operations
-
ఎలాన్ మస్క్ చేతికి టిక్టాక్..?
టెస్లా, స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్(Elon Musk) చైనాకు చెందిన బైట్డ్యాన్స్ ఆధ్వర్యంలోని టిక్టాక్(TikTok) అమెరికా కార్యకలాపాల(US operations)ను కొనుగోలు చేయవచ్చనే వార్తలొస్తున్నాయి. అమెరికాలో జాతీయ భద్రత, డేటా గోప్యతపై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో బైట్డ్యాన్స్ యూఎస్ కార్యకలాపాలు ప్రశ్నార్థకంగా మారాయి. ఈ నేపథ్యంలో టిక్టాక్ను స్థానికంగా నిషేధించనున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. దీనిపై ఇంకా తుది నిర్ణయం రాలేదు.చైనాకు చెందిన బైట్డ్యాన్స్(ByteDance) ఆధ్వర్యంలోని టిక్టాక్ను 2025 జనవరి 19 నాటికి అమెరికాకు చెందిన ఓ కంపెనీకి విక్రయించాలనేలా గతంలో ఆంక్షలు విధించారు. లేదంటే ఈ యాప్పై నిషేధం విధించే అవకాశం ఉంది. ఈ నిషేధాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలనేలా టిక్టాక్ అమెరికా ఉన్నత న్యాయస్థానాన్ని ఇటీవల అభ్యర్థించింది. దాంతో 2025 జనవరి 10న కంపెనీ వాదనలు వినడానికి న్యాయస్థానం అంగీకరించింది. దీనిపై తుదితీర్పు రావాల్సి ఉంది.అమెరికాలో జాతీయ భద్రతా ఆందోళనల కారణంగా ఈ యాప్పై చాలా విమర్శలొచ్చాయి. దాంతో అమెరికా ప్రభుత్వం ప్రాథమికంగా దర్యాప్తు జరిపింది. అమెరికా దేశ భద్రతకు భంగం వాటిల్లేలా స్థానికుల నుంచి సున్నితమైన సమాచారాన్ని సేకరించి దాన్ని చైనాలోని డేటా సెంటర్లలో స్టోర్ చేస్తున్నారని ప్రాథమికంగా నిర్ధారించింది.డేటా భద్రతలొకేషన్లు, ప్రైవేట్ సందేశాలతో సహా అమెరికన్ యూజర్ల నుంచి టిక్టాక్ పెద్దమొత్తంలో డేటా సేకరించి దేశ భద్రతకు భంగం కలిగించేలా డేటాను చైనా ప్రభుత్వం యాక్సెస్ చేస్తుందనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి.కంటెంట్ మానిప్యులేషన్అమెరికన్లు చూసే కంటెంట్ను తారుమారు చేయడానికి, ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయడానికి లేదా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి టిక్టాక్ను వినియోగిస్తున్నారనే భయాలు ఉన్నాయి.ఇదీ చదవండి: మరింత క్షీణిస్తున్న రూపాయి!ఈ నేపథ్యంలో బైట్డ్యాన్స్ 2025 జనవరి 19 లోగా టిక్టాక్ను అమెరికా కంపెనీకి విక్రయించాలని లేదా నిషేధాన్ని ఎదుర్కోక తప్పదని 2024 ఏప్రిల్లో ఒక చట్టం ఆమోదించారు. ద్వైపాక్షిక మద్దతుతో ఈ చట్టాన్ని రూపొందించి జో బైడెన్ దానిపై సంతకం చేశారు. దాంతో కంపెనీ అమెరికా ఉన్నత న్యాయస్థానం ముందు తన వాదనలు వినిపించింది. ఈ తరుణంలో ఎలాన్మస్క్ టిక్టాక్ అమెరికా కార్యకలాపాలను కొనుగోలు చేయబోతున్నట్లు కొన్ని మీడియా సంస్థలు వార్తాకథనాలు ప్రచురిస్తున్నాయి. -
భయపెడుతున్న దానా.. ప్రచండ గాలులతో వర్ష సూచన!
Dana Cyclone Updates:తీవ్ర తుఫానుగా ‘దానా’ వాయువ్య బంగాళాఖాతంలో కదులుతోంది. గడిచిన 6 గంటల్లో 12 కి.మీ వేగంతో ఉత్తర వాయువ్య దిశగా తుపాను కదులుతోంది. పారాదీప్ (ఒడిశా)కు ఆగ్నేయంగా 260 కి.మీ, ధమర (ఒడిశా)కి 290 కి.మీ, సాగర్ ద్వీపానికి (పశ్చిమ బెంగాల్) దక్షిణంగా 350 కి.మీ దూరంలో తుపాను కేంద్రీకృతం అయినట్లు వాతావరణ అధికారుతెలిపారు.దానా తుపాను ప్రభావంతో ఒడిశాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ డైరెక్టర్ మనోరమా మొహంతి తెలిపారు. ఈ రాత్రి (గురువారం) అత్యధిక వేగంతో గాలి వీస్తుందని చెప్పారు.‘‘ దానా తుపాను గత అర్ధరాత్రి తీవ్ర తుఫానుగా మారింది. ఇది గత 6 గంటల్లో 12 కి.మీ/గంట వేగంతో వాయువ్య దిశగా కదులుతోంది. బంగాళాఖాతం వాయువ్య దిశలో తీవ్ర తుపానుగా కదులుతోంది’’అని అన్నారు.#WATCH | Bhubaneswar, Odisha | On cyclone 'Dana', Director IMD, Manorama Mohanty says, "The cyclone Dana has intensified into a severe cyclonic storm in last midnight and it is moving north-westward with the speed 12km/hr during last 6 hours and now it is lying over central and… pic.twitter.com/Cff2mVTNgh— ANI (@ANI) October 24, 2024దానా తుపాను భయపెడుతున్న నేపథ్యంలో తీరం దాటకముందే ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది. సుమారు 10 లక్షల మందిని తరలించాలని ప్రభుత్వం అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ దానా తుపాను.. గురువారం లేదా శుక్రవారం భిటార్కనికా , ధమ్రా మధ్య తీరం దాటనుందని వాతావరణ శాఖ అధికారలు తెలిపారు. మరోవైపు.. దానా తుపాను నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కూడా అప్రమత్తమై.. కోల్కతా, భువనేశ్వర్ విమానాశ్రయాల్లో నేటి నుంచి రేపు(శుక్రవారం) ఉదయం వరకు కార్యకలాపాలు నిలిపివేసింది.#CycloneDanaLies around 200kms off #Odisha coast at 5.30 am IST on 24th Oct. It is likely to landfall today evening/night (a tough time for relief personnel due to darkness) as a very severe cyclonic storm with expected windspeed of 120 kmph.Take care.@Windycom @zoom_earth pic.twitter.com/6PxsR7MGnS— Prof RV (@TheTechocrat) October 24, 2024 ఒడిశాలోని అనేక తీర జిల్లాల నుంచి దాదాపు 10 లక్షల మంది ప్రజలను తరలించడానికి ఒడిశాలోని అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం.. 120 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న ఈ దానా తుపాను ఒడిశాలోని సగం జనాభా ప్రభావం చూపే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.It appears that #Dana is approaching #Cyclone strength and Category 2+ is on the cards as it approaches #India. Hopefully dry air will weaken it before landfall#wx #wxtwitter #tropicswx #CycloneDana #CycloneAlert pic.twitter.com/R8McN71Fnv— Hurricane Chaser Chase (@hurricane_chase) October 24, 2024 ఈ తుపాను బుధవారం రాత్రి 11.30 గంటల సమయానికి పారాదీప్ (ఒడిశా)కి ఆగ్నేయంగా 330 కి.మీల దూరంలో, ధమర (ఒడిశా)కి 360 కి.మీ దక్షిణ-ఆగ్నేయంగా, సాగర్ ద్వీపానికి (పశ్చిమ బెంగాల్) దక్షిణ-ఆగ్నేయంగా 420 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే.. ఈ తుపాను ఒడిశాలోని భిటార్కనికా నేషనల్ పార్క్ , ధామ్రా ఓడరేవుల మధ్య తీరం దాట వచ్చని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు.In view of Cyclone DANA's impact on the coastal region of West Bengal, including Kolkata, it has been decided to suspend the flight operations from 1800 IST on 24.10.2024 to 0900 IST on 25.10.2024 due to predicted heavy winds and heavy to very heavy rainfall at Kolkata. pic.twitter.com/jhd4E7S3NS— Kolkata Airport (@aaikolairport) October 23, 2024 మరోవైపు.. దానా తుపాను ప్రభావంతో పశ్చిమ బెంగాల్లోని ఉత్తర, దక్షిణ 24 పరగణాలు, పుర్బా , పశ్చిమ మెదినీపూర్, ఝర్గ్రామ్, కోల్కతా, హౌరా , హుగ్లీ జిల్లాల్లో గురువారం, శుక్రవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే కోల్కతా విమానాశ్రయం గురువారం సాయంత్రం 6 గంటల నుండి రేపు(శుక్రవారం) ఉదయం 9 గంటల వరకు విమాన కార్యకలాపాలను నిలిపివేసింది.🚨 Breaking NewsDon't be alarmed by potential storm 'seeds'.Be careful,be safe. Life is precious.I strongly believe that we all can successfully face the storm this time together as before. #EveryLifeIsPrecious #CycloneDana #Odisha#CycloneDana#BRICS2024 pic.twitter.com/a4bGjDLG3L— Akhilesh Yadav (@Akhiles61939129) October 24, 2024 అదేవిధంగా భువనేశ్వర్ విమానాశ్రయం ఈరోజు సాయంత్రం 5 నుండి శుక్రవారం ఉదయం 9 గంటల వరకు విమాన కార్యకలాపాలను నిలిపివేయనున్నట్టు తెలుస్తోంది. ఇక.. దానా తుపాను నేపథ్యంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల మీదుగా నడిచే దాదాపు 200 రైళ్లను రద్దు చేశారు. ఒడిశాలో, బుధవారం సాయంత్రం నాటికి సుమారు 3 లక్షల మందిని, పశ్చిమ బెంగాల్ 1.14 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. -
ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో స్పష్టతకు రాని మృతుల సంఖ్య
నారాయణ్పుర్ - దంతెవాడ సరిహద్దులో శుక్రవారం పోలీసుల జరిపిన భారీ ఎన్కౌంటర్లో పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో మొత్తం 40 మంది మరణించగా.. పోలీసులు మాత్రం 31మంది మావోయిస్టులు మృతి చెందినట్లు వెల్లడించారు.అయితే, మిగిలిన తొమ్మిది మంది ఎవరనేది చెప్పే ప్రయత్నం చేయలేదు పోలీసులు. పైగా ఆ తొమ్మది మంది మృతదేహాల్ని ఎవరివి అనేది దృవీకరించలేదు.ఇక ఎన్కౌంటర్లో మృతి చెందిన మహిళ మావోయిస్టులలో దళ కమాండర్ ఒకరు మరణించినట్లు ధ్రువీకరించారు. మహారాష్ట్ర నుండి 150 మంది మహిళ పోలీస్ కమాండోలు ఈ ఎన్కౌంటర్లో పాల్గొన్నారు. మృతి చెందిన 31 మంది మావోయిస్టులపై సుమారు కోటి రూపాయల రివార్డు ఉన్నట్లు తెలుస్తోంది. -
Covert Creatures: పావురాల నుంచి డాల్ఫిన్ల దాకా..
బెలుగా జాతికి చెందిన అరుదైన పెద్ద గూఢచారి తిమింగలం ‘హవాల్దిమీర్’దక్షిణ నార్వే తీరంలో బుల్లెట్ గాయాలతో విగతజీవిగా కనిపించడం ఇటీవల అంతర్జాతీయ వార్తాంశంగా నిలిచింది. దీంతో అసలు మనిషి ఇంతవరకు ఏ జాతుల జీవులను నిఘా కోసం గూఢచారులుగా వినియోగించుకున్నాడన్న చర్చ మొదలైంది. గూఢచారులుగా ఈ జంతువులు నిర్వర్తించిన విధుల్లేంటి. వాటిల్లో అత్యుత్తమ గూఢచారి ఏది? వంటి ఆసక్తికర అంశాలపై ఇప్పుడు ఓ లుక్కేద్దాం.. గూఢచార జీవులు... అత్యాధునిక పరికరాలు, చిన్న నిఘా కెమెరాలు రాకముందు సుదూర ప్రాంతాలకు రహస్య సమాచారాన్ని సురక్షితంగా చేరవేయడం ఓ సవాలుగా ఉండేది. దీంతో సందేశాలు పంపడానికి పావురాలను ఉపయోగించేవారు. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో నిఘా కోసం జర్మన్ సైన్యం ప్రత్యేకంగా బుల్లి కెమెరాలు రూపొందించి వాటిని పావురాలకు కట్టింది. వాటిల్లో రికార్డయ్యే సమాచారంతో శత్రు జాడ తెల్సుకునేది. రెండో ప్రపంచ యుద్ధంలో మిత్రరాజ్యాలూ గూఢచర్యానికి పావురాలనే నమ్ముకున్నాయి. 1970లలో అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(సీఐఏ) తన ప్రత్యేక నిగా ఆపరేషన్ ‘టకానా’లో భాగంగా బుల్లి కెమెరాలు అమర్చిన పావురాలను సోవియట్ రష్యాలోకి పంపింది. ఇలా పావురాలు మాత్రమే కాదు.. పిల్లులు, తిమింగలాలు, డాల్ఫిన్లు, ఇంకొన్ని రకాల పక్షులు, చనిపోయిన జంతువులు కూడా కోవర్ట్ ఆపరేటర్లుగా సమర్థవంతంగా విధులు నిర్వర్తించాయి. డాల్ఫిన్లతో ప్రత్యేకంగా.. ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో సోవియట్ నావికాదళం సముద్ర క్షీరదాలతో వివిధ కార్యక్రమాలను చేపట్టింది. వీటిలో ఒకటి డాల్ఫిన్లకు శిక్షణ ఇవ్వడం. అమెరికా నావికాదళం సముద్ర క్షీరదాల కార్యక్రమం(ఎంఎంపీ) కింద సముద్రజలాల్లో నిఘా కోసం డాల్ఫిన్లను ఉపయోగించింది. 1960లలో ప్రాజెక్ట్ ఆక్సిగాస్లో భాగంగా శత్రు నౌకలకు పేలుడు పరికరాలను అమర్చేందుకు సీఐఏ డాల్ఫిన్లకు శిక్షణ ఇచి్చంది. ఈ కార్యక్రమానికి సముద్రాల్లో స్వేచ్ఛగా తిరిగే రెండు ‘బాటిల్నోస్’డాల్ఫిన్లను ఉపయోగించారు. ప్రపంచంలోని అత్యంత తెలివైన జంతువులుగా డాల్ఫిన్లు ప్రసిద్ధి చెందాయి. క్రిమియాలోని సెవాస్టోపోల్ నల్లసముద్రంలోని నౌకాదళ స్థావరంలో శత్రు డైవర్లను గుర్తించడానికి, ఎదుర్కోవడానికి డాల్ఫిన్లకు శిక్షణ ఇచ్చేందుకు రష్యా గత సంవత్సరం ఒక క్షీరద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందని బ్రిటిష్ ఇంటెలిజెన్స్ నివేదిక బహిర్గతంచేసింది. 2023 ఏప్రిల్ నుంచి జూన్ వరకు సెవాస్టోపోల్ నౌకాశ్రయంలో తేలియాడే క్షీరదాల బోనుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు బ్రిటిష్ సైనిక నిఘా ఉపగ్రహ చిత్రాల్లో వెల్లడైంది. పిల్లుల చెవులకు మైక్రో ఫోన్లు పిల్లులను తెలివైన జంతువులుగా భావిస్తారు. సీఐఏ 1960వ దశకంలో పిల్లులను ఉపయోగించి ‘ఆపరేషన్ అకౌస్టిక్ కిట్టీ’అనే ప్రాజెక్టును అభివృద్ధి చేసింది. దీని కోసం 2 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. ప్రాజెక్టులో భాగంగా పిల్లుల చెవుల్లో మైక్రోఫోన్లను ఏర్పాటు చేసింది. ఇవి సోవియట్ దౌత్యవేత్తలు, ఏజెంట్ల సంభాషణలను రహస్యంగా రికార్డ్ చేస్తాయి. పిల్లి పెంపుడు జంతువు. అది బహిరంగ ప్రదేశాలు, కొన్ని రహస్య ప్రదేశాల్లో అవి ప్రత్యక్షమవడం శత్రు దేశాలకు అనుమానాలు పెంచే అవకాశం ఉంటుంది. అదీగాక పిల్లులను నియంత్రించడం అంత సులభం కాదు. శిక్షణాసమయంలో వాటిని శిక్షకులు నియంత్రించలేక చేతులెత్తేశారు. పిల్లులు వాటికి సూచించిన ప్రాంతాలకు కాకుండా తమకిష్టమైన ప్రదేశాల్లో చక్కర్లు కొట్టాయి. దీంతో చేసేదిలేక చివరికి 1967లో ఈ కార్యక్రమానికి ఫుల్స్టాప్ పెట్టేశారు. టాప్ ఏజెంట్.. పావురం పిల్లులు, చనిపోయిన ఎలుకల వంటివాటిని రంగంలోకి దింపి పని కానిచి్చనప్పటికీ వివిధ దేశాల నిఘా సంస్థలు శతాబ్దాలుగా ఎక్కువ నమ్మకం పెట్టుకున్నది పావురం మీదనే. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటిష్ ఇంటెలిజెన్స్ నిర్వహించిన అత్యంత విజయవంతమైన గూఢచారి కార్యక్రమం ‘ఆపరేషన్ కొలంబా’పావురాలతోనే విజయంవంతమైంది. జర్మన్ సైనిక కార్యకలాపాలను, సున్నితమైన సైనిక స్థానాలపై నిఘాను హోమింగ్ జాతి పావురాలు సేకరించాయి. పేపర్పై రాసిన సందేశాలను సూక్ష్మ డబ్బాల్లో పెట్టి పక్షి కాలికి కట్టేశారు. ఈ రహస్య సందేశాలలో నాజీ దళాల కదలికలు, నాజీల కొత్త ఆయుధాలపై నివేదికలు, ప్రణాళికాబద్ధమైన రాకెట్ దాడుల వివరాలను వేగులు సేకరించి పావురాల ద్వారా ప్రధాన కేంద్రానికి రహస్యాన్ని పంపేవారు. రచయిత గోర్డాన్ కోరేరా ‘ఆపరేషన్ కొలంబా: ది సీక్రెట్ పీజియన్ సరీ్వస్’పుస్తకంలో ఇలాంటి ఎన్నో వివరాలు ఉన్నాయి. బ్రిటిష్ ఇంటెలిజెన్స్ 1941 నుంచి 1944 మధ్య నాజీ ఆక్రమిత ఐరోపాపై 16,000 హోమింగ్ జాతి పావురాలను వాడారు. అన్నింటికన్నా ముఖ్యంగా పక్షుల ద్వారా గూఢచర్యం విజయవంతంకావడంతో నూతన టెక్నాలజీలకూ కపోతమే స్ఫూర్తిగా నిలిచింది. గత నెలలో చైనా అచ్చం పావురంలాగా ఉండే చిన్నపాటి నిఘా డ్రోన్ను ఆవిష్కరించడం తెల్సిందే. గూఢచార పావురాలని... భారత ఉపఖండంలో సందేశాలను పంపించడానికి పావురాలను ఉపయోగించినట్టుగా చరిత్ర చెబుతోంది. 2020 మేలో కశ్మీర్లోని ఓ గ్రామంలో నంబర్ల సెట్ ఉంగరం కలిగిన పావురం కనిపించింది. దానిని పట్టుకున్న గ్రామస్తులు పోలీసులకు అప్పగించారు. పాకిస్తాన్కు చెందిన గూఢచారి పావురమై ఉంటుందని, దానిపై ఉన్నది కోడ్ అని అనుమానించిన పోలీసులు.. డీ క్రిప్ట్ చేయడానికి ప్రయట్నించారు. చివరికది గూఢచారి పావురం కాదని తేలడంతో విడిచిపెట్టారు. 2016 అక్టోబర్లో భారత ప్రధానిని బెదిరిస్తూ మరో పావురం కనిపించింది. పంజాబ్లోని పఠాన్ కోట్లో ఈ పావురాన్ని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. 2023 మేలో ముంబైలో దొరికిన పావురాన్ని చైనా గూఢచారిగా అనుమానిస్తూ ఎనిమిది నెలల పాటు బోనులో ఉంచి దాని ఆనుపానాలు సేకరించారు. ఆ పావురం కాలుకు ఉంగరాలు కట్టి, దాని రెక్కల కింది భాగంలో చైనీస్ భాషలో ఏదో రాశారు. అయితే అది తైవాన్లో రేసింగ్ పోటీలో పాల్గొన్న పక్షి అని ఫిబ్రవరిలో తేలడంతో ఎట్టకేలకు దానిని అధికారులు వదిలేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
హైరింగ్ ప్రణాళికల్లో స్టోరబుల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సెల్ఫ్–స్టోరేజ్ టెక్నాలజీ సొల్యూషన్స్ అందించే అమెరికన్ సంస్థ స్టోరబుల్ భారత్లో తమ కార్యకలాపాలు విస్తరిస్తోంది. హైదరాబాద్లో 15వేల చ.అ. విస్తీర్ణంలో కొత్త కార్యాలయాన్ని ప్రారంభించింది. గతేడాదే హైదరాబాద్లో తమ ఏషియా జీసీసీని స్టోరబుల్ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఇక్కడ 60 మంది ఉద్యోగులు ఉండగా, ఈ ఏడాది ఆఖరు నాటికి ఈ సంఖ్యను 120కి పెంచుకోనున్నట్లు సంస్థ ప్రెసిడెంట్ చార్లీ మారియట్ తెలిపారు. ఇంజనీరింగ్, ప్రోడక్ట్ డెవలప్మెంట్ విభాగాల్లో నియామకాలు చేపట్టనున్నట్లు వివరించారు. -
చంద్రుడి ఒడిలో ‘ఒడిస్సియస్’!
జాబిలిపైకి ల్యాండర్ల పరంపర కొనసాగుతోంది. జపాన్ ‘మూన్ స్నైపర్’ ల్యాండర్ తర్వాత తాజాగా అమెరికా వంతు వచ్చింది. అర్ధ శతాబ్దం తర్వాత చంద్రుడిపై మరోమారు అగ్రరాజ్యం జెండా రెపరెపలాడింది. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో హూస్టన్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రైవేటు సంస్థ ‘ఇంట్యూటివ్ మెషీన్స్’ రూపొందించిన ‘ఒడిస్సియస్’ (నోవా-సీ శ్రేణి) ల్యాండర్ జాబిలి ఉపరితలంపై దక్షిణ ధ్రువం చేరువలోని ‘మాలాపెర్ట్ ఎ’ బిలంలో దిగ్విజయంగా దిగింది. తొలుత ల్యాండర్ నేవిగేషన్ వ్యవస్థలోని లేజర్ రేంజిఫైండర్లలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో మిషన్ కంట్రోల్ కేంద్రంలోని శాస్త్రవేత్తలు ఆందోళన చెందారు. దీంతో ల్యాండర్ దిగాల్సిన నిర్దేశిత సమయంలో కొంత జాప్యం సంభవించినప్పటికీ భారత కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 4:53 గంటలకు అది క్షేమంగా చంద్రుడిపై దిగి భూమికి సంకేతం పంపింది. ‘మాలాపెర్ట్ ఎ’ అనేది చంద్రుడి దక్షిణ ధృవానికి 300 కిలోమీటర్ల దూరంలో 85 డిగ్రీల దక్షిణ అక్షాంశ ప్రాంతంలో నెలకొన్న ఓ చిన్న బిలం. బెల్జియంకు చెందిన 17వ శతాబ్దపు ఖగోళ శాస్త్రవేత్త చార్లెస్ మాలాపెర్ట్ పేరును దానికి పెట్టారు. చంద్రుడి దక్షిణ ధ్రువానికి అతి సమీపంలో దిగిన వ్యోమనౌకగా చరిత్ర సృష్టించిన ‘ఒడిస్సియస్’… ఆ విషయంలో గత ఏడాది మన చంద్రయాన్-3 ‘విక్రమ్’ ల్యాండర్ పేరిట ఉన్న రికార్డును బద్దలుకొట్టడం విశేషం. ‘ఒడిస్సియస్’ ల్యాండరుకు ‘ఇంట్యూటివ్ మెషీన్స్’ సంస్థ ఉద్యోగులు పెట్టుకున్న ముద్దు పేరు ‘ఒడీ’. ఈ మానవరహిత చంద్రయాత్రకు మిషన్ ‘ఐఎం-1’గా నామకరణం చేశారు. జీవితకాలం ఏడు రోజులే! పూర్తిగా ఓ ప్రైవేటు కంపెనీ తయారీ-నిర్వహణలో ల్యాండర్ ఒకటి చంద్రుడి ఉపరితలంపై సజావుగా దిగడం ఇదే తొలిసారి. సాంకేతిక అవాంతరాలు ఎదుర్కొన్నప్పటికీ జపాన్ ‘స్లిమ్’ ల్యాండర్ మాదిరిగా తలకిందులుగా కాకుండా ‘ఒడిస్సియస్’ నిటారుగానే దిగినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. షడ్భుజి ఆకృతితో, సిలిండర్ ఆకారంలో టెలిఫోన్ బూత్ కంటే కాస్త పెద్ద పరిమాణంలో ఉన్న ఈ ల్యాండరులో 100 కిలోల బరువైన ఐదు ‘నాసా’ పరికరాలు, ఇతర వాణిజ్య సంస్థలకు చెందిన ఆరు శాస్త్రీయ పరికరాలు (పేలోడ్స్) ఉన్నాయి. అవి చంద్రుడిపై పరిశోధనలు నిర్వహిస్తాయి. వీటిలో లేజర్ రెట్రో రిఫ్లెక్టర్, ఐఎల్ఓ-ఎక్స్ అబ్జర్వేటరీ (టెలిస్కోప్) ఉన్నాయి. జాబిలిపై ‘ఒడిస్సియస్’ జీవితకాలం కేవలం ఏడు రోజులు. మరో వారం రోజుల్లో అది దిగిన ప్రదేశంలో సూర్యాస్తమయం అవుతుంది. కనుక ల్యాండర్ పనిచేయడానికి సౌరశక్తి లభించదు. చంద్రుడి ఉపరితలంతో అంతరిక్ష వాతావరణం చర్యనొందే విధానం, రేడియో ఆస్ట్రానమీ, చంద్రావరణానికి సంబంధించిన డేటాను ‘నాసా’ పేలోడ్స్ సేకరించనున్నాయి. అమెరికా చివరిసారిగా 1972లో చేపట్టిన ‘అపోలో-17’ మానవసహిత యాత్రలో వ్యోమగాములు జీన్ సెర్నాన్, హారిసన్ ష్మిట్ చంద్రుడి నేలపై నడయాడారు. ఆ తర్వాత అమెరికా వ్యోమనౌక ఒకటి నియంత్రిత విధానంలో చంద్రుడిపై దిగడం ఇదే మొదటిసారి. చైనా కంటే ముందుగా తమ ‘ఆర్టెమిస్’ యాత్రతో త్వరలో జాబిలిపైకి తమ వ్యోమగాములను పంపాలని అమెరికా భావిస్తోంది. ఈ నేపథ్యంలో ‘ఒడిస్సియస్’ సేకరించే సమాచారం కీలకం కానుంది. చంద్రుడిపైకి ప్రైవేటు ల్యాండర్లను ప్రయోగించడానికి ఉద్దేశించిన తన కమర్షియల్ లూనార్ పేలోడ్ సర్వీసెస్ ప్రాజెక్టులో భాగంగా ‘నాసా’ వెయ్యి కోట్ల రూపాయల విలువైన ఈ మిషన్ కాంట్రాక్టును ‘ఇంట్యూటివ్ మెషీన్స్’కు కట్టబెట్టింది. చంద్రుడి సూక్ష్మ శిల్పానికి గాంధీ పేరు! ఆరు కాళ్లపై నిలబడే ‘ఒడిస్సియస్’ ల్యాండర్ ఎత్తు 4 మీటర్లు కాగా, వెడల్పు సుమారు 2 మీటర్లు. ప్రయోగ సమయంలో ల్యాండర్ బరువు 1,908 కిలోలు. ఈ నెల 15న ఫ్లోరిడాలోని కేప్ కెనెవరాల్ నుంచి కెన్నెడీ అంతరిక్ష కేంద్రం వేదికగా ఇలాన్ మస్క్ సంస్థ ‘స్పేస్-ఎక్స్’కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ సాయంతో దాన్ని ప్రయోగించారు. భూమి నుంచి చూస్తే చంద్రుడిలో కనిపించే 62 దశలు, అంతరిక్షంలోని ఇతర ప్రాంతాల నుంచి చూస్తే చంద్రుడిలో అగుపించే మరో 62 దశలు, ఒక చంద్రగ్రహణం... మొత్తం కలిపి చంద్రుడి 125 దశలను ప్రతిబింబించే సూక్ష్మ శిల్పాలను ఓ పెట్టెలో పెట్టి ల్యాండరులో అమర్చడం విశేషం. వీటిని అమెరికన్ కళాకారుడు జెఫ్ కూన్స్ రూపొందించారు. ఒక్కో బుల్లి శిల్పం వ్యాసం అంగుళం. ఈ శిల్పాలకు మానవ చరిత్రలో అత్యంత ప్రాముఖ్యమున్న అరిస్టాటిల్, లియోనార్డో డా విన్సీ, గాంధీ, డేవిడ్ బౌయీ, బిల్లీ హాలిడే తదితరుల పేర్లు పెట్టారు. భూమికి ‘ఒడిస్సియస్’ ల్యాండర్ పంపిన సంకేతం బలహీనంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఫలితంగా ల్యాండర్ భవితపై అనిశ్చితి నెలకొంది. దీంతో మిషన్ కంట్రోల్ కేంద్రంలో హర్షధ్వానాలు, విజయోత్సవాలను రద్దు చేశారు. ల్యాండర్ సంకేతాలను మెరుగుపరచేందుకు ‘ఇంట్యూటివ్ మెషీన్స్’ శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. ::: జమ్ముల శ్రీకాంత్ -
బతికించిన సూరీడు.. ‘మూన్ స్నైపర్’ ఈజ్ బ్యాక్!
నిద్ర లేస్తూనే చకచకా పని ఆరంభించిన జపాన్ ల్యాండర్. చంద్రుడిపై దిగిన తమ ‘స్లిమ్’ ల్యాండరుతో ఆదివారం సాయంత్రం సమాచార సంబంధాలను పునరుద్ధరించినట్టు సోమవారం ‘ఎక్స్’ (పాత పేరు ట్విట్టర్) వేదికగా ప్రకటించిన జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ ‘జాక్సా’. ల్యాండరులోని మల్టీబ్యాండ్ స్పెక్ట్రోస్కోపిక్ కెమెరా (ఎంబీసీ)తో వెంటనే శాస్త్రీయ పరిశోధనలు ప్రారంభించినట్టు ఆ సంస్థ తెలిపింది. ల్యాండర్ దిగిన ప్రదేశంలో కుక్క బొమ్మ (టాయ్ పూడిల్)ను పోలివున్న ఓ చంద్రశిల ఛాయాచిత్రాన్ని రోవర్-2 (లూనార్ ఎక్స్కర్షన్ వెహికల్-2) ఫొటో తీసింది. ల్యాండర్, దాని సమీపంలోని ఆ శిల ఛాయాచిత్రాన్ని ఎక్స్ వేదికగా ‘జాక్సా’ పోస్ట్ చేసింది. ‘మూన్ స్నైపర్’ ఈ నెల 19న చంద్రుడిపై షియోలి బిలంలోని వాలులో తలకిందులుగా దిగిన సంగతి తెలిసిందే. ఫలితంగా ‘మూన్ స్నైపర్’ సౌరఫలకాలు సూర్యుడికి వ్యతిరేక దిశలో ఉండిపోవటంతో ల్యాండరులోని ఆన్బోర్డ్ బ్యాటరీని రెండున్నర గంటలు మాత్రమే వినియోగించి, 12% పవర్ ను ముందుజాగ్రత్తగా నిల్వ ఉంచి దాన్ని ‘జాక్సా’ స్విచ్ ఆఫ్ చేసింది. ల్యాండరులోని సాంకేతిక సమస్యను అధిగమించామని, సూర్యుడి కోణం మారి ప్రస్తుతం ఎండ అందుబాటులోకి రావడంతో ల్యాండర్ సౌరఘటాలు పనిచేస్తున్నాయని ‘జాక్సా’ వివరించింది. చంద్రుడి బిలంలో ల్యాండర్ డొల్లిపోయి తలకిందులుగా దిగినా, దాని సోలార్ ప్యానెళ్లు పై భాగంలో కాకుండా కిందివైపు... అదీ వెనుకవైపున సూర్యుడికి వ్యతిరేక దిశలో ఉన్నా... తాజాగా సూర్యరశ్మిని గ్రహించి అవి పనిచేయడం మొదలుపెట్టడం నిజంగా ఓ అద్భుతమనే చెప్పాలి. ల్యాండర్ తలకిందులైనా దాని జాతకం తిరగబడి అది తుది ఘట్టంలో కుదురుకోవడం ఆశ్చర్యకర పరిణామం. ఈ విషయంలో జపాన్ అంతరిక్ష శాస్త్రవేత్తలు చాలా అదృష్టవంతులు. చంద్రశిలల నిర్మాణ కూర్పును ల్యాండర్ అధ్యయనం చేయనుంది. చంద్రుడిపై ల్యాండర్ ఎప్పటివరకు పనిచేస్తుందో ‘జాక్సా’ వెల్లడించలేదు. అయితే... జాబిలిపై రాత్రివేళల్లో నమోదయ్యే మైనస్ డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలను తట్టుకునే విధంగా దాన్ని డిజైన్ చేయలేదు. చంద్రుడిపై 15 రోజులపాటు పగలు, 15 రోజులపాటు రాత్రి ఉంటాయి. అలా చూస్తే... గరిష్ఠంగా మరో 3-4 రోజులు మాత్రమే బహుశా ల్యాండర్ పనిచేయవచ్చు. :::: జమ్ముల శ్రీకాంత్ -
నిమ్స్లో చిన్నారులకు ఉచిత గుండె ఆపరేషన్లు
లక్డీకాపూల్: గుండె సమస్యలతో బాధపడే చిన్నారులకు నిమ్స్లో ఈ నెల 24 నుంచి 30వ తేదీ వరకు ఉచితంగా గుండె ఆపరేషన్లు నిర్వహించనున్నట్లు ఆస్పత్రి డైరెక్టర్ ప్రొఫెసర్ నగరి బీరప్ప తెలిపారు. నవజాత శిశువులు మొదలు ఐదేళ్లలోపు చిన్నారుల గుండె వ్యాధులకు చికిత్స అందిస్తామని ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. బ్రిటన్లోని ఆల్డర్ హే చిల్డ్రన్స్ హాస్పిటల్ కార్డియాక్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ రమణ దన్నపునేని ఆధ్వర్యంలోని 10 మంది సర్జన్ల బృందం నిలోఫర్ సర్జన్లు, నిమ్స్ కార్డియోథొరాసిక్ విభాగాధిపతి డాక్టర్ అమరేశ్వరరావు, ఇతర వైద్య బృందంతో కలసి నిమ్స్లో ఈ శస్త్రచికిత్సలు చేపట్టనున్నట్లు వివరించారు. ‘హీలింగ్ లిటిల్ హార్ట్స్ చార్లీస్ హార్ట్ హీరోస్ క్యాంప్’లో భాగంగా ఉచిత శస్త్రచికిత్సలు జరగనున్నాయని బీరప్ప పేర్కొన్నారు. తమ చిన్నారులకు ఆపరేషన్లు అవసరమైన తల్లిదండ్రులు మరిన్ని వివరాలకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య 040–23489025 నంబర్లో సంప్రదించాలని సూచించారు. -
ఇసుకపై పదేపదే వక్రీకరణలు
సాక్షి, అమరావతి : ఒక అబద్ధాన్ని పదే పదే చెబితే దాన్నే నిజమని ప్రజలు నమ్ముతారనే భ్రమలో ఈనాడు రామోజీరావు ప్రతిరోజూ పని గట్టుకుని రాష్ట్రంలో ఇసుక ఆపరేషన్స్పై బురద జల్లుతున్నారు. ఇసుక కొరత లేకపోయినా ఉన్నట్లు.., స్టాక్ యార్డుల్లో నిల్వ చేసిన ఇసుకను అక్రమ నిల్వలుగా పేర్కొంటూ ఇష్టానుసారం అవాస్తవాలు ప్రచురిస్తున్నారు. రాజధాని లావాదేవీల్లో చంద్రబాబుకు ఐటీ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో దాని గురించి ఒక్క ముక్క రాయని ఈనాడు.. దాన్ని కప్పిపుచ్చేందుకు ఇసుక, ఇతర వ్యవహారాలపై కట్టు కథలు రాస్తూ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. చంద్రబాబును రక్షించేందుకు, ఆయన అవినీతిని కప్పిపుచ్చేలా ఈనాడు ఇలా ప్రతిసారీ ప్రభుత్వంపై బురదజల్లడమే పనిగా పెట్టుకొంది. ఇదే విధంగా ఇసుక పైనా ఓ అసత్య కథనాన్ని ప్రచురించింది. ‘ఇది ఇసుక దోపిడీ కాదా‘ అనే శీర్షికతో శనివారం ప్రచురించిన కథనం పూర్తి అవాస్తవమని రాష్ట్ర గనుల శాఖ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి తెలిపారు. డ్రెడ్జింగ్ రీచ్లు, స్టాక్ యార్డుల్లోనే ఇసుక విక్రయాలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. దాన్ని వక్రీకరిస్తూ అక్రమ మైనింగ్గా చిత్రీకరించడం హాస్యాస్పదంగా ఉందని చెప్పారు. దీనిపై వివరంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినా పనిగట్టుకుని మళ్లీ అవాస్తవాలు రాయడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో నిర్మాణ రంగానికి వర్షాకాలంలో ఇసుక కొరత లేకుండా ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలు తీసుకుందని తెలిపారు. దీనివల్లే వర్షాలు ప్రారంభం కాకుండానే పలు చోట్ల స్టాక్ యార్డుల్లో ఇసుక నిల్వలు ఉంచామన్నారు. వర్షాలు పడుతున్నా ఇసుక లభించేలా ఏర్పాట్లు చేశామని, ఇసుక కొరత అనేది రాష్ట్రంలో లేదన్నారు. రాష్ట్రంలో ఇసుక పరిస్థితిపై ఆయన చెప్పిన వివరాలు.. అక్రమ మైనింగ్ చేయాల్సిన అవసరం ఏంటి? రాష్ట్రవ్యాప్తంగా 136 ఇసుక స్టాక్ పాయింట్లు ఉన్నాయి. వాటిలో 64 లక్షల టన్నుల నిల్వలు ఉన్నాయి. వినియోగదారులు స్టాక్ పాయింట్లలోని ఇసుక కొని, తీసుకెళ్ళేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. ఇసుక స్టాక్ యార్డ్ ఫోటోలు తీసి అక్రమ ఇసుక తవ్వకాలు అంటూ ఈనాడు పత్రిక వక్రీకరణలతో తప్పుడు కథనాలు రాయడం దారుణం. రాష్ట్రంలో పర్యావరణ అనుమతులు ఉన్న 110 రీచ్లలో 77 లక్షల టన్నుల ఇసుక తవ్వకాలకు అనుమతి ఉంది.అలాగే 42 డీసిల్టింగ్ పాయింట్ల ద్వారా 90 లక్షల ఇసుక తవ్వకాలకు అనుమతులు ఉన్నాయి. ఇసుక కొరత లేకుండా డీసిల్టింగ్ పాయింట్ల నుంచి కూడా తవ్వుతున్నాం. అన్ని చోట్లా ప్రభుత్వం నిర్ణయించిన ధరకే ఇసుక లభిస్తోంది. అటువంటప్పుడు అక్రమ మైనింగ్ ఎవరు చేస్తారు? ఎక్కువ రేటుకు ఎవరైనా ఎందుకు కొంటారు? రాష్ట్రంలో జేపీ సంస్థ ద్వారానే ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. కొన్ని రీచ్లలో సమీపంలోనే స్టాక్ యార్డులు ఉన్నాయి. నదీ తీరంలో ఏర్పాటు చేసిన యార్డ్లో నిల్వ చేసిన ఇసుకను కూడా రీచ్ అని చిత్రీకరిస్తారా? పారదర్శక ఇసుక విధానంపై చాలా స్పష్టంగా వివరించినప్పటికీ ఇటువంటి వార్తలు రాయడం తగదు. గతంలో ఉచిత ఇసుక ఎవరికి ఇచ్చారు! గత ప్రభుత్వ హయాంలో ఏ నియోజకవర్గంలో ఇసుక ఉచితంగా ప్రజలకు అందింది? ఉచిత ఇసుక పేరుతో ప్రజలు ఎక్కువ రేటుకు కొనుక్కోవాల్సిన దుస్థితి తెచ్చారు. ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియని అయోమయ స్థితి ప్రజలకు కల్పించారు. తప్పులు చేసిన వారిని దండించలేదు. జరిమానాలు విధించలేదు. మెరుగైన ఇసుక విధానంతో మా ప్రభుత్వం ఇసుక అక్రమాలపై ఉక్కుపాదం మోసింది. ప్రజలకు నియోజకవర్గాల్లో డిపోల వద్ద ఎంత ధరకు ఇసుక విక్రయిస్తున్నారో అత్యంత పారదర్శకంగా పత్రికల్లో ప్రకటనల ద్వారా తెలియచేస్తోంది. అంతకంటే ఎక్కవ రేటుకు ఎవరైనా ఆమ్మితే తక్షణం ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నంబర్ను తెచ్చింది.ఎవరైనా అక్రమాలకు పాల్పడితే రెండు లక్షల రూపాయల జరిమానా, రెండేళ్ళ వరకు జైలు శిక్ష విధించేలా చట్టాల్లో మార్పులు తెచ్చింది. స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరోను ఏర్పాటు చేసింది. దాదాపు 18 వేల కేసులు ఈ బ్యూరో నమోదు చేసింది. 6.36 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను సీజ్ చేసింది. ఈ కేసుల్లో చాలా మందికి శిక్షలు కూడా పడ్డాయి. కట్టుదిట్టంగా నిబంధనలను అమలు చేస్తున్నాం. పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలను నిలిపివేశాం. ఓపెన్ రీచ్ల ద్వారా నాణ్యమైన ఇసుకను అందిస్తున్నాం. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమ ఇసుక తవ్వకాలపై ఎన్జీటి తీవ్రంగా స్పందించింది. ఏకంగా రూ.100 కోట్లు జరిమానా విధించింది. ఇది కూడా సీఎంగా చంద్రబాబు నివాసం ఉంటున్న కరకట్ట ప్రాంతంలో జరిగిన అక్రమ ఇసుక తవ్వకాలపైనే. ప్రస్తుత వైఎస్ జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను పరిశీలించి సంతృప్తి చెందిన ఎన్జీటీ ఆ జరిమానాను రద్దు చేసింది. రీచ్లకు ఎవరైనా వెళ్లవచ్చు ఓపెన్ రీచ్లు, ఇసుక శాండ్ డిపోలకు ఎవరైనా స్వేచ్ఛగా వెళ్ళవచ్చు. అవసరమైనంత ఇసుక కొనుక్కోవచ్చు. ఇలాంటి చోట ఎవరైనా ఆంక్షలు పెడతారా? ఎవరూ రాకుండా కాపలా పెడతారా? ఈనాడు ప్రతినిధులను అడ్డుకున్నారని వార్తలు రాయడం కేవలం అభాండాలు వేయడం తప్ప మరొకటి కాదు. పారదర్శకంగా జరుగుతున్న చోట ఏదో జరిగిపోతోందనే భ్రమలు కల్పించడమే ఈనాడు లక్ష్యం. దీనిని మినీ కేజిఎఫ్ అంటూ చిత్రీకరించడం ఈనాడు పత్రిక దివాళాకోరుతనానికి నిదర్శనం. కాంట్రాక్ట్ వ్యాల్యూ పైన కాంట్రాక్టింగ్ ఏజెన్సీ జీఎస్టీ చెల్లిస్తోంది. ఏటా రెండు కోట్ల టన్నుల ఇసుక విక్రయాలకు నిబంధనల ప్రకారం ఎంత జీఎస్టీ చెల్లించాలో అంతా చెల్లిస్తోంది. దీనిపైనా అసత్య ప్రచారం చేస్తున్నారు. వర్షాకాలంలో ఓపెన్ రీచ్ల నుంచి తవ్వకాలు జరగడంలేదు. అయితే స్టాక్ చేసిన యార్డ్లోని ఇసుకను విక్రయిస్తున్నాం. చిత్తూరు జిల్లా నాగలాపురం మండలం అరణియార్లో ఇసుక తవ్వకాలు గతంలోనే నిలిపివేశారు. పాత ఫోటోలతో అక్కడ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయంటూ తప్పుడు కథనాలను ప్రచురించారు. ఇసుక మాఫియాకు చెక్ పెట్టాం ఈ ప్రభుత్వం గతంలో జరిగిన ఇసుక మాఫియా ఆగడాలకు చెక్ పెట్టింది. నూతన ఇసుక విధానాన్ని తీసుకువచ్చింది. ప్రజలకు అందుబాటు ధరలో ఇసుక లభించేలా చర్యలు తీసుకుంటోంది. పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తూ, నూతన ఇసుక పాలసీని ప్రకటించింది. దానిలో భాగంగా 2019 ఏప్రిల్ 9న రాష్ట్ర ప్రభుత్వం జీవో 70, 71 జారీ చేసింది. అనంతరం ఇసుక విధానంలోని లోటుపాట్లను సవరించేందుకు మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ప్రజల అభిప్రాయాలను సేకరించి ప్రభుత్వానికి నివేదించింది. దీనిపై 2020 నవంబరు 12న జీవో 78 జారీ చేసింది. అలాగే ఈ విధానంలోని కొన్ని నిబంధనల్లో మార్పు చేస్తూ 2021 ఏప్రల్ 16న జీవో 25ని జారీ చేసింది. ఆన్లైన్, ఆఫ్లైన్ విధానాల్లో ఇసుక విక్రయాలు జరుగుతున్నాయి. పారదర్శకంగా ఇసుక తవ్వకాలు జరగాలనే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎఎస్టీసీ ద్వారా, వారి పర్యవేక్షణలో టెండర్లు నిర్వహించాం. జేపీ పవర్ వెంచర్స్ ఈ టెండర్లు దక్కించుకుంది. వారి ద్వారానే ఇప్పటివరకు ఇసుక ఆపరేషన్స్ జరుగుతున్నాయి. ఇంత పారదర్శకంగా టెండర్లు నిర్వహిస్తే తప్పుడు ఆరోపణలా? టెండర్ దక్కించుకున్నది జేపీ పవర్ వెంచర్స్ కంపెనీ ఒక్కటే. అన్ని అనుమతులతోనే ఎక్కడైనా ఆ సంస్థే తవ్వకాలు చేస్తుంది. అలాంటప్పుడు ఆ సంస్థ అక్కడ తవ్వుతోంది, ఇక్కడ తవ్వుతోందంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. వారు టెండర్ నిబంధనల ప్రకారం వారికి అనుకూలమైన సంస్థను సబ్ కాంట్రాక్టర్ గా తీసుకోవచ్చు. ఇది పూర్తిగా ఆ సంస్థ సొంత వ్యవహారం. కాంట్రాక్టు సంస్థ టన్నుకు రూ.375 చొప్పున ప్రభుత్వానికి చెల్లిస్తోంది. దీనిపై మరో వంద రూపాయలు వేసుకుని టన్ను రూ.475 కు అమ్ముకుంటోంది. ఆ వంద రూపాయల్లోనే కంపెనీ కార్యకలాపాలు నిర్వహించుకోవాలి. ఇసుక టెండర్ల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా రూ.765 కోట్లు ఆదాయం లభిస్తోంది. అంటే అయిదేళ్ళలో రూ.3,825 కోట్ల ఆదాయం వస్తుంది. గత ప్రభుత్వ పాలనలో ఇన్ని వేల కోట్లు ఎక్కడికి వెళ్లాయి? ఎవరి జేబుల్లోకి వెళ్ళాయి? ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు ఎక్కడైనా ఇసుక కొనుక్కోవచ్చు. నాణ్యతను పరిశీలించుకోవచ్చు. అలాంటప్పుడు బ్లాక్ లో ఎక్కువ రేటుకు ఇసుకను కొనాల్సిన అవసరం ఎలా ఉంటుంది? -
మూడేళ్లలో రూ. 30 వేల కోట్లు...
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ గ్యాస్ దిగ్గజం గెయిల్ (ఇండియా) భారీ స్థాయిలో కార్యకలాపాలు విస్తరించనుంది. వచ్చే మూడేళ్లలో రూ. 30,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. గెయిల్ (ఇండియా) వార్షిక సర్వ సభ్య సమావేశంలో పాల్గొన్న సందర్భంగా చైర్మన్ సందీప్ కుమార్ గుప్తా ఈ విషయాలు వెల్లడించారు. 2022–23 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ. 10,000 కోట్ల మేర పెట్టుబడి వ్యయాలు చేసినట్లు వివరించారు. (ఉబెర్ 'గ్రూప్ రైడ్స్' ఫీచర్: ఎగిరి గంతేస్తున్న రైడర్లు) రాబోయే మూడేళ్లలో పైప్లైన్ల ఏర్పాటు, ప్రస్తుతం కొనసాగుతున్న పెట్రోకెమికల్ ప్రాజెక్టులు, నిర్వహణపరమైన పెట్టుబడులు, గ్రూప్ కంపెనీల్లో పెట్టుబడులు మొదలైన వాటి కోసం రూ. 30,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు గుప్తా చెప్పారు. ఇటీవలే కొనుగోలు చేసిన ప్రైవేట్ రంగ జేబీఎఫ్ పెట్రోకెమికల్స్తో తమ పోర్ట్ఫోలియోలో మరో కొత్త రసాయన ఉత్పత్తి (ప్యూరిఫైడ్ టెరిఫ్తాలిక్ యాసిడ్ – పీటీఏ) చేరినట్లు ఆయన తెలిపారు. మహారాష్ట్రలోని ఉసార్లో తాము తొలిసారిగా 50,000 టన్నుల ఐసోప్రొపైల్ ఆల్కహాల్ (ఐపీఏ) ఉత్పత్తి సామర్థ్యంతో స్పెషాలిటీ కెమికల్ ప్లాంటును ఏర్పాటు చేస్తున్నట్లు గుప్తా చెప్పారు. ఇలాంటి వాటి తోడ్పాటుతో తమ పెట్రోకెమికల్స్ / కెమికల్స్ పోర్ట్ఫోలియో సామర్థ్యం వార్షికంగా 3 మిలియన్ టన్నులకు చేరగలదని వివరించారు. అంతర్జాతీయంగా ఎల్ఎన్జీ (ద్రవీకృత సహజ వాయువు) దిగ్గజాల నుంచి దీర్ఘకాలికంగా కొనుగోళ్లు జరిపే అంశంపై కసరత్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అటు సహజ వాయువులో హైడ్రోజన్ను ఏయే స్థాయిలో కలిపితే ఫలితాలు ఎలా ఉంటాయనే దానిపై అధ్యయనం చేస్తున్నట్లు గుప్తా చెప్పారు. -
శ్రీసిటీలో ‘కెర్రీ ఇండెవ్’ లాజిస్టిక్స్ కేంద్రం ప్రారంభం
సత్యవేడు (తిరుపతి జిల్లా): భారత్లోని ప్రముఖ ఇంటిగ్రేటివ్–3పీఎల్ (థర్డ్ పార్టీ లాజిస్టిక్స్) సేవల సంస్థ కెర్రీ ఇండెవ్ లాజిస్టిక్స్ నెట్వర్క్, శ్రీసిటీలో 3 లక్షల చ.అ విస్తీర్ణంలో నిర్మించిన నూతన అత్యాధునిక లాజిస్టిక్స్ కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించింది. మిత్సుబిషి ఎలక్ట్రిక్ ఇండియా ఆపరేషన్స్ కోసం ఇది పనిచేయనుంది. పరిశ్రమ ఆవరణలో జరిగిన ప్రారంభోత్సవ వేడుకల్లో మిత్సుబిషి ఎలక్ట్రిక్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (మార్కెటింగ్)ఒబాటా మసకాజు ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. కెర్రీ ఇండెవ్ చైర్మన్ డాక్టర్ గ్జావియర్ బ్రిట్టో మాట్లాడుతూ..వేర్ హౌసింగ్, లాజిస్టిక్స్ వ్యాపార సంస్థలకు శ్రీసిటీ అత్యంత అనువైన వ్యూహాత్మక స్థానమని చెప్పారు. తమ ప్లాంట్ ఏర్పాటుకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించిన శ్రీసిటీ బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. ఒబాటా మసకాజు మాట్లాడుతూ నూతన ప్లాంట్ ఏర్పాటులో కెర్రీ ఇండెవ్ లాజిస్టిక్స్, ఇండోస్పేస్ బృందాల అత్యుత్తమ కృషిని అభినందించారు. శ్రీసిటీ ఎండీ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి మాట్లాడుతూ..ప్రస్తుతం పారిశ్రామిక రంగంలో లాజిస్టిక్, వేర్హౌసింగ్ సేవల ప్రాముఖ్యతను వివరించారు. మిత్సుబిషి ఎలక్ట్రిక్ ప్లానింగ్ హెడ్ గణపతి శంకర్ తదితరులు పాల్గొన్నారు -
చంద్రయాన్–3లో ఖమ్మం వాసి!
ఖమ్మంఅర్బన్: శాస్త్ర, సాంకేతిక రంగంలో కీలకమైన చంద్రయాన్–3 ప్రయోగం విజయవంతమైంది. అయితే, ఈ ప్రయోగంలో ఖమ్మంకు చెందిన శాస్త్రవేత్త ఆపరేషన్ మేనేజర్గా వ్యవహరించారు. ఖమ్మం శ్రీనగర్కాలనీకి చెందిన రిటైర్డ్ పీఆర్ డీఈ వల్లూరి కోటేశ్వరరావు కుమారుడు వల్లూరి ఉమామహేశ్వరరావు 2013లో ఇస్రో శాస్త్రవేత్తగా చేరారు. వివిధ స్థాయిల్లో పదేళ్ల నుంచి ప్రయోగాల్లో పాలు పంచుకుంటున్న ఆయనకు చంద్రయాన్–3లో ఆపరేషన్ మేనేజర్గా అవకాశం దక్కింది. బెంగళూరు కేంద్రంగా ఇస్రోలో ఆపరేషన్ డిజైనింగ్ విభాగంలో 1,500 మందికి పైగా పనిచేస్తుండగా... ఆపరేషన్ మేనేజర్లుగా 30మందిని ఎంపిక చేశారు. ఇందులో ఉమామహేశ్వరరావు కూడా ఉండడం విశేషం. ఈసందర్భంగా ఆయన ఫోన్లో ‘సాక్షి’తో మాట్లాడుతూ దేశ సాంకేతిక రంగంలో కీలకమైన ప్రయోగంలో తాను పాలు పంచుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. -
ఓఎల్ఎక్స్లో ఉద్యోగాల కోత.. పలు దేశాల్లో మూసివేత
నెదర్లాండ్కు చెందిన ప్రోసస్ కంపెనీ క్లాసిఫైడ్స్ వ్యాపార విభాగమైన ఓఎల్ఎక్స్ గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా 800 ఉద్యోగాలను తొలగించనున్నట్లు ప్రకటించింది. తమ గ్రూప్నకు చెందిన ఓఎల్ఎక్స్ ఆటోస్ కార్యకలాపాలను కొన్ని దేశాల్లో మూసివేస్తున్న నేపథ్యంలో లేఆఫ్స్ను ప్రకటించినట్లుగా తెలుస్తోంది. ఉద్యోగాల తొలగింపు విషయాన్ని ఓఎల్ఎక్స్ గ్రూప్ టెక్ క్రంచ్ వార్తా సంస్థకు ధ్రువీకరించింది. ఆమ్స్టర్డామ్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తుంగా కంపెనీ ఇటీవలే ఉద్యోగాల కోత గురించి బాధిత ఉద్యోగులకు తెలియజేయడం ప్రారంభించింది. ‘ఈ సంవత్సరం ప్రారంభంలో ఓఎల్ఎక్స్ ఆటోస్ వ్యాపారం నుంచి నిష్క్రమించడానికి వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నాం. అప్పటి నుంచే సంభావ్య కొనుగోలుదారులు, పెట్టుబడిదారుల కోసం అన్వేషిస్తున్నాం’ అని కంపెనీ టెక్క్రంచ్ వార్తా సంస్థకు ఈమెయిల్ ద్వారా పంపిన ప్రకటనలో తెలిపింది. అర్జెంటీనా, మెక్సికో, కొలంబియాలో కంపెనీ తన కార్యకలాపాలను మూసివేసింది. ఓఎల్ఎక్స్ ప్రపంచవ్యాప్తంగా 30కి పైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక నివేదికలో ప్రోసస్ సంస్థ తన క్లాసిఫైడ్స్ వ్యాపారం ఓఎల్ఎక్స్ ప్రపంచవ్యాప్తంగా 11,375 మంది ఉద్యోగులను కలిగి ఉన్నట్లు పేర్కొంది. ఇదీ చదవండి: No Work From Home: ఇన్ఫోసిస్ మొదలుపెట్టేసింది.. ఉద్యోగులు ఇక ఇల్లు వదలకతప్పదు! -
కంపెనీ కార్యకలాపాలకు ‘మెటావర్స్’ - పీడబ్ల్యూసీ ఇండియా ఏం చెబుతుందంటే?
న్యూఢిల్లీ: దేశంలో 70 శాతం కంపెనీలు తమ వ్యాపార కార్యకలాపాలను మెటావర్స్తో అనుసంధానించే ప్రణాళికతో ఉన్నాయి. ఈ విషయాన్ని పీడబ్ల్యూసీ ఇండియా తెలిపింది. మెటావర్స్ అనేది సంస్థ ఉత్పత్తులు, వ్యాపార కార్యకలాపాలను కస్టమర్ ఉన్న చోట నుంచే వర్చువల్గా చూపించే టెక్నాలజీ. మెటావర్స్తో సంప్రదింపులు చేస్తున్న కంపెనీల్లో అధిక శాతం ఏడాదిలోనే తమ కార్యకలాపాలను మెటావర్స్తో అనుసంధానించేందుకు సన్నద్ధంగా ఉన్నట్టు చెప్పాయి. మెటావర్స్ పట్ల తమకు సరైన అవగాహన ఉన్నట్టు 60 శాతం వ్యాపార సంస్థల ఎగ్జిక్యూటివ్లు (ఉన్నతోద్యో గులు) చెప్పారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన 150 కంపెనీల ప్రతినిధులను పీడబ్ల్యూసీ సర్వే చేసి ఈ వివరాలు విడుదల చేసింది. ‘‘మెటావర్స్తో అవకాశాలు అపారం. మెటావర్స్తో విశేషమైన వృద్ధి ఉంటుందని అంచనా వేస్తున్నాం. వివిధ ప్రాంతాలు, తరాలకు ఇది అనుకూలంగా ఉంటుంది. వినియోగదారులు నూతన టెక్నాలజీ పట్ల అనుకూలంగా ఉన్నారు. దీంతో కంపెనీలు మెటావర్స్ సాంకేతికత అమలు కోసం అధికంగా పెట్టుబడులు పెడుతున్నాయి’’అని పీడబ్ల్యూసీ ఇండియా డిజిటల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ పార్ట్నర్ అశుతోష్ చాంద్ తెలిపారు. అంతర్జాతీయంగా పలు కంపెనీలు మెటావర్స్ విషయంలో కంపెనీలతో భాగస్వామ్యాలు, వ్యాపార అవకాశాల కోసం సంప్రదింపులు మొదలు పెట్టినట్టు పీడబ్ల్యూసీ ఇండియా నివేదిక తెలిపింది. ఆరంభ దశలో.. మెటావర్స్ సాంకేతికత భారత్లో ఇంకా ఆరంభంలోనే ఉన్నట్టు పేర్కొంది. సర్వేలో పాల్గొన్న కంపెనీల ప్రతినిధుల్లో 25 శాతం మంది తాము ఏడాదిలోపే మెటావర్స్తో తమ కార్యకలాపాలను అనుసంధానిస్తామని చెప్పగా, 47 శాతం కంపెనీల ప్రతినిధులు 2–3 ఏళ్ల సమయం పడుతుందని తెలిపారు. కస్టమర్లతో అర్థవంతంగా సంప్రదింపులు చేసేందుకు వీలుగా కంపెనీలకు మెటావర్స్ వినూత్న అవకాశం కల్పిస్తుందని పీడబ్ల్యూసీ ఇండియా పార్ట్నర్ సుదీప్త ఘోష్ చెప్పారు. సర్వేలో పాల్గొన్న వారిలో 36 శాతం మంది సైబర్ సెక్యూరిటీ వ్యాపారాలకు పెద్ద రిస్క్ అని చెప్పగా, 28 శాతం కంపెనీల ప్రతినిధులు టెక్నాలజీ పరిమితులను సవాలుగా పేర్కొన్నారు. -
ఈసారి ఆపరేషన్లు లేనట్టే!
సాక్షి, హైదరాబాద్: కంటి వెలుగు రెండో విడతలో ఆపరేషన్లు ఉండవని తెలుస్తోంది. మొదటి విడత లో కొందరికి ఆపరేషన్లు చేయించగా అవి వికటించడంతో వాటిని నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత అనుభవాల దృష్ట్యా కళ్లద్దాలు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించినట్లు అధికారవర్గాల సమాచారం. ఇదిలా ఉండగా కంటి వెలుగు రెండో విడతలో కోటిన్నర మందికి పరీక్షలు చేస్తే, దాదాపు 10 లక్షల మందికి కంటి ఆపరేషన్లు అవసరం అవుతాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అంచనా వేస్తోంది. చాలామందికి క్యాటరాక్ట్ ఆపరేషన్లు చేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. వచ్చే జనవరి 18వ తేదీ నుంచి రాష్ట్రంలో కంటి వెలుగు–2 కార్యక్రమం ప్రారంభం కానున్న విష యం తెలిసిందే. పని దినాల ప్రకారం వంద రోజు ల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా 55 లక్షల మందికి కళ్లద్దాలు పంపిణీ చేయాలని ప్రణాళికలు రూపొందించారు. ఇందులో భాగంగా రీడింగ్ గ్లాసులు, చత్వారం అద్దాలను అందజేస్తారు. బ్రాండెడ్ కంపెనీలకు చెందిన కళ్లద్దాలనే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం ఇప్పటికే టెండర్లు పిలిచింది. మొదటి విడతలో 1.54 కోట్ల మందికి పరీక్షలు 2018లో ప్రారంభమైన కంటి వెలుగు మొదటి విడత దాదాపు 8 నెలలపాటు జరిగింది. అప్పుడు 1.54 కోట్ల మందికి పరీక్షలు నిర్వహించారు. పరీక్షలు చేయించుకున్న వారిలో 90.25 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలే ఉండటం గమనార్హం. అప్పట్లో ఎన్నికలకు ముందు సర్కారుకు ఇది మంచి పేరు తెచ్చిపెట్టింది. కంటి ఆపరేషన్లు సహా ఇతరత్రా తదుపరి వైద్యం కోసం దాదాపు 9.30 లక్షల మందిని గుర్తించారు. కాగా, ఇందులో కొందరికి ఆపరేషన్లు చేయించారు. ఒకట్రెండు చోట్ల ఆపరేషన్లు వికటించడంతో ఆపరేషన్ల ప్రక్రియను నిలిపివేశారు. ఇదిలా ఉండగా రెండో విడత కంటి వెలుగులో ఆపరేషన్లపై సర్కారు స్పష్టత ఇవ్వలేదు. కేవలం కళ్లద్దాలు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించినట్లు ఒక అధికారి తెలిపారు. ఆపరేషన్లు ఎక్కడైనా వికటిస్తే అది మొత్తం కార్యక్రమానికే చెడ్డపేరు తెస్తుందని అంటున్నారు. కాగా, ప్రైవేట్ ఆసుపత్రులతో ఒప్పందం చేసుకొని ఆపరేషన్లు చేయించాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు. -
‘దేశ రాజకీయాల పేరిట కేసీఆర్ కొత్త డ్రామా’
సాక్షి, హైదరాబాద్: ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళలు మృతి చెందడం, ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ దాడులు, ఉద్యోగ నోటి ఫికేషన్ల విడుదలలో జాప్యం వంటి విషయా లపై నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే సీఎం కేసీఆర్ దేశరాజకీయాలు, ఫ్రీ కరెంటు అంటూ కొత్త డ్రామాకు తెరదీశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజమె త్తారు. ఇబ్రహీంపట్నం ఘటనలో వైద్యశాఖ మంత్రి హరీశ్ను బర్తరఫ్ చేయాలని, వైద్య శాఖ డైరెక్టర్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మంగళవారం మీడియాతో మాట్లా డుతూ.. దేశంలో ఎక్కడ ఈడీ దాడులు జరి గినా, అవినీతి, అక్రమాలు బయటపడ్డా కేసీఆర్ కుటుంబసభ్యుల ప్రమేయం ఉన్నట్లు వార్తలొస్తున్నాయన్నారు. ఈ చర్చను, ప్రజా సమస్యలను, రాష్ట్రంలో జరుగుతున్న వరుస సంఘటనలను దారి మళ్లించేందుకే కేసీఆర్ కొత్త డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డా రు. ‘ఇబ్రహీంపట్నం ఘటనౖపై దొంగ చేతికే తాళాలు ఇచ్చినట్లు, దీనికి బాధ్యుడైన హెల్త్ డైరెక్టర్ను విచారణ అధికారిగా నియమిస్తా రా? ఆయనపై ఉన్నన్ని ఆరోపణలు ఎవరి పైనా లేవు. పోస్టింగులు, డిప్యూటేషన్లు, ప్రమోషన్లుసహా ఏ పని చేసినా ఆయనకు పైసలియ్యాల్సిందే. నెలనెలా మూటముల్లె సీఎం, మంత్రికి అప్పగిస్తుండు. రేపోమాపో కేసీఆర్ ఆయనను ఎమ్మెల్సీ చేస్తాడేమో’ అని వ్యాఖ్యానించారు. ఈడీ దాడులపై విలేకరుల ప్రశ్నలకు సంజయ్ స్పందిస్తూ వాళ్ల పనివాళ్లు చేస్తరని, దాని గురించి తమకు సమాచారం లేదని అన్నారు. కేసీఆర్ మోసాలు చాటాలి ‘టీఆర్ఎస్ను గద్దె దించేది, బీజేపీని అధికారంలోకి తెచ్చేది మునుగోడు ఉప ఎన్నికే. ఈ నియోజకవర్గంలో ఒక్కో ఎస్సీ మోర్చా కార్యకర్త సగటున వంద ఇళ్లకు వెళ్లి టీఆర్ఎస్ మోసాలను ఎండగట్టండి. దళితులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు చేసిన అన్యాయాలను వివరించండి’ అని బండి సంజయ్ పిలుపునిచ్చారు. మంగళ వారం ఎస్సీ మోర్చా రాష్ట్ర పదాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు జి.వివేక్ వెంకటస్వామి, మునుస్వామి, కొప్పు భాషా, కుమ్మరి శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: అమిత్ షా యాక్షన్ప్లాన్.. ఢిల్లీలో మెగా మీటింగ్.. ఇంక ఆ సీట్లపైనే గురి -
‘గదిలో కింద పడుకోబెట్టి గంటలో 34 మందికి ఆపరేషన్లు ఎలా చేస్తారు?’
సాక్షి, హైదరాబాద్: ఇబ్రహీంపట్నంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళలు మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా, ఈ ఘటనను తెలంగాణ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. మహిళల మృతి నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో ఇబ్రహీంపట్నం బాధితులను ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పరామర్శించారు. మంత్రి హరీష్ రావు బుధవారం నిమ్స్ ఆసుపత్రికి వెళ్లి బాధితులను కలిశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ మాట్లాడుతూ.. ఆరేళ్లలో 12 లక్షల మందికి ఆపరేషన్లు చేశాం. ఎప్పుడూ ఇలా జరగలేదు. ఈ ఆపరేషన్లు చేసిన డాక్టర్ల లైసెన్స్లను రద్దు చేశాము. ఈ ఘటనపై కమిటీ నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటాము అని స్పష్టం చేశారు. మరోవైపు.. ఇబ్రహీంపట్నం ఆపరేషన్ల ఘటనపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సైతం స్పందించారు. జూబ్లీహిల్స్లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. గంటలో 34 మందికి ఎవరైనా ఆపరేషన్లు చేస్తారా.? ఇలా మహిళల ప్రాణాలతో ఆటుకుంటారా?. టెస్టులు చేయకుండా, ఆరోగ్య పరిస్థితి తెలుసుకోకుండా ఇలా కు.ని ఆపరేషన్లు చేస్తారా?. వారిని ఆసుపత్రి గదిలో కింద పడుకోపెట్టి అంత తొందరగా ఆపరేషన్లు చేయాల్సిన అవసరం ఏముంది అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాగా, అపోలో ఆసుపత్రిలో 11 మంది, నిమ్స్లో 19 మంది చికిత్స పొందుతున్నారు. ఇది కూడా చదవండి: కు.ని.ఆపరేషన్పై భయాందోళనలు.. వ్యాసెక్టమీతో పురుషులకు వచ్చే ఇబ్బందులేంటి? -
ఆ వైద్యుడు పేదల కంటి వెలుగు.. వందల మందికి ఉచిత ఆపరేషన్లు
సాక్షి, కడప సెవెన్రోడ్స్: గోరంత సాయం చేసి కొండంత ప్రచారం పొందాలనుకునేవారు చాలామంది. తమను తాము ప్రముఖ సంఘ సేవకులుగా చెప్పుకునే ఈ కోవకు చెందిన వారిని నిత్యం చూస్తుంటాం. కానీ అందుకు భిన్నంగా నిస్వార్థ సేవలు అందిస్తూ కూడా పబ్లిసిటీకి ఇష్టపడని వ్యక్తులు సైతం ఉంటారంటే ఒకింత ఆశ్చర్యమేస్తుంది. రెండు దశాబ్దాలకు పైబడి పేదలకు ఉచిత వైద్య పరీక్షలు, ఆపరేషన్లు నిర్వహిస్తున్న కడప నగరానికి చెందిన ప్రముఖ కంటి వైద్యులు గగ్గుటూరు ప్రదీప్కుమార్ ఇందుకు నిదర్శనం. కడప నగరం రమేష్ థియేటర్ ఎదురు వీధిలో డాక్టర్ ప్రదీప్ కుమార్ తన తండ్రిపేరిట శ్రీ గగ్గుటూరు పిచ్చయ్య నేత్ర వైద్యశాలను చాలా ఏళ్లుగా నిర్వహిస్తున్నారు. తన ఆస్పత్రికి వచ్చే రోగులకు ఎంతో ఓపికగా కంటి పరీక్షలు నిర్వహిస్తూ అవసరమైన సేవలు అందిస్తుంటారు. 20 ఏళ్లుగా ఉచిత సేవలు పేదలకు వారంలో ఒకరోజు ఉచిత వైద్య పరీక్షలు, అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు నిర్వహించాలని ఆయన నిర్ణయించుకున్నారు. అలా 2001 నుంచి ప్రతి ఆదివారం ఉచిత కంటి పరీక్షలు, వైద్యం అందించేవారు. మాజీమంత్రి బిజివేముల వీరారెడ్డి అల్లుడు డాక్టర్ రవికుమార్రెడ్డి క్లాస్మేట్. దీంతో ప్రతి ఆదివారం బద్వేలులోని వీరారెడ్డి ఆస్పత్రికి వెళ్లి ఉచిత కంటి పరీక్షలతోపాటు అవసరమైన వారికి ఆపరేషన్లు చేసేవారు. ఇలా 19 సంవత్సరాలు అక్కడ సేవలు అందించారు. ఇప్పుడు ప్రతి శనివారం కడప నగరం ఎర్రముక్కపల్లెలోని తన ఇంటి వద్ద ఉచిత పరీక్షలు చేస్తున్నారు. ప్రారంభంలో ఉచిత ఆపరేషన్లు చేశారు. అయితే జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వద్ద అనుమతులు పెండింగ్లో ఉన్నందున ప్రస్తుతానికి ఆపరేషన్లు నిర్వహించడం లేదు. కంటి పరీక్షలు నిర్వహించి ఆపరేషన్లు అవసరమైతే ఇతర వైద్యుల వద్దకు పంపుతున్నారు. ప్రతి శనివారం ఉచిత క్యాంపునకు 60–90 మంది పేషంట్లు వస్తుంటారు. కడప నగరంతోపాటు కమలాపురం, మైదుకూరు, ఎర్రగుంట్ల, గుత్తి, బ్రహ్మంగారిమఠం ప్రాంతాల నుంచి రోగులు వస్తారు. గతంలో బద్వేలులో పనిచేయడం వల్ల ఆ ప్రాంతం వారు ఎక్కువ వస్తారు. ఉదయం 7 నుంచి 12 గంటల వరకు అవసరమైతే మరికొంత సమయాన్ని ఉచిత సేవలకు వినియోగిస్తున్నారు. చదవండి: (ఫలించిన ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి కృషి.. సీఎం జగన్కు కృతజ్ఞతలు) సామాజిక బాధ్యతగా భావించాను నేను పుట్టి పెరిగింది కడప నగరం ఎర్రముక్కపల్లె. వైద్య పట్టా పుచ్చుకున్నాక మా ఇంటి చుట్టుపక్కల ఉన్న పేదలకు ఉచిత పరీక్షలు, ఆపరేషన్లు నిర్వహించడం బాధ్యతగా భావించాను. ఇప్పుడు కడపకు చెందిన వారేకాకుండా ఇతర ప్రాంతాల వారు కూడా వస్తున్నారు. శుక్లాలు, అద్దాల చెకప్, గ్లాకోమా తదితర కంటి పరీక్షలు నిర్వహిస్తాను. – డాక్టర్ ప్రదీప్కుమార్, కంటి వైద్య నిపుణులు, కడప పేదలకు ఎంతో మేలు ఇప్పుడున్న పరిస్థితుల్లో వైద్యం ఖరీదై పోయింది. డబ్బున్న వారికే వై ద్యం అన్నట్లు తయారైంది. గతంలో ఒకటి లేదా రెండు రూపాయల నామమాత్రపు ఫీజు తీసుకునే వైద్యులను చూశాను. ఇప్పుడు డాక్టర్ ప్రదీప్కుమార్ వారంలో పూర్తిగా ఒకరోజు ఉచిత సేవలు అందించడం పేదలకు ఎంతో మేలు చేసే అంశం. – సీఆర్వీ ప్రసాద్రావు, నాగరాజుపేట, కడప -
సూర్యాపేట: ప్రైవేట్ ఆసుపత్రి సీజ్.. ఎందుకో తెలుసా..?
సాక్షి, సూర్యాపేట: జిల్లాలో సిజేరియన్ ఆపరేషన్లపై సాక్షి వరుస కథనాలతో వైద్యారోగ్యశాఖ యంత్రాంగంలో కదిలిక వచ్చింది. ముహూర్తపు సిజేరియన్లు చేస్తున్నారంటూ సాక్షి స్ట్రింగ్ ఆపరేషన్ చేపట్టింది. ఈ స్ట్రింగ్ ఆపరేషన్లో స్థానిక దీప్తి ఆసుపత్రి అడ్డంగా దొరికిపోయింది. సాక్షి కథనాలతో డీఎంహెచ్వో ఆధ్వర్యంలో ఆసుపత్రిలో సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో ఆసుపత్రిలో వైద్యురాలి సంభాషణ సీక్రెట్ కెమెరాలో రికార్డు అయ్యింది. దీంతో, ఆసుపత్రిని సీజ్ చేసినట్టు డీఎంహెచ్వో తెలిపారు. ఈ సందర్బంగా.. సిజేరియన్లను ప్రోత్సహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇది కూడా చదవండి: నకిలీ సర్టిఫికెట్స్తో 230 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు -
గుండెఘోషకు ‘సూపర్’ వైద్యం
సాక్షి, అమరావతి: ముద్దులొలికే చిన్నారులు. ఆటపాటలతో బోసినవ్వులు చిందించే వయసు. కానీ, ఆ పసి గుండెల్లో పేరుకున్న విషాదంతో నిత్యం కన్నవారికి కన్నీరే.. ఆందోళనే. పైపెచ్చు పేదరికంతో ఎటూ పాలుపోని నిస్సహాయత. అయితే అమ్మవారి పాదాల సాక్షిగా తిరుపతిలో ప్రారంభమైన పీడియాట్రిక్ కార్డియాక్ ఆసుపత్రి వీరికి నిజమైన పండగ తీసుకొచ్చింది. ఆరంభమైన 4 నెలల్లో ఏకంగా 128 మంది చిన్నారులకు శస్త్ర చికిత్సలు చేసి.. ఆ కుటుంబాలకు జీవితానికి సరిపడేంత సంతోషాన్నిచ్చింది. ఏపీలోనే మొట్టమొదటిది.. నిజానికి రాష్ట్రంలో గుండె సంబంధిత రుగ్మతలతో బాధపడే పిల్లలకంటూ ప్రత్యేకించి పీడియాట్రిక్ కార్డియాక్ ఆసుపత్రి వంటిదేమీ లేదు. ఇతర ఆసుపత్రుల్లోనే పిల్లలకూ కార్డియాక్ సేవలందిస్తున్నారు. దీంతో ఈ అవసరాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి... తిరుపతిని దీనికి వేదికగా చేసుకున్నారు. ఫలితంగా 70 పడకలతో తాత్కాలికంగా శ్రీ పద్మావతి పీడియాట్రిక్ కార్డియాక్ ఆసుపత్రి ఏర్పాటు కావటం... గతేడాది ఆక్టోబరు 11న ముఖ్యమంత్రి ప్రారంభించటం సాధ్యమయ్యాయి. నిరుపేదలకు ఖరీదైన, సమర్థమైన వైద్యాన్ని అందించటమే లక్ష్యంగా ముందుకెళుతున్న సర్కారు సాయంతో ఈ 4 నెలల్లో ఆరోగ్య శ్రీ ద్వారా 128 మంది పిల్లలకు విజయవంతంగా గుండె శస్త్రచికిత్సలు చేయగలిగారు. తాత్కాలికంగా తిరుపతిలోని ‘బర్డ్’ ఆస్పత్రి పాత బ్లాక్లో పనిచేస్తున్న ఈ ఆస్పత్రికి టీటీడీ ఫెసిలిటేటర్గా వ్యవహరిస్తోంది. అత్యాధునిక పరికరాలతో పాటు 40 ఐసీయూ పడకలు... మూడు లామినార్ ఫ్లో ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. వ్యాధిగ్రస్త చిన్నారులు, వారి తల్లిదండ్రులు వేచి ఉండే ప్రాంతంతో పాటు ఔట్ పేషెంట్ బ్లాక్లో ఐదు కన్సల్టేషన్ సూట్లు ఏర్పాటు చేశారు. ఇంకా పది మంది రెగ్యులర్ స్పెషలిస్ట్లతో పాటు.. ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు నుంచి విజిటింగ్ నిపుణులు ప్రతివారం ఇక్కడకొచ్చి వైద్య సేవలు అందిస్తున్నారు. ఏటా 10 వేల మంది చిన్నారులకు... రాష్ట్రంలో ఏటా సుమారు 10 వేల మంది వరకూ చిన్నారులు గుండె సంబంధిత సమస్యలతో పుట్టడమో, పుట్టిన కొద్ది నెలల్లోనే ఇలాంటి సమస్యలు ఎదుర్కోవటమో జరుగుతోంది. వీరిలో మూడొంతుల మంది పిల్లలది క్లిష్ట పరిస్థితి. సకాలంలో చికిత్స అందించకపోతే ప్రాణాంతకమే. మరోవైపు.. రాష్ట్ర విభజన తర్వాత పిల్లల ఆరోగ్య అవసరాలు తీర్చేందుకు ఏపీలో ప్రత్యేకంగా ఆస్పత్రి అనేదే లేకుండా పోయింది. దీంతో ఈ తరహా చిన్నారులకు సరైన చికిత్స అందించాలన్న సీఎం ఆలోచనల్లోంచి పీడియాట్రిక్ కార్డియాక్ ఆసుపత్రి పుట్టుకొచ్చింది. 350 పడకలతో మరో ‘సూపర్ స్పెషాలిటీ’ తాత్కాలిక ఆసుపత్రి అందిస్తున్న సేవలు మరింత విస్తృతపరచాల్సి ఉన్న తరుణంలో... టీటీడీ 350 పడకలతో మరో సూపర్ స్పెషాలిటీ పీడియాట్రిక్ ఆస్పత్రిని ఏర్పాటు చేస్తోంది. దీన్లో గుండె సంబంధిత చికిత్సలు మాత్రమే కాకుండా సబ్ స్పెషాలిటీలకు సంబంధించి పది ఇతర విభాగాలు ప్రారంభిస్తున్నారు. నాలుగు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూపుదిద్దుకుంటున్న ఈ ఆసుపత్రిలో న్యూరో, జెనిటికల్ ఛాలెంజ్డ్, తలసేమియా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్, ఆంకాలజీ, డెవలప్మెంటల్ పీడియాట్రిక్స్ మొదలైన 14 స్పెషాలిటీ సేవలందించేలా ప్రణాళిక రూపొందించారు. -
Ford: ప్లీజ్ మమ్మల్ని వదిలేసి వెళ్లొద్దు!
'Please don't leave': ఆటోమొబైల్ దిగ్గజం ఫోర్డ్ సంస్థ ఇండియాలో తమ ఆపరేషన్స్ నిలిపేస్తున్నట్టు ప్రకటించడంతో అనేక మంది ఎమోషనల్గా రియాక్ట్ అవుతున్నారు. ఫోర్డ్ డోంట్ గో అంటూ సోషల్ మీడియాలో ఫోర్డ్తో తమకున్న ఎమోషనల్ బాండింగ్ను గుర్తు చేసుకుంటున్నారు. సెప్టెంబరు 9న ఫోర్డ్ నుంచి ప్రకటన వెలువడినప్పటి నుంచి ఫోర్డ్ ఇండియా హ్యాష్ట్యాగ్ ట్రెండవుతోంది. - మెయినుద్దీన్ షేక్ అనే వ్యక్తి స్పందిస్తూ ఫోర్డ్ అస్పైర్ కారు కొనుక్కోవడం తన లక్క్ష్యమని, దానికి సంబంధించిన డబ్బును కూడబెట్టానని, ఈ ఏడాది చివరికల్లా కొనుక్కుందామని ప్లాన్ చేశానని పేర్కొన్నాడు. ఫోర్డ్ తాజా నిర్ణయంతో తన హృదయం ముక్కలైందని, ఫోర్డ్ ప్లీజ్ డోంట్ గో అంటూ కోరాడు No more EcoSport and Endeavour #FordIndia pic.twitter.com/gWRGunXA19 — Car Stuff (@carrelatedstuff) September 9, 2021 - భార్గవ్ పెదకొలిమి అనే ట్విట్టర్ యూజర్ స్పందిస్తూ... 12 ఏళ్ల నుంచి ఫోర్డ్ కారు కొనుక్కోవాలనేది తన కలని, ఇప్పుడు ఆ కల తీరే సమయం వచ్చినప్పుడే ఫోర్డ్ ఇండియాను వీడి వెళ్లిపోతుందని తెలిసి హార్ట్బ్రేక్ అయ్యిందటూ పేర్కొన్నాడు. క్వాలిటీ, కంఫర్ట్, పవర్ఫుల్ ఇంజన్ అందివ్వడంలో ఫోర్ట్ మేటి అని చెబతూ.. ఇండియాను వదిలి వెళ్లొద్దంటూ రిక్వెస్ట్ చేశాడు. - నాకు ఆరేడేళ్ల వయసు నుంచి ఫోర్డ్ కారు సొంతం చేసుకోవాలనే కల ఉండేదని, ఇప్పుడు ఫోర్డ్ ఇండియాను వీడి వెలుతుందనే వార్తలతో నా కల చెదిరిపోయిందంటూ సిద్ధార్థ్ నౌతియాల్ అనే వ్యక్తి ట్వీట్ చేశాడు. I'm at a loss of words. I dreamt of owning a Ford since I was 6 or maybe 7 years old. A childhood dream just got crushed. I wish you had updated your budget vehicles (Figo/Freestyle/Aspire). They were enthusiast's choice and had so much potential. 😢 — Siddharth Nautiyal (@1998_Siddharth_) September 9, 2021 నాట్ లీవింగ్ ఇండియా ఇండియాను వీడి పోతున్నట్టు ప్రకటించగానే నెటిజన్ల నుంచి వెల్లువెత్తున్న ఎమోషనల్ ట్వీట్స్కి ఫోర్డ్ ఇండియా స్పందించింది. ఇండియాను తాము వీడి వెళ్లడం లేదంటూ లైట్ బిజినెస్ మోడల్ని అప్లై చేయబోతున్నట్టు తెలుపుతోంది. దీని వల్ల లాంగ్ రన్లో సంస్థకు లాభాలు వస్తాయంటూ వివరణ ఇస్తోంది. Hello, Kunal: Ford is NOT leaving India. A new, asset-light business model is being created with the reforms we announced today. This business model will be more profitable in the long run. ^VG — Ford India Service (@FordIndiaHelp) September 9, 2021 -
వచ్చే ఏడాదిలో తేజస్ మార్క్–2
న్యూఢిల్లీ: స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన బహుళ ప్రయోజక యుద్ధ విమానం తేజస్ సరికొత్త రూపంతో వచ్చే ఏడాదిలో తయారవుతుందని హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) సీఎండీ ఆర్.మాధవన్ వెల్లడించారు. తేజస్ మార్క్–2లో మరింత శక్తివంతమైన ఇంజిన్, ఎక్కువ బరువులు మోసే సామర్థ్యం, ఆధునిక ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ఉంటాయని వివరించారు. తేజస్ మార్క్–2 తయారీ పనులు విజయవంతంగా కొనసాగుతున్నాయనీ, 2023లో హైస్పీడ్ ట్రయల్స్ మొదలవుతాయన్నారు. 2025 నాటికి పూర్తిస్థాయిలో ఉత్పత్తి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. కొత్త వెర్షన్ జెట్ మరింత పెద్దదిగా ఉండటంతోపాటు ఎక్కువ దూరం ప్రయాణించలగలదనీ, నిర్వహణ కూడా మరింత తేలిగ్గా ఉంటుందన్నారు. హెచ్ఏఎల్ తయారు చేసిన తేజస్ మార్క్–1ఏ రకం 73 జెట్ విమానాలను రూ.48 వేల కోట్లతో కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం జనవరి 13న అంగీకారం తెలిపిందన్నారు. వీటి ఉత్పత్తి 2028 వరకు కొనసాగుతుందని చెప్పారు. మార్క్–2 జెట్ల తయారీ 2025 మొదలై 6 నుంచి 8 ఏళ్ల నడుస్తుందన్నారు. దీంతోపాటు, 5 బిలియన్ డాలర్ల మేర ఖర్చయ్యే 5వ తరం మీడియం ఫైటర్ జెట్ విమానం తయారీపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. దీని నమూనా 2026 వరకు సిద్ధమవుతుందనీ, ఉత్పత్తి 2030 నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు. హెచ్ఏఎల్, డీఆర్డీవోతోపాటు మరో రెండు ప్రైవేట్ రంగ సంస్థలు కలిసి ఈ ప్రాజెక్టును చేపట్టే అవకాశాలున్నాయని మాధవన్ తెలిపారు. ఇందులో రూ.2,500 కోట్ల పెట్టుబడి ప్రైవేట్ సంస్థలది కాగా, మిగతాది తాము భరిస్తామన్నారు. చైనా జేఎఫ్–17 యుద్ధ విమానం కంటే తేజస్ మార్క్–1ఏ జెట్ ఎంతో మెరుగైందని ఆయన వివరించారు. ఇంజిన్, రాడార్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థలతోపాటు సాంకేతికత పరంగా కూడా చైనా జెట్ కంటే మంచి పనితీరు కనబరుస్తుందని చెప్పారు. -
డబ్బు ఆశతో భారీ మూల్యం చెల్లించుకున్న వైద్యుడు
వర్జీనియా: డబ్బు ఆశకు పోయి ఓ డాక్టర్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. అమెరికాలోని గైనకాలజిస్టు విభాగాంలో పనిచేస్తున్న ఓ డాక్టర్ అవసరం లేకపోయినా శస్త్ర చికిత్సలు చేసి 465 ఏళ్ల జైలు శిక్షను ఎదుర్కొన్నాడు. ఈ డాక్టర్ పేరు జావేద్ పర్వేజ్. వర్జీనీయాకు చెందిన ఈ వైద్యుడు గైనకాలజిస్ట్గా పనిచేస్తూ సొంతంగా ప్రైవేటు ఆస్పత్రి నడుపుతున్నాడు. అధిక డబ్బు సంపాదించాలనే దురాశతో ఆయన వద్దకు వచ్చిన రోగులకు అవసరం లేకపోయిన శస్త్రచికిత్స చేయాలని సూచించేవాడు. ఈ క్రమంలో ఎక్కువగా అతడు గర్భసంచి సంబంధిత ఆపరేషన్స్ చేసేవాడు. మందులకు తగ్గే జబ్బులకు సైతం ఆపరేషన్ చేసేవాడు. అలా ఈ ప్రబుదుడు పదేళ్లలో 52 మందికి అనవసర శస్త్రచికిత్సలు చేసినట్లు అమెరికా మెడికల్ కౌన్సిల్ గుర్తించింది. (చదవండి: ఈమె 8 మంది శిశువులను చంపారట!) అయితే ఓ డాక్టర్ పదేళ్లలో సగటున 7.63 శాతం మాత్రమే ఆపరేషన్స్ చేయాల్సి ఉంటుంది. జావేద్ పర్వేజ్ మాత్రం పదేళ్లలో ఏకంగా 41.26 శాతం శస్త్ర చికిత్సలు చేశాడు. ఈ వైద్యుడి వద్దకు చికిత్సకు వెళ్లిన కొంతమంది మహిళలు అనుమానంతో మెడికల్ కౌన్సిల్కు ఫిర్యాదు చేశారు. జావేద్ ఆస్పత్రిపై రైడ్ చేసిన మెడికల్ కౌన్సిల్ పదేళ్లలో 41.26 శాతం ఆపరేషన్స్ చేసినట్లు గుర్తించింది. అతడిని విచారించగా అధిక డబ్బు గడించాలనే ఆశతోనే ఇలా చేసినట్లు సదరు వైద్యుడు ఒప్పుకున్నాడు. దీంతో వర్జీనియా న్యాయస్థానం అతడికి దాదాపు 465 ఏళ్ల జైలు శిక్ష విధించింది. (చదవండి: ట్రంప్ వైఖరి ఇబ్బందికరమే) -
హోండా ప్లాంట్ నిరవధిక మూసివేత
హోండా మోటార్సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) హర్యానా, మానేసర్లోని తన ప్లాంట్లో కార్యకలాపాలను నిరవధికంగా నిలిపివేసింది. ఆందోళన చేస్తున్న కార్మికులతో చర్చలు విఫలం కావడంతో సంస్థ ఈ నిర్ణయం తీసుకంది. సోమవారం నుండి ప్లాంట్ సాధారణ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు సంస్థ నోటీసు విడుదల చేసింది. యూనియన్ నాయకులు, ప్లాంట్ మేనేజ్మెంట్ మధ్య సోమవారం చర్చలు జరిగినా సఫలం కాలేదు. దీంతో శాశ్వత కార్మికులు, సంఘాలు, ఇతర కాంట్రాక్ట్ సిబ్బందిపై దుష్ప్రవర్తన ఆరోపణలు గుప్పిస్తూ ప్లాంట్ హెడ్ సైబల్ మైత్రా ఈ నోటీసులిచ్చారు. యూనియన్ నేతలు కాంట్రాక్టు కార్మికులను రెచ్చగొట్టి తమ అక్రమ సమ్మెను కొనసాగించమని పదేపదే కోరడంతోపాటు, కంపెనీ ప్రాంగణంలో చట్టవిరుద్ధంగా నిరసనలకు ప్రేరేపిస్తున్నారని పేర్కొన్నారు. ఈ అంశాలన్నింటినీ దృష్టిలోఉంచుకుని, ప్లాంట్ సాధారణ కార్యకలాపాలు సాధ్యం కాదని భావించి నిరవధికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. తిరిగి కార్యకలాపాలను ఎప్పుడు ప్రారంభించేదీ స్పష్టం చేయలేదు. అయితే ప్లాంట్లోని పరిస్థితి సాధారణమైన తర్వాత కార్యకలాపాల పునఃప్రారంభంపై వాటాదారులకు సమాచారం ఇస్తామన్నారు. కాగా ఉత్పత్తి కోత, కాంట్రాక్టు ఉద్యోగులపై భారీగా తొలగించడంపై నవంబర్ 5 నుంచి కార్మికులు సమ్మెకు దిగారు. అలాగే తమకు జీతాలు పెంచాలని కూడా పర్మినెంట్ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. వీరి ఆందోళనకు రాజకీయ పార్టీలు, ఇతర యూనియన్లు మద్దతు ఇస్తున్నాయి. ప్లాంట్ కార్మిక సంఘం సెక్రటరీ జనరల్ రమేష్ ప్రధాన్ సమాచారం ప్రకారం, ప్లాంట్లో ఉత్పత్తి చేసే ద్విచక్ర వాహనాల సంఖ్య రోజుకు 6000 నుండి నవంబర్ నాటికి 3500 కు తగ్గింది. దీంతో 2019 ప్రారంభం నుండి మొత్తం 1,000 మంది ఉపాధి కోల్పోయారు. అలాగే నిబంధనల ప్రకారం, ప్రతి మూడు సంవత్సరాలకు పే స్కేల్ సవరించాలి. అయితే ఆగస్టు 2018 నుండి ఇది పెండింగ్లో ఉందని కార్మికులు వాదిస్తున్నారు. -
ఆపరేషన్లు ఆగిపోయాయ్!
సాక్షి, హైదరాబాద్: జాతీయ వైద్య కమిషన్ బిల్లుకు నిరసనగా వైద్యులు చేపట్టిన ఆందోళన శుక్రవారం కూడా కొనసాగింది. 3రోజుల క్రితం ఓపీ సేవలు ఆపేసి ఆందోళన చేపట్టిన వైద్యులు గురువారం మధ్యాహ్నం నుంచి అత్యవసర వైద్యసేవలనూ బహిష్కరించిన విషయం తెలిసిందే. జ్వరం, దగ్గు, జలుబు వంటి సాధారణ సమస్యలతో బాధపడుతూ ఆస్పత్రి ఓపీకి చేరుకున్న ఔట్ పేషెంట్లకే కాకుండా ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడి గాంధీ, ఉస్మానియా, నిమ్స్ అత్యవసర విభాగాలకు చేరుకున్న రోగు లూ వైద్యసేవలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొందరు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లగా.. మరి కొందరు ఆస్పత్రి ప్రాంగణాల్లోనే పడిగాపులు కాస్తున్నారు. రోజంతా ఏకధాటిగా కురుస్తున్న వర్షం, వైద్యులు సమ్మెకు దిగిన సమాచారంతో ఆయా ఆస్పత్రులకు రోగుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఇదిలా ఉండగా పార్లమెంట్లో జాతీయ వైద్య కమిషన్ బిల్లు ఆమోదం పొందినప్పటికీ.. దానిని ఉపసంహరించే వరకు ఆందోళనను విరమించేది లేదని వైద్యులు మరోసారి స్పష్టం చేశారు. అత్యవసరం తప్ప అంతా బంద్! సాధారణ రోజుల్లో ఉస్మానియాలో రోజుకు సగటున 150, గాంధీలో 200, నిలోఫర్లో 40–50, ఈఎన్టీలో 25, నిమ్స్లో 250 వరకు చిన్నాపెద్దా సర్జరీలు జరుగుతాయి. అయితే జూడాల సమ్మెతో 30% సర్జరీలు వాయిదా వేయాల్సి వచ్చింది. అత్యవసర సర్జరీ లు కొనసాగినప్పటికీ.. మిగిలిన ఆపరేషన్లను వాయి దా వేశారు. ఇప్పటికే సర్జరీకి డేట్ తీసుకుని, ఉదయాన్నే ఆయా ఆపరేషన్ థియేటర్ల వద్దకు చేరుకున్న బాధితులు తీరా ఆపరేషన్ వాయిదా వేసినట్లు తెలిసి నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. గాంధీ ఆస్పత్రి లోని జూడాల సామూహిక ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతోంది. కోఠి ఈఎన్టీ ఆస్పత్రి వైద్యులు ప్రధాన గేటుకు తాళం వేసి నిరసన వ్యక్తం చేయగా, ఉస్మానియాలో పాతభవనం ముందు ఆందోళన చేపట్టారు. నిలోఫర్ చిన్నపిల్లల దవాఖానాలో సకాలం లో వైద్య సేవలు అందక పసిపిల్లలు అవస్థలు పడుతున్నారు. నిమ్స్లో రెసిడెంట్ వైద్యులు విధులు బహిష్కరించడంతో అత్యవసర విభాగానికి చేరుకు న్న రోగులకే కాకుండా ఆస్పత్రిలోని వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులకు వైద్యసేవలు అందలేదు. స్టాఫ్ నర్సులే పెద్దదిక్కు: జూనియర్లు సమ్మెలో ఉండటంతో అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. తాత్కాలికంగా సెలవులను రద్దు చేశారు. సీనియర్ ఫ్యాకల్టీ మొత్తాన్ని ఓపీ, ఐపీ, అత్యవసర విభాగాల్లో అందుబాటులో ఉంచారు. ఉదయం 9 గంటలకే ఐపీ రౌండ్స్ నిర్వహించాల్సిన సీనియర్ వైద్యులు ఓపీలో కూర్చోవడంతో ఆయా విభాగాల్లో చికిత్స పొందుతున్న రోగులకు స్టాఫ్నర్సులే పెద్దదిక్కుగా మారారు. ఇప్పటికే ఆస్పత్రిలో అడ్మిటైన వారికి సర్జరీ కోసం ఎదురు చూపులు తప్పలేదు. -
ఉన్నట్టుండి ఎందుకు కళ్లు తిరిగి పడిపోతున్నాను
నా వయసు 49 ఏళ్లు. నాకు అప్పుడప్పుడూ ఉన్నట్టుండి కళ్లు తిరుగుతున్నాయి. కొన్నిసార్లు కింద పడిపోవడం కూడా జరిగింది. నాకు ఇతర ఆరోగ్య సమస్యలు ఏమీ లేవు. ఒక డాక్టర్ను సంప్రదించి, బీపీ, షుగర్ పరీక్షలు కూడా చేయించుకున్నాను. అన్నీ నార్మల్ అని రిపోర్టులు వచ్చాయి. అప్పుడప్పుడూ తల కూడా తిరుగుతూ ఉన్నట్లు, పడిపోబోతున్నట్లు అనిపించే ఈ సమస్యతో నాకు చాలా ఆందోళనగా ఉంది. నాకు ఎందుకిలా జరుగుతోంది? తగిన సలహా ఇవ్వండి. మీరు చెప్పిన వివరాలు పరిశీలిస్తే మీరు ‘బినైన్ పొజిషనల్ వర్టిగో’ అనే సమస్యతో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. మన చెవిలోని లోపలి భాగంలో వినికిడి కోసం, బ్యాలెన్స్ను నియంత్రించేందుకు... రెండు వ్యవస్థలు ఉంటాయి. బ్యాలెన్స్ నియంత్రించే వ్యవస్థలను ‘వెస్టిబ్యులర్ వ్యవస్థ’ అంటారు. ఇందులో భాగాలలో ఓటోలిత్ అనే కణాలు, హెయిర్ సెల్స్, ఇతర భాగాలు ఉంటాయి. ఇవి మన బ్యాలెన్స్ను నియంత్రించేందుకు ఉపయోగపడతాయి. వాటిలోని లోపాల వల్ల బ్యాలెన్స్ వ్యవస్థలో లోపాలు రావడానికి అవకాశం ఉంది. మీరు మొదట నిపుణులైన ఈఎన్టీ వైద్యులను సంప్రదించి వినికిడి, బ్యాలెన్స్ వ్యవస్థకు సంబంధించిన, క్లినికల్ పరీక్షలు చేయించుకోండి. కళ్లు తిరగడంతో పాటు తలనొప్పి, వినికిడి లోపం, ఇతర సమస్యలు ఉన్నట్లయితే ఈఎన్టీ వైద్యుల సలహాపై న్యూరాలజిస్ట్ను కూడా సంప్రదించండి. అయితే ఈ సమస్య అంత ప్రమాదకరమైనది కాదు. కొన్ని రకాల వెస్టిబ్యుల్కు సంబంధించిన ఎక్సర్సైజులతో తగ్గిపోతుంది. అవసరాన్ని బట్టి కొన్ని మందులు వాడాల్సి ఉంది. సర్జరీ తర్వాత నుంచి మాట సరిగా రావడం లేదు నాకు ఈమధ్యనే గుండెకు సంబంధించిన ఓపెన్ హార్ట్ సర్జరీ అయ్యింది. అప్పట్నుంచి నాకు మాట సరిగా రావడం లేదు. ఎంత ప్రయత్నించినా స్వరం పెగలడం లేదు. మాట కూడా ఏదో గాలి బయటకు వస్తున్నట్లుగా వస్తోంది. అంతకముందు నాకు ఎప్పుడూ గొంతుకు సంబంధించిన సమస్యలు లేవు. అంతేకాదు... ఇప్పుడు తినేటప్పుడు, తాగేటప్పుడు, మింగే సమయంలో ఇబ్బందిగా ఉంది. గొంతుకు ఏదో అడ్డు పడినట్లుగా ఉంది. పరిష్కారం చెప్పండి. మీ సమస్యకు సంబంధించిన వివరాలు పరిశీలించాక మీకు స్వరపేటికలోని ఒక భాగం అయిన ‘వోకల్ ఫోల్డ్’లో సమస్య ఉన్నట్లుగా తెలుస్తోంది. గుండెకు సంబంధించిన ఆపరేషన్లు (ముఖ్యంగా ఓపెన్ హార్ట్ సర్జరీ), ట్రకియాస్టమీ, ఊపిరితిత్తులకు సంబంధించిన ఆపరేషన్స్లో కొన్నిసార్లు వోకల్ఫోల్డ్కు ఒత్తిడి తగలడం లేదా అది దెబ్బతినడానికి అవకాశాలు ఎక్కువ. మీకు కూడా అలాగే జరిగినట్లుగా అనిపిస్తోంది. దీని వల్ల మీరు చెప్పిన విధంగానే మింగడం, మాట్లాడటంలో సమస్యలు రావచ్చు. కొన్నిసార్లు వోకల్ ఫోల్డ్ పెరాలసిస్ రావడానికి అవకాశం ఉంది. మీ సమస్యను నిర్ధారణ చేయడానికి మొదట మీరు అనుభవజ్ఞులైన ఈఎన్టీ వైద్యుడిని సంప్రదించండి. మీకు అవసరాన్ని బట్టి లారింగోస్కోపీ, ఎండోస్కోపీ వంటి పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. అంతుకాకుండా మీరు స్పీచ్ థెరపిస్ట్ను సంప్రదించి అవసరమైన ఎక్సర్సైజ్లు కూడా ప్రాక్టీస్ చేయాలి. వోకల్ నాడ్యూల్స్ ఎందుకొస్తాయి... పరిష్కారం చెప్పండి నేను వృత్తిరీత్యా టీచర్గా పనిచేస్తున్నాను. ఇంటికి వచ్చాక కూడా ట్యూషన్స్ ఎక్కువగా చెబుతుంటాను. ఇటీవల నా గొంతు బొంగురుగా ఉంటే ఈఎన్టీ వైద్యులను సంప్రదించాను. ‘వోకల్ నాడ్యుల్స్’ వచ్చాయని అన్నారు. ఇవి ఎందుకు వస్తాయి. నాకు తగిన పరిష్కారం చెప్పండి. వృత్తిపరంగా గొంతును అధికంగా ఉపయోగించేవారిలో అత్యధికుల్లో వచ్చే సమస్య వోకల్ నాడ్యూల్స్. ఇందులో స్వరపేటికలోని రెండు అర్ధభాగాలు కలిసే చోట కండ ఒక చిన్న గడ్డలా పెరుగుతుంది. ఇలా పెరిగిన వోకల్ నాడ్యూల్స్ వల్ల స్వరపేటికలోని రెండు అర్థభాగాలూ పూర్తిగా మూసుకుపోవు. దాంతో స్వరంలో మార్పు వస్తుంది. సాంకేతికంగా చెప్పాలంటే మన మాటల్లో మునుపు ఉండే నాణ్యత (క్వాలిటీ ఆఫ్ వాయిస్) లోపిస్తుందన్నమాట. అంతేకాకుండా ఒక్కోసారి గొంతు బొంగురుపోయినట్లుగా ఉండటం, మాట్లాడే సమయంలో నొప్పి రావడం, మాట వస్తూ వస్తూ మధ్యలో ఆగిపోవడం వంటివీ జరగవచ్చు. మాటపూర్తిగా పెగలకుండా... లోగొంతుకతో వస్తున్నట్లుగా కూడా అనిపించవచ్చు. అంతేకాదు... స్వరపేటికలో స్వరతంత్రులు (వోకల్ కార్డ్స్) కూడా ఉంటాయి. వీటిలోనూ మళ్లీ ట్రూ కార్డ్స్, ఫాల్స్ కార్డ్స్ అనే రకాలుంటాయి. ఈ సమస్య ఉన్నవారిలో ట్రూ కార్డ్స్ అనేవి స్పందించినప్పుడు గొంతులో నొప్పి వస్తుంటుంది. అందువల్ల ఆ నొప్పిని అధిగమించడానికి వీళ్లు ఫాల్స్ కార్డ్స్ అనే తంత్రుల సహాయంతో మాట్లాడుతుంటారు. దాని వల్ల స్వరంలో మార్పు వస్తుందన్నమాట. మీరు ఈఎన్టీ నిపుణులను, స్పీచ్ థెరపిస్ట్లను కలవండి. మీ నాడ్యూల్స్ మరీ ఎక్కువ పరిమాణానికి పెరిగితే అవసరమైతే శస్త్రచికిత్స చేసి వాటిని తొలగించడం వల్ల మీకు ఉపశమనం కలుగుతుంది. డాక్టర్ ఇ.సి. వినయ కుమార్ హెచ్ఓడి – ఈఎన్టి సర్జన్, అపోలో హాస్పిటల్స్, హైదరాబాద్ -
‘కంటి వెలుగు’కు ఆపరేషన్ల ఫోబియో!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘కంటి వెలుగు’కార్యక్రమం ముగిసినా, లక్షలాది మందికి చేయాల్సిన ఆపరేషన్ల ప్రక్రియ మాత్రం ఇప్పటికీ తిరిగి మొదలు కాలేదు. ఈ ఆపరేషన్లు చేయించడానికి అధికారులు సుముఖత చూపడంలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలా సీఎం కేసీఆర్ ఆశయాలకు వైద్య ఆరోగ్యశాఖ తూట్లు పొడుస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఒకట్రెండు చోట్ల చేసిన ఈ ఆపరేషన్లు వికటించడంతో మొత్తం ఆపరేషన్ల ప్రక్రియను నిలిపివేశారు. ‘మనకెందుకు ఈ రిస్క్. ఒకవేళ ఆపరేషన్లు తిరిగి ప్రారంభించాక ఎక్కడైనా వికటించినా, సమస్య వచ్చినా బదనాం అవుతా’మన్న ధోరణిలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులున్నట్లు తెలుస్తోంది. వారి తీరు వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే పరిస్థితి నెలకొందని అంటున్నారు. ‘లక్షలాది మందికి ఆపరేషన్లు చేస్తే ఒకట్రెండు చోట్ల చిన్నచిన్న సమస్యలు రావడం సహజం. పేరున్న ప్రైవేటు ఆసుపత్రుల్లో చేసినా ఇలాంటివి జరుగుతుంటాయి. అలాగని ఆపరేషన్లు చేయడం ఆపేస్తామా?’అని ఒక కంటి వైద్య నిపుణుడు అభిప్రాయపడ్డారు. కచ్చితమైన మార్గదర్శకాలు జారీచేసి ఆ ప్రకారం జాగ్రత్తలు చెప్పి, ప్రముఖ కంటి ఆసుపత్రుల్లో చేసేలా నిర్ణయాలు తీసుకుంటే బాగుండేదని అంటున్నారు. ఎల్వీ ప్రసాద్ వంటి కంటి ఆసుపత్రులతో ఒప్పందం చేసుకుంటే బాగుండేదంటున్నారు. కానీ ఉన్నతాధికారులు రిస్క్ తీసుకోకుండా కేవలం ఉద్యోగం చేస్తున్నామా? ఇంటికి పోతున్నామా? అన్న ధోరణిలోనే ఉన్నారన్న విమర్శలు వస్తున్నాయి. పైగా ఈ కార్యక్రమాన్ని కేంద్రం ఆధ్వర్యం లోని అంధత్వ నివారణ కార్యక్రమం ద్వారా చేపట్టే అవకాశం కూడా ఉంది. 9.30 లక్షల మందికి కంటి లోపం... ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం గత నెలలో ముగిసింది. కీలకమైన ఎన్నికల సమయంలో ఈ కార్యక్రమంతో గ్రామాల్లో కేసీ ఆర్కు ఎంతో కలిసి వచ్చింది. ఆనాడు కోటి కళ్లు ఆయన్నే దీవించాయి. ఏడు నెలలపాటు కంటి వెలుగు కింద 1.54 కోట్ల మందికి పరీక్ష లు నిర్వహించారు. 9,882 గ్రామాల్లో (99. 50%) కంటి పరీక్షలు పూర్తిచేశారు. వారిలో అత్యధికంగా 90.25 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలే ఉండటం గమనార్హం. అందులో అత్యధికంగా బీసీలు 89.90 లక్షల (58.12%) మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఎస్సీలు 16.60 శాతం, ఎస్టీలు 11.02 శాతం, మైనారిటీలు 4.51 శాతం ఉపయోగిం చుకున్నారు. అంటే బడుగు బలహీన వర్గాలకు ఈ పథకం కింద కంటి పరీక్షలు జరిగాయంటే సర్కారు అనుకున్న లక్ష్యం నెరవేరింది. అంతే కాదు 22.92 లక్షల మందికి రీడింగ్ గ్లాసులు అక్కడికక్కడే అందజేశారు. మరో 10.12 లక్షల మందికి చత్వారీ అద్దాలు ఇచ్చారు. మరో 8 లక్షల మందికి చత్వారీ అద్దాలు సరఫరా చేయడంలో లోపంపైనా విమర్శలు వస్తున్నాయి. ఇక కంటి సమస్యలున్నాయని, ఆపరేషన్లు సహా ఇతరత్రా తదుపరి వైద్యం కోసం 9.30 లక్షల మందిని పై ఆసుపత్రులకు రిఫర్ చేశారు. వారిలో దాదాపు ఆరు లక్షల మందికి వివిధ రకాల ఆపరేషన్లు అవసరమని, మిగిలిన వారికి తదుపరి వైద్యం అవసరమని అంచనా వేశారు. లక్ష మందికి మాత్రం తీవ్రమైన కంటి లోపం ఉందని, వారికి ఆపరేషన్లు తక్షణమే చేయాల్సి ఉందని తేల్చారు. కానీ వైద్య ఆరోగ్యశాఖ మాత్రం కాలయాపన చేస్తూ సర్కారుకు చెడ్డ పేరు తెస్తోంది. అధికారుల తీరుపై బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. వికటిస్తాయన్న భయమే కారణమా... కంటి ఆపరేషన్లు చేయకపోవడానికి కేవలం అవి వికటిస్తాయన్న భయమే కారణమని ఓ కీలక అధికారి అభిప్రాయపడ్డారు. దీంతో ముఖ్యమంత్రి వద్దకు సమగ్రమైన మార్గదర్శకాలతో వెళ్లి కంటి ఆపరేషన్లు మొదలుపెట్టడానికి ఎవరూ సాహసించడంలేదు. మరో వైపు బాధితులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. అటు అధికారులు ఇటు ప్రభుత్వం చొరవ చూపి బాధితులకు ఊరటనివ్వాల్సిన అవసరం ఉంది. ∙ కంటి శస్త్రచికిత్సలపై చేతులెత్తేస్తున్న వైద్య ఆరోగ్యశాఖ ∙ దీంతో ఎక్కడికక్కడ నిలిచిపోయిన ప్రక్రియ -
13 రూట్లలో విమాన సర్వీసులు రద్దు
సాక్షి, ముంబై : ఆర్థిక సమస్యలు, రుణ భారంలో చిక్కుకుని విలవిల్లాడుతున్న ప్రయివేటు విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ మరింత సంక్షోభంలో కూరుకుపోతోంది. విమానాలకు అద్దెలు చెల్లించలేక, పైలెట్లకు జీతాలు చెల్లించలేక పలు విమానాల రద్దు చేసుకుంటూ వస్తోంది. తాజా 13 అంతర్జాతీయ రూట్లలో సర్వీసులను రద్దు చేసింది. ఏప్రిల్ చివరివరకు ఈ నిర్ణయం అమలవుతుందని ఎయిర్లైన్ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే అద్దె బకాయిలు చెల్లించలేక మరో 7 విమానాలను కూడా రద్దు చేస్తున్నట్టు తెలిపింది. దీంతో రద్దు చేసిన విమానాల సంఖ్య 54కు చేరింది. ఇప్పటికే ముంబై -ఢిల్లీ మధ్య విమానాల సర్వీసులను కూడా బాగా తగ్గించింది. అలాగే ముంబై -మాంచెస్టర్ మధ్య సర్వీసులను ఇప్పటికే రద్దు చేసుకుంది. కాగా జీతాలు చెల్లించకుంటే వచ్చేనెలనుంచి విధులకు హాజరుకామని ఇప్పటికే జెట్ ఎయిర్వేస్ పైలట్లు యాజమాన్యాన్ని హెచ్చరించారు. జీతాల్లేక ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన చెందారు. మరోవైపు వందలాది మంది పైలెట్లు ఉద్యోగాలకోసం ఇతర విమానయాన సంస్థలను ఆశ్రయించిన సంగతి విదితమే. -
కంటి ‘వెలుగు’ ఎప్పుడో?
సాక్షి, హైదరాబాద్: ‘కంటి వెలుగు’ఆపరేషన్లపై నీలినీడలు అలుముకున్నాయి. కంటి శిబిరాలు నిర్వహించాక అవసరమైన వారందరికీ ఆపరేషన్లు చేస్తామని సర్కారు స్పష్టం చేసింది. మొదట్లో అక్కడక్కడ ఆపరేషన్లు చేస్తున్నప్పుడు సమస్యలు తలెత్తడం, వరంగల్లో ఏకంగా 18 మందికి ఒకే ఆస్పత్రిలో ఆపరేషన్లు వికటించి పరిస్థితి విషమించడంతో వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు కంగుతిన్నాయి. ఎన్నికల సమయంలో ఆపరేషన్లు వికటిస్తే ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుందని గుర్తించి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు అప్పట్లో ఆపరేషన్లను తాత్కాలికంగా నిలిపివేశారు. ఎన్నికలు ముగిసి రెండు వారాలవుతున్నా.. మళ్లీ కంటి వెలుగు ఆపరేషన్లు మొదలుపెట్టడంలో వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు నిర్లక్ష్యం చూపుతున్నాయి. ఎప్పటినుంచి కంటి ఆపరేషన్లు చేస్తారో కూడా ఇప్పటికీ అధికారులు వివరాలు వెల్లడించలేదు. దీంతో ఎప్పుడు ఆపరేషన్లు చేస్తారోనన్న ఆందోళన బాధితుల్లో నెలకొంది. 7.32 లక్షల మంది ఎదురుచూపు.. ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని ఈ ఏడాది ఆగస్టు 15న ప్రారంభించింది. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 1.12 కోట్ల మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. అందులో 39.53 లక్షల (35.2%) మందికి ఏదో రకమైన కంటి లోపాలున్నట్లు గుర్తించారు. వారిలో 18.19 లక్షల మందికి రీడింగ్ గ్లాసులు అందజేశారు. మరో 14.01 లక్షల మందికి చత్వారం ఉన్నట్లు నిర్ధారించారు. వారిలో 3.47 లక్షల మందికి ఇప్పటివరకు చత్వారం అద్దాలు ఇచ్చారు. 7.32 లక్షల మంది లబ్ధిదారులకు ఆపరేషన్లు అవసరమని వైద్యులు నిర్ధారించారు. మొదట్లో కొద్దిమందికి ఆపరేషన్లు వికటించినట్లు వార్తలు రావడంతో తాత్కాలికంగా నిలిపివేశారు. ఆపరేషన్లు నాలుగింతలు పెరిగే అవకాశం... కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభానికి ముందు రాష్ట్రంలో కేవలం మూడు లక్షల మందికే ఆపరేషన్లు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. కానీ, ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే కంటి వెలుగు పూర్తయ్యే నాటికి 12 లక్షల మందికి కంటి ఆపరేషన్లు చేయాల్సి వస్తుందని తాజా అంచనా. ఏకంగా 4 రెట్లు పెరగింది. దీంతో ఆపరేషన్లు చేసే ఆస్పత్రుల సంఖ్యను కూడా పెంచారు. ఇప్పటివరకు 70 ఆస్పత్రులకు అనుమతివ్వగా.. అదనంగా మరో 41 ఆస్పత్రులను గుర్తించారు. వారందరికీ ఆయా ఆస్పత్రుల్లో ఆపరేషన్లు చేయాలంటే కనీసం ఏడాదిన్నర పడుతుందని వైద్య ఆరోగ్య వర్గాలు చెబుతున్నాయి. ప్యాకేజీ పెంచాలంటున్న ప్రైవేటు ఆస్పత్రులు.. కంటి వెలుగు కింద క్యాటరాక్ట్ ఆపరేషన్లకు ప్రభుత్వం ఇచ్చే సొమ్ము సరిపోవడం లేదని ప్రైవేటు కంటి ఆస్పత్రులు గగ్గోలు పెడుతున్నాయి. ఒక్కో క్యాటరాక్ట్ ఆపరేషన్కు రూ. 2 వేలు నిర్దారించారు. కొన్నింటికి గరిష్టంగా రూ.35 వేల వరకు ప్రభుత్వం సంబంధిత ఆస్పత్రులకు చెల్లిస్తుంది. అయితే కంటి వెలుగు కింద గుర్తిస్తున్న వాటిలో అధికం క్యాటరాక్ట్వే ఉన్నాయి. క్యాటరాక్ట్ ఆపరేషన్లకు రూ. 2 వేలు ఇస్తే సరిపోదని, కేంద్రం ప్రారంభించిన ఆయుష్మాన్ భారత్లో క్యాటరాక్ట్కు రూ.6 వేలు ఇస్తున్నారని ప్రైవేట్ ఆస్పత్రులు అంటున్నాయి. తమకు కనీసం రూ.5 వేలయినా చెల్లించాలని కోరుతున్నాయి. లేదంటే ఆపరేషన్లు చేయబోమని చెబుతున్నాయి. ఈ సమస్యను ఇప్పటికీ వైద్య, ఆరోగ్యశాఖ పరిష్కరించలేదు. -
కలగా మారిన కంటి వెలుగు
ఎల్లారెడ్డిరూరల్: కంటి వెలుగు కార్యక్రమంలో ఇప్పటి వరకు ఒక్కరికి కూడా ఆపరేషన్లు నిర్వహించలేదు. ఎప్పుడు నిర్వహిస్తారన్న విషయమై స్పష్టత కూడా లేదు. దీంతో ఆపరేషన్లు అవసరమైనవారు నిరాశ చెందుతున్నారు. ఆగస్టు 15వ తేదీన కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభమైన విషయం తెలిసిందే. ప్రభుత్వం జిల్లాలో కంటి వెలుగు అమలు కోసం 22 బృందాలను ఏర్పాటు చేసింది. ఈ బృందంలో ఒక సాధారణ వైద్యుడు, ఒక ఆప్తాల్మిక్ వైద్యు డు, ఇద్దరు డాటా ఎంట్రీ ఆపరేటర్లు, ఏఎన్ఎం, ఆశావర్కర్ ఉన్నారు. ఇప్పటి వరకు జిల్లా లో 253 గ్రామాలలో కంటి వెలుగు కార్యక్రమం లో భాగంగా లక్షా 92 వేల 892 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో దగ్గరి చూపు లోపంతో బాధపడుతున్న 34,699 మందికి కంటి అద్దాలను పంపిణీ చేశారు. దూరపు చూపు లోపంతో ఉన్న 23,798 మందికి కంటి అద్దాల కోసం ఆర్డర్ చేశారు. 17,370 మంది మోతి బిందుతో బాధపడుతున్నారని గుర్తించిన వైద్యులు.. కంటి ఆపరేషన్ల కోసం సిఫారసు చేశారు. ప్రారంభం కాని ఆపరేషన్లు.. జిల్లాలో కంటి వెలుగు ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా.. ఇప్పటి వరకు ఒక్కరికి కూడా కంటి ఆపరేషన్లు నిర్వహించలేదు. జిల్లాలో 17,370 మందికి కంటి ఆపరేషన్లు నిర్వహించాల్సి ఉండగా ఒక్కరికి కూడా నిర్వహించకపోవడంపై కంటి చూపుతో బాదపడుతున్న వారు ఆవేదన చెందుతున్నారు. కంటి పరీక్షలు నిర్వహించి రెండున్నర నెలలు పూర్తవుతున్నప్పటికీ ఇప్పటి వరకు కంటి ఆపరేషన్లు నిర్వహించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆపరేషన్లలో జాప్యం జరుగుతుండడంపై నిరాశ చెందుతున్నారు. వెంటనే శస్త్రచికిత్సల ప్రక్రియ చేపట్టాలని కోరుతున్నారు. ఆపరేషన్లు ప్రారంభం కాలేదు.. జిల్లాలో కంటి వెలుగు కొనసాగుతోంది. ఇప్పటివరకు మోతిబిందు కారణంతో కంటి చూపుతో బాధపడుతున్న వారిని 17,370 మందిని గుర్తించాం. అయితే కంటి వెలుగు పథకం కింద ఇప్పటివరకు ఆపరేషన్లు ప్రారంభించలేదు. నేషనల్ బ్లైండ్నెస్ కంట్రోల్ ప్రోగ్రాం ద్వారా కంటి ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలు వచ్చిన తరువాత కంటి వెలుగులో ఆపరేషన్లు ప్రారంభిస్తాం. – చంద్రశేఖర్, డీఎంహెచ్వో, కామారెడ్డి -
కంటి వెలుగుకు ఆ‘పరేషాన్’
సాక్షి, సిటీబ్యూరో: కంటిచూపు సమస్యతో బాధపడుతున్న వారికి ఆ‘పరేషాన్’ తప్పడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘కంటి వెలుగు’ కార్యక్రమంలో భాగంగా కాటరాక్ట్ సమస్య ఉన్నట్లు గుర్తించిన రోగులకు సకాలంలో ఆపరేషన్లు జరగడం లేదు. శిబిరాల్లో వైద్యులు బాధితులను గుర్తించి ఎంపిక చేసిన ఆస్పత్రులకు సిఫార్సు చేస్తున్నారు. పైసా ఖర్చు లేకుండా శుక్లాల ఆపరేషన్ చేయించుకునేందుకు ఎంతో ఆశతో ఆస్పత్రులకు వెళ్లిన రోగులకు నిరాశే మిగులుతోంది. దీనికితోడు ఇప్పటివరకు రీడింగ్ గ్లాసులు మినహా మల్టిపుల్ విజన్, ఇతర సమస్యలతో బాధపడుతున్న వారిలో ఒక్కరికి కూడా కళ్లజోళ్లు అందించకపోవడం గమనార్హం. సరోజినిదేవి కంటి ఆస్పత్రి సహా ఇతర ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్సలకు అవసరమైన మౌలిక సదుపాయాలు లేకపోవడం, ప్రభుత్వం ఇచ్చే ఖర్చులు చాలా తక్కువగా ఉండటంతో ప్రైవేటు ఆస్పత్రులు సర్జరీలు చేసేందుకు ముందుకు రావడం లేదు. దీంతో బాధితులు దిక్కుతోచక ఇబ్బందులు పడుతున్నారు. అందని కళ్లజోళ్లు కంటివెలుగు కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 98 క్యాంపులు ఏర్పాటు చేశారు. తాత్కాలిక ప్రతిపాదికన ఒక్కో క్యాంపులో ఆరుగురు చొప్పున మొత్తం 588 మంది సిబ్బందిని నియమించింది. వీరు ఇప్పటి వరకు 2,04,786 మంది రోగులను పరీక్షించారు. ఇందులో 83171 మంది పురుషులు కాగా, 120598 మంది మహిళలు ఉన్నారు. ఇప్పటి వరకు 42649 మందికి రీడింగ్ గ్లాసులను పంపిణీ చేశారు. మరో 69284 మందికి మల్టిపుల్ విజన్ సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. వీరికి సమస్యను బట్టి ప్రత్యేకంగా కళ్లజోళ్లను ఇవ్వాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు ఒక్కరికి కూడా అద్దాలు అందజేయలేదు. మరో 11,825 మందికి కాటరాక్ట్ సమస్య బాధపడుతున్నట్లు గుర్తించి ఆపరేషన్ నిమిత్తం నగరంలోని ఆనంద్ నేత్రాలయం, హరికృష్ణ నేత్రాలయం, మెడివిజన్, ఎల్వీప్రసాద్, పుష్పగిరి, సరోజినిదేవి కంటి ఆస్పత్రి, ప్రిన్సెన్ఇస్రో, కింగ్కోఠి జిల్లా ఆస్పత్రులకు సిఫార్సు చేశారు. అయితే ఆయా ఆస్పత్రుల్లో ఇప్పటి వరకు 95 కాటరాక్ట్ సర్జరీలు మాత్రమే జరిగాయి. ఇందులో ఎల్వీప్రసాద్, హరికృష్ణ నేత్రాలయా ఆస్పత్రుల్లో ఇప్పటి వరకు ఒక్క సర్జరీ కూడా చేయకపోవడం విశేషం. ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స ఖర్చులు ఎక్కువగా ఉండటం, ఆ మేరకు ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో నిర్వాహకులు చికిత్సలకు వెనుకాడుతున్నట్లు సమాచారం. గుర్తింపుతోనే సరి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు వైద్య శిబిరంలో కంటిచార్ట్ సహాయంతో ప్రాథమిక కంటి పరీక్ష(అన్ ఎయిడెడ్ విజువల్ ఆక్యూటీ)తో పాటు సవివరమైన కంటిపరీక్ష(ఆబ్జెక్టివ్ రీఫ్రాక్షన్)లు చేస్తున్నారు. ఇందుకు అవసరమైన సామాగ్రి కూడా ప్రభుత్వమే సమకూర్చింది. ఇందులో భాగంగా వైద్యులు కంటి సమస్యను గుర్తించి మందులతో పాటు అవసరమైన వారికి కంటి అద్దాలు సిఫార్సు చేస్తున్నారు. రీడింగ్ గ్లాసులు అవసరమైన వారికి అక్కడికక్కడే అందజేస్తున్నప్పటికీ..ప్రిస్కిప్షన్ రాసిన వారికి నాలుగు వారాల గడువు ఇచ్చారు. వీటి తయారీ బెంగుళూరుకు చెందిన ఈఎస్ఎస్ఎల్ఆర్ సంస్థకు కాంట్రాక్టు అప్పగించారు. క్యాటరాక్ట్ సర్జరీలు అవసరమైన వారిని కేవలం గుర్తింపునకే పరిమితమవుతోంది. బాధితులను ప్రభుత్వమే సయంగా ఆస్పత్రులకు తీసుకెళ్లి సర్జరీలు చేయించకపోవడంతో ఆశించిన స్థాయిలో ఆపరేషన్లు జరగడం లేదు. చికిత్స చేయించుకునేందుకు బాధితులే స్వయంగా ఆస్పత్రులకు వస్తున్నా ప్రభుత్వం చెల్లిస్తున్న వైద్య ఖర్చులు చాలా తక్కువగా ఉండటంతో కంటి వెలుగు బాధితులను చేర్చుకునేందుకు ఆస్పత్రులు నిరాకరిస్తుండటంతో రోగుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. -
మరణంలోనూ జీవించు !
గుంటూరు మెడికల్ : దానాలలో కెల్లా గొప్ప దానం ఏదంటే.. టక్కున అవయవదానం అనేమాట వినిపిస్తోంది. ఆధునిక వైద్యం అందించిన మహాదానం ఇది. మరణంలోనూ మానవత్వాన్ని పరిమళింప చేస్తోంది. సామాజిక స్పృహతో ఎన్నో నిండు ప్రాణాలను నిలబెడుతోంది. చనిపోయిన తర్వాత కూడా పది మంది గుర్తుంచుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. నేడు అవయవదానం దినోత్సవం సందర్భంగా సాక్షి కథనం. ఇది మరో జీవితం.. ప్రతిరోజూ గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 20మందికి పైగా వివిధ రకాల వ్యాధులతో, రోడ్డు ప్రమాదాల్లో గాయపడి చికిత్స పొందుతూ మరణిస్తున్నారు. ఆస్పత్రుల్లో, ఇళ్ల వద్ద మరణించిన వారి కుటుంబ సభ్యులను కలిసి కౌన్సిలింగ్ చేసి అవయవదానం చేయించటం ద్వారా ఎంతో మందికి ప్రాణదానం చేసి నూతన జీవితాన్ని ప్రసాదించవచ్చు. అవయవదానంపై ప్రజలకు అవగాహన లేకపోవటం, మూఢనమ్మకాలతో చనిపోయిన వారి భౌతిక కాయాన్ని దహనం, ఖననం చేస్తున్నారు. వాస్తవానికి చనిపోయిన వారి అవయవాలను దానం చేయడం వల్ల ఎంతో మంది బతుకుల్లో వెలుగులు నింపొచ్చు. మరణంలోనూ జీవించవచ్చు. 122 మంది అవయవదానం చేశారు.. గుండె, కిడ్నీలు, కళ్లు, లివర్, ఊపిరితిత్తులు, ప్యాంక్రియాసిస్ అవయాలను దానం చేయటం ద్వారా ఆపరేషన్లు చేసి బాధితులకు ప్రాణదానం చేయవచ్చు. ఇప్పటి వరకు 122 మంది అవయవాలను దానం చేసినట్లు జీవన్ధాన్ కార్యక్రమం సీఈఓ డాక్టర్ గాదె కృష్ణమూర్తి తెలిపారు. బ్రెయిన్డెడ్ అయిన దాతల నుండి కిడ్నీలు 218, లివర్లు 103, గుండెలు 38, ఊపిరితిత్తులు 34 సేకరించి ప్రాణాపాయస్థితిలో ఉన్నవారికి అమర్చి నూతన జీవితాన్ని ప్రసాదించినట్లు వెల్లడించారు. ఎంత సమయం పడుతుంది.. మానవ శరీరంలోని ఉపయోగపడే అవయవాలు బ్రెయిన్ డెడ్ కేసు నుంచి బయటకు తీసేందుకు ఐదు గంటల సమయం పడుతుంది. అవయవాలు సేకరించిన తర్వాత గుండె, లంగ్స్ను మూడు గంటల్లోగా అమర్చాలి. లివర్ను ఐదు నుంచి 8 గంటల లోపు, కిడ్నీలను 15 నుంచి 18 గంటల్లోపు అమర్చాలి. లేని పక్షంలో సేకరించిన అవయవాలు పనిచేయకుండా పోతాయి. కళ్లు చాలా కాలం వరకు స్టోర్ చేయవచ్చు. శరీరం నుంచి సేకరించిన అవయవభాగాలను ‘యూ డబ్ల్యూయూ సొల్యూషన్’ అనే చల్లని ద్రావకంలో ఉంచి ఐస్బాక్సుల్లో భద్రం చేసి అవయవాదనం కోసం ఎదురు చూస్తున్నవారికి అమర్చుతారు. గుంటూరు, విజయవాడల్లో కేంద్రాలు.. జీవన్ధాన్ పథకం రాష్ట్ర వ్యాప్తంగా 39 ఆస్పత్రుల్లో ఉంది. గుంటూరు జిల్లాలోని గుంటూరు జీజీహెచ్లో, గుంటూరు సిటీ హాస్పిటల్, వేదాంత హాస్పిటల్లో, అశ్విని హాస్పిటల్లో, రమేష్ మల్టీస్పెషాలిటి హాస్పిటల్లో, శ్రీలక్ష్మీ సూపర్స్పెషాలిటి, ఎన్ఆర్ఐ, మణిపాల్ ఆస్పత్రిలలో అందుబాటులో ఉంది. కృష్ణా జిల్లాలో ఆయుష్, ఆంధ్రాహాస్పిటల్, అరుణ్కిడ్నీ సెంటర్, సెంటిని, విజయ సూపర్స్పెషాలిటి, సన్రైజ్, స్వరూప్, కామినేని, మెట్రో సూపర్స్పెషాలిటి ఆస్పత్రుల్లో ఉంది. గుండె మార్పిడి ఆపరేషన్లు.. జీజీహెచ్లో సహృదయ హెల్త్, మెడికల్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ నిర్వాహకులు డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణగోఖలే ఆధ్వర్యంలో 2016 మే 20న తొలి గుండె మార్పిడి ఆపరేషన్ జరిగింది. గుంటూరుకు చెందిన డ్రైవర్ ఉప్పు ఏడుకొండలు అనే వ్యక్తికి గుండె మార్పిడి ఆపరేషన్ చేశారు. ఈ ఆపరేషన్తో జాతీయస్థాయిలో గుండెమార్పిడి ఆపరేషన్ చేసిన ఐదో ప్రభుత్వ ఆస్పత్రిగా గుంటూరు జీజీహెచ్ రికార్డు సృష్టించింది. అధికారికంగా 385 మంది ఎదురుచూపులు.. అనారోగ్యంతో అవయవాలు చెడిపోయి వారు ఆపరేషన్లు చేయించుకునేందుకు ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. అందుకోసం జీవన్ధాన్ అనే కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్ర విభజన అనంతరం విజయవాడ కేంద్రంగా 2015 నుంచి జీవన్ధాన్ తన కార్యక్రమాలను నిర్వహిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 509 మంది కిడ్నీ మార్పిడి ఆపరేషన్ల కోసం, 74 మంది లివర్ మార్పిడి ఆపరేషన్లు కోసం, 15 మంది గుండె మార్పిడి ఆపరేషన్లు కోసం, ఇద్దరు లంగ్స్ మార్పిడి ఆపరేషన్ల కోసం దరఖాస్తు చేసుకుని అవయవాల కోసం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఎదురు చూస్తున్నారు. సకాలంలో వీరికి అవయవాలు లభించకపోతే వీరు ప్రాణాలు కోల్పోతారు. ఆపరేషన్లుకు అయ్యే ఖర్చులు భరించలేక జీవన్ధాన్లో పేర్లు నమోదు చేయించుకోని కిడ్నీ బాధితులు, గుండెజబ్బు బాధితులు అధికంగానే ఉన్నట్లు సమాచారం. ఏ అవయవాలు దానం చేయవచ్చు మనిషి మరణానంతరం కళ్లు, గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీ, లివర్, జీర్ణ వ్యవస్థలోని ఫ్యాంక్రియాస్, ప్రేగులు దానం చేయవచ్చు. రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడి తలకు రక్త సరఫరా నిలిచిపోవడంతో బ్రెయిన్డెడ్గా నిర్ధారణ అయిన వారి నుండి మాత్రమే అవయవాలను సేకరిస్తారు. ఎలా రిజిస్టార్ కావాలి.. అవయవదానం చేయాలనుకునే వ్యక్తులు ముందస్తుగా తన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, తనకు తెలిసిన వాళ్లకు తాను అవయవదానం చేస్తున్నట్లు తెలపాలి. ఇలా తెలియజేయడం వల్ల సదరు వ్యక్తి మరణానంతరం అతని కోరిక మేరకు కుటుంబ సభ్యులు అవయవదానం చేసేందుకు వీలు కలుగుతుంది. ప్రభుత్వం జీవన్ధాన్ అనే పథకాన్ని 2014లో ప్రవేశపెట్టింది. దీని ద్వార బ్రెయిన్డెడ్ అయిన కేసుల నుంచి అవయవాల నుండి సేకరిస్తారు. ఠీఠీఠీ. ్జ్ఛ్ఛఠ్చిnఛ్చీn. జౌఠి. జీn వెబ్సైట్లో డోనర్లు తమ పేర్లు నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకున్నవారికి ప్రభుత్వం ఆర్గాన్ డోనార్ కార్డును అందజేస్తుంది. అవయవాలు కావాల్సి వస్తే.. అవయవమార్పిడి కోసం జీవన్ధాన్ వెబ్సైట్లో పేర్లు నమోదు చేయించుకోవాలి. నమోదు చేయించుకున్నవారికి సీరియల్ నంబర్ ఇస్తారు. ఎవరైనా అవయవదానం చేసేందుకు వెబ్సైట్కు సమాచారం ఇస్తే తక్షణమే సీరియల్ నంబర్ ప్రకారం ముందస్తు వరుసలో ఉన్నవారికి అవయవాలు అమర్చేలా చర్యలు తీసుకుంటారు. -
యానల్ ఫిషర్కు చికిత్స ఉందా?
నా వయసు 66 ఏళ్లు. మలవిసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి వస్తోంది. డాక్టర్ను సంప్రదిస్తే యానల్ ఫిషర్ అని చెప్పి ఆపరేషన్ చేయాలన్నారు. నాకు ఆపరేషన్ అంటే భయం. హోమియోలో ఆపరేషన్ లేకుండా దీనికి చికిత్స ఉందా? – డి. సాయిప్రతాప్, ఏలూరు మలద్వారం దగ్గర ఏర్పడే చీలికను ఫిషర్ అంటారు. మనం తీసుకునే ఆహారంలో పీచుపదార్థాల పాళ్లు తగ్గడం వల్ల మలబద్దకం వస్తుంది. దాంతో మలవిసర్జన సాఫీగా జరగదు. అలాంటి సమయంలో మలవిసర్జన కోసం విపరీతంగా ముక్కడం వల్ల మలద్వారం వద్ద పగుళ్లు ఏర్పడతాయి. ఇలా ఏర్పడే పగుళ్లను ఫిషర్ అంటారు. ఈ సమస్య ఉన్నప్పుడు మల విసర్జన సమయంలో నొప్పితో పాటు రక్తస్రావం జరుగుతుంది. ఇది వేసవికాలంలో ఎక్కువగా ఉంటుంది. మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవన విధానం వల్ల ఈ మధ్యకాలంలో ఇలాంటి సమస్యలు మరీ ఎక్కువగా కనిపిస్తున్నాయి. మలబద్దకం వల్ల రోగి ఎక్కువగా ముక్కాల్సి రావడంతో మలద్వారంతో పాటు దాని చుట్టుపక్కల ఉండే అవయవాలన్నీ తీవ్ర ఒత్తిడికి గురవుతాయి. క్రమేపీ అక్కడి ప్రాంతంలో కూడా వాపు రావడం, రక్తనాళాలు చిట్లడం మలంతో పాటు రక్తం పడటం జరుగుతుంది. ఫిషర్ సంవత్సరాల తరబడి బాధిస్తుంటుంది. ఆపరేషన్ చేయించుకున్నా మళ్లీ సమస్య తిరగబెట్టడం మామూలే. ఇది రోగులను మరింత ఆందోళనకు గురిచేస్తుంది. కారణాలు: దీర్ఘకాలిక మలబద్దకం – ఎక్కువ కాలం విరేచనాలు – వంశపారంపర్యం – అతిగా మద్యం తీసుకోవడం – ఫాస్ట్ఫుడ్స్, వేపుళ్లు ఎక్కువగా తినడం – మాంసాహారం తరచుగా తినడం వల్ల ఫిషర్ సమస్య వస్తుంది. లక్షణాలు: తీవ్రమైన నొప్పి, మంట – చురుకుగా ఉండలేరు – చిరాకు, కోపం – విరేచనంలో రక్తం పడుతుంటుంది – కొందరిలో మలవిసర్జన అనంతరం మరో రెండు గంటల పాటు నొప్పి, మంట. చికిత్స: ఫిషర్ సమస్యను నయం చేయడానికి హోమిమోలో మంచి చికిత్స అందుబాటులో ఉంది. వాటితో ఆపరేషన్ అవసరం లేకుండానే చాలావరకు నయం చేయవచ్చు. రోగి మానసిక, శారీరక తత్వాన్ని, ఆరోగ్య చరిత్ర వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని హోమియో మందులను అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడితే తప్పక మంచి ఫలితం ఉంటుంది. డాక్టర్ టి.కిరణ్ కుమార్, డైరెక్టర్, పాజిటివ్ హోమియోపతి, విజయవాడ, వైజాగ్ -
శభాష్ మధుసూదన్
చేవెళ్ల : మండలంలోని కందవాడ గ్రామానికి చెందిన శేరి బాల్రెడ్డికి చెందిన గేద శనివారం దూడకు జన్మనిచ్చింది. అయితే పుట్టిన దూడకు జన్యులోపం హెర్నియా (పుట్టుకతో వచ్చే లోపం) కారణంగా కడుపులో ఉండాల్సిన పేగులు బయటకు వచ్చాయి. దీంతో రైతు వెంటనే చేవెళ్లలోని పశువైద్యశాలలో ఉన్న వైద్యులు డాక్టర్ మధుసూధన్ వద్దకు తీసుకు వచ్చారు. దూడ పరిస్థితిని పరిశీలించిన వైద్యుడు మధుసుధన్ మాట్లాడుతూ... ఇది జన్యు సంబంధమైన లోపం కారణంగా బొడ్డు లోపల ఉండాల్సిన పేగులు బయటకు వచ్చాయన్నారు. దీంతో వెంటనే ఆయన దూడకు అపరేషన్ చేసి పేగులను కడుపులో పెట్టి కుట్లు వేశారు. ఆపరేషన్ తరువాత దూడ ఆరోగ్యంగానే ఉందని చెప్పారు. దూడను బతికించిన వైద్యునికి రైతు కృతజ్ఞతలు తెలిపారు. -
తల్లికి కడుపు కోత..!
మార్కాపురం : పుట్టబోయే బిడ్డ ఎలా ఉంటుందోనని ఆశతో ధర్మాస్పత్రికి వెళ్లిన మహిళకు కడపుకోత మిగులుతోంది. ప్రసవాన్ని సాధారణంగా కాకుండా సిజేరియన్ చేస్తూ కాసులు వసూలు చేస్తుండటంతో పేద మహిళలు తీవ్ర ఆవేదనలో మునిగిపోతున్నారు. ఇలాంటి బాధాకర ఘటనలు మార్కాపురం ఏరియా వైద్యశాలలో జరుగుతున్నా పర్యవేక్షించి చర్యలు తీసుకొనే అధికారులు కనిపించడంలేదు. సమర్థించుకుంటున్న వైద్యులుపండంటి బిడ్డను కనాలని నెలలు నిండి నొప్పులు రాగానే వైద్యశాలకు వెళ్తే సాధారణ కాన్పు చేయాల్సిన వైద్యులు కాసుల కోసం చేయి చాస్తున్నారు. ఇటీవల కాలంలో కాన్పుల కోసం వైద్యశాలకు వెళ్లిన వారంతా సిజేరియన్ ఆపరేషన్లు చేయించుకుని బయటకు వస్తున్నారు. నిబంధనలను పక్కన పెట్టి కొంత మంది వైద్యులు ఆపరేషన్లకు అందమైన భాష్యం చెబుతున్నారు. తల్లీబిడ్డల క్షేమం కోసమే తాము ఆపరేషన్లు చేస్తున్నామంటూ సమర్థించుకుంటున్నారు. పశ్చిమ ప్రకాశానికి ఏకైక వంద పడకల వైద్యశాల ఇక్కడే ఉంది. గిద్దలూరు నుంచి పుల్లలచెరువు వరకు ఉన్న 12 మండలాల నుంచి ప్రతి రోజూ కాన్పుల కోసం వస్తుంటారు. నిలిచిన నిధులు ఏరియా వైద్యశాలకు వెళ్తే ఉచితంగా ఆపరేషన్ చేయాలి. ఇందు కోసం ప్రభుత్వం జననీ సురక్షా యోజన పథకం కింద ఉదయం 9 నుంచి సాయంత్రం 4గంటల వరకు డ్యూటీలో ఉన్న డాక్టర్కు ఆపరేషన్లు చేసినందుకు వెయ్యి రూపాయలు చెల్లిస్తుంది. సాయంత్రం 4 నుంచి ఉదయం 9గంటల వరకు ఆపరేషన్లు చేసినట్లయితే రూ. 1500 చెల్లిస్తుంది. కాగా గత 4 నెలల నుంచి ప్రభుత్వ నిధులను నిలిపి వేసింది. దీనితో ఆపరేషన్లు చేసే డాక్టర్లకు ఫీజులు రావటం లేదు. సిజేరియన్కు నిబంధనలు ఇవే.. మొదటి కాన్పు అయితే నొప్పులు రాగానే వైద్యశాలలో 24 నుంచి 36 గంటల వరకు వేచి చూడాలి. రెండో కాన్పు అయితే 12 గంటల వరకు చూడవచ్చు. మూడో కాన్పు అయితే 6 గంటల వరకు వేచి చూడాలి. తల్లీబిడ్డ ఆరోగ్య పరిస్థితి విషమిస్తే సిజేరియన్ చేయవచ్చు. ఇప్పుడేం జరుగుతోంది? ఏరియా వైద్యశాలలో ఆపరేషన్లు చేసే విషయంలో మత్తు డాక్టర్ లేకపోవటంతో వేరే డాక్టర్ను తీసుకొస్తున్నారు. అయితే అతను ఎవరో కాదు.. వైద్యశాలలోనే మరో విభాగంలో పని చేసే డాక్టరే. తనకు సంబంధం లేని డ్యూటీ చేయాలంటే డబ్బులు ఇవ్వాలని రోగి బంధువుల నుంచి 2 నుంచి 3 వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. ఇక్కడికి చీరాల ఏరియా వైద్యశాలలో పనిచేస్తున్న డాక్టర్ వచ్చేందుకు ప్రయత్నిస్తున్నా పలువురు అడ్డుకుంటున్నట్లు తెలిసింది. సదరు డాక్టర్ ఈ ప్రాంతంకు చెందిన వ్యక్తే కావటంతో ఇక్కడ పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. మొత్తం మీద ఏరియా వైద్యశాలలో కాన్పు కావాలంటేæ మత్తు డాక్టర్, సర్జరీ చేసే డాక్టర్, వైద్య సిబ్బందికి కలిపి రూ. 5 నుంచి రూ. 6వేల వరకు వసూలు చేస్తున్నారు. ఆపరేషన్లు చేస్తే భవిష్యత్లో అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సాధారణ కాన్పు అయ్యే అవకాశం ఉన్నప్పటికీ ఇలా చేయడంపై అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాలుగు నెలల నుంచి ఏరియా వైద్యశాలలో సాధారణ కాన్పుల కంటే సర్జరీలే ఎక్కువగా జరిగాయి. అత్యవసరమైతేనే సర్జరీలు: మార్కాపురం ఏరియా వైద్యశాలకు కాన్పు కోసం వస్తే అత్యవసర పరిస్థితుల్లోనే సిజేరియన్ చేస్తున్నాం. తల్లీబిడ్డల్లో ఎవరికి ప్రమాదమైనా సిజేరియన్కు ప్రాధాన్యత ఇస్తాం. లేకపోతే మామూలు కాన్పులే చేస్తున్నాం. వైద్యశాలలో మత్తు డాక్టర్ లేకపోవటంతో బయటి నుంచి పిలిపిస్తున్నాం. మత్తు డాక్టర్ను నియమించాలని వైద్య విధాన పరిషత్ కమిషనర్ను, జిల్లా కో ఆర్డినేటర్ను కోరాం. -డాక్టర్ ఆంజనేయులు, ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్, -
బికినీ ఎయిర్లైన్స్ సేవలు ఇక ఢిల్లీకి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ బడ్జెట్ ఎయిర్లైన్ వియత్నాంకు చెందిన వియట్జెట్ ఢిల్లీనుంచి డైరెక్ట్ విమాన సర్వీసులను ప్రకటించింది. బికినీ ఎయిర్లైన్స్గా పేరు తెచ్చుకున్న వియట్ జెట్ ఢిల్లీ నుంచి వియత్నాంలోని హోచిమిన్ నగరానికి నడపనున్నట్లు ప్రకటించింది. ఇండియా-వియత్నాం దౌత్య సంబంధాల 45వ వార్షికోత్సవం సందర్భంగా వియత్నాం-ఇండియా బిజినెస్ ఫోరమ్లో ఈ విషయాన్ని ప్రకటించింది. ఆసియన్ ఏజ్ నివేదించిన ప్రకారం బికినీ ఎయిర్లైన్స్గా పేరొందిన వియట్జెట్ ఎయిర్లైన్స్ జులై- ఆగస్టు లో భారత్కు డైరెక్ట్ ఫ్లైట్స్ సేవలు అందించనున్నామని వెల్లడించింది. ఈ రెండు నగరాలమధ్య వారానికి నాలుగు సార్లు విమానాలను నిర్వహిస్తుంది. పైలట్లు, ఎయిర్హోస్టెస్లు సహా ఇతర క్యాబిన్ క్రూ అంతా బికినీ ధరించి సేవలు అందించడమే ఈ బికినీ ఎయిర్లైన్స్ ప్రత్యేకత. అలా బికినీ ఎయిర్లైన్స్గా ప్రఖ్యాతి పొందింది. 2007లో మహిళా బిలియనీర్ గుయేన్ థీ ఫుంగ్ థావో స్థాపించిన వైమానిక సంస్థ వియత్నాం దేశంలోనే రెండవ అత్యుత్తమ సేవలు అందిస్తున్న అతిపెద్ద సంస్థగా పాపులారిటీ సాధించింది. పైలట్లు, ఫ్లైట్ అటెండెంట్లతో బికినీలు ధరింపజేసి 2011లో ఈ సంస్థ చేసిన ప్రచారం అప్పట్లో వివాదాస్పదమైంది. అ క్కడి ప్రభుత్వంనుంచి జరిమాను కూడా ఎదుర్కొంది.అయితే కొన్ని ప్రత్యేక విమానాల్లో మాత్రమే ప్రయాణీకులను ఆకర్షించడానికి బికినీల్లో ఉన్నమహిళా సిబ్బందిని ఉపయోగిస్తుంది. అయితే ఇంత ప్రతికూల ప్రచారం ఉన్నప్పటికీ, ప్రారంభించినప్పటి నుంచీ సంస్థ పెరుగుదల గణనీయంగా ఉంది. తాజా త్రైమాసికంలో లాభాల్లో 75.9 శాతం వృద్ధిని నమోదు చేయడం విశేషం. దీనికి తోడు కంపెనీకి 55 ఏ320, ఏ321 విమానాల విమానాలను కలిగి ఉంది. దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో 385 విమానాలు నడుపుతోంది. -
వోకల్ నాడ్యూల్స్ అంటే ఏమిటి?
ఈఎన్టీ కౌన్సెలింగ్ నేను టీచర్ను. ఇంట్లో కూడా ట్యూషన్స్ చెబుతుంటాను. ఇటీవల నా గొంతు బొంగురుగా ఉంటే ఈఎన్టీ వైద్యులను సంప్రదించాను. ‘వోకల్ నాడ్యుల్స్’ వచ్చాయని అన్నారు. ఇవి ఎందుకు వస్తాయి. నాకు తగిన పరిష్కారం చెప్పండి. – శివకుమార్, ఖమ్మం వృత్తిపరంగా గొంతును అధికంగా ఉపయోగించే అత్యధికుల్లో వోకల్ నాడ్యూల్స్ సమస్య వస్తుంటుంది. ఇందులో స్వరపేటికలోని రెండు అర్ధభాగాలు కలిసే చోట కండ ఒక చిన్న గడ్డలా పెరుగుతుంది. ఇలా పెరిగిన వోకల్ నాడ్యూల్స్ వల్ల స్వరపేటికలోని రెండు అర్ధభాగాలూ పూర్తిగా మూసుకుపోవు. దాంతో స్వరంలో మార్పు వస్తుంది. సాంకేతికంగా చెప్పాలంటే మన మాటల్లో మునుపు ఉండే నాణ్యత (క్వాలిటీ ఆఫ్ వాయిస్) లోపిస్తుందన్నమాట. అంతేకాకుండా ఒక్కోసారి గొంతు బొంగురుపోయినట్లుగా ఉండటం, మాట్లాడే సమయంలో నొప్పి రావడం, మాట వస్తూ వస్తూ మధ్యలో ఆగిపోవడం వంటివీ జరగవచ్చు. మాటపూర్తిగా పెగలకుండా... లోగొంతుకతో వస్తున్నట్లుగా కూడా అనిపించవచ్చు. అంతేకాదు... స్వరపేటికలో స్వరతంత్రులు (వోకల్ కార్డ్స్) కూడా ఉంటాయి. వీటిలోనూ మళ్లీ ట్రూ కార్డ్స్, ఫాల్స్ కార్డ్స్ అనే రకాలుంటాయి. ఈ సమస్య ఉన్నవారిలో ట్రూ కార్డ్స్ అనేవి స్పందించినప్పుడు గొంతులో నొప్పి వస్తుంటుంది. అందువల్ల ఆ నొప్పిని అధిగమించడానికి వీళ్లు ఫాల్స్ కార్డ్స్ అనే తంత్రుల సహాయంతో మాట్లాడుతుంటారు. దాని వల్ల స్వరంలో మార్పు వస్తుందన్నమాట. మీరు ఈఎన్టీ నిపుణులను, స్పీచ్ థెరపిస్ట్లను కలవండి. మీ నాడ్యూల్స్ మరీ ఎక్కువ పరిమాణానికి పెరిగితే అవసరమైతే శస్త్రచికిత్స చేసి వాటిని తొలగించడం వల్ల మీకు ఉపశమనం కలుగుతుంది. హార్ట్ సర్జరీ తర్వాత మాట సరిగా రావడం లేదు నాకు ఇటీవలే ‘ఓపెన్ హార్ట్ సర్జరీ’ అయ్యింది. అప్పట్నుంచి మాట సరిగా రావడం లేదు. మాట్లాడబోతుంటే గాలిలాగా వస్తోంది. తినేప్పుడు, తాగేటప్పుడు, మిగడంలో ఇబ్బందిగా ఉంది. ఎప్పుడూ గొంతులో ఏదో అడ్డం పడ్డట్లుగా ఉంది. దగ్గు కూడా వస్తోంది. నాకు తగిన సలహా ఇవ్వండి. – సర్వేశ్వరరావు, అనకాపల్లి మీకు స్వరపేటికలోని ‘వోకల్ ఫోల్డ్’లో సమస్య ఉన్నట్లుగా అనిపిస్తోంది. గుండెకు సంబంధించిన ఆపరేషన్లు (ముఖ్యంగా ఓపెన్హార్ట్ సర్జరీ), ట్రకియాస్టమీ, మెడ, ఊపిరితిత్తులకు సంబంధించిన ఆపరేషన్లలో కొన్నిసార్లు ‘వోకల్ ఫోల్డ్’పై ఒత్తిడి పడటానికీ లేదా అవి చెడిపోవడానికి ఆస్కారం ఉంటుంది. దాంతో మింగడం, మాట్లాడటంలో సమస్యలు వస్తాయి. కొన్నిసార్లు వోకల్ఫోల్డ్ పెరాలసిస్ వచ్చేందుకూ అవకాశం ఉంది. మీ సమస్యను నిర్ధారణ చేయడానికి ముందుగా మీరు నిపుణులైన ఈఎన్టీ వైద్యులను సంప్రదించి ‘ల్యారింగోస్కోపీ లేదా ఎండోస్కోపీ’ వంటి పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. అంతేగాక స్పీచ్థెరపిస్ట్ను సంప్రదించి మింగడంలోని ఇబ్బందులు తొలగిపోడానికీ, గొంతురావడానికి అవసరమైన ఎక్సర్సైజ్లను తెలుసుకుని వాటిని ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. మాటిమాటికీ తలతిరుగుతోంది...! నా వయసు 47 ఏళ్లు. నాకు అప్పుడప్పుడూ కళ్లు తిరుగుతున్నాయి. కొన్ని సార్లు కింద కూడా పడిపోయాను. నాకు ఇతర ఆరోగ్య సమస్యలు ఏమీ లేవు. బీపీ, షుగర్ పరీక్షలు కూడా చేయించుకున్నాను. అన్నీ నార్మల్ అని రిపోర్టులు వచ్చాయి. అప్పుడప్పుడూ తల కూడా తిరుగుతూ ఉన్నట్లు, పడిపోబోతున్నట్లు అనిపించే ఈ సమస్యతో నాకు చాలా ఆందోళనగా ఉంది. నాకు తగిన సలహా, పరిష్కారం సూచించండి. – ఎన్. రమణమూర్తి, విజయవాడ మీరు చెప్పిన వివరాలు పరిశీలిస్తే మీరు ‘బినైన్ పొజిషనల్ వర్టిగో’ అనే సమస్యతో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. మన చెవిలోని లోపలి భాగంలో వినికిడి కోసం, బ్యాలెన్స్ను నియంత్రించేందుకు... రెండు వ్యవస్థలు ఉంటాయి. బ్యాలెన్స్ నియంత్రించే వ్యవస్థలను ‘వెస్టిబ్యులర్ వ్యవస్థ’ అంటారు. ఇందులో భాగాలలో ఓటోలిత్ అనే కణాలు, హెయిర్ సెల్స్, ఇతర భాగాలు ఉంటాయి. ఇవి మన బ్యాలెన్స్ను నియంత్రించేందుకు ఉపయోగపడతాయి. వాటిలోని లోపాల వల్ల బ్యాలెన్స్ వ్యవస్థలో లోపాలు రావడానికి అవకాశం ఉంది. మీరు మొదట నిపుణులైన ఈఎన్టీ వైద్యులను సంప్రదించి వినికిడి, బ్యాలెన్స్ వ్యవస్థకు సంబంధించిన, క్లినికల్ పరీక్షలు చేయించుకోండి. కళ్లు తిరగడంతో పాటు తలనొప్పి, వినికిడి లోపం, ఇతర సమస్యలు ఉన్నట్లయితే ఈఎన్టీ వైద్యుల సలహాపై న్యూరాలజిస్ట్ను కూడా సంప్రదించండి. అయితే ఈ సమస్య అంత ప్రమాదకరమైనది కాదు. కొన్ని రకాల వెస్టిబ్యుల్కు సంబంధించిన ఎక్సర్సైజులతో తగ్గిపోతుంది. అవసరాన్ని బట్టి కొన్ని మందులు వాడాల్సి ఉంది. – డాక్టర్ ఇ.సి. వినయ కుమార్, హెచ్ఓడి – ఈఎన్టి సర్జన్, అపోలో హాస్పిటల్స్, హైదరాబాద్ -
ఇండియాలో పేపాల్ సర్వీసులు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ గ్లోబల్ డిజిటల్ పేమెంట్స్ సంస్థ పేపాల్ బుధవారం భారతదేశంలో తన కార్యకలాపాలు ప్రకటించింది. గత దశాబ్ద కాలంగా అంతర్జాతీయ చెల్లింపులకు అందుబాటులో పేమెంట్ సంస్థ పే పాల్ ఇకపై భారతీయులు కూడాఅంతర్జాతీయంగా కూడా చెల్లింపులు చేయవచ్చని కంపెనీ ప్రకటింటింది. భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన వ్యాపారంగా ఉన్న ఆన్ లైన్ ద్వారా ఒకపై పే పాల్ ద్వారా ఒకనుగోళ్లు చేయవచ్చని పేపాల్ హోల్డింగ్స్ ఒకప్రకటనలో తెలిపింది. తద్వారా స్థానిక , ప్రపంచ చెల్లింపులను ప్రాసెస్ చేయగలరని తెలిపింది.భారతదేశంలో డిజిటల్ లావాదేవీలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో తాము ఈ సర్వీసులు అందించడం ద్వారా డిజిటల్ ఇండియాలో భాగస్వామ్యం కావడం గర్వంగా ఉందని పేపాల్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అనుపమ్ పాహుజా పేర్కొన్నారు. డిజిటల్ ఇండియా, వ్యాపార అవకాశాలు మెరుగుపర్చుకునే లక్ష్యంతో తమ మారథాన్ ఇపుడే మొదలైందని పేపాల్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో రోహన్ మహదేవన్ వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా పేపాల్ 218 మిలియన్ల మంది వినియోగదారులతో భారతీయ వినియోగదారుల ఏకీకరణ సాధ్యం మవుతుందున్నారు. అంటే ఇప్పటిదాకా క్రెడిట్ కార్డు చెల్లింపులను మాత్రమే అంగీకరించిన పేపాల్ ఇకపై భారతీయ డెబిట్ కార్డ్ చెల్లింపులకు అవకాశం కల్పిస్తుంది. ఇక సెక్యూరిటీ విషయానికి వస్తే...వినియోగదారుల ఫిర్యాదులు కేవలం 30 సెకన్లలో , పెద్ద సమస్య అయితే 5 నిమిషాల్లోనూ పరిష్కరిస్తామని పాహుజా తెలిపారు. అలాగే పే పాల్ ద్వారా ఆన్లైన్ షాపింగ్ చేసినపుడు... పేమెంట్ పూర్తియినా.. ఆవస్తువు డెలివరీ కాకపోతే ఆరె నెలలు(180 రోజులు) లోపల ఫిర్యాదు చేయాల్సి ఉంటుందన్నారు. అపుడు నిబంధనల మేరకు ఆ క్యాష్న రిఫండ్ చేస్తామన్నారు. అలాగే వస్తువులు కొనుగోలు చేసిన కస్టమర్లు సదరు నగదు చెల్లించకపోతే వ్యాపారుల ప్రయోజనార్థం ఆ బాధ్యతను కూడా పేపాల్ తీసుకుంటుందట. -
కడుపు చీల్చుతున్న నిర్లక్ష్యపు కత్తెర్లు
సాక్షి, అమరావతి: ఉన్న నాలుకకు మందేస్తే కొండనాలుక ఊడిపోయిన చందంగా.. జబ్బుతో ఆస్పత్రికి వస్తే నయం చేయాల్సిందిపోయి, కడుపులోని కణతులు తొలగించాల్సిన కత్తెర్లు, కత్తులను కడుపులోనే పెట్టేసి కుట్లేసేస్తున్నారు మన డాక్టర్లు కొందరు. మళ్లీ రోగి తీవ్ర ఇబ్బందికి గురవడం, స్కానింగ్ చేయించిన తర్వాత కత్తెర్లను గుర్తించి, తిరిగి సర్జరీ చేసేయాల్సిన పరిస్థితి నెలకొంటోంది. ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో ప్రభుత్వ పెద్దాస్పత్రుల్లోనే చోటుచేసుకుంటుండటంతో రోగులు సర్జరీ అంటే హడలెత్తిపోతున్నారు. ఆపరేషన్ థియేటర్లోకి వచ్చే ముందు సర్జికల్ సామగ్రి లెక్కించి ఆపరేషన్ పూర్తయ్యాక వాటిని సరిచూసుకోకపోవడం వల్లే ఇలాంటి ఉదంతాలు చోటుచేసుకుంటున్నాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఆపరేషన్ చేశాక సర్జికల్ పరికరాలన్నీ ఓసారి పరిశీలించుకుంటే తాజాగా నెల్లూరు ప్రభుత్వాస్పత్రిలో జరిగిన ఘటనల్లాంటివి పునరావృతం కావని చెబుతున్నారు. గుంటూరులోనూ ఇటీవల ఇలాంటి పరిణామమే చోటుచేసుకుంది. తేలిగ్గా తీసుకుంటున్న వైద్యులు సర్జరీ చేశాక కడుపులో కత్తెర్లు మరిచిపోయి కుట్టేసే ఉదంతాలు కొత్తేమీ కాదు. ఏడాదికి 30 నుంచి 40 ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కొందరు వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే పునరావృతం అవుతున్నాయని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్నిసార్లు కడుపులో కత్తులు మరచిపోయి కుట్లేశాక రెండేళ్లకో మూడేళ్లకో దుష్పరిణామాలు చోటు చేసుకుని తిరిగి మళ్లీ శస్త్రచికిత్స చేయించుకున్న ఘటనలూ ఉన్నాయని కాకినాడకు చెందిన ఓ వైద్యుడు చెప్పారు. కడుపులోనే కత్తెరలు, కత్తులు మరచిపోయి తిరిగి గుర్తించాక మళ్లీ ఆపరేషన్ చేసి తీయడం అనే విషయాన్ని వైద్యులు అత్యంత తేలిగ్గా తీసుకుంటున్నారు. శాఖాపరమైన చర్యలు తీసుకున్న దాఖలాలూ తక్కువగా ఉండటంతో పట్టింపు లేకుండా పోయింది. ఏడాదికి బోధనాసుపత్రుల్లోనే 11 బోధనాసుపత్రుల్లో 75 వేల వరకూ మేజర్ సర్జరీలు మరో 70 వేలు మైనర్ సర్జరీలు జరుగుతున్నాయి. ఇక్కడికొచ్చేదంతా పేద రోగులే. అసలే అతికష్టమ్మీద వైద్యం దక్కిందన్న ఆనందం ఇలాంటి ఘటన జరిగినప్పుడు వారికి దక్కడం లేదు. పొరపాటున జరిగిందే సాధారణంగా ఆపరేషన్ ముగిశాక ప్రతి డాక్టరూ, ఆపరేషన్లో ల్గొన్న స్టాఫ్నర్సులూ కౌంట్ చేసుకుంటారు. నెల్లూరులో జరిగిన ఘటన పొరపాటున జరిగిందే. ఇలాంటి ప్రభుత్వాస్పత్రులతోపాటు ప్రైవేటులోనూ అప్పుడప్పుడూ జరుగుతూంటాయి. ఇలా ఎవరో వైద్యులు కడుపులో కత్తెర్లు మరచిపోయిన ఘటనలో నేనే శస్త్రచికిత్స ద్వారా తీశాను. ప్రాణాపాయం ఉండకపోయినా ఇలాంటి ఘటనలు జరగకూడదు. రెండు గంటలు కష్టపడి చేసిన సర్జరీ ఇలాంటి చిన్న పొరపాటు వల్ల విఫలమవుతుంది. –డా.కె.బాబ్జీ, న్యూరో సర్జన్, వైద్య విద్యా సంచాలకులు (అకడమిక్) ఆపరేషన్ ప్రొటోకాల్స్ ఇలా.. ► ఆపరేషన్ చేయాలన్నప్పుడు ముందుగా రోగిని సిద్ధం చేస్తారు ► ఆపరేషన్కు గడువు విధించినప్పుడే సర్జన్తో పాటు స్టాఫ్ నర్సులు, టెక్నీషియన్లను నిర్ణయిస్తారు. ► అనస్థీషియా వైద్యుడిని ముందే నిర్ణయిస్తారు ► ఆపరేషన్ మొదలయ్యే సమయానికి స్టెరిలైజ్ (వేడినీటిలో శుద్ధి) చేసిన కత్తులు, కత్తెర్లు వంటివి సిద్ధం చేస్తారు ► రక్తస్రావాన్ని నియంత్రించే కాటన్ ప్యాడ్స్ (స్వాబ్స్)ను సిద్ధం చేస్తారు ► కత్తులు, కత్తెర్లు, ఫోర్సెప్స్, కాటన్ప్యాడ్స్ లాంటివన్నీ విధిగా ముందే లెక్కించి థియేటర్లోకి తీసుకురావాలి ► ఆపరేషన్ ముగియగానే కత్తులు, కత్తెర్లు, కాటన్ప్యాడ్స్ వంటివన్నీ స్టాఫ్నర్సు లెక్కిస్తారు ► అన్నీ లెక్కసరిపోయాక లెక్క సరిపోయాయి.. ఇక ముగించవచ్చని స్టాఫ్నర్సు చెబుతారు ► ఆ వెంటనే ఆపరేషన్ చేసిన భాగాన్ని కుట్లు వేసి మూసేస్తారు ► ఇవన్నీ విధిగా పాటించాలి.. వీటిలో ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా రోగికి ఇబ్బంది తప్పదు -
శంకర్దాదాలు!
కాసులకోసం కడుపుకోత అవసరం లేకపోయినా 22మందికి సిజేరియన్ కాన్పులు ఆరు తండాలు, రెండు గ్రామాల్లో 112మందికి అనవసరపు ఆపరేషన్లు ఒక్కో ఆపరేషన్కు రూ.25వేల నుంచి రూ.35వేల వరకు వసూలు కోయిలకొండలో ఓ ఆర్ఎంపీ ఆగడాలు గ్రామాల్లో ప్రభుత్వవైద్యంపై కొరవడిన అవగాహన కోయిల్కొండ మండలం చన్మన్పల్లితండాకు చెందిన రాధిక ధర్మాపూర్ పాఠశాలలో ఐదవ తరగతి చదువుతోంది. పాపకు కడుపునొప్పిరావడంతో పాఠశాలనుంచి తండాకు వచ్చింది. రాధికను ఆమె తాత అభంగపట్నం గ్రామంలోని ఖలీం అనే ఆర్ఎంపీ నడుపుతున్న దవాఖానాకు తీసుకెళ్లాడు. అక్కడ చూపిస్తే ఆపరేషన్ చేయించాలని, మహబూబ్నగర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి రెఫర్ చేశాడు. మరుసటి రోజు రాధికకు ఆపరేషన్ చేశారు. ఇంతకు రాధికకు కడుపునొప్పి ఎందుకు వచ్చిందో చెప్పింది లేదు. కేవలం డబ్బుల కోసం చిన్నారి కడుపును కోశారు. కోయిల్కొండ మండల పరిధిలోని ఆరు తండాలు, రెండు గ్రామాల్లో 112మందికి అనవసరపు ఆపరేషన్లు చేశారని తేలింది. అవి కూడా ప్రైవేటు ఆస్పత్రుల్లోనే. అంటే వీరు డబ్బుల కోసం ఎంతకైనా తెగిస్తారన్నది సుస్పష్టమవుతోంది. సాక్షి, మహబూబ్నగర్ పేదల ప్రజల అమాయకత్వం వారికి ఆసరా.. శస్త్రచికిత్సలు అవసరం లేకపోయినా కాసుల కోసం ఆపరేషన్లు చేసేస్తున్నారు. కమీషన్ వస్తుందంటే చాలు ఎంతకైనా సిద్ధపడుతున్నారు. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అనవసరపు ఆపరేషన్లు చేసి పేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కోయిల్కొండ మండలంలో కన్నతల్లులకు కడుపుకోతలు మిగుల్చుతున్న సంఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. కలెక్టర్ రొనాల్డ్రోస్ తనిఖీలతో అనేక విషయాలు బహిర్గతమయ్యాయి. మండలంలోని అభంగపట్నం గ్రామంలో ప్రైవేట్ క్లినిక్ నడుపుతున్నా ఖలీం అనే వ్యక్తి చిన్నచిన్న జబ్బులకు వైద్యంచేస్తూ నిర్లక్షరాస్యులు, పేదలను నమ్మించాడు. కొన్నిరోజుల తరువాత కడుపునొప్పితోపాటు ఇతర వ్యాధులు వచ్చినవారు ఖలీం వద్దకు వైద్యం కోసం వస్తే ‘మీకు ఆపరేషన్ చేయాలని లేకుంటే రోగం నయం కాదని’ చెప్పి జిల్లా కేంద్రంలోని కొన్ని డయాగ్నస్టిక్ సెంటర్లకు పంపించి పరీక్షలు చేయిస్తున్నాడు. గ్రామంలో ఎవరిని తట్టినా తమకు గర్భసంచి ఆపరేషన్ జరిగిందని, అపెండిసైటిస్ ఆపరేషన్లు జరిగాయని చెబుతుండడం ఖలీం వైద్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఒక్కో ఆపరేషన్కు రూ.25వేల నుంచి రూ.35వేల వరకు దండుకుని తనకిచ్చే కమీషన్ను తీసుకుంటున్నాడని పలువురు బాధితులు ఆరోపిస్తున్నారు. జిల్లాలో అధికారికంగా 20ఆర్ఎంపీల క్లీనిక్లు ఉండగా, అనధికారికంగా 150కిపైగా ఉంటాయి. కలెక్టర్ పర్యటనతో వెలుగులోకి.. ఈనెల 10న జాతీయ నులిపురుగుల నిర్మూలన ది నోత్సవాన్ని పురస్కరించుకుని మాత్రలు వేయిం చేందుకు కలెక్టర్ రొనాల్డ్రోస్ కోయిలకొండ మండలంలోని చన్మయిపల్లి గ్రామాన్ని సందర్శించారు. ఈ క్రమంలో రోడ్డుపై వెళ్తున్న కలెక్టర్కు ఇద్దరు బాలికలు కనిపించారు. బడికి వెళ్లకుండా బయటకు ఎందుకు వెళ్తున్నారని ఆయన ప్రశ్నించారు. దీంతో ఆ బాలికలు తమకు ఆపరేషన్ అయిందని చెప్పడంతో ఎవరు చేశారని.. ఏం ఆపరేషన్ అని కలెక్టర్ వారిని అడిగారు. దీంతో ఆర్ఎంపీ ఖలీల్ నిర్వాహకం వెలుగులోకి వచ్చింది. వెంటనే కలెక్టర్ రొనాల్డ్రోస్ అతడిపై విచారణ చేయాలని డీఎంహెచ్ఓకు ఆదేశాలు జారీచేశారు. ఆర్ఎంపీ వైద్యంపై కొరవడిన నిఘా గ్రామాల్లో విచ్చలవిడిగా వెలసిన ఆర్ఎంపీ క్లీనిక్లపై జిల్లా వైద్యాధికారులు దృష్టిసారించలేకపోతున్నారు. క్లీనిక్లకు వచ్చిన నిరుపేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్నా పట్టించుకున్న పాపానపోలేదు. ఆర్ఎంపీలు ప్రసవాలు, ఆపరేషన్లు, ఆబార్షన్లు చేస్తూ పేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కోయిల్కొండమండలంలోని అభంగపట్నంలో క్లీనిక్ సెంటర్ నిర్వహిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడి ఆపరేషన్లు చేయించిన ఆర్ఎంపీ ఖలీంపై కేసునమోదు చేసినట్లు కోయిల్కొండ ఎస్ఐ శ్రీకాంత్రెడ్డి తెలిపారు. పరారీలో అతడిని వెంటనే పట్టుకుని రిమాండ్కు తరలిస్తామన్నారు. విచ్చలవిడిగా ఆర్ఎంపీ కేంద్రాలు మహబూబ్నగర్ జిల్లా కోయిలకొండ, నారాయణపేట, కోస్గి, జడ్చర్ల, నవాబ్పేట, ధన్వాడ మండలాల్లో ఆర్ఎంపీల వైద్యం బాగా విస్తరించింది. ఇంజక్షన్లతో పాటు నెబ్యులైజర్, సెలైన్ బాటిళ్లు ఎక్కిస్తున్నారు. ప్రమాదంలో కాళ్లు, చేతులు విరిగినవారికి అత్యవసర సేవలు అందించేందుకు కూడా వెనుకాడడం లేదు. కొంతమంది ఫిజియోథెరపీలు ఎక్స్రే, ప్రిస్కిప్షన్లు రాస్తూ చికిత్స చేస్తున్నారు. ఇటీవల నారాయణపేటలోని ఓ ఆర్ఎంపీ వైద్యుడు చేసిన చికిత్సకారణంగా రోగి కాలు నడవలేని పరిస్థితి ఏర్పడింది. రోగి ప్రమాదకరస్థితిలో ఉండగానే సంబంధిత నకిలీ వైద్యులు ఆ ప్రమాదం నుంచి బయటపడటానికి ఆయా శాఖలో ఉండే ఉన్నతాధికారులకు భారీస్థాయిలో ముడుపులు ముట్టచెప్పుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 112 ఆపరేషన్ల గుర్తింపు కలెక్టర్ ఆదేశాల మేరకు మండలంలోని ఆరు తండాలు, రెండు గ్రామాల్లో జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి విచారణ చేయగా 112మందికి వివిధ రకాల ఆపరేషన్లు జరిగినట్లు తేలింది. వీటిలో గర్భసంచి తొలగించినవి 41, అపెండిసైటిస్ 22, సిజేరియన్లు 49 ఉన్నాయి. దీంట్లో ఖలీల్ అనే ఆర్ఎంపీ 22ఆపరేషన్లు చేయించినట్లు విచారణలో తెలింది. ఇదిలా ఉండగా, పేదల వైద్యానికి కోట్లాది రూపాయలు ఖర్చు అవుతున్నాయని లెక్కలు చూపిస్తున్న ప్రభుత్వం గ్రామీణులకు ప్రభుత్వం వైద్యంపై నమ్మకం కలిగించలేకపోతుంది. ఏ చిన్నజబ్బు వచ్చినా ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారే తప్ప ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లడం లేదు. కలెక్టర్ పర్యటనలో వెలుగులోకి వచ్చిన ఆపరేషన్లను పరిశీలిస్తే అన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో జరిగినవే కావడం గమనార్హం. -
శర్దా ఎనర్జీ అండ్ మినరల్స్ జోష్..
ముంబై: శర్దా ఎనర్జీ అండ్ మినరల్స్ బుధవారం నాటి మార్కెట్ లో దూసుకుపోతోంది. ఐరన్ వోర్ (ఇనుప ఖనిజం) మైనింగ్ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడంతో శర్దా ఎనర్జీ అండ్ మినరల్స్ కౌంటర్లో జోష్ పెరిగింది. మదుపర్ల కొనుగోళ్లతో శర్దా సుమారు 8 శాతం జంప్చేసింది. నిలిచి పోయిన ఇనుప ధాతువు వెలికితీత పనులు పునరుద్ధించినట్టు కంపెనీ బీఎస్సీ ఫైలింగ్ తో తెలిపింది. దీంతో ఇన్వెస్టర్ల కొనుగోళ్లు శర్దా వైపు మళ్లారు నక్సలైట్ల దాడి కారణంగా మార్చి 7న నిలిచిపోయిన మైనింగ్ కార్యకలాపాలు తిరిగి మొదలు పెట్టినట్టు తెలిపింది. అయితే శర్దా లో కార్యకలాపాలు పునఃప్రారంభంతో కౌంటర్లో కొనుగోళ్ల ధోరణి నెలకొందని మార్కెట్ విశ్లేషకుల అంచనా . -
కడుపులో దూదిని ఉంచి కుట్లేసిన డాక్టర్
-
‘గాంధీ’కి పోటెత్తుతున్న గర్భిణీలు..
పాలనా యంత్రాంగం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు గాంధీ ఆస్పత్రి : సుల్తాన్బజార్ ప్రసూతి ఆస్పత్రిలో ఆపరేషన్లు నిలిపివేసిన నేపధ్యంలో గాంధీ ఆస్పత్రికి గర్భిణీలు పోటెత్తుతున్నారు. వైద్యులు, సిబ్బందితో పాటు మంచాలు అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో గైనకాలజీ వార్డు, లేబర్ రూమ్ల్లో 160 మంచాలుండగా సుమారు 250 మందికి సర్ధుబాటు చేస్తున్నారు. సుల్తాన్బజార్ ప్రసూతి ఆస్పత్రిలో డెలివరీలు నిలిపివేయడంతో నిరుపేదలు గాంధీ దారిపట్టడంతో ఓపీకి వచ్చేవారి సంఖ్య అమాంతంగా 350కి పెరిగింది. బెడ్లు అందుబాటులో లేకపోవడంతో ఒకే మంచంపై ఇద్దరు ముగ్గురికి సర్దుబాటు చేస్తున్నారు. వార్డుల బయట మంచాలు ఏర్పాటు చేసి వైద్యసేవలు అందిస్తున్నారు. గైనకాలజీ విభాగానికి రద్ధీ పెరిగినందున రోగులకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టామని ఆస్పత్రి సూపరింటెండెంట్, గైనకాలజీ హెచ్ఓడీ ప్రొఫెసర్ జేవీరెడ్డి తెలిపారు. సుల్తాన్బజార్ ఆస్పత్రికి చెందిన వైద్యులు, సిబ్బంది ఇక్కడికే వచ్చి వైద్యసేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఐదు ఆపరేషన్ థియేటర్లను 24 గంటల పాటు అందుబాటులో ఉంచామన్నారు. -
ప్రభుత్వ ఆస్పత్రిల్లో ప్రసవాల సంఖ్య పెంచాలి
విధుల్లో నిర్లక్ష్యం వహించే డాక్టర్లపై చర్యలు కలెక్టర్ నీతూ ప్రసాద్ ముకరంపుర: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని కలెక్టర్ నీతూప్రసాద్ వైద్యులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశమందిరంలో క్లస్టర్ లెవల్ అధికారులు ఎస్పీహెచ్వోలతో జిల్లాస్థాయి మార్పు సమావేశం గురువారం నిర్వహించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలు, ఆపరేషన్ ప్రసవాలు దాదాపు సమాంతరంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. సాధారణ ప్రసవాలకే డాక్టర్లు ప్రాధాన్యమివ్వాలన్నారు. ఎక్కువ ఆపరేషన్ జరిగే ప్రై వేట్ నర్సింగ్హోమ్లకు షోకాజ్ నోటీసులివ్వాలని డీఎంహెచ్వోను ఆదేశించారు. గంభీరావుపేట, కాటారం, సుల్తానాబాద్, పెద్దపల్లి ఆస్పత్రులలో గతనెల ప్రసవాల సంఖ్య తక్కువగా ఉన్నాయని అసంతప్తి వ్యక్తంచేశారు. అన్ని పీహెచ్సీలలో డాక్టర్లు ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. విధులకు తరచుగా గైర్హాజరయ్యే వారిని తొలగించి కొత్తవారిని నియమించాలని సూచించారు. లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహించే ప్రై వేట్ ఆస్పత్రులపై నిఘా ఉంచి వారి లైసెన్సు రద్దు చేయాలని ఆదేశించారు. క్లస్టర్ లెవల్ సమావేశాలకు హాజరుకాని అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేసి ఒకరోజు వేతనాన్ని నిలుపుదల చేయాలని ఆదేశించారు. మాతాశిశుమరణాలను తగ్గించుటకు చర్యలు తీసుకోవాలన్నారు. అతిసారం, అంటువ్యాధులు రాకుండా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. గ్రామాల్లో డెంగీ జ్వరాలు సోకిన వారిని కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి పంపించాలన్నారు. ఏజేసీ నాగేంద్ర, డీఎంహెచ్వో రాజేశం పాల్గొన్నారు. -
ప్రభుత్వాస్పత్రుల్లో పెరిగిన ప్రసవాలు
థియేటర్ల ఏర్పాటుతో మెరుగైన సేవలు సత్ఫలితాలిస్తున్న జననీ సురక్ష యోజన పెరుగుతున్న ఆపరేషన్లు ఈ ఏడాది జిల్లాలో మొత్తం ప్రసవాలు 5561 ప్రసూతి ఆపరేషన్లు 2891 కరీంనగర్ హెల్త్ : జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసూతి ఆపరేషన్ల సంఖ్య పెరుగుతోంది. సాధారణ ప్రసవాలతో సమానంగా ఆపరేషన్ ప్రసవాలు జరుగుతున్నాయి. దాదాపు అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు చేస్తుండడంతో సాధారణ, ఆపరేషన్ ప్రసవాలు ఎక్కువగానే జరుగుతున్నాయి. ఆపరేషన్ థియేటర్ సౌకర్యం కల్పించడంతో ఆపరేషన్ల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మాతాశిశు మరణాలు తగ్గించేందుకు కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన జననీ సురక్ష యోజన ద్వారా వైద్య ఆరోగ్య శాఖ వైద్య సేవలు అందిస్తోంది. ఈ పథకం ద్వారా తల్లీశిశువును పూర్తి ఆరోగ్యంగా ఇంటికి చేర్చాలనే లక్ష్యంతో పనిచేస్తుండడం సత్ఫలితమిస్తోంది. ఆస్పత్రుల ఆధునీకీకరణతో.. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆధునీకీకరించడంతో మరింత సత్ఫలితాలు సాధించే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో ప్రసవాలతోపాటు ఆపరేషన్లు కూడా చేసేలా సౌకర్యాలు కల్పిస్తే శిశుమరణాలు కూడా తావులేకుండా ఉంటుంది. ప్రస్తుతం జిల్లా ప్రభుత్వ ప్రధానాస్పత్రితోపాటు వైద్య విధానపరిషత్ ఆధ్వర్యంలో నడిచే ఏరియా ఆస్పత్రులతోపాటు ఎనిమిది సీహె చ్సీల్లో మాత్రమే ఆపరేషన్లు జరుగుతున్నాయి. ఇతర పీహెచ్సీలు, సీహెచ్సీలు, అర్బన్ హెల్త్సెంటర్లలో సౌకర్యాలు లేవు. జిల్లాలో ప్రధానాస్పత్రితోపాటు గోదావరిఖని, సిరిసిల్ల, జగిత్యాలలో ఏరియా ఆస్పత్రులు ఉండగా.. డీపీహెచ్ ఆధ్వర్యంలో నడిచే హుజూరాబాద్, జమ్మికుంట, సుల్తానాబాద్, కోరుట్ల కమ్యూనిటీ హెల్త్సెంటర్లు, వైద్యవిధాన పరిషత్ ఆధ్వర్యంలో నడిచే మెట్పల్లి, మంథని, మహదేవపూర్, పెద్దపల్లి కమ్యూనిటీ హెల్త్సెంటర్లలో మాత్రమే ప్రసూతి ఆపరేషన్కు థియేటర్ సౌకర్యం ఉంది. జిల్లాలో మొత్తం 71ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉండగా 28 పీహెచ్సీలు 24 గంటలపాటు సేవలు అందిస్తున్నాయి. తాజాగా జిల్లాలోని అర్బన్ హెల్త్సెంటర్లతోపాటు అన్ని ప్రభుత్వ ఆరోగ్యకేంద్రాల్లో ప్రసవాలు నిర్వహించడానికి వీలుగా నిర్మాణాలు చేపట్టింది. 24 గంటల పీహెచ్సీల్లో లేబర్రూమ్తోపాటు ఆపరేషన్ థియేటర్ సౌకర్యం కల్పించి గైనకాలజిస్టును ఏర్పాటుచేస్తే మరింత మెరుగైన ప్రసూతి సేవలందే అవకాశాలున్నాయి. వీటిలో థియేటర్ ఏర్పాటుచేయడంతో ప్రస్తుతం ఉన్న ఆస్పత్రులపై భారం తగ్గి మాతాశిశు మరణాలు తగ్గుతాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. జిల్లాలో ప్రసూతి ఆపరేషన్లు జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో 2016–17 ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు మొత్తం ప్రసవాలు 5561 జరగగా, సాధారణ ప్రసవాలు 2,670, ఆపరేషన్ ప్రసవాలు 2,891 జరిగాయి. ఏప్రిల్లో 555 ఆపరేషన్లు, మేలో 526, జూన్లో 582, జూలైలో 581, ఆగస్టులో 647 ఆపరేషన్లు జరిగాయి. 2014–15లో 6856 ఆపరేషన్లు, 2015–16లో 7261 ఆపరేషన్లు జరిగాయి. ఏటా ఈ సంఖ్య సాధారణ ప్రసవాలకు దాదాపుగా సమానంగా ఉంటోంది. థియేటర్లు, గైనకాలజిస్టులను ఏర్పాటు చేస్తే ఆపరేషన్ ప్రసవాలు మరింత పెరుగుతాయి. -
అధునాతన పరిశోధనలతో శస్త్ర చికిత్సలు సులభతరం
అమలాపురం రూరల్ : ఎనస్తీషియా రంగంలో అధునాతన పరిశోధనలతో శస్త్ర చికిత్సలు సులభతరం కానున్నాయని ఇండియా ఎనస్తీషియా డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, అమలాపురం కిమ్స్ వైద్య కళాశాల డీన్ డాక్టర్ ఏఎస్ కామేశ్వరరావు తెలిపారు. గత నెల 25 నుంచి 28వ తేదీ వరకూ చైనా దేశం ఘాంజూలో జరిగిన 16 దేశాల ఎనస్తీషియా డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుల అంతర్జాతీయ సదస్సులో డాక్టర్ కామేశ్వరరావు పాల్గొన్నారు. అనంతరం ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ రెండో తేదీ వరకూ హాంకాంగ్లో జరిగిన ప్రపంచ మత్తు వైద్యుల సదస్సుకు ఆయన హాజరయ్యారు. ఈ రెండు సదస్సుల్లో కూడా డాక్టర్ కామేశ్వరరావు మత్తుపై వస్తున్న ఆధునిక పరిశోధనలు, ప్రక్రియలపై ప్రసంగించారు. క్యాన్సర్ నొప్పిపై విశ్లేషాత్మక ఉపన్యాసం చేశారు. ఈ రెండు అంతర్జాతీయ సదుస్సుల్లో పాల్గొని తిరిగి వచ్చిన డాక్టర్ కామేశ్వరరావు స్థానిక కిమ్స్ వైద్య కళాశాలలో బుధవారం సాయంత్రం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. చైనాలో జరిగిన మత్తు వైద్యుల సదస్సులో 16 దేశాల అసోసియేషన్ల అధ్యక్షులు పాల్గొంటే మన దేశం తరఫున తాను పాల్గొన్నానని ఆయన చెప్పారు. హాంకాంగ్లో జరిగిన ప్రపంచ మత్తు వైద్యుల సదస్సులో మన దేశం నుంచి వంద మంది వైద్యులు పాల్గొన్నారని చెప్పారు. ఈ సదస్సులోనే తాను ఇంటర్నేషనల్ ఎనస్తీషియా ఎడ్యుకేషన్ కమిటీ సభ్యునిగా ఎన్నికయ్యానని తెలిపారు. ఆసియా దేశాల నుంచి ఈ కమిటీకి తానొక్కడినే సభ్యుడిగా ఎన్నికయ్యానని వివరించారు. ఇండియా ఎనస్తీషియా డాక్టర్స్ అసోసియేషన్లో 23 వేల మంది డాక్టర్లు సభ్యులుగా ఉన్నారని డాక్టర్ కామేశ్వరరావు తెలిపారు. డాక్టర్ కామేశ్వరరావును కిమ్స్ చైర్మన్ చైతన్యరాజు, ఎండీ, ఎమ్మెల్సీ రవికిరణ్వర్మ అభినందించారు. -
18 మందికి ఉచిత కంటి ఆపరేషన్లు
మిర్యాలగూడ అర్బన్ : అజయ్జ్యోతి ఉచిత గ్రామీణ కంటి వైద్యశాల, అన్నపూర్ణ నేత్రాలయం డాక్టర్ ఆళ్ల రామశేషయ్య ఆధ్వర్యంలో బుదవారం పట్టణంలో 18 మందికి ఉచితంగా కంటి ఆపరేషన్లు నిర్వహించారు. 36మంది రోగులను పరిక్షించిన అనంతరం 18 మందికి ఆపరేషన్ అవసరాన్ని గుర్తించి ఆపరేషన్లను నిర్వహించారు. అనంతరం రోగులందరికీ దుస్తులు, పండ్లు, కంటి అద్దాలు, మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సిబ్బంది రెడ్యానాయక్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
స్నాప్డీల్లో ఉద్యోగాల కోత?
బెంగళూరు : ఆన్లైన్ మార్కెట్ సంస్థ స్నాప్డీల్ బెంగళూరు, ముంబై, కోల్కతా, హైదరాబాద్ లాంటి ప్రాంతీయ కార్యాలయాల్లో తన కార్యకలాపాలను తగ్గించుకోనుంది. కంపెనీ కొత్తగా ఫండ్స్ను పెంచుకోలేని పరిస్థితుల్లో వచ్చే ఆరునెలల్లో కొన్ని ఆఫీసులను మూసేస్తుందని స్నాప్ డీల్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఇప్పటికే బెంగళూరులోని అకౌంట్స్ అండ్ వెండర్ మేనేజ్ మెంట్ కు చెందిన టీమ్ ను 85 నుంచి 45 మందికి తగ్గించింది. ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన పనితీరు మెరుగుదల ప్రణాళిక కింద 200 మంది ఉద్యోగులకు నోటీసులు జారీచేసింది. అయితే కంపెనీ డిమాండ్లను చేరుకోవడం చాలా కష్టమని చాలామంది ఉద్యోగులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. తమతో రాజీనామా చేయించొద్దని కొంతమంది ఉద్యోగులు ఢిల్లీకి వెళ్లి మరీ కంపెనీ అధినేతలతో చర్చించారు. ఫ్లిప్ కార్ట్, అమెజాన్ లాంటి పెద్ద ఈ-కామర్స్ దిగ్గజాలతో స్నాప్డీల్కు తీవ్ర పోటీ నెలకొంటోంది. ఈ పోటీని తట్టుకోలేక కంపెనీ కొన్ని ప్రాంతీయ ఆఫీసులను మూసివేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం స్నాప్ డీల్ యాడ్ బిజినెస్ ల వైపు దృష్టిసారిస్తుందని అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. రీజనల్ ఆఫీసుల తగ్గింపుపై స్నాప్ డీల్ ఇంకా అధికారిక ప్రకటన ఏమీ చేయలేదు. రాజధాని ప్రాంత టీమ్ సభ్యులను తమ గుర్గావ్ క్యాంపస్కు తరలిస్తున్నట్టు పేర్కొంది. దీంతో లీజుకు తీసుకున్న చిన్న చిన్న కార్యాలయాలు తగ్గించుకోవచ్చని తెలిపింది. ఎవరైనా ఉద్యోగులు కంపెనీ నుంచి వెళ్లదలుచుకుంటే, ఎంప్లాయిమెంట్ కాంట్రాక్టు ప్రకారం అన్ని చెల్లింపులను అందుకోవాలని ఓ ప్రకటన విడుదల చేసింది. -
మైనింగ్ గనిలో చరియలు విరిగిపడి..
యాంగన్: గనుల్లో పనికి వెళ్లి ల్యాండ్ స్లైడింగ్ వల్ల 11 మంది మృతి చెందిన ఘటన ఉత్తర మయన్మార్ లో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. ఇప్పటివరకు 11 మృతదేహలను బయటకు తీసిన అధికారులు శిథిలాల కింద ఎక్కువ మంది ఉండొచ్చనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటిలానే జేడ్ మైనింగ్ రీజియన్లో తవ్వకాలు ప్రారంభించేందుకు కూలీలందరూ చేరుకున్నారు. పని ప్రారంభించిన కొద్ది సేపటికి మైనింగ్ చేస్తున్న కొండ చరియలు విరిగిపడటంతో వారంతా ఆచూకీ లేకుండా పోయారు. వెంటనే స్పందించిన అధికారులు హూటా హుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. క్రేన్ ల సాయంతో చరియలను పక్కకు తీస్తున్న అధికారులు ఇప్పటివరకు 11 మృతదేహాలను వెలికి తీశారు. ఇంకా 50 మందికిపైగా మృతులు ఉండే అవకాశాలు ఉన్నాయని వివరించారు. -
అమ్మతనానికి అడ్డు‘కోత’
నకిరేకల్ పట్టణానికి చెందిన ప్రసన్న గత నెల 26వ తేదీన ప్రసవం కోసం స్థానిక ఏరియాస్పత్రికి వెళ్లింది. ఆమెను పరీక్షించిన వైద్యులు ఆస్పత్రిలో చేర్చుకున్నారు. తీరా అక్కడ పనిచేస్తున్న ఓ ప్రైవేట్ క్లినిక్ మధ్యవర్తి కడుపులో బిడ్డ అడ్డం తిరిగిందని..ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లమని సలహా ఇచ్చినట్లు తెలిసింది. ఆమె సూచించిన ఆస్పత్రికి వెళ్లగా.. అవసరం లేకున్నా ప్రసన్నకు సిజేరియన్ చేశారు. రూ.21 వేల బిల్లు చేతికిచ్చారు. * అవసరం లేకున్నా ఆపరేషన్లు * ఏటా ఏడు వేలకుపైగా సిజేరియన్లు * పెరుగుతున్న మాత,శిశు మరణాలు * ప్రైవేట్ ఆస్పత్రులకు కాసుల వర్షం సూర్యాపేట : జిల్లాలోని దాదాపు 90 శాతం ప్రభుత్వాస్పత్రులు, 24 గంటల పీహెచ్సీలు, కమ్యూనిటీహెల్త్ సెంటర్లలో ఇదే పరిస్థితి. గర్భిణులకు శస్త్ర చికిత్సల పేరిట కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్నాయి. ప్రభుత్వపరంగా అందజేయాల్సిన ‘జాతీయ ఆరోగ్య గ్రామీణ మిషన్’లో వైద్య సేవలు అంతంత మాత్రంగా ఉండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో గర్భిణులు ప్రైవేటు వైద్యసేవల్ని ఆశ్రయించాల్సి వస్తోంది. మాత, శిశు మరణాలను తగ్గించడానికి ఏటా రూ.కోట్లలో నిధులు విడదలవుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలకు చైతన్యం కల్పించి ప్రభుత్వ ఆస్పత్రులకు రప్పించడంలో యంత్రాంగం విఫలమవుతోంది. దీనిని ఆసరాగా చేసుకుని కొన్ని ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు గర్భిణుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఎలాంటి అవసరం లేకున్నా సిజేరియన్ ఆపరేషన్లు చేసి అమ్మతనాన్ని తెలిపే పురిటినొప్పులను చెరిపేస్తున్నారు. ధరలు ఏవీ..? ప్రైవేట్ ఆస్పత్రులపై జిల్లా యంత్రాంగం పర్యవేక్షణ లేకపోవడంతో పరిస్థితి ఇష్టానుసారంగా తయారైంది. రక్తం గ్రూపు తెలుసుకోవడం నుంచి పెద్దస్థాయి శస్త్ర చికిత్సల వరకు ఏయే సేవలకు ఎంత రుసుం చెల్లించాలనే వివరాలు జిల్లాలో ఏ ఒక్క ప్రైవేట్ ఆస్పత్రిలో కన్పించడం లేదు. ఫలితంగా కాసులకు కక్కుర్తి పడి కాన్పుల కోసం వచ్చే గర్భిణులకు సిజేరియన్లు చేయడానికే కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు వెలిశాయంటే జిల్లాలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కొన్ని చోట్ల అనుభవం లేని వైద్యులు ఆపరేషన్లు చేస్తుండడంతో అవి వికటించి మాత,శిశు మరణాలు సైతం పెరుగుతున్నాయి. జిల్లాలో ప్రైవేట్ ఆస్పత్రులు ఎటా సగటున 7500 మంది స్త్రీలకు సిజేరియన్ ఆపరేషన్లు చేస్తున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సగటున ఏడాదికి 3 వేల సిజేరియన్లు జరుగుతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రులకు పోటీగా రెట్టింపు సంఖ్యలో ప్రైవేట్ ఆస్పత్రుల్లో సిజేరియన్లు చేయడం విస్మయానికి గురిచేస్తోంది. చివ్వెంల మండలం పాశ్చ్యానాయక్తండాకు చెందిన బుజ్జికి నెలలు పూర్తిగా నిండడంతో స్థానిక పీహెచ్సీకి కాన్పుకోసం వెళ్లింది. పరిస్థితి విషమించిందని, ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని అక్కడి సిబ్బంది సూచించారు. ఆటోలో వెళ్తుండగానే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. -
వైద్యం రాక చంపుతున్నారు.. జాగ్రత్త!
ముంబయి: రోగుల జబ్బుల ప్రకారం వైద్యం అందించడంలో పొరపాట్లు దొర్లుతుండటం వల్లే ఎక్కువ ప్రాణాలుపోతున్నాయని, ఇప్పుడిది అమెరికాలో అతిపెద్ద మూడో సమస్యగా పరిణమించిందని ఓ అధ్యయనం వెల్లడించింది. మితిమీరిన్ డోస్ ఇవ్వడం, సరైన రక్షణ చర్యలు తీసుకోకపోవడం, నైపుణ్యం లేని నర్సులను ఉపయోగించడం.. రెండో దశలో చేయాల్సిన వైద్య భారం సీనియర్స్ పేరిట నర్సులపై వేయడం వంటి కారణాల వల్ల రోగుల ప్రాణాలు హరీమంటూ గాల్లో తేలిపోతున్నాయంటూ ఆ అధ్యయనం పేర్కొంది. దీనిపై ప్రజల్లో కనీస అవగాహన లేకుంటే పరిస్థితి ప్రమాద కరంగా ఉంటుందని ఆ అధ్యయనం వెల్లడించింది. బ్రిటిష్ మెడికల్ జర్నల్(బీఎంజే)లో ఈ అధ్యయనం వివరాలను జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయానికి చెందిన బృందం వెల్లడించింది. అయితే, ఇండియాలో ఇలాంటి అధ్యయనం ఇప్పటి వరకు జరగలేదని కానీ 2013లో హార్వార్డ్ యూనివర్సిటీ వేసిన అంఛనా ప్రకారం ప్రతి ఏడాది 52లక్షల మంది వైద్యపరమైన తప్పులు చేయడం మూలంగానే గాయపడుతున్నారని, అవగాహన లేని చర్యల కారణంగా దెబ్బతింటున్నారని తెలిపింది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా మెడికల్ ఎర్రర్స్తో గాయపడుతున్న వారు 430లక్షల మంది ఉన్నారని అని కూడా అధ్యయనం తెలిపింది. అమెరికాలో ప్రతి ఏడాది 6.11లక్షలమంది గుండెపోటు, 5.85లక్షలమంది క్యాన్సర్ కారణంగా మృత్యువాత పడుతుండగా ఒక్క మెడికల్ ఎర్రర్స్ కారణంగా దాదాపు 2.51 లక్షలమంది చనిపోతున్నారని, ఇది అతిపెద్ద మూడో సమస్య అని ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆ అధ్యయనం హెచ్చరించింది. -
పంజాబ్లో మళ్లీ కలకలం!
-
పఠాన్కోట్ దాడికి పాకిస్థాన్లోనే పథక రచన..!
-
జీజీహెచ్లో జీవన్దాన్ కమిటీ పర్యటన
- గుండె, కిడ్నీ మార్పిడి ఆపరేషన్లకు త్వరలో అనుమతిస్తాం - మీడియాతో డాక్టర్ రవిరాజు గుంటూరు మెడికల్: గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో గుండె, కిడ్నీలు మార్పిడి ఆపరేషన్లు చేసేందుకు అనుమతి ఇచ్చేందుకు జీవన్దాన్ కమిటీ శుక్రవారం ఆస్పత్రిలో పర్యటించింది. జీవన్దాన్ కమిటీ చైర్మన్, డాక్టర్ ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ డాక్టర్ టి.రవిరాజు ఆధ్వర్యంలో వైద్య బృందం ఆసుపత్రిని పరిశీలించారు. స్పెషాలిటీ వైద్యులు ఆపరేషన్లు చేసేందుకు నిబంధనల మేరకు సరిపడా ఉన్నారా, లేరా, వారు ఎప్పటి నుంచి ఆసుపత్రిలో పనిచేస్తున్నారు తదితర విషయాలను వైద్యులను పిలిపించి విచారించారు. ఆపరేషన్ థియేటర్లు, వ్యాధి నిర్ధారణ పరీక్షా కేంద్రాలు నిబంధనల మేరకు ఉన్నాయా లేవా, రోగులకు వైద్య సౌకర్యాలు ఏ మాత్రం ఉన్నాయనే విషయాలను అధ్యయనం చేశారు. అనంతరం డాక్టర్ రవిరాజు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయాక గత జనవరిలో ఆంధ్రప్రదేశ్కు నూతనంగా జీవన్దాన్ పథకాన్ని ప్రారంభించారన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కేవలం విశాఖపట్నంలో మాత్రమే ఒక హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిందని, జీజీహెచ్లో అనుమతులు మంజూరు చేశాక రెండో హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ జరుగుతుందన్నారు. గుండె, కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేసేందుకు గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో వసతులను పరిశీలించామన్నారు. త్వరలోనే అనుమతులు మంజూరు చేస్తామని వెల్లడించారు. మేము సిద్ధం : జీజీహెచ్ సూపరింటెండెంట్ జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ తన్నీరు వేణుగోపాలరావు మాట్లాడుతూ జీజీహెచ్లో నిపుణులైన వైద్యులు ఉన్నారని, అంకిత భావంతో పనిచేసే సిబ్బంది ఉన్నారని, ఆధునిక వైద్య పరికరాలు ఉన్నాయని, పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామన్నారు. సమావేశంలో విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఉప్పలపాటి సూర్యకుమారి, ఆయుష్ హాస్పటల్కు చెందిన కార్డియాలజిస్ట్ డాక్టర్ గోపాలకృష్ణ, జీవన్దాన్ పథకం చీఫ్ కో ఆర్డినేటర్ డాక్టర్ గాదె కృష్ణమూర్తి, న్యూరాలజీ ప్రొఫెసర్ డాక్టర్ రామకృష్ణారావు, వివిధ విభాగాల వైద్యులు పాల్గొన్నారు. డాక్టర్ గోఖలేకు అభినందనలు గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో ఓపెన్ హార్ట్ సర్జరీలు పీపీపీ పద్ధతిలో నిర్వహిస్తున్న డాక్టర్ ఆళ్ళ గోపాలకృష్ణ గోఖలేను ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్చాన్సలర్ డాక్టర్ రవిరాజు అభినందించారు. దేశంలోనే గుండెమార్పిడి ఆపరేషన్లు చేసిన మొట్టమొదటి వ్యక్తి జీజీహెచ్లో పేదరోగులకు వైద్య సేవలు అందించేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. -
కాసుల కోసం కోతలు
ప్రైవేటు ఆసుపత్రుల్లో పెరుగుతున్న సిజేరియన్లు ప్రసూతి వైద్యంలో యాభై శాతానికి మించి శస్త్ర చికిత్సలు తణుకు: కాసుల ముందు తల్లీబిడ్డల ఆరోగ్యం బలాదూర్ అవుతోంది. ప్రతి వంద ప్రసవాల్లో సిజేరియన్లు (అపరేషన్ చేసి బిడ్డను బయటకు తీయడం) 10 నుంచి 15 శాతం మించకూడదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) చెబుతోంది. జిల్లాలో మాత్రం ఇది 50 శాతం దాటుతోంది. ఇలా చేయడం వల్ల తలెత్తుతున్న దుష్పలితా లను ఎవరూ గుర్తించడం లేదు. కేవలం కాసుల కోసమే సుఖ ప్రసవాలు జరిగే కేసుల్లోనూ వైద్యులు గర్భిణుల ఉదరాన్ని కోసి.. బలవంతంగా బిడ్డను బయటకు తీసి ఆనక కోసిన చోట్ల కుట్లు వేస్తున్నారు. తద్వారా అందినకాడికి దోచుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. యాభై శాతం సిజేరియన్లే.. ప్రస్తుతం సాధారణ ప్రసవం అనేది ఆరుదైన విషయంగా మారిపోయింది. కడుపుకోత పెడితే గానీ బిడ్డ బాహ్య ప్రపంచంలోకి అడుగు పెట్టడం లేదు. జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రులతోపాటు ప్రభుత్వాసుపత్రుల్లో సైతం ప్రతి వంద ప్రసవాల్లో కనీసం యాభై కాన్పులు సిజేరియన్లే అవుతున్నాయి. అవసరం ఉన్నా లేకున్నా కాసుల కోసం కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు కోతలను తప్పనిసరి చేస్తున్నాయి. ఐదేళ్ల నుంచి ఈ మార్పు వేగంగా చోటు చేసుకుంటోంది. జిల్లాలోని దాదాపు 250 వరకు ప్రైవేటు ప్రసూతి నర్సింగ్ హోమ్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉంటే సరాసరి కనీసం రోజుకు ఒక్కో ఆసుపత్రిలో 10 నుంచి 12 మంది శిశువులు జన్మిస్తున్నారు. సహజ ప్రసవాలకు పెద్దపీట వేయాల్సిన వైద్యులు సమయం ఆదా కోసం కూడా సిజేరియన్లు వైపు మొగ్గు చూపుతున్నారు. మరోవైపు మంచి ముహూర్తం పేరిట గర్భిణి బంధువుల ఒత్తిళ్లు సైతం దీనికి కారణమవుతోంది. వైద్యులు చెబుతున్న కారణాలివీ కాన్పు సమయంలో తల్లీబిడ్డల ప్రాణాలకు ప్రమాదం ఉం దని తెలిస్తే (హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులు) సిజేరియన్ తప్పనిసరి అవుతోందని వైద్యులు చెబుతున్నారు. ఎక్కువ మంది గర్భిణులు పరిస్థితి విషమించే సమయంలోనే నర్సింగ్ హోమ్లకు వస్తుంటారని.. అంతకుముందు చిన్నస్థాయి ఆసుపత్రుల కు వెళుతుంటారని పేర్కొంటున్నారు. అక్కడ చేతులెత్తేస్తే హడావుడిగా పెద్దాసుపత్రులకు తీసుకువస్తారని చెబుతున్నారు. ఈ సమయంలో సహజ ప్రసవం కోసం వేచి చూసే పరిస్థితి ఉండదంటున్నారు. ఇదిలావుంటే సిజేరియన్ అయితే వారం పది రోజులు ఆసుపత్రిలోనే ఉండాలి. ఈ పరిస్థితుల్లోనూ కొందరు వైద్యులు సిజేరియన్ చేసిన రెండు రోజులకే బాలింతలను ఇళ్లకు పంపేస్తున్నారు. శస్త్రచికిత్స గాయం మానకుండానే ఇంటికి పంపించేస్తుండటంతో ఒక్కోసారి ప్రాణం మీదకు వస్తోందని రోగులు చెబుతున్నారు. వైద్య, ఆరోగ్య శాఖ దృష్టి సిజేరియన్లపై జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ దృష్టి సారించిం ది. సిజేరియన్లు తగ్గించాలని నర్సింగ్ హోమ్లు, ప్రభుత్వాసుపత్రి వైద్యులకు ఆదేశాలు జారీ చేసింది. సిజేరియన్ల వల్ల దుష్ఫలితాలు సాధారణ ప్రసవమైనప్పుడు ఆ తల్లి మాతృత్వ అనుభూతి పొందగలుగుతుంది. ఆ అనుభూతి విలువ కట్టలేనంత గొప్పది. శస్త్రచికిత్స సమయంలో మత్తు ఇవ్వడం, ఇతరత్రా మందుల వల్ల కాన్పు అనంతరం దుష్పరిమాణాలు తలెత్తే ప్రమాదం ఉంది. మొదటి కాన్పులో శస చికిత్స చేస్తే రెండో కాన్పులోనూ చేయాలి. శస్త్రచికిత్స చేయించుకున్న వారు కనీసం వారం నుంచి 10 రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉండాలి. సిజేరియన్ కారణంగా బిడ్డలో ఊబకాయం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటా యి. 20 శాతం కేసుల్లో బిడ్డకు మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువ. అంతేకాకుండా పుట్టిన బిడ్డకు వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. తల్లి నుంచి హార్మోన్లు సహజ సిద్ధంగా అందవు. అందువల్ల ప్రసవ సమయంలో శస్త్ర చికిత్స చేయించుకోవడం మంచిది కాదు. - ఎం.వీరాస్వామి, సివిల్ సర్జన్, తణుకు సిజేరియన్లు తగ్గించాలని కోరాం ప్రైవేటు నర్సింగ్ హోమ్లలో సిజేరియన్లు ఎక్కువగా చేస్తున్నారనే ఆరోపణలు వినబడుతున్నాయి. దీనిపై ఎప్పటికప్పుడు సంబంధిత వైద్యులను హెచ్చరిస్తూ వస్తున్నాం. సిజేరియన్లు, సుఖప్రసవాల నిష్పత్తిని సేకరించి ఉన్నతాధికారులకు నివేదించాం. - కేవీ శివనాగేంద్రరావు, డెప్యూటీ డీఎంహెచ్వో, తణుకు. -
కో ఆపరేషన్ కరువు
వనపర్తి ఆస్పత్రిలో ప్రసవ వేదన ‘ నేను ఎంతో ఉదారంగా.. సేవా ధృక్పథంతో ఆపరేషన్లు చేద్దామని ముందుకొచ్చాను. కానీ, ఇక్కడ ఎవరూ సహకరించడం లేదు. అటెండర్ నుంచి నర్సు వరకు ఇదే పరిస్థితి. ఆపరేషన్లు చేయించుకునే వారున్నా.. చేసేందుకు తాను ముందుకు వచ్చినా.. సహకార లోపం వెంటాడుతోంది. బాలింతలకు ఇవ్వాల్సిన పారితోషికం, రక్తం, మందుల బిల్లుల చెల్లింపులో మీనమేషాలు లెక్కిస్తున్నారు. దీంతో ఇక్కడ వృత్తి నిబద్ధత లోపించిందని గ్రహించాను. అందుకే పనిచేయలేక పోతున్నా..’ ఇది ఎస్పీహెచ్ఓ డాక్టర్ శ్రీనివాసులు ఆవేదన. ఒక వైద్యాధికారే తనకు సహకరించడం లేదని చెబుతున్నారంటే ఈ ఆస్పత్రిలో పరిస్థితి ఎలా ఉందో అర్ధం అవుతుంది. వనపర్తి టౌన్ : ప్రభుత్వ ఆసుప్పత్రులోనే ప్రసవాలు, శస్త్రచికిత్సలు చేయించుకోవాలని సర్కార్ సైతం ప్రకటనలు చేస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. వనపర్తిలో ఏర్పాటు చేసిన వంద పకడల ఏరియా ఆస్పత్రికి వనపర్తి నియోజకవర్గంతో పాటు కొల్లాపూర్, దేవరకద్ర, నాగర్కర్నూల్ తదితర ప్రాంతాల నుంచి ప్రసవాలు చేయించుకునేందుకు మహిళలు వస్తుంటారు. కానీ, ఇక్కడ ఆపరేషన్లు చేసే పరిస్థితి లేకుండా పోయింది. ఆస్పత్రి ప్రారంభం నుంచి గైనకాలజిస్ట్ పోస్టును భర్తీ చేయకపోవడంతో ఏడాదికి ఎప్పుడో ఒక్కమారు డిప్యూటేషన్పై వచ్చే డాక్టరే దిక్కుగా మారింది. ఐదు నెలల కిందట ఆపరేషన్లు, కాన్పులు చేసేందుకు నిర్ణయించారు. ఆ మేరకు కొంత విజయవంతమయ్యారు. కానీ, ఇప్పుడు వైద్యాధికారులు ఆ ఊసే పట్టించుకోవడం లేదు. దీంతో ఏరియా ఆస్పత్రిలో ప్రసవాలు, ఆపరేషన్లు జరిగినట్టే జరిగి ఒక్కసారిగా బ్రేక్ పడడంతో సామాన్యులు ఇబ్బందులకు గురవుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో వేలాది రూపాయలు ఖర్చు పెట్టి ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్నారు. ఆస్పత్రిలో ప్రస్తుతం పీజీ విద్యార్థిని (8నెలల ట్రైనింగ్లో ఉన్న వైద్యురాలు) ఇక్కడ పనిచేస్తున్నారు. అయితే, ఆమె ఆపరేషన్లు చేయడానికి వెనుకాడుతోంది. దీంతో ఆస్పత్రి పరిస్థితిని అర్ధం చేసుకున్న వనపర్తి క్లస్టర్ అధికారి శ్రీనివాసులు ఇక్కడ ప్రసవాలు, ఆపరేషన్లు చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. కొంతకాలం పాటు శ్రీనివాసులు, ట్రైనింగ్లో ఉన్న వైద్యురాలు స్వాతి ఇద్దరు కలిసి ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేశారు. ఈ తరుణంలో ఆపరేషన్లు చేయించుకున్న వారికి, బాలింతలకు ఇచ్చే పారితోషికం, మందుల బిల్లుల చెల్లింపు విషయంలో ఆస్పత్రి సూపరింటెండ్, ఎస్పీహెచ్ఓకు మధ్య విభేధాలు పొడచూపినట్టు ప్రచారం సాగింది. ఇదే సమయంలో ఎస్పీహెచ్ఓ కూడా ఆపరేషన్లు చేసేందుకు ముందుకు రావడం లేదు. దీంతో ఇక్కడ కాన్పుకోసం వచ్చిన మహిళల పరిస్థితి దారుణంగా తయారైంది. వైద్యసేవలు అందినట్టే అంది.. మళ్లీ దూరం కావడంతో వారు ఆందోళనకు గురవుతున్నారు. ఆస్పత్రిలో మళ్లీ ఆపరేషన్లు జరిగేలా ఎమ్మెల్యే చొరవ తీసుకోవాలని కోరుతున్నారు. ఎస్పీహెచ్ఓకు ఎప్పటికీ వెల్కం వనపర్తి ఏరియా ఆస్పత్రిలో కాన్పులు, ఆపరేషన్లు చేసేందుకు ఎస్పీహెచ్ఓ ముందుకు రావడం మాకు.. ప్రజలకు ధై ర్యాన్ని చ్చింది. వ్యక్తిగత కారణాల వల్ల.. పీహెచ్సీల పర్యవేక్షణ మూలంగా ఎస్పీహెచ్ఓ శ్రీనివాసులు ఆస్పత్రికి రావడం లేదనుకుంటున్నాం. ప్రజలకు మంచి జరగడానికి తనకు బేషజాలు లేవు. ఎస్పీహెచ్ఓ ఎప్పుడొచ్చినా ఆయనకు వెల్కం చెబుతాం. - భాస్కర్ప్రభాత్, సూపరింటెండెంట్, వనపర్తి. -
ఆపరేషన్ కష్టాలు
⇒ చేవెళ్ల ఆస్పత్రిలో పడకల సంఖ్య 20 ⇒ కు.ని. శస్త్రచికిత్సలు చేసింది 96 మందికి ⇒ బెడ్లు సరిపోక ఇబ్బందులకు గురైన మహిళలు ⇒ వసతుల కల్పనలో విఫలమైన యంత్రాంగం చేవెళ్ల రూరల్: కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేయించుకోవాలని ఒకవైపు భారీగా ప్రచారం చేస్తున్నా.. అందుకు తగిన విధంగా సౌకర్యాలు కల్పించటంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. తరచూ ఇబ్బందుల మధ్యే ఆపరేషన్లు జరుగుతున్న విషయం జిల్లా వైద్యాధికారులకు తెలిసినా ఎలాంటి చర్యలు తీసుకోవటంలేదనడానికి చేవెళ్లలో ఆపరేషన్లు చేయించుకున్న మహిళల అవస్థలే నిదర్శనం. ఆస్పత్రిలో ఉన్నవి 20 పడకలే అయినా 96 మంది మహిళలకు శస్త్రచికిత్సలు చేశారు. అందరికీ బెడ్లు సరిపోక కొందరిని వరండాలోని నేలపై పడుకోబెట్టడంతో మహిళలు ఇబ్బందులకు గురయ్యారు. సోమవారం డివిజన్లోని నాలుగు మండలాల పరిధిలోని పీహెచ్సీల నుంచి 96 మంది మహిళలు కు.ని. ఆపరేషన్ల కోసం ఉదయాన్నే పస్తులతో వచ్చారు. కానీ ఆపరేషన్లను మధ్యాహ్నం మొదలుపెట్టి సాయంత్రం వరకు చేశారు. దీంతో మహిళలు చాలా నీరసించిపోయారు. దీనికి తోడు ఆస్పత్రి వద్ద ఎలాంటి సౌకర్యాలు లేకపోవటంతో ఇబ్బందులకు గురయ్యారు. ఆస్పత్రిలో ఉన్న 20 మంచాలపై ఇద్దరు చొప్పున 40 మందిని పడుకోబెట్టారు. మిగిలినవారిని వరండాలోని నేలపైనే విశ్రాంతి తీసుకున్నారు. మహిళల వెంట వచ్చిన కుటుంబ సభ్యులకు ఆరుబయట వేసిన చిన్న టెంటు సరిపోకపోవటంతో చెట్ల కిందనే నిరీక్షించారు. తాగునీరు, బాత్రూంలు లేక అవస్థల పాలయ్యారు. ఒకేసారి ఇంత పెద్దమొత్తంలో వచ్చేవారికి ఆస్పత్రిలోని బెడ్లు సరిపోవని వైద్యాధికారులు తెలిపారు. మొదట ఆపరేషన్ పూర్తయినవారిని పంపిస్తూ.. ఆ తర్వాత చేసేవారికి బెడ్లను కేటాయిస్తున్నట్లు చెప్పారు. సాధ్యమైనంత వరకు అన్ని సౌకర్యాలూ కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కు.ని. ఆపరేషన్లలో వైద్యులు జయమాలిని, క్యాంపు ఇన్చార్జి కరీమున్నీషా, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
ఒక్క మగాడు.. లేడు..!
కర్నూలు హాస్పిటల్ : కుటుంబ సంక్షేమంలో స్త్రీ, పురుషులు అత్యంత కీలకం. అయితే కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల్లో మాత్రం పురుషులు ముందుకు రావడంలేదు. ఆపరేషన్ల(వేసెక్టమీ)లో ఆధునిక పద్ధతులు వచ్చినా పురుషులు వెనుకడుగు వేస్తున్నారు. తొమ్మిది నెలలు మోసి, ప్రసవించిన స్త్రీలకే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు తప్పడంలేదు. ప్రసవ సమయాల్లో సిజేరియన్లు జరిగినా.. కు.ని. ఆపరేషన్లకు పురుషులు మాత్రం ముందుకురావడంలేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటే మహిళలకు రూ.800, పురుషులకు రూ.1100 చొప్పున ప్రభుత్వం ప్రోత్సాహక నగదు ఇస్తుంది. అయినా వేసెక్టమీ ఆపరేషన్లలో మాత్రం జిల్లా అట్టడుగున ఉంది. ప్రభుత్వం నుంచి సరైన ప్రచారం లేకపోవడంతో వేసెక్టమీ ఆపరేషన్ల నమోదు దారుణంగా పడిపోతోంది. వేసెక్టమీ ఆపరేషన్లో మార్పులెన్నో.. పురుషులకు చేసే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ (వేసెక్టమీ)లో గతంలో కోత ఉండేది. ఇప్పుడు ఆధునిక పద్ధతులు అమలులోకి వచ్చాయి. శిక్షణ పొందిన వైద్యులు ఉన్నారు. వసతులు ఉన్నాయి. ఆసుపత్రులకు వచ్చే పురుషులకు రెండు నుండి ఐదు నిమిషాల వ్యవధిలో ఈ ఆపరేషన్ చేస్తారు. గంటలోపే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కావచ్చు. ఆపరేషన్ చేయించుకున్న పురుషులకు ప్రభుత్వం రూ.1100 ప్రోత్సాహక నగదు బహుమతి ఇస్తుంది. ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. అన్ని పనులు సక్రమంగా చేసుకోవచ్చు. బరువు ఎత్తవచ్చు. అయినా పురుషులు అపోహలతో వెనుకంజ వేస్తున్నారు. ప్రచారం లేదు.. అవగాహన లేదు.. కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కుటుంబ నియంత్రణ పద్ధతులను వివరించడంలో విఫలమవుతోంది. ట్యూబెక్టమీ ఆపరేషన్ల వైపే ప్రాధాన్యత చూపుతున్న యంత్రాంగం వేసెక్టమీ ఆపరేషన్లపై పురుషులకు అవగాహన కల్పించడంలో వెనుకబడిందని చెప్పవచ్చు. ప్రజల్లో అవగాహన లేకపోవడం, ప్రభుత్వం నుండి ప్రచారం లేకపోవడం, ప్రత్యేక క్యాంపులు, ప్రోత్సాహకాలు లేకపోవడం తదితర కారణాల వల్ల పురుషులకు ఆపరేషన్లు ఆశించిన స్థాయిలో జరగడం లేదు. కుటుంబ నియంత్రణ పద్ధతులను వివరిస్తున్న ఆశ వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు, వేసెక్టమీ ఆపరేషన్లపై అవగాహన కల్పించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. రికార్డుల్లో నమోదు కోసం సిబ్బంది ప్రచారం నిర్వహిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. స్త్రీలనే ప్రధానంగా టార్గెట్ చేసుకుని ప్రచారం చేస్తున్నారు. వారికే అవగాహన కల్పిస్తున్నారు. పదేళ్లలో గణనీయంగా తగ్గిన ఆపరేషన్లు జిల్లాలో గత పదేళ్ల కాల వ్యవధిలో వేసెక్టమీ ఆపరేషన్లు గణనీయంగా తగ్గాయి. ఎటువంటి లక్ష్యాలు, ప్రభుత్వం నుంచి ఒత్తిడి లేకపోవడంతో జిల్లాలో వందల సంఖ్యలో నుండి పదుల సంఖ్యకు చేరుకోవడం గమనార్హం. 2008లో 166 వేసెక్టమీ ఆపరేషన్లు నమోదు కాగా, 2013-14లో రెండు మాత్రమే నమోదయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ 19వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా ఒక్క వేసెక్టమీ ఆపరేషన్ కూడా నమోదు కాకపోవడం విశేషం. వేసెక్టమీ సులువైన ఆపరేషన్.. వ్యాసెక్టమీ ఆపరేషన్ చాలా సులువైనది. నోస్కాలెపెల్ వ్యాసెక్టమీ(ఎన్ఎస్వి) ఆపరేషన్ పదేళ్ల క్రితం అమల్లోకి వచ్చింది. అయినా పురుషుల నుండి స్పందన లేదు. కత్తి లేకుండా చేసే ఆపరేషన్లో కోత, కుట్లు ఉండవు. ప్రజల్లో అవగాహన లేకపోవడం ప్రధాన కారణం. విస్తృతంగా ప్రచారం కల్పించాలి. పురుషులకు, ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలి. దీనిపై యువతకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలి. - డాక్టర్ మాణిక్యరావు, గర్భిణీ, స్త్రీవ్యాధుల నిపుణులు, కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల -
ఆరోగ్య శ్రీ ఆపరేషన్లు బంద్
పేదల పాలిట అపర సంజీవనిగా పేరుగాంచిన ‘ఆరోగ్యశ్రీ’ పథకం తెలుగుదేశం ప్రభుత్వం రాకతో అనారోగ్యం బారినపడింది. ప్రస్తుతం దీని పేరు మార్చి ‘ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ’గా నామకరణం చేశారు. గతంలో ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్లు చేయించుకునే రోగులకు ఒక్క రోజులో అనుమతి వచ్చేది. ఇప్పుడు వారం నుంచి పది రోజులు కూడా పడుతోంది. అత్యవసర వైద్యం కోసం వచ్చే రోగులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో గుంటూరులోని ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి (జీజీహెచ్) వంటి పెద్దాసుపత్రి మొదలు పలు నెట్వర్క్ ఆస్పత్రుల్లో సైతం ఆరోగ్య శ్రీ ఆపరేషన్లు నిలిపివేశారు. సాక్షి, గుంటూరు/ మెడికల్: ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్లు జరగాలంటే రోజుల పాటు ఆసుపత్రుల్లో మూల గాల్సిన దుస్థితి ఏర్పడిందని రోగులు వాపోతున్నారు. ఆరోగ్యశ్రీ అనుమతులు రాకపోవడంతో రోగుల బంధువుల నుంచి తమకు తీవ్రస్థాయిలో ఒత్తిడి పెరుగు తోందని, మరోవైపు ఆరోగ్యశ్రీ ట్రస్టు అనుమతి ఇవ్వకుండా ఆపరేషన్లు చేస్తే దానికి ఆరోగ్యశ్రీ వర్తించదని వైద్యులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 2008 జూలై 7న ఈ పథకం ప్రారంభమైంది. కొణిజేటి రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నకాలంలో ఈ పథకంలో మార్పులు జరిగాయి. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చేస్తున్న 126 రకాల ఆపరేషన్లు ప్రైవేటు ఆస్పత్రుల నుంచి తొలగించి కేవలం ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ఏడాదికి రెండులక్షల రూపాయల వరకు ఖర్చుఅయ్యే వ్యాధులకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం పొందే అవకాశం ఉంది. టీడీపీ ప్రభుత్వం ఈ ఏడాది అక్టోబర్ 2న ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీగా పేరు మార్చి, అనుమతుల మంజూరులో కోతలు విధించింది. అనుమతుల్లో ఆలస్యం... తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి హైదరాబాద్లోని ఆరోగ్యశ్రీ ట్రస్టు అనుమతులు ఇవ్వడంలో ఆలస్యం చేస్తుండటంతో పలు ఆస్పత్రుల్లో ఆపరేషన్ కేసులు పెండింగ్లో ఉంటున్నాయి. కొన్ని ఆస్పత్రుల్లో ఆపరేషన్లు చేసినా వాటికి రావాల్సిన పారితోషికాలు విడుదల చేయకపోవడంతో ఆరోగ్య శ్రీ ఆపరేషన్లు చేసేందుకు వైద్యులు ఆసక్తిచూపించటం లేదు. జీజీహెచ్లో గతంలో నెలకు రూ.కోటికిపైగా పారితోషికాల రూపంలో ఆస్పత్రికి వచ్చే ఆదాయం నేడు కేవలం రూ.19లక్షలకు పడిపోయిందంటే అనుమతులు ఇవ్వడంలో ప్రభుత్వం ఏ మేరకు జాప్యం చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. 2014 జూన్లో ఆరోగ్యశ్రీ కింద జీజీహెచ్లో 854 ఆపరేషన్లు చేయగా, 494 ఆపరేషన్లుకు మాత్రమే రూ.10,976,816 లు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నిధులను చెల్లించింది. జూలైలో 940 ఆపరేషన్లు చేస్తే 888 ఆపరేషన్లుకు రూ. 18,033,082లు చెల్లించింది. ఆగస్టు నెలలో 947 ఆపరేషన్లు చేయగా 115 ఆపరేషన్లుకు మాత్రమే రూ.19,92,891లు చెల్లించింది. సెప్టెంబర్లో 886 ఆపరేషన్లు చేయగా 648 ఆపరేషన్లుకు రూ.12,684,428 చెల్లించింది. ఆగస్టు నెలలో జీజీహెచ్లోని కార్డియాలజీ, పీడియాట్రిక్స్, జనరల్ మెడిసిన్ విభాగాల్లో చికిత్స పొందిన రోగుల్లో ఏ ఒక్కరికి కూడా ప్రభుత్వం క్లెయిమ్ చెల్లించలేదు. న్యూరో సర్జరీ విభాగంలో ఐదుగురికి, ఆర్థోపెడిక్ విభాగంలో ఏడుగురికి, జనరల్ సర్జరీ విభాగంలో 11 మందికి మాత్రమే పారితోషికాలు చెల్లించింది. ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తుండడంతో జీజీహెచ్లోని కొన్ని వైద్య విభాగాల్లో, జిల్లాలోని పలు నెట్ వర్క్ ఆస్పత్రుల్లో వైద్యసేవలను నిలిపివేస్తున్నారు. మన బిడ్డలకు ఇలా జరిగితే ఊరుకుంటామా... తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రులకు వచ్చే నిరుపేదలకు వెంటనే ఆపరేషన్లు చేయాలంటే ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుంచి అనుమతులు రావడం ఆలస్యమౌతుంది. దీని వల్ల రోగులు, వారి బంధువులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం, ఆరోగ్యశ్రీ ఉన్నతాధికారులు దృష్టిసారించి సమస్యను సత్వరమే పరిష్కరించాలి. ఇదే మన ఇంటిలో బిడ్డలకు ఇలా జరిగితే ఊరుకుంటామా, పేదవారికి ఉపయో గపడినప్పుడే ఈ పథకానికి సార్థకత ఉంటుంది. ఆలస్యం అవుతున్న మాట వాస్తవమే... ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఆపరేషన్లు చేసేందుకు గతంలో వెంటనే అనుమతి ఇచ్చేవారం. నేడు కొంత సమయం పడుతోంది. జిల్లాలో 32 నెట్వర్క్ ఆస్పత్రుల ద్వారా వైద్యసేవలు అందుతున్నాయి. వీటిల్లో ఐదు ప్రభుత్వ ఆస్పత్రులు కాగా 27 ప్రైవేటు ఆస్పత్రులు ఉన్నాయి. - డాక్టర్ కె.విజయభాస్కరరెడ్డి, ఆరోగ్యశ్రీ, జిల్లా కోఆర్డినేటర్ -
ఈ ఆపరేషన్ మాకొద్దు
ఘట్కేసర్: కుటుంబ నియంత్రణ గురించి విస్తృతంగా ప్రచారం నిర్వహించే ప్రభుత్వం ఆ ఆపరేషన్లు చేయించుకోవడానికి వచ్చే మహిళలకు కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదు. దీంతో ఆపరేషన్లు చేయించుకోవడానికి ఆస్పత్రికి వచ్చిన మహిళలు అక్కడి పరిస్థితులు చూసి ఆందోళన చెందుతున్నారు. మళ్లీ వస్తామంటూ ఆపరేషన్లు చేయించుకోకుండానే వెనుదిరుగుతున్నారు. మండలంలోని నారపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం మండల వ్యాప్తంగా మహిళలకు కుటుంబ నియంత్రణ (ట్యూబెక్టమి) ఆపరేషన్లు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఆయా గ్రామాలకు చెందిన 12 మంది మహిళలు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవడానికి తమ పేర్లను నమోదు చేయించారు. శుక్రవారం ఉదయం 8 గంటల వరకు సదరు 12 మంది మహిళలు ఆస్పత్రికి చేరుకున్నారు. మొదట ఆరుమంది మహిళలకు ఆపరేషన్లు చేసి అందుబాటులో ఉన్న 6 మంచాలపై పడుకోబెట్టారు. అనంతరం వచ్చిన ఇద్దరు మహిళలను ఆపరేషన్ తర్వాత బెంచీలు, టేబుళ్లపై పడుకోబెట్టారు. ఈ పరిస్థితి గమనించిన మిగితా నలుగురు మహిళలు నివ్వెరపోయారు. ఆస్పత్రిలో ఇక బెంచీలు, టేబుళ్లు కూడా లేకపోవడంతో ఆపరేషన్ తర్వాత తమ పరిస్థితి ఏంటని వారు ఆందోళనకు గురయ్యారు. మళ్లీ వచ్చి ఆపరేషన్ చేయించుకుంటామని చెప్పి అక్కడినుంచి వెనుదిరిగారు. కు.ని ఆపరేషన్లకు కనీస సౌకర్యాలు కూడా కల్పించకపోవడంతోనే తాము భయపడి వెనుదిరిగినట్లు వారు విలేకరులతో గోడు వెళ్లబోసుకున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు కల్పించుకొని కు.ని ఆపరేషన్లకు కనీస సౌకర్యాలు కల్పించాలని కోరారు. వైద్యులు నారాయణ రావు, సతీష్ చందర్ల నేతృత్వంలో కు.ని ఆపరేషన్లు కొనసాగాయి. -
‘కు.ని’కి పాట్లు
సాక్షి, ఒంగోలు : జాతీయ ఆరోగ్యమిషన్ (ఎన్ఆర్హెచ్ఎం) నుంచి జిల్లాకు ఏటా రూ.20 కోట్లకు పైగా నిధులు వస్తున్నాయి. ఇందులో రూ.2 కోట్ల నుంచి రూ.2.5 కోట్ల వరకు కుటుంబ సంక్షేమ పథకాలకు కేటాయిస్తున్నారు. ఈ నిధులతో నాలుగు రకాలుగా కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇద్దరు సంతానం పుట్టాక కుటుంబ నియంత్రణ (కు.ని) ఆపరేషన్లు చేయడం ఒకటి కాగా, పిల్లల మధ్య ఎడమ కోసం తాత్కాలిక ఆపరేషన్లైన కాపర్ టీ వేయించడం, గర్భం దాల్చకుండా నోటిమాత్రలు పంపిణీ చేయడం, కండోమ్ల పంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది. ఇందులో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు మినహా అన్ని కార్యక్రమాలు నామమాత్రంగానే సాగుతున్నాయి. క్షేత్రస్థాయిలో కానరాని ప్రగతిని జిల్లా వైద్య,ఆరోగ్యశాఖ అధికారులు మాత్రం గణాంకాల్లో ఘనంగా చూపుతుండటం గమనార్హం. వేసెక్టమీలు ఏడు మాత్రమే... కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు సంబంధించి ఏటా భారీ స్థాయిలో లక్ష్యాలను నిర్దేశించుకుంటూ.. వాటిని అధిగమించే విషయంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ చతికిలపడటం రివాజవుతోంది. ఏటా రూ. కోట్లు ఖర్చుచేస్తున్నా.. లక్ష్యాలు నెరవేరడం లేదు. జిల్లావ్యాప్తంగా పురుషులకు చేసే వేసెక్టమీ ఆపరేషన్లు ఈఏడాది మొత్తంలో కేవలం ఏడు మాత్రమే నమోదవడం తాజా ఉదాహరణ. వాస్తవ పరిస్థితులిలా.. జనాభా నియంత్రణలో కుటుంబ నియంత్రణ అనేది ఒక భాగం. తల్లులు, పిల్లల ఆరోగ్యం విషయంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ఇద్దరు లేదా ముగ్గురు పిల్లల తర్వాత తప్పనిసరిగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకునేందుకు దంపతులను ప్రోత్సహించాలి. చిన్న కుటుంబంతో కలిగే లాభాలను వివరించే అవగాహన సమావేశాలు నిర్వహించాలి. కార్యక్రమాల్లో చురుగ్గా పనిచేయాల్సిన ‘డెమో’ విభాగం మూలనపడింది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకునేందుకు జిల్లాలో 37 కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటితో పాటు ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్సెంటర్లు పనిచేస్తున్నాయి. యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి, మార్కాపురం తదితర నియోజకవర్గాల్లో అక్కడక్కడా తప్ప అధిక చోట్ల ప్రత్యేక శిబిరాల ఊసే లేదు. ఆయాప్రాంతాల్లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరగడం లేదు. గైనిక్, అనస్థీషియా (మత్తు) వైద్యులు కొరత కారణంగా తొందరపడి ఆపరేషన్ల జోలికి వెళ్లలేకపోతున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సరైన మౌలిక సదుపాయాలు లేనందున చాలామంది ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. నెరవేరని లక్ష్యం.. జిల్లావైద్య, ఆరోగ్యశాఖ 2013-14 సంవత్సరంలో 22 వేల కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందుకుగాను కేవలం 7 వేల ఆపరేషన్లు మాత్రమే నిర్వహించారు. ప్రభుత్వ ఆస్పత్రులు కంటే ప్రయివేటు ఆస్పత్రుల్లో ఈ ఆపరేషన్లు అధికంగా జరిగాయి. పీహెచ్సీ, సీహెచ్సీలలో వైద్యులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉన్నా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు ముందుకు రావడం లేదని ఫిర్యాదులందుతున్నాయి. ఒంగోలు రిమ్స్కు పంపుతూ కొన్ని నియోజకవర్గాల్లో వైద్యసిబ్బంది చేతులు దులుపుకుంటున్నారు. ఈ విషయంలో వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో లక్ష్యం నీరుగారుతోంది. -
ఆస్పత్రిని అప్పగించే వరకు పోరాటం ఆగదు
10వ రోజుకు చేరిన జూనియర్ డాక్టర్ల ఆందోళన ఆపరేషన్లను అడ్డుకున్నారు జీవోప్రతుల దగ్ధం, సంతకాల సేకరణ తిరుపతి అర్బన్: ఎస్వీ మెడికల్ కాలేజీ పరిధిలో పనిచేస్తున్న ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి కోసం నిర్మించిన 300 పడకల గర్భిణీల ఆస్పత్రిని తిరిగి ఇచ్చేవరకు పోరాటం ఆపే ప్రసక్తే లేదని మెడికల్ కాలేజీ వైద్యులు, జూనియర్ డాక్టర్లు తెగేసి చెప్పారు. అందుకోసం భవన పరిరక్షణ జేఏసీ కన్వీనర్లు డాక్టర్ జీ.పార్థసారధిరెడ్డి, డాక్టర్ కిరీటి ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలు శుక్రవారం పదవ రోజుకు చేరాయి. శుక్రవారం వరలక్ష్మీవ్రతం పర్వదినం అయినప్పటికీ రుయా-మెటర్నిటీ వైద్యులతో పాటు జూనియర్ డాక్టర్లు, హౌస్ సర్జన్లు ఉదయం 8 గంటలకే అన్ని ఆస్పత్రుల్లోని ఓపీలను నిలుపుదల చేయించారు. అలాగే రుయా పరిధిలో నిర్వహిస్తున్న ఆర్థో, పిడియాట్రిక్, ఆప్తమాలజీ, సర్జన్ విభాగాల్లో, మెటర్నిటీలోని గైనిక్ ఆపరేషన్ థియేట ర్లను బంద్ చేయించారు. మెడికల్ కాలేజీ నుంచి ర్యాలీ గా బయల్దేరిన జూనియర్ డాక్టర్లు, నర్సులు, వైద్య విద్యార్థులు మెటర్నిటీ హాస్పిటల్, రుయా చిన్నపిల్లల ఆస్పత్రి మీదుగా రుయా పరిపాలన భవనం, క్యాజు వాల్టీ మార్గంలో వెళ్లి మెడికల్ కాలేజీ సర్కిల్ వద్దకు చేరుకున్నారు. కొంతసేపు ఆందోళన చేపట్టారు. అక్క డి నుంచి బయల్దేరి మెటర్నిటీ హాస్పిటల్ వద్దకు చేరుకుని తమకు వ్యతిరేకంగా వైద్యశాఖ ముఖ్య కార్యదర్శి జారీ చేసిన జీవో ప్రతులను దగ్ధం చేశారు. అలాగే ఆందోళనలకు మరింత ఊతం కలిగేలా సంతకాల సేకరణ చేపట్టారు. వీటిని ఈనెల 16న జిల్లాకు రానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అందజేయనున్నట్టు వైద్యులు, జేఏసీ నాయకులు పేర్కొన్నారు. అనంతరం మెటర్నిటీ ఆస్పత్రి వద్ద జూనియర్ డాక్టర్స్(పీజీ) అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ బీ.చంద్రశేఖ ర్, ఉపాధ్యక్షుడు డాక్టర్ గోపీకృష్ణ, కార్యదర్శి డాక్టర్ సురేష్ మాట్లాడుతూ రాయలసీమ జిల్లాలతో పాటు కోస్తాలోని రెండు జిల్లాలకు చెందిన కోట్లాది మంది పేద ప్రజలకు దశాబ్దాల తరబడి వైద్యసేవలు అం దిస్తున్న తిరుపతి మెటర్నిటీ హాస్పిటల్ను నిర్వీర్యం చేసేందుకు కొందరు కుట్రలు పన్నారని ధ్వజమెత్తారు. వారి కుట్రలు సాగనీయబోమని హెచ్చరించారు. 300 పడకల భవనాల నిర్వహణపై కూడా రాష్ట్ర ఉన్నతాధికారులు రోజుకో విధంగా మాట్లాడుతుండడం బాధాకరమన్నారు. కేంద్ర ప్రభుత్వం పరిధిలోని ఎన్ఆర్హెచ్ఎం రూ.100 కోట్ల నిధులతో నిర్మించిన 300 పడకల భవనాలను ప్రజా ప్రభుత్వం లేని సమయంలో ఒకరి ద్దరు అధికారులు ఇలా కార్పొరేట్ సంస్థకు అప్పగిం చేందుకు జారీ చేసిన ఉత్తర్వులపై ముఖ్యమంత్రి సమగ్ర విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. చివరగా మెటర్నిటీ నుంచి బయల్దేరి అలిపిరి ప్రధాన రహదారిపై జూనియర్ డాక్టర్లు, జేఏసీ నాయకులు నినాదా లు చేస్తూ ర్యాలీని కొనసాగించారు. నేడు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేల రాక వైద్యులు, జూనియర్ డాక్టర్లు నిర్వహిస్తున్న ఆందోళనలకు మద్దతుగా శనివారం పలువురు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు రానున్నారు. వీరిలో చంద్రగిరి, నగరి ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, ఆర్కే.రోజా, తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి పాల్గొని సంఘీభావం తెలపనున్నారు. -
ఆస్పత్రిలో ఆకలిమంటలు
జబ్బు నయంచేసుకోవాలని రోగులు సర్కార్ ఆస్పత్రికెళితే అక్కడ కొత్తరోగం వచ్చేట్టుంది. ఏది పెట్టినా తింటారులే అనే నిర్లక్ష్యంతో నాణ్యతలేని టిఫిన్, భోజనం వడ్డిస్తూ రోగుల కడుపు మాడ్చుతున్నారు. నాణ్యతను పరిశీలించాల్సినఆస్పత్రి వర్గాలు పట్టించుకోవడంలేదు. సర్కార్ ఆస్పత్రికి వైద్యం కోసం వచ్చేదంతా నిరుపేదలే. బయట ఆహారం కొని తినలేని పరిస్థితి. ఆస్పత్రిలో ఇచ్చే నాసిరకం తిండి తినలేక ఆకలితో కడుపుమాడ్చుకుంటున్నారు. జిల్లా కేంద్రమైన చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో రోగులు ఎదుర్కొంటున్న దీనావస్థలివీ. చిత్తూరు (క్రైమ్),న్యూస్లైన్: చిత్తూరులోని 300 పడకల ఆస్పత్రి నిత్యం రోగులతో కిటకిటలాడుతుంటుంది. జిల్లా వ్యాప్తంగా పీహెచ్సీల నుంచి సీరియస్ కేసులను ఇక్కడికి రెఫర్ చేస్తుం టారు. వీరుగాక ఆస్పత్రికి రోజూ 1000 మందికిపైగా రోగులు వస్తుంటారు. ఆపరేషన్లు, ప్రాణాంతక జబ్బులతో పాటు డెలివరీ కేసులవారు 3 నుంచి 15 రోజుల పాటు ఆరోగ్యం కుదుటపడేవరకు ఆస్పత్రిలోనే చికిత్సపొందుతారు. వీరు ఆస్పత్రిలో అడ్మిట్టయినప్పటినుంచి డిశ్చార్జ్ అయ్యేవరకు పౌష్టికాహారం అందివ్వాలి. ఈ క్రమంలో టిఫిన్, భోజనం, పండ్లు, పాలు, కోడిగుడ్డు సరఫరా చేసే బాధ్యతను కాంట్రాక్టర్కు అప్పగించారు. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ మాత్రం ఉదయం నీళ్లపాలు, రాళ్లులాంటి గట్టి ఇడ్లీలు, నీళ్ల సాంబారు, ఉడికీ ఉడకని అన్నం మెతుకులను వడ్డిస్తున్నారు. ఈ ఆహారం తింటున్న రోగులు నానా అవస్థలు పడుతున్నారు. నాణ్యతలేని ఆహారం గురించి నిర్వాహకులను ప్రశ్నిస్తే రోగులపై తిరగబడుతున్నారు. పెట్టేది ఇంతే ... ఎవరికైనా చెప్పుకోండి... ఏం భయం లేదు అంటున్నారు. నిబంధనల ప్రకారం కాంట్రాక్టర్ సరఫరాచేసే భోజనాన్ని ఆస్పత్రి అధికారి పరీక్షించి నాణ్యతను నిర్ధారించిన తరువాతే రోగులకు వడ్డించాలి. నాణ్యతలో తేడా వస్తే కాంట్రాక్టర్ను హెచ్చరించాలి. లేదా ఆ కాంట్రాక్టును రద్దుచేయడానికి ఉన్నతాధికారులకు సిఫారసు చేయాలి. అయితే ఫుడ్ క్వాలిటీని పరీక్షించాల్సిన ఆస్పత్రి అధికారి ఇవన్నీ పట్టించుకున్న పాపానపోలేదు. దాంతో కాంట్రాక్టర్ ఏది వడ్డిస్తే అది తినాల్సిన దుస్థితి నెలకొంది. ప్రతిరోజూ రోగులకు అరటిపండు, ఆరంజ్, ఆపిల్ తదితర పండ్లలో ఏదో ఒకటి అందించాల్సివున్నా రోగులకు పంపిణీ చేయడంలేదు. భోజనం అధ్వానం ఆపరేషన్ చేసుకుని వారం రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నా. ప్రతిరోజూ 6 నుంచి 10 మాత్రలు మింగుతుండటంతో కడుపులో చాలా మంటగా ఉంది. ఇక్కడ వడ్డిస్తున్న భోజనం తింటే కడుపుమంటతో పాటు భరించలేని కడుపునొప్పి వస్తోంది. నాసిరకం భోజనం ఇస్తుండడంతో త్వరగా కోలుకోలేకపోతున్నాం. -అర్జునయ్య, నలగాంపల్లె, బంగారుపాళెం మండలం దిక్కున్న చోట చెప్పుకో అంటున్నారు ఇడ్లీ గట్టిగా ఉందని, పాలు నీళ్లుగా ఉన్నాయని అడిగితే దిక్కున్నచోట చెప్పుకో అంటూ బెదిరించారు. వారం రోజుల నుంచి ఫుడ్ కాంట్రాక్టర్ ఇచ్చే పాలు, టిఫిన్, భోజనం కిందపడేయాల్సి వస్తోంది. ఇప్పటివరకు ఒక్కసారి కూడా పండ్లు ఇవ్వలేదు. కాంట్రాక్టర్ తీరుపై విచారణ చేసి రోగులకు న్యాయం చేసేలా అధికారులు చొరవచూపాలి. -శ్రీనివాసులు, దిగువ కామినేపల్లె, ఐరాల మండలం రోగులపై తిరగబడితే చర్యలు తీసుకుంటాం రోగులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని కచ్చితంగా మెనూ ప్రకారం అందించాలి. నాణ్యత లేదని ప్రశ్నించిన రోగులకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఫుడ్ కాంట్రాక్టర్పై ఉంది. అలాకాకుండా రోగులపైనే విరుచుకుపడటం.. ఎవరికైనా చెప్పుకో అనడం సరికాదు. ఈ విషయంపై విచారణ జరిపి తగుచర్యలు తీసుకుంటాం. -సరళమ్మ, డీసీహెచ్ఎస్. -
‘గైనిక్’ లేరని వెళ్లగొట్టారు
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసూతి కేసులు పెంచాలని ప్రచారం నిర్వహిస్తున్నా వైద్యులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఆస్పత్రులకు వచ్చిన గర్భిణులను జాగ్రత్తగా చూసుకుని వారికి కాన్పులు చేయాల్సి ఉండగా అలసత్వం ప్రదర్శిస్తున్నారు. వివిధ సాకులు చెప్పి ఆపరేషన్లు చేయకుండా తప్పించుకుంటున్నారు. మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రిలో జరిగిన ఉదంతమే అందుకు నిదర్శనం. మిర్యాలగూడ క్రైం, న్యూస్లైన్ : పట్టణంలోని ముత్తిరెడ్డికుంటకు చెందిన మల్లేశం, చంద్రకళ దంపతుల కూతురు లలితను మిర్యాలగూడ మండలం గూడూరు గ్రామ పంచాయతీ పరిధిలోగల కిష్టాపురానికి చెందిన కొండ మట్టయ్యకు ఇచ్చి ఆరేళ్ల కిత్రం వివాహం జరిపించారు. లలితకు నెలలు నిండటంతో శనివారం పట్టణంలోని ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. పరీక్షించిన వైద్యులు నొప్పులు వచ్చినప్పుడు ఆస్పత్రికి తీసుకురమ్మని చెప్పి పంపించారు. మధ్యాహ్నం 2గంటల సమయంలో లలితకు నొప్పులు అధికమై బ్లీడింగ్ కావడంతో కుటుంబ సభ్యులు ఆమెను మళ్లీ ఏరియా ఆస్పత్రికి తరలించారు. 3గంటల పాటు వేచి ఉన్నా వైద్యులు గర్భిణిని ఆస్పత్రిలో చేర్చుకోలేదు. సంబంధిత డాక్టర్లు లేరని, నల్లగొండ లేదా నార్కట్పల్లికి వెళ్లమని ఉచిత సలహా ఇచ్చి చేతులు దులుపుకున్నారు. దీంతో బాధితురాలి కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రిలోనే ఆందోళనకు దిగారు. జ్యోతి ఆస్పత్రికి తరలింపు విషయం తెలుసుకున్న పట్టణ మహిళా సమాఖ్య అధ్యక్షురాలు బత్తిని సోమిదేవి, టీఆర్ఎస్ నాయకుడు విజయ్కుమార్లు పట్టణంలోని జ్యోతి ఆస్పత్రి వైద్యుడు మువ్వా రామారావు దగ్గరకు వెళ్లి గర్భిణి పరిస్థితిని వివరించారు.వెంటనే స్పందించిన సదరు డాక్టర్ లిలతకు ఆపరేషన్ చేయడానికి అంగీకరించడంతో ఆమెను అక్కడకు తరలించారు. గైనిక్ సర్జన్ సెలవులో ఉన్నారు ఈ విషయమై ఆస్పత్రి సూపరింటెండెంట్ ఎంఎస్ నాయక్ను వివరణ కోరగా గైనిక్ సర్జన్ రెండురోజులు సెలవులో ఉండటంతో గర్భిణినీ ఆస్పత్రిలో చేర్చుకోలేదని చెప్పారు. లలితను అంబులెన్స్లో నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలి స్తామన్నారు.