Paddy crop
-
సర్కారు నిర్వాకంతో తడిసిముద్దయిన ధాన్యం రాశులు.. అన్నదాత అగచాట్లు
బస్తాల్లో ధాన్యం తడిసి ముద్దయ్యింది.. ఎకరం 50 సెంట్లలో వరి సాగుచేశా. ఎకరాకు 54 బస్తాల దిగుబడి వచి్చంది. తేమ శాతం ఎక్కువగా ఉందని ఆరబెట్టమన్నారు. రోడ్లపై ఆరబెట్టాను. ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రంలోనే అమ్ముదామని అనుకున్నా. మిల్లర్లకు చేరవేస్తే క్వింటాకు రూ.1,500 ఇస్తామంటున్నారు. ఇప్పుడు బస్తాల్లోకి ఎక్కించిన ధాన్యం కాస్తా ఇలా తడిసి ముద్దయింది. ధర ఎంతొస్తుందో తెలియని పరిస్థితి దాపురించింది. – అంగరాల రాంబాబు, చిట్టిగూడెం, గూడూరు మండలం, కృష్ణాజిల్లాసాక్షి, అమరావతి: ఫెంగల్ తుపాను వస్తుందని నాలుగైదురోజుల క్రితమే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. కోతలు ముమ్మరంగా జరుగుతున్న తరుణంలో బాధ్యతగల ఏ ప్రభుత్వమైనా ఏం చేస్తుంది.. ముందుగా కోసిన పంటను ఆఘమేఘాల మీద కొనుగోలు చేసి రైతులను ఆదుకునేలా చర్యలు చేపడుతుంది. కానీ, నిత్యం సొంత డబ్బా కొట్టుకునే టీడీపీ కూటమి ప్రభుత్వం చేతగానితనంవల్ల కళ్లెదుటే తమ కష్టార్జితం తడిసిముద్దవడంతో అన్నదాతల వేదన అంతాఇంతా కాదు. ఇప్పటికే రెక్కలు ముక్కలు చేసుకుని ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు కనీస మద్దతు ధరలేక రైతులు అల్లాడిపోతుంటే.. ఫెంగల్ తుపాను ప్రభావంతో వారి పరిస్థితి ఇప్పుడు పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లయింది. అలాగే, ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం చేతులెత్తేయడం.. తమ కష్టార్జితాన్ని దళారీలు సొమ్ము చేసుకుంటుండడంతో వారు క్వింటాకు రూ.500కు పైగా నష్టపోతున్నారు. ఇదిలా ఉంటే.. తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు కళ్లాల మీద ఉన్న వరిచేలు నేలకొరుగుతుంటే.. కోసిన పంట తడిసి ముద్దవుతోంది. కనీసం నష్టానికి తెగనమ్ముకుందామన్నా కూడా కొనే నాథుడు కన్పిచక రైతులు అన్నిరకాలుగా దగాకు గురవుతున్నారు. ఫెంగల్ కలవరంతో రైతులు పడరాని పాట్లు.. ప్రస్తుతం పంట చేతికొచ్చే సమయంలో విరుచుకుపడుతున్న ఫెంగల్ తుపాను రైతులను మరింత కలవరపెడుతోంది. ఉభయగోదావరి జిల్లాల్లో మాత్రమే 60–70 శాతం కోతలు పూర్తయ్యాయి. కొన్ని జిల్లాల్లో 20–40 శాతం కోతలు పూర్తికాగా, మెజార్టీ జిల్లాల్లో 15–20 శాతం మాత్రమే కోతలు పూర్తయ్యాయి. కోసిన పంటను కనీసం 3–4 రోజులపాటు ఆరబెడితేగాని తేమ శాతం తగ్గే అవకాశం ఉండదు. దీనికితోడు.. కూలీల కొరత, మరోవైపు సంచుల కొరత తీవ్రంగా ఉంది. అలాగే, తూకం వేయకుండా సంచుల్లో నింపిన ధాన్యాన్ని తరలించే దారిలేక రోడ్ల మీద, పంట పొలాల మీదే ఉంచేసారు. ఈ నేపథ్యంలో.. శనివారం కురిసిన వర్షాలకు ఈ ధాన్యం కాస్తా తడిసి ముద్దవడంతో తేమశాతం పెరగడమే కాక రంగుమారి పోయే పరిస్థితి నెలకొంది. ఈ తేమ శాతం తగ్గితేగానీ కొనుగోలు కేంద్రాల్లో అమ్మే పరిస్థితిలేదు. ఇదే వంకతో గడిచిన మూడ్రోజులుగా ప్రైవేటు వ్యాపారులు సైతం ధాన్యం కొనేందుకు ముందుకు రావడంలేదు. అయినాసరే.. ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లుగా ఉంది. ముఖ్యంగా.. ఉభయ గోదావరి, కాకినాడ, కోనసీమ, కృష్ణా జిల్లాల్లో ఎక్కడికెళ్లినా కోసిన పంట రోడ్లపైన, కళ్లాల్లోనే కన్పిస్తోంది. ఆరబోత కోసం రోడ్లపై వేసిన ధాన్యాన్ని ఒబ్బిడి చేసుకునేందుకు.. కోసిన ధాన్యంలో తేమ శాతాన్ని తగ్గించుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. మరోవైపు.. అధిక శాతం పంట ఇంకా కళ్లాలు, పొలాల్లోనే ఉండడంతో కోసిన పంటను అక్కడే ఆదరాబాదరాగా కుప్పలు పెడుతున్నారు. ఇవి కనీసం నాలుగైదు రోజులు పనల మీదే ఎండాల్సి ఉంది. వాతావరణ మార్పులతో ధాన్యం రంగుమారే ప్రమాదం ఉందని రైతులు బెంబేలెత్తిపోతున్నారు. పీడిస్తున్న టార్పాలిన్ల కొరత.. ఇక టార్పాలిన్ల కొరత కూడా రైతులను పట్టిపీడిస్తోంది. అద్దెకు తెచ్చుకుని కప్పుకుంటున్నారు. అవి కూడా అరకొరగానే దొరుకుతున్నాయి. ఎకరం విస్తీర్ణంలో పండిన ధాన్యానికి కనీసం మూడ్రోజులపాటు ఆరబెట్టుకునేందుకు రూ.వెయ్యి నుంచి రెండువేల వరకు డిమాండ్ చేస్తున్నారు. వర్షాలు మరో నాలుగైదు రోజులు కొనసాగితే అద్దె భారం తడిసి మోపెడవక తప్పని పరిస్థితి. అమ్ముకోవాలంటే మండపేటకు వెళ్లండిఇదిలా ఉంటే.. కృష్ణాజిల్లాలో రైసుమిల్లుల వద్ద ధాన్యం లోడులతో వందలాది లారీలు బారులుతీరాయి. దీంతో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడంలేదు. పైగా.. అమ్ముకోవాలంటే మండపేట మిల్లులకు తరలించుకోవాలని రైతులకు ఉచిత సలహా ఇస్తున్నారు. కృష్ణాజిల్లా నుంచి మండపేట తరలించాలంటే రైతులకు రవాణా చార్జీలు తడిసిమోపెడవుతాయి. ఒకవేళ వ్యయప్రయాసలకోర్చి తరలించినా మండపేట మిల్లుల వద్ద కూడా 3–4 రోజుల పాటు పడిగాపులు పడాల్సిన పరిస్థితులున్నాయని చెబుతున్నారు. జీఎల్టీ చెల్లింపుల ఊసులేదు.. వైఎస్ జగన్ హయాంలో హమాలీల చార్జీలు భరించడంతో పాటు రవాణా సౌకర్యాలను ప్రభుత్వమే సమకూర్చేది. ఒకవేళ రైతే సొంతంగా తరలించుకుంటే గన్నీ, లేబర్, ట్రాన్స్పోర్టు (జీఎల్టీ) చార్జీలు నేరుగా రైతుల ఖాతాలో జమచేసేది. కానీ, టీడీపీ కూటమి ప్రభుత్వంలో హామీల చార్జీలు చెల్లించడంగానీ, రవాణా సౌకర్యాలు కల్పించడంగానీ ఎక్కడా జరగడంలేదు. మంత్రి నాదెండ్ల ప్రచారార్భాటం.. విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారిపై 60 కిలోమీటర్ల పొడవునా ఇరువైపులా సర్వీవస్ రోడ్లలో ధాన్యం రాశులే కన్పిస్తున్నాయి. తుపాను హెచ్చరికలు ఉన్నప్పటికీ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం రాసులు శనివారం కురిసిన వర్షానికి తడిసి ముద్దయ్యాయి. పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ వారం జిల్లా పర్యటనలో ప్రచారార్భాటానికి ఇచ్చిన ప్రాధాన్యత ధాన్యం కొనుగోళ్లపై పెట్టలేదని సాక్షాత్తు రైతులే ఆరోపించారు. నిజానికి.. రోడ్లపై ఆరబడిన ధాన్యాన్ని 48 గంటల్లోనే మిల్లులకు తరలిస్తామని మంత్రి ఆర్భాటంగా ప్రకటన చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో ఎక్కడా ఆ పరిస్థితిలేదు. కృష్ణా జిల్లా కంకిపాడు సమీపంలో తడిసిపోయిన వరి పనలు జిల్లాల్లో ఇదీ పరిస్థితి..⇒ ఉత్తరాంధ్రలో విశాఖ, శ్రీకాకుళం, మన్యం జిల్లాల్లో 50–60 శాతం కోతలు పూర్తికాగా, అనకాపల్లి జిల్లాలలో కేవలం 12 శాతం మాత్రమే కోతలు పూర్తయ్యాయి. ఈ జిల్లాల్లో తుపాన్ ప్రభావం పెద్దగా ఉండదని అంచనా వేస్తున్నారు. అయితే, ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిస్తే ధాన్యం రంగుమారి రైతులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందంటున్నారు. ⇒ పూర్వపు ఉభయ గోదావరి జిల్లాల్లో 60–70 శాతం కోతలు పూర్తయ్యాయి. కళ్లాల్లో లక్ష టన్నులకు పైగా ధాన్యం రాసులు పోసి ఉన్నాయి. దాదాపు లక్ష ఎకరాల పంట పక్వానికి వచ్చి కోతకు సిద్ధంగా ఉంది. ఈ దశలో వర్షాలు కురిస్తే కళ్లాల్లో ఉన్న ధాన్యం రంగుమారడమే కాదు.. వర్షపు నీరు పొలాల్లో చేరి కనీసం 2–3 రోజులుంటే పక్వానికి వచ్చిన పంటకు కూడా తీవ్రనష్టం తప్పదంటున్నారు. ⇒ ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో 30–40 నూరి్పడి చేసిన ధాన్యాన్ని రోడ్లపై ఎక్కడపడితే అక్కడ పోసి ఆరబెట్టుకుంటున్నారు. ఈ డెల్టా పరిధిలో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కోతకు వచి్చన వరి పంట నేలవాలింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు మొలకలొచ్చే పరిస్థితులు కని్పస్తున్నాయి. పొలాల్లో వర్షపు నీరుచేరితే నష్ట తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ⇒ గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో వరి పంట కోతకు సిద్ధంగా ఉంది. ఇప్పటివరకు కేవలం 15 శాతానికి మించి కోతలు పూర్తికాలేదు. కోత కోసి ఓదె మీద ఉన్నప్పుడు వర్షం వస్తే నష్టం ఎక్కువగా ఉంటుందనే ఆలోచనతో యంత్రాలతోనే నూర్పిడికి మొగ్గు చూపుతున్నారు. ఆది, సోమవారాల్లో భారీ వర్షాలు పడితే తాము నిండా మునిగిపోతామని రైతులు కలవరపడుతున్నారు. ఈ జిల్లాల్లో తీతకు సిద్ధంగా ఉన్న పత్తి, వాగుల వెంబడి ఉన్నా మిరప పంటలు దెబ్బతినే అవకాశం కన్పిస్తోంది. ⇒ నెల్లూరు జిల్లాలో రైతులు ముందస్తు రబీకి సన్నాహాలు చేసుకుంటున్నారు. జలాశయాల్లో నీరు సమృద్ధిగా ఉండడంతో ఈ జిల్లాల్లో వరి సాగుకు రైతులు ఉత్సాహం చూపుతున్నారు. పెన్నా డెల్టా, కనుపూరు కాలువల కింద వరి నారుమడుల కోసం విత్తనాలు జల్లారు. మరికొన్నిచోట్ల నారుమడులు సిద్ధంచేసుకుంటున్నారు. ఈ దశలో 2–3 రోజులు వర్షాలు కురిసి, పొలాల్లో నీరుచేరితే నష్టపోతామని రైతులు చెబుతున్నారు. ⇒ తిరుపతి, ప్రకాశం జిల్లాల్లో పంట 45–60 రోజుల దశలో ఉంది. ఈ జిల్లాల్లో కూడా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురిసి చేలల్లో చేరిన నీరు నిలిస్తే మాత్రం నష్టతీవ్రత ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. -
కాళేశ్వరం లేకున్నా రికార్డు వరి పంట
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీరు అందించకపోయినా రాష్ట్రంలో ఈ ఏడాది రికార్డు స్థాయిలో వరి ధాన్యం ఉత్పత్తి అవుతున్నదని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా ఈ ఏడాది 1.53 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా వేసినట్లు చెప్పారు.కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్లనే రాష్ట్రంలో వరి ఉత్పత్తి పెరిగిందని ప్రచారం చేసిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడేం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. శుక్రవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో మంత్రులు మీడియాతో మాట్లాడారు. అధికార దాహంతో ఉన్న బీఆర్ఎస్ పారీ్ట.. రైతులకు మేలు చేస్తున్న రేవంత్రెడ్డి ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో రెండోస్థానం కోసం బీజేపీ కుయుక్తులు పన్నుతోందని మండిపడ్డారు. 40 లక్షల ఎకరాల్లో సన్నాల సాగు రాష్ట్రంలో గతంలో 25 లక్షల ఎకరాల్లో సన్నవడ్లు సాగు చేస్తే, ఈ ఏడాది సన్నాలకు రూ.500 బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించటంతో 40 లక్షలకు పైగా ఎకరాల్లో రైతులు సాగు చేశారని మంత్రులు తెలిపారు. వచ్చే సంక్రాంతి నుంచి రేషన్ షాపులు, గురుకులాలు, హాస్టళ్లలో సన్నబియ్యం పంపిణీ చేస్తామని ప్రకటించారు. ‘గత ఏడాది ఇదే సమయానికి 17 జిల్లాల్లో కొనుగోళ్లు ప్రారంభిస్తే.. ఈ ఏడాది 25 జిల్లాల్లో కొనుగోళ్లు చేస్తున్నాం.గత ఏడాది ఈ కాలానికి 9.35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగులో చేస్తే.. ఈ ఏడాది 9.58 లక్షలు మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశాం. వాస్తవాలు ఇలా ఉంటే ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తూ రైతుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాయి’అని ఆగ్రహం వ్యక్తంచేశారు. హింస ప్రేరిపిస్తోంది విపక్షాలే.. ప్రతిపక్షాలు రైతులను, ప్రజలను రెచ్చగొట్ట హింసను ప్రేరిపిస్తున్నాయని మంత్రులు విమర్శించారు. పరిశ్రమలకు భూములు సేకరించే సమయంలో ప్రజాభిప్రాయ సేకరణను నేరుగా ముఖ్యమంత్రి, స్థానిక ప్రజాప్రతినిధులు చేపట్టడం దేశ చరిత్రలో ఎక్కడా లేదని, దీనిపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఇష్టానుసారంగా మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఆగ్రహం వ్యక్తంచేశారు. కొడంగల్లో ఫార్మా కంపెనీల ఏర్పాటు విషయంలో రైతులతో మాట్లాడేందుకు సీఎం, మంత్రులు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.ధాన్యంలో తేమ 17 శాతానికి మించరాదన్న కేంద్ర ప్రభుత్వ నిబంధన వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని మంత్రులు తెలిపారు. ఈ నిబంధన సడలించేలా రాష్ట్రంలోని బీజేపీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తేవాలని సూచించారు. తేమశాతాన్ని పక్కనపెట్టి ప్రైవేటు వ్యాపారులు అధిక ధరకు రైతుల నుంచి ధాన్యం కొంటున్నారని చెప్పారు. -
పొలం పనుల్లో హీరోయిన్ శ్రియ.. వీడియో వైరల్
ఈ మధ్య కాలంలో అంతగా సినిమాలు చేయడం లేదు శ్రియ. ఒకట్రెండు సినిమాలు, వెబ్ సిరీస్ మాత్రమే చేస్తున్నారు. షూటింగ్ లేని సమయాల్లో తన కుమార్తె రాధతో కలిసి సమయాన్ని గడుపుతున్నారు. కూతురికి ఆట పాటలు నేర్పడంతో పాటు ఇంకా బోలెడన్ని విషయాలు నేర్పుతున్నారు.ఆసక్తికరమైన విషయం ఏమిటంటే రాధను ఆమె పొలానికి తీసుకెళ్లి వ్యవసాయంపై అవగాహన కల్పించారు. పంట నూర్పిళ్ల విధానాన్ని తన కూతురుకి తెలియజేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. పొలాలంటే ఏంటో నేటితరానికి పెద్దగా తెలియడం లేదు. ఈ నేపథ్యంలో శ్రియ తన కుమార్తెను ఇలా పొలానికి తీసుకెళ్లడం, నూర్పిళ్లు ఎలా చేస్తారో తానే స్వయంగా చేసి చూపంచడం హాట్టాపిక్గా మారింది.సెల్ఫోన్లతో పిల్లలు బిజీగా ఉంటున్న ఈ కాలంలో శ్రియ ఇలా చేయడం అభినందనీయమని పలువురు నెటిజన్లు ఆమెను అభినందిస్తున్నారు. ఇక శ్రియ సినిమాల విషయానికి వస్తే.. సూర్య హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సూర్య 44’(వర్కింగ్ టైటిల్) సినిమాలో కీలక పాత్ర చేస్తున్నారు. View this post on Instagram A post shared by Pinkvilla South (@pinkvillasouth) -
ప్రతి గింజా కొంటాం
సాక్షి, హైదరాబాద్: రైతు పండించిన ప్రతి గింజకు మా ప్రభుత్వం మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తుంది. 7,750 ధాన్యం కొనుగోలు కేంద్రాలను తెరిచాం. ఇది గత ప్రభుత్వం కంటే చాలాఎక్కువ. కేంద్రాల్లో పనిచేసే సిబ్బందికి శిక్షణ ఇచ్చి అన్ని సదుపాయాలు కల్పించాం. ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన నిధులు కూడా సమీకరించాం. రూ.30 వేల కోట్ల వరకు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 70–75 శాతం మిల్లర్లు ధాన్యం కొనుగోళ్లకు సహకరిస్తున్నారు. వారు సహకరించని ప్రాంతాల్లో పౌరసరఫరాల సంస్థ ద్వారా మార్కెట్ కమిటీల ఆధ్వర్యంలో కొనుగోలు చేస్తాం. రైతులెవరూ ఆందోళన పడొద్దు’అని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోళ్లపై ఆదివారం ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రశ్న: కొన్ని ప్రాంతాల్లో మిల్లర్లు సహకరించక రైతులు ఇబ్బంది పడుతున్నారు కదా ? ఉత్తమ్: ధాన్యం కొనుగోళ్లకు సహకరించాలని మిల్లర్లకు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం. రైతులకు మద్దతు ధరకన్నా, తక్కువ చెల్లింపులు చేస్తే కఠిన చర్యలు తప్పవు. మిల్లర్లు సహకరించని ప్రాంతాల్లో రైతులకు ఇబ్బంది కలగకుండా పౌరసరఫరాల సంస్థ ద్వారా కొనుగోళ్లు చేసి గోదాముల్లో నిల్వ చేసేందుకు ఏర్పాట్లు చేశాం. ఎక్కడా మేజర్ సమస్యల్లేవు. ప్రశ్న: బ్యాంకు గ్యారంటీ నిబంధన ఉపసంహరించాలని మిల్లర్లు కోరుకుంటున్నారు కదా? ఉత్తమ్: గత ప్రభుత్వం మిల్లర్ల వద్ద స్టాక్ ఉంచి ఏ సెక్యూరిటీ తీసుకోలేదు. ఏపీలో 100 శాతం సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించి మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. మన దగ్గర సైతం ప్రారంభ దశలో మిల్లర్ల ట్రాక్ రికార్డు ఆధారంగా స్టాక్ విలువలో 10 శాతం, 20 శాతం, 25 శాతాన్ని సెక్యూరిటీ డిపాజిట్గా తీసుకోవాలని నిర్ణయించాం. రాష్ట్ర మిల్లర్ల సంఘం ఒప్పుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నాం. బాండ్ పేపర్పై పూచీకత్తు రాసిచ్చి కూడా ధాన్యం కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పించాం. ప్రశ్న: మిల్లర్లకు ఏమైనా వెసులుబాటు కల్పిస్తారా? ఉత్తమ్: ఏపీతో పోలి్చతే రాష్ట్రంలో బ్యాంకు గ్యారంటీలు చాలా తక్కువే. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మిల్లర్లకు టన్నుకు రూ.10 చొప్పున మిల్లింగ్ చార్జీలు చెల్లించగా, ఇప్పుడు మేము దొడ్డు రకానికి రూ.40, సన్న రకానికి రూ.50 చొప్పున పెంచాం. ఏపీలో డిఫాల్ట్ అయిన మిల్లర్ల నుంచి 150 శాతం జరిమానా వసూలు చేస్తే, మన దగ్గర 120 శాతమే వసూలు చేస్తున్నాం.గతంలో మిల్లర్లకు సీఎంఆర్ ధాన్యం కేటాయింపుల్లో చాలా అవినీతి జరిగేది. ఇప్పుడు శాస్త్రీయ సిద్ధాంతం ఆధారంగా ఏ మిల్లర్కు ఎంత ఇవ్వాలో నిర్ణయించి ఇస్తున్నాం. ప్రశ్న: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కూడా రైతులు ఇబ్బంది పడుతున్నట్టు వార్తలొచ్చాయి ? ఉత్తమ్: ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లో సజావుగా ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఒకరిద్దరు మినహా స్థానిక మిల్లర్లందరూ సహకరిస్తున్నారు. (మంత్రి ఉత్తమ్ సూర్యాపేట, నల్లగొండ, భువనగిరి జిల్లాల కలెక్టర్లకు అప్పటికప్పుడు ఫోన్ చేసి పరిస్థితిని ఆరా తీశారు. కలెక్టర్ల నుంచి మంచి ఫీడ్బ్యాక్ ఉందని చెప్పారు.) ప్రశ్న: ఈ సారి రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి వచి్చంది.ఎలాంటి ఏర్పాట్లు చేశారు ? ఉత్తమ్: గతంలో ఎన్నడూ లేనంతగా రాష్ట్రంలో ఈసారి రికార్డు స్థాయిలో 66.7లక్షల ఎకరాల్లో 40 లక్షల మంది రైతులు 155 మెట్రిక్ టన్నుల ధాన్యం పండించారు. ధాన్యం కొనుగోలు చేసిన మూడు నాలుగు రోజుల్లోనే వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులను జమ చేస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టుతోనే రాష్ట్రంలో వరి ధాన్యం పెరిగిందని గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పుకున్నదంతా అబద్ధమని ఈసారి తేటతెల్లమైంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల నుంచి చుక్కనీరు సరఫరా చేయకపోయినా ఈ ఖరీఫ్లో రికార్డు స్థాయిలో ధాన్యం పండింది. ప్రశ్న: సన్నాలకు రూ.500 బోనస్ చెల్లిస్తామన్నా, రైతులు వ్యాపారులు, మిల్లర్లకు నేరుగా అమ్ముకుంటున్నారు కదా ? ఉత్తమ్: కేంద్రం ప్రకటించిన మద్దతు ధరతో దొడ్డు రకం ధాన్యం, దానికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరో రూ.500 బోనస్ చెల్లించి సన్నరకం ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నది. కొనుగోలు కేంద్రాలకు సన్న రకం ధాన్యం ఎంత వచ్చినా బోనస్ చెల్లించి కొనుగోలు చేస్తాం. పండించిన ధాన్యం అమ్ముకునే విషయంలో రైతులపై ఆంక్షలు లేవు. సన్నాలకు మద్దతు ధర రూ.2320కు బోనస్ రూ.500 కలిపితే వచ్చే ధర కంటే అధిక ధరతో అమ్ముకునే అవకాశం వస్తే రైతులకు, ఆర్థిక వ్యవస్థకు, రాష్ట్రానికి మంచిది. ప్రశ్న: రైతులు సన్నాలను ప్రభుత్వానికి అమ్మకపోతే వచ్చే సంక్రాంతి నుంచి రేషన్షాపుల్లో సన్న బియ్యం పంపిణీ ఎలా చేస్తారు ? ఉత్తమ్: రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీకి ఇబ్బంది లేకుండా అవసరమైన సరుకు సమీకరణ చేస్తాం. ఇబ్బందులేమీ రావు. ప్రశ్న: ధాన్యం సేకరణలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని బీఆర్ఎస్, బీజేపీ ఆరోపణలు చేస్తున్నాయి ? ఉత్తమ్: నల్లగొండ జిల్లాలో రైతులు రోడ్లపై ఆరబోసుకున్న ధాన్యం వీడియోలు తీసి రైతులు రోడ్లపై పారబోశారని బీఆర్ఎస్ వారు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. 17శాతం, ఆలోపే తేమ ఉండాలని కేంద్రమే నిర్దేశించింది. మద్దతు ధర సైతం కేంద్రమే నిర్ణయించింది. దాని ప్రకారమే ధాన్యం కొనుగోళ్లు చేస్తుంటే బీజేపీ నేతలు కేంద్రాలకు వెళ్లి ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉంది. -
తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై రాజకీయ రగడ
-
సన్న బియ్యం పెద్ద లొల్లి
-
మండుటెండల్లోనూ నిండా ముంచే..రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం
సాక్షి నెట్వర్క్: అకాల వర్షం పుట్టి ముంచింది. కల్లాల్లో, కొనుగోలు కేంద్రాల్లో ఉన్న వరి ధాన్యాన్ని ముంచేసింది. చెట్లపై ఉన్న మామిడి కాయలను రాల్చేసింది. ఈదురుగాలులతో విరుచుకుపడి పలువురి ప్రాణాలనూ బలిగొంది. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు కురిసిన వాన బీభత్సం సృష్టించింది. వరి ధాన్యం కొట్టుకుపోయింది. ఈదురుగాలుల ధాటికి ఇళ్ల పైకప్పులు లేచిపోయాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వరంగల్: నీట మునిగిన ధాన్యం వరంగల్ ఉమ్మడి జిల్లాలో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. జనగామ వ్యవసాయ మార్కెట్ వెయ్యి బస్తాల ధాన్యం తడిసిపోయింది. బచ్చన్నపేట, జనగామ రూరల్, పాలకుర్తి, రఘునాథపల్లి, స్టేషన్ఘన్పూర్, దేవరుప్పుల తదితర మండలాల్లో విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, 33కేవీ లైన్లు నేలకొరిగాయి. చిల్పూరు, జనగామ, బచ్చన్నపేట, నర్మెట, తరిగొప్పుల మండలాల్లో వందల ఎకరాల్లో మామిడి కాయలు రాలిపోయాయి. భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం నల్లగుంట మీనాజీపేట, కిష్టాపూర్, మహాముత్తారం, కోనంపేటలలో ధాన్యం కొట్టుకుపోయింది. ములుగు జిల్లా వెంకటాపురం(కె) మండలంలో ధాన్యం తడిసింది. మహబూబాబాద్ జిల్లా కురవి, బయ్యారం, గంగారం, మహబూబాబాద్ రూరల్ మండలాల్లో పంటలకు నష్టం జరిగింది. హనుమకొండ జిల్లా కమలాపూర్లో ధాన్యం నీట కొట్టుకుపోయింది. కరీంనగర్: వడగళ్ల వాన మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో.. ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు, మార్కెట్ యార్డుల్లో ధాన్యం తడిసిపోయింది. పలు గ్రామాల్లో ఇళ్లపై కప్పు రేకులు ఎగిరిపోయాయి. వడగళ్ల వానతో కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలోని పలు మండలాల్లో మామిడికాయలు రాలిపోయాయి. జమ్మికుంటలో మొక్కజొన్న పంట దెబ్బతిన్నది. ఉమ్మడి ఆదిలాబాద్: వాన తిప్పలు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఈదురుగాలులతో కురిసిన వర్షంతో రైతులు తిప్పలు పడ్డారు. పలుచోట్ల ధాన్యం తడిసిపోయింది. సిరికొండ, ఇంద్రవెల్లి, ఇచ్చోడ, తలమడుగు మండలాల్లో వడగళ్ల వాన కురిసింది. నర్సాపూర్(జీ), నిర్మల్, లక్ష్మణచాంద మండలాల్లో తీవ్రంగా ఈదురుగాలులు వీయడంతో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేల కూలయి. ఆసిఫాబాద్ మండలంలో కోతకు వచ్చిన వరిపంట నేలకొరిగింది. ఉమ్మడి నల్లగొండ: దెబ్బతిన్న మామిడి నల్లగొండ ఉమ్మడి జిల్లా పరిధిలో పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వానలు పడ్డాయి. వందల ఎకరాల్లో మామిడి కాయలు రాలిపోయాయి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట, చౌటుప్పల్, బీబీనగర్, పోచంపల్లి, మోత్కూరు మండలాల్లో చాలాసేపు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. యాదాద్రి కొండపై ఈదురుగాలులు, వానతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చలువ పందిళ్లు నేలకూలాయి. క్యూకాంప్లెక్స్ పైకప్పు రేకులు ఎగిరి సమీపంలో ఉన్న వాహనాలపై పడ్డాయి. ఉమ్మడి నిజామాబాద్: వణికించిన ఈదురుగాలులు బలమైన ఈదురుగాలులు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాను వణికించాయి. నాలుగైదు గంటల పాటు గాలివాన బీభత్సం సృష్టించింది. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చెట్లు విరిగిపడ్డాయి. పలుచోట్ల ధాన్యం తడిసిపోయింది. ఉమ్మడి రంగారెడ్డి: నీట మునిగిన కాలనీలు రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలుల వాన వణికించింది. పలుచోట్ల వడగళ్లు కురిశాయి. మామిడి నేల రాలింది. చేవెళ్ల, మొయినాబాద్, యాచారం మండలాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగింది. షాద్నగర్ పట్టణంలోని లోతట్టు కాలనీలు నీటమునిగాయి. ఉమ్మడి మెదక్ జిల్లా: ముంచెత్తిన వాన మెదక్ ఉమ్మడి జిల్లాను అకాల వర్షం ముంచెత్తింది. సిద్దిపేట పత్తి మార్కెట్ యార్డులో 3 వేల బస్తాలకుపైగా ధాన్యం మొత్తం తడిసింది. సంగారెడ్డి జిల్లా అందోల్ మండలంలో భారీగా ధాన్యం తడిసింది. పటాన్చెరు నియోజకవర్గంలో పలుచోట్ల చెట్లు విరిగిపడి ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జిన్నారం, హత్నూర మండలాల్లో వడగళ్లు పడ్డాయి. ధాన్యం తడిసిపోయింది. జిల్లాలో రెండు ఇళ్లు, ఓ హోటల్ పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. మెదక్ జిల్లా చిలప్చెడ్ మండలంలో ధాన్యం నీట మునిగింది. హైదరాబాద్ ఆగమాగం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం హైదరాబాద్ నగరాన్ని ఆగమాగం చేసింది. మియాపూర్లో ఏకంగా 13.3 సెంటీమీటర్లు, కూకట్పల్లిలో 10.7 సెంటీమీటర్లు భారీ వర్షపాతం నమోదైంది. మూసాపేట గూడ్స్òÙడ్ రోడ్డులో పార్కింగ్ చేసిన లారీలు, కంటైనర్ లారీలు మట్టి దిగబడి ఓ వైపు ఒరిగి పోయాయి. చాలా ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు, హోర్డింగ్స్ కూలిపోయాయి. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. అత్తాపూర్లో ఇళ్ల రేకులు ఎగిరిపోయి సమీపంలోని సబ్స్టేషన్లో పడటంతో భారీగా మంటలు చెలరేగాయి. ప్రధాన రహదారులపై వరద నీరు చేరడంతో తీవ్రంగా ట్రాఫిక్ జామ్ అయింది. ‘వాన’ దెబ్బకు ఆరుగురు బలి రాష్ట్రవ్యాప్తంగా ఈదురుగాలులు, వర్షం ధాటికి చెట్ల కొమ్మలు విరిగిపడి, గోడలు కూలి, పిడుగులు పడి ఆరుగురు మరణించారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. వరంగల్ జిల్లా సంగెం మండలం ఇల్లందలో చెట్టు కొమ్మలు విరిగిపడి బీటెక్ విద్యార్థి ఆబర్ల దయాకర్ (22) మృతిచెందాడు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం రాయిలాపూర్ (నాగ్సాన్పల్లి) శివారులోని మామిడితోటలోని కోళ్ల ఫారం గోడ కూలడంతో ఇద్దరు కూలీలు అక్కడిక్కడే మరణించారు. పిడుగుపాటుకు గురై సంగారెడ్డి జిల్లా అందోల్ మండల ఎర్రారంలో గోవిందు పాపయ్య (52), సిద్దిపేట జిల్లాలో కుకునూరుపల్లికి చెందిన మల్లేశం (33)మృతి చెందారు. హైదరాబాద్ బాచుపల్లిలో గోడ కూలి.. భారీ వర్షం కారణంగా హైదరాబాద్లోని బాచుపల్లి రేణుక ఎల్లమ్మ కాలనీలోని నిర్మాణంలో ఉన్న ఓ భవనం రిటైనింగ్ వాల్ కూలిపోయింది. ఆ పక్కనే ఉన్న రేకుల ఇళ్లపై గోడ, మట్టిపెళ్లలు విరిగిపడ్డాయి. దీంతో వాటిలో నివాసం ఉంటున్న ఏడుగురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాల కింద కొందరు కూరుకుపోయి ఉంటారని భావిస్తున్నారు. వేగంగా సహాయక చర్యలు చేపడుతున్నారు. కూలీలు ఇచ్చిన వివరాల మేరకు 8 మంది వరకు శిథిలాల కింద కూరుకుపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. మంగళవారం అర్ధరాత్రికల్లా శిథిలాల కింద ఒకరి మృతదేహాన్ని గుర్తించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. -
మా ప్రభుత్వంలో రైతులు ఒక్క రూపాయి కూడా నష్టపోకూడదు
-
అడవి పందుల కోసమని ఏర్పాటు చేస్తే.. చివరికి ఇలా..!
మహబూబ్నగర్: అడవి పందుల బారినుంచి పంటను కాపాడుకునేందుకు ఏర్పాటు చేసిన విద్యుత్ వైరు తగిలి షాక్తో ఇద్దరు రైతులు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ విషాదకర సంఘటన గురువారం రాత్రి వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం మండలంలోని రుక్కన్నపల్లి శివారులో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. రుక్కన్నపల్లితండాకు చెందిన రాములునాయక్(37) రుక్కన్నపల్లి, కోతులకుంట తండాల శివారులో ఐదున్నర ఎకరాల్లో వరిపంట సాగు చేశాడు. ప్రస్తుతం పంట కోత దశకు వచ్చింది. ఈ క్రమంలో అడవి పందులు పంటను నాశనం చేస్తుండటంతో కొన్నిరోజుల నుంచి చుట్టూ విద్యుత్ కంచె ఏర్పాటు చేసి రాములు అత్తగారి ఇంటి నుంచి కరెంట్ కనెక్షన్ ఇచ్చారు. గురువారం రాత్రి అతనికి తోడుగా సోళీపురం గ్రామానికి చెందిన జాలికాడి నర్సింహులు(45)ను పిలుచుకున్నాడు. ఇద్దరూ కలిసి పొలం దగ్గరకు వెళ్లారు. ఇదే సమయంలో ప్రతిరోజు మాదిరిగానే రాములునాయక్ భార్య శారద ఇంటి దగ్గర కరెంట్ ఆన్ చేయడానికి తన భర్తను అడిగేందుకు ఫోన్లో చేసింది. అయితే అప్పటికే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. దీంతో ప్రతిరోజు లాగే గురువారం సైతం కరెంట్ ఆన్ చేసింది. ఈ విషయం తెలియని రాములునాయక్, జాలికాడి నర్సింహులు ఇద్దరూ వరి చేను దగ్గరకు వెళ్లగా.. కరెంట్ తీగలు తగలడంతో విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతిచెందారు. తర్వాత అటుగా వెళ్లిన ఇతర పొలాల రైతులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో ఇరు కుటుంబాల సభ్యులతోపాటు రెండు గ్రామాల ప్రజలు పెద్దఎత్తున ఘటనా స్థలానికి చేరుకున్నారు. అర గంట ముందు వరకు కళ్ల మందు ఉన్న వ్యక్తులు అంతలోనే విగతజీవులుగా మారడంతో బోరుమని విలపించారు. రాములు నాయక్కు భార్యతోపాటు ముగ్గురు ఆడపిల్లలు ఉండగా.. నర్సింహకు భార్య బొజ్జమ్మతోపాటు ఒక కుమారుడు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. -
ఒక్క రోజులోనే మార్కెట్కు 6వేళ క్వింటాళ్ల వరి ధాన్యం
జనగామ: వానాకాలం సీజన్లో ముందస్తు సాగు చేసిన వరి ‘కోతలు’ ముమ్మరంగా సాగుతున్నాయి. ఆరుగాలం కష్టించి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు మార్కెట్ బాట పట్టారు. దీంతో రికార్డు స్థాయిలో వస్తున్న ధాన్యం రాశులతో జనగామ వ్యవసాయ మార్కెట్ నిండి పోతున్నది. గురువారం ఒక్కరోజే ఆరువేల క్వింటాళ్లకు పైగా ధాన్యం కొనుగోలు చేశారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు రూ.500 తక్కువగా వ్యాపారులు కొనుగోలు చేస్తుండడంతో మరో రూ.200 పెచేలా చూడాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో వానాకాలం సీజన్ 1.72 లక్షల ఎకరా ల్లో వరి సాగు చేశారు. ఏటా ఈ సీజన్లో కత్తెర సాగుతో పాటు రెగ్యులర్ పంట వేసుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. సెప్టెంబర్ రెండవ వారం వరకు కత్తెర కోతలు పూర్తి కాగా.. ప్రస్తుతం ముంద స్తు నాట్లు వేసిన రైతులు వరి కోతలు ప్రారంభించారు. ధాన్యంతో జనగామ మార్కెట్కు ఉదయం వచ్చిన రైతులు, సాయంత్రాని ఇంటికి వెళ్లేలా పాలకమండలి, అధికారులు చర్యలు చేపట్టారు. రోజూ ఉదయం 5 నుంచి 10 గంటల వరకు సరుకును లోనికి అనుమతిస్తూ.. మధ్యాహ్నం రెండు గంటల వరకు మార్కెట్ గేటు మూసి వేస్తున్నారు. ఎంట్రీ చేసిన సరుకుకు ఈ–నామ్లో టోకెన్ కేటాయించి గేట్ ఎంట్రీ వద్ద లాట్ నంబర్ ఇస్తున్నారు. ఉద యం బిడ్డింగ్ మొదలైన తర్వాత ఆలస్యంగా వచ్చిన ధాన్యం వాహనాలను అనుమతించి మరుసటి రోజు కొనుగోలు చేస్తున్నారు. 43 లక్షల క్వింటాళ్ల ధాన్యం వానాకాలం సీజన్లో 43 లక్షల క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సీజన్లో ప్రభుత్వం 1.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతుండగా.. ప్రస్తుతం ప్రైవేటు మార్కెట్లో కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. 2023–24 సంవత్సరం కేంద్ర ప్రభుత్వం వరి పంటకు కనీస మద్దతు ధర ఏ–గ్రేడ్ రూ.2,203, సాధారణ గ్రేడ్కు రూ.2,183 ప్రకటించింది. కత్తెర, ముందస్తు సాగు చేసిన వరి కోతలు మొదలై మార్కెట్లోకి పెద్ద ఎత్తున సరుకు వస్తున్నప్పటికీ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు నేటికి ప్రారంభం కాలేదు. దీంతో మార్కెట్లో ప్రైవేట్ వ్యాపారులు మద్దతు ధరకు సుమారు రూ.500 తక్కువగా కొనుగోలు చేస్తున్నారు. తేమ అధికంగా ఉండడం వల్లే ధర ఇవ్వలేక పోతున్నామని వ్యాపారులు చెబుతున్నారు. 56వేల క్వింటాళ్ల కొనుగోళ్లు ఈ ఏడాది ఆగస్టు 30 నుంచి గురువారం వరకు జనగామ వ్యవసాయ మార్కెట్లో 1,262 మంది రైతుల వద్ద 56,074(85,169 బ్యాగులు) క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశారు. క్వింటాకు ధర గరిష్టంగా రూ.2,079, రూ.1,961, రూ.1,859, కనిష్టంగా రూ.1,911, 1,720, రూ,1,609, రూ.1,405, మోడల్ ప్రైజ్ రూ.1,899, రూ.1,913, రూ.1,779, రూ.1,889 ధర పలికింది. ధర తక్కువగా వచ్చింది పదెకరాల్లో వరి సాగు చేసినం. పెట్టుబడికి రూ.2.50లక్షలు ఖర్చయింది. ముందుగా నాట్లు వేసిన ఆరు ఎకరాల్లో కోతలు పూర్తి చేసినం. 180 బస్తాల దిగుబడి రాగా జనగామ మార్కెట్కు వచ్చినం. ప్రభుత్వ మద్దతు ధరకంటే.. తక్కువగా కొనుగోలు చేశారు. సరుకు పచ్చిగా ఉందని క్వింటాకు రూ.1,765 మాత్రమే ధర ఇచ్చారు. విధిలేక అమ్ముకున్నాం. ధర మరో రూ.150 ఎక్కువ వస్తే బాగుండేది. శ్రమకు ఫలితం రావడం లేదు. – బాలోతు కళమ్మ, మహిళా రైతు, పెద్దపహాడ్(ఎర్రకుంటతండా) కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి ఐదెకరాల్లో వరి సాగు చేస్తే రెండు ఎకరాల్లో కోతలు పూర్తయ్యా యి. 90 బస్తాల దిగుబడి రాగా మార్కెట్కు తెచ్చిన. క్వింటాకు రూ.1,708 ధర పెట్టిండ్లు. రూ.1,800 ఇవ్వాలని కొట్లాడినా ఫలితంలేదు. ధాన్యానికి సరైన ధర రావాలంటే ప్రభుత్వం వెంట నే గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. – భూక్యా సరక్రూ, రైతు, మచ్చుపహాడ్, నర్మెట ధర పడిపోకుండా చూస్తున్నాం.. మార్కెట్కు వచ్చిన ప్రతి గింజకు మంచి ధర వచ్చేలా చూస్తున్నాం. ఈ–నామ్ పద్ధతిలో విక్రయాలు జరుగుతున్నాయి. ఎక్కువగా పచ్చి సరుకు రావడంతో ధర పడిపోకుండా చూస్తున్నాం. ఏ ఒక్క రైతుకు నష్టం జరగకుండా పర్యవేక్షిస్తున్నం. – బాల్దె సిద్ధిలింగం, మార్కెట్ చైర్మన్ -
వరిలో అగ్గి తెగులు నివారణ
-
రైతులకు గుడ్న్యూస్.. పంటల గిట్టుబాటు ధర పెంచిన కేంద్రం
సాక్షి, ఢిల్లీ: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు గుడ్న్యూస్ చెప్పింది. ఈ ఏడాది ఖరీఫ్లో పలు పంటలకు గిట్టుబాటు ధరల పెంపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో వరికి కనీస మద్దతు ధర 7 శాతం పెంచింది. పెసర్లకు కనీస మద్దతు ధర 10 శాతం పెంపు, అలాగే, క్వింటా కందులు రూ.7వేలు, రాగులు రూ.3,846, పత్తి రూ.6,620, సోయాబీన్ రూ.4,600, నువ్వులు రూ.8,635, మొక్కజొన్న రూ.2,050, సజ్జలు రూ.2,500లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది కేబినెట్. ఇది కూడా చదవండి: అమిత్ షా ఇంటి వద్ద మణిపూర్ మహిళలు నిరసన -
ఒక్క రైతూ ఇబ్బంది పడకూడదు.. అధికారులకు సీఎం జగన్ ఆదేశం
సాక్షి, అమరావతి: అకాల వర్షాలతో తడిసిన, మొలకెత్తిన, తేమ శాతం అధికంగా ఉన్న ధాన్యం కొనుగోలు విషయంలో ఏ ఒక్క రైతూ ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లపై తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. రోడ్లపైన, వ్యవసాయ క్షేత్రాల వద్ద రైతులు ఆరబెట్టిన ధాన్యాన్ని యుద్ధప్రాతిపదికన తరలించడానికి ఏర్పాట్లు చేయాలన్నారు. గన్నీ బ్యాగుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. ఏ రైతూ మిల్లర్ల వద్దకు వెళ్లొద్దు ఇప్పటికే వ్యవసాయ క్షేత్రాల నుంచి మిల్లులకు ధాన్యం రవాణా చేయడానికి అనుమతిచ్చాం. వర్షాల ప్రభావం ఉన్న జిల్లాల్లో గన్నీ బ్యాగ్ల కొరత లేకుండా చూడాలి. అవసరమైతే పొరుగు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున గన్నీ బ్యాగ్లను ఆయా జిల్లాలకు తరలించాలి. రైతులు మిల్లులను సందర్శించడం, మిల్లర్లను కలవడం వల్ల రైతులపై అనవసరమైన ఒత్తిళ్లు తీసుకొస్తారు. ఇది ప్రతికూల సందేశానికి దారితీస్తుంది. ఆర్బీకేల ద్వారా రైతులకు ఎఫ్టీవో జనరేట్ అవుతుంది. చెల్లింపుల విషయంలో ఏ ఒక్క రైతూ మిల్లర్ దగ్గరకు వెళ్లనవసరం లేదు. ఈ విషయంలో రైతులకు అవగాహన కల్పించాలి. ఆఫ్లైన్ ద్వారా కొన్న వివరాలను 24 గంటల్లో ఆన్లైన్లో మార్చుకోవాలి. విరిగిన నూక శాతాన్ని అంచనా వేసేందుకు మినీ మిల్లుల సంఖ్యను పెంచాలి. ఆర్బీకేల ద్వారా నూక శాతాన్ని నిష్పక్షపాతంగా అంచనా వేయొచ్చు. అధిక తేమ, విరిగిన, పగుళ్లు, పలువలు మారడం, మొలకెత్తడం వంటి కారణాలతో కొనుగోళ్లను తిరస్కరించడం ద్వారా రైతులు ఇబ్బంది పడకుండా చూడాలి. వరి విస్తీర్ణం ఎక్కువగా ఉండి.. మిల్లింగ్ సామర్థ్యం తక్కువగా ఉన్న ఎన్టీఆర్, ఉత్తర కోస్తా జిల్లాల్లో ఆధునిక రైసు మిల్లుల ఏర్పాటును ప్రోత్సహించాలి. కాగా ఆదివారం నాటికి కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో 6.5 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు అధికారులు సీఎంకు వివరించారు. ప్రస్తుతం ఆఫ్లైన్లోనే కొనుగోలు సాధారణంగా 5 శాతం మొలక ధాన్యానికి మినహాయింపు ఉంటుంది. వర్షాల వల్ల ప్రస్తుతం మొలక శాతం 7–10 వరకు ఉంటోంది. అయినా ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. వాస్తవానికి ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లోనే జరుగుతుంది. కానీ, వర్షాల వల్ల రైతులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఆఫ్లైన్లో కొనుగోలుకు చర్యలు చేపట్టింది. వాటిని సమీపంలోని మిల్లులకు తరలిస్తున్నారు. ప్రస్తుతం రైతులు వాటిని ఆరబెట్టుకోలేని పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో నేరుగా ఆఫ్లైన్లో కొనుగోలు చేస్తున్నారు. వాటిని బాయిల్డ్ రకంగా పరిగణించి బాయిల్డ్ మిల్లులకు తరలిస్తున్నారు. మండలానికి ఒకటి చొప్పున మొబైల్ మినీ మిల్లులు ఏర్పాటు చేశారు. ఈ మినీ మిల్లుల ద్వారా మిల్లరు రైతుల ఎదుటే ధాన్యాన్ని మరాడించి ఎంత శాతం నూక వస్తుందో పరిశీలిస్తున్నారు. డిప్యూటీ తహసీల్దార్ క్యాడర్ అధికారులను కస్టోడియన్ ఆఫీసర్లుగా మిల్లుల వద్ద నియమించి రైతులకు సమస్య రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆర్బీకేలో ధాన్యం అప్పగించి రసీదు పొందే వరకే రైతు బాధ్యత. ఆ తర్వాత మిల్లర్లు పిలిచిన వెళ్లవద్దంటూ ఆర్బీకేల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. ధాన్యం సేకరణ పద్ధతి ఇలా.. దశాబ్దాలుగా రైతుల గిట్టుబాటు ధరను దోచుకుంటున్న మిల్లర్లు, దళారులకు ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. సాధారణంగా తొలుత ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతు ఆర్బీకేలోని ధాన్యం సేకరణ సిబ్బంది (వీఏఏ)ను సంప్రదిస్తారు. సదరు అధికారి క్షేత్ర స్థాయిలోకి వెళ్లి ధాన్యం శాంపిళ్లను తీసుకుని ఆర్బీకేలోని ల్యాబ్లో పరీక్షిస్తారు. ఎఫ్ఏక్యూ నిబంధనల ప్రకారం.. ధాన్యం ఉన్నది, లేనిది నిర్ధారించి.. తేమ 17శాతం కంటే ఎక్కువ ఉంటే ఆరబెట్టేందుకు సూచిస్తారు. ధాన్యం శాంపిళ్లు నిబంధనల ప్రకారం ఉంటే.. రైతుకు ధాన్యం ఎప్పుడు తరలించేది షెడ్యూల్ను ఖరారు చేస్తూ మెసేజ్ రూపంలో రైతు మొబైల్కు సమాచారం పంపిస్తారు. అనంతరం షెడ్యూల్ ప్రకారం ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు హమాలీలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని వాహనంలో లోడింగ్ చేస్తారు. తర్వాత తూకం వేసి ట్రాక్ షీట్ జనరేట్ చేస్తారు. అప్పుడు మాత్రమే సదరు రైతు ధాన్యం ఏ మిల్లుకు వెళ్లేది తెలుస్తుంది. ధాన్యం లోడింగ్లో రైతు సొంతంగా హమాలీలను ఏర్పాటు చేసుకుని ధాన్యాన్ని తరలిస్తే ప్రభుత్వం ఆర్బీకే, మిల్లు మధ్య దూరాన్ని బట్టి ఆ మొత్తాన్ని చెల్లిస్తుంది. ఎక్కువగా మిల్లరు లేదా ఏజెన్సీ ఏర్పాటు చేసిన హమాలీలు, వాహనాల్లోనే సరుకును రవాణా చేస్తున్నారు. ట్రాక్ షీట్ జనరేట్ అయిన తర్వాత మిల్లుకు ధాన్యాన్ని తరలిస్తారు. ఈ క్రమంలోనే ఫండ్ ట్రాన్సఫర్ ఆర్డర్ (ఎఫ్టీవో) వస్తుంది. అందులో రైతు విక్రయించిన ధాన్యం బరువు, దానికి చెల్లించే నగదు, హామీలు, రవాణా తదితర వివరాలు పొందుపరుస్తారు. ఒకసారి ఎఫ్టీవో జనరేట్ అయిన తర్వాత ఆర్బీకే సిబ్బందే ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తారు. మిల్లు దగ్గర ప్రభుత్వం నియమించిన కస్టోడియన్ అధికారి ధాన్యం వచ్చినట్టు ధ్రువీకరించి.. మిల్లరు లాగిన్కు ఫార్వర్డ్ చేస్తారు. మిల్లరు కూడా ధాన్యం వచ్చినట్టు ధ్రువీకరించుకుంటారు. అనంతరం ఎఫ్టీవోలో చూపించిన ప్రకారం రైతుకి నిర్ణీత వ్యవధిలో ధాన్యం నగదు జమవుతాయి. మిల్లర్లు తరుగు కింద ధాన్యం తగ్గించినా, రైతు నుంచి డబ్బు డిమాండ్ చేసినా, ఇతర విషయాలపై ఫిర్యాదు చేసేందుకు వీలుగా టోల్ ఫ్రీ నెంబర్ 1967 వివరాలను ఎఫ్టీవో రసీదుపై ముద్రించారు. ముమ్మరంగా ధాన్యం కొనుగోళ్లు రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఏప్రిల్ రెండో వారం నుంచి అనేక జిల్లాల్లో రైతుభరోసా కేంద్రాల (ఆర్బీకే) ద్వారా రబీ కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన నగదు చెల్లింపులను ప్రభుత్వం ఎలాంటి ఆలస్యం చేయకుండా నిర్ణీత వ్యవధిలోగా చెల్లిస్తోంది. అక్కడక్కడ రైతుల బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబరు అనుసంధానం కాకపోవటంవల్ల నగదు జమకాకుండా పెండింగ్లో ఉంది. మరోవైపు.. ఈ ప్రక్రియలో హమాలీలు, రవాణా చార్జీలు రాష్ట్ర ప్రభుత్వమే రైతులకు చెల్లిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం రైతులను అన్ని విధాలా ఆదుకుంటుందని రైతులెవరూ అధైర్యపడకుండా ఉండాలని.. తడిసిన, మొలకెత్తిన ధాన్యాన్ని విక్రయించాలని.. దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని ఉన్నతాధికారులు రైతులకు సూచిస్తున్నారు. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం తమకెంతో మేలు చేస్తోందని.. సకాలంలో డబ్బులు చెల్లిస్తోందని రైతులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. దళారీలకు అమ్ముకుని ఉంటే బాగా నష్టం జరిగేదని.. ప్రభుత్వం ఇస్తున్న మద్దతు ధరకు అమ్ముకోవడం బాగా కలిసొచ్చిందని వారంటున్నారు. జిల్లాల వారీగా చూస్తే.. ►శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఇప్పటివరకు 4,460 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేసింది. ఎన్నడూ లేని విధంగా ఈ దఫా జిల్లాలో తెగుళ్లు తగ్గుముఖం పట్టి అధిక దిగుబడులు, అధిక ధరలతో అన్నదాతల్లో హర్షం వ్యక్తమవుతోంది. ►బాపట్ల జిల్లాలో ఏప్రిల్ 10 నుంచి రబీ కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ఇప్పటికీ జిల్లాలో 2,244 మంది రైతుల నుంచి 13,516 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. ►ప్రకాశం జిల్లాలోనూ ఏప్రిల్లోనే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ఇక్కడ మొత్తం 35 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేశారు. ఇప్పటివరకు 3 వేల టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. జిల్లాలో తడిసిన ధాన్యం ఎక్కడాలేదు. వర్షం వచ్చినా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. గోనె సంచులను ఎక్కడికక్కడ కొనుగోలు కేంద్రాల్లోనే అవసరమైనన్ని అందుబాటులో ఉంచారు. ►తూర్పుగోదావరి జిల్లాలో సోమవారం నాటికి 24,766 మంది రైతుల నుండి 1,69,370 మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరణకు కూపన్లు విడుదల చేశారు. సోమవారం ఆన్లైన్లో 2,579.200 మెట్రిక్ టన్నులు, ఆఫ్లైన్లో 2,620.748 మెట్రిక్ టన్నులు మొత్తంగా చూస్తే 14,733 మంది రైతులు నుండి 1,33,302.680 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ►పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా దాళ్వా సీజన్లో ఇప్పటివరకు 33,929 మంది రైతుల నుంచి 3.20 లక్షల టన్నులను కొనుగోలు చేశారు. ►ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 1.50 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించారు. 12,581 మంది రైతుల నుంచి రూ.297 కోట్ల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ►కృష్ణాజిల్లాలో ఇప్పటివరకు 19,020 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ►అనకాపల్లి జిల్లాలో ధాన్యం సేకరణ సోమవారం నుంచి ప్రారంభమైంది. జిల్లాలో 39 ఆర్బీకేల ద్వారా 14 కొనుగోలు కేంద్రాలు సిద్ధంచేశారు. ఇందుకు ప్రభుత్వం స్పెషలాఫీసర్లను నియమించింది. రానున్న రోజుల్లో వర్షాలుపడే అవకాశం ఉన్నందున పంట నష్టం కలుగకుండా తగిన ముందస్తు చర్యలు చేపట్టేలా రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా ప్రత్యేకాధికారి జె. నివాస్ ఆదేశించారు. ప్రభుత్వం చొరవతో 40 క్వింటాళ్లు అమ్ముకున్నా ప్రభుత్వం చొరవ తీసుకుని మద్దతు ధరతో మొక్కజొన్న కొనుగోలు చేపట్టడం శుభపరిణామం. నిజానికి.. మొక్కజొన్నకు ధరలు తగ్గిపోయాయి. మద్దతు ధర రూ.1,962 ఉండగా.. దళారీలు క్వింటా కేవలం రూ.1,500–1,600 ధరకు కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చారు. కానీ, ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలూ ఏర్పాటుచేయడంతో సోమవారం 40 క్వింటాళ్లు అమ్ముకున్నా. దళారీలకు అమ్ముకుని ఉంటే దాదాపు రూ.15వేల వరకు నష్టం జరిగేది. మద్దతు ధరతో అమ్ముకోవడం బాగా కలిసొచ్చింది. – సంగ నాగశేఖర్, ముతలూరు, రుద్రవరం మండలం, నంద్యాల జిల్లా రైతులకు సకాలంలో డబ్బులు అందుతున్నాయి నేను సుమారు ఐదెకరాలు సాగుచేస్తున్నా. దాళ్వా వరి సాగుకు సంబంధించి ఇప్పటివరకు మాసూళ్లు చేసిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేసింది. సకాలంలోనే డబ్బులు కూడా అందాయి. వాతావరణంలో మార్పులవల్ల కొంత పంట మాసూళ్లు ఆలస్యమైంది. ఇప్పుడు మిగిలిన పంటను కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. గిట్టుబాటు ధర ఉండడం సంతోషం. – బొక్కా రాంబాబు, రైతు, కొండేపూడి, పాలకోడేరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా ఎప్పుడూ లేని విధంగా బస్తాకు రూ.1,530 ఇచ్చారు ఎన్నడూ, ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా ఈ ప్రభుత్వం ధాన్యం డబ్బు అందించింది. 75 కిలోల బస్తాకు రూ.1,530 ఇచ్చింది. గతంలో దళారులు కమీషన్ తీసుకునేవారు. డబ్బులకు రెండునెలలు పట్టేది. ఇప్పుడు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి నేరుగా మా ఖాతాలో డబ్బు జమచేసింది. సంచులు కూడా సకాలంలో ఇచ్చింది. ధాన్యం రవాణాకూ లారీని ఏర్పాటుచేస్తున్నారు. – పొన్నాడ రాఘవరావు, రైతు, యర్రమళ్ల, ఏలూరు జిల్లా ఆదాయం బాగుంది.. సంతోషంగా ఉంది నేను శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మడపల్లి గ్రామంలో సొంత పొలంలో వరి సాగుచేశాను. మొత్తం 30 పుట్ల దిగుబడి వచ్చింది. ఈ ధాన్యాన్ని ఆర్బీకే ద్వారా విక్రయించా. ఆదాయం బాగుంది. సంతోషంగా ఉంది. – కొండారెడ్డి, రైతు, మడపల్లి, చేజెర్ల మండలం, నెల్లూరు జిల్లా రైతులకు సహకరించాం మడపల్లిలో సుమారు 560 ఎకరాల్లో వరిని సాగుచేశారు. పంటను కాపాడేందుకు రైతులకు సూచనలు, సలహాలిచ్చాం. ఏ సమయంలో పంటను కోయాలో వివరించాం. చివరలో ధాన్యాన్ని ఆర్బీకేల ద్వారా సేకరిస్తున్నాం. – ఎ. మమత, మడపల్లి, వీఏఏ, చేజెర్ల మండలం, నెల్లూరు జిల్లా వారం రోజుల్లో డబ్బులు జమయ్యాయి బాపట్ల జిల్లా చినగంజాం మండలం, చింతగుంపల్లి గ్రామానికి చెందిన నేను 110 క్వింటాళ్ళ ధాన్యాన్ని ఏప్రిల్ 25న మా గ్రామంలోని ఆర్బీకే ద్వారా రైస్మిల్లుకు తోలాను. క్వింటాకు రూ.2,060 చొప్పున రూ.2,26,600 నగదు ఈనెల 4న నా అకౌంట్కు జమచేశారు. గతంలో దళారులు మా వద్ద ధాన్యం కొనుగోలు చేసి నెలల తరబడి వారి చుట్టూ తిప్పుకునే వాళ్లు. ప్రస్తుతం గిట్టుబాటు ధర కల్పించడంతోపాటు సకాలంలో నగదు జమచేయటం చాలా సంతోషంగా ఉంది. – కరణం శ్రీనివాసరావు, చినగంజాం మండలం, బాపట్ల జిల్లా -
ప్రభుత్వ చర్యలపై అన్నదాతల్లో ఆనందం
-
ధాన్యం రైతుకు దన్ను
అనంతపురం అర్బన్: రైతు సంక్షేమానికి జగన్ సర్కార్ అనేక కార్యక్రమాలు అమలు చేస్తోంది. జిల్లాలో వరి ధాన్యం సేకరణ చేపట్టి రైతుకు దన్నుగా నిలిచేందుకు శ్రీకారం చుట్టింది. ఇందుకు అనుగుణంగా జాయింట్ కలెక్టర్ చైర్మన్గా జిల్లా సేకరణ కమిటీ (డిస్ట్రిక్ట్ ప్రొక్యూర్మెంట్ కమిటీ–డీపీసీ) ఏర్పాటైంది. వ్యవసాయ శాఖ జేడీ, మార్కెటింగ్ శాఖ ఏడీ, డీసీఎంఎస్ అధికారి, జిల్లా కో–ఆపరేటివ్ అధికారి, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్, జిల్లా సరఫరాల అధికారి సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ ఇప్పటికే ఒక దఫా సమావేశమై కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుంది. 5 వేల టన్నుల సేకరణ లక్ష్యం జిల్లాలో కణేకల్లు, బొమ్మనహాళ్, డీ హీరేహాళ్ ప్రాంతాల్లో ఐదు వేల టన్నుల వరి ధాన్యం సేకరించాలని లక్ష్యం నిర్దేశించుకున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర మొదటి రకం క్వింటాలు రూ.2,060, రెండో రకం రూ.2,040తో రైతుల నుంచి ధాన్యం సేకరిస్తారు. ఈ మూడు మండలాల పరిధిలోని 3 పీఏసీఎస్లు, 37 ఆర్బీకేల సహకారంతో డిసెంబర్ నుంచి సేకరణ చేపట్టనున్నారు. జిల్లాలో సార్టెక్స్ మిల్లులు లేని కారణంగా ఇక్కడ సేకరించిన ధాన్యాన్ని చిత్తూరు, తిరుపతి మిల్లులకు పంపించనున్నారు. నాణ్యత పరిశీలనకు సహకారం ధాన్యం నాణ్యత పరిశీలనకు సాంకేతిక సహాయకుల సహకారం తీసుకోనున్నారు. పీఏసీఎస్లోని సభ్యులు ఎవరైనా బీఎస్సీ, అగ్రికల్చర్ బీఎస్సీ చేసిన వారు ఉంటే వారిని సాంకేతిక సహాయకులుగా నియమించుకుంటారు. వీరికి ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ప్రస్తుతం ఒక బ్యాచ్కు కణేకల్లులో మొదటి విడత శిక్షణ ఇస్తున్నారు. ఇక సేకరణ ప్రక్రియలో వలంటీర్లను భాగస్వాముల్ని చేయనున్నారు. రైతు ఖాతాలోకి నగదు జమ ధాన్యం సేకరణకు సంబంధించిన నగదు నేరుగా రైతుల ఖాతాల్లోకి ప్రభుత్వం జమ చేస్తుంది. రైతు పట్టాదారు పాసుపుస్తకం, ఫోన్ నంబర్తో పాటు ఆధార్ అనుసంధానమైన బ్యాంక్ ఖాతా వివరాలు తీసుకుని ఆన్లైన్లో నమోదు చేస్తారు. ఆ వెంటనే సంబంధిత రైతు ఎఫ్టీఓ (ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్) క్రియేట్ అవుతుంది. మిల్లరు ధాన్యం తీసుకున్న వెంటనే ఆన్లైన్లో నమోదవుతుంది. ఎఫ్టీఓ ఆధారంగా రైతు ఖాతాలోకి నగదు జమవుతుంది. లక్ష్య నిర్దేశనం జిల్లాలో వరి అధికంగా పండించే కణేకల్లు, బొమ్మనహాళ్, డీ.హీరేహాళ్ మండలాల్లో ధాన్యం సేకరణ చేపడుతున్నాం. 3 పీఏసీఎస్లు, 37 ఆర్బీకేల పరిధిలో ఈ ఏడాది 5 వేల టన్నుల సేకరణ లక్ష్యంగా నిర్దేశించాం. ఇందుకు అవసరమైన కార్యాచరణ సిద్ధం చేశాం. తొలివిడతగా 1,500 టన్నులు సేకరించాలని చెప్పాం. ధాన్యానికి సంబంధించి నగదు రైతుల ఖాతాల్లోకి నేరుగా జమవుతుంది. – కేతన్గార్గ్, జాయింట్ కలెక్టర్ సేకరణ ప్రక్రియ ప్రారంభం కార్యాచరణ ప్రకారం ధాన్యం సేకరణ ప్రక్రియ ప్రారంభించాం. జాయింట్ కలెక్టర్ నిర్దేశించిన లక్ష్యం 5 వేల టన్నుల ధాన్యం సేకరణకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నాం. పీఏసీఎస్, ఆర్బీకేల సహకారం, వలంటీర్ల భాగస్వామ్యంతో లక్ష్యం పూర్తి చేస్తాం. – నీలమయ్య, డీఎం, పౌర సరఫరాల సంస్థ -
Photo Feature: పుడమితల్లి ఒడిలో.. అంతులేని ఆనందం
డైనింగ్ టేబుల్ లేదు.. వడ్డించే వారూ ఉండరు.. కూర్చొనేందుకు సరైన సౌకర్యమూ ఉండదు. అయితేనేం.. తినే ప్రతీ మెతుకులోను అంతులేని ఆనందం వారి సొంతం. పుడమితల్లి ఒడిలో.. చేలగట్లపై సమయానికి తినే పట్టెడు అన్నమే వారికి బలం. ఆ శక్తితోనే ఎంతో మందికి అన్నం పెట్టేందుకు పొలంలో శ్రమిస్తారు. శ్రమైక జీవన సౌందర్యానికి మించినది లేదని చాటిచెబుతారు. విజయనగరం జిల్లా కుమిలి రోడ్డులో పొలం గట్లపై సామూహికంగా భోజనాలు చేస్తూ సోమవారం ‘సాక్షి’ కెమెరాకు చిక్కిన మహిళా రైతుల చిత్రమే దీనికి సజీవ సాక్ష్యం. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయనగరం చకచకా ఈ–క్రాప్ జిల్లాలో ఈ–క్రాప్ నమోదు చకచకా సాగుతోంది. సచివాలయ వ్యవసాయ సహాయకులు, వ్యవసాయ, రెవెన్యూ అధికారుల సమక్షంలో పంటల నమోదు ప్రక్రియ జరుగుతోంది. ఉచిత పంటల బీమా, సున్నావడ్డీ, పంట రుణాలు, నష్ట పరిహారం, రైతు భరోసా, ధాన్యం కొనుగోలు వంటి ప్రయోజనాలు రైతులకు చేరాలంటే ఈ–క్రాప్ నమోదు తప్పనిసరి. రైతులు కూడా బాధ్యతగా ఈ నెల 31లోగా ఈ క్రాప్ నమోదు చేయించుకునేందుకు చొరవచూపాలని అధికారులు సూచిస్తున్నారు. – నెల్లిమర్ల రూరల్ ముందస్తు వైద్యం వర్షాలు కురిసే వేళ.. కలుషిత మేత, నీరు తాగడంతో జీవాలు వ్యాధుల భారిన పడే అవకాశం ఉంది. జీవాల సంరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం ముందస్తుగా ఉచిత వైద్యసేలందిస్తోంది. ఊరూరా పశువైద్య శిబిరాలు నిర్వహించి నట్టల నివారణ మందు వేయిస్తోంది. జిల్లా వ్యాప్తంగా 6,04,665 జీవాలు ఉండగా వీటిలో గొర్రెలు 4,48,154, మేకలు 1,56,511 ఉన్నాయి. జీవికి రూ.2.50 పైసల చొప్పున సుమారు రూ.18 లక్షల విలువైన డోసులను సరఫరా చేసింది. ఈ నెల 16న ప్రారంభమైన నట్టనివారణ మందు వేసే ప్రక్రియ ఈ నెల 31 వరకు సాగనుందని పశుసంవర్థకశాఖ జేడీ వైవీ రమణ తెలిపారు. – రామభద్రపురం ఐదు అడుగుల అరటిగెల.. చీపురుపల్లిరూరల్(గరివిడి): అరటిగెల సాధారణంగా 3 నుంచి నాలుగు అడుగుల పొడవు ఉంటుంది. అయితే, గరివిడి పట్టణంలోని బద్రీప్రసాద్ కాలనీలో ఓ విశ్రాంత ఫేకర్ ఉద్యోగి ఇంటి పెరటిలోని అరటిచెట్టు ఐదు అడుగుల గెల వేసింది. 300కు పైబడిన పండ్లతో చూపరులను ఆకర్షిస్తోంది. (క్లిక్: మొబైల్ మిస్సయ్యిందా..? జస్ట్ ఇలా చేస్తే చాలు.. మీ ఫోన్ సేఫ్!) -
తెలంగాణాలో వేడి వేడిగా వడ్ల రాజకీయం
-
వరి పోరు.. వదిలేది లేదు
సాక్షి, హైదరాబాద్: వరి కొనుగోలుకు సంబంధించి కేంద్రంపై తెలంగాణ ఉద్యమం తరహాలో పోరు చేస్తామన్న సీఎం కేసీఆర్.. అందుకు అవసరమైన కార్యాచరణ సిద్ధం చేశారు. సోమవారం ఉదయం 11.30 గంటలకు తెలంగాణ భవన్లో జరిగే పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఈ కార్యాచరణను ప్రకటించనున్నారు. సమావేశానికి తప్పనిసరిగా హాజరవ్వాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు, పార్టీ రాష్ట్ర కార్యవర్గం తదితరులకు సంబంధిత జిల్లా మంత్రుల ద్వారా శనివారం రాత్రే ఆదేశాలు అందాయి. భేటీ ముగిశాక సీఎం నేతృత్వంలోని మంత్రుల బృందం కేంద్ర మంత్రులను కలిసేందుకు సోమవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లనుంది. పర్యటనలో భాగంగా ప్రధాని మోదీని కూడా బృందం కలవనుంది. కేంద్ర మంత్రులు, ప్రధాని మోదీతో భేటీ సందర్భంగా ప్రస్తావించాల్సిన అంశాలకు సంబంధించిన లేఖలను సీఎస్ సోమేశ్కుమార్ పర్యవేక్షణలో అధికారులు సిద్ధం చేశారు. ఢిల్లీ వెళ్లే మంత్రుల బృందంలో వ్యవసాయ, పౌర సరఫరాల శాఖ మంత్రులు నిరంజన్రెడ్డి, గంగుల కమలాకర్తో పాటు మరో నలుగురు మంత్రులుండే అవకాశముంది. ఉద్యమ కార్యాచరణపై ఉత్కంఠ యాసంగి వరి ధాన్యం కొనుగోలు అంశాన్ని తీవ్రమైన సమస్యగా భావిస్తున్న కేసీఆర్.. పార్టీ నేతలు, అధికారులు, సంబంధిత రంగాల నిపుణులతో వారం రోజులు లోతుగా చర్చించినట్టు సమాచారం. దీనికి సంబంధించి కేంద్రంపై ఒత్తిడి పెంచే పోరు కార్యాచరణ షెడ్యూల్ను ఆయన సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో కేంద్రంపై రాష్ట్ర సర్కారు చేసే ఉద్యమం ఎలా ఉంటుందోనని టీఆర్ఎస్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రంలో పాలనపై ప్రతికూల ప్రభావం పడకుండా ఆందోళనలు ఉంటాయని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. ధాన్యం కొనుగోలుపై కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర మంత్రివర్గం, శాసనసభా పక్షం, ఎంపీలు, పార్టీ ముఖ్య నేతలు ఇందిరాపార్కు వద్ద గతేడాది చివరలో ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. రెగ్యులర్ ఆందోళనలు కాకుండా.. బంద్లు, రాస్తారోకోలు లాంటి రెగ్యులర్ ఆందోళన కార్యక్రమాలు కాకుండా కేంద్రంలోని బీజేపీని ఇరకాటంలోకి నెట్టడంతో పాటు ఇతర పార్టీలూ తమ వైఖరి చెప్పాల్సిన స్థితిలోకి నెట్టేలా ఉద్యమ కార్యాచరణ ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ధాన్యం కొనుగోలుపై కేంద్రాన్ని నిలదీసేందుకు ఢిల్లీ వేదికగా రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర కీలక నేతలతో కలిసి సీఎం దీక్ష చేపట్టే అవకాశముంది. ఢిల్లీ దీక్షకు ముందు రాష్ట్రంలో వివిధ రూపాల్లో ఆందోళనలు చేపట్టే ఆలోచనలో ఉన్న కేసీఆర్.. సోమవారం నాటి భేటీలో కార్యాచరణ షెడ్యూల్ను ప్రకటించనున్నారు. -
రచ్చబండ కార్యక్రమాన్ని అడ్డుకోవడం అప్రజాస్వామికం: మధు యాష్కీ
సాక్షి, హైదరాబాద్: ఎర్రవల్లిలో కిసాన్ కాంగ్రెస్ నిర్వహిస్తున్న రచ్చబండ కార్యక్రమాన్ని అడ్డుకోవడం అప్రజాస్వామికమని కాంగ్రెస్ లీడర్ మధు యాష్కీ గౌడ్ విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రచ్చబండ కార్యక్రమానికి వెళుతున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకోవడం రాజ్యంగ హక్కులను కాలరాయడమని పేర్కొన్నారు. రచ్చబండ కార్యక్రమానికి వెళుతున్న సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, మాజీ మంత్రి వర్యులు మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబును గృహనిర్భంధంలో తీసుకోవాడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం.. ప్రతి పక్ష పార్టీల భావ ప్రకటన స్వేచ్చా, నిరసన తెలిపే హక్కులను కాలరాస్తుందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీఎం కేసీఆర్ తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజాస్వామిక వాదులు, తెలంగాణ పోరాట యోధులు, కవులు, కళాకారులు, మేధావులు, తప్పక స్పందించాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యయుతంగా చేస్తున్న నిరసనలను.. పోలీసుల ఇనుప కంచెలు ఆపలేవన్నారు. ఉక్కు పాదాల కింద భావవ్యక్తీకరణ ఆపే ప్రయత్నం చేస్తే.. కాంగ్రెస్ శ్రేణులు వాటిని తిప్పికొడతారన్నారు. చరిత్రలో వరివేయొద్దని పిలుపునిచ్చిన చేతగానీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే అని విమర్శించారు. రైతులకు మేలు చేయాల్సిన ముఖ్యమంత్రి వరి వేస్తే.. ఉరేనని చెప్పటం బాధాకరమన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందని.. రైతుల కోసం పోరాటాలు, ఉద్యమాలు చేసేందుకు యావత్ కాంగ్రెస్ నాయకత్వం సిద్ధంగా ఉంటుందన్నారు. రైతులేవరు అధైర్యపడాల్సిన అవసరం లేదని.. టీఆర్ఎస్ ప్రభుత్వం.. వరి ధాన్యం కొనేవరకు పోరాటాలు చేస్తామని మధుయాష్కీ గౌడ్ స్పష్టం చేశారు. చదవండి: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అరెస్ట్ -
వద్దన్నా.. వరి సాగు
-
నాది హామీ..కోటి టన్నులైనా కొంటాం
సాక్షి, న్యూఢిల్లీ: ‘‘వానాకాలానికి సంబంధించి తెలంగాణలో పండించిన ప్రతి ధాన్యం గింజను చివరివరకు కొంటాం. ఈ సీజన్లో ఎంతమేర ధాన్యం సేకరించాలన్న దానిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందానికి మించి ధాన్యం వచ్చినా సేకరిస్తాం. ఎంతైనా కొంటాం.. అది కోటి మెట్రిక్ టన్నులు అయినాసరే. పచ్చిబియ్యం, ఉప్పుడు బియ్యం అన్నతేడా లేకుండా కనీస మద్దతు ధరలతో తీసుకునేందుకు సిద్ధం. ఈ విషయంలో తెలంగాణ రైతాంగానికి కేంద్రమంత్రిగా నాది హామీ’’అని కేంద్ర పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి జి.కిషన్రెడ్డి ప్రకటించారు. సోమవారం ఆయన ఢిల్లీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్, సోయం బాపూరావులతో కలిసి మీడియాతో మాట్లాడారు. వానాకాలం సీజన్లో ధాన్యం కొనబోమని కేంద్రం ఎక్కడైనా చెప్పిందా, చెపితే చూపించాలని సీఎం కేసీఆర్ను డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గత 25 రోజులుగా కొనుగోళ్లను నిలిపేయడంతో ఎక్కడి ధాన్యం అక్కడే ఉందని.. ధాన్యాన్ని మిల్లులకు పంపించే సోయి లేదుగానీ కేంద్రాన్ని దోషిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని కిషన్రెడ్డి మండిపడ్డారు. సీఎం కేసీఆర్ అసంబద్ధ నిర్ణయాల వల్లే రైతులు గందరగోళంలో పడ్డారని.. కొనుగోళ్లు జరగక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఓటమి అనంతరం కేసీఆర్ తీవ్రంగా భయపడుతున్నారని.. ఆయన కుమారుడు ముఖ్యమంత్రి అవుతాడో లేడో అన్న ఆందోళనలో ఉన్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి పుత్ర వాత్సల్యం ప్రగతిభవన్ నుంచి పార్లమెంట్కు చేరుకుందని, అందుకే లేని సమస్యను సృష్టిస్తున్నారని మండిపడ్డారు. యాసంగి ప్రణాళిక రాష్ట్రానిదే.. యాసంగిలో బాయిల్డ్ రైస్ తీసుకోబోమని కేంద్రం చెప్పిందని.. రైతులను ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు మళ్లించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని కిషన్రెడ్డి స్పష్టం చేశారు. ఇతర పంటలకు విత్తనాలు, ఎరువులు, రుణాలపై ఓ విధానం రూపొం దించుకోవాల్సింది రాష్ట్రమేనని.. దానిని వదిలేసి కేంద్రంపై విమర్శలు చేయడం ఏమిటని నిలదీశారు. పంజాబ్లోనైనా, తెలంగాణలోనైనా కేంద్రం ఒకే విధానంతో ముందుకెళుతుందని.. సీఎం కేసీఆర్ తరహాలో గజ్వేల్కు ఓ న్యాయం, దుబ్బాకకు మరో న్యాయం ఉండదని వ్యాఖ్యానించారు. -
ఒప్పందాలుంటేనే వరి.. యాసంగిలో వరి వేయొద్దని సీఎస్ సోమేశ్కుమార్ సూచన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నుంచి పారాబాయిల్డ్ (ఉప్పుడు) బియ్యం సేకరించబోమని భారత ఆహార సంస్థ నిర్ణయించినందున రాష్ట్ర రైతులు వరి సాగు చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ఘాటించింది. రాష్ట్రంలో నెలకొన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో యాసంగి సీజన్లో పండే వరి ఉప్పుడు బియ్యానికే అనుకూలమైందని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ శనివారం డీజీపీ ఎం. మహేందర్రెడ్డితో కలసి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ యాసంగిలో వరి సాగు చేయవద్దని, ఒకవేళ విత్తన కంపెనీలు, మిల్లర్లతో ఒప్పందం లేదా సొంత అవసరాల కోసం అయితే సాగు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. జిల్లాల్లో వానాకాలం ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేలా చూడాలని ఆదేశించారు. అవసరమైన చోట కొత్తగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్రంలోని కొనుగోలు కేంద్రాలకు ఇతర ప్రాంతాల ధాన్యం వస్తున్నట్లు గుర్తించామని, దీన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లు నిరోధించాలని ఆదేశించారు. ఈ భేటీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ముఖ్యకార్యదర్శులు సందీప్కుమార్ సుల్తానియా, ఎస్ఏఎం రిజ్వీ, పోలీస్ అధికారులు జితేందర్, అనిల్కుమార్, కార్యదర్శులు రఘునందన్రావు, క్రిస్టినా జెడ్. చొంగ్తు, పౌరసరఫరాల శాఖ కమిషనర్ వి.అనిల్కుమార్, రవాణా శాఖ కమిషనర్ ఎంఆర్ఎం రావు పాల్గొన్నారు. -
ఇందిరా పార్క్ వద్ద టీఆర్ఎస్ మహాధర్నా
-
గవర్నర్ తమిళిసైని కలిసిన టీఆర్ఎస్ ప్రతినిధుల బృందం
సాక్షి, హైదరాబాద్: ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం ద్వంద వైఖరిని నిరసిస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం గురువారం మహా దర్నా నిర్వహిస్తోంది. హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద చేపట్టిన ఈ ధర్నలో సీఎం కేసీఆర్తో సహా, మంత్రులు, ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ ధర్నా మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగింది. మహాధర్నా తరువాత గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ను కలిసి సీఎం కేసీఆర్ వినతి పత్రం అందించారు చదవండి: మంత్రి కేటీఆర్ చొరవ.. ఐదేళ్ల చిన్నారిని దత్తత తీసుకున్న కలెక్టర్ ఇందిరాపార్క్ వద్ద టీఆర్ఎస్ మహాధర్నా ముగిశాఖ టీఆర్ఎస్ మంత్రులు బస్సులో రాజ్భవన్కు చేరుకున్నారు. ఈ మేరకు ఎంపీ కేశవరావు నేతృత్వంలోని బృందం 10 మంది మంత్రులు,10 ఎంపీలు గవర్నర్నర్ను కలిసి రైతు సమస్యలపై వినతి పత్రం ఇచ్చారు. వీరిలో గంగుల కమలాకర్, మంత్రి సత్యవతి రాథోడ్, కౌశిక్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కడియం శ్రీహరి, నారదాసు లక్ష్మణ్రావు, మంత్రులు నిరంజన్ రెడ్డి, తలసాని, శ్రీనివాస్ గౌడ్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎమ్మెల్యే జోగు రామన్న, పద్మాదేవేందర్రెడ్డి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మాలోత్ కవిత, భాను ప్రసాద్ ఉన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. వరి కొనుగోలు విషయంలో కేంద్ర ద్వంద వైఖరిని నిరసిస్తూ ధర్నా చేపట్టినట్లు తెలిపారు. కేంద్ర విధానం వల్ల రైతులు దెబ్బతింటున్నారని, కేంద్ర వైఖరి రైతులకు వ్యతిరేకంగా ఉందని విమర్శించారు. కేంద్రంపై యుద్ధానికి శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు. ఈ యుద్ధం ఆగదు. ఇది ఆరంభం మాత్రమే. అంతం కాదని స్పష్టం చేశారు. పంజాబ్లో మాదిరిగా తెలంగాణలో ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. 50 రోజులు గడిచిన కేంద్ర నుంచి ఎలాంటి స్పందన లేదని మండిపడ్డారు. ధాన్యం కొనుగోళ్ల గురించి ప్రధానికి లేఖలు కూడా రాశామని.. గ్రామగ్రామల్లో వివిధ రకాల ఆందోళనలు కొనసాగుతాయని సీఎం కేసీఆర్ తెలిపారు ‘ఈ పోరాటం ఇక్కడితో ఆగదు. ఈ యుద్ధం ఢిల్లీ దాకా పోవాలి. కేంద్రం కళ్ళు తెర్పించడానికి ఈ యుద్ధం. మంత్రులే ధర్న కు కూర్చుంటున్నారు అంటున్నారు. 2006లో నాటి గుజరాత్ సీఎం నేటి ప్రధాని మోదీ కూడా ధర్నా చేశారు. రైతుల పక్షాన మేముంటం. పోరాటాలు మాకు కొత్త కాదు’ కాదు అని సీఎం స్పష్టం చేశారు. మరోవైపు సాయి చంద్ పాటకు మంత్రి కేటీఆర్ చప్పట్లు కొడుతూ ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు. -
‘బండి సంజయ్ రెండు చెంపలు పగులకొట్టి రైతులకు క్షమాపణ చెప్పాలి'
సాక్షి, రాజన్న సిరిసిల్లా జిల్లా: వానాకాలం పంటను పూర్తిగా తెలంగాణ ప్రభుత్వం కొంటుందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. జిల్లాలో ఇప్పటి వరకు 52 వేల మెట్రిక్ టన్నులు కొన్నామని, ఇంకా 3 లక్షల టన్నుల పంట కొన్సాల్సి ఉందన్నారు. తడిసిన దాన్యం కూడా కొనే ప్రయత్నం చేయాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో 4,743 దాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా దాన్యం సేకరిస్తున్నామని తెలిపారు. రాజ్యాంగం ప్రకారం దాన్యం కొనుగోలు విషయములో కేంద్రం రాష్ట్రానికి వెన్నుదన్నుగా ఉండాలని హితవు పలికారు. రాష్ట్రంలో వ్యవసాయానికి నీటి వసతులకు కేంద్రం ఎలాంటి సహాయాన్ని అందించలేదని విమర్శించారు. చదవండి: Seethakka: జైభీమ్ మూవీ ఆస్కార్ అవార్డు గెలుస్తుంది యాసంగి దాన్యం కొనుగోలుపై కేంద్రం పునఃసమీక్షించుకోవాలని మంత్రి కేటీఆర్ అన్నారు. దీనిపై గురువారం ఇందిరా పార్క్ వద్ద దర్నాకు కూర్చోబోతున్నామని తెలిపారు. కేంద్రానికి తెలంగాణ ధనం కావాలి కానీ, దాన్యం వద్దు అనే కేంద్ర విధానాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. కేంద్రం రెండు నాలుకల ధోరణిని ఎండగట్టబోతున్నామని పేర్కొన్నారు. స్థానిక బీజేపీ ఆసత్య ప్రచారాన్ని నమ్మి వరి వేస్తే రైతు నష్ట పోతారని అన్నారు. చదవండి: మనం ఏ స్థాయిలో ఉన్నా డ్రెస్సు, అడ్రెస్సు మారకూడదు: ఉప రాష్ట్రపతి యాసంగి వరి దాన్యం కేంద్రం కొనే విషయం నిజమైతే, పూర్తి పంట కొంటామని రాతపూర్వకంగా రాసి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకుంటే రైతులను మోసం చేస్తున్న బండి సంజయ్ రెండు చెంపలు పగులకొట్టి రైతులకు బహిరంగ క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలను నమ్మాలని, పనికిమాలిన వారి మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. -
వరి సాగు చేస్తే ఊరుకునేది లేదు: సిద్ధిపేట కలెక్టర్ ఘాటు వ్యాఖ్యలు
సాక్షి, మెదక్: సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి తాజాగా ఘాటైనా వ్యాఖ్యలు చేశారు. వరి సాగు చేస్తే ఊరుకునేది లేదని, రైతులకు వరి విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. యాసంగిలో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై వ్యవసాయ అధికారులు, విత్తనాలు, ఎరువుల డీలర్లతో కలెక్టర్ సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. యాసంగిలో ఎవరైనా ఒక్క కేజీ వరి విత్తనాలు విక్రయించినా ఊరుకునేది లేదని.. అమ్మితే జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరించారు. వ్యాపారం రద్దు చేసి షాపుని మూయిం చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. డీలర్లు సుప్రీం కోర్టుకి వెళ్లి ఆర్డర్ తెచ్చుకున్నా షాపు ఓపెన్ చేసేది లేదని తేల్చిచెప్పారు. ‘నేను చెప్పిన దానికి విరుద్ధంగా సుప్రీం కోర్టు జడ్జి చెప్పినా, రాష్ట్ర హైకోర్టు జడ్జి చెప్పినా, ప్రజా ప్రతినిధులు చెప్పినా నేను కలెక్టర్గా ఉన్నంతకాలం ఎటువంటి పరిస్థితులలో షాపులు తెరుచుకోవు. ఒకవేళ డీలర్లు విత్తనాలు అమ్మితే సంబంధిత ఏఈవోలు, అధికారులు సస్పెండ్ అవుతారు.’ అంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. కాగా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి చేసిన ఘాటు వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదస్పదంగా మారాయి. -
వేలాది ఎకరాల్లో నేలకొరిగిన వరి పంట
-
బొండాల రకం ధాన్యం: రైతులు దళారుల మాటలు నమ్మొద్దు
సాక్షి, తూర్పు గోదావరి: బొండాల రకం ధాన్యం పండించిన రైతులు దళారుల మాటలు నమ్మొద్దని జిల్లా జాయింట్ కలెక్టర్ లక్ష్మీ తెలిపారు. దళారుల మాటలు నమ్మి పంటను విక్రయించొద్దని రైతులకు సూచించారు. తూర్పు గోదావరి జిల్లాలో 4 లక్షల మెట్రిక్ టన్నుల బొండాల రకం ధాన్యం పండిందని తెలిపారు. ఇందులో 95 శాతం పంటను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. బొండాల రకం ధాన్యాన్ని క్వింటా రూ.1868 చొప్పున.. 75 కేజీలు రూ.1,401గా ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించిందని గుర్తుచేశారు. రైతులకు సమస్యలుంటే కమాండ్ కంట్రోల్ నంబరు: 88866 13611కు ఫోన్ చేయాలని పేర్కొన్నారు. రైతుభరోసా, ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరణ చేపడుతున్నామని కలెక్టర్ తెలిపారు. చదవండి: Kharif Crop: ఖరీఫ్కు రెడీ -
బాయిల్డ్ రైస్ సేకరణకు ఎఫ్సీఐ మంగళం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో యాసంగి సీజన్లో అధికంగా ఉత్పత్తి అయ్యే బాయిల్డ్ రైస్ (ఉప్పుడు బియ్యం)సేకరణకు భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) క్రమంగా మంగళం పాడనుంది. ఒక్కసారిగా కాకుండా క్రమంగా బాయిల్డ్ రైస్ తీసుకునే విధానానికి స్వస్తి పలికేలా ఎత్తులు వేస్తోంది. గతేడాది వరకు రాష్ట్రం నుంచి భారీగా బాయిల్డ్ రైస్ సేకరించి ఇతర రాష్ట్రాలకు సరఫరా చేసిన ఎఫ్సీఐ.. ఈ ఏడాది యాసంగికి సంబంధించి 50 శాతానికి మించి బాయిల్డ్ రైస్ తీసుకోలేమని రాష్ట్రానికి స్పష్టం చేసింది. అయితే ఒక్కసారిగా ఇలాంటి నిర్ణయం తీసుకుంటే రాష్ట్రంలో భారీగా సాగైన దొడ్డు రకాల ధాన్యం సేకరణకు ఇబ్బందులు తలెత్తుతాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు కేంద్రం దృష్టికి అంశాన్ని తీసుకెళ్లడంతో పాటు, ఎఫ్సీఐని ఒప్పించడంతో ఈ సీజన్లో 80 శాతం బాయిల్డ్ రైస్ తీసుకునేందుకు అంగీకరించింది. సాధారణంగా యాసంగిలో బాయిల్డ్ రైస్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్, ఒడిశా, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో వీటికి అధికంగా డిమాండ్ ఉండటంతో ఈ బియ్యాన్ని రాష్ట్రం నుంచి సేకరించి ఆయా రాష్ట్రాలకు సరఫరా చేసేది. అయితే ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లోనే పంటల దిగుబడి పెరిగి బాయిల్డ్ రైస్ ఉత్పత్తి పెరిగింది. ఈ నేపథ్యంలో తమకున్న డిమాండ్ మేరకు రా రైస్ (ముడి బియ్యం) మాత్రమే కావాలని, బాయిల్డ్ రైస్ తీసుకోవద్దని నిర్ణయించింది. అయితే తర్వాత ఎఫ్సీఐ 50 శాతం మేర మాత్రమే తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ సీజన్లో మాత్రం 80 శాతం బాయిల్ రైస్, 20 శాతం రా రైస్ తీసుకోవడానికి అంగీకరించింది. కాగా, బాయిల్డ్ రైస్ సేకరణ నుంచి ఎఫ్సీఐ క్రమంగా తప్పుకొంటున్న నేపథ్యంలో దొడ్డు బియ్యం సాగు నుంచి రైతులు బయటకు రావాలని, మార్కెట్లో డిమాండ్ ఉన్న సన్న రకం ధాన్యాల సాగుకు ముందుకు రావాలని పౌర సరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్రెడ్డి సూచించారు. గురువారం తన కార్యాలయంలో మాట్లాడుతూ.. సన్న వడ్లతో పాటు వేరు శనగ, ఆయిల్ సీడ్ పంటల సాగుకు మళ్లాలని పేర్కొన్నారు. 24 గంటల్లోనే ధాన్యం డబ్బులు.. రాష్ట్రంలో ఈ ఏడాది 6,575 కేంద్రాల ద్వారా 80 నుంచి 90 లక్షల మెట్రిక్ టన్నుల మేర ధాన్యం సేకరణ చేయనున్నట్లు శ్రీనివాస్రెడ్డి తెలిపారు. ఇప్పటికే నిజామాబాద్, కామారెడ్డి, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో 179 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని తెలిపారు. ధాన్యం కొనుగోళ్లకు కావల్సిన రూ.20 వేల కోట్లను పౌరసరఫరాల సంస్థకు ముఖ్యమంత్రి సమకూర్చారని, 24 గంటల్లోనే రైతులకు తమ ఖాతాల్లో డబ్బులు పడేలా చూస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలకు అనుగుణంగా తేమశాతం 17 లోపు ఉండేలా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. యాసంగిలో 80 నుంచి 90 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోళ్లను కలిపి 2020–21 ఏడాదిలో 1.28 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ ఉంటుందన్నారు. చదవండి: భారీగా పెరిగిన డీఏపీ ధరలు.. -
వరికంకుల కొత్త చరిత్ర
సాక్షి ప్రతినిధి, వరంగల్: విస్తారంగా వానలు.. నిండుకుండల్లా జలాశయాలు.. మత్తడి దుంకిన చెరువులు, కుంటలు.. పొలాలకు సమృద్ధిగా జలాలు.. భూమికి పచ్చాని రంగేసినట్టు పచ్చదనం... ఆకట్టుకున్న ప్రాజెక్టుల ఆయకట్టులు.. కాళేశ్వరం, దేవాదుల, శ్రీరాంసాగర్, నాగార్జునసాగర్ తదితర ప్రాజెక్టుల నీరు బిరబిరా కాల్వల్లో పరుగులు... ఫలితంగా రాష్ట్రంలో వరిసాగు రెండింతలైంది. వరికంకులు కొత్త చరిత్ర సృష్టించాయి. 2020– 21 యాసంగిలో మొత్తం పంటల అంచనా 36,43,770 ఎకరాలు కాగా, 68,14,555(187.02 శాతం) ఎకరాల్లో రైతులు వివిధ పంటలు వేశారు. వరిసాగు అంచనా 22,19,326 ఎకరాలు కాగా.. అనూహ్యంగా 52,78,636 (237.85 శాతం) ఎకరాల్లో సాగైంది. వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలు 1,47,80,181 టన్నుల ధాన్యం దిగుబడి రావొచ్చని అంచనా. అయితే ఇప్పటికే రైసుమిల్లులు, సీడబ్ల్యూసీ, ఎస్డబ్ల్యూసీ గోదాములు వానాకాలం ధాన్యంతో నిండిపోయాయి. ఈసారి యాసంగి పంట కొనుగోళ్లు సవాల్గా మారనున్నాయి. 137 శాతం అధికంగా వరిసాగు గత యాసంగి, ఖరీఫ్తో పోలిస్తే ఈసారి పంటలు దండిగా రానున్నాయి. అంచనాలకు మించి 137 శాతం అధికంగా వరి సాగైంది. ఒకదశలో ఈ యాసంగి ధాన్యం కోనుగోలు చేయబోమని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రైతుల్లో అలజడి చెలరేగడంతో మళ్లీ వెనుకడుగు వేసింది. యాసంగి ధాన్యం కూడా కొనుగోలు చేస్తామని సీఎం కేసీఆర్ తాజాగా వెల్లడించారు. గతేడాది యాసంగిలో 38,62,510 ఎకరాల్లో వేస్తే ఈసారి 14,16126 ఎకరాల్లో అదనంగా సాగు చేశారు. వరంగల్ రూరల్ జిల్లాలో సాగు అంచనా 43,710 ఎకరాలు కాగా, 1,19,682 ఎకరాల్లో వరివేశారు. నిజామాబాద్లో 1,92,616 ఎకరాలకుగాను 3,87,628, మహబూబ్నగర్ 29,415కుగాను 1,21,004, కరీంనగర్లో 1,21,853కుగాను 2,64,609, జగిత్యాలలో 1,32,648కుగాను 2,98,283, పెద్దపల్లిలో 1,13,520 ఎకరాలకుగాను 1,97,741 ఎకరాల్లో వరివేశారు. మొత్తంగా ఈ ఏడు 1.48 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. గోదాములే సమస్య రాష్ట్రవ్యాప్తంగా యాసంగిలో వరి విస్తీర్ణం 52.78 లక్షల ఎకరాలకు చేరిన నేపథ్యంలో 6,408 కొనుగోలు కేంద్రాలను 31 జిల్లాల్లో ఏర్పాటు చేయనున్నారు. ఇందులో 2,131 ఐకేపీ, 3,964 పీఏసీఎస్(ఫ్యాక్స్), 313 ఏఎంసీ, ఇతర కేంద్రాల ద్వారా కొనుగోళ్లు చేయనున్నారు. ప్రస్తుత సీజన్కు కూడా కామన్ రకం క్వింటాకు రూ.1,868, ‘ఏ’గ్రేడ్ రకానికి చెందిన ధాన్యం క్వింటాకు రూ.1,888గా కనీసమద్దతు ధర(ఎంఎస్పీ) చెల్లిం చనున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా వానాకాలం ధాన్యంతో రైసుమిల్లులు, గోదాములు నిండుకుండల్లా మార డం ప్రతిబంధకం కావచ్చని మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో కొత్తవి, పాతవి కలిపితే 21.99 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములే అందుబాటులో ఉన్నాయి. తెలంగాణవ్యాప్తంగా 2,210 రైస్ మిల్లులున్నాయి. ఈ మిల్లులు ఏడాదికి కోటి లక్షల టన్నుల బియ్యం తయారు చేస్తాయి. గతంలో వీటికి సరిపడా ధాన్యం కూడా రాకపోయేది. కానీ, ఈసారి సగం మిల్లుల్లో వానాకాలం ధాన్యం, బియ్యం నిల్వలు ఫుల్గా ఉన్నాయి. వల్బాపూర్లో యంత్రంతో వరికోసిన తర్వాత ఆరబోసిన ధాన్యం ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం కొనుగోళ్లు యాసంగిలో రైతులు అధికమొత్తంలో దొడ్డురకం వరిధాన్యం సాగు చేశారు. అక్కడక్కడ మాత్రమే సన్నరకం వరి వేశారు. ఈ యాసంగిలో వరి ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉందని గుర్తించాం. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు కోసం కసరత్తు పూర్తయింది. ఎలాంటి ఇబ్బందులు రాకుండా కొనుగోలు చేసి మిల్లులకు తరలించేందుకు అనుమతుల కోసం లేఖ రాశాం. – రాఘవేందర్, డీఎం, జయశంకర్ భూపాలపల్లి ఈసారి కొంత ఎక్కువ దిగుబడి పోయినసారి కన్నా ఈసారి కొంత ఎక్కువ దిగుబడి వచ్చింది. పోయిన యాసంగిల ఎకరానికి 23 క్వింటాళ్లు వస్తే, పోయిన వానాకాలంల కేవలం 18 క్వింటాళ్లే వచ్చాయి. ఈసారి అధికారులు 28 అంటున్రుగాని సుమారు 26 క్వింటాళ్ల వరకు వచ్చే అవకాశాలున్నాయి. – ఎండపెల్లి శ్యాంసుందర్రెడ్డి, రైతు, కమలాపూర్, వరంగల్ అర్బన్ జిల్లా ఇప్పటికైతే మంచిగానే ఉంది ఎన్నో ఏళ్లుగా ఎవుసాన్ని నమ్ముకొని బతుకుతున్న. మూడు, నాలుగేళ్లుగా ఎవుసం చేస్తె అప్పులే తప్ప గవ్వ మిగులలేదు. వానాకాలం పంట చేతికి వచ్చే సమయానికి వాన నిండా ముంచింది. యాసంగి పంట దిగుబడి ఇప్పటికైతే మంచిగానే ఉంది. కోసే దాక వానలు కొట్టకపోతే ఎకరానికి 25 క్వింటాళ్ల దాక వడ్లు చేతికి వస్తయ్. – డొంగరి రాజయ్య, రైతు, కాటారం, జేఎస్ భూపాలపల్లి జిల్లా 2020–21 యాసంగి సాగు వివరాలు (ఎకరాల్లో) యాసంగిలో మొత్తం పంటల అంచనా 36,43,770 ఈ ఏడాది యాసంగి సాగు 68,14,555 మొత్తంగా సాగు శాతం 187.02 గతేడాది యాసంగి సాగు 52,22,377 అత్యధికంగా పంటలు సాగైన జిల్లా వరంగల్ రూరల్ (299.10 శాతం) అత్యల్పంగా పంటలు సాగైన జిల్లా ఆసిఫాబాద్ కొమురం భీం (128.95 శాతం) రాష్ట్రంలో వరిసాగు అంచనా(ఎకరాల్లో) 22,19,326 ఈ యాసంగి సాగు 52,78,636 మొత్తంగా వరిసాగు శాతం 237.85 దిగుబడి అంచనా 1,47,80,181(దొడ్డు రకం 1.19 కోట్ల టన్నులు + టన్నులు సన్నాలు 28.80 లక్షల టన్నులు) గతేడాది సాగు 38,62,510 యాసంగి కొనుగోళ్లు ఇలా మొత్తం కొనుగోలు కేంద్రాలు 6,408 ఐకేపీ కేంద్రాలు 2,131 పీఏసీఎస్ (ఫ్యాక్స్) కేంద్రాలు 3,964 ఏఎంసీ, ఇతర కేంద్రాలు 313 కనీస మద్దతుధర (ఎంఎస్పీ) ‘ఏ’గ్రేడ్ (క్వింటాకు) రూ.1,888 కామన్ రకం (క్వింటాకు) రూ.1,868 చదవండి:త్వరలో రంగారెడ్డి జిల్లాలోని అసైన్డ్ భూముల వేలం -
కడ్తా రూపంలోనే కాదు.. తూకంలోనూ మోసాలు
సాక్షి, భీమ్గల్: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అకవతవకలు వెలుగు చూస్తున్నాయి. కడ్తా రూపంలోనే కాదు.. తూకంలోనూ మోసాలు బయట పడుతున్నాయి. 40 కిలోల సంచికి మూడు కిలోలు ఎక్కువగా కాంటా వేస్తున్నట్లు తాజాగా వెలుగు చూసింది. భీమ్గల్ మండలంలోని పల్లికొండ గ్రామంలో గల ధాన్యం కొనుగోలు కేంద్రంలో జరుగుతున్న అక్రమాలను రైతులు ఆదివారం వెలికి తీశారు. 15 రోజుల క్రితం ముచ్కూర్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో నాలుగు ఎల్రక్టానిక్ కాంటాల ద్వారా నిత్యం ధాన్యం తూకం వేసి, లారీలలో మిల్లర్లకు పంపిస్తున్నారు. అయితే, ఆదివారం కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చి తూకం వేసిన ఓ రైతుకు కాంటా తీరుపై అనుమానం వచ్చింది. తనకు వచ్చిన దిగుబడి ప్రకారం సుమారు 600 బస్తాల ధాన్యం రావాల్సి ఉండగా, 407 బస్తాలు మాత్రమే రావడంతో ఆ రైతు ఖంగు తిన్నాడు. దీంతో నిర్ధారణ కోసం ఒక బస్తాను మోటార్ సైకిల్పై గ్రామంలోని రైస్ మిల్లుకు తీసుకువెళ్లి తూకం వేయగా 40 కిలోల స్థానంలో 43 కిలోల బరువు వచ్చింది. 40 కిలోల బస్తాకు 3 కిలోలకు పైగా తేడా రావడంతో అసలు విషయం వెలుగు చూసింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామంలోని ఇతర రైతులు కొనుగోలు కేంద్రం వద్దకు వచ్చి నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు. రైతుల సమక్షంలో కేంద్రంలోని నాలుగు కాంటాలను తనిఖీ చేసారు. మూడు కాంటాలలో తూకం సమానంగా రాగా, ఒక కాంటాలో మాత్రం బస్తాకు 3 కిలోల వరకు తక్కువ వస్తున్నట్లు గుర్తించారు. రైతుల ఆందోళన విషయం తెలిసి తహసీల్దార్ రాజేందర్, ఆర్ఐ ధనుంజయ, సొసైటీ చైర్మన్ అక్కడకు వచ్చారు. ఏం జరిగిందో ఆరా తీశారు. అలాగే, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులతో మాట్లాడారు. సాంకేతిక లోపం కారణంగా నష్టం జరిగినందున, నష్టపోయిన రైతులకు సంచికి 3 కిలోల చొప్పున తిరిగి ఇప్పించేందుకు ఒప్పించారు. గత 15 రోజులుగా కొనుగోలు కేంద్రంలో తూకం వేసిన ధాన్యం ట్రక్ షీట్ను, మిల్లుకు అప్పగించినపుడు లారీ ధర్మకాంటా రసీదును బేరీజు వేయాలని, వచ్చిన తేడాను ఆ లారీలో ఏయే రైతుల దాన్యం వెళ్లిందో గుర్తించి వారి ఖాతాలో వేయాలని అధికారులు ఆదేశించారు. ఆయా వివారలన్నీ రెండు రోజుల్లో సేకరించి, రైతులను సమావేశపరిచి వెల్లడిస్తానని తహసీల్దార్ హామీ ఇవ్వడంతో అన్నదాతలు శాంతించారు. తేడా ఉన్న తూకం యంత్రాన్ని సీజ్ చేసి వెంట తీసుకెళ్లారు. -
వరి ఉత్పత్తే 2.54 లక్షల మెట్రిక్ టన్నులు
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది రాష్ట్రంలో భారీగా ఆహారధాన్యాల ఉత్పత్తి వస్తుందని వ్యవసాయశాఖ భావిస్తోంది. ఈ మేరకు 2020–21 వ్యవసాయశాఖ కార్యాచరణ ప్రణాళికలో ఉత్పత్తి అంచనాలను పొందుపర్చింది. నైరుతి రుతుపవనాలతో మంచి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించడం, కాళేశ్వరం వంటి ప్రాజెక్టులు పూర్తి కావడం, నియంత్రిత సాగు పద్ధతులను అనుసరిస్తుండటం వంటి కారణాలతో బంఫర్ క్రాప్ వస్తుందని వ్యవసాయశాఖ ప్రకటించింది. ఈ ఏడాది వానాకాలం, యాసంగి సీజన్లలో 2.88 కోట్ల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి అవుతుందని వ్యవసాయశాఖ తెలిపింది. ఇందులో వానాకాలంలో 1.28 కోట్ల మెట్రిక్ టన్నులు కాగా, యాసంగిలో 1.60 కోట్ల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి వస్తుందని అంచనా వేసింది. గతేడాది ఉత్పత్తితో పోలిస్తే ఈ ఏడాది 44 లక్షల మెట్రిక్ టన్నులు అధికంగా ఉంటుందని తెలిపింది. కోటి మెట్రిక్ టన్నులు అధికంగా.. ఈసారి వరి ఉత్పత్తే 2.54 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటుందని వ్యవసాయశాఖ తెలిపింది. గతేడాది కంటే కోటి మెట్రిక్ టన్నులు అధికం కావడం గమనార్హం. ఈ వానాకాలంలో 1.21 కోట్ల మెట్రిక్ టన్నులు, యాసంగిలో 1.33 కోట్ల మెట్రిక్ టన్నులు ఉంటుందని తెలిపింది. రెండు సీజన్లలో కలిపి వరి 81.05 లక్షల ఎకరాలలో సాగవుతుందని అంచనా వేసింది. ఇక పత్తి 60.17 లక్షల ఎకరాల్లో సాగు చేయగా, 14.71 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అంచనా వేశారు. పప్పు ధాన్యాలు రెండు సీజన్లలో కలిపి 8.35 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి వస్తుందని కార్యాచరణ ప్రణాళికలో వ్యవసాయశాఖ పేర్కొంది. -
గుండె మండిన రైతు
సాక్షి, వెంకటగిరి: రుతుపవనాలు గతి తప్పి ఇబ్బంది పెడుతున్నా.. రైతులు కాడి పడేయడం లేదు. అనుకూలంకాని పరిస్థితులకు ఎదురొడ్డి బాధ్యతగా పంట పండిస్తూనే ఉన్నారు. తీరా పంట చేతికొచ్చి అమ్ముదామనే సమయానికి ధర అమాంతం పడిపోతుంది. ఈ పరిస్థితే అన్నదాతల్ని రగిలిపోయేలా చేస్తోంది. ప్రభుత్వం ప్రకటిస్తున్న గిట్టుబాటు ధరకు, ఉత్పత్తి వ్యయానికి ఏ మాత్రం పొంతన ఉండడం లేదు. కనీసం ఆ ధర అయినా అన్ని పంటలకు దక్కుతుంగా అంటే లేదు. ఫలితంగా ఆర్థికంగా కుదేలవుతున్నారు. అప్పులు తీర్చలేక కుటుంబ భారం మోయలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్న నియోజకవర్గంలోని కుటుంబాల్లో అధికశాతం మంది రైతు కుటుంబాలే. నియోజకవర్గంలో కండలేరు జలాశయం నుంచి తమ ప్రాంతాల గుండా చెన్నై, తిరుపతి పట్టణాలకు తాగునీరు నెపంతో పదుల సంఖ్య టీఎంసీల నీరును చిత్తూరు జిల్లా రైతులు ప్రతిఏటా చెరువులకు పెట్టుకుని పంటలు సాగుచేసుకుంటున్నారు, జిల్లాలోని డెల్టా ప్రాంత రైతులు రెండు పంటలకూ నీరు సంమృద్ధిగా లేకుంటే సోమశిల నుంచి కండలేరును చుక్కనీరు వదలరు. నాలుగేళ్లుగా ఒక్క పంటకూడా పెట్టుకోలేని మెట్టప్రాంత వెంకటగిరి నియోజకవర్గ రైతులకు ఏళ్లుగా మారని ఈ పరిస్థితులే వారిని సాగుజలాల కోసం రోడ్డెక్కిస్తున్నాయి. వెంకటగిరి ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయగలిగే ఎస్ఎస్ కెనాల్ను పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నా.. అన్ని బాధలని పంటి బిగువన భరిస్తున్నారు ఈ ప్రాంత రైతులు. జిల్లాకే చెందిన సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి రాష్ట్ర వ్యవసాయశాఖా మంత్రి అయినప్పటికీ ఈ ప్రాంతంలో సాగునీటి రంగం మెరుగు పరచడం, మద్దతు ధర అందించడంలో ఏ మార్పు లేకపోవడంతో గత ఐదేళ్లుగా నష్టాల పాలవుతున్నారు. రైతులకు అమలు చేయాల్సినవి ఎంఎస్ స్వామినాథన్ కమిచేసిన సిఫార్సులను అమలు చేస్తామని, పంట ఉత్పత్తి వ్యవయానికి 50 శాతం జోడించి మద్దతు ధర నిర్ణయిస్తామని రైతులకు పాలకులు ఇచ్చిన హమీని అమలు చేయాలి. గత నాలుగేళ్లుగా నామమాత్రంగా ప్రభుత్వం ఆహార ధాన్యాల మద్దతు ధర పెంచింది. మరికొంత సహకారం అందజేయాలి. రైతు పండించే పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలి. రైతుకు జబ్బు చేస్తే వైద్యం చేయించుకోవడానికి ప్రత్యేక హెల్త్కార్డు సదుపాయం కల్పించాలి. వ్యవసాయ ధరల కమిషనర్ (సీఏసీపీ) పంట ఉత్పత్తి వ్యయాన్ని అంచనా వేసే విధానం సరిగా లేదని రైతులకు నష్టం చేసేలా ఉందని, స్వామినాథన్, రమేష్ చంద్ కమిటీలు చెప్పిన దాన్ని ప్రభుత్వం పట్టించుకోవాలి. ప్రకృతి వైపరీత్యాలు, అతివృష్టి , అనావృష్టి కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులకు పెట్టుబడి రాయితీగా ఎకరాకు రూ.10 వేలు ఆర్థికసాయం అందించాలన్న భూపేంద్రసింగ్ హుడా కమిటీ చేసిన సిఫార్సులను అమలుచేయాలి. ఇదీ సంక్షోభం భూమినే నమ్ముకున్న రైతులు బజారున పడడానికి బాధ్యులు ఎవరు? ఇది రాష్ట్రానికి క్షేమదాయకం కాదు. ఎన్నాళ్లనీ.. ఎన్నేళ్లనీ రైతులు తమ బాధలు దిగమింగుతూ బతకాలి? నాలుగేళ్లుగా రైతులకు పాలకులు ప్రకటించే రైతు రథం, సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు వంటి పథకాలు తెలుగు తమ్ముళ్లకే పరమితమయ్యాయి. పంట వేసేందుకు సరైన విత్తనాలు అందించడం లేదు. ప్రకృతి ప్రకోపానికి గురైతే సాయం అందదు. బ్యాంకుల నుంచి రుణాలు అందక సాగు కోసం అధిక వడ్డీలకు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించి ఆరుగాలం కష్టించి బోరుబావుల కింద కొద్దో గొప్పో సాగుచేసిన పంటకు గిట్టుబాటు ధరలు అందవు. కోతల సమయంలో 30 శాతం వరకూ తగ్గిపోతున్నాయి. సాగు ఖర్చులు, పురుగుమందులు, ఎరువుల ధరలు మాత్రం ఎప్పుడూ పెరుగుతూనే ఉన్నాయి. 2016 నుంచి వెంకటగిరి నియోజకవర్గంలో నాలుగేళ్లుగా కరువు తాండవిస్తుంది. వాతావరణ అననుకూలతతో పంటలు సాగుచేయడం తలకు మించిన భారంగా పరణమించింది. నియోజకవర్గంలో అప్పుల ఊబిలో ఉన్న కుటుంబాల్లో 60 శాతం మందికి వ్యవసాయమే అధారం. టిడిపి అధినేత గత ఎన్నికల్లో రైతుల రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తానని హమీ ఇచ్చి గద్దెనెక్కారు. తొలి సంతకం రైతురుణమాఫీపై చేసి ఆపై కొర్రీలు పెట్టి ఎకరా భూమికి రూ.15000 వరకూ మాఫీ అంటూ కోతపెట్టడమే కాకుండా ఐదు విడతల్లో ఐదేళ్లపాటు ఇస్తానని చెప్పి ప్రతి ఏటా ఎకరాకు రూ 3000 వంతున మూడు దఫాలు చెల్లించారు. అయితే 4,5 విడతల రుణమాఫీ సొమ్ము ఇప్పటికీ రైతుల చేతికందలేదు. చాన్నాళ్ల తర్వాత రైతుల్లో ఆగ్రహాన్ని గమనించిన టిడిపి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని ఎన్నికల ముందు తీసుకొచ్చింది. అంతకు ముందే తెలంగాణలో ఈ పధకం ద్వారా అక్కడి తెరాస ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడంతో రైతులే సార్వత్రిక ఎన్నికల్లో ప్రభావం చూపబోతున్నారని గ్రహించి 3,4 విడతల రుణమాఫీ సోమ్మును ఎన్నికలకు ముందుగానే జమ చేస్తానని వెంకటగిరి సభలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. చంద్రబాబు పాలనలో నిర్లక్ష్యం చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో నియోజకవర్గంలోని సాగునీటి ప్రాజెక్ట్లను నిర్లక్ష్యం చేశారు. వ్యవసాయంపై ఆయన ఉన్న ప్రేమను తెలియజేస్తుంది. ఎస్ఎస్కెనాల్ పూర్తిచేస్తామని ఎన్నికల సంధర్భంగా ఇచ్చిన హమీలు విస్మరించారు. దీనివల్ల వేలాది ఎకరాలు సాగునీరందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. – మామిడి ప్రభాకర్, మార్లగుంట, డక్కిలి మండలం నీరందక సాగు ప్రశ్నార్థకం అయింది తెలుగుగంగ ద్వారా సాగునీరందక ఈ ఏడాది పంటలు వేయలేదు. మా గ్రామంలోనే సుమారు 250 ఎకరాలు బీడు భూములుగా మారాయి. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయితే సాగునీటి ప్రాజెక్టర్లను అభివృద్ది చేస్తానని ప్రకటించడం ఆనందగా ఉంది. – కె రామిరెడ్డి, కుప్పంపల్లి, వెంకటగిరి మండలం జగన్తో మంచి రోజులు జలయజ్ఞం పేరిట సాగునీటి ప్రాజెక్ట్లు నిర్మాణానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వేలకోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఆయన హయాంలోనే ఎస్ఎస్ కెనాల్ నిర్మాణ పనులకు నిధులు మంజూరు చేసినా టీడీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. జగన్తో మళ్లీ మంచిరోజులు వస్తాయని ఎదురు చూస్తున్నాం. – ఆవుల గిరియాదవ్, సిద్ధవరం, వెంకటగిరి మండలం వైఎస్సార్ హయాంలో సాగుకు స్వర్ణయుగం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞం ద్వారా తెలుగుగంగ బ్రాంచి కాలువలు పూర్తి, మెట్టప్రాంతాలకు సాగునీరందించే సుమారు 350 కోట్లుతో నియోజకవర్గంలోని రాపూరు వద్ద ఎస్ఎస్కెనాల్ నిర్మాణ పనులకు శంకుస్దాపన చేశారు. ఆయన మరణం తరువాత వచ్చిన పాలకులు ఆ ప్రాజెక్ట్లను విస్మరించారు. – మేకల శ్రీనివాసులు, వెంకటగిరి రాజన్న ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు వైఎస్ రాజశేఖరరెడ్డి బతికి ఉంటే జలయజ్ఞం ద్వారా ఎస్ఎస్ కెనాల్ పూర్తి చేసేవారు. తెలుగుగంగ బ్రాంచి కాలువలు పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేవారు. రాజశేఖరరెడ్డి మరణించిన తరువాత ఏ ముఖ్యమంత్రి కూడా పట్టించుకోలేదు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయితే సాగునీటి ప్రాజెక్టులు పూర్తయి రైతులకు మేలు జరుగుతుందని ఆశిస్తున్నా. – ఆర్ వీరరాఘవులు, వెంకటగిరి -
పగిడేరులో పాతాళగంగ..!
మణుగూరురూరల్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం పగిడేరు గ్రామ పంచాయతీ పరిధిలోని పరిసర గ్రామాల్లో వస్తున్న వేడి జలపాతాలు రైతుల్లో సంతోషాన్ని నింపుతున్నాయి. సింగరేణి బొగ్గు నిక్షేపాల కోసం వేస్తున్న జియోలజికల్ సర్వే బోర్ల నుంచి వేడి నీరు ఉబికి వస్తుండటంతో ఆ నీరు వృథాగా పోకుండా గ్రామాల రైతులు వ్యవసాయానికి సాగు చేసుకుంటున్నారు. పగిడేరు గ్రామంలో గతంలో కేవలం వర్షాధారంతో ఆ ప్రాంతాల్లో ఉన్న చెరువులు కుంటల్లో నీటితో కేవలం వర్షాకాలం పంట పండించాలంటేనే కష్టంగా ఉండేది. సింగరేణి సంస్థ బొగ్గు నిక్షేపాలను కనుగొనడానికి వేస్తున్న బోర్ల నుంచి వేడి నీరు ఉబికి వస్తుండటం విశేషం. పట్టుకుంటే కాలిపోయే విధంగా నీరు రావడం మరో విశేషం. ఎటువంటి ఖర్చులేకుండా సాగునీరు అందిస్తున్న బోర్లు పగిడేరు పరిసర ప్రాంతాల్లో ఇప్పటివరకు సుమారు 20 బోర్లు వేయగా అందులో కనీసం 10 బోర్ల నుంచి వేడి నీరు వస్తుంది. తొలుత స్పీడుగా నీరు వచ్చిన బోర్లు కొంతకాలం తరువాత తగ్గుతున్నాయి. 20 సంవత్సరాల క్రితం వేసిన బోర్లు ఇంకిపోగా, ఇటీవల వేసిన బోర్ల నుంచి వేడినీరు ఉబికి వస్తుండటంతో రైతులు ఆనందాన్ని వ్యక్తంచేస్తున్నారు. ఇటీవల కొడిశల కుంట గ్రామ సమీపంలో వేసిన రెండు బోర్లలో వేడినీరు ఉబికి వస్తుంది. 5 హెచ్పీ మోటార్కు వచ్చినంత వేగంగా నీరు బయటకు రావడంతో ఆ నీటిని రైతులు చేరువులోకి మళ్లించి పంటలు సాగుచేసుకుంటున్నారు. అదే విధంగా గొల్లకొత్తూరు గ్రామంలో బోరు వేయడంతో దాని నుంచి వేడి నీరు రావడంతో రైతులకు ఉపయోగపడే విధంగా ఏర్పాటు చేశారు. దీంతో పగిడేరు పరిసర ప్రాం తాల్లో కేవలం ఈ బోర్లను ఆధారంగా చేసుకొని సుమారు 500ల ఎకరాల్లో వరి సాగు చేసుకుంటున్నారు. ఈబోర్ల వలన రెండు పంటలు పండటానికి అనుకూలంగా ఉండటంతో రైతులు సం తోషం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ ఖర్చులు లేకుండా సాగునీరు అందిస్తున్న బోర్లు తమకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
రబీలో వరి వద్దు
సాక్షి, హైదరాబాద్: రబీలో వరి సాగు వద్దని, ఇతర ప్రత్యామ్నాయ పంటలకు వెళ్లాలని వ్యవసాయశాఖ రైతులకు పిలుపునిచ్చింది. కాలం కలసి రాకపోవడం, అనేక చోట్ల బోర్లు, బావులు, చెరువుల్లో నీరు అడుగంటి పోవడంతో వరి వేస్తే ప్రయోజనం ఉండదని తెలిపింది. ఈ మేరకు వ్యవసాయశాఖ కమిషనర్ రాహుల్ బొజ్జా జిల్లా వ్యవసాయాధికారులతో శనివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నీటి వనరులున్నచోట మాత్రమే వరికి వెళ్లాలని, మిగిలిన ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ పంటలు వేయాలని రైతులకు సూచిస్తున్నట్లు రాహుల్ బొజ్జా ‘సాక్షి’కి తెలిపారు. ఈ మేరకు రైతులను చైతన్యపరచాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన వివరించారు. రాష్ట్రంలో 18 జిల్లాల్లో వర్షాభావం నెలకొంది. దీంతో రబీలో అనుకున్న స్థాయిలో వరి నాట్లు పడలేదు. వరి నాట్లు పుంజుకోలేదు. రబీలో అన్ని పంటల సాధారణ సాగు విస్తీర్ణం 33.45 లక్షల ఎకరాలుకాగా ఇప్పటివరకు కేవలం 10 లక్షల ఎకరాలకే సాగు పరిమితమైంది. రబీ వరి సాధారణ సాగు విస్తీర్ణం 17.62 లక్షల ఎకరాలుకాగా ఇప్పటివరకు లక్ష ఎకరాల లోపే నాట్లు పడ్డాయి. ఇక మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 4.15 లక్షల ఎకరాలుకాగా 2 లక్షల ఎకరాలకే పరిమితమైంది. అలాగే మొక్కజొన్నపై కత్తెర పురుగు దాడి చేస్తుంది. నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, నిర్మల్, కరీంనగర్, మహబూబాబాద్ జిల్లాల్లో ఈ పురుగు కారణంగా మొక్కజొన్న నాశనమై పోయింది. దీంతో పరిస్థితిని గమనించిన వ్యవసాయశాఖ ప్రత్యామ్నాయ ప్రణాళికను సిద్ధం చేయాలని నిర్ణయించింది. ఆరుతడి పంటలే మేలు... వరికి ప్రత్యామ్నాయంగా శనగ, వేరుశనగ, పొద్దు తిరుగుడు, ఆముదం, నువ్వులు తదితర పంటలను సాగు చేసేలా రైతులను అధికారులు ప్రోత్సాహించనున్నారు. సిద్దిపేట జిల్లా వ్యవసాయశాఖ, కలెక్టర్ ఇప్పటికే ‘రబీలో వరి వద్దు... ఆరుతడి పంటలే మేలంటూ’పెద్ద ఎత్తున కరపత్రాలు వేసి రైతుల్లో చైతన్యం నింపుతున్నారు. సాగునీటి వనరులు లేకపోవడంతో వరి వైపు వెళ్లి నష్టపోకూడదని వ్యవసాయశాఖ సూచిస్తోంది. ఎకరా వరి సాగయ్యే నీటితో కనీసం మూడెకరాల ఆరుతడి పంటలను రైతులు సాగు చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. డ్రిప్ ద్వారానైతే ఐదారు ఎకరాలూ సాగు చేసుకోవచ్చు. పైగా పంటల మార్పిడి వల్ల చీడపీడల ఉధృతి కూడా ఉండదని వ్యవసాయశాఖ చెబుతోంది. వరి కంటే కూడా పొద్దు తిరుగుడు, శనగ, నువ్వుల పంటకాలం కూడా తక్కువుంటుందని, పైగా ఆరుతడి పంటలకే మద్దతు ధర అధికంగా ఉందని వ్యవసాయశాఖ చెబుతోంది. వరి మద్దతు ధర క్వింటాలుకు రూ. 1,770 అయితే, పొద్దు తిరుగుడు మద్దతు ధర రూ. 5,388 ఉందని తెలిపింది. సాగు ఖర్చు కూడా తక్కువని పేర్కొంది. ప్రస్తుతం రబీ కోసం 4.72 లక్షల క్వింటాళ్ల విత్తనాలను సబ్సిడీపై అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. అందులో జిల్లాల్లో ఇప్పటివరకు 80 వేల క్వింటాళ్లు అందుబాటులో ఉంచారు. వాటిలో 65 వేల క్వింటాళ్లే అమ్ముడుపోయాయి. ఇక రబీ వరి విత్తనాలు 2.22 లక్షల క్వింటాళ్లు సరఫరా చేయడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రత్యామ్నాయ ప్రణాళికకు వెళ్లాల్సి ఉన్నందున ఇతర విత్తనాలను కూడా ఆగమేఘాల మీద అందుబాటులో ఉంచాలని రాహుల్ బొజ్జా అధికారులను ఆదేశించారు. -
తెలంగాణ వరికి ‘నాసి’ రోగం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సోనా రకం వరి విత్తనాల్లో మొలకెత్తని వాటిని రాష్ట్ర వ్యవసాయశాఖ గుర్తించింది. సోనమ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తయారు చేసిన (లాట్ నంబర్: 150480) విత్తనాలు నాసిరకమైనవని తేలింది. దీంతో వాటిని సీజ్ చేయాలని జిల్లా వ్యవసాయాధికారులను ఆదేశించింది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆర్ఎన్ఆర్–15048 అనే తెలంగాణ సోనా రకం వరి విత్తనాన్ని కనుగొన్నది. ఈ వరిలో గ్లైపోసేట్ శాతం తక్కువ ఉండటంతో ఇది షుగర్ వ్యాధిగ్రస్తులకు ప్రయోజనకరమన్న ప్రచారం ఉంది. దీంతో ఈ వరి బియ్యాన్ని అనేకమంది ఉపయోగిస్తున్నారు. ఈ వరిపై పలు రాష్ట్రాలూ ఆసక్తి చూపిస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సహా మరికొన్ని రాష్ట్రాల్లో దీని సాగు పెరిగింది. దీంతో అనేక కంపెనీలకు విత్తనోత్పత్తి చేసే అవకాశం కల్పించారు. కానీ, కొన్ని కంపెనీలు నిర్లక్ష్యంగా ఉండటంతో నాసిరకపు విత్తనాలు వెలుగు చూస్తున్నాయని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. సోనమ్ కంపెనీ పంపిణీ చేసిన లాట్లోని కొన్ని విత్తనాలను పరీక్ష నిమిత్తం సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల వ్యవసాయాధికారి లెబొరేటరీకి పంపారు. పరీక్షల్లో ఆ లాట్ విత్తనాలకు 55 శాతం మొలకెత్తే స్థాయి మాత్రమే ఉందని నిర్ధారించారు. ఒక అంచనా ప్రకారం ఈ లాట్ నంబర్ కలిగిన నాసిరకపు విత్తనాలను దాదాపు 50 నుంచి వంద క్వింటాళ్ల వరకు రైతులకు అమ్మేందుకు జిల్లాలకు సరఫరా చేసినట్లు సమాచారం. అయితే, ఎంతమేరకు ఇప్పటికే ఈ లాట్ నంబర్ కలిగిన తెలంగాణ సోనా విత్తనాలను రైతులు కొనుగోలు చేశారో మాత్రం తెలియదు. ఈ లాట్ నంబర్ కలిగిన విత్తనాలను జిల్లాలకు సరఫరా చేయడానికి ముందే నాణ్యతను ఎందుకు కనుగొనలేదన్న ప్రశ్నలు రైతుల నుంచి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో విత్తనాన్ని సరఫరా చేసిన కంపెనీపై చర్యలు తీసుకునే అవకాశముంది. తెలంగాణ సోనా విత్తనంలో జన్యుపరమైన లోపాలున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవంలేదని వ్యవసాయశాఖ వర్గాలు ప్రకటించాయి. -
వరిపై మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
-
మంత్రి దేవినేని వివాదాస్పద వ్యాఖ్యలు
నందిగామ: ‘‘పశ్చిమ కృష్ణా ప్రాంతంలో రైతులు 45 వేల ఎకరాల్లో సుబాబుల్ పంట వేశారు. వరి ఎలాగైతే సోమరిపోతు పంటో సుబాబుల్ కూడా అలాంటిదే. మనకు గతి లేక, మరో పంట పండక, నీటి ఎద్దడి వల్ల సుబాబుల్ పంటకు అలవాటుపడ్డాం. రైతులు సుబా బుల్ నుంచి బయటకు వచ్చి వాణిజ్య పంటలపై దృష్టి పెట్టాలి’’ అని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం కృష్ణా జిల్లా నందిగామలో నూతన పోలీసుస్టేషన్ భవనాన్ని ఉప ముఖ్యమంత్రి మంత్రి చినరాజప్ప, మంత్రి దేవినేని ప్రారంభించారు. ఈ సందర్భంగా వరి, సుబాబుల్ పంటల గురించి దేవినేని చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్రంలో పోలీసు సిబ్బంది తక్కువగా ఉన్నప్పటికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి శాంతి భద్రతలను అదుపులో ఉంచుతున్నామని చినరాజప్ప చెప్పారు. వ్యవసాయం, రైతులంటే టీడీపీకి చిన్నచూపే : ఎంవీఎస్ నాగిరెడ్డి సాక్షి, అమరావతి/విజయవాడ సిటీ: వరి, సుబాబుల్ పంటల రైతులపై రాష్ట్ర మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చేసిన వ్యాఖ్యలను వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి ఖండించారు. ‘‘రైతుల పట్ల తెలుగుదేశం ప్రభుత్వానికి ఎప్పుడూ చిన్నచూపే. వ్యవసాయం దండుగని చంద్రబాబు వ్యాఖ్యానించిన విషయం మర్చిపోలేం. ఇప్పుడు ఆయన మంత్రివర్గంలోని దేవినేనిఉమ వరి సాగుదారులను సోమరిపోతులు అనడం దారుణం. మొత్తం వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా ఉన్న ఏపీలో వరి ప్రధాన పంటగా ఉంది. కృష్ణా–గోదావరి కృష్ణా, గోదావరి, పెన్నా డెల్టాతో ఏపీని అన్నపూర్ణగా, దక్షిణభారత ధాన్యాగారంగా పిలుస్తారు. ఏపీలో 90శాతం మంది వరి అన్నం తింటారు. వ్యవసాయం, రైతుల గురించి మాట్లాడేటప్పడు ఎవరికైనా ఇంగితజ్ఞానం ఉండాలి. సాగునీటి ప్రాజెక్టుల పేరిట ధనదోపిడీ కొనసాగించడం తప్ప రైతుల పట్ల గౌరవం, వ్యవసాయం రంగం పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదు’’ అని తీవ్రంగా విమర్శించారు. -
జోరందుకున్న వరి నాట్లు
రోజూ వర్షాలు కురియడం.. చెరువుల్లో పుష్కలంగా నీరు చేరడంతో రైతన్నలు వరి నాటుపై ఆసక్తి చుపుతున్నారు. గతేడాది సుమారు 100 ఎకరాల్లో వరి సాగు చేయగా.. ఈ ఏడాది సుమారు 300 ఎకరాలకు పైగా సాగవుతున్నట్లు వ్యవసాయాధికారులు తెలిపారు. ఏళ్ల తరబడి సాగుకు నోచుకోని బీడు భూములను కూడా రైతన్నలు సాగులోకి తెస్తున్నారు. మండలంలోని పెద్దేముల్, దుగ్గాపూర్, మంబాపూర్, జనగాం, గాజీపూర్, బుద్దారం, కందనెల్లితండా, తింసాన్పల్లి తదితర గ్రామాల్లో వరి నాట్లు వేయడం జోరందుకుంది. దానికి తోడు కులీలకు డిమాండ్ కూడా పెరింగిందని రైతులు అంటున్నారు. - పెద్దేముల్ -
‘వరి’ తగ్గించుకోవడమే మేలు
‘సాక్షి’ ఇంటర్వ్యూలో గజ్వేల్ ఏడీఏ శ్రావణ్కుమార్ గజ్వేల్: గజ్వేల్ వ్యవసాయ సబ్డివిజన్ పరిధిలోని గజ్వేల్, తూప్రాన్, కొండపాక మండలాల్లో ఖరీఫ్ ఆశాజనకంగా ఉందని ఏడీఏ శ్రావణ్కుమార్ చెబుతున్నారు. ఆరుతడి పంటలకు ఇక ఢోకా లేదని తెలిపారు. భారీ వర్షాల్లేని కారణంగా చెరువులు, కుంటలు ఇతర జలాశయాల్లో నీరు చేరకపోవడం వల్ల భూగర్భజలమట్టం పెరిగే పరిస్థితి లేదని ఈ నేపథ్యంలో...బోరుబావుల సేద్యం కొంత ఇబ్బంది మారిందంటున్నారు. ‘వరి’ సాగును తగ్గించుకోవాలని సలహా ఇస్తున్నారు. తాజా పరిస్థితులపై ‘సాక్షి’ గజ్వేల్ ఏడీఏను ఇంటర్వ్యూ చేసింది. ఆ వివరాలు మీ కోసం... సాక్షి: గజ్వేల్ సబ్డివిజన్లో ఈసారి ఎన్ని హెక్టార్ల సాగు వస్తుందని భావించారు...? ఎంత సాగైంది..? ఏడీఏ: సబ్డివిజన్ పరిధిలోని గజ్వేల్ మండలంలో 12392 హెక్టార్ల సాధారణ విస్తీర్ణానికిగానూ 11285 హెక్టార్లలో పంటలు సాగులోకి వచ్చాయి. కొండపాక మండలంలో 10368 హెక్టార్లకు 7506, తూప్రాన్ మండలంలో 6500 హెక్టార్ల సాధారణ విస్తీర్ణానికిగానూ 5676 హెక్టార్లలో పంటలు సాగులోకి వచ్చాయి. సాక్షి: మొక్కజొన్న, పత్తి పంటల సాగు విస్తీర్ణం ఎంత...? ఏడీఏ: గజ్వేల్ మండలంలో మొక్కజొన్న 6744, పత్తి 3130 హెక్టార్లు, కొండపాక మండలంలో మొక్కజొన్న 3380, పత్తి 1941 హెక్టార్లు, తూప్రాన్లో మొక్కజొన్న 1770, పత్తి 30 హెక్టార్లలో సాగులోకి వచ్చాయి. సాక్షి: వర్షపాతం నమోదు వివరాలు తెల్పండి..? ఏడీఏ: జూన్ నెలలో సాధారణం కంటే అధికంగా వర్షపాతం నమోదైంది. జూలై మాత్రం తక్కువగా ఉంది. అయినా పంటలకు ఎలాంటి ఇబ్బంది లేదు. మూడు మండలాల్లో పంటలు బాగానే వున్నాయి. సాక్షి: జూలై 15తో విత్తనాలు వేసే గడువు ముగిసిందని మీరంటున్నారు. ఇప్పటివరకు విత్తనాల వేయని వారి పరిస్థితి...? ఏడీఏ: ఇప్పటివరకు విత్తనాలు వేయని వారు ఆగస్టు 15వరకు కంది, ఆముదం, పొద్దుతిరుగుడు వంటి విత్తనాలు వేసుకోవచ్చు. సాక్షి: వరి సాగు పరిస్థితి...? ఏడీఏ: సబ్డివిజన్లో ఇప్పటివరకు వరి నాట్లు పెద్దగా ఊపందుకోలేదు. సబ్డివిజన్ పరిధిలో ఇప్పటివరకు 900 హెక్టార్లకు సాగు మించలేదు. చాలా చోట్ల నారుమడి దశలో ఉన్నాయి. అక్కడక్కడా బోరుబావుల సాయంతో నాట్లు వేస్తున్నారు. భారీ వర్షాలు కురవడంలేదు, వరి నాట్లకు దూరంగా ఉండటమే మంచిది. సాక్షి: పంటల బీమా పరిస్థితి ఏమిటి...? ఏడీఏ: ఈసారి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా పథకం రైతుల రుణమాఫీ పథకంతోనే వర్తిస్తుంది. -
విద్యుదాఘాతంతో రైతు మృతి
ఖానాపూర్ (వరంగల్): వరి పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లిన ఓ రైతు విద్యుదాఘాతంతో ప్రాణాలు కోల్పోయాడు. వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం ధర్మారావుపేటకు చెందిన తేజావత్ వెంకన్న (50) రెండెకరాల్లో వరి సాగు చేస్తున్నాడు. బుధవారం సాయంత్రం పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లాడు. మోటారు దగ్గర ఫీజును సరిచేస్తున్న క్రమంలో షాక్కు గురై ప్రాణాలు కోల్పోయాడు. వెంకన్నకు భార్య అచ్చి, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. -
వరి పంటకు నీరు ఇవ్వలేం
కర్నూలు: తుంగభద్ర దిగువ కాల్వ కింద వరిపంటకు సాగు నీరు ఇవ్వలేమని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. సోమవారం కర్నూలులో వ్యవసాయ, సాగునీటి అధికారులు సంయుక్తంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయాన్ని తెలిపారు. దిగువ కాల్వ కింద కేవలం ఆరుతడి పంటలు మాత్రమే వేయాలని రైతులకు అధికారులు తెలిపారు. వరిపంటకు నీరు విడదల చేసేందుకు ప్రాజెక్టులో నీరు లేదని వారు పేర్కొన్నారు. -
అకాల వర్షాలతో కుదేలైన రైతులు
- పరిహారం అందివ్వాలని రాస్తారోకో సింధనూరు టౌన్ : గత వారం కురిసిన అకాల వర్షాల నుంచి ఇంకా కోలుకోని రైతులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వరిపంట తీవ్రంగా నష్టపోవడంతో రైతులు ఆకస్మిక రాస్తారోకో చేపట్టారు. తాలూకాలోని బసాపుర ఈజే, పగడదిన్ని క్యాంప్, కున్నటగి, దేవరగుడి, గీతాక్యాంప్, తుర్విహాళ, గుంజళ్లి తదితర గ్రామాల్లో వరి పంటలకు తీవ్ర నష్టం జరిగింది. ఏపుగా పెరిగిన వరి పంట కోతకు వచ్చే దశలో అకాల వర్షాలు ముంచెత్తాయి. దిక్కుతోచని రైతులు నానిపోయిన వరి పణలను ట్రాక్టర్లలో వేసుకొని వచ్చి తాలూకాలోని బసాపుర క్యాంప్ వద్ద రాస్తారోకో చేపట్టారు. ప్రభుత్వ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జెడ్పీ మాజీ అధ్యక్షుడు బాదర్లి పంపనగౌడ, జెడ్పీ సభ్యుడు చందూసాబ్ ముళ్లూరు తదితరులు అక్కడకు చేరుకుని రైతులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అనంతరం అక్కడకు చేరుకున్న జిల్లాధికారి శశికాంత్ సెంథిల్, తహశీల్దార్ గంగప్ప కల్లూరులను రైతులు చుట్టుముట్టారు. రైతుల సమస్యలు పరిష్కరిస్తామని అధికారులు హామీనివ్వడంతో రైతులు శాంతించి తమ ఆందోళన విరమించారు. అనంతరం రైతులు, నాయకులతో అధికారులు చర్చించారు. ప్రముఖులు మల్లనగౌడ కన్నారి, శ్రీనివాస్, పంపనగౌడ పూలబావి, ఎస్ఎన్ రాజు, సహాయక వ్యవసాయ అధికారి జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. రైతుల రాస్తారోకోతో సుమారు గంటసేపటికి పైగా ట్రాఫిక్ అస్తవ్యస్తమైంది. మూడు రోజుల్లో ప్రభుత్వానికి పంట నష్టంపై నివేదిక అకాల వర్షంతో జరిగిన పంట నష్టంపై రైతులకు తగిన పరిహారం అందించేందుకు మూడు రోజుల్లోగా ప్రభుత్వానికి నివేదిక పంపుతామని జిల్లాధికారి శశికాంత్ సెంథిల్ పేర్కొన్నారు. కౌలు రైతులకు కూడా పరిహారం అందింపజేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఆయన శుక్రవారం తాలూకాలోని బసాపుర క్యాంప్ వద్ద నష్టానికి గురైన వరి పంటను పరిశీలించిన అనంతరం మాట్లాడారు. తహశీల్దార్ నేతృత్వంలో తాలూకాలో జరిగిన పంట నష్టంపై సర్వే జరిపించి నివేదిక రూపొందిస్తామన్నారు. గతంలో మాదిరిగా చెక్ల రూపంలోనే ఈసారి కూడా పరిహారం అందిస్తామన్నారు. అందువల్ల ప్రతిఒక్క రైతు బ్యాంకు ఖాతా కలిగి ఉండాలన్నారు. సింధనూరు టౌన్ : తాలూకాలో గురువారం రాత్రి కురిసిన వడగండ్ల వర్షాలకు వరి పంటలు నీటి పాలయ్యాయి. గొరెబాళ్, సాసలమరి, సోమలాపుర గ్రామాల్లో కురిసిన వర్షం వల్ల కోత దశలో ఉన్న వరి పంట నేలకొరిగి భారీ స్థాయిలో నష్టం వాటిల్లింది. ప్రభుత్వం స్పందించి పంటల నష్టాన్ని అంచనా వేసి పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు. -
నీరు లేక వరికి నిప్పు
తాము పొలంలో నాటేది విత్తో విపత్తో అంతుచిక్కని దయనీయ పరిస్థితి రైతాంగానిది. ఏటా అతివృష్టి,అనావృష్టితో నష్టాలే. హుద్హుద్ ధాటికి నేలకొరిగిన వరిని సుడిదోమ ఆశించింది. దానికి వర్షాభావ పరిస్థితులు తోడవ్వడంతో పంట ఎండిపోయి పనికిరాకుండాపోయింది. చోడవరం మండలం దామునాపల్లిలో సుమారు వంద ఎకరాల వరి పంటను రైతులు మంగళవారం తగులబెట్టారు. చోడవరం : వరి రైతు గుండె దిగాలు పడింది. ఎండుతున్న పంటను చూసి రైతన్న కన్నీటి పర్యంతమవుతున్నాడు. ఎక్కడ చూసినా వరి రైతుల వేదనే వినిపిస్తోంది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్కు అన్నీ అడ్డంగులే ఎదురయ్యాయి. వర్షాలు సకాలంలో కురవక అష్టకష్టాలు పడి సీజన్ ఆఖరి రోజుల్లో నాట్లు వేశారు. ఆలస్యంగా నాట్లు వేసినా పంట చేతికొస్తే తిండి గింజలైనా మిగులుతాయని రైతులంతా ఆశించిన సమయంలో హుద్హుద్ తుఫాన్ వచ్చిపడింది. ఈ తుఫాన్లో వర్షాలు పడకపోగా గాలులకు ఎదిగిన పంట పూర్తిగా నేలకొరిగింది. దీనికితోడు మునుపెన్నడూలేని విధంగా సుడిదోమ ఈ సారి వరి పంటను పీడించింది. ఈ తెగులును నివారించాలంటే భారీ వర్షం పడాల్సి ఉంది. కాని వర్షం పడలేదు. తెగులు సోకని పొలాలు నీరులేక ఎండిపోతున్నాయి. ఇప్పటికీ వ్యవసాయానికి విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కాకకపోవడంతో కనీసం బోర్ల సాయంతోనైనా పొలాలకు నీరుపెట్టుకోని దయనీయ స్థితి ఏర్పడింది. ఇటు సుడిదోమ, అటు నీరులేక వందలాది ఎకరాల్లో పంట పొలాలు ఎండపోయాయి. చోడవరం, మాడుగుల నియోజకవర్గాల పరిధిలో సుమారు 500ఎకరాలకు పైబడి వరి పంట ఎండిపోయింది. చోడవరం మండలంలో దామునాపల్లిలోనే సుమారు వంద ఎకరాల మేర వరి పంట సుడిదోమ బారిన పడి ఎండిపోవడంతో రైతులు ఈ పంటను మంగళవారం తగులబెట్టారు. శానాపతి సత్యారావు, శానాపతి నాగేశ్వరరావు, కొయిలాపల్లి రాము, రాజు, మట్టా భాను లకు చెందినే సుమారు 65 ఎకరాలు ఒకే సారి తగులబెట్టారు. ఇప్పటి కే లక్కవరంలో రైతులు 20ఎకరాల్లో ఎండిన వరిపంటను కోసి పశువులకు వేశారు. పిడికెడు మెతుకులైనా దక్కుతాయని వేసిన పంటను ఆ చేతులతోనే తగులబెట్టే దుస్థితి రావడంతో బాధిత రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం గ్రామీణ జిల్లాను నిర్లక్షం చేస్తోందని రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
పంట ఎండిందని ప్రాణం తీసుకున్నాడు..
దోమ: ఆరుగాలం కష్డపడి సాగు చేసిన వరిపంట కళ్ల ముందే ఎండిపోవడంతో అప్పులు తీరేమార్గం లేదని మనోవేదనకు గురైన ఓ అన్నదాత బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా దోమ మండల పరిధిలోని బొంపల్లి చిన్నతండాలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. తండాకు చెందిన ఆంగోతు రాములు నాయక్(35) బొంపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వద్ద 6 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని గత మూడేళ్లుగా వ్యవసాయం చేస్తున్నాడు. ఈ ఏడాది ఖరీఫ్లో వరిపంట వేశాడు. పెట్టుబడికి, కుటుంబ అవసరాల కోసం దోమ ఎస్బీహెచ్లో రూ.30 వేలు, ప్రైవేట్గా మరో రూ.1.70 లక్షల వరకు అప్పు చేశాడు. ఇటీవల విద్యుత్ కోతల కారణంగా పంటకు నీరందక పూర్తిగా ఎండిపోయింది. దీంతో పెట్టిన పెట్టుబడి కూడా వస్తుందో రాదోనని రాములునాయక్ మానసిక వేదనకు గురయ్యాడు. అప్పులు తీరేమార్గం లేదని మనస్తాపం చెందిన ఆయన మంగళవారం మధ్యాహ్నం పొలంలో తాడుతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొద్దిసేపటి తర్వాత పొలానికి వెళ్లిన చిన్న కుమారుడు సేవ్యా తండ్రి మృతదేహాన్ని గమనించి గ్రామస్తులకు సమాచారం ఇచ్చాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య లక్ష్మీబాయితో పాటు కుమారులు శంకర్, సేవ్యా, కుమార్తె సావిత్రి ఉన్నారు. రైతు మృతితో కుటుంబీకులు, బంధువులు కన్నీటిపర్యంతమయ్యారు. మృతుడి తండ్రి రూప్సింగ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆకుపచ్చని బంగారం మన మాగాణం!
* వరి సాగుతో పర్యావరణానికి కీడు లేదు.. మేలే! * భూతాపోన్నతికి దోహదపడే కర్బన ఉద్గారాలను పీల్చుకుంటున్న మాగాణి భూములు * సీఆర్ఆర్ఐ శాస్త్రవేత్తల పరిశోధనల్లో వెల్లడైన వాస్తవం అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు పెద్దలు. మన దేశంలోనే కాదు.. దక్షిణాసియా దేశాల ప్రజలకు వరి అన్నమే అత్యంత ముఖ్యమైన ఆహారం. మనకు ఇంత ముఖ్యమైన వరి పంటను 80% మేరకు నీటిని నిల్వగట్టే పద్ధతిలో, 20% విస్తీర్ణంలో ఆరుతడి పద్ధతిలో సాగు చేస్తున్నారు. నీటిని నిల్వగట్టే పద్ధతి వల్ల పర్యావరణానికి తీరని హాని కలుగుతున్నదన్న నింద ఎప్పటి నుంచో ఉంది. మనిషి చేసే పనుల వల్ల అత్యంత ప్రమాదకరమైన మిథేన్ వాయువు వాతావరణంలోకి విడుదలవుతున్నది. ఇది 11% మేరకు చైనా, భారత్ తదితర దేశాల్లో వరి పొలాల నుంచే వెలువడుతోందని చెబుతున్నారు. వాతావరణ మార్పులపై అంతర్జాతీయ చర్చల్లో ఇది తరచూ ప్రస్తావనకొస్తుంటుంది. వరి పొలాల వల్ల జరుగుతున్నదని భావిస్తున్న పర్యావరణ నష్టాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిందేనన్న డిమాండ్ ముందుకొస్తున్నది. అయితే, తాజా పరిశోధన తేల్చిందేమంటే.. వరి పొలాల వల్ల పర్యావరణానికి జరుగుతున్నది హాని కాదు.. మేలని! సంప్రదాయ వరి పొలాలు వాతావరణంలోని కర్బన ఉద్గారాలను పీల్చుకుంటూ కాలుష్యాన్ని, భూతాపాన్ని తగ్గిస్తున్నాయని ఈ పరిశోధన తేల్చింది. పచ్చని తివాచీలా విస్తారంగా పరచుకున్న వరి మాగాణులు భూతాపాన్ని పెంచకపోగా.. తగ్గించేందుకు దోహదపడు తున్నాయని తేల్చిన ఈ అపూర్వ పరిశోధనకు కటక్ (ఒడిశా)లోని ప్రతిష్టాత్మక కేంద్రీయ వరి పరిశోధనా సంస్థ(సీఆర్ఆర్ఐ) వేదికైంది. దేశంలోనే అతిముఖ్యమైన వరి పరిశోధనా సంస్థ సీఆర్ఆర్ఐ. 2009 అక్టోబర్ నుంచి అక్కడి శాస్త్రవేత్తలు ఈ పరిశోధనపై దృష్టి పెట్టారు. రెండున్నర ఎకరాల మాగాణి పొలం చుట్టూ పకడ్బందీగా ఇనుప తీగల కంచె వేసి.. నడి మధ్యన ఒక యంత్ర పరికరాన్ని ఏర్పాటు చేశారు. అత్యంత ముఖ్యమైన ఆహార పంటయిన వరిని మడుల్లో నీటిని నిల్వగట్టి సాగు చేయడం వల్ల పర్యావరణానికి జరుగుతున్న కీడేమిటో, మేలేమిటో కొత్త కోణంలో అర్థం చేసుకోవడానికి ఈ విశేష పరిశోధన ఎంతగానో దోహదపడుతోంది. ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తల మన్నన పొందిన అధునాతన ఎడ్డీ కొవారియన్స్(ఈసీ) సాంకేతిక వ్యవస్థను ఉపయోగించి ఈ పరిశోధన జరిపారు. నేల - వాతావరణం మధ్య వివిధ పర్యావరణ వ్యవస్థల్లో బొగ్గుపులుసు వాయువు, నీటి ఆవిరి, మిథేన్, అనేక ఇతర వాయువుల మార్పిడి తీరు ఎలా ఉందో కచ్చితంగా లెక్కగట్టడానికి ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలంతా ఈసీ వ్యవస్థపైనే ఆధారపడుతున్నారు. సీఆర్ఆర్ఐలో సీనియర్ క్రాప్ సైంటిస్ట్గా పనిచేస్తున్న డాక్టర్ ప్రతాప్ భట్టాచార్య కూడా ఈసీ టెక్నిక్నే ఉపయోగించారు. వరి పొలాల వల్ల భూతాపం పెరిగిపోతోందనడం శుద్ధ తప్పని, నిజానికి వరి పొలాలు కర్బన ఉద్గారాలను పీల్చుకొని భూతాపాన్ని తగ్గిస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు. 2012-13 సంవత్సరంలో ఏడాది పొడవునా డా. ప్రతాప్ భట్టాచార్య, ప్రిన్సిపల్ సైంటిస్ట్ ఏకే నాయక్లతో కూడిన బృందం పూర్తిస్థాయి పరిశోధన చేసింది. నీటిని నిల్వగట్టి వరి సాగైన మాగాణి భూముల్లో బొగ్గుపులుసు వాయువు(సీవో2), మిథేన్(సీహెచ్4)ల నిల్వలు తగ్గుతున్నట్లు వారు గుర్తించారు. ఈ పొలాల్లో నేలకు భూతాపోన్నతికి దోహదపడుతున్న ఈ రెండు వాయువులను భూస్థాపితం చేస్తూ, భూ ఉపరితల వాతావరణం అమితంగా వేడెక్కకుండా అడ్డుకుంటున్నాయని ఈ అధ్యయనం తేల్చింది. హెక్టారు(సుమారు రెండున్నర ఎకరాల) మాగాణి భూమి వర్షాకాలంలో 910 కిలోలు, ఇతర కాలాల్లో 590 కిలోల కర్బనాన్ని వాతావరణం నుంచి పీల్చుకుంటున్నదని ఈ బృందం గుర్తించింది. అయితే, ఫిలిప్పీన్స్లోని అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థకు చెందిన డా. రీనర్ వాస్మన్ విభేది స్తున్నారు. డా. భట్టాచార్య బృందం మిథేన్ను పట్టించుకోలేదన్నారు. డా. భట్టాచార్య స్పందిస్తూ, (మిథేన్ సహా) కర్బనాన్ని మాగాణి భూములు పీల్చుకుంటున్నాయని గుర్తించామని.. విడిగా మిథేన్ను పరిగణనలోకి తీసుకోలేదన్నారు. - లతా జిష్ణు (‘డౌన్ టు ఎర్త్’ సౌజన్యంతో..) మాగాణులతో మేలు.. వరి మాగాణుల నుంచి వెలువడే ఉద్గారాల కంటే అవి వాతావరణంలో నుంచి పీల్చుకుంటున్నవే ఎక్కువన్న నిర్ణయానికొచ్చాం. ఇందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాం. మాగాణులు సాధారణంగా కోస్తా తీర ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉంటాయి. వరి కుంటలకు చుట్టూ 50 నుంచి 100 సెం.మీ.ల ఎత్తున కట్టలు వేస్తుంటారు. ఈ కుంటల్లో వరిసాగు చేస్తూ ఎక్కువ రోజులు నీటిని నిల్వగట్టడం వల్ల నీటి సంరక్షణ జరిగి భూగర్భ జలమట్టం పెరుగుతోంది. కోస్తా ప్రాంతాల్లో భూగర్భంలోకి సముద్రపు నీరు చొచ్చుకురావడాన్ని కూడా ఇవి అడ్డుకుంటున్నాయి. పర్యావరణం, పంటల సాగు వ్యవస్థల ప్రాతిపదికన కర్బన ఉద్గారాలపై జాతీయస్థాయి డేటాబ్యాంక్ను రూపొందించడం మన దేశానికి ఉపయుక్తంగా ఉంటుంది. - డా. ప్రతాప్ భట్టాచార్య, కేంద్రీయ వరి పరిశోధనా సంస్థ, కటక్, ఒడిశా -
ఇవి పెట్టుబడి లేని రాచ‘బాటలు’!
పాడి-పంట: గుడ్లవల్లేరు (కృష్ణా): వరి నాట్లు వేస్తున్నారా? ఇప్పటికే వేశారా? విత్తనాలను చేలో వెదజల్లారా? డ్రమ్సీడర్ను ఉపయోగించి విత్తనాలు వేశారా?... ఏం చేసినా ఫర్వాలేదు. కాలిబాటలు తీయడం మాత్రం మరచిపోవద్దు. ఎందుకంటే వీటివల్ల ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. ఇందుకోసం పైసా కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదని, పంటకాలంలో ఎదురయ్యే అనేక సమస్యలకు కాలిబాటలు పరిష్కారం చూపుతాయని చెబుతున్నారు రిటైర్డ్ ఏడీఏ పి.సత్యనారాయణ. ఆ వివరాలు మీ కోసం... ఎలా తీయాలి? వరి నాట్లు వేసిన తర్వాత చేలో ప్రతి రెండు మీటర్లకు 20 సెంటీమీటర్ల వెడల్పున కాలిబాట తీయాలి. నాట్లు వేసిన 12 నుంచి 16 రోజుల లోపు కాలిబాట తీయడం మంచిది. మందపాటి తాడును చేనుకు అవతలి గట్టున ఒకరు, ఇవతలి గట్టున ఒకరు పట్టుకొని లాగాలి. వాటి చివర్లను ఒక కట్టెకు కట్టి గట్టు మీద గుచ్చాలి. ఆ తాడుకు 20 సెంటీమీటర్ల దూరంలో సమాంతరంగా మరో తాడును ఇదే పద్ధతిలో ఏర్పాటు చేయాలి. రెండు తాళ్ల మధ్య ఉన్న ప్రదేశంలోని మొక్కలను తీసేయాలి. పైరు పలచగా ఉన్న చోట ఆ మొక్కలను నాటుకోవచ్చు. కొందరు రైతులు వరి నాట్లు వేసేటప్పుడే కాలిబాటలు తీస్తుంటారు. అలాంటప్పుడు ముందుగానే గట్ల మధ్య తాళ్లు లాగి, ఆ ప్రదేశాన్ని వదిలి, మిగిలిన రెండు వైపులా మొక్కలు నాటాలి. చేలో విత్తనాలను వెదజల్లిన రైతులు కూడా కాలిబాటలు తీసుకోవచ్చు. విత్తనాలు చల్లిన 15-20 రోజుల మధ్యలో... అంటే పైరు ఎదుగుతున్న సమయంలో ప్రతి 2 మీటర్లకూ 20 సెంటీమీటర్ల వెడల్పులో మొక్కలను తొలగిస్తే సరిపోతుంది. సాధారణంగా వెదజల్లే పద్ధతిలో పైరును పలచన చేస్తుంటారు. ఆ సమయంలోనే కాలిబాటలు తీయడం మంచిది. డ్రమ్సీడర్ను ఉపయోగించి విత్తనాలు వేసే వారు... దానితో ఒక వరుస విత్తనాలు వేయడం పూర్తయిన తర్వాత 20 సెంటీమీటర్ల స్థలాన్ని వదిలి మరో వరుస విత్తనాలు వేసుకోవాలి. ఖరీఫ్లో తూర్పు-పడమర దిశగా, రబీలో ఉత్తర-దక్షిణ దిశగా కాలిబాటలు తీసుకోవాలి. అంతరసేద్యం సులభం వరి చేలో అంతరసేద్యానికి కాలిబాటలు ఎంతగానో ఉపయోగపడతాయి. కూలీలతో కలుపు తీయించడానికి ఇవి బాగా అనువుగా ఉంటాయి. అనేక రకాల పురుగులకు ఆశ్రయమిచ్చే ఊద, తూటుకాడ, బొక్కెనాకు, పిల్లి అడుగు వంటి కలుపు మొక్కలను తేలికగా తీసేయవచ్చు. చేలో ఎలుక బొరియలను గుర్తించడం, అవసరమైన నివారణ చర్యలు చేపట్టడం కూడా సులభమవుతుంది. కేళీల్లో అరుదైన రకాలను కూడా కాలిబాటల ద్వారా గుర్తించి తొలగించవచ్చు. కాలిబాటల వల్ల ఒత్తుగా ఉన్న మొక్కలను తీసి, పైరును పలచన చేయడం తేలికవుతుంది. చీడపీడలు దూరం కాలిబాటల వల్ల వరి పైరుకు గాలి, వెలుతురు పుష్కలంగా లభిస్తాయి. కిరణజన్య సంయోగక్రియ బాగా జరుగుతుంది. మొక్కల్లో పత్రహరితం అధికంగా ఉత్పత్తి అవుతుంది. పైరు ఆరోగ్యవంతంగా పెరుగుతుంది. గాలి సమృద్ధిగా లభిస్తుంది కాబట్టి వరి మొక్కలు ఆక్సిజన్ను గ్రహించేందుకు పెద్దగా శక్తిని ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. గాలి, వెలుతురు ధారాళంగా అందడం వల్ల పైరులో చీడపీడల బెడద కూడా తక్కువగానే ఉంటుంది. ఒకవేళ ఉన్నా వాటిని నిర్మూలించడం తేలిక. దుబ్బులను ఆశించి పైరుకు నష్టం కలిగించే బూడిద రంగు దోమ, తెల్లదోమ, పచ్చ దీపపు పురుగులను సకాలంలో గుర్తించి వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టవచ్చు. కాలిబాటలు ఉంటే పొలం నుంచి ఎప్పటికప్పుడు మురుగు నీటిని తీసేయడం తేలిక. దీనివల్ల ఆకు గొట్టాల పురుగు, నాము పురుగు ఉధృతి తగ్గుతుంది. కాలిబాటల చివర పంగలకర్రలు నాటితే పక్షులు వాటి పైకి చేరి, హానికారక కీటకాలను పట్టుకొని తినేస్తాయి. దిగుబడులు పెరుగుతాయి కాలిబాటలు తీయడం వల్ల వరి పైరులో దిగుబడులు 10-13 శాతం పెరుగుతాయని పరిశోధనల్లో తేలింది. కాలిబాటలు సాగు నీటి వినియోగ సామర్థ్యం పెరగడానికి దోహదపడతాయి. ఎందుకంటే పంటకు ఎంత నీరు అవసరమో ఎప్పటికప్పుడు గమనిస్తూ అంతే నీటిని అందించవచ్చు. భూమిలోని సేంద్రియ పదార్థాలు త్వరగా కుళ్లడానికి కాలిబాటలు ఉపయోగపడతాయి. దీనివల్ల మొక్కలకు పోషకాలు లభించి, మంచి దిగుబడులు వస్తాయి. కోత దశలోనూ ఉపయోగపడతాయి కాలిబాటలు కోత దశలోనూ రైతులకు ఉపయోగపడతాయి. పంట కోత దశలో జరిగే నష్టాన్ని ఇవి నివారిస్తాయి. ఎలాగంటే కాలిబాటలు తీస్తే... పంట కోసేటప్పుడు వంగిపోయిన మొక్కలను నిలబెట్టడం తేలికవుతుంది. ప్రకృతి వైపరీత్యాల కారణంగా దుబ్బులు నేలకు ఒరిగితే వాటిని సరిచేయవచ్చు. కాలిబాటలు లేకపోతే పంట ఒరిపిడికి గింజలు రాలిపోతాయి. కోత ఖర్చు కూడా పెరుగుతుంది. ఈ లాభాలు కూడా... కాలిబాటల వల్ల వరి పైరులో చీడపీడలు-కలుపు నివారణకు మందులు పిచికారీ చేయడం చాలా సులభమవుతుంది. ఎరువులు వేయడం కూడా తేలికవుతుంది. ఎరువులను పొలమంతా సమానంగా పడేలా వేసుకోవచ్చు. కాలిబాటలు వేసిన చేలో రైతులు ఎలాంటి ఇబ్బంది లేకుండా కలియదిరగవచ్చు. పంటను నిశితంగా పరిశీలించవచ్చు. పొలంలో నీటి పరిస్థితిపై ఒక అవగాహనకు రావచ్చు. చీడపీడల ఉనికి, ఉధృతిని గమనిస్తూ ఎప్పటికప్పుడు సస్యరక్షణ చర్యలు చేపట్టవచ్చు. వరి కోతకు ముందు మినుములు, పెసలు వంటి పప్పు పంటల విత్తనాలు చల్లుకోవడానికి కూడా కాలిబాటలు బాగా ఉపయోగపడతాయి. -
ఎక్కువైనా... తక్కువైనా నష్టమే
పాడి-పంట: పెనుగొండ (పశ్చిమ గోదావరి): మనకు అందుబాటులో ఉన్న నీటిలో 90 శాతాన్ని వ్యవసాయ రంగమే ఉపయోగించుకుంటోంది. అందులో నూ సుమారు 65 శాతం నీటిని వరి పైరుకు విని యోగిస్తున్నారు. అయితే ఈ పంటలో నీటి విని యోగ సామర్థ్యం చాలా సందర్భాలలో 40 శా తం కంటే తక్కువగానే ఉంటోంది. అవసరానికి మించి వినియోగించడం వల్ల నీరు వృథా అవుతోంది. దిగుబడులూ తగ్గుతున్నాయి. వరి పైరు కు నీటి అవసరం దాని పెరుగుదల దశలపై ఆధారపడి ఉంటుంది. ఏ దశకు ఎంత నీరు అవసరమో అంతే ఇవ్వాలి. నీరు ఎక్కువైనా, తక్కువైనా నష్టం తప్పదు. కాబట్టి ఆయా దశల్లో స రైన నీటి యాజమాన్య పద్ధతులను పాటించడం ద్వారా అధికోత్పత్తిని, తద్వారా మంచి ఆదాయాన్ని పొందవచ్చునని చెబుతున్నారు పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరు వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ మానుకొండ శ్రీనివాసు, ఆంధ్రప్రదేశ్ వరి పరిశోధనా సంస్థ డెరైక్టర్ డాక్టర్ ఎ.విష్ణువర్ధన రెడ్డి. ఆ వివరాలు.. ప్రధాన పొలం తయారీకి... ప్రధాన పొలంలో ముందుగా పశువుల ఎరువు వేసి, 5-10 సెంటీమీటర్ల లోతు ఉండేలా నీరు పెట్టి బాగా కలియదున్నాలి. పచ్చిరొట్ట పైరు వేసుకున్న వారు దానిని కూడా భూమిలో కలియదున్నాలి. సేంద్రియ ఎరువుల వినియోగం వల్ల భూమికి నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం పెరుగుతుంది. పచ్చిరొట్ట పైరు భూమిలో కుళ్లిపోవడానికి మూడు వారాల సమయం పడుతుంది కాబట్టి అప్పటి వరకూ చేలో 5 సెంటీమీటర్ల నీటిని నిలగట్టాలి. ప్రధాన పొలాన్ని తయారు చేసుకునే సమయంలో చేలో 10-15 సెంటీమీటర్ల లోతున నీటిని నిలగట్టి బాగా దమ్ము చేయాలి. దీనివల్ల భూమిలో గట్టి మట్టి పొర ఏర్పడుతుంది. భూమి లోపలి పొరల్లోకి నీరు ఇంకిపోకుండా అది అడ్డుకుంటుంది. పొలాన్ని దమ్ము చేయడం పూర్తయిన తర్వాత చదును చేసేటప్పుడు పలచగా నీరు ఉండాలి. భూమిని బాగా దమ్ము చేసి, చదును చేస్తే నీరు-పోషకాల వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. కలుపు సమస్య కూడా తగ్గుతుంది. నాటేటప్పుడు-ఆ తర్వాత... వరి నాట్లు వేసేటప్పుడు చేలో పలచగా... అంటే 2 సెంటీమీటర్ల నీరు ఉండాలి. దీనివల్ల నారు మొక్కలను సరైన లోతులో నాటవచ్చు. నాట్లు పూర్తయిన తర్వాత నాలుగైదు రోజుల వరకూ 5 సెంటీమీటర్ల లోతున నీరు పెట్టాలి. ఇలా చేయ డం వల్ల వరి మొక్కలు గాలికి వాలి తేలిపోవు. భూమిలోనే నిటారుగా ఉండి, నిలదొక్కుకొని స్థిరపడతాయి. మూన త్వరగా తిరుగుతుంది. మొక్కల్లో భాష్పోత్సేక నష్టం తగ్గుతుంది. మొక్క త్వరగా కొత్త వేర్లు తొడుగుతుంది. పిలక దశ నుంచి... నాట్లు వేసిన తర్వాత 4-7 రోజుల్లో వరి మొక్క లు మూన తిరుగుతాయి. వేసినరకాన్ని బట్టి మూన తిరిగిన తర్వాత 30-40 రోజుల వరకూ పిలకలు వేసే దశ కొనసాగుతుంది. పిలకలు తొ లుత నెమ్మదిగా, ఆ తర్వాత ఎక్కువగా వస్తా యి. పిలకలు పెట్టే సమయంలో పొలంలో నీరు పలచగా... అంటే రెండు సెంటీమీటర్లకు మించకుండా ఉండాలి. ఆ సమయంలో నీటి లోతు ఎక్కువైతే పిలక అంకురాలు నీటిలో మునిగిపోతాయి. ఫలితంగా పిలకల సంఖ్య తగ్గుతుంది. అంతేకాక మొక్క పొడుగ్గా పెరుగుతుంది. ఈ దశలో పంట నీటి ఎద్దడికి గురైతే దిగుబడి 30 శాతం వరకూ తగ్గే ప్రమాదం ఉంది. పిలక దశలో పైరుకు పైపాటుగా యూరి యా వేసేటప్పుడు చేలో సన్నని నీటి పొర ఉండేలా చూసుకోవాలి. యూరియా వేసిన 36-40 గంటల తర్వాత మామూలుగా నీరు పెట్టాలి. బరువు నేలల్లో నాట్లు వేసిన 45 రోజులప్పుడు సుమారు 2 రోజుల పాటు నేలను ఆరబెట్టాలి. ఆ తర్వాత తిరిగి కొత్త నీరు పెట్టాలి. దీనివల్ల వెన్ను వేయని పిలకలు తగ్గి, వేరు వ్యవస్థకు కావాల్సినంత ఆక్సిజన్ లభించి, మొక్కలు ఆరోగ్యవంతంగా పెరుగుతాయి. ఎక్కువ పిలకలు వస్తాయి. చిరుపొట్ట దశ నుం చి గింజ గట్టి పడే దాకా వరి చేలో 5 సెంటీమీటర్ల లోతు వరకూ నీరు ఉండాలి. కోతకు 10 రోజుల ముందు నీటిని నెమ్మదిగా తగ్గించి, పొలాన్ని ఆరబెట్టాలి. ఎలా నివారించాలి? వరిలో నీటి వృథాను నివారించాలంటే... తేలి క నేలల్లో ముందుగా చెరువు మట్టిని తోలి, సేంద్రియ-పచ్చిరొట్ట ఎరువులు వేసి, పొలా న్ని బాగా దమ్ము చేసి చదును చేయాలి. మాగా ణి వరి పొలానికి ముందుగా నీరు పెట్టి, నాలుగైదు సార్లు దమ్ము చేయాలి. ఇలా చేయడం వల్ల నీరు వృథాగా భూమిలోకి ఇంకదు. వరి చేలో 5 సెంటీమీటర్ల కంటే ఎక్కువ నీరు ఉన్నట్లయితే భూమ్యాకర్షణ శక్తి వల్ల ఇంకిపోతుం ది. పైగా మనం వేసిన నత్రజని ఎరువు కూడా వృథా అవుతుంది. కాబట్టి చేలో ఎప్పుడూ 5 సెంటీమీటర్ల కంటే ఎక్కువ నీరు ఉండకూడదు. పంటకు అవసరాన్ని బట్టి రోజు విడిచి రోజు నీరు పెట్టాలి. ఎరువులు పూర్తి స్థాయిలో పైరుకు ఉపయోగపడాలన్నా, పిలకలు ఎక్కువ సంఖ్యలో రావాలన్నా సరైన నీటి యాజమాన్య పద్ధతులు పాటించాలి. -
సమతుల్యత లోపిస్తే నష్టం తప్పదు
పాడి-పంట: జగిత్యాల అగ్రికల్చర్ (కరీంనగర్): వరి పంటకు ఏ సమయంలో, ఎంత మోతాదులో ఎరువులు వేయాలనే దానిపై చాలా మంది రైతులకు సరై న అవగాహన ఉండడం లేదు. కొందరు రైతు లు అవసరమైన దాని కంటే ఎక్కువగా, మరి కొందరు తక్కువగా ఎరువులు అందిస్తున్నారు. దీనివల్ల దిగుబడులపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో వరిలో ఎరువుల యాజమాన్యంపై కరీంనగర్ జిల్లా పొలాస వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ తిప్పెస్వామి (వరి) అందిస్తున్న సూచనలు... చాలా మంది రైతులు వరి పంటకు సిఫార్సు చేసిన మోతాదు కంటే రెండు మూడు రెట్లు అదనంగా యూరియా వేస్తున్నారు. అదే సమయంలో కొన్ని చోట్ల పొటాష్ ఎరువును అసలే వేయడం లేదు. దీనివల్ల పోషక వినియోగంలో సమతుల్యత లోపిస్తుంది. రైతుకు ఖర్చు పెరుగుతుంది. భూసారం తగ్గుతుంది. వ్యవసాయ భూములు నిస్సారమవుతాయి. కాబట్టి రసాయన ఎరువులపై పెట్టే ప్రతి రూపాయి నుండి లాభం పొందడానికి రైతులు ప్రయత్నించాలి. నారుమడిలో... ఐదు సెంట్ల నారుమడికి కిలో భాస్వరం, కిలో పొటాష్ అందించే ఎరువులను దుక్కిలోనే వేసుకోవాలి. విత్తనాలు చల్లడానికి ముందు, చల్లిన 12-14 రోజులప్పుడు కిలో చొప్పున నత్రజనిని అందించే ఎరువు వేయాలి. నారుమడిలో జింక్ లోపం కన్పిస్తే లీటరు నీటికి 2 గ్రాముల చొప్పు న జింక్ సల్ఫేట్ కలిపి పిచికారీ చేసుకోవాలి. ఎరువులను ఆదా చేయండి ప్రధాన పొలంలో రసాయన ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులను కూడా వాడాలి. దీనివల్ల పంటకు అవసరమైన అన్ని పోషకాలు లభిస్తాయి. రసాయన ఎరువులపై పెట్టే ఖర్చు తగ్గుతుంది. సాధారణంగా వరి పైరుకు ప్రధాన పోషకాలైన నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులను 4:2:1 నిష్పత్తిలో వేయాల్సి ఉండగా 9.5:2.7:1 నిష్పత్తిలో వేస్తున్నారు. నీటి యాజమాన్యం సరిగా లేకపోవడం వల్ల కూడా వేసిన ఎరువులు సద్వినియోగం కావడం లేదు. పశువుల ఎరువు, కంపోస్ట్, కోళ్ల ఎరువు వంటి సేంద్రియ ఎరువులను రసాయనిక ఎరువులతో కలిపి వాడితే నత్రజని ఎరువును 20-25% వరకు ఆదా చేయవచ్చు. అలాగే వరి చేలో అపరాలు, జీలుగ, జనుము, పిల్లిపెసర వంటి పచ్చిరొట్ట పైర్ల విత్తనాలు వేసుకొని, ఆ పైర్లను పూత దశలో భూమిలో కలియదున్నితే భూసారం పెరగడమే కాకుండా ప్రధాన ఎరువుల వాడకాన్ని 20-25% మేర తగ్గించుకోవచ్చు. ఎలా వేయాలి? భూసారాన్ని బట్టి ఎరువుల మోతాదును నిర్ణయించుకోవాలి. సాధారణంగా ఎకరానికి 70-75 కిలోల నత్రజని, 30 కిలోల భాస్వరం, 16 కిలోల పొటాష్, 20 కిలోల జింక్ వేయాలి. నత్రజని ఎరువును కాంప్లెక్స్ ఎరువుల రూపంలో లేదా యూరియా రూపంలో వాడవచ్చు. అయితే నత్రజనిని నైట్రేట్ రూపంలో అందిస్తే అది ఎక్కువ శాతం వృథా అవుతుంది. ఆశించిన ప్రయోజనం చేకూరదు. సిఫార్సు చేసిన నత్రజని ఎరువును మూడు సమ భాగాలుగా చేసుకోవాలి. దానిని మొక్కలు నాటడానికి ముందు దమ్ములోనూ, పైరు దుబ్బు చేసే సమయంలోనూ, అంకురం దశలోనూ వేసుకోవాలి. పొలం బురద పదును మీద ఉన్నప్పుడు మాత్రమే నత్రజని ఎరువును చేలో సమానంగా పడేలా వెదజల్లుకోవాలి. 24-36 గంటల తర్వాత పలచగా నీరు పెట్టాలి. ప్రతి 50 కిలోల యూరియాకు 10 కిలోల వేపపిండిని కలిపి వెదజల్లినట్లయితే నత్రజని వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. ఇక సిఫార్సు చేసిన భాస్వరం ఎరువు మొత్తాన్నీ దమ్ములోనే వేసుకోవాలి. పొటాష్ ఎరువులో సగ భాగాన్ని ఆఖరి దమ్ములో, మిగిలిన సగ భాగాన్ని అంకురం ఏర్పడే దశలో వేయాలి. కాంప్లెక్స్ ఎరువులను పైరు దుబ్బు చేసే సమయంలో లేదా అంకురం ఏర్పడే దశలో పైపాటుగా వేయకూడదు. వాటిని దమ్ములోనే వేయడం మంచిది. జింక్ లోప నివారణ వరి పండించే భూముల్లో జింక్ ధాతువు లోపించకుండా ఉండాలంటే ప్రధాన పోషకాలతో పాటు ఎకరానికి 20 కిలోల చొప్పున జింక్ సల్ఫేట్ను ప్రతి రబీ సీజన్లో ఆఖరి దమ్ములో వేసుకోవాలి. జింక్ను భాస్వరం ఎరువుతో కలిపి వేయకూడదు. కనీసం ఒక రోజైనా వ్యవధి ఉండాలి. జింక్, భాస్వరాన్ని కలిపి వేస్తే రసాయనిక చర్య జరిగి, మొక్కలకు అందుబాటులో లేకుండా పోతాయి. సమస్యాత్మక నేలలైతే ఎకరానికి 40 కిలోల జింక్ సల్ఫేట్ వేయాలి. సుమారు 200 కిలోల సేంద్రియ ఎరువుకు 15 కిలోల జింక్ సల్ఫేట్ను కలిపి నెల రోజుల పాటు మాగనివ్వాలి. ఆ మిశ్రమాన్ని దుక్కిలో వేసుకున్నట్లయితే జింక్ వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. అంతేకాక జింక్ మోతాదును 25% మేర తగ్గించుకోవచ్చు. వరి పైరులో జింక్ లోపం ఏర్పడితే ముదురాకు చివరలో, మధ్య ఈనెకు రెండు పక్కల తుప్పు రంగు మచ్చలు ఏర్పడతాయి. మొక్కలు గిడసబారతాయి. దుబ్బు చేయవు. పైరులో జింక్ లోప లక్షణాన్ని గమనించిన వెంటనే లీటరు నీటికి 2 గ్రాముల చొప్పున జింక్ సల్ఫేట్ కలిపి 5 రోజుల వ్యవధితో 2-3 సార్లు పిచికారీ చేసుకోవాలి. సమస్యాత్మక నేలల్లో జింక్ సల్ఫేట్ను తప్పనిసరిగా వాడుకోవాలి. జింక్ సల్ఫేట్ ద్రావణాన్ని పిచికారీ చేసేటప్పుడు దానిలో పురుగు లేదా తెగుళ్ల నివారణ మందులు కలపకూడదు. -
ఆరోగ్యవంతమైన నారు కోసం...
పాడి-పంట: అమలాపురం (తూర్పు గోదావరి): ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో రైతులు ఇప్పటికే వరి నారుమడులు పోసుకున్నారు. మరికొన్ని చోట్ల అందుకు సమాయత్తమవుతున్నారు. విత్తు కొద్దీ పంట అన్నట్లు విత్తనం నాణ్యంగా ఉంటేనే పంట బాగా పండుతుంది. మంచి దిగుబడులు అందిస్తుంది. వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు సూచించిన మేలైన, తమ ప్రాంతానికి అనువైన వంగడాలను సాగు చేస్తే మంచి ఆదాయం పొందవచ్చు. ఈ నేపథ్యంలో ఆరోగ్యవంతమైన నారు పొందాలంటే చేపట్టాల్సిన చర్యలపై తూర్పు గోదావరి జిల్లా అమలాపురం ఏడీఏ ఎం.ఎస్.సి.భాస్కరరావు అందిస్తున్న సూచనలు... విత్తన మోతాదు-శుద్ధి ఎకరం విస్తీర్ణంలో నాట్లు వేయడానికి 25 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. సెంటుకు ఐదు కిలోల చొప్పున ఐదు సెంట్ల నారుమడిలో విత్తనాలు చల్లుకోవాలి. వర్షాధార పంటగా వరి వేసే వారు గొర్రుతో విత్తడానికి 30-36 కిలోల విత్తనాలు వినియోగించాలి. వరిలో విత్తనశుద్ధి తప్పనిసరి. దీనివల్ల విత్తనం ద్వారా వచ్చే తెగుళ్లను నివారించవచ్చు. పొడి విత్తనశుద్ధి చేసే వారు కిలో విత్తనాలకు మూడు గ్రాముల చొప్పున కార్బండజిమ్ పట్టించి, రెండు రోజుల తర్వాత నారుమడిలో చల్లుకోవాలి. తడి విత్తనశుద్ధి కోసం లీటరు నీటికి ఒక గ్రాము చొప్పున కార్బండజిమ్ కలిపి, ఆ ద్రావణంలో కిలో విత్తనాల్ని 24 గంటలు నానబెట్టి, ఆ తర్వాత 24-36 గంటల పాటు మండె కట్టాలి. మొలకెత్తిన విత్తనాల్ని నారుమడిలో చల్లుకోవాలి. నారుమడి తయారీ ఇలా... దృఢమైన, ఆరోగ్యవంతమైన నారును పొందాలంటే విత్తనాలు చల్లడానికి ముందు నారుమడిని మూడుసార్లు బాగా దున్ని కలుపు మొక్కల్ని ఏరేయాలి. ఆ తర్వాత గొర్రుతో చదును చేసుకోవాలి. నీరు పెట్టడానికి, నీటిని బయటికి పంపడానికి వీలుగా కాలువలు ఏర్పాటు చేసుకోవాలి. విత్తనాలు చల్లే ముందు ఒకసారి, చల్లిన 12-16 రోజులకు మరోసారి ప్రతి ఐదు సెంట్ల నారుమడిలో కిలో చొప్పున నత్రజనిని అందించే ఎరువు వేయాలి. నారు పీకడానికి ముందు నత్రజని ఎరువు వేయకూడదు. చివరి దమ్ములో భాస్వ రం, పొటాష్లను అందించే ఎరువుల్ని కిలో చొప్పున వేయాలి. సెంటు నారుమడిలో ఐదు కిలోల విత్తనాలు మాత్రమే చల్లాలి. విత్తన మోతాదు ఎక్కువైతే నారు బలహీనంగా పెరుగుతుంది. తక్కువైతే పీకే సమయంలో నారు మొ క్కలు తేలికగా రావు. వేర్లు తెగిపోతాయి. నాటిన తర్వాత మూన తిరగడం ఆలస్యమవుతుంది. నీరు ఎలా అందించాలి? నారుమడిలో సెంటీమీటరు లోతున నీరు ఉంచి, సాయంకాలం వేళ విత్తనాలు చల్లుకోవాలి. మరుసటి రోజు ఉదయం నీటిని తీసేయాలి. నారు ఒక ఆకు పూర్తిగా పురివిచ్చుకునే వరకూ ఆరుతడులు ఇచ్చి, ఆ తర్వాత పలచగా నీరు పెట్టాలి. నారుమడిలో తగినంత నీరు లేకపోతే భూమిలో సన్నని పగుళ్లు ఏర్పడతాయి. మొక్కల వేర్లు భూమి లోపలికి పోయి, పీకేటప్పుడు తెగిపోతాయి. దీనివల్ల ప్రధాన పొలంలో నాటేందుకు నారు సరిపోకపోవచ్చు. కలుపు నివారణ ఎలా? నారుమడిలో కలుపు నివారణ కోసం విత్తనాలు చల్లిన మూడు రోజులకు లీటరు నీటికి ఐదు మిల్లీలీటర్ల బ్యూటాక్లోర్ లేదా సోఫిట్ (ప్రెటిలాక్లోర్, సేఫ్నర్ కలిసిన మందు) చొప్పున కలిపి పిచికారీ చేయాలి. వరి నారుమడుల్లో ప్రధానంగా వచ్చే కలుపు ఊద. ఈ కలుపు మొక్కలు, వరి మొక్కలు తొలి దశలో ఒకే విధంగా ఉంటా యి. వీటిని గుర్తించి తొలగించడం చాలా కష్టం. విత్తనాలు చల్లిన 15 రోజులప్పుడు ఊద నిర్మూలనకు లీటరు నీటికి 2 మిల్లీలీటర్ల చొప్పున సైహలోఫాప్ బ్యూటైల్ 10% కలిపి పిచికారీ చేసుకోవాలి. నారుమడిలో ఊద, వెడల్పాటి ఆకుల కలుపు మొక్కలు సమానంగా ఉన్నట్లయితే విత్తనాలు చల్లిన 15 రోజులకు 10 లీటర్ల నీటికి 4 మిల్లీలీటర్ల చొప్పున బిస్ పైరిబాక్ సోడియం 10% కలిపి పిచికారీ చేయాలి. చీడపీడల నివారణ కోసం... నారుమడిలో చీడపీడల నివారణ కోసం... విత్తనాలు చల్లిన 10 రోజులకు ఐదు సెంట్ల నారుమడిలో 800 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3జీ గుళికలు వేసుకోవాలి. లేకుంటే లీటరు నీటికి 1.6 మిల్లీలీటర్ల మోనోక్రొటోఫాస్ లేదా 2 మిల్లీలీటర్ల క్లోరిపైరిఫాస్ చొప్పున కలిపి విత్తనాలు చల్లిన 10 రోజులకు ఒకసారి, 17 రోజులకు మరోసారి పిచికారీ చేయాలి. లేకుంటే నారు పీకడానికి వారం రోజుల ముందు కార్బోఫ్యూరాన్ గుళికల్ని పైన సూచించిన మోతాదులో వేయాలి. ఆ సమయంలో నారుమడిలో నీరు తక్కువగా ఉండాలి. ఈ జాగ్రత్తలు తీసుకోండి నారు పీకేటప్పుడు వేర్లు ఎక్కువగా తెగిపోకుండా చూసుకోవాలి. ఇందుకోసం నారుమడికి ముందుగా నీరు పెట్టి, నేలను బురద పదును మీద ఉంచాలి. పీకిన నారు మొక్కలు వడలకుండా ఉండాలంటే వాటిని నీటిలో ఉంచాలి. నారు లేతాకుపచ్చ రంగులో ఉన్నట్లయితే నాటిన తర్వాత మొక్కలు త్వరగా కోలుకొని పిలకలు తొడుగుతాయి. ముదురాకుపచ్చగా ఉంటే మొక్కలు ఎండిపోయి త్వరగా మూన తిరగవు. నారుమడిలో జింక్ లోపాన్ని గమనిస్తే లీటరు నీటికి రెండు గ్రాముల చొప్పున జింక్ సల్ఫేట్ కలిపి పిచికారీ చేయాలి. ఈ పంటలు వేసుకోండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల రైతులు ప్రస్తుతం టమాటా, వంగ, మిరప నారుమడులు పోసుకోవాలి. నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో బెండ, చిక్కుడు, తీగజాతి కూరగాయ పంటల విత్తనాలు వేసుకోవాలని రాజేంద్రనగర్లోని వ్యవసాయ వాతావరణ పరిశోధనా కేంద్రం వారు సూచిస్తున్నారు. -
రైతు విలవిల
సాక్షి, రంగారెడ్డి జిల్లా: అల్పపీడన ప్రభావంతో జిల్లా రైతాంగం విలవిల్లాడుతోంది. పక్షం రోజుల క్రితం కురిసిన అకాలవర్షాలతో పంటలు నష్టపోగా... తాజా వర్షాలు మరింత నష్టాల్లోకి నెడుతున్నాయి. గురు, శుక్రవారాల్లో జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. దీంతో చేతికొచ్చే దశలో ఉన్న వరి పంటతో పాటు పెద్దఎత్తున మామిడి, కూరగాయ పంటలు దెబ్బతిన్నాయి. వర్షానికి గాలి తోడవడంతో పలుచోట్ల విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. దీంతో పలు గ్రామాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. పూడూరు మండలంలో బైక్పై వెళ్తున్న యువకుడిపై విద్యుత్ స్తంభం పడిపోవడంతో అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. భారీ వర్షం కురవడంతో శంకర్పల్లిలోని మూసీ, షాబాద్లోని ఈసీ వాగులు అలుగు దాటి రోడ్డెక్కి ఉధృతంగా ప్రవహించాయి. దీంతో రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీగా పంట నష్టం.. ఇప్పటికే తీవ్ర నష్టాల్లో ఉన్న రైతాంగాన్ని అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాలు మరింత నష్టాలపాలు చేస్తున్నాయి. గత వారం కురిసిన వర్షాలకు జిల్లాలో రెండున్నరవేల హెక్టార్లలో వివిధ పంటలు దెబ్బతిన్నాయి. ఇందులో అధికంగా 1,777 హెక్టార్లలో వరి పంట పూర్తిగా పాడైంది. తాజా వర్షాలతో ఈ నష్టం మరింత పెరగనుంది. మరో 24 గంటల పాటు భారీ వ ర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. మరోవైపు అల్పపీడన ప్రభావంతో జరిగిన నష్టాన్ని గుర్తించేందుకు వ్యవసాయ శాఖ అధికారులు ఉపక్రమించారు. రెండు, మూడు రోజుల్లో ప్రాథమిక నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి సమర్పిస్తామని అధికారులు చెబుతున్నారు. -
రైతులను నిలువునా ముంచిన అకాల వర్షాలు
గండేడ్, న్యూస్లైన్: వారం రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు రైతులను నిలువునా ముంచేశాయి. ఈ వర్షాలకు ఈదురుగాలులు తోడవడంతో రైతుల పరిస్థితి మరింత దిగజారింది. వరి, కూరగాయల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పంటచేతికొచ్చే సమయానికి మామిడి కాయలు నేలరాలి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. శనివారం మండల పరిధిలోని గాధిర్యాల్, చౌదర్పల్లి, మంగంపేట్, మొకర్లాబాద్, మహమ్మదాబాద్, షేక్పల్లి, వెంకట్రెడ్డిపల్లి తదితర గ్రామాల్లో కురిసిన వర్షానికి వరిపంట నేలకొరిగి, విత్తనాలు రాలిపోయాయి. ఈ వారం వ్యవధిలో మూడు సార్లు వడగళ్ల వాన కురవడంతో వందలాది ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. అంతేకాకుండా వందలాది క్వింటాళ్ల మామిడి కాయలు నేలరాలాయి. దీనికితోడు గాలివానతో కొన్ని గ్రామాల్లో స్తంభాలు నేలకొరిగి కరెంటు సరఫరా నిలిచిపోయింది. గాధిర్యాల్ గ్రామంలో పలు స్తంభాలు నెలకొరిగి నాలుగు రోజులు గడుస్తున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కరెంటు లేక నీటి సరఫరా నిలిచిపోయి వరి దెబ్బతింటోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించడం లేదని వారు ఆరోపిస్తున్నారు. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంటలు గాలివానతో దెబ్బతిన్నాయని, ప్రభుత్వం తమకు పరిహారం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. -
రైసు మిల్లుల్లో విజిలెన్స్ తనిఖీలు
మండపేట, న్యూస్లైన్ : మండపేట, పరిసర గ్రామాల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిర్వహించిన దాడుల్లో అక్రమ నిల్వలు బయటపడ్డాయి. రికార్డుల్లోని వివరాలకు, గోదాముల్లోని నిల్వలకు భారీ వ్యత్యాసాలు ఉండటంతో సుమారు రూ. 4.81 కోట్ల విలువైన సరుకులను సీజ్ చేశారు. మిల్లుల నిర్వాహకులపై కేసులు నమోదుచేశారు. విజిలెన్స్ ఎస్పీ పి.రమేషయ్యా ఆధ్వర్యంలో డీఎస్పీ రామచంద్రరావు, సీఐలు, ఇతర సిబ్బంది నాలుగు బృందాలుగా ఏర్పడి మండపేటలోని జానకిరామ, అరవింద్ ఆగ్రోస్, మోదుకూరు సమీపంలోని లక్ష్మీ శ్రీనివాస రైస్ అండ్ ఫ్లోర్ మిల్లు, ఏడిద సమీపంలోని సీతారామ ఫుడ్స్ రైస్మిల్లుల్లో తనిఖీలు చేశారు. మధ్యాహ్నం ప్రారంభమైన తనిఖీలు రాత్రి వరకు కొనసాగాయి. ధాన్యం, బియ్యం, నూకలు కొనుగోలు, అమ్మకాలు, గోదాముల్లోని సరుకుల వివరాలను ఎప్పటికప్పుడు బి రిజిష్టర్లో నమోదు చేయాల్సి ఉన్నా, నిర్వహణ సక్రమంగా జరగడం లేదని విజిలెన్స్ అధికారులు గుర్తించారు. రిజిష్టర్లోని సరుకుల వివరాలకు, గోదాముల్లోని నిల్వలకు పొంతన లేకపోవడంతో చర్యలకు ఉపక్రమించారు. నిల్వల మధ్య వ్యత్యాసంతో అరవింద్ ఆగ్రోస్లోని రూ. 1.55 కోట్ల విలువైన ధాన్యం, బియ్యం నిల్వలను విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారు. శ్రీలక్ష్మీ శ్రీనివాస రైస్ ఫ్లోర్ మిల్లులో వారం రోజులుగా బి రిజిష్టర్ నిర్వహించడం లేదని అధికారులు తెలిపారు. రూ. 78.5 లక్షల విలువ చేసే ధాన్యం, బియ్యం, నూకల అక్రమ నిల్వలు ఉన్నట్టు గుర్తించి వాటిని సీజ్ చేశారు. సీతారామ ఫుడ్స్లో రికార్డుల్లోని వివరాలకు, గోదాముల్లోని నిల్వలకు వ్యత్యాసం ఉండడంతో రూ. 78 లక్షల విలువ చేసే ధాన్యం, బియ్యం నిల్వలను విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారు. జానకిరామ రైస్మిల్లులో రాత్రి వరకూ తనిఖీలు కొనసాగాయి. రికార్డులకు, నిల్వలకు వ్యత్యాసం ఉండటంతో సుమారు రూ. 1.70 కోట్ల విలువైన ధాన్యం, బియ్యం నిల్వలను సీజ్ చేసినట్టు విజిలెన్స్ అధికారులు తెలి పారు. ఆయా మిల్లులకు చెందిన నిర్వాహకులపై 6ఏ కేసులు నమోదుచేశామన్నారు. ఈ తనిఖీ లో సీఐలు గౌస్బేగ్, వరప్రసాద్, ఏజీ ఎం. శ్రీనివాస్, ఎఫ్ఆర్ఓ ఎస్కె వల్లీ, డీసీటీఓ రత్నకుమార్, కానిస్టేబుళ్లు పి.గణేష్, పి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
పెట్టుబడి దక్కేనా..?
కొత్తగూడెం, న్యూస్లైన్: ‘అమ్మ పెట్టదు.. అడుక్కు తిననీయదు..’ అన్న చందంగా ఉన్నాయి ప్రభుత్వ నిర్ణయాలు. అష్టకష్టాలకోర్చి వరిసాగుచేసిన రైతులు అధికారుల వైఖరితో పంటవిక్రయంపై అగమ్యగోచరంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇటీవల కాలంలో వచ్చిన తుపానులతో జిల్లాలో వరి రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీనికితోడు నకిలీ విత్తనాలు, చీడ పీడలు కారణంగా ఈసారి వరి సరాసరి దిగుబడి కూడా తగ్గిపోయింది. ఇలా ఇప్పటికే నష్టాన్ని చవిచూసిన రైతులు ధాన్యం కొనుగోలుపై స్పష్టమైన వైఖరి లేకపోవడంతో మరింత ఆందోళన చెందుతున్నారు. ప్రతి ఏడాది నవంబర్ నెల మొదటివారంలోనే లెవీ టార్గెట్ అందించే అధికారులు ఇప్పటి వరకు మిల్లర్లకు టార్గెట్ ఇవ్వకపోవడంతో ధాన్యం కొనుగోలు చేసేందుకు మిల్లర్లు ముందుకు రావడం లేదు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద మద్దతు ధర తక్కువగా ఉండటం, బయట అమ్మకాలు చేద్దామంటే కొనుగోలు చేసేందుకు మిల్లర్లు సుముఖంగా లేకపోవడంతో రైతులు తమ ధాన్యం అమ్మకాలు ఎలా చేయాలనే విషయంపై కలవరపడుతున్నారు. జిల్లాలో 1.50 లక్షల హెక్టార్లలో రైతులు వరి సాగు చేస్తున్నారు. ఈ ఏడాది జూన్ నెల ప్రారంభం నుంచే వర్షాలు సకాలంలో కురవడం, వరి పంటకు ప్రధాన వనరుగా ఉన్న నాగార్జున సాగర్ ఎడమ కాలువ నీరు వదలడంతో రైతులు పూర్తిస్థాయిలో పంట సాగు చేశారు. అయితే ఇటీవల జల్, హెలెన్ తుపానుల కారణంగా వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతోపాటు చీడ పీడల తెగులు అధికంగా ఉండటం, ప్రభుత్వం సరఫరా చేసిన విత్తనాలు నకిలీవి కావడంతో ఈ ప్రభావం వరి సాగుపై తీవ్రంగా పడింది. ఈ నేపథ్యంలో సాధారణ పరిస్థితుల్లో 8.25 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చే వరి ఈసారి కేవలం 7 లక్షల మెట్రిక్ టన్నుల వరకు మాత్రమే వచ్చే అవకాశాలున్నట్లు అంచనా వేస్తున్నారు. కోతలు ప్రారంభించినా ఖరారు కానీ లెవీ.. ప్రతి ఏడాది ప్రభుత్వం అధికారికంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నప్పటికీ అక్కడ ముతక, దొడ్డు రకం ధాన్యాన్ని ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. ఈ ఏడాది అక్టోబర్ మొదటి వారంలోనే జిల్లాలో 24 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. కాగా, నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలోనే ఎక్కువగా వరి సాగు అయింది. సాగర్ ఆయకట్టు పరిధిలో సాగు చేసే రైతులు సన్నరకం ధాన్యాన్ని పండిస్తుంటారు. ప్రతి ఏడాది 5 లక్షల మెట్రిక్ టన్నుల మేరకు సన్నరకం ధాన్యం జిల్లాలో ఉత్పత్తి అవుతున్నట్లు మిల్లర్లు చెబుతున్నారు. ఈ ఏడాది ప్రతి కూల పరిస్థితులు నెలకొనడంతో సన్నరకం ధాన్యం 4 లక్షల మెట్రిక్ టన్నుల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ప్రతి ఏడాది సన్నరకం ధాన్యం లెవీ టార్గెట్ ద్వారా మిల్లర్లు కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలోని 90 పారా బాయిల్డ్ రైస్ మిల్లర్లు ఈ ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు అవకాశాలున్నాయి. అయితే ఇప్పటి వరకు లెవీ టార్గెట్ నిర్ణయించకపోవడంతో మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేసేందుకు వెనుకంజ వేస్తున్నారు. మద్దతు ధరకంటే బహిరంగ ధర అధికం.. ప్రస్తుతం దిగుబడి అవుతున్న వరి ధాన్యంలో సుమారు 25 శాతం తేమ ఉంటున్నప్పటికీ ప్రభుత్వం అందించే మద్దతు ధరకంటే బహిరంగ మార్కెట్లో ఎక్కువ ధర రావడం, బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేసేందుకు లెవీ టార్గెట్ లేక మిల్లరు కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ముతక, దొడ్డు రకం ధాన్యం క్వింటాకు రూ.వెయ్యి అందిస్తుండగా, బహిరంగ మార్కెట్లో మాత్రం రూ.1200ల వరకు ధాన్యం ధర పలుకుతోంది. దీనికి తోడు సన్నబియ్యంకు మద్దతు ధర క్వింటాకు రూ.1,200లు అందిస్తుండగా, ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో రూ.1,500ల వరకు మద్దతు ధర అందుతుంది. అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల కారణంగా బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేసేందుకు మిల్లర్లు భయపడుతుండటంతో తక్కువ ధరకు రైతులు ధాన్యం అమ్ముకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అసలే దిగుబడి తగ్గి పెట్టుబడులు వస్తాయో రావో అని నిరాశలో ఉన్న రైతులను ఆదుకునేందుకు ఇప్పటికైనా ప్రభుత్వం బహిరంగ మార్కెట్లో ధాన్యం అమ్మకాలు చేసేలా మిల్లర్లకు లెవీ అందించాలని రైతులు కోరుతున్నారు. లేకపోతే ఇదే అదనుగా దళారులు ధాన్యం కొనుగోలు చేసి ఇతర జిల్లాలకు తరలించే అవకాశాలు లేకపోలేదని పలువురు పేర్కొంటున్నారు. -
గుండె మండింది..
నిర్మల్/కడెం/జన్నారం, న్యూస్లైన్ : జిల్లా రైతులను దోమపోటు ఆందోళనకు గురిచేస్తోంది. పంటలు చేతికొచ్చే సమయంలో చీడపీడలు విజృంభిస్తుండటంతో రైతులు దిగుబడి తగ్గుతుందని దిగాలు చెందుతున్నారు. ఫలితంగా ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందని వాపోతున్నారు. పెట్టుబడి కూడా రాదనే బెంగతో రైతులు వరి పైరుకు నిప్పు పెట్టి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆరంభం నుంచీ కష్టాలే.. ఖరీఫ్ ప్రారంభం కంటే ముందే ఆశించిన స్థాయిలో వర్షాలు కురిసి జలాశయాలు, చెరువులు, కుంటలు నిండటంతో రైతుల మోముల్లో ఆనందం వెల్లివిరిసింది. ఈ యేడాది వరి పంటకు ఢోకా లేదని భావించారు. అనంతరం పంటలు మోగిపురుగు, అగ్గితెగుళ్ల బారిన పడటంతో మనోవేదనకు గురయ్యారు. దీనికి తోడు ఏకధాటిగా కురిసిన వర్షాలకు పంట పొలాల్లో నీరు చేరి కలుపు పెరిగి ఆర్థికంగా నష్టపోయారు. పంట గింజ పాలుపోసుకునే సమయంలో, గట్టి పడే సమయానికి పై-లీన్ తుపాన్ ప్రభావంతో వరి పైరుపై పెను ప్రభావం పడింది. పంట నేలకొరిగి వరి రైతు నష్టపోయాడు. దీనికి తోడు ఇప్పుడేమో దోమపోటు రైతన్న పాలిట శాపంగా మారింది. దోమపోటు భరించలేక జన్నారం, కడెంలలో రైతులు వరి పైరుకు నిప్పు పెడుతున్నారు. రైతన్నకు పాట్లు... జిల్లాలో ఈ ఏడాది 52,886 హెక్టార్లలో వరి సాగైంది. నిర్మల్, ఖానాపూర్, మంచిర్యాల నియోజకవర్గాల్లో అధికంగా సాగైంది. పంట చేతికొస్తున్న ప్రస్తుత తరుణంలో దోమపోటు పంటపై ఆశిస్తోంది. ఇది దిగుబడులపై పెను ప్రభావం చూపుతోంది. నత్రజని వాడకం ఎక్కువగా ఉండడం, వాతావరణ పరిస్థితుల వల్ల దోమపోటు వస్తుంది. మొన్నటి వరకు వర్షాలు ఆ తర్వాత చలి ప్రారంభం కావడంతో ఉష్ణోగ్రతల్లో హెచ్చు, తగ్గుల వల్ల పంటల్లో దోమపోటు పెద్ద మొత్తంలో సోకింది. ప్రధానంగా ఇది వరి అడుగు భాగంలో నీటి మట్టం ఉన్న ప్రాంతంలో ఆశించి కాండం రసం పీలుస్తుంది. దీంతో మొక్క కాండంలో శక్తి సన్నగిల్లి ఎండిపోతుంది. దీంతో దిగుబడిపై పెను ప్రభావం చూపనుంది. నష్టాల పాలు.. వరి సాగుకు ఎకరానికి రూ.16వేలను మొదలుకుని రూ.20 వే ల వరకు ఇప్పటికే రైతన్నలు ఖర్చు అయింది. ఇక పంట ధర లు చూస్తే ఏ గ్రేడ్కు క్వింటాల్కు రూ.1,310 ఉండగా, బీ గ్రేడ్ కు రూ.1,280 ప్రకటించారు. అయితే పంట బాగా పండితే ఎ కరానికి 18 నుంచి 20 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. అ యితే గతంలో సోకిన తెగుళ్లు, ప్రస్తుతం ఆశిస్తున్న దోమపోటుతో దిగుబడి 10క్వింటాళ్లు కూడా వచ్చే పరిస్థితి కనిపించ డం లేదు. దీంతో రైతన్నలు నష్టపోయే పరిస్థితి నెలకొంది. పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదు.. నేను ఎకరంలో వరి సాగు చేశాను. ఇప్పటి వర కు రూ.15వేల వరకు ఖర్చు పెట్టాను. అయితే పంట చేతికొస్తుందనుకున్న సమయంలో దోమపోటు ఆశించింది. దీంతో పంట చాలా మట్టుకు ఎండింది. దీని వల్ల పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ప్రభుత్వం మాలాంటి రైతులను ఆదుకుని నష్టపరిహారం అందించాలి. - పెంట భూమన్న, రైతు, న్యూలోలం, దిలావర్పూర్ మండలం -
అన్వేషణం: పంటచేల మధ్య పల్లెటూరు
మన దేశంలోని పలు గ్రామాల్లో అక్కడక్కడా వరి చేలు కనిపిస్తూ ఉంటాయి మనకు. అయితే చైనాలోని గ్వాంగ్జీ ప్రావిన్స్లో మాత్రం చేల మధ్యన అక్కడక్కడా ఇళ్లు కనిపిస్తూ ఉంటాయి. చుట్టూ పచ్చని చేలు ఆవరించి ఉండగా, మధ్యలో అక్కడక్కడా విసిరేసినట్టుగా ఇళ్లు ఉంటాయి. దాంతో అదో అద్భుతమైన చిత్రంలా కనిపిస్తుంది మనకు. ఇది నిజంగా ఎక్కడా కనిపించని ఓ అరుదైన దృశ్యమనే చెప్పాలి! గ్వాంగ్జీ ప్రావిన్స్లోని లాంగ్షెంగ్ కౌంటీలో ఉన్న లాంగ్జీ గ్రామం... ఈ పచ్చని పంటచేలకి నిలయం. ఆ గ్రామానికి వెళ్తే... పచ్చదనం తప్ప మరేమీ కనిపించదు. అత్యంత ఎత్తై కొండలకు పచ్చచీరను చుట్టినట్టుగా అనిపిస్తుంది. చీరమీద ఉన్న చుక్కల్లా కనిపిస్తాయి చేల మధ్య ఇళ్లు. ఆ పచ్చదనమంతా వరి చేలవల్ల వచ్చిందే. కొండవాలుల్లో చేలు ఉండటం అనేది కాస్త ఆశ్చర్యంగానూ, మరికాస్త అబ్బురంగానూ అనిపిస్తుంది. ప్రకృతిలోని సౌందర్యమంతా అక్కడే కుప్ప పోసిన అనుభూతి కలుగుతుంది. లాంగ్జీ అంటే... డ్రాగన్ వెన్నెముక అని అర్థం. ఈ గ్రామం ఎత్తయిన కొండ మీద ఏర్పడింది. దూరం నుంచి చూస్తే ఈ కొండ డ్రాగన్ వెన్నెముకలాగే కనిపిస్తుంది. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. లాంగ్జీ గ్రామస్థులకు పంటను పండించుకోవడానికి ప్రత్యేకంగా నేల లేదు. అందుకే కొండ వాలులనే వరి చేలుగా చేసుకున్నారు. వందలాది వరుసలుగా నాట్లు వేసి వరిని పండిస్తున్నారు. పర్వత ప్రాంతం కాబట్టి వర్షాలకు లోటు ఉండదు. పైగా ఏటవాలు ప్రాంతం కాబట్టి వర్షపు నీరు చక్కగా జారుతూ, మొత్తం చేలన్నిటినీ తడుపుతుంది. వర్షం పడనప్పుడు పక్కన ఉన్న జలాశయాల ద్వారా నీటి సదుపాయాన్ని ఏర్పరచుకుంటారు. ఈ టై వ్యవసాయం చాలాచోట్ల ఉన్నా... ఇక్కడ ఉన్నంత భారీ స్థాయిలో మాత్రం మరెక్కడా ఉండదు! వేళ్లాడే పూలతోట! గులాబి తోటలు, మల్లెతోటలు, చామంతి తోటల వంటివెన్నో చూస్తుంటాం. కానీ విస్టీరియా పూలతోటను చూసే అవకాశం మనకు దొరకదు. ఎందుకంటే, అవి మన దేశంలో ఉండవు. చైనా, జపాన్, కొరియా, అమెరికా దేశాల్లో మాత్రమే విరివిగా ఉంటాయి. మరికొన్ని దేశాల్లో కూడా ఉన్నా, చాలా తక్కువగానే కనిపిస్తాయి. తెలుపు, గులాబి, లేత నీలం, పర్పుల్ రంగుల్లో ఉండే విస్టీరియా పూల అందమే వేరు. ఈ పూలతీగలు ఎంతో వేగంగా వ్యాపిస్తాయి. రెయిలింగ్ మీద, గోడమీద, చెట్ల మీద... ఎక్కడైనా పాకేస్తాయి. చక్కటి లేత పరిమళాన్ని కూడా వెదజల్లుతాయి. జపాన్ వారికి ఈ పూలంటే ప్రత్యేకమైన ఇష్టం. అందుకే ఆ దేశంలోని పలు ప్రదేశాల్లో ఈ పూలతీగలు కనిపిస్తుంటాయి. అయితే వీటి అసలైన అందాన్ని చూడాలంటే... టోక్యోకి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న కవాచీ ఫ్యుజీ గార్డెన్స్కు వెళ్లాలి. విస్టీరియా పూలతీగలు ఈ గార్డెన్లో ఉన్నంతగా మరెక్కడా ఉండవు. ఇక్కడ వీటిని ఓ క్రమ పద్ధతిలో పెంచారు. తెలుపు, గులాబి, నీలం, పర్పుల్ రంగుల పూల తీగలను ఓ వరుస క్రమంలో పెరిగేలా చేయడం వల్ల ఆ తోట ఓ ప్రత్యేకమైన అందాన్ని సంతరించుకుంది. ఎత్తయిన రెయిలింగ్ మీద వీటిని పాకించి, అందంగా కత్తిరించడం వల్ల వాటి కింద నుంచి వెళ్తుంటే ఓ సొరంగంలోంచి వెళ్లిన అనుభూతి కలుగుతుంది. అందుకే దీనిని విస్టీరియా ఫ్లవర్ టన్నెల్ అంటారు. ఎప్పుడైనా జపాన్ వెళ్తే దీన్ని మిస్ కావొద్దు. ఎందుకంటే, అంత గొప్ప అనుభూతిని అన్నిసార్లూ పొందలేం కదా!