక్గా హెచ్డీఎఫ్సీ నిలిచింది. ప్రస్తుతం డీమ్యాట్ ఖాతాకే అందుబాటులో ఉన్న ఈ సౌకర్యాన్ని త్వరలో ఫండ్స్, బాండ్లు, బీమా పాలసీలకు విస్తరిస్తామని బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. ఫ్యూచర్ జెనరాలి లైఫ్ నుంచి కొత్త ప్లాన్ ఫ్యూచర్ జెనరాలి ఇండియా లైఫ్ ఇన్సూ రెన్స్ కంపెనీ తాజాగా ఫ్యూచర్ జెనరాలి బిగ్ ఇన్కమ్ మల్టీప్లయర్ ప్లాన్ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఇది కచ్చితమైన రాబడులను అం దించే నాన్లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్ స్కీమ్. ఇందులో రూ.18,000 కనీస వార్షిక ప్రీమియంతో లేదా రూ.1,500 కనీస నెలవారీ ప్రీమియంతో ఇన్వెస్ట్మెంట్లను ప్రారంభించొచ్చు. ఇలా 12 ఏళ్లపాటు పెట్టుబడులు కొనసాగించాలి. ప్లాన్లో సభ్యులుగా చేరాలంటే 4–50 ఏళ్ల వయసు ఉండాలి. వినియోగదారులు ఇన్సూరెన్స్ కవర్ పొందవచ్చు. కాగా బీమా సేవలు అందించడానికి సంస్థ యూకో బ్యాంక్తో కూడా జతకట్టింది. ఎన్డీటీవీతో హెచ్డీఎఫ్సీ ఎర్గో జట్టు దేశీ మూడో అతిపెద్ద నాన్–లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ‘హెచ్డీఎఫ్సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్’ తాజాగా ఎన్డీటీవీ భాగస్వామ్యంతో ‘హెల్త్ మ్యాటర్స్’ అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. హెల్త్ చెకప్స్పై ప్రజల్లో అవగాహన పెంపొం దించడం, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రాధాన్యతను వారికి తెలియజేయడం, హెల్త్ ఇన్సూరెన్స్పై ఉన్న సందేహాలను తొలగించడం లక్ష్యంగా హెచ్డీఎఫ్సీ ఎర్గో ఈ కార్యక్రమాన్ని ఆవిష్కరించింది. ప్రభుత్వ ఉద్యోగులకు వ్యక్తిగత రుణాలు ప్రభుత్వ/పీఎస్యూ ఉద్యోగుల కోసం ఫెడరల్ బ్యాంక్ ‘ఎక్స్క్లూ జివ్ పర్సనల్ లోన్’ స్కీమ్ను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా ఉద్యోగులు రూ.15 లక్షల వరకు వ్యక్తిగత రుణాన్ని పొందవచ్చు. లాంగ్టర్మ్ టూవీలర్ బీమా పాలసీ ప్రైవేట్ రంగంలోని సాధారణ బీమా సంస్థ రాయల్ సుందరమ్ దీర్ఘకాల టూవీలర్ బీమా పాలసీని అందుబాటులోకి తెచ్చింది. ఒకే ప్రీమియమ్తో ఈ లాంగ్ టర్మ్ టూవీలర్ ప్యాకేజీ పాలసీని పొందవచ్చని తెలిపింది. ‘ఐసెలెక్ట్’ టర్మ్ ప్లాన్ ఆవిష్కరించిన కెనరా హెచ్ఎస్బీసీ ఓరియెంటల్ కెనరా హెచ్ఎస్బీసీ ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ తన ఆన్లైన్ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోని మారింత విస్తరించుకుంది. ఇది తాజాగా ఐసెలెక్ట్ టర్మ్ ప్లాన్ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. అందుబాటు ప్రీమియంలో కుటుంబానికి విస్తృతమైన ఇన్సూ రెన్స్ కవరేజ్ను అందించడమే లక్ష్యంగా కంపెనీ ఈ ప్లాన్ను తీసుకువచ్చింది. -
ఆర్నబ్ బాటలో మరో సీనియర్ జర్నలిస్ట్
న్యూఢిల్లీ: ప్రముఖ ఇంగ్లీష్ న్యూస్ చానల్ 'టైమ్స్ నౌ' ఎడిటర్ ఇన్ చీఫ్ పదవి నుంచి తప్పుకున్న ఆర్నబ్ గోస్వామి బాటలో మరో సీనియర్ జర్నలిస్ట్ నడిచారు. ఎన్డీటీవీ కన్సల్టింగ్ ఎడిటర్ బర్కా దత్ రాజీనామా చేశారు. ప్రైమ్టైమ్ షో 'ద న్యూస్ అవర్' ద్వారా పాపులరైన ఆర్నబ్ గోస్వామి సొంతంగా వార్తా చానల్ పెడతారని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. బర్కా దత్ కూడా సొంతంగా వెంచర్ ప్రారంభిస్తారని సమాచారం. బర్కా దత్ సుదీర్ఘకాలం సంస్థలో పనిచేశారని, ఆమె భవిష్యత్ బాగుండాలని ఆకాంక్షిస్తున్నామని ఎన్డీటీవీ ఓ ప్రకటనలో పేర్కొంది. 1995లో ఎన్డీటీవీలో చేరిన బర్కా దత్ పలు హోదాల్లో పనిచేశారు. 21 ఏళ్ల పాటు ఆమె నిబద్ధతతో పనిచేశారని, సంస్థ అభివృద్ధికి కృషి చేశారని ఎన్డీటీవీ ప్రశంసించింది. 1999లో జరిగిన కార్గిల్ యుద్ధం సందర్భంగా దత్ విస్తృతంగా కవరేజీ ఇచ్చారు. పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులను అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు అందజేసి ఆమెను గౌరవించింది. కాగా రాడియా టేప్స్ వ్యవహారంలో ఆమెపై విమర్శలు, ఆరోపణలు వచ్చాయి. -
బెర్లిన్లో భౌతిక గోడైతే భారత్లో అదృశ్య గోడ
న్యూఢిల్లీ : ఎన్డీటీవీ హిందీ ఛానల్ ప్రసారాలను బుధవారం ఒక రోజు నిలిపివేయాలంటూ జారీ చేసిన ఆదేశాలను పునర్ సమీక్షిస్తామని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రకటించడం కాస్త ఊరట కలిగించే అంశమే. రేపు బుధవారంకున్న ప్రాముఖ్యత ప్రభుత్వానికి తెలియకపోవచ్చుగానీ, మీడియా పీపుల్కు మాత్రం అది ముఖ్యమైన రోజు. బుధవారం నాటికి అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడుతాయి. ఈ ఫలితాల ప్రభావం భారత్పైనా, మొత్తం ప్రపంచంపై ఎలా ఉంటుందో ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యతను నిర్వహించడంతోపాటు వివిధ కోణాల నుంచి ఫలితాలను విశ్లేషించి, చర్చాగోష్ఠులను నిర్వహించడం రేపు ఏ టీవీ ఛానల్ మనుగడకైనా ముఖ్యమే. భారత్ మీడియాలో అమెరికా అధ్యక్ష ఎన్నికలకు విస్తత కవరేజ్ వచ్చినందున రేపు యాడ్స్, యాడ్స్ టారిప్లు ఛానళ్లకు పెరిగే అవకాశం కూడా ఉంది. నవంబర్ 9వ తేదీ (1989)....మరో చరిత్రాత్మకమైన రోజు. తూర్పు, పశ్చిమ జర్మనీల మధ్య బెర్లిన్వాల్ను కూల్చేసిన రోజు. కమ్యూనిస్టు ప్రభుత్వం ఆధీనంలో ఉన్న తూర్పు జర్మనీ నుంచి పశ్చిమ జర్మనీకి ప్రజలెవరూ వెళ్లకుండా నిర్మించినది బెర్లిన్ గోడ. గోడ కూల్చివేతకు ముందు అక్కడి సమాచార వ్యవస్థపై, ప్రభుత్వ వైఖరిని విమర్శించే వర్గాలపై ఎంతో అణచివేత, ఎన్నో ఆంక్షలు ఉండేవి. భారత్లో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వం కూడా గత 29 నెలలుగా అలాంటి గోడనే నిర్మిస్తోంది. బెర్లిన్ గోడ భౌతికమైనదైతే మోదీ ప్రభుత్వం నిర్మిస్తున్నది అదృశ్య గోడ. అక్కడ అధికారంలో ఉండింది లెఫ్ట్వింగ్ ప్రభుత్వంకాగా, భారత్లో రైట్వింగ్ ప్రభుత్వం కొనసాగుతోంది. వామపక్షాలు, అంబేద్కర్వాదులు, ఉదారవాదులు, మధ్యంతరవాదులు, లౌకికవాదులు, గోమాంస భక్షకులు, లవ్ జిహాదులకు, హిందూత్వవాదులకు మధ్యన ఈ కనిపించని గోడను మోదీ ప్రభుత్వం నిర్మిస్తోంది. గోవధ నిషేధాలను, గోమాంస భక్షకుల పేరిట దళితులపై జరుగుతున్న దాడులను, హిందూత్వ మూలాలను ప్రశ్నించిన హేతువాదుల హత్యలనుప్రస్తావించరాదు. హిందూత్వాన్ని పూసుకున్న, మోస్తున్న బీజీపీ శక్తులను అసలు విమర్శించరాదు. అలా చేస్తున్న మీడియా గ్రూపులకు నరేంద్ర మోదీగారు ‘న్యూస్ ట్రేడర్స్’ అని పేరు కూడా పెట్టారు. మరో బీజేపీ సీనియర్ నాయకుడు తన నాలుకకు మరింత పదునుపెట్టి ‘ప్రెస్టిట్యూట్స్’ అని కూడా తిట్టిపోశారు. రిజర్వేషన్ల కోసం గుజరాత్లో పటేళ్లు, హర్యానాల్లో జాట్లు చేస్తున్న ఆందోళనలను, తమ హక్కుల సాధన కోసం పోరాడుతున్న దళితులు, ఆదివాసుల ఉద్యమాల ఊసెత్తకుండా తమ పాలనలో భారతీయులు ఎంతగానో సుఖ పడుతున్నారని చెప్పుకుంటున్న మోదీ ప్రభుత్వాన్ని, హ్యాపి నేషన్ అంటూ సంఘ్ పరివార్ చేస్తున్న ప్రచారాన్ని, కాశ్మీర్తోపాటు దేశంలోని అన్ని సమస్యలకు పాకిస్తాన్ కారణమనే నినాదాన్ని మీడియా మరింత ముందుకు తీసుకెళితే మోదీ ప్రభుత్వం సంతోషిస్తోందేమో! ఇప్పటికే తలవరకు వచ్చిన అదృశ్యగోడను త్వరగా పూర్తి చేస్తుందేమో!! --- ఓ సెక్యులరిస్ట్ కామెంట్ -
ఎన్డీ టీవీకి ఊరట...!
న్యూఢిల్లీ : జాతీయ న్యూస్ ఛానల్ ఎన్డీ టీవీకి తాత్కాలిక ఊరట లభించింది. ఈ నెల 9వ తేదీన ఒకరోజు పాటు ప్రసారాలు నిలిపేయాలన్న నిర్ణయంపై కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖ పునరాలోచిస్తున్నట్లు సమాచారం. ఎన్టీ టీవీపై నిషేధాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు తెలుస్తోంది. కాగా ప్రసారాల నిలిపివేత నిర్ణయాన్ని కేంద్రం పునపరిశీలించాలని ఎన్బీఏ విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. మరోవైపు పఠాన్కోట్ దాడిపై ప్రసారాలు చేసినందుకు ‘ఎన్డీటీవీ ఇండియా’ హిందీ న్యూస్ చానల్ ప్రసారాలు ఒకరోజుపాటు నిలిపివేయాలన్న ఆదేశాల్ని విపక్షాలు, మీడియా సంస్థలు ఖండించాయి. సమాచార ప్రసార శాఖకు చెందిన అంతర్ మంత్రిత్వ శాఖ విచారణ బృందం ఆదేశాల పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేయడంతో పాటు ఎమర్జెన్సీ రోజులు గుర్తు కొస్తున్నాయంటూ మండిపడ్డాయి. ప్రసారాల నిలుపుదలపై ఇచ్చిన ఆదేశాల్ని తక్షణం ఉపసంహరించుకోవాలన్నాయి. ఐబీ ఉత్తర్వుల్ని ఖండించడంతో పాటు ఇది పత్రికా స్వేచ్ఛను ఉల్లంఘించడమేనని ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా. బ్రాడ్కాస్ట్ ఎడిటర్స్ అసోసియేషన్ పేర్కొన్నాయి. కాగా పటాన్ కోట్లో మిలట్రీ ఆపరేషన్ లైవ్ ఇచ్చినందుకు ఎన్డీ టీవీపై కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖ ఈ చర్యలు తీసుకున్న విషయం విదితమే. -
ఎల్లుండే నిషేధం.. సుప్రీంకు చానెల్!
ఎన్డీటీవీ ఇండియాపై ఒక రోజు నిషేధం విధించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై ఆ చానెల్ యాజమాన్యం సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పఠాన్కోట్ ఎయిర్బేస్పై ఉగ్రవాద దాడి సందర్భంగా దేశ రక్షణకు భంగం కలిగించేలా వార్తాప్రసారాలు చేశారని ఆరోపిస్తూ కేంద్రం హిందీ చానెల్ ఎన్డీటీవీపై ఒక రోజు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నెల 9న (బుధవారం) ఒకరోజుపాటు చానెల్ ప్రసారాలను నిలిపివేయాలని కేంద్రం ఎన్డీటీవీ ఇండియాకు నోటీసులు జారీచేసింది. ఈ నిషేధానికి వ్యతిరేకంగా ఎన్డీటీవీ సుప్రీంకోర్టును ఆశ్రయించినట్టు ఆ చానెల్ స్ట్రాటజీ డైరెక్టర్ సుపర్ణ సింగ్ ట్విట్టర్లో తెలిపారు. పఠాన్కోట్ ఉగ్రవాద దాడి సందర్భంగా ఎన్డీటీవీ దేశ రక్షణకు సంబంధించిన సమాచారాన్ని బయటపెట్టిందని, దీనిని ఉగ్రవాదులు ఉపయోగించుకొని ఉండివుంటే దేశభద్రత తీవ్ర పమాదంలో పడి ఉండేదని కేంద్ర సమాచార, ప్రసార శాఖ పేర్కొంది. దేశ భద్రత విషయమై ఓ చానెల్పై ఒకరోజు నిషేధం విధించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అయితే, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఎన్డీటీవీ యాజమాన్యం, ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. -
అత్యవసర పరిస్థితికి ఆహ్వానం?
జాతిహితం ఎన్డీటీవీపై నిషేధంపై పలు చానళ్ల వైఖరి అత్యవసర పరిస్థితి కాలంలోని మన పత్రికలు చాలా వాటి తీరును గుర్తుకు తెస్తోంది. నాడు మనం మౌనం పాటించి అత్యవసర పరి స్థితిలో భాగస్వాములం అయ్యాం. పౌర సమాజంపైన, పేదలపైన దాడులు జరిగాయి. నేడు మీడియాపై జరుగుతున్న ఈ కొత్త దాడిపైన, నగ్నంగా జరుగుతున్న బూటకపు ఎదురుకాల్పులపైన, ప్రభుత్వ ప్రాయోజిత సాంస్కృతిక జాతీయవాదం పైన మౌనం వహించడం ద్వారా మనం మన అప్రతిష్టాకరమైన ఆ గతాన్ని పునరావృతం చేస్తున్నాం. నేటి ప్రత్యామ్నాయ చరిత్రల కాలంలో రాజకీయ, భావజాల, మేధోపరమైన విభేదాలన్నింటికి అతీతంగా అందరికీ అత్యవసర పరిస్థితిపై ఆమోదయోగ్య మైన అవగాహన ఉంది. దానికి భిన్నంగా ధ్వనించే మరో అర్థాన్నిచ్చే కథ నాన్ని రచించడం సాధ్యమేనా? అది స్వతంత్ర భారత చరిత్రలోనే అత్యంత చీకటి కాలం. పాత్రికేయులతోసహా (అప్పట్లో ‘మీడియా’ అని ఎవరూ అన లేదు) ప్రజలలో చాలా మంది దాన్ని సహించడానికి నిరాకరించారు. న్యాయ వ్యవస్థ సైతం ఆ పోరాటంలో చేరింది. ఇవన్నీ కలసి రూపొందిన ఆగ్రహావేశ వెల్లువకు దేవ్ కాంత్ బారువా ‘‘ఇందిరే ఇండియా’’ అన్న ఇందిరా గాంధీ, ఆమె కుమారుడు సంజయ్గాంధీలుసహా, దేశ చరిత్రలోనే ఎన్నడూ ఎరుగని గొప్ప భజనపరుల మూకంతా చరిత్ర చెత్తబుట్టలోకి కొట్టుకుపోయారు. ఆ అత్యవసర పరిస్థితిని గుర్తు చేçసుకుంటూ, అలా మన స్వేచ్ఛలకు, ప్రజాస్వామ్యానికి తిరిగి ముప్పు ఏర్పడటాన్ని నివారించాలని హెచ్చరించడ మంటే మన ప్రధానికి ఇష్టం. ఈ వారంలో కూడా ఆయన, పాత్రికేయ వృత్తిలో అత్యుత్తమ ప్రతిభకు పురస్కార ప్రధానోత్సవంలో ఇదే విషయాన్ని ఆయన మళ్లీ ప్రస్తావించారు. అత్యవసర పరిస్థితి పట్ల మన మీడియా చూపిన ప్రతిఘటనకు గర్వించదగ్గ చిహ్నంగా నిలిచిన రామ్నాథ్ గోయెంకా స్మారక పురస్కారాలవి. నలభై ఏళ్ల క్రితమే అత్యవసర పరిస్థితి అంతమైనా, నిరంకు శాధికారం తిరిగి వచ్చే అవకాశం ఉన్నందున ఆ హెచ్చరిక అవసరమైనదే. అయితే, దాదాపుగా ఆ ఉపన్యాసం సాగుతున్నప్పుడే ఎన్డీటీవీ హిందీ చానల్ ప్రసారాలపై ఒక రోజు నిషేధాన్ని ప్రకటించారు. పఠాన్కోట్ ఉగ్ర వాద దాడి లైవ్ కవరేజీ విషయంలో ఆ చానల్ వ్యవస్థీకృతమైన ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిందంటూ దానికి ఆ శిక్ష విధించారు. మీడియాపై కొత్త నిషేధాల కొరడా ప్రధాని ఉపన్యాసం, ఆ నిషేధ ఉత్తర్వులూ, రెండూ పూర్తిగా కాకతాళీ యమే అనుకుందాం. సమాచార మంత్రిత్వశాఖ వీసీ శుక్ల హయాంలో అత్యవ సర పరిస్థితిలో పత్రికలపై ముందస్తు సెన్సార్షిప్ను ప్రకటించిన తర్వాత మొదటి సారిగా ఒక ప్ర«ముఖ వార్తా చానల్పై నిషేధాస్త్రాన్ని ప్రకటించడానికి ముందు అంతకంటే మెరుగైన చర్య ఏమైనా ఉందేమోనని ఆలోచించాల్సింది. కానీ ఇది భారత ప్రభుత్వం, కాబట్టి ఇలాంటివి జరగడం మామూలే. అత్యవసర పరిస్థితి వంటి ముప్పునకు వ్యతిరేకంగా ప్రధాని మనల్ని జాగ రూకుల్ని చేసిన కథనం అచ్చవుతుండగానే... మాననీయ ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా (ఈజీఐ) ఎన్డీటీవీపై విధించిన నిషేధాన్ని ఖండిస్తూ ప్రకటనను జారీ చేసింది. ఈజీఐకి ‘‘మాననీయ’’ అనే విశేషణాన్ని వాడటానికి రెండు కారణా లున్నాయి. ఒకటి, ఏళ్లు గడిచే కొద్దీ పత్రికల యజమానులు సంపాదకీయ బాధ్యతలలోకి ప్రవేశించడమో లేదా ‘‘అణకువ’’గా ఉండే సంపాదకులు కావాలని కోరుకోవడమో చేస్తున్నారు. రెండు, ఈజీఐ ఉపయోగించిన భాష. గతంలో అది, నిరసన తెలిపేటప్పుడు కూడా పాత తరహా సంపాదకీయం లాగా నిగ్రహంగా, ఆచితూచినదిగా ఉండేది. తాజా ఖండన తుపాకీ మందులో ముంచిన మిరపకాయలా ఉంది. పాత్రికేయులం అయిన ఒక్క కారణం వల్ల మనం అత్యవసర పరిస్థితిని ప్రధానంగా మనల్ని వేధించడంగా, ఉత్తేజకరమైన రీతిలో మనం దాని పట్ల చూపిన ప్రతిఘటనగా నిర్వచిస్తాం. ఇందులో రెండో దానికి సంబంధించిన ప్రత్యామ్నాయ చరిత్రను తడమడం సముచితం. వంగమని అంటే భారత పాత్రికేయలోకం పాకిందంటూ ఎల్కే అద్వానీ ఆ విషయంపై అజరామ రమైన, సమంజసమైన వ్యాఖ్య చేశారు. మన పాత్రికేయులు ఎలాంటి పోరా టాన్నీ చేయలేదు లేదా ఆత్మసై్థర్యాన్ని ప్రదర్శించలేదనేది విచారకర వాస్తవం. గొయెంకా ఇండియన్ ఎక్స్ప్రెస్, ఇరానీ స్టేట్స్మేన్, అన్నిట్లోకి అత్యంత ధైర్యాన్ని చూపిన రాజ్మోహన్గాంధీ హిమ్మత్ పత్రిక వంటివి అందుకు మినహాయింపు. జాతీయ పత్రికల పట్ల శత్రువైఖరి చేపట్టిన ఇందిఎరాగాంధీ ఝూట్ (అబద్ధాలకోరు) ప్రెస్ అనేవారు. ప్రధానంగా ద్రవ్యోల్బణం 25%కి పైగా పెరిగిపోవడమూ, ప్రజలలో ఆమె పట్ల భ్రమలు తొలగడమూ కలసి బంగ్లాదేశ్ యుద్ధం వల్ల ఆమెకు కలిగిన ప్రాభవాన్ని మసకబరిచాయి. 1974 పోఖ్రాన్ అణు విస్ఫోటనం సైతం ఆ అసంతృప్తిని చల్లార్చలేకపోయింది. అత్యవసర పరిస్థితిలో మొట్టమొదట ఆమె ఆగ్రహానికి లక్ష్యంగా మారిన సుప్రసిద్ధ సంపాదకులు బీజీ వర్గీస్. అత్యవసర పరిస్థితి విధించిన మూడు నెల్లకు ఆయనకు ఉద్వాసన పలికారు. అంతకు ఏడాది ముందే ఆయన సిక్కిం విలీనాన్ని దురాక్రమణగా పేర్కొంటూ తన సంతకంతో ఒక సంపాదకీ యాన్ని వెలువరించారు. ఆ వెంటనే ఆయన్ను దేశవ్యతిరేకి అన్నారు. ఆయన తోటివారిలో అత్యధికులు ఆయనకు సమర్థనగా నిలవలేదు. వాక్ స్వాతం త్య్రం మంచిదే. కానీ అత్యున్నత జాతీయ ప్రయోజనాల రీత్యా సిక్కిం విలీ నాన్ని మీరు ప్రశ్నించడం సరైనదేనా? అనే వైఖరి చేపట్టారు. ఆయన సొంత పత్రిక పాత్రికేయులు అందుకు మినహాయింపు. ‘జాతీయ ప్రయోజనం’ నోటికి తాళం నేడు ఎన్డీటీవీపై నిషే«ధానికి వ్యతిరేకంగా పోరాడటంలో కూడా అలాంటి సందిగ్ధమే కనబడుతోంది. ఎక్కువగా ప్రింట్ మీడియా లేదా ‘‘ప్రెస్’’ అని పిలిచే దానితో కూడిన ఎడిటర్స్ గిల్డ్ నిరసన తెలిపింది. కాగా, చాలా ప్రధాన టీవీ చానళ్లు తిరిగి మళ్లీ అదే జాతీయ ప్రయోజన సూత్రాన్ని పఠిస్తూ నిరసన తెలుపలేదు. టీఆర్పీ రేటింగ్లను ఆరాధిస్తూ, తామే సరైనవారమని అహంక రించే ఈ అతి దేశభక్త చానళ్లు... భోపాల్ ఎన్కౌంటర్ కథనాన్ని పూర్తిగా విస్మరించేలా చాలా మందిని ఒప్పించాయి. ఇక ఆ ఘటనపై సరైన విచారణ జరిపించాలని అవి కోరడం సంగతి చెప్పనవసరమే లేదు. దేశభక్తి అనే ఈ భావనే ఉడీ ఉగ్రదాడిని, ఆ తదుపరి ఘటనలను ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం గొప్పగా ప్రచారం చేసుకుంటునే ఉన్నా... వాటి వివరాలను అడగ కుండా మనల్ని భయపెడు తోంది. వాస్తవాధీన రేఖ వద్ద నిత్యం జరుగుతున్న ప్రాణనష్టంపై ఏక పక్షమైనదిగా ఉంటోంది. మోదీ ప్రభుత్వానికి ఒక నూతన సిద్ధాంతం ఉన్నదని మనం గుర్తిస్తున్నాం. కానీ దానిలోని శ్రేష్టమైన అంశాలపై నైనా ‘‘వాంఛనీయమైన’’ చర్చ అవసరమని పరిగణించడం లేదు. ఐదు ప్రభుత్వాలు మారినా నిలిచిన వ్యూహాత్మక సంయమనం స్థానే ఇప్పుడు మోదీ–దోవల్ సిద్ధాంతం ప్రవేశించింది. దీన్ని ప్రశ్నించడం కాదు, చర్చించడ మైనా కూడా జాతీయ ప్రయోజనాలుగా చెప్పేవాటి రీత్యా తగని పని. శ్రోత లకు, ప్రజలకు, మార్కెట్కు సైతం కావాల్సింది ఊపిరి సలపని ప్రశంసలే తప్ప, ఇవేవీ అవసరం లేదు. యుద్ధం సాగిస్తున్న చానళ్లకు విరుద్ధంగా, అవస రమైన చోట కాస్త ఆగి, వాస్తవాల కోసం అన్వేషిస్తూ ప్రశ్నలు లేవనెత్తే చానళ్ల రేటింగ్స్లోని తేడాలో ఇది కనిపిస్తుంది. ఇందిరా గాంధీ కూడా అత్యవసర పరిస్థితికి ముందు, తర్వాతా దానికి సమర్థనగా ఇదే అతి జాతీయవాదాన్ని వాడారు. జయప్రకాశ్ నారాయణ్ ఉద్యమానికి వెనుక విదేశీ హస్తానికి ఆధారాలుగా పొరుగునున్న బంగ్లాదేశ్లో షేక్ ముజిబుర్ రెహ్మాన్, దూరంగా చిలీలో సాల్వడార్ అలెండీల హత్యలను చూపారు. ఆ సాకుతో ఆ ఉద్యమంపై విరుచుకు పడ్డారు. ఆ సమయంలో దేశం అప్పుడే గొప్ప సైనిక విజయాన్ని సాధించి పాక్ రెండు ముక్కలయ్యేలా చేసింది. నక్సలైట్ ఉద్యమాన్ని అణచివేసింది, బాహ్య అంతర్గత ముçప్పులు 1947 తర్వాత అతి అల్పస్థాయిలో ఉన్నాయి. అయితే చాలా జాగ్రత్తగా జాతీయ ఉన్మాదాన్ని కుహనా సోషలిజాన్ని మొరటుగా కలగలిపారు. ఎమ ర్జెన్సీ కాలంలో బస్సులపై మెరిసిన అప్రతిష్టాకరమైన నినాదాల్లో కెల్లా నాకు ఇష్టమైనది ‘‘పుకార్లు రేపేవారి పట్ల జాగ్రత్త వహించండి’’. మరింత సూటిగా చదివితే దానర్థం చేదు వాస్తవాలను చెప్పేవారిని తప్పు పట్టండి అని. మరోసారి అదే తప్పు చేద్దామా? నాలుగు దశాబ్దాల క్రితం నాటి భారతం ఈ ఫాసిస్టు చెత్తను నమ్మిందా? లేక వాటి వెనుక వాస్తవాలను చూసి, తిప్పికొట్టి, తన స్వేచ్ఛలను పునరుద్ధరించు కుందా? తర్వాతి చరిత్ర రెండోదే జరిగిందని చెబుతున్నా అది కథనంలోని ఒక భాగమే. అనామక పేద ప్రజా బాహుళ్యంపై బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను నాటి పాలకులు పాల్పడంతో ఉత్తర భారతం ఆగ్ర హంతో రగిలేవరకు ఉన్నత, మధ్య తరగతి వర్గాలు తమ స్వేచ్ఛలను కొంత కోల్పోవడాన్ని అంతగా పట్టించుకోలేదు. కానీ 1977 ఎన్నికల ఫలితాలు ఏమ య్యాయి? బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరిగిన ఉత్తర భార తంలో ఇందిరాగాంధీ తుడిచిపెట్టుకుపోగా, అవి జరగని దక్షిణాదిలో ఘన విజయం సాధించారు. ఇది ఏం తెలియజేస్తోంది? ఉన్నత, మధ్య తరగతి వర్గాల వారు స్వేచ్ఛ గురించి పట్టించుకోరని చెప్పడం మరీ అతిశయీకరించడమే అవుతుంది. వారెప్పుడూ, అది నా కోసమా, అయితే చెల్లించాల్సిన మూల్యం ఎంత? అని లాభనష్టాలను బేరీజు వేసి చూస్తారు. ఆ మేరకు మనం గత 40 ఏళ్లలో మారలేదు. పత్రికలు మౌనం పాటించినందున మనం, పాత్రికేయులం 1975-77 కాలం నాటి అత్యవసర పరిస్థితిలో భాగస్వాములం అయ్యాం. పౌర సమాజంపైన, పేదలపైనా దాడులు జరిగాయి. నేడు మీడియాపై జరుగుతున్న ఈ కొత్త దాడిపైన, నగ్నంగా జరుగుతున్న బూటకపు ఎదురుకాల్పులపైన, ప్రభుత్వ ప్రాయోజిత సాంస్కృతిక జాతీయవాదంపైన మౌనం వహించడం ద్వారా మనం మన అప్రతిష్టాకరమైన గతాన్ని పునరావృతం చేస్తున్నాం. నేడున్న ప్రమాదాలు నాటికంటే పెద్దవి. ఒకటి, బహిర్గత శత్రువు చాలా తేలికగా కనిపిస్తున్నాడు. రెండు, బాగా పనిచేస్తున్న ఆర్థిక వ్యవస్థ పెద్ద ఎత్తున అసంతృప్తిని దూరంగా ఉంచుతోంది. మూడు, చాలాకాలంగా స్థిరంగా నిలి చిన సామాజిక–రాజకీయ శక్తులు తమ మౌలిక విశ్వాసాలను కోల్పోయి, వాటికి బదులుగా టీఆర్పీ రేట్ల ద్వారా, ప్రజాభిప్రాయాన్ని తయారు చేయ డం ద్వారా తమ రాజకీయాలను సాగిస్తున్నాయి. నేడు స్పష్టమైన ఆలోచ నలతో సువిశాల జాతీయవాద సామాజిక రాజకీయ నిర్మాణాన్ని కలిగిన ఏకైక శక్తి దేశంలో ఆర్ఎస్ఎస్ ఒక్కటే. అది నాటి అత్యవసర పరిస్థితి వ్యతిరేక పోరాటాన్ని నడిపింది. నేడు అది అధికార వ్యవస్థకు నేతృత్వం వహిస్తోంది. శేఖర్ గుప్తా, twitter@shekargupta -
‘ఎన్డీటీవీ’ నిలిపివేత ఆదేశాలపై నిరసనలు
న్యూఢిల్లీ: పఠాన్కోట్ దాడిపై ప్రసారాలు చేసినందుకు ‘ఎన్డీటీవీ ఇండియా’ హిందీ న్యూస్ చానల్ ను నవంబర్ 9న నిలిపివేయాలన్న ఆదేశాల్ని విపక్షాలు, మీడియా సంస్థలు ఖండించాయి. సమాచార ప్రసార శాఖకు చెందిన అంతర్ మంత్రిత్వ శాఖ విచారణ బృందం ఆదేశాల పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేయడంతో పాటు ఎమర్జెన్సీ రోజులు గుర్తు కొస్తున్నాయంటూ మండిపడ్డాయి. ప్రసారాల నిలుపుదలపై ఇచ్చిన ఆదేశాల్ని తక్షణం ఉపసంహరించుకోవాలన్నాయి. దేశంలో ఎమర్జెన్సీ నాటి పరిస్థితులు నెలకొన్నాయని పశ్చిమ బెంగాల్ సీఎం మమత, ఈ ఆదేశాలు దిగ్భ్రాంతికర పరిణామంగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ పేర్కొన్నారు. ఐబీ ఉత్తర్వుల్ని ఖండించడంతో పాటు ఇది పత్రికా స్వేచ్ఛను ఉల్లంఘించడమేనని ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా. బ్రాడ్కాస్ట్ ఎడిటర్స్ అసోసియేషన్ పేర్కొన్నాయి. -
ఎన్డీ టీవీపై చర్యను ఖండించిన ఎన్బీఏ
న్యూఢిల్లీ: ఈ నెల 9వ తేదీన జాతీయ ఛానల్ ఎన్డీ టీవీ ఇండియా ప్రసారాలు నిలిపేయాలన్న కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖ నిర్ణయంపై ఎన్బీఏ అసంతృప్తి వ్యక్తం చేసింది. పటాన్ కోట్ దాడిని మిగతా ఛానళ్లు ప్రసారం చేసినా... కేవలం ఎన్డీ టీవీ ఇండియాపైన మాత్రమే చర్యలు తీసుకోవడం ఆశ్చర్యకరంగా ఉందని అభిప్రాయపడింది. ఆ నిర్ణయాన్ని కేంద్రం పునపరిశీలించాలని ఎన్బీఏ విజ్ఞప్తి చేసింది. కాగా పటాన్ కోట్లో మిలట్రీ ఆపరేషన్ లైవ్ ఇచ్చినందుకు ఎన్డీ టీవీపై కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖ చర్యలు చేపట్టింది. ఎన్డీటీవీ లైవ్ ప్రసారాల వల్ల రక్షణ రహస్యాలు భంగం వాటిల్లిందని ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ నెల 9వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి నవంబర్ 10వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట వరకూ చానెల్ ప్రసారాలు నిలిచిపోనున్నాయి. -
ఎన్డీటీవీ ప్రసారాలు నిలిపివేత
ప్రముఖ జాతీయ చానెల్ ఎన్డీటీవీ ప్రసారాలను ఒక రోజు పాటు నిలిపివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రసారాల నియమాలను ఉల్లంఘనే ఇందుకు కారణమని తెలుస్తోంది. పఠాన్ కోఠ్ ఎయిర్ బేస్ పై ఉగ్రదాడి సమయంలో ప్రోగ్రాం కోడ్ ను ఉల్లఘించి కీలక ప్రదేశాలను ఎన్డీటీవీ ప్రసారం చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసిన కేంద్ర ప్రసారాల శాఖ ఎన్డీటీవీపై క్రమశిక్షణా చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొంది. మంత్రుల కమిటీ చేసిన సూచనల ప్రకారం దాడిని ప్రత్యక్ష ప్రసారం చేయడం వల్ల టెర్రరిస్టులపై ప్రభుత్వం తీసుకునే చర్యల వివరాలు ప్రసారమైనట్లు నిర్దారణ జరిగిందని చెప్పారు. ఈ మేరకు ఈ నెల 9వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి నవంబర్ 10వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట వరకూ చానెల్ ప్రసారాలను నిలిపివేయాలని ఎన్డీటీవీని కోరినట్లు తెలిపింది. కాగా, ఎన్డీటీవీ నుంచి ఇప్పటివరకూ ఎలాంటి స్పందనా లేదని వెల్లడించింది. ఎయిర్ బేస్ లోని విమానస్ధావరాలు, యుద్ద విమానాలు, రాకెట్ లాంచర్లు, మోటార్లు, హెలికాప్టర్లు, ప్రెట్రోల్ ట్యాంకులు తదితరాలను ఎన్డీటీవీ ప్రసారం చేసినట్లు తెలిసింది. ఆ తర్వాత ఎన్డీటీవీకి షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసినట్లు పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ అధికారి తెలిపారు. -
కాసేపట్లో వైమానిక దాడులు.. కానీ
* ‘కార్గిల్’ సమయంలో పాక్పై దాడులకు వాయుసేన ప్రణాళిక * ఎక్స్క్లూజివ్గా సంపాదించిన ఎన్డీటీవీ న్యూఢిల్లీ: 1999 జూన్ 13.. తెల్లవారుజాము 4.30 గంటలు.. భారత్, పాకిస్తాన్ మధ్య కార్గిల్ యుద్ధం భీకరంగా సాగుతోంది. పాక్పై దాడులకు భారత వాయుసేన ప్రణాళిక రూపొందించింది. విమానాలను సిద్ధం చేసింది.. లక్ష్యాలను గురిపెట్టింది.. తుపాకులు, మందుగుండు సామగ్రితో పైలట్లు సిద్ధంగా ఉన్నారు. కొద్ది నిమిషాల్లో దాడులు మొదలవుతాయనగా.. ‘నో గో’(వద్దు.. వెళ్లొద్దు) అంటూ ఆదేశాలు అందాయి.. దీంతో దాయాదుల మధ్య పూర్తిస్థాయి యుద్ధం ప్రారంభం కాకుండానే ముగిసింది. పాక్పై దాడి చేసేందుకు వాయుసేన రూపొందించిన సమగ్ర ప్రణాళిక ఇది.. దీన్ని ఎన్డీటీవీ సంపాదించింది. అందులో ఏముందంటే.. ఆ యుద్ధ సమయంలో అప్పటి భారత, పాక్ విదేశాంగ మంత్రులు జశ్వంత్ సింగ్, సర్తాజ్ అజీజ్ల మధ్య ఢిల్లీ చర్చలు విఫలమవడంతో వాయుసేన ‘దాడి’ ప్రణాళిక రూపొందించింది. ‘జూన్ 12న చర్చలు విఫలమై అజీజ్ వెళ్లిపోవడంతో సాయంత్రం 4 గంటలకు పైలట్లను సమావేశపరిచింది. 13న వేకువజామున దాడులు చేయాలని కమాండ్ ఎయిర్ టాస్కింగ్ ఆర్డర్ జారీ చేసింది. పాక్ ఆక్రమిత కశ్మీర్లో 4 ఎయిర్క్రాఫ్ట్ల బాంబింగ్ మిషన్.. రావల్పిండిలోని చక్లాలా ఎయిర్ ఫోర్స్ ఎయిర్ బేస్లో బీడీఏ (బాంబ్ డ్యామేజ్ అసెస్మెంట్) చేయాలని ఆదేశాలు అందాయి’ అని ఎయిర్ఫోర్స్ 17 స్క్వాడ్రాన్ డైరీలో పేర్కొన్నారు. -
బాబుగారూ.. బడాయితనం
► హైదరాబాద్ నా బ్రెయిన్ చైల్డ్ ► నా జీవితం ప్రజల కోసం త్యాగం చేశా ► అప్పుడు నేను సంపదను సృష్టించింది నేనే ► ఎన్నికల్లో చేసిన హామీల కన్నా ఎక్కువ ఇస్తున్నా ► తెలంగాణలో నా జనం ఉంటారు.. కానీ నేనక్కడికి వెళ్లలేను ► టీడీపీ ఎమ్మెల్యేలను కేసీఆర్ తీసుకెళ్లటం చట్టబద్ధం కాదు ► ఎన్డీటీవీ ‘వాక్ ది టాక్’లో చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు చిద్విలాసంగా చెప్పుకున్న గొప్పలివి! నదీ పరిరక్షణ చట్టాన్ని ఉల్లంఘించి కృష్ణా నది గట్టుపై నిర్మించిన గెస్ట్హౌస్ను అధికారిక నివాసంగా చేసుకున్న చంద్రబాబు.. ఆ గెస్ట్హౌస్లోనే ఎన్డీటీవీ ‘వాక్ ది టాక్’లో ఇంటర్వ్యూ ఇచ్చారు. కృష్ణా నది గట్టు మీద, గెస్ట్హౌస్ లాన్లలో విహరిస్తూ ఆయన చెప్పిన మాటలు.. చేసిన వ్యాఖ్యలపై ఫేస్బుక్, ట్విటర్ సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చలు మొదలయ్యాయి. ఆయన వ్యాఖ్యలను జోక్లుగా అభివర్ణిస్తూ సెటైర్లు వినవస్తున్నాయి. ఇంటర్వ్యూలో శేఖర్గుప్తా అడిగిన పలు ప్రశ్నలకు చంద్రబాబు సమాధానాలిస్తూ చేసిన పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే... సాక్షి, హైదరాబాద్ : ‘‘నా జీవితం, రాజకీయాలు అంతా పోరాటమయం. నేను ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత అందరూ నన్ను అంతం చేయాలనుకున్నారు. ఎన్నో కష్టాలు.. పదేళ్ల పాటు పోరాడి చివరకు నేను నవ్యాంధ్రప్రదేశ్కు సీఎం అయ్యాను. హైదరాబాద్ నా బ్రెయిన్ చైల్డ్. హైదరాబాద్, సికిందరాబాద్లకు నేను సైబరాబాద్ను చేర్చాను. నేను హైదరాబాద్ను అభివృద్ధి చేశా అన్న ఆలోచనలు వస్తాయి. కానీ.. నేను జనం కోసం హైదరాబాద్ను నిర్మించానన్నది వాస్తవం. వారిని అనుభవించనివ్వండి.. నేను మరో నగరాన్ని నిర్మిస్తా. ఆరు నెలల కాలంలో.. గోదావరి నుంచి కృష్ణాకు నేను నీళ్లు తీసుకురాగలిగాను. ఈ ఏడాది 8 టీఎంసీ నీళ్లు ఇక్కడికి వచ్చాయి. పోలవరం ద్వారా గోదావరిలో వరద ఉన్నపుడు ఎంత నీటినైనా ఇక్కడికి తీసుకురాగలం. దేశంలో రెండు పెద్ద నదులను తొలిసారి అనుసంధానించాం. ఇక్కడి నుంచి పెన్నాకు తీసుకెళ్లాలనుకుంటున్నాను. అప్పుడు (గతంలో అధికారంలో ఉన్నపుడు) నేను సంపదను సృష్టించాను. అది దానికదిగా కింది వర్గాల వారికి చేరుతుందని (ట్రికిల్ డౌన్) నేను భావించా. కానీ అలా జరగలేదు.. నేను అధికారం కోల్పోయాను. నా కృషి మొత్తం వృథా అయింది. ఇప్పుడు మళ్లీ మైనస్లో నేను మొదలు పెట్టా. సున్నాతో కాదు.నావల్లే 2004 నాటికి విద్యుత్ మిగులు ఉంది. నేను మళ్లీ అధికారంలోకి వచ్చేటప్పటికి.. ఒక్క ఏపీలోనే 22.5 మిలియన్ యూనిట్ల లోటు ఉంది. తెలంగాణలో కాదు. ఒక నెల కాలంలోనే నేను దానిని మళ్లీ సరి (రివర్స్) చేయగలిగాను. నేను ఇలా ఎందుకు పనిచేయాలి? నా కుటుంబం ఇక్కడ లేదు. వారు ఏదో వ్యాపారం చేస్తున్నారు. ఆమె కూడా బిజీ. నాకొక మనవడు ఉన్నాడు. రోజుకు గంట సమయం కూడా గడపటం లేదు. నేను మనవడితో ఆడుకునే సమయం ఇది. కానీ నేను నా జీవితం త్యాగం చేస్తున్నాను. ఎందుకు? ప్రజల కోసం. నేను ఎన్నికల్లో అతిగా హామీలు ఇవ్వలేదు. నేను హామీలు ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఇస్తున్నా. కొన్నిసార్లు మేం ఆలోచనలు మార్చుకోవచ్చు. అప్పుడు అది సరికావచ్చు.. ఇప్పుడు ఇంకొకటి సరికావచ్చు. ఉదాహరణకు ఇప్పుడు 44 లక్షల పెన్షన్లు ఇస్తున్నా. ఇంటికి పంపిస్తున్నా. తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేలు 15 మందిలో 9 మందిని (కేసీఆర్) తీసుకెళ్లటం చట్టబద్ధం కాదు. పార్టీ ఫిరాయింపుల చట్టం ఉంది. అసలు పార్టీని చీల్చలేరు. దానిపై న్యాయపోరాటం ఒక నిరంతర ప్రక్రియ. హైదరాబాద్లో తెలంగాణలో నా జనం ఉంటారు.. నేను అక్కడికి వెళ్లలేను. అక్కడ (అసెంబ్లీ ఎన్నికల్లో) పోటీ చేయలేను. 2018 ఎన్నికల్లో అక్కడ అధికారం కోసం పోటీచేస్తాం.’’ -
ఆన్లైన్ వెడ్డింగ్ మార్కెట్లోకి ఎన్డీటీవీ మీడియా గ్రూప్
స్పెషల్ అకేషన్ పేరుతో వెంచర్ ఏర్పాటు న్యూఢిల్లీ: ఆన్లైన్ వెడ్డింగ్ మార్కెట్ స్పేస్లోకి ఎన్డీటీవీ మీడియా గ్రూప్ ప్రవేశించింది. స్పెషల్ అకేషన్ పేరుతో ఆన్లైన్ ఏర్పాటు చేస్తున్న ఈ కొత్త వెంచర్కు అమెరికాకు చెందిన సెర్రాక్యాప్ వెంచర్స్ నుంచి పెట్టుబడుల సమీకరించామని ఎన్డీటీవీ తెలిపింది. అయితే ఎంతమొత్తంలో నిధులు సమీకరించిందీ కంపెనీ వెల్లడించలేదు. సెర్రాక్యాప్ వెంచర్స్ నుంచి సమీకరించిన పెట్టుబడులు ఆధారంగా స్పెషల్ అకేషన్ విలువను 2 కోట్ల డాలర్లుగా పేర్కొంది. ఈ స్పె షల్ అకేషన్ వెంచర్కు సీఈఓగా సచిన్ సింఘాల్ను నియమించామని వివరించింది. తాము అందుబాటులోకి తెచ్చిన ఇండియన్రూట్స్డాట్కామ్, గాడ్జెట్360డాట్కామ్, కార్ఎన్బైక్డాట్కామ్.. వంటి ఈ కామర్స్ వెంచర్లకు ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన లభిస్తోందని ఎన్డీటీవీ సీఈఓ విక్రమ్ చంద్ర చెప్పారు. ఆన్లైన్ వెడ్డింగ్ మార్కెట్ 4,000 కోట్ల డాలర్ల మార్కెట్ అనీ, అయితే అత్యధిక భాగం అవ్యవస్థీకృతంగా ఉందని సెర్రాక్యాప్ వెంచర్స్ మేనేజింగ్ పార్ట్నర్ సౌరభ్ సూరి చెప్పారు. -
కమల దళానికే పట్నా పీఠం!
బిహార్ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందన్న ఎన్డీటీవీ ఎగ్జిట్ పోల్ ♦ ఎన్డీఏకు 125, మహాకూటమికి 110 సీట్లు వస్తాయని అంచనా న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ మెజారిటీ సాధించి అధికారం సొంతం చేసుకుంటుందని తన ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడైనట్లు ఆంగ్ల వార్తా చానల్ ఎన్డీటీవీ ప్రకటించింది. అక్టోబర్ 12న మొదలై నవంబర్ 5 వరకూ ఐదు దశలుగా సాగిన ఎన్నికలపై నిర్వహించిన ఫలితాలను ఎన్డీటీవీ శుక్రవారం ప్రసారం చేసింది. రాష్ట్రంలోని మొత్తం 243 అసెంబ్లీ స్థానాల్లో విపక్ష ఎన్డీఏ 125 సీట్లు కైవసం చేసుకుంటుందని అంచనా వేసింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న జేడీయూ సారథ్యంలోని ఆర్జేడీ, కాంగ్రెస్లతో కూడిన మహాకూటమి 110 సీట్లు సాధించి విపక్షంలోకి వెళుతుందని పేర్కొంది. ఐదు దశల ఎన్నికల్లో తొలి దశ, చివరి దశ ఎన్నికలు జరిగిన సీట్లలోనే మహాకూటమికి.. ఎన్డీఏ కన్నా స్వల్పంగా ఎక్కువ సీట్లు వస్తాయని.. మధ్యలో గల మూడు దశల్లోనూ ఎన్డీఏకే అధిక సీట్లు వస్తాయని తేలినట్లు వివరించింది. అయితే.. గురువారం జరిగిన తుది దశ ఎన్నికల్లోనే రెండు కూటముల తల రాతలు మారిపోయినట్లు పేర్కొంది. ముస్లింలు, ఓబీసీలు అధికంగా గల సీమాంచల్, మిథిలాంచల్ ప్రాంతాల్లో మొదటి నాలుగు దశలకన్నా అధికంగా రికార్డు స్థాయిలో 60 శాతం పోలింగ్ నమోదైన విషయం తెలిసిందే. ఈ ఐదో దశలో ఎన్నికలు జరిగిన 57 స్థానాల్లో మహాకూటమి తన సిట్టింగ్ స్థానాలను 17 కోల్పోతే.. ఎన్డీఏ 20 స్థానాలను అధికంగా గెలుచుకోనుందని ఎన్డీటీవీ వివరించింది. మొత్తం మీద.. మహాకూటమి కన్నా 15 సీట్లు అధికంగా సాధించి ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని అంచనా వేసింది. రాష్ట్రంలోని 243 నియోజకవర్గాల నుంచి 76,000 మందిని సర్వే చేసి ఈ ఫలితాలను క్రోడీకరించినట్లు తెలిపింది. -
గ్యాడ్జెట్ 360 డిగ్రీలో కొత్త పెట్టుబడులు
న్యూఢిల్లీ: మీడియా దిగ్గజం ఎన్డీటీవీకి చెందిన ఈకామర్స్ సంస్థ గ్యాడ్జెట్ 360 డిగ్రీ తాజాగా మరిన్ని పెట్టుబడులు సమీకరించింది. పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్, ఇన్ఫ్లెక్షన్పాయింట్ మొదలైనవి ఇందులో ఇన్వెస్ట్ చేశాయి. 50 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 325 కోట్ల) వేల్యూయేషన్లతో సంస్థ ఈ నిధులు సమీకరించినట్లు ఎన్డీటీవీ ఒక ప్రకటనలో తెలిపింది. గ్యాడ్జెట్ 360 డిగ్రీకి భావనా అగర్వాల్ను కొత్త సీఈవోగా నియమించినట్లు వివరించింది. యాత్రాడాట్కామ్ వంటి స్టార్టప్ సంస్థల్లో ఆమె కీలక పాత్ర పోషించినట్లు ఎన్డీటీవీ పేర్కొంది. -
మోదీ ప్రభుత్వ ప్రభ మసకబారుతోంది
రాహుల్ బజాజ్ తీవ్ర విమర్శలు న్యూఢిల్లీ : నరేంద్ర మోదీ ప్రభుత్వ ప్రభ మసకబారుతోందని ప్రముఖ పారిశ్రామికవేత్త రాహుల్ బజాజ్ తీవ్రంగా విమర్శించారు. కొత్త నలధన చట్టం ప్రజలను ఇబ్బందులకు గురిచేయడానికే పనికివస్తుందని నిప్పులు చెరిగారు. ప్రతీకారం తీర్చుకునే భావనతోనే దీనిని రూపొందించినట్లుగా ఉందని చెప్పారు. గతంలో నరేంద్ర మోదీకి వీరాభిమాని అయిన రాహుల్ బజాజ్ ఇప్పుడు ఈ స్థాయిలో విమర్శించడం విశేషం. ప్రభుత్వం తన ప్రయత్నాలకు తానే అడ్డంకులు సృష్టించుకుంటోందని పేర్కొన్నారు. ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కొత్త నల్లధన చట్టం ప్రకారం విదేశీ ఆస్తులున్నవాళ్లు వాటి వివరాలను వెల్లడించాల్సి ఉంటుందని, ఇలా వెల్లడి చేస్తే భవిష్యత్తులో విచారణ నుంచి విముక్తి పొందే గ్యారంటీ ఏదీ లేదని వివరించారు. -
ఎన్డీటీవీకి రూ.24 కోట్ల నష్టాలు
న్యూఢిల్లీ : ఎన్డీటీవీకి మొదటి త్రైమాసిక కాలానికి రూ.24 కోట్ల నికర నష్టం వచ్చింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి రూ.1 కోటి నష్టం పొందామని ఎన్డీటీవీ తెలిపింది. గత క్యూ1లో రూ.147 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ1లో రూ.120 కోట్లకు తగ్గిందని పేర్కొంది. కొత్తగా ప్రారంభించనున్న ఈ కామర్స్ వెంచర్స్ కోసం తొలి దశలో 8 కోట్ల డాలర్ల నిధులను సమీకరించామని తెలిపింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేర్ బీఎస్ఈలో 2 శాతం వృద్ధితో రూ.127కు పెరిగింది. -
సెక్సిస్ట్ ఔట్లుక్ని ఇకనైనా బద్దలు కొట్టాలి
బిగుతైన దుస్తులు వేసుకుని స్మిత ర్యాంప్ మీద నడుస్తుంటే కెమెరా పట్టుకుని కేసీఆర్ ఆమె వంక చూస్తున్నట్లు వేసిన క్యారికేచర్... తను స్వయంగా అన్నట్లు ప్రజల్లో ఒక ‘అభిప్రాయాన్ని’ ఏర్పరుస్తుంది. ఔట్లుక్ ‘నో బోరింగ్ బాబు’ వివాదం గురించి ఎన్డీటీవీతో మాట్లాడుతూ స్మితా సబర్వాల్ ఈ మొత్తం విషయాన్ని ‘కాన్స్పిరసి’ అ న్నారు. ఈ పదానికి తె లుగులో కుట్ర, దురా లోచన, మంత్రాంగం అనే అర్థాలున్నాయని శబ్దకోశం చెబుతోంది. మన రాజ్యాంగం, ఆర్టికల్ 164(2)లో ముఖ్య మంత్రితోపాటు మంత్రులు కూడా లెజిస్లేటివ్ అసెంబ్లీకి సమష్టి బాధ్యత వహించాలి అని చెబు తుంది. కాని నేటి మన రాజకీయ పార్టీలు, మరీ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలోని ప్రాంతీ య పార్టీలు వ్యక్తి కేంద్రంగా ఉంటూ వస్తున్నా యి. దాంతో ముఖ్యమంత్రి అవుతున్న ఆ పార్టీ నేత సార్వభౌమత్వాన్ని పొందుతున్నాడు. అతని కార్యాలయం ‘పవర్ సెంటర్’గా మారిపోయిం ది. ఆ పవర్ సెంటర్లో అధికారిగా కీలకమైన స్థానంలోకి చిన్న వయసులో అనేక మందిని దాటుకుని చేరుకున్నది స్మిత. ప్రధానమంత్రి లేదా ముఖ్యమంత్రులు తమ కార్యాలయాల్లో పనిచేసే అత్యున్నత స్థాయి అధికారులను, మంత్రుల్ని ఎంపిక చేసుకున్నట్లే, తమకు అనుకూలంగా పనిచేసేవారిని ఎంపిక చేసుకుని తెచ్చుకోవడం ఇప్పుడొక రివాజుగా ఉంది. మన రాష్ట్రం వరకు వస్తే ఆయా ముఖ్య మంత్రులు వారి కార్యాలయాల్లో అత్యున్నత పదవుల్లో నియమించుకున్న అధికారులను బట్టి ఆ ముఖ్యమంత్రి ప్రాధమ్యాలు ఏ రకంగా ఉం డబోతున్నాయో అనే సూచన కొన్నేళ్లుగా ఉంటూ వస్తోంది. రాజశేఖరరెడ్డి వంటి దార్శనిక ముఖ్య మంత్రులు దళిత మైనారిటీ వర్గాల అధికారు లను నియమించడం ద్వారా ఆ వర్గాలకు ఆత్మ స్థైర్యాన్ని ఇవ్వడమే కాకుండా ఆ వర్గాల అభివృ ద్ధిని ఉద్యమ స్థాయిలోకి తీసుకెళ్లడానికి ప్రయ త్నించారు. ఒక సుదీర్ఘ ఉద్యమ ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. ఒక ప్రత్యేక అస్తిత్వ పోరాటాన్ని అతి నేర్పుగా నడి పిన ఈ నాయకుడు రాష్ట్ర అవతరణ దినోత్సవా నికి ముందు, దళితుడే తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి అవుతాడని ప్రకటించి ఉన్నాడు. అలాగే నవ తెలంగాణ నిర్మాణం కోసం ఇతర రాష్ట్రాలలో పనిచేస్తున్న తెలంగాణకు చెందిన ఉన్నత స్థాయి అధికారులను డెప్యుటేషన్ మీద తీసుకొస్తానని కూడా ప్రకటించి ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన కార్యాలయంలో అధికారు లు పూర్తిగా తెలంగాణ నేపథ్యం ఉన్నవారే అయి ఉంటారని.. వారిలో దళితులు, మైనారిటీలు కూడా ఉంటారని చాలామంది అనుకున్నారు. కానీ అందుకు భిన్నంగా.. సుదీర్ఘ అనుభవం, ప్రతిభ ఉన్న ఒక తెలంగాణ వాసిని ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించడంతోపాటు బెంగాలీ నేపథ్యం ఉన్న సమర్థులైన యువ అధికారిణిని అదనపు కార్యదర్శిగా నియమించుకున్నారు. స్మిత తన నియామకంపై మాట్లాడుతూ, ‘ఇంత వరకు మహిళలు లేని చోట మహిళలను నియ మించి, సీఎం కేసీఆర్ సమాజానికి ఒక సందేశా న్నిచ్చారు’ అని అన్నారు. అయితే ఈ మొత్తం విషయాన్ని పరిశీలిస్తే మనలో కొన్ని ప్రశ్నలు తలెత్తుతాయి. తెలంగాణ ఆత్మగౌరవం పేరిట ఏర్పడ్డ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేయడానికి సమర్థత, ప్రతిభ కలిగిన బలహీ నవర్గాలకు చెందిన ఒక్క తెలంగాణ ఐఏఎస్ కూడా కేసీఆర్కి కనిపించలేదా? చరిత్ర పొడవునా అధికారం కోసం జంతు నీతితో మనం పోట్లాడుతూనే వచ్చాం. అది ఇవా ళ కొత్త కాదు. కొత్త ఏమిటంటే ఇక్కడ అధికారం కోసం జరిగిన పాచికలాటలో ఒక మహిళ గెలు పొందింది. గెలుపు సాధించడానికి పురుషుడి కైనా, స్త్రీకైనా పరిచయాలు, కులాలు, మతాలు, నేపథ్యాలు వంటి ఎన్నో అంశాలు కీలకపాత్రలు పోషిస్తాయి. కానీ పురుషుడికి భిన్నంగా అధికా రంలో ఉన్న ఒక స్త్రీ మీద దాడి జరిగేటప్పుడు మాత్రం ఆమె లైంగికత అక్కడ ప్రధాన అంశమై నిలుస్తుంది. ఔట్లుక్ పత్రిక చేసింది కూడా అదే. బిగుతైన దుస్తులు వేసుకుని స్మిత ర్యాంప్ మీద నడుస్తుంటే కెమెరా పట్టుకుని కేసీఆర్ ఆమె వంక చూస్తున్నట్లు వేసిన క్యారికేచర్... స్మిత స్వయంగా ఎన్డీటీవీతో అన్నట్లు ప్రజల్లో ఒక అభి ప్రాయాన్ని ఏర్పరుస్తుంది. స్మితలాగే సమాన ప్రతిభ ఉన్నవాళ్లు చాలామంది ఉన్నా స్మిత సౌం దర్యం ఆమెని ఆ స్థానానికి తీసుకెళ్లిందని, కేసీ ఆర్ ఆమెని ఒక వస్తువుగానే చూసి తీసుకెళ్లి ఆ స్థానంలో కూర్చోబెట్టాడనేదే ఆ అభిప్రాయం. ఈ తరహా దాడి పురుషులతో పోటీ పడ గలిగే స్థాయికి చేరిన స్త్రీలందరికీ అనుభవమే. ఒక స్త్రీ ఈ పురుషస్వామ్య ప్రపంచంలో కీలక స్థానంలో నిలిచిందంటే ఆమె కత్తిమీద సాము చేసి వచ్చిందని అర్థం. స్మిత కీలక పదవిని పొం దడంలోనే కాదు ఈ ప్రపంచం చేసిన లైంగిక పరమైన దాడిని ధైర్యంగా ఎదుర్కోవడం ద్వారా కూడా సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అనే సోషల్ డార్వి నిజం ప్రకారం ఫిట్టెస్ట్ ఆఫ్ ది ఫిట్టెస్ట్గా నిలి చింది. మన సమాజం స్మిత పట్ల లేదా ఆమె లాం టి స్త్రీలపట్ల వ్యక్తపరుస్తున్న ఈ సెక్సిస్ట్ ఔట్ లుక్ ని ఇకనైనా బద్దలు కొట్టాల్సిన అవసరం ఉంది. (వ్యాసకర్త కథా రచయిత్రి) మొబైల్: 80196 00900 - సామాన్య -
ఎన్డీటీవీపై సెబీ జరిమానా
న్యూఢిల్లీ : మీడియా సంస్థ న్యూఢిల్లీ టెలివిజన్ (ఎన్డీటీవీ)పై సెబీ రూ. 2 కోట్ల జరిమానా విధించింది. 2014 ప్రారంభంలో రూ. 450 కోట్ల మేర పన్ను నోటీసులు అందుకున్న సమాచారాన్ని స్టాక్ ఎక్స్చేంజీలకు తెలియజేయడంలో కంపెనీ జాప్యం చేసినందుకు గాను ఈ పెనాల్టీ విధించింది. 2009-10 అసెస్మెంట్ ఇయర్కి సంబంధించి నోటీసులను ఆదాయ పన్ను శాఖ 2014 ఫిబ్రవరిలోనే ఇచ్చినప్పటికీ ఆ విషయాన్ని బీఎస్ఈ, ఎన్ఎస్ఈలకు మే లో తెలియజేసింది ఎన్డీటీవీ. ఇన్వెస్టర్ల ప్రయోజనాలతో ముడిపడి ఉన్న ఇలాంటి అంశంలో కంపెనీ .. నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా సెబీ అడ్జుడికేటింగ్ అధికారి ప్రసాద్ జగ్దలే ఈ మేరకు జరిమానా విధిస్తూ ఉత్తర్వులిచ్చారు. -
టీడీపీకి 40 సీట్లు కూడా రావు: వైఎస్ జగన్
హైదరాబాద్ : సీమాంధ్రలో తమ పార్టీ క్లీన్స్వీప్ చేస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ...ఎన్డీ టీవీ సీఈవో ప్రణయ్ రాయ్కిచ్చిన ప్రత్యేక ఇంటర్వూలో చెప్పారు. సీమాంధ్రలోని 175 సీట్లలో టీడీపీకి 40 సీట్లు కూడా రావన్నారు. సీమాంధ్రకు హైదరాబాద్ను దూరం చేసి తీరని అన్యాయం చేసిన కాంగ్రెస్పై ఆయన మండిపడ్డారు. అభివృద్ధికి ఇంజిన్లాంటి హైదరాబాద్ను తొలగించి సీమాంధ్రకు ప్రత్యేక హోదా ఇచ్చినందువల్ల ప్రయోజనమేమీ ఉండబోదన్నారు. ప్రణయ్రాయ్: ఎన్నికల ప్రచారంలో ఇలాంటి భావోద్వేగ వాతావరణాన్ని ఎప్పుడూ చూడలేదు. మీకు ఇది అంత పట్టున్న ప్రాంతం కూడా కాదు. సీమాంధ్రలో కన్నా.. ఎక్కువ ఎమోషన్ కనిపిస్తోందా? వైఎస్ జగన్: సీమాంధ్రలో ఇంతకన్నా ఎక్కువ ఉంటుంది ప్రణయ్రాయ్: రాయలసీమలో కూడా ఇంతేనా? వైఎస్ జగన్: రాయలసీమైనా... కోస్తాంధ్ర అయినా పెద్దగా తేడా ఉండదు. రెండు ప్రాంతాలు కూడా ఒకే రకమైన అభిప్రాయంతో ఉంటాయి. శ్రీకాకుళం నుంచి చివరివరకూ ఒకేరకమైన ధోరణి కనిపిస్తుంది. అధికారంలో వచ్చే ఏపార్టీ అయినా.. క్లీన్స్వీప్ చేస్తుంది. మూడింట రెండొంతుల మెజార్టీ సాధిస్తుంది. తమిళనాడు తరహా రాజకీయ ప్రవర్తన కనిపిస్తుంది. కాని తెలంగాణలో దీనికి భిన్నంగా ఉంటుంది. మెజార్టీ సీట్లు సాధించే ఏపార్టీకూడా సగానికిపైగా సీట్లు సాధించే అవకాశం లేదు. తెలంగాణ ఉద్యమం తారస్థాయిలో ఉన్నప్పుడు కూడా టీఆర్ఎస్ కేవలం 26 సీట్లు మాత్రమే సాధించింది. 2009 ఎన్నికల్లో టీఆర్ఎస్కు 10 సీట్లే వచ్చాయి. సీమాంధ్రలో అయితే పరిస్థితి భిన్నంగా ఉంటుంది. క్లీన్ స్వీప్ ఉంటుంది. ఆప్రాంతంలో రాజకీయ ధోరణి అలానే ఉంటుంది. గడచిన 30 ఏళ్ల ఫలితాలను చూస్తే... ఇదే తెలుస్తుంది. ప్రణయ్ రాయ్: మీరు ఎన్ని నెలలనుంచి ఇలా ర్యాలీలు, రోడ్షోలు చేస్తున్నారు? వైఎస్ జగన్: గడచిన నాలుగు సంవత్సరాలు నేను ఇవి చేస్తూనే ఉన్నా... ప్రణయ్రాయ్: ప్రత్యేకించి మహిళలు... మరింత భావోద్వేగాలను చూపుతున్నారు? వైఎస్ జగన్ : మిగతావారితో పోలిస్తే.. మహిళలు నన్ను హృదయపూర్వంగా ఆశీర్వదిస్తున్నారు. దేవుడికి కృతజ్ఞతలు. ప్రణయ్రాయ్: బీజేపీ, టీడీపీల పొత్తు.. కొంతశాతం మైనార్టీ ఓటర్లను మీకు దూరంచేస్తుందంటారా? వైఎస్ జగన్: బీజేపీ, టీడీపీ పొత్తు ఉన్నా.. లేకున్నా.. పెద్దగా ప్రభావం ఉండదు. ఓటింగ్ దగ్గరకు వచ్చేసరికి బీజేపీ , టీడీపీ పొత్తు వల్ల పెద్దగా మార్పు ఉండదు. కాకుంటే ఒకటి రెండు శాతం ఓట్లలో తేడా ఉండొచ్చు. కాని, ఈతేడా ఓట్లు, సీట్లుగా మారవు. సీమాంధ్రలో బీజేపీకి, కాంగ్రెస్కు ఎలాంటి సీట్లూ రావు. 175 సీట్లలో టీడీపీ 40 సీట్లు దాటదు. ప్రణయ్రాయ్: మీరు కూడా ఎన్నికల గణాంకాల విశ్లేషకులే. మీరు కూడా ఎవరికెన్నిసీట్లో చెప్తున్నారు. మీ ఆలోచనల్లో... మీ భావాల్లో మీనాన్న ఎక్కువ కనిపిస్తున్నారు? వైఎస్ జగన్: ఇప్పటికీ ఆయన బతికే ఉన్నారు. కారణం ఏంటంటే.. ఆయన చాలా చేశారు. ఆయన వదిలివెళ్లిన ప్రేమాభిమానాలను ప్రజలు చూపిస్తున్నారు. ప్రజల దగ్గరకు వచ్చేసారికి తమ సొంత ఇంటి మనిషిలా చూస్తున్నారు. సొంత కొడుకుగా, మనవడిగా, సొంత తమ్ముడిగా, అన్నగా నన్ను అభిమానిస్తున్నారు. ఇదంతా నాన్న చేసినదానివల్లే. దాన్ని నిలబెట్టుకుంటానని, మరింత మెరుగ్గా సేవలందిస్తానని వారికి మరింత భరోసానివ్వాలి. -
టీడీపీకి 40 సీట్లు కూడా రావు: వైఎస్ జగన్
-
సర్వేల పేరుతో జాతీయ చానళ్ల హంగామా
-
సర్వేలలో సారమెంత..?
-
అల్లర్లు జరిగితే సీఎంకీ బాధ్యత: పవార్
ఏ రాష్ట్రంలో అల్లర్లు జరిగినా, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి బాధ్యత ఉంటుందని ఎన్సీపీ అధినేత, కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్పవార్ అన్నారు. 2002 గుజరాత్ మత ఘర్షణలకు నరేంద్రమోడీ బాధ్యుడా? కాదా? అనే విషయంపై సోమవారం ఎన్డీటీవీతో ఆయన మాట్లాడుతూ.. పైవ్యాఖ్యలు చేశారు. ‘నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ఏదైనా ఘటన జరిగితే దానికి నేనే బాధ్యత తీసుకోవాలి. నేరుగా అందులో పాలుపంచుకోకపోయినా.. ఓ ముఖ్యమంత్రిగా, ఓ ప్రజాప్రతినిధిగా పౌరుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత నాపై ఉంటుంది’’ అని చెప్పారు. గతంలో ఇదే అంశంపై పవార్ స్పందిస్తూ గుజరాత్ అల్లర్లకు మోడీని బాధ్యుడిని చేయడం సరికాదని, కోర్టు కూడా ఆయనను నిర్దోషిగా ప్రకటించిందని చెప్పారు. 2002 అల్లర్లకు సంబంధించి కోర్టు తీర్పును ఆమోదించాల్సి ఉంటుందన్నారు. -
కన్ఫ్యూజింగ్ మాస్టార్
-
రాష్ట్ర విభజనను అడ్డుకుంటే మోడీకి కూడా మద్దతిస్తాం
-
కాంగ్రెస్కు అర్థం మారిపోయింది: జగన్
ఎన్డిటివి.కాం సౌజన్యంతో... న్యూఢిల్లీ: సమైక్యాంధ్ర కోసం ఎవరు ముందుకొచ్చిన వారికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా సోమవారం దేశ రాజధాని న్యూఢిల్లీలో జంతర్ మంతర్ చేపట్టిన సమైక్య ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్డిటీవీతో వైఎస్ జగన్ మాట్లాడారు. సమైక్య ఆంధ్ర కోసం తాము చేస్తున్న పోరాటానికి జాతీయ నేతలు మద్దతు ఇస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని ఆయన జోస్యం చెప్పారు. హెడ్లైన్స్ టుడే సౌజన్యంతో... నేడు ఆంధ్రప్రదేశ్ను ముక్కలు చేస్తున్న కేంద్రం రేపు మరో రాష్ట్రాన్ని కూడా విభజిస్తుందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ అనే మాటకు అర్థం మారిపోయింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాస్తా ఇటాలియన్ నేషనల్ కాంగ్రెస్గా రూపాంతరం చెందిందన్నారు. దేశంలో బ్రిటీష్ పాలన కూడా ఇంత ఘోరంగా లేదన్నారు. -
'సమైక్యనినాదంతో తెలంగాణలో పర్యటిస్తా'
-
మనకు కావలసింది ముజఫర్ నగర్లు కాదు.. మొహబత్ నగర్లు: ఎన్డిటివితో వైఎస్ జగన్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ఎన్డీటీవికి ఇచ్చిన ఇంటర్వ్యూ