Palani Swami
-
అమ్మ డీఎంకే పేరుతో సెల్వం కొత్తపార్టీ..!
సాక్షి, చైన్నె: మాజీ సీఎం పన్నీరు సెల్వం కొత్త పార్టీ కసరత్తుల్లో ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి.ఈ పార్టీకి అమ్మ డీఎంకే అనే పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. వివరాలు.. అన్నాడీఎంకేను కై వశం చేసుకునేందుకు మాజీ సీఎం పన్నీరు సెల్వం చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టులో, కేంద్ర ఎన్నికల కమిషన్ వద్ద చుక్కెదురైంది. పళణి స్వామి అనుకూలంగా తీర్పులు వెలువడ్డాయి. చివరకు సర్వ సభ్య సమావేశ తీర్మానాల విషయంలో తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని ఎదురుచూసి భంగ పడ్డారు. ఈ వ్యవహారంలోనూ పళణి స్వామినే విజయం వరించింది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఆ పార్టీ పగ్గాలను పూర్తిగా పళణి స్వామి తన గుప్పెట్లోకి తెచ్చుకున్నారు. దీంతో పన్నీరుకు భంగపాటు తప్పలేదు. ఇక, అన్నాడీఎంకే కై వశం ప్రయత్నాలను పక్కన పెట్టి తనను నమ్మి వచ్చిన వారి కోసం, తనకు అండగా ఉన్న కేడర్ చేజారకుండా జాగ్రత్తలకు పన్నీరు సెల్వం సిద్ధమయ్యారు. ఇందుకోసం కొత్త పార్టీకి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే తమ కంటూ ఓ పత్రికను ఏర్పాటు చేశారు. ఈ పత్రిక ద్వారా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కొత్త వ్యూహాలకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఆయన అన్నాడీఎంకేను ఇరకాటంలో పెట్టే రీతిలో కొత్త పార్టీ వైపుగా అడుగులు వేస్తున్నట్టు మద్దతుదారులు పేర్కొంటున్నారు. ఈ పార్టీకి అమ్మడీఎంకే అన్న పేరును పరిశీలిస్తున్నట్లు సంకేతాలు వెలువడ్డాయి. ఇప్పటికే అన్నాడీఎంకే నుంచి చీలికతో దినకరన్ నేతృత్వంలో అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం ఆవిర్భవించి ఉంది. ఇది విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లి ఉంది. ఈ దృష్ట్యా, అన్నా డీఎంకేకు ప్రత్యామ్నాయంగా అమ్మడీఎంకే అన్న పేరును పరిశీలిస్తున్నామని ఓ నేత పేర్కొన్నారు. మరికొద్ది రోజుల్లో పార్టీ ప్రకటన, మహానాడుకు సిద్ధమవుతున్నామని ఆ నేత తెలిపారు. లోక్సభ ఎన్నికలలో పన్నీరు పార్టీ పోటీకి దిగడం ఖాయం అని ధీమా వ్యక్తంచేశారు. కేంద్రంలోని బీజేపీ తమను మోసం చేసిందని అందుకే ఆ కూటమికి ప్రత్యామ్నాయంగా అమ్మ డీఎంకే అడుగుల వేగం పెంచడం ఖాయం అని మరో నేతపేర్కొనడం గమనార్హం. -
Tamilnadu: ఢిల్లీలో చక్రం తిప్పే తమిళ తంబి ఎవరో..?
డీఎంకే అధ్యక్షుడు, సీఎంగా ఎంకే స్టాలిన్, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎంగా పళణిస్వామి జాతీయ రాజకీయాల్లో రాణించడమే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇందుకోసం రానున్న లోక్సభ ఎన్నికలను ఈ ఇద్దరూ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ భేటీలో పళణి స్వామికి ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ పక్కనే కూర్చునే అవకాశం రావడం అన్నాడీఎంకే వర్గాల్లో అమితానందాన్ని నింపింది. ఇక బెంగళూరులో జరిగిన ఐ.ఎన్.డి.ఐ.ఎ భేటీలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ పక్కనే కూర్చోవడంతో పాటు జాతీయ స్థాయి ప్రతిపక్షాల కూటమిలో స్టాలిన్కు సముచిత స్థానం దక్కడం ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో జాతీయ రాజకీయాల్లో ఎవరు చక్రం తిప్పుతారనే చర్చ జోరందుకుంది. సాక్షి, చైన్నె: జాతీయ రాజకీయాల్లో తమిళనాడు పాత్ర ఎప్పుడూ కీలకంగానే ఉంటున్నాయి. దివంగత నేతలు కామరాజర్, అన్నాదురై, ఎంజీఆర్ వంటి వారు జాతీయ రాజకీయాలలో రాణించిన వారే. అయితే, జాతీయ రాజకీయాలను శాసించిన ఘనత మాత్రం దివంగత డీఎంకే అధినేత, కలైంజ్ఞర్ కరుణానిధి, మాజీ సీఎం జయలలితలకే దక్కింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని అప్పట్లో కుప్ప కూలడంలో జయలలిత కీలక పాత్రే పోషించారు. ఇక, యూపీఏ అధికారంలోకి రావడంతో పాటు, ఆ కేబినెట్లలో అత్యధిక స్థానాలను దక్కించుకుని జాతీయ స్థాయిలో తమిళ ఖ్యాతిని చాటిన నేత మాత్రం కరుణానిధి. ప్రస్తుతం ఈ ఇద్దరు నేతలూ జీవించి లేరు. జయలలిత మరణంతో అన్నాడీఎంకే ముక్కలు కావడం ,నాయకత్వ లోటు నెలకొనడం వంటి పరిణామాలలో ఆ పార్టీని తన గుప్పెట్లోకి తీసుకుని బల నిరూపణలో పళణి స్వామి సఫలీకృతులు అవుతున్నారు. అదే సమయంలో కరుణానిధి మరణంతో డీఎంకే అధ్యక్ష పగ్గాలు చేపట్టి గత లోక్సభ ఎన్నికల్లో తన సత్తాను స్టాలిన్ చాటుకున్నారు. అలాగే 2021 అసెంబ్లీ ఎన్నికలలో గెలుపుతో రాష్ట్ర అధికార పగ్గాలు చేపట్టిన స్టాలిన్ తాజాగా జాతీయ రాజకీయాలలో కీలక పాత్ర పోషించే దిశగా వ్యూహాలకు పదును పెట్టారు. జాతీయ స్థాయిలో చక్రం తిప్పిన రాష్ట్రానికి చెందిన ఇద్దరు మహానాయకులు ప్రస్తుతం జీవించి లేకున్నా, ఆ పార్టీల బలాన్ని అస్త్రంగా చేసుకుని ఢిల్లీ పెద్దలు స్టాలిన్, పన్నీరు సెల్వంకు ఎన్డీఏ, ఇండియా కూటముల్లో ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం విశేషం. పళణికి మోదీ అభయం.. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా పళణి స్వామి రాజకీయ వ్యూహాలకు పదును పెట్టమే కాకుండా, తన బలాన్ని చాటే ప్రయత్నాలను విస్తృతం చేశారు. ఈ సమయంలో ఎన్డీఏ కూటమిలోని అన్నాడీఎంకేకు కేంద్ర ప్రభుత్వ ప్రధాన్యం ఇవ్వడమే కాకుండా, ఢిల్లీలో జరిగిన సమావేశానికి తనను ఆహ్వానించడం పళణి స్వామిలో మరింత ఉత్సాహాన్ని నింపింది. మంగళవారం ఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ పక్కనే కూర్చోవడమే కాకుండా, సమావేశానికి హాజరైన నేతలందరినీ కలిసి తన ఉనికి చాటుకునే విధంగా పళణి జోరు పెంచడం గమనార్హం. ఈ సమావేశం ముగించుకుని బుధవారం చైన్నెకు చేరుకున్న పళణిలో మరింత ఉత్సాహం తొణికిసలాడడం.. ప్రత్యర్థి పన్నీరు సెల్వాన్ని మరింత షాక్కు గురి చేసింది. రానున్న ఎన్నికల ద్వారా జాతీయ స్థాయిలో సత్తాచాటాలంటే అత్యధిక ఎంపీ స్థానాల కైవసం చేసుకోవాలని పళణి భావిస్తున్నారు. అదే సమయంలో రాష్ట్రంలో కూటమికి నేతృత్వం వహించి అన్నాడీఎంకేకు పెద్ద దిక్కుగా తన బలాన్ని చాటుకోవాల్సిన అవసరం ఉంది. ఇక, రాష్ట్రంలో అన్నాడీఎంకే నేతృత్వంలోనే కూటమి ఉంటుందని పళణి స్పష్టం చేయడం విశేషం. జాతీయ స్థాయిలో తాము ఎన్డీఏతోనే ఉంటామని, రాష్ట్రానికి వచ్చేసరికి అన్నాడీఎంకే కూటమిలో బీజేపీ ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. ఇక అవినీతికి కేరాఫ్ అడ్రస్సుగా మారిన డీఎంకేకు మున్ముందు అన్నీ ఓటములే ఎదురుకానున్నాయంటూ ఆయన పేర్కొనడం గమనార్హం. తిరుగులేని స్టాలిన్.. స్టాలిన్కు జాతీయస్థాయి నేతలతో ఎప్పటి నుంచో పరిచయాలు, సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కరుణానిధి ప్రతినిధిగా అప్పట్లో ఆయన అనేక పార్టీల నేతలను కలిసిన సందర్భాలు ఉన్నాయి. ఇది ప్రస్తుతం జాతీయ రాజకీయాలలో రాణించే ప్రయత్నాలకు కలిసి వస్తోంది. దేశంలో కాంగ్రెస్కు అత్యంత సన్నిహితంగా ఉన్న పార్టీ డీఎంకే. ఇది వరకు కాంగ్రెస్ కూటమిలో కీలకంగా ఉన్న డీఎంకే, ప్రస్తుతం రెండు రోజుల సమావేశానంతరం బెంగళూరు వేదికగా కొత్తగా ఆవిర్భవించిన ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్ (ఐఎన్డీఐఏ–ఇండియా)లోనూ అదే ఊపును కొనసాగించే వ్యూహాలకు పదును పెట్టింది. బెంగళూరులో రెండు రోజుల పాటు జరిగిన సమావేశంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ పక్కనే కూర్చోవడమే కాకుండా, సోనియా, మమత, నితీష్కుమార్ , శరద్ పవార్, కేజ్రీవాల్ వంటి నేతలతో స్టాలిన్ కలిసి పోవడం గమనార్హం. తన ప్రసంగంలోనూ జాతీయ స్థాయి అంశాలను పదే పదేస్టాలిన్ ప్రస్తావించడాన్ని బట్టి మున్ముందు ఢిల్లీలో తన తండ్రి, దివంగత నేత కరుణానిధి తరహాలో చక్రం తిప్పేందుకు స్టాలిన్ ప్రయత్నాలు చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇందులో ఆయన ఏ మేరకు సఫలీకృతులు అవు తారో 2024 వరకు వేచి చూడాల్సిందే. ఈ ఎన్నికల్లో పుదుచ్చేరితో పాటుగా తమిళనాడులోని 40 స్థానాలను కై వశం చేసుకుని జాతీయ స్థాయిలో తన బలాన్ని చాటేందుకు స్టాలిన్ సిద్ధమవుతున్నారు. ఇందుకు అద్దం పట్టే విధంగా ఆయన రాష్ట్రంలో ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్న అన్నా డీఎంకే, బీజేపీని టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు. ఢిల్లీ సమావేశంలో పళణి స్వామిని మోదీ తన పక్కన కూర్చోబెట్టుకున్న అంశాన్ని ప్రస్తావిస్తూ, ఇకపై వారికి అవినీతి గురించి మాట్లాడే అర్హత ఉందా..? ఇదే హాస్యాస్పదం అని స్టాలిన్ చమత్కరించడం గమనార్హం. -
నాయకుడొచ్చాడు..! అన్నాడీఎంకే పూర్తిగా పళణి స్వామి గుప్పెట్లోకి
అనుమానాలు తొలగిపోయాయి.. ఉత్కంఠకు తెరపడింది. సుదీర్ఘ పోరాటం తర్వాత ఎట్టకేలకూ అన్నాడీఎంకే పూర్తిగా పళణి స్వామి గుప్పెట్లోకి చేరింది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆయనకి కేంద్ర ఎన్నికల కమిషన్ గుర్తింపు కల్పించింది. ఆయన నేతృత్వంలో 79 మంది రాష్ట్ర కమిటీ, 69 జిల్లాల కార్యదర్శులు, ఇతర రాష్ట్రాలలోని కార్యదర్శులకు ఆమోద ముద్ర వేస్తూ.. ఆ వివరాలను మంగళవారం కేంద్ర ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో పొందుపరిచింది. ఇది అన్నాడీఎంకే శ్రేణుల్లో అమితానందాన్ని నింపింది. సాక్షి, చైన్నె: అమ్మ జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకేలో చోటు చేసుకున్న అనూహ్య పరిణామాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాల క్రమంలో ఆ పార్టీలోని ముఖ్య నేతలు నాలుగు శిబిరాలుగా విడిపోయి ముందుకెళ్తున్నారు. ఓ ఓ వైపు తానే ఆ పార్టీ ప్రధాన కార్యదర్శినంటూ జయలలిత నెచ్చెలి శశికళ, మరోవైపు పార్టీలో చీలిక కారణంగా ఏర్పడిన అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం గొడుగు నీడన దినకరన్, ఇంకో వైపు సమన్వయ కమిటీ కన్వీనర్ హోదాతో అంటూ పన్నీరు సెల్వం శిబిరం అన్నాడీఎంకేను కై వశం చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాయి. అయితే, కేడర్ బలం, ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీల మద్దతుతో అన్నాడీఎంకే తనదే అని చాటే విధంగా పళణి స్వామి నిత్యం వ్యూహాలకు పదును పెట్టి చివరికి సఫలీకృతులయ్యారు. అన్నాడీఎంకే వ్యవహారాలు అనేకం కోర్టుల్లో ఉన్నా, పార్టీకి కీలకం ఎవరు? అనే విషయాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ తాజాగా మరోమారు తేల్చింది. సర్వ సభ్య సమావేశం, పార్టీ నిబంధనలకు అనుగుణంగా సంస్థాగత ఎన్నికలు, ఏకగ్రీవంగా పదవులకు ఆమోదం లభించడంతో పళనిస్వామి పై చేయి సాధించారు. నూతనోత్సాహంతో.. సుప్రీంకోర్టు ఇటీవల వచ్చిన తీర్పు, అందుకు అనుగుణంగా కేంద్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన ఉత్తర్వులతో వ్యూహాలకు పదును పెట్టి అన్నాడీఎంకేలో ఏక నాయకత్వం దిశగా పళణి స్వామి అడుగులు వేసి విజయం సాధించారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పగ్గాలు చేపట్టి బలోపేతం దిశగా పరుగులు తీస్తున్నారు. ఆగస్టులో మదురై వేదికగా భారీ మహానాడు నిర్వహణకు సిద్ధమవున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రధాన కార్యదర్శిగా తన ఎంపికతో పాటుగా, రాష్ట్ర కమిటీ, జిల్లాల కమిటీ, ఇతర రాష్ట్రాల కమిటీల ఎంపిక వివరాలను కేంద్ర ఎన్నికల కమిషన్కు అన్నాడీఎంకే వర్గాలు పంపించాయి. ఇందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఆమోద ముద్ర వేసింది. ఇక, అన్నాడీఎంకేను సొంతం చేసునే అవకాశం ఇతర గ్రూపులకు లేని విధంగా కేంద్ర ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో పెట్టిన ఉత్తర్వులు మంగళవారం పళణి స్వామికి అందాయి. ఇందులో అన్నాడీఎంకేలో ఇక ఏక నాయకత్వం అని చాటే విధంగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పళణి స్వామికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే, 69 జిల్లాలకు కార్యదర్శులు, రాష్ట్ర కమిటీలో జంబో జట్టుగా 79 మంది నియామకానికి, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి, ఢిల్లీ, తెలంగాణ, అండమాన్ తదితర ప్రాంతాలకు పార్టీ కార్యదర్శుల గుర్తింపునకు ఆమోదం లభించింది. దీంతో ఆపార్టీలో నూతనోత్సాహం కనిపిస్తోంది. రాష్ట్ర కమిటీలో 79 మందికి చోటు పార్టీ ప్రిసీడియం చైర్మన్గా తమిళ్ మగన్ హుస్సేన్, డిప్యూటీ ప్రధాన కార్యదర్శులుగా కేపీ మునుస్వామి, నత్తం ఆర్. విశ్వనాథన్, కోశాధికారిగా దిండుగల్ శ్రీనివాసన్, ఆల్ ఇండియా ఎంజీఆర్ మండ్రం కార్యదర్శిగా సి. పొన్నయ్యన్ను నియమించారు. పార్టీ సిద్ధాంతాల ప్రచార కార్యదర్శిగా సి. తంబి దురై, నిర్వాహక కార్యదర్శులుగా సెంగోట్టయన్, తంగమణి, జయకుమార్, సీవీ షణ్ముగం, సెమ్మలై, దళవాయి సుందరం, పార్టీ ప్రధాన కార్యాలయ కార్యదర్శిగా ఎస్పీ వేలుమణి, పార్టీ ఎన్నికల విభాగం కార్యదర్శిగా పొల్లాచ్చి వి. జయరామన్, మహిళా విభాగం కార్యదర్శిగా వలర్మతికు పదవులు కల్పించారు. కేంద్ర ఎన్నికల కమిషన్ తమకే అన్నాడీఎంకే అని స్పష్టం చేయడంతో పళణి స్వామి మద్దతు దారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక, అన్నాడీఎంకే జెండాను గానీ,పార్టీ చిహ్నాన్ని గానీ మరెవరైనా ఉపయోగిస్తే చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని జయకుమార్ హెచ్చరించారు. పళణిస్వామికి అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి గుర్తింపు వచ్చిందో లేదో వెంటనే ఏన్డీఏ కూటమి ఆహ్వానం కూడా దక్కింది. ఈనెల 18వ తేదీ ఢిల్లీలో జరగనున్న ఎన్డీఏ పార్టీల సమావేశానికి అన్నాడీఎంకే తరపున హాజరు కావాలంటూ పళణికి పిలుపు రావడం విశేషం. ఈ పరిణామాలతో అన్నాడీఎంకే వర్గాలు ఆనంద తాండవం చేస్తున్నాయి. అంగీకరించే ప్రసక్తే లేదు.. కేంద్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులను తాము అంగీకరించే ప్రసక్తే లేదని పన్నీరు సెల్వం స్పష్టం చేశారు. మంగళవారం ఆయన తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. ఈ వ్యవహారం కోర్టులో ఉందని, తమకు అనుకూలంగా తీర్పు వస్తుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. పళణి సీఎంగా ఉన్నప్పుడు చోటు చేసుకున్న (దివంగత సీఎం జయలలితకు చెందిన ఎస్టేట్) కొడనాడు ఘటనను ఈసందర్భంగా పన్నీరు సెల్వం ప్రస్తావిస్తూ, ఈ కేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేయాని కోరారు. ఈ విషయంపై ఆగస్టు 1వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నామని ప్రకటించారు. కాగా, ఎన్డీఏ కూటమి సమావేశానికి పళణి స్వామికి, పీఎంకే తరపున అన్భుమణి రాందాసుకు, తమిళ మానిల కాంగ్రెస్ తరపున జీకే వాసన్కు ఆహ్వానాలు వచ్చినా తనకు మాత్రం ఎలాంటి ఆహ్వానం అందలేని పన్నీరు పేర్కొనడం గమనార్హం. -
పళణి కేసులో సాక్షిగా పన్నీరు
సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామిపై దాఖలైన కేసులో ఆ పార్టీ సమన్వయ కమిటీ కనీ్వనర్ పన్నీరు సెల్వంను సాక్షిగా పోలీసులు చేర్చారు. ఇది కాస్త కొత్త చర్చకు దారి తీసింది. వివరాలు.. అన్నాడీఎంకేలో పళని, పన్నీరు మధ్య జరుగుతున్న వార్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం పార్టీని పళణి స్వామి పూర్తిగా తన ఆ«దీనంలోకి తెచ్చుకున్నారు. పన్నీరు సెల్వం, ఆయన మద్దతుదారులకు ఉద్వాసన పలికారు. అయితే, తనదే నిజమైన అన్నాడీఎంకే అని, ఆ పార్టీ సమన్వయ కమిటీ కనీ్వనర్గా తనకే అధికారాలు ఉన్నాయంటూ పన్నీరు సెల్వం న్యాయ పోరాటం చేస్తూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషన్ను బురిడి కొట్టించే విధంగా పళణి స్వామి ప్రదర్శించిన మాయకు ప్రస్తుతం పన్నీరు సాక్షి అయ్యారు. 2021 ఎన్నికల నామినేషన్ సమయంలో పళణి స్వామి దాఖలు చేసిన ప్రమాణ పత్రంలో ఆస్తుల వివరాలన్నీ తప్పుల తడకగా ఉన్నాయని, అనేక ఆస్తుల వివరాలను ఆయన దాచి పెట్టినట్టు తేనికి చెందిన జిలానీ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ కేసును సేలం పోలీసులు విచారిస్తున్నారు. పళణి స్వామిపై మూడు సెక్షన్లతో కేసు పెట్టారు. ఈ కేసు విచారణను ముగించిన నివేదికను శుక్రవారం కోర్టుకు సేలం పోలీసులు సమరి్పంచారు. ఈ నివేదికలో పళణి స్వామి చేసిన తప్పుకు సాక్షులుగా ఉన్న వారి పేర్లను పొందుపరిచి ఉండడం శనివారం వెలుగులోకి వచ్చింది. సేలం సబ్ రిజిస్టార్, బ్యాంక్ మేనేజర్తో పాటు పన్నీరు సెల్వంను కూడా సాక్షిగా చేర్చారు. ఆ ఎన్నికల సమయంలో పళణి, పన్నీరు ఐక్యంగా ఉన్న విషయం తెలిసిందే. సమన్వయ కమిటీ కనీ్వనర్ హోదాలో పళణి స్వామి నామినేషన్ను బలపరిచే విధంగా పన్నీరు సైలం సంతకం చేసి ఉండటంతో ఆయనన్ి ఈ కేసులో సాక్షిగా చేర్చినట్టు పోలీసులు పేర్కొనడం గమనార్హం. మిత్రులు, ప్రస్తుతం బద్ద శత్రువులుగా మారిన నేపథ్యంలో కేసు విచారణ సమయంలో పళణిని మరింత ఇరకాటంలో పెట్టే విధంగా పన్నీరు సెల్వం వాంగ్మూలం ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
రెండేళ్లలో 30 వేల కోట్లు మింగేశారు
సాక్షి, చైన్నె: డీఎంకే ప్రభుత్వం తన రెండేళ్ల పాలనలో రూ. 30 వేల కోట్లు కొల్లగొట్టిందని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి ఆరోపించారు. రాష్ట్రం హత్యలతో అట్టుడుకుతోందని , రోజుకు కనీసం ఆరేడు హత్య ఘటనలు చోటు చేసుకుంటుండడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఆదివారం చైన్నె నుంచి సేలంకు పళణి స్వామి వెళ్లారు. ఆయనకు కొంగనాపురంలో పార్టీ వర్గాలు ఘన స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, గత పాలనలో తాము తీసుకొచ్చిన ప్రాజెక్టులు, అనేక పనులు ప్రస్తుతం ముగిశాయని, వాటిని డీఎంకే ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చినట్లు పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సేలం జిల్లాను పూర్తిగా ఈ పాలకులు విస్మరించారని, తాను ఈ జిల్లా వాడిననే కారణంతో ఇక్కడి ప్రజలపై సవతి తల్లి ప్రేమను డీఎంకే పాలకులు చూపిస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రవ్యాప్తంగా డీఎంకే పాలకులు కొత్త చేపట్టిన పనులు ఏ ఒక్కటీ లేవని, కపట నాటకాలు, కళ్లబొల్లి మాటలతో ప్రజల్ని మభ్య పెడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, రోజుకు ఆరేడు హత్య ఘటనలు రాష్ట్రంలో వెలుగు చూస్తున్నాయని వివరించారు. యువత మత్తుకు బానిసయ్యే విధంగా గంజాయి, మాదక ద్రవ్యాల విక్రయాలు రాష్ట్రంలో జోరందుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం క్రీడా మైదానాలు, కల్యాణ వేదికలలోకి మద్యం సరఫరా అంటూ , రాష్ట్రాన్ని మత్తులో ముంచే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో విచిత్ర పాలన సాగుతోందని, ఈ అసమర్థ సీఎం కారణంగా ప్రజలు మున్ముందు అష్టకష్టాలు పడే పరిస్థితులు ఎదురు కాబోతున్నాయన్నారు. రెండేళ్ల పాలనలో రూ. 30 వేల కోట్లను మింగేశారని ఆరోపించారు. పాలకుల అవినీతి అక్రమాలపై ఆర్థిక మంత్రి పళణి వేల్ త్యాగరాజన్ చేసినట్టుగా ప్రచారంలో ఉన్న ఆడియో గురించి సీఎం స్టాలిన్ స్పందించక పోవడం శోచనీయమని విమర్శించారు. -
పళనికి అమిత్ షా అభయం
సాక్షి, చైన్నె : అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి హోదాలో తొలిసారిగా ఎడపాడి కే పళనిస్వామి బుధవారం ఢిల్లీకి వెళ్లారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఆయన భేటీ అయ్యారు. ఈసందర్భంగా పళనికి తన అభయాన్ని అమిత్ షా ఇస్తూ కొన్ని సూచనలు చేసినట్టు సమాచారం. అన్నాడీఎంకేలో పళని స్వామి, పన్నీరుసెల్వం మధ్య జరుగుతున్న వార్ క్లైమాక్స్కు చేరిన విషయం తెలిసిందే. కోర్టు, ఎన్నికల కమిషన్ ఉత్తర్వులతో అన్నాడీఎంకేను పూర్తిగా పళని స్వామి తన గుప్పెట్లోకి తెచ్చుకున్నారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రాజకీయ వ్యూహాలకు పదును పెట్టే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో బుధవారం ఢిల్లీకి పళని వెళ్లారు. ముందుగా సేలంలోని తన స్వగ్రామం శిలువం పట్టిలోని మారియమ్మన్ ఆలయంలో పూజలు నిర్వహించారు. అక్కడ జరిగిన కుంభాభిషేక ఉత్సవానికి కుటుంబ సమేతంగా హాజరు అయ్యారు. అనంతరం కోయంబత్తూరు చేరుకున్న పళనిస్వామి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఆయనకు కోయంబత్తూరు విమానాశ్రయంలో అన్నాడీఎంకే వర్గాలు ఘనంగా వీడ్కోలు పలికాయి. పార్టీ నేతలు తంగమణి, ఎస్పీ వేలుమణిలతో కలిసి రాత్రి ఏడు గంటలకు ఢిల్లీకి పళనిస్వామి చేరుకున్నారు. అక్కడి విమానాశ్రయంలో పార్టీ నేతలు, ఎంపీలు సీవీ షణ్ముగం, తంబిదురై, చంద్రశేఖర్ పళనికి ఆహ్వానం పలికారు. రాత్రి తొమ్మిది గంటల సమయంలో అమిత్ షాతో పళనిస్వామి భేటీ అయ్యారు. ఈ ఇద్దరి మధ్య అర గంటకు పైగా తమిళ రాజకీయ అంశాలపై చర్చ జరిగినట్టు సమాచారం. అలాగే, రాష్ట్రంలో అన్నాడీఎంకే కూటమిలో గందరగోళం సృష్టించే విధంగా బీజేపీ అధ్యక్షుడు అన్నామలై తరచూ చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలపై అమిత్ షాకు పళణి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. అలాగే, లోక్సభ ఎన్నికల కూటమి గురించి చర్చించినట్టు తెలిసింది. ఈసందర్భంగా పళని స్వామికి అమిత్ షా అభయాన్ని ఇచ్చినట్టు తెలిసింది. అన్ని వ్యవహారాలను తాను చూసుకుంటానని, తమిళనాడులో కూటమి అధిక స్థానాల్ని కై వసం చేసుకోవడం లక్ష్యంగా కార్యక్రమాలు విస్తృతం చేయాలని అమిత్ షా పళనికి సూచించినట్టు తెలిసింది. -
పన్నీరు ‘ఉప’ పదవికి ఎసరు
సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే పళణి స్వామి గుప్పెట్లోకి చేరడంతో డైలమాలో పడ్డ పన్నీరు సెల్వంకు మరో దెబ్బ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన చేతిలో ఉన్న పార్టీ శాసన సభా పక్ష ఉప నేత పదవికి ఎసరు పెట్టేందుకు పళణి శిబిరం సిద్ధమైంది. బుధవారం స్పీకర్ అప్పావును కలిసి అన్నాడీఎంకే విప్ ఎస్పీ వేలుమణి కోర్టు తీర్పుపై చర్చించారు. వివరాలు.. అన్నాడీఎంకే ఆధిపత్య సమరంలో కోర్టు తీర్పుతో పళణి స్వామి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా పగ్గాలు చేపట్టినానంతరం పార్టీపై పట్టు బిగించే పనిలో పళణి నిమగ్నం అయ్యారు. ఇప్పటికే అన్నాడీఎంకే నుంచి పన్నీరును బయటకుపంపించడం, కోర్టు తీర్పు ఆయనకు వ్యతిరేకంగా రావడం వంటి అంశాలను పళణి శిబిరం పరిగణనలోకి తీసుకుంది. పన్నీరు సెల్వం పదవికి ఎసరు పెట్టేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఇది వరకే పన్నీరు సెల్వంను ఆ పదవి నుంచి తప్పిస్తూ అన్నాడీఎంకే శాసన సభాపక్షం తీర్మానం చేసినా, స్పీకర్ అప్పావు ఇంత వరకు స్పందించ లేదు. పన్నీరును తప్పించి ఆ పదవిలో తమ శిబిరం నేత ఆర్బీ ఉదయకుమార్ను నియమించాలని స్పీకర్కు విజ్ఞప్తి చేసినా ఫలితం శూన్యం. దీంతో సభలో పళణి, పన్నీరు పక్క పక్కనే కూర్చోవాల్సిన పరిస్థితి. ఈసారి వదలి పెట్టం.. ఇది వరకు వ్యవహారం కోర్టులో ఉండడంతో స్పీకర్ ఉప నేత పదవి విషయంగా ఆచీ తూచీ స్పందించారు. పన్నీరును ఆ సీటులో కూర్చునేందుకు అవకాశం కల్పించారు. ప్రస్తుతం అన్నాడీఎంకే వ్యవహారంలో కోర్టు తీర్పు తమకు అనుకూలంగా రావడం,ప్రధాన కార్యదర్శి పదవిని తమ నేత పళని స్వామి స్వీకరించడంతో ఇక, పన్నీరును ఆ సీటులో కూర్చోబెట్టేందుకు అంగీకరించే ప్రసక్తే లేదని మెజారిటీశాతం ఎమ్మెల్యేలు స్పీకర్పై ఒత్తిడికి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ముందుగా అన్నాడీఎంకే విప్ ఎస్పీ వేలుమణి బుధవారం స్పీకర్ అప్పావును కలిసి విషయాన్ని ప్రస్తావించారు. తమ పార్టీతో సంబంధం లేని వ్యక్తిని ఎలా ఉప నేత సీటులో కూర్చోబెడుతారని, తక్షణం ఆయన్ని తప్పించి, ఆర్బీ ఉదయకుమార్ ఆ స్థానంలో నియమించాలని కోరారు. స్పీకర్ ఒకటి రెండు రోజుల్లో స్పందించని పక్షంలో ఎమ్మెల్యేలతో సభను స్తంభింప చేయడానికి పళణి స్వామి సిద్ధం అవుతుండడం గమనార్హం. కాగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఉదయం అసెంబ్లీలో పళణిస్వామి అడుగుపెట్టగానే ఆ పార్టీ ఎమ్మెల్యేలు బల్లలు గుద్ది మరీ కరతాళ ధ్వనులతో ఆహ్వానం పలకడం విశేషం. ఇదిలా ఉండగా మంగళవారం వెలువడ్డ తీర్పునకు వ్యతిరేకంగా పన్నీరు సెల్వం దాఖలు చేసిన అప్పీలు పిటిషన్ విచారణ గురువారం ప్రారంభం కానుంది. బుధవారం పన్నీరు శిబిరానికి చెందిన వైద్యలింగం, మనోజ్ పాండియన్, జేసీడీ ప్రభాకర్లు సైతం వేర్వేరుగా పళణికి వ్యతిరేకంగా పిటిషన్లు దాఖలు చేయడం గమనార్హం. అందుకే బుధవారం జరగాల్సిన విచారణ ఒక రోజు వెనక్కి వెళ్లింది. -
రాజకీయరంగంలో సంచలనంగా పళని ప్రస్థానం
తెల్ల చొక్కా, తెల్ల పంచె, నుదుటున విభూదితో కనిపించే పళణి స్వామి ప్రస్థానం తమిళ రాజకీయాల్లో ప్రత్యేకమనే చెప్పాలి. 1954లో సేలం జిల్లా శిలువం పాళయం అనే గ్రామంలో ఆయన జన్మించారు. కోనేటి పట్టిలో బెల్లం వ్యాపారంలో రాణించారు. ఎంజీఆర్ మరణంతో అన్నాడీఎంకే ముక్కలైన సమయంలో 1989లో జయలలిత శిబిరం ఎమ్మెల్యేగా ఎడపాడి నియోజకవర్గం నుంచి తొలిసారి గెలుపొందారు. అప్పటి నుంచి ఎడపాడి ఆయన ఇంటి పేరుగా మారింది. పార్టీ జిల్లా కార్యదర్శిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా విజయాలతో దూసుకొచ్చిన పళణి స్వామి 2011లో తొలిసారి మంత్రి అయ్యారు. 2016లో మరో మారు మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. జయలలిత మరణం తదుపరి పరిణామాలతో అన్నాడీఎంకేలో చోటు చేసుకున్న మార్పుల నేపథ్యంలో అనూహ్యంగా పళణి స్వామి శాసన సభ పక్ష నేతగా మారారు. జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళ అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్తూ, తన ప్రతినిధిగా పళని స్వామిని ఏకంగా సీఎం పీఠంపై కూర్చోబెట్టింది. ఆ తదుపరి పళనిస్వామి రాజకీయ వ్యూహాలకు పదునుపెడుతూ, ఎత్తుకు పై ఎత్తులతో శశికళ శిబిరాన్నే పూర్తిగా పక్కన పెట్టారు. అలాగే, పార్టీకి వ్యతిరేకంగా ఉన్న పన్నీరు సెల్వంను అక్కున చేర్చుకుని జంట నాయకత్వంతో ముందుకెళ్లారు. ఎంత కాలం ఈ ప్రభుత్వం కొనసాగుతుందో అని అనుమానం వ్యక్తం చేసిన వారికి తన మార్కు పాలనతో సమాధానం చెప్పారు. ప్రజల మన్ననలే కాదు, అన్నాడీఎంకే కార్యకర్తలు, నాయకుల మదిలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. 2021 అసెంబ్లీ ఎన్నికలలో అన్నాడీఎంకేకు అధికారం దూరమైనా, గౌరవప్రదంగా 65కు పైగా ఎమ్మెల్యేలను గెలిపించుకుని తన ప్రత్యేకత చాటుకున్నారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా పగ్గాలు చేపట్టి.. తనదైన రాజకీయ వ్యూహాలతో ముందుకు సాగారు. ఇక చివరికి అన్నాడీఎంకేలో తిరుగు లేని నేతగా మారి జయలలిత తర్వాత ప్రధాన కార్యదర్శిగా పగ్గాలు చేపట్టారు. :: సాక్షి, చైన్నె ప్రతినిధి -
తమిళనాట ట్విస్ట్.. పళనిస్వామి సంచలన నిర్ణయం?
సాక్షి, చెన్నై: భారతీయ జనతా పార్టీతో తెగదెంపులకు పళని శిబిరం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తమకు రెండాకుల గుర్తు దక్కినా..దక్కకున్నా ఈ ఉప ఎన్నికలో తమ అభ్యర్ధిని నిలబెట్టి తీరుతారలని పళని స్వామి భావిస్తున్నారు. ఈ మేరకు పార్టీ వర్గాలతో ఆదివారం జరిపిన చర్చల్లో నిర్ణయించినట్లు సమాచారం. కాంగ్రెస్ పరుగులు.. మరోవైవు ఈరోడ్ తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఈవీకేఎస్ ఇలంగోవన్ గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఇక కాంగ్రెస్ అభ్యర్ధికి మద్దతుగా డీఎంకే దూసుకెళ్తోంది. 50 వేల ఓట్ల మెజారిటీ సాధించడమే లక్ష్యంగా 11 మంది మంత్రులు, 22 మంది ముఖ్య నేతలు ఇంటింటికీ వెళ్లి ఓట్ల వేటలో ఉన్నారు. అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం, డీఎండీకే కూడా అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల పనులు ప్రారంభించారు. అయితే అన్నాడీఎంకేలో విభేదాల నేపథ్యంలో ఆ పార్టీ చర్చలు, సమీక్షలు, సమావేశాలకే పరిమితమైంది. ప్రధానంగా జాతీయ పార్టీ బీజేపీ మద్దతు కోసం అన్నాడీఎంకేలోని పన్నీరు సెల్వం, పళణి స్వామి శిబిరాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైతో పాటు ముఖ్య నేతలను ఇప్పటికే ఇరు శిబిరాల ప్రతినిధులు వేర్వేరుగా కలిసి మద్దతు కోరారు. అధికారికంగా బీజేపీ నుంచి ఇంత వరకు ఏ శిబిరానికీ మద్దతు దక్కలేదు. దీంతో తమ అభ్యర్థిని ప్రకటించాలని పళని శిబిరం నిర్ణయించింది. తీవ్ర ప్రయత్నాలు.. రెండాకుల గుర్తు కోసం సోమవారం సుప్రీంకోర్టులో పళని స్వామి శిబిరం చివరి ప్రయత్నం చేయనుంది. కేంద్రం మద్దతు ఉన్న పక్షంలో ఎన్నికల యంత్రాంగం ద్వారా గుర్తుతో పాటు, బీఫాంలో సంతకం పెట్టే అధికారం తనకు దక్కుతుందని ఇన్నాళ్లూ పళని స్వామి భావించారు. అయితే బీజేపీ ఏ విషయాన్నీ స్పష్టం చేయకపోవడం ఆయన్ని కలవరంలో పడేసింది. దీంతో, ఆదివారం ఈరోడ్లో జరిగిన పార్టీ నేతల సమావేశంలో రెండాకుల చిహ్నం కోసం చివరి వరకు ప్రయత్నిద్దామని, అది దక్కని పక్షంలో స్వతంత్రంగానైనా పోటీ చేయడానికి సిద్ధంగా ఉండాలని నేతలకు ఆయన తేల్చిచెప్పినట్లు తెలిసింది. కాగా ఈ పరిస్థితుల్లో బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోననే ఉత్కంఠ నెలకొంది. రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ ఈరోడ్ తూర్పు నియోజకవర్గ ఉప ఎన్నికకు గాను.. మంగళవారం నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఇందుకోసం ఈరోడ్ కార్పొరేషన్ ఆవరణలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా శివకుమార్ వ్యవహరించనున్నారు. నామినేషన్ దాఖలుకు వచ్చే అభ్యర్థులకు కఠిన ఆంక్షలు విధించారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే నామినేషన్లు స్వీకరిస్తారు. అభ్యర్థితో పాటు కార్యాలయంలోకి నలుగురిని మాత్రమే అనుమతిస్తారు. ఊరేగింపుగా వచ్చే వాహనాలను 100 మీటర్ల దూరంలోనే ఆపేయాల్సి ఉంటుంది. అభ్యర్థుల సైతం తమ వాహనాలను అక్కడే ఆపేసి నడుచుకుంటూ రావాల్సి ఉంటుంది. నియోజకవర్గంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘన, ఎన్నికల ఖర్చు తదితర వ్యవహారాల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారుల బృందం మంగళవారం ఈరోడ్కు రానుంది. ఇప్పటికే అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం, డీఎంకే వర్గాలపై పదుల సంఖ్యలో కోడ్ ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉండగా, తూర్పు నియోజకవర్గ పరిధిలో గత కొద్ది రోజులుగా రూ. 2 వేలు, రూ. 500 నోట్ల చెలామణి పెరగడం గమనార్హం. -
ప్లాన్ మార్చిన పళణి స్వామి.. జంబో జట్టుతో వ్యూహరచన!
సాక్షి, చెన్నై: ఈరోడ్ తూర్పు నియోజకవర్గంలో గెలుపు బావుటా ఎగురవేడయమే లక్ష్యంగా అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పళణి స్వామి వ్యూహాలకు పదును పెట్టారు. ఎమ్మెల్యే కేఏ సెంగోట్టయన్ నేతృత్వంలో జంబో జట్టును గురువారం రంగంలోకి దించారు. ఇందులో పార్టీ మాజీ మంత్రులు, ముఖ్య నేతలు 106 మంది ఉన్నారు. వివరాల ప్రకారం.. ఈరోడ్ తూర్పు నియోజకవర్గంలో ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థి ఈవీకేఎస్ ఇలంగోవన్ ప్రచారంలో ఉరకలు తీస్తున్నారు. ఆయనకు మద్దతుగా డీఎంకే మంత్రులు 11 మందితో పాటుగా ముఖ్య నేతలు 31 మంది ఓట్ల వేటలో ఉన్నారు. వీరంతా ఒక్కో ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని అక్కడి ఓటర్లను ఆకర్షించే పనిలో నిమగ్నం అయ్యారు. అదే సమయంలో తానేమి తక్కువ కాదని చాటే విధంగా తన సొంత జిల్లా సేలంకు పొరుగున ఉన్న ఈరోడ్ తూర్పు స్థానాన్ని కైవసం చేసుకునేందుకు అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పళణి స్వామి వ్యూహాలకు పదును పెట్టారు. పార్టీ సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వం శిబిరం రూపంలో ఏదేని చిక్కులు , సమస్యలు ఎదురైనా తిప్పికొట్టేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఈరోడ్ తూర్పులో గెలుపే లక్ష్యంగా ఎన్నికల కోసం జంబో జట్టును రంగంలోకి దించారు. ఎమ్మెల్యే కేఏ సెంగోట్టయన్ నేతృత్వంలోని ఈ జట్టులో పార్టీ ప్రిసీడియం చైర్మన్, మాజీమంత్రులు, ముఖ్య నేతలు 106 మంది ఉన్నారు. వీరందరితో గురువారం ఈరోడ్లో పళణి స్వామి భేటీ అయ్యారు. ఢిల్లీ పెద్దలే కారణం.. అన్నాడీఎంకేలో నెలకొన్న పరిస్థితులకు ఢిల్లీ పెద్దలే కారణం అని అమ్మమక్కల్ మున్నేట్ర కళగం నేత టీటీవీ దినకరన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శక్తివంతమైన పార్టీని చిన్నాభిన్నం చేయడంలో ఢిల్లీ పాత్రే ఎక్కువగా ఉందని గురువారం ఓ మీడియాతో మాట్లాడుతూ ధ్వజమెత్తారు. ఇక ఉప ఎన్నికల విషయంపై పన్నీరుసెల్వం మంతనాలు కొనసాగిస్తూనే ఉన్నారు. మిత్రులను కలిసి మద్దతు వేటలో ఉన్న ఆయన శిబిరం నేతలు ఇప్పటి వరకు తూర్పు నియోజకవర్గం వైపుగా వెళ్లక పోవడం గమనార్హం. ఇదిలా ఉండగా ఈవీకేఎస్కు మద్దతు ప్రకటించిన మక్కల్ నీది మయ్యం నేత కమలహాసన్, స్వయంగా ప్రచారానికి వెళ్లాలని నిర్ణయించారు. ఆ నియోజకవర్గంలో నాలుగైదు రోజుల పాటు పర్యటించేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నా రు. ఇక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ ఏర్పాట్లపై అధికారులు దృష్టి పెట్టారు. అలాగే ఎన్నికల విధుల్లోకి రానున్న 550 మంది టీచర్ల జాబితాను సిద్ధం చేసి ప్రకటించారు. ఇది కూడా చదవండి: కాంగ్రెస్ చీఫ్ ఖర్గేకు షాకిచ్చిన సీఎం నితీశ్ కుమార్ -
తమిళనాట కోల్డ్వార్: సుప్రీంకోర్టుకు పళనిస్వామి.. ఏం జరుగనుంది?
సాక్షి, చెన్నై : అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం వ్యవహారంలో తమ వాదన వినాలని కోరుతూ ఎడపాడి కె.పళనిస్వామి తరఫున కేవియేట్ పిటిషన్ గురువారం సుప్రీంకోర్టులో దాఖలైంది. అన్నాడీఎంకేలో పన్నీరు సెల్వం, పళని స్వామి శిబిరాల మధ్య జరుగుతున్న వార్ గురించి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ఈనెల 11వ తేదీ చెన్నైలో పళనిస్వామి నేతృత్వంలో జరిగిన అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశాన్ని పన్నీరు సెల్వం తీవ్రంగా వ్యతిరేకించారు. అదే సమయంలో ఈ సమావేశం వేదికగా అన్నాడీఎంకే సమన్వయ కమిటీని రద్దు చేశారు. అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళనిస్వామి ఎంపికయ్యారు. అలాగే అన్నాడీఎంకే నుంచి పన్నీరు సెల్వం అండ్ బృందాన్ని సాగనంపే విధంగా తీర్మానాలు చేశారు. దీంతో ఈ సమావేశానికి, ఇందులో తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా పన్నీరుసెల్వం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అలాగే ఈ సమావేశం నిర్వహణకు అనుకూలంగా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. ఈ పిటిషన్ శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో పళని స్వామి తరఫున కార్యనిర్వాహక కార్యదర్శి, మాజీమంత్రి ఎస్పీ వేలుమణి గురువారం సుప్రీంకోర్టులో కేవియేట్ పిటిషన్ దాఖలు చేశారు. పన్నీరు సెల్వం దాఖలు చేసిన పిటిషన్ వ్యవహారంలో తమ వాదన వినాలని కోరారు. అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశానికి ఉన్న ప్రాధాన్యత, అధికారాల గురించి ఆ పిటిషన్లో వివరించారు. ఇది కూడా చదవండి: ఐదేళ్లలో కేంద్రం ప్రకటనల ఖర్చు రూ.3,339 కోట్లు -
అన్నాడీఎంకే పంచాయతీ: ఢిల్లీలో పళని.. గల్లీలో పన్నీర్
సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకేపై పట్టు సాధించిన పళనిస్వామి ఢిల్లీలో ప్రధాని మోదీ సహా పలువురు నేతలను కలుసుకుంటూ బిజీబిజీగా గడుపుతున్నారు. ఇక పార్టీ అంతర్గత పోరులో వెనుకబడిన పన్నీరు సెల్వం చెన్నైలో ఉంటూ పిటీషన్ల పర్వం కొనసాగిస్తున్నారు. నేపథ్యం ఇదీ.. ఎడపాడి పళనిస్వామి, ఓ పన్నీర్సెల్వం మధ్య భగ్గుమన్న విబేధాలు అన్నాడీఎంకే చీలికదిశగా సాగు తు న్నాయి. తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఈపీఎస్ ఎన్నికైన∙వెంటనే పనిలోపనిగా ఓపీఎస్ పనిపట్టడం ప్రారంభించారు. పన్నీర్, ఆయన ఇద్దరు కుమారులు రవీంద్రనాథ్, జయప్రదీప్ ఇతర మద్దతుదారులపై శాశ్వత బహిష్కరణ వేటు వేశారు. అంతేగాక కోశాధికారి పదవి నుంచి పన్నీర్ను తప్పించి, అన్నాడీఎంకే బ్యాంకు ఖాతాలను తన ఆధీనంలోకి తెచ్చుకున్నారు. పన్నీర్ కుమారుడైన తేనీ లోక్సభ సభ్యుడు రవీంద్రనా«థ్కు అన్నాడీఎంకే పార్లమెంటరీ నేత హోదా నుంచి కూడా తప్పించాలని కోరుతూ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ఎడపాడి ఇటీవల లేఖ రాశారు. పార్టీ కార్యాల యం ధ్వంసం చేసి, ఖరీదైన వస్తువులను, కొన్ని పత్రా లను అపహరించినట్లుగా ఎడపాడి మద్దతుదారైన సీవీ షణ్ముగం ఆరోపించారు. ఇందుకు బాధ్యులైన ఓపీఎస్, వైద్యలింగం, మనోజ్పాండియన్ సహా 9 మందిపై చర్య తీసుకోవాలని కోరుతూ చెన్నై రాయపేట పోలీస్స్టేషన్లో శనివారం ఆయన ఫిర్యాదు చేశారు. బిజీబిజీగా ఓపీఎస్ రాష్ట్రంలో పరిస్థితులను పక్కనబెట్టి.. ఎడపాడి పళనిస్వామి దేశ రాజధానిలో పర్యటిస్తున్నారు. శుక్రవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్న ఈపీఎస్ శనివారం ఢిల్లీ పెద్దలను కలవడం మొదలుపెట్టారు. ఇటీవల జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో గెలుపొందిన ద్రౌపది ముర్మును కలిసి అభినందనలు తెలిపారు. అలాగే, శుక్రవారం రాత్రి ఢిల్లీలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వీడ్కోలు విందులో పాల్గొన్నారు. ఇదే సమయంలో ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షాను కలుసుకున్నారు. ఎడపాడి ఢిల్లీలో మరో రెండురోజులుండి పార్టీలో చోటుచేసుకున్న పరిణామాలు, పన్నీర్ వైఖరిని మోదీకి వివరించనున్నట్లు తెలిసింది. కాగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వీడ్కోలు, కొత్త రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పదవీ ప్రమాణ సభలకు ఎడపాడిని మాత్రమే కేంద్రం ఆహ్వానించినట్లు ప్రధాన ప్రతిపక్ష ఉపనేత ఆర్బీ ఉదయ్కుమార్ మీడియాకు తెలిపారు. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎడపాడిని కేంద్రం అంగీకరించినట్లు భావించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. స్పీకర్కు ఓపీఎస్ లేఖ తనను అన్నాడీఎంకే నుంచి తొలగించినట్లుగా ఎడపాడి రాసిన లేఖను పరిగణనలోకి తీసుకోవద్దని లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ఓ పన్నీర్సెల్వం, తేనీ ఎంపీ రవీంద్రనాథ్ శనివారం ఓ లేఖ పంపారు. ఈపీఎస్ను తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేసుకున్న అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం చెల్లదనే వివాదం న్యాయస్థానంలో విచారణ దశలో ఉందని, ఇదే అంశంపై ఎన్నికల కమిషన్కు ఓపీఎస్ రాసిన ఉత్తరం పరిశీలనలో ఉందని అందులో పేర్కొన్నారు. ఈసీ రికార్డుల్లో పార్టీ కన్వీనర్గా పన్నీర్సెల్వమే ఉన్నారని గుర్తు చేశారు. ఆయన అనుమతి లేకుండా, పార్టీ విధి విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 11వ తేదీన నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి చట్టబద్ధత లేదని లేఖలో స్పష్టం చేశారు. బ్యాంకు ఖాతాలు సీజ్ చేయాలి కాగా అన్నాడీఎంకే బ్యాంకు ఖాతాలను సీజ్ చేయాలని ఆ పార్టీ కన్వీనర్ హోదాలో ఓ పన్నీర్సెల్వం రిజర్వు బ్యాంకు చెన్నై మండల డైరెక్టర్కు శనివారం లేఖ రాశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి వ్యవహారంలో ఎన్నికల కమిషన్ ఓ నిర్ణయానికి వచ్చే వరకు అన్నాడీఎంకేకు చెందిన ఏడు బ్యాంకు ఖాతాలను తక్షణం స్తంభింపజేయాలని కోరారు. ఈసీ రికార్డుల్లో తానే కన్వీనర్, కోశాధికారినని, ఇందుకు సంబంధించిన రికార్డులను ఇప్పటికే ఈసీకి సమర్పించానని అందులో స్పష్టం చశారు. -
తవ్వేకొద్దీ అవినీతి.. కట్టలు కట్టలుగా డబ్బులు,కళ్లు తిరిగేలా బంగారం!
సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రతిపక్ష నాయకుడు ఎడపాడి పళనిస్వామికి సన్నిహితుడైన కాంట్రాక్టరు ఇళ్లు, కార్యాలయాల్లో ఆదాయపు పన్నుశాఖ అధికారుల తనిఖీలు గురువారం కూడా కొనసాగాయి. ఎడపాడికి.. మదురైకి చెందిన మురుగవేల్, ఆయన కుమారులు అత్యంత సన్నిహితులు. ఎడపాడి ద్వారా 2016 నుంచి వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు పనులు పొంది భారీస్థాయిలో ఆర్జించారు. అయితే ఆదాయపు పన్ను ఎగవేసినట్లు సమాచారం అందడంతో ఐటీ అధికారులు బుధవారం ఆకస్మిక దాడులకు దిగారు. తవ్వేకొద్దీ అవినీతి బయటపడటంతో రెండోరోజైన గురువారం కూడా తనిఖీలు కొనసాగించారు. మదురై, దిండుగల్లు జిల్లాల్లో 15కు పైగా భవన నిర్మాణ కంపెనీల నుంచి రూ.27 కోట్ల నగదు, 3 కిలోల బంగారు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. చదవండి: పెళ్లై 40 రోజులు.. ఏమైందో ఏమో.. బయటకు వెళ్తున్నానని చెప్పి! -
బాహుబలి క్లైమాక్స్ కూడా తక్కువే.. అన్నాడీఎంకే పగ్గాలు పళనికే..!
ఆరోపణలు.. ప్రత్యారోపణలు, సభలు.. సమావేశాలు, దాడులు.. దౌర్జన్యాలు, ఎత్తులు.. పై ఎత్తులతో గత పక్షం రోజులుగా సాగిన అన్నాడీఎంకే ఆధిపత్య పోరుకు తెరపడింది. పార్టీ పగ్గాలు ప్రస్తుతానికి పళనిస్వామికే దక్కాయి. అయితే సోమవారం క్లైమాక్స్ మాత్రం బాహుబలి, కేజీఎఫ్, విక్రమ్ సినిమాలకు తక్కువ కాదన్నట్లుగా సాగింది. సర్వసభ్య సమావేశంలో వానగరం వేదికగా ఎడపాడి పార్టీ పగ్గాలు అందుకున్నారనే సమాచారంతో.. పన్నీరు సెల్వం వర్గం ఆగ్రహంతో ఊగిపోయింది. ఓపీఎస్ తన మద్దతుదారులతో రాయపేటలోని పార్టీ కార్యాలయం తలుపులను బద్దలు కొట్టి.. దాన్నిస్వాధీనంలోకి తెచ్చుకున్నారు. సమాచారం అందుకున్న ఎడపాడి వర్గం అక్కడికి వచ్చి వీరంగం సృష్టించింది. దాడులు.. ప్రతిదాడులతో పార్టీ కార్యాలయ ప్రాంగణం దద్దరిల్లింది. పోలీసులు లాఠీచార్జీ చేసినా ఫలితం లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంది. అన్నాడీఎంకే కార్యాలయానికి సీలు వేసి పలువురు ఆందోళన కారులను అరెస్ట్ చేసింది. సాక్షి ప్రతినిధి, చెన్నై: గత కొంతకాలంగా అన్నాడీఎంకేలో సాగుతున్న ఆధిపత్యపోరులో ఎట్టకేలకూ ఎడపాడి పళనిస్వామి పైచేయి సాధించారు. పన్నీర్ కల్పించిన అడ్డంకులను అధిగమించి పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎడపాడి ఎంపికయ్యారు. దీంతో ప్రత్యర్థి వర్గం ఎడపాడి మద్దతుదారులపై విరుచుకుపడగా జరిగిన అల్లర్లు, వాహనాల ధ్వంసం, పరస్పర ముష్టిఘాతాలు, కత్తివేట్లతో పార్టీ కార్యాలయ పరిసరాలు యుద్ధభూమిని తలపించాయి. అమ్మ మరణంతో ఖాళీగా మారిన ప్రధాన కార్యదర్శి పదవిని చేజిక్కించేందుకు తొలుత శశికళ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు ఆమె జైలుకెళ్లగా, సమన్వయ కమిటీ కన్వీనర్, కో కన్వీనర్లుగా పన్నీర్సెల్వం, ఎడపాడి పళనిస్వామి జయస్థానాన్ని భర్తీ చేశారు. అయితే ఇద్దరికీ పొసగకపోవడంతో చాపకిందినీరులా ఉన్న అంతఃకలహాలు అసెంబ్లీ ఎన్నికల తరువాత బట్టబయలయ్యాయి. పార్టీ సారథులుగా ఇద్దరు వద్దు, ఒక్కరే ముద్దు అంటూ ఏక నాయకత్వ నినాదం తెరపైకి వచ్చింది. ఈ వ్యవహారంలో సుమారు 80 నుంచి 90 శాతం మంది నాయకులు, కార్యకర్తలు ఎడపాడి వైపు నిలువడంతో పన్నీర్సెల్వం కోపం కట్టలు తెంచుకుంది. ఎడపాడికి అన్నీ మంచి శకునాలే.. ఇదిలా ఉండగా, ఈనెల 11వ తేదీన ప్రధాన కార్యదర్శిగా ఎంపికయ్యేందుకు ఎడపాడి అన్నీ సిద్ధం చేసుకున్నారు. సమావేశంపై స్టే కోసం పన్నీర్సెల్వం కోర్టు కెక్కడంతో ఎడపాడి శిబిరం తీవ్ర ఉత్కంఠకు లోనైంది. అయితే సోమవారం వెలువడిన తీర్పు ఎడపాడికి అనుకూలమైంది. పార్టీ అంతర్గత వ్యవహారాల్లో కోర్టు జోక్యం చేసుకోబోమని న్యాయమూర్తి తమ తీర్పులో పేర్కొన్నారు. దీంతో యధావిధిగా సర్వసభ్య సమావేశం జరిగింది. తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎడపాడి, కోశాధికారిగా దిండుగల్లు శ్రీనివాసన్ ఎంపికయ్యారు. కన్వీనర్, కో కన్వీనర్ పదవులు రద్దు, పార్టీ నుంచి పన్నీర్ బహిష్కరణ, ప్రధాన కార్యదర్శి పదవికి నాలుగు నెలల్లోగా ఎన్నికలు తదితర 16 తీర్మానాలు ఎలాంటి అవాంతరాలు లేకుండా ఏకగ్రీవ ఆమోదం పొందాయి. అంతేగాక శాశ్వత ప్రధాన కార్యదర్శి జయలలిత అనే పదవిని రద్దు చేస్తూ పార్టీ బైలాను సవరించారు. కాగా అన్నాడీఎంకేను మళ్లీ అధికారంలోకి తెస్తామని సర్వసభ్య సమావేశంలో ఎడపాడి ధీమా వ్యక్తం చేశారు. రెచ్చిపోయిన ఇరువర్గాలు ఎడపాడి ఎత్తులకు చిత్తయిన పన్నీర్సెల్వం పార్టీ ప్రధాన కార్యాలయంలో పాగా వేశారు. ఎడపాడి మద్దతుదారులంతా వానగరంలో జరుగుతున్న సర్వసభ్య సమావేశంలో ఉండగా, పన్నీర్సెల్వం తన అనుచరులతో కలిసి రాయపేట పార్టీ కార్యాలయంలోకి తలుపులను బద్దలు కొట్టి మరీ వెళ్లారు. అక్కడున్న ఎడపాడి ఫొటోలను చించివేసి తగులబెట్టారు. ఈ సమాచారం అందుకున్న ఎడపాడి వర్గం పార్టీ కార్యాలయంలోకి జొరబడి వీరంగం సృష్టించింది. ఇందుకు ప్రతిగా పన్నీర్ అనుచరులు సైతం ముష్టిఘాతాలకు దిగడంతో ఆ ప్రాంతం రణరంగంగా మారింది. కత్తులు, కర్రలు ఇతర మారణాయుధాలతో పరస్పరం దాడులకు పాల్పడ్డారు. ఒకరినొకరు వెంటాడారు. ఫలితంగా కొందరికి గాయాలయ్యాయి. శాంతిభద్రతల సమస్య తలెత్తడంతో.. దాడుల కారణంగా అనేక వాహనాలు ధ్వంసమై తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడి.. శాంతిభద్రతల సమస్య తలెత్తింది. పోలీసులు భారీగా మొహరించి లాఠీచార్జీ చేసినా పార్టీ శ్రేణులను నిలువరించడం సాధ్యం కాలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని 144 సెక్షన్ విధించి పార్టీ కార్యాలయానికి సీలు వేసి పలువురిని అరెస్ట్ చేసింది. ఇందుకు నిరసన తెలుపుతూ పన్నీర్ తన మద్దతుదారులతో ధర్నాకు దిగారు. పార్టీ కార్యాలయంలో విధ్వంసానికి పాల్పడ్డారని, ముఖ్యమైన డాక్యుమెంట్లను తీసుకెళ్లారని ఆరోపిస్తూ ఎడపాడి వర్గీయులు పన్నీర్సెల్వం తదితరులపై పోలీసు కేసు పెట్టారు. పార్టీ నుంచి తనను ఎడపాడి బహిష్కరించడం కాదు, తానే ఎడపాడి, కేపీ మునుస్వామిని పార్టీ నుంచి బహిష్కరించినట్లు పన్నీర్సెల్వం మీడియాతో మాట్లాడుతూ ప్రకటించారు. చదవండి: సీఎంకు చల్లటి చాయ్: అధికారికి నోటీసులు.. కఠిన చర్యలు! -
‘నేనే నెంబర్ వన్’
సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకేలో సమన్వయ కమిటీ కో–కన్వీనర్ పదవీ కాలం చెల్లిపోయినందున ఇకపై తాను పార్టీ ప్రధాన కార్యాలయ కార్యదర్శినని ఎడపాడి పళనిస్వామి తనకు తానుగా ప్రకటించుకున్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన చేసిన ట్వీట్తో అన్నాడీఎంకేలో అంతర్గత పోరు మరో మలుపు తిరిగింది. జయ మరణం తరువాత కన్వీనర్, కో–కన్వీనర్గా పన్నీర్సెల్వం, ఎడపాడి పళనిస్వామి వ్యవహరించారు. పార్టీ జనరల్ బాడీ సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యంలో ఏక నాయకత్వం నినాదాన్ని ఎడపాడి వర్గీయులు తెరపైకి తేవడంతో ఓపీఎస్, ఈపీఎస్ మధ్య నిప్పురాజుకుంది. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యేందుకు వీలుగా ఎడపాడి ఈనెల 11వ తేదీ జనరల్బాడీ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాన్ని అడ్డుకునేందుకు ఓపీఎస్ సర్వశక్తులు ఒడ్డుతున్నారు. తన అనుమతి లేకుండా నిర్వహించే జనరల్బాడీ సమావేశం, అందులో చేసే తీర్మానాలు చెల్లవని ఓపీఎస్ వాదిస్తున్నారు. ఈ క్రమంలో ఎడపాడి తనను తాను పార్టీ కార్యాలయ కార్యదర్శిగా ప్రకటించుకోవడం చర్చకు దారితీసింది. కన్వీనర్గా పన్నీర్సెల్వం గడువు ముగిసిపోయినందున కోశాధికారి పదవి నుంచి సైతం అతడిని తప్పించేందుకు ఎడపాడి వర్గం ప్రయత్నాలు చేస్తోంది. కో కన్వీనర్గా ఉన్న ఎడపాడి పార్టీ కార్యాలయ కార్యదర్శిగా ప్రకటించుకోవడంతో పన్నీర్ చేతిలోని కోశాధికారి పదవిపై పలువురు పోటీపడుతున్నారు. ఎడపాడి వర్గీయులైన సీనియర్ నేతలు కేపీ మునుస్వామి, ఎస్పీ వేలుమణి, విజయభాస్కర్ కోశాధికారి పగ్గాలు చేపట్టేందుకు ఎవరికివారుగా పావులు కదుపుతున్నారు. ఇందుకు అనుగుణంగా సర్వసభ్య సమావేశ కార్యవర్గం ఎడపాడికి మద్దతు పలుకుతూ ఉత్తరం రాసింది. అంతేగాక జిల్లాల్లో మద్దతు తీర్మానాలు చేయడం ప్రారంభించింది. -
ఎస్ఈసీ చెంతకు అన్నాడీఎంకే పంచాయితీ.. పన్నీరు సెల్వం ఫిర్యాదు, పళని స్వామి వ్యూహాలు
సాక్షి,చెన్నై: అన్నాడీఎంకే పంచాయితీ కేంద్ర ఎన్నికల కమిషన్కు చేరింది. పార్టీలో పరిణామాలపై పన్నీరు సెల్వం ఈసీకి ఫిర్యాదు చేశారనే.. సమాచారంతో పళని శిబిరం వ్యూహాలకు పదును పెట్టింది. ఇక, గత వారం జరిగిన అన్నాడీఎంకే సర్వ సభ్య సమావేశంలో కోర్టు ధిక్కారం జరిగినట్టు హైకోర్టులో మంగళవారం పిటిషన్ దాఖలైంది. అన్నాడీఎంకేలో పన్నీరు సెల్వం, పళని స్వామి మధ్య నెలకొన్న వివాదం బుల్లి తెర ధారావాహికను తలపించే విధంగా మలుపులతో ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. తనకు వ్యతిరేకంగా పళని శిబిరం దూకుడు పెంచడంతో ఎత్తుకు పైఎత్తు వేసే పనిలో పన్నీరు సెల్వం ఉన్నారు. అన్నాడీఎంకేలో తాజాగా చోటు చేసుకున్న వివాదాలు, సమన్వయ కమిటీ కన్వీనర్ అనుమతి లేకుండా జూలై 11న మరో మారు సర్వసభ్య సమావేశానికి ఏర్పాట్లు చేయడం వంటి పరిణామాలను వివరిస్తూ పన్నీరు సెల్వం కేంద్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఆ సమావేశాన్ని అడ్డుకోవడమే కాకుండా, రెండాకుల చిహ్నాన్ని మరోమారు స్తంభింపజేయడానికి తగ్గ వ్యూహాల్లో పన్నీరు ఉన్నట్టు ప్రచారం జోరందుకుంది. ఇది కాస్త పళని శిబిరంలో కలవరాన్ని రేపినా, సమర్థంగా ఎదుర్కొనేందుకు తగిన వ్యూహాలకు మద్దతుదారులు పదును పెట్టారు. సర్వసభ్య సమావేశానికి ఎలాంటి ఆటంకం కలగకుండా, పార్టీలో పన్నీరు రూపంలో ఎదురు అవుతున్న పరిణామాలను ఎన్నికల కమిషన్కు వివరించేందుకు తగ్గ నివేదిక సిద్ధం చేసే పనిలో పళని మద్దతు నేతలు ఉండటం విశేషం. అదే సమయంలో శ్రీవారు వెంకటాచలపతి ప్యాలెస్ వేదికగా సర్వసభ్య సమావేశం జరిగి తీరుతుందని అన్నాడీఎంకే ప్రిసీడియం చైర్మన్ తమిళ్ మగన్ హుస్సేన్ మంగళవారం ప్రకటించారు. పెరిగిన బలం పళనిస్వామికి రోజురోజుకూ బలం పెరుగుతోంది. పన్నీరు సెల్వం వెన్నంటి ఉన్న వారిలో 9 మంది సర్వ సభ్య సమావేశం సభ్యులు మంది మంగళవారం పళనికి జై కొట్టారు. అన్నాడీఎంకేలో మొత్తం 2,665 మంది సర్వసభ్య సమావేశం సభ్యులు ఉండగా, 2,432 మంది పళని వైపు ఉన్నారు. ఇదిలా ఉండగా, పన్నీరు సెల్వం మద్దతు దారులు తనపై దాడిచేశారని వ్యాసార్పాడికి చెందిన పళనిస్వామి మద్దతిస్తున్న మారిముత్తు పోలీసుల్ని ఆ›శ్రయించారు. దీంతో పన్నీరు సెల్వం మద్దతుదారులు 10 మందిపై కేసు నమోదైంది. కాగా, గత వారం జరిగిన అన్నాడీఎంకే సర్వ సభ్య సమావేశంలో కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు.. పిటిషన్ దాఖలైంది. షణ్ముగం అనే సర్వసభ్య సమావేశం సభ్యుడు ఈ పిటిషన్ దాఖలు చేశారు. సమావేశ నిర్వహణకు కోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు, సూచనల్ని అన్నాడీఎంకే వర్గాలు విస్మరించినట్టు పేర్కొంటూ ఈ పిటిషన్ దాఖలు చేశారు. నియోజకవర్గాల్లో చిన్నమ్మ పురట్చి పయనం అన్నాడీఎంకేలో పరిణామాల నేపథ్యంలో దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళ కూడా వ్యూహాలకు పదును పెట్టిన విషయం తెలిసిందే. కేడర్ను తన వైపునకు తిప్పుకునే విధంగా పురట్చి పయనానికి తిరుత్తణి వేదికగా ఆమె శ్రీకారం చుట్టారు. ఈ పర్యటనను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు తగ్గ రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నారు. కరూర్ నుంచి నియోజకవర్గాల వారీగా తన పర్యటన సాగే విధంగా చిన్నమ్మ పర్యటన ఏర్పాట్లు చేసుకుంటుండటం గమనార్హం. చదవండి: HYD: మోదీ పర్యటనకు భారీ భద్రత.. ‘సాలు మోదీ.. సాలు దొర’ ఫ్లెక్సీ వార్ -
ఢిల్లీలో ‘రెండాకుల’ పంచాయితీ
సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకేలో ఆధిపత్యపోరు ముదిరింది. ఆ పార్టీలో నెలకొన్న రాజకీయ పంచాయితీ హస్తినకు చేరుకుంది. ఎడపాడి ఎత్తుగడలను అడ్డుకునేలా ఢిల్లీలో ఎన్నికల కమిషన్కు ఓపీఎస్ శుక్రవారం వినతిపత్రం సమర్పించారు. అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్గా ఓ పన్నీర్సెల్వం, కో కన్వీనర్గా ఎడపాడి పళనిస్వామి నేతృత్వంలో గత కొన్నేళ్లుగా సాగుతున్న ధ్వంధ నాయకత్వానికి తెరదించే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఇదే అదనుగా ఏక నాయకత్వం నినాదాన్ని ఎడపాడి పళనిస్వామి తెరపైకి తెచ్చారు. ఈ వ్యవహారాన్ని పన్నీర్సెల్వం తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. సుమారు పదిరోజులకు పైగా సాగిన ఈ ఆధిపత్యపోరు గురువారం జరిగిన సర్వసభ్య సమావేశంలో విశ్వరూపం దాల్చింది. మెజారిటీ కార్యవర్గం ఎడపాడికి మద్దతుగా నిలవడంతో పన్నీర్ వేసిన పాచికలు పారలేదు. తనకు అనుకూలంగా ఓపీఎస్ రూపొందించిన 23 తీర్మానాలు ఆమోదం పొందక వీగిపోయాయి. ప్రిసీడియం శాశ్వత చైర్మన్గా తమిళ్మగన్ హుస్సేన్ ఎంపికైనట్లు గురువారం నాటి సమావేశంలో ఈపీఎస్ ప్రకటించారు. జూలై 11 వ తేదీన మరోసారి సర్వసభ్య సమావేశం నిర్వహించేలా ఈపీఎస్ వర్గానికి చెందిన మాజీ మంత్రి సీవీ షణ్ముగం చేసిన విజ్ఞప్తిని ప్రిసీడియం చైర్మన్ గురువారం నాటి సమావేశంలో అనుమతించారు. ఏక నాయకత్వంపై తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు సీవీ షణ్ముగం అదే వేదికపై ప్రకటించారు. రాజధానికి చేరుకున్న ఓపీఎస్ సర్వసభ్య సమావేశం మొత్తం ఈపీఎస్కు అనుకూలంగా మారడంతో కినుక వహించిన పన్నీర్సెల్వం తన మద్దతుదారులతో కలిసి వాకౌట్ చేశారు. అందరూ కలిసి గురువారం రాత్రే ఢిల్లీ విమానం ఎక్కేశారు. ప్రధాని మోదీ, కేంద్రహోం మంత్రి అమిత్షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలను కలిసి పార్టీలో నెలకొన్న పరిస్థితులను వారికి వివరించే ప్రయత్నాలు సాగిస్తున్నారు. అంతేగాక జూలై 11వ తేదీ సర్వసభ్య సమావేశం జరుపకుండా స్టే విధించాలని కోరుతూ చీఫ్ ఎలక్షన్ కమిషన్కు ఓపీఎస్ శుక్రవారం వినతిపత్రం సమర్పించారు. కన్వీనర్గా ఉన్న తన అనుమతి లేకుండా ప్రిసీడియం చైర్మన్ను ఎన్నుకున్నారని, ప్రధాన కార్యదర్శి పదవి లేనందున కన్వీనర్, కో కన్వీనర్ పదవులను ఏర్పాటు చేసుకున్నామని అందులో వివరించారు. ప్రధాన కార్యదర్శి పదవిని చట్టవిరుద్ధంగా పునరుద్ధరణకు ప్రయత్నాలు సాగుతున్నాయని ఈసీకి ఇచ్చిన వినతిపత్రంలో పేర్కొన్నారు. రాజీకి ససేమిరా వివాదాలను పక్కనపెట్టి సామరస్యం దిశగా ముందుకు సాగేలా ఓపీఎస్ వర్గం చేసిన ప్రతిపాదనను ఈపీఎస్ వర్గం తోసిపుచ్చింది. ఏక నాయకత్వాన్నే కోరుతున్నామని మరోమారు స్పష్టం చేసింది. ఢిల్లీ నుంచి పావులు కదిపేలా పన్నీర్సెల్వం చేస్తున్న ప్రయత్నాలకు గండికొట్టేందుకు ఎడపాడి పళనిస్వామి చెన్నైలో చట్ట నిపుణులతో శుక్రవారం చర్చలు జరిపారు. ఎత్తుకు పైఎత్తువేసి పన్నీర్ను పడగొట్టాలని మద్దతుదారులతో సమావేశమయ్యారు. కన్వీనర్, కో కన్వీనర్ల పదవీకాలం ముగిసినందున ప్రిసీడియం చైర్మన్ మాటే పార్టీలో చెల్లుబాటు అవుతుందని సీవీ షణ్ముగం మీడియాతో శుక్రవారం అన్నారు. పన్నీర్సెల్వం ప్రస్తుతం పార్టీ కన్వీనర్ కాదు, కోశాధికారి మాత్రమేనని వ్యాఖ్యానించారు. జనరల్బాడీ సభ్యుల నుంచి ఐదుశాతం హాజరీ ఉంటే సర్వసభ్య సమావేశాన్ని జరుపుకోవచ్చని ఆయన తెలిపారు. ఎడపాడి అనుమతిస్తే ఓపీఎస్ను కలిసి చర్చలు జరుపుతానని ప్రిసీడియం చైర్మన్ చెప్పారు. చదవండి: EPS - OPS Clash: పన్నీరు సెల్వంపైకి బాటిళ్లు విసిరిన ఈపీఎస్ వర్గీయులు -
అన్నాడీఎంకేలో ముదిరిన ఆధిపత్య పోరు.. నేనంటే నేనని..
సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంపై సర్వాధికారం తనదేనని, ప్రధాన కార్యదర్శిగా ఎడపాడిని అంగీకరించేది లేదని పన్నీర్సెల్వం పట్టుదలతో ఉన్నారు. మెజారిటీ శ్రేణులు తనవైపే ఉంటే పన్నీర్సెల్వం నాయకత్వం ఎలా సాధ్యమంటూ ఎడపాడి పళనిస్వామి మెట్టుదిగలేదు. ఎవరికివారు చేసుకుంటున్న సన్నాహాలతో అన్నాడీఎంకేలో ఆధిపత్యపోరు శుక్రవారం తీవ్ర రూపం దాల్చింది. అన్నాడీఎంకేను స్థాపించిన ఎంజీ రామచంద్రన్ ఆ పార్టీ తొలి అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఆయన మరణించిన తరువాత పార్టీ బాధ్యతలు చేపట్టిన జయలలిత ఎంజీఆర్ గౌరవార్థం అధ్యక్ష పదవిని అలాగే ఉంచి ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. జయ మరణం తరువాత ఎడపాడి, పన్నీర్సెల్వం సమ ఉజ్జీవులుగా మారారు. సమన్వయ కమిటీ కన్వీనర్గా ఓ పన్నీర్సెల్వం, కో–కన్వీనర్గా ఎడపాడి పళనిస్వామి పార్టీ బాధ్యతలను సమానంగా పంచుకున్నారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓడిపోయిన తరువాత పార్టీలో ఏక నాయకత్వం నినాదం తెరపైకి వచ్చింది. ఈనెల 23వ తేదీ పార్టీ జనరల్ బాడీ సమావేశం జరుగనున్న తరుణంలో ఎడపాడి పళనిస్వామికి అనుకూలంగా ఏక నాయకత్వం వివాదం విశ్వరూపం దాల్చింది. తిరువణ్ణామలైలో జరిగిన ఒక కార్యక్రమానికి ఎడపాడి పళనిస్వామి శుక్రవారం వెళ్లగా జిల్లా వ్యాప్తంగా ఆయనకు అనుకూలంగా బ్యానర్లు, ఫ్లెక్సీలు వెలిశాయి. ‘పార్టీ ప్రధాన కార్యదర్శికి స్వాగతం’ ‘పార్టీ శాశ్వత ప్రధాన కార్యదర్శి’ ‘అన్నాడీఎంకేకు వందేళ్లు మార్గదర్శకంగా నిలిచే నేత’ తదితర నినాదాలతో ఎడపాడి అనుచరులు ఫ్లెక్సీలు పెట్టడం కలకలం రేపాయి. అలాగే ఎడపాడి పళనిస్వామి సొంతూరైన ఎడపాడిలో ఓపీఎస్ నాయకత్వాన్ని బలపరుస్తూ పోస్టర్లు వెలిశాయి. పార్టీ జిల్లా కార్యదర్శులు, నిర్వాహకులను ఓపీఎస్, ఈపీఎస్ వేర్వేరుగా ఆహ్వానించి సమాలోచనలు జరిపేందుకు సన్నాహలు చేస్తున్నారు. అయితే ఇద్దరూ కలిసి తమను ఆహ్వానించడమే పార్టీకి శ్రేయస్కరమని కొందరు హితవుపలికారు. అన్నాడీఎంకే అంతర్గత వ్యవహారాల్లో తాము జోక్యం చేసుకునే ప్రశ్నే లేదని మిత్రపక్ష బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై తమ వైఖరిని స్పష్టం చేశారు. జయకు ద్రోహం చేస్తున్న ఎడపాడి: ఓపీఎస్ ప్రధాన కార్యదర్శి పదవిని ఎవరు చేపట్టినా అది జయలలితకు చేసిన ద్రోహమే అవుతుందని పరోక్షంగా ఎడపాడిని ఉద్దేశిస్తూ పన్నీర్సెల్వం గురువారం సాయంత్రం మీడియా ముందు కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు. అంతేగాక పార్టీకి తానే శాశ్వత ప్రధాన కార్యదర్శినని ప్రకటించినట్లుగా తెలిపారు. జయలలిత హయాంలో ప్రభుత్వం అనేక ఒడిదుడుకులు ఎదుర్కోగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి తానే ప్రభుత్వాన్ని నిలబెట్టానని పన్నీర్సెల్వం గుర్తు చేశారు. పార్టీ శ్రేణులు ఏక నాయకత్వాన్నే కోరుకుంటే అందుకు తానే అర్హుడినని పన్నీర్సెల్వం వాదిస్తున్నారు. వాస్తవానికి ప్రస్తుత పరిస్థితుల్లో ఏక నాయకత్వం అవసరం లేదని అన్నారు. అదే జరిగితే ఎలాంటిæ కారణాల చేత తనను పక్కనపెట్టేందుకు వీలులేదని చెప్పారు. పార్టీ చీలిపోకూడదని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. తన అంగీకారం లేనిదే పార్టీ సమావేశాల్లో చేసే ఎలాంటి తీర్మానం చెల్లదని ఎడపాడిని ఓపీఎస్ స్పష్టం చేశారు. అదే జరిగితే చట్టపరంగా ఎదుర్కొనేందుకు సిద్ధమని హెచ్చరించారు. స్పందించొద్దు: ఎడపాడి పన్నీర్ వైఖరి ఇలా ఉండగా ఎడపాడి పళనిస్వామి మరో కోణంలో నింపాదిగా అడుగులు వేస్తున్నారు. ఏక నాయకత్వం వ్యవహారం, పన్నీర్ చేస్తున్న ఆరోపణలపై స్పందించొద్దని తన అనుచరులను ఆదేశించారు. 23వ తేదీ జరిగే జనరల్బాడీ సమావేశంలో చూసుకుందామని అన్నారు. పార్టీలో పూర్తిస్థాయి పెత్తనం కోసం ఎడపాడి, పన్నీర్సెల్వం మధ్య అన్నాడీఎంకేలో 4 రోజులుగా రగులుతున్న రచ్చ రసకందాయంలో పడింది. ఎడపాడి దూకుడుకు కళ్లెం వేసేందుకు పన్నీర్సెల్వం తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. పార్టీపై తన వైఖరిని పన్నీర్సెల్వం మీడియా సమావేశం ద్వారా స్పష్టతనిచ్చారు. ఇరువురి మధ్య క్యాడర్ నలిగిపోతుండగా మాజీ ఎంపీ తంబిదురై ద్వారా సామరస్యపూర్వక సంధికి కొందరు పూనుకున్నారు. -
శశి‘కలకలం’.. రీఎంట్రీ కోసం చిన్నమ్మ చిచ్చు?
సాక్షి, చెన్నై: అమ్మ జయలలిత మరణానంతరం తమిళనాడు రాజకీయాల్లో అన్నాడీఎంకే పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. ఈ నేపథ్యంలో పార్టీని తిరిగి గాడిలో పెట్టాలన్నా.. బలోపేతం చేయాలన్నా చిన్నమ్మ శశికళకు పార్టీ బాధ్యతలు అప్పగించడం మేలన్న అభిప్రాయాన్ని పన్నీర్ సెల్వం వర్గం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో వర్గ పోరు చిచ్చు రాజుకుంది. అన్నాడీఎంకే బలోపేతానికి శశి‘కళ’ అనివార్యమనే గళం గట్టిగా వినిపిస్తోంది. వరుస పరాజయాల నుంచి గట్టెక్కాలంటే శశికళను పార్టీలో చేర్చుకోవడం మినహా గత్యంతరం లేదని తన అనుచరులద్వారా పన్నీర్సెల్వం సంకేతాలు పంపిస్తున్నారు. ఈ క్రమంలోనే తేని జిల్లా పెరియకుళం కైలాసపట్లిలో పలువురు నేతలు సమావేశమై శశికళ రీ-ఎంట్రీ తీర్మానం చేశారు. అయితే వాళ్లు పాల్గొన్న వేదిక.. అన్నాడీఎంకే సమన్వయకర్త పన్నీర్ సెల్వానికి చెందిన ఫామ్హౌస్ కావడం విశేషం. ఎడపాడి అలక? బుధవారం శశికళ, ఆమె మేనల్లుడు దినకరన్ రీఎంట్రీకి తీర్మానం చేయడం, ఇందుకు ఎడపాడి పళనిస్వామి విముఖత ప్రదర్శించడం తీవ్రస్థాయిలో చర్చనీయాంశమైంది. అన్నాడీంకేను అన్నీతానై నడిపించిన జయలలిత 2016 డిసెంబర్లో కన్నుమూసిన తరువాత పన్నీర్సెల్వం సీఎం బాధ్యతలు చేపట్టారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళను ఎన్నుకున్నారు. అయితే సీఎం పదవిపై కన్నేసిన శశికళ ఆ కుర్చీ నుంచి పన్నీర్సెల్వంను బలవంతంగా తప్పించి శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ పిలువకపోవడం, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష పడడంతో శశికళ ఆశలు అడియాశలయ్యాయి. జైలు కెళ్లేముందు ఎడపాడి పళనిస్వామిని ఆమె సీఎం కుర్చీలో కూర్చోబెట్టి పార్టీ బాధ్యతలను మేనల్లుడు టీటీవీ దినకరన్కు అప్పగించింది. శశికళపై తిరుగు బాటు చేసి సొంతపార్టీ పెట్టుకున్న పన్నీర్సెల్వం.. మరలా ఎడపాడితో జట్టుకట్టి(సొంత పార్టీని విలీనం చేసి) ఉప ముఖ్యమంత్రిగా మారారు. పార్టీ కన్వీనర్, కో– కన్వీనర్లుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఈపీఎస్, ఓపీఎస్ ఇద్దరూ కలిసి శశికళ, టీటీవీ దినకరన్ను పార్టీ నుంచి బహిష్కరించారు. ఓటమి తరువాత ఎడముఖం.. పెడముఖం గడిచిన అసెంబ్లీ ఎన్నికల వరకు ఒకరికొకరుగా సాగిన ఎడపాడి, పళనిస్వామి, పార్టీ పరాజయం తరువాత ఎడముఖం, పెడముఖంగా మారిపోయారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, డీఎండీకే, పీఎంలను కూటమిలో కలుపుకుని పోటీకి దిగినా అన్నాడీఎంకేకు కేవలం ఒక్కస్థానమే దక్కింది. ఇక గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వం చేజారిపోయింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం పరాజయం వెంటాడింది. జనాకర్షణ లేకనే పార్టీ వరుస పరాజయాల ఎదుర్కొంటోందని కొందరు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో పన్నీర్సెల్వం అధ్యక్షతన బుధవారం తేనీలో జరిగిన పార్టీ సమావేశంలో శశికళను మళ్లీ పార్టీలో చేర్చుకోవాలని తీర్మానం చేయడం కలకలం రేపింది. ఈ నిర్ణయంపై ఎడపాడి వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. గత రెండేళ్లుగా పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగే సమావేశాల్లో ‘శశికళ వర్గంతో సంబంధం పెట్టుకుంటే వేటు తప్పదు’ అని ఎడపాడి, పన్నీర్ హెచ్చరికలు జారీచేశారు. మరిప్పుడు సాక్షాత్తూ పార్టీ కన్వీనర్ పన్నీర్సెల్వమే చినమ్మ, దినకరన్కు స్వాగతం పలకడాన్ని కొందరు జీర్ణించుకోలేకున్నారు. మరి కొందరు సమర్ధిస్తున్నారు. పార్టీ అధిష్టానం తీసుకు నే నిర్ణయాలకు కట్టుబడి ఉంటామని మాజీ మంత్రి కడంబూరు రాజా, శశికళ ప్రవేశం వల్ల పార్టీలో మ రింత గందరగోళ పరిస్థితులు ఏర్పడుతాయని అ న్నాడీఎంకే ఎమ్మెల్యే అరుణ్మొళి దేవన్ వ్యాఖ్యానించారు. అన్నాడీఎంకే సారథ్యం సరిగా లేదు, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగంతో విలీనమై పార్టీని దినకరన్ నడిపించాలని మాజీ ఎమ్మెల్యే ఆరుకుట్టి సూచించారు. పళనివర్గం అత్యవసర సమావేశం పార్టీలో చకచకా మారుతున్న పరిణామాలను గమ నిస్తున్న ఎడపాడి పళనిస్వామి మాజీ మంత్రులు, సీనియర్ నేతలతో సేలంలో గురువారం అత్యవసరంగా సమావేశమయ్యారు. ఈ సమాచారం అందుకున్న మీడియా ప్రతినిధులు అక్కడికి చేరుకోగా బందోబస్తులో ఉన్న పోలీసు సిబ్బంది వారిని అడ్డుకుని పంపివేశారు. పార్టీలో సమ ఉజ్జీలుగా సాగుతున్న ఎడపాడి, పళనిస్వామి మధ్య గత కొంతకాలంగా సాగుతున్న విభేదాలు తాజా పరిణామాలతో మరింత రాజుకునే అవకాశం ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ దారుణ ఓటమి చెందింది. ఈ నేపథ్యంలో పార్టీని తిరిగి గాడిలో పెట్టాలంటే శశికళకు పార్టీ బాధ్యతలు అప్పగించడం మేలన్న అభిప్రాయాన్ని అటు నేతలు, ఇటు కార్యకర్తలు వెల్లడిస్తున్నారు. పన్నీర్ సెల్వం సమక్షంలో ఆమోదించిన ఈ తీర్మానంపై ఎడప్పాడి వర్గం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. శుక్రవారం జిల్లా కార్యనిర్వాహక మండలి సమావేశం జరుగుతుండగా.. పళని వర్గం ప్రత్యేకంగా సమావేశమై చర్చించనుంది. ఈ విషయంలో ఎడప్పాడి వర్గం సానుకూలంగా స్పందించి శశికళను తిరిగిపార్టీలోకి తీసుకుంటే తమిళ రాజకీయాలు మళ్లీ వేడెక్కడం ఖాయం. -
లైన్ క్లియర్.. పన్నీరు, పళనిలకు భారీ ఊరట
సాక్షి, చెన్నై (తమిళనాడు): అన్నాడీఎంకే సమన్వయ కమిటీ ఎన్నికలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ మద్రాసు హైకోర్టులో తిరస్కరణకు గురైంది. దీంతో కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వం, కో–కన్వీనర్ పళని స్వామిలకు ఊరట లభించింది. అలాగే బీజేపీ ఎమ్మెల్యే వానతీ శ్రీనివాసన్ గెలుపుకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ సైతం తిరస్కరణకు గురైంది. అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్, కో–కన్వీనర్ ఎంపికకు ఈనెల మొదటి వారంలో నామినేషన్ల ప్రక్రియ సాగింది. ఈ పదువులకు ఆ పార్టీ నేతలు పన్నీరు సెల్వం, పళని స్వామిలు తప్పా, ఇతరులెవ్వరూ నామినేషన్లు వేయడానికి వీలు లేకుండా అన్నాడీఎంకే వర్గాలు ముందుకు సాగాయి. చిరవకు ఈ వ్యవహారం మద్రాసు హైకోర్టుకు చేరడంతో ఆ ఇద్దరు నేతలు ఏకగ్రీవంగా ఎంపికైనట్టు ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో హోసూరుకు చెందిన అన్నాడీఎంకే నాయకుడు జయచంద్రన్ మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశారు. నిబంధనలకు విరుద్ధంగా సంస్థాగత ప్రక్రియలు జరిగినట్టు, ఈ ఇద్దరి ఎంపికను ధ్రువీకరించకుండా ఎన్నికల కమిషన్ను ఆదేశించాలని కోరారు. ఈ పిటిషన్ మంగళవారం హైకోర్టులో విచారణకు వచ్చింది. వాదనల అనంతరం ఒక పార్టీకి సంబంధించి సంస్థాగత వ్యవహారాలు, ఇందుకు సంబంధించి ఎన్నికల కమిషన్కు ప్రత్యేక ఉత్తర్వులు ఇచ్చేందుకు తగ్గ జోక్యం కోర్టుకు లేదని పేర్కొంది. ఈ పిటిషన్ విచారణ యోగ్యం కాదని తిరస్కరించింది. దీంతో పన్నీరు, పళని ఎన్నికకు లైన్ క్లియర్ అయింది. వానతీ శ్రీనివాసన్ గెలుపు బీజేపీ మహిళా విభాగం జాతీయ అ«ధ్యక్షురాలు వానతీ శ్రీనివాసన్ అసెంబ్లీ ఎన్నికల్లో కోయంబత్తూరు దక్షిణం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే. ప్రత్యర్థి మక్కల్ నీది మయ్యం నేత కమలహాసన్పై ఆమె 1,600 ఓట్లతో గెలిచారు. అయితే ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరిగాయంటూ ఆ నియోజకవర్గంలో పోటీచేసిన స్వ తంత్ర అభ్యర్థి రాహుల్ గాంధీ మద్రాసు హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ మంగళవారం న్యాయమూర్తి భారతీ దాసన్ నేతృత్వంలోని బెంచ్ ముందు విచారణకు వచ్చింది. ఆధారాలు లేకపోవడం, ఇతర అభ్యర్థులు ఎలాంటి ఆరోపణలు చేయకపోవడం వంటì అంశాలను పరిగణించిన కోర్టు పిటిషన్ విచారణను తిరస్కరించింది. చదవండి: వామ్మో.. లోదుస్తుల్లో బంగారం.. -
అమ్మకు ఘన నివాళి.. మెరీనా తీరంలో ఉద్రిక్తత
సాక్షి, చెన్నై(తమిళనాడు): దివంగత ముఖ్యమంత్రి అమ్మ జయలలిత ఐదో వర్ధంతిని రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం ఘనంగా నిర్వహించారు. వాడవాడల్లో అన్నాడీఎంకే, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేతలు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మ సమాధి సాక్షిగా కుట్రలను భగ్నం చేస్తామని అన్నాడీఎంకే సమన్వయ కమిటీ పెద్దలు పన్నీరు సెల్వం, పళని స్వామి ప్రతిజ్ఞ చేశారు. గెలుపే లక్ష్యంగా అందరం ఏకం అవుదామని చిన్నమ్మ శశికళ పిలుపునిచ్చారు. ఇరు వర్గాలు అమ్మ సమాధి సాక్షిగా బల ప్రదర్శనకు దిగడంతో మెరీనా తీరంలో ఉద్రిక్తత నెలకొంది. పోటాపోటీ.. అన్నాడీఎంకే నేతలు వాడవాడల్లో జయలలిత విగ్రహాలు, చిత్రపటాలకు నివాళులర్పించారు. పలుచోట్ల సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తామేమి తక్కువ తిన్నామా..? అన్నట్టుగా అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం వర్గాలు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహించాయి. సమాధి వద్ద నివాళులు మెరీనా తీరంలోని అమ్మ సమాధి వద్దకు నేతలు క్యూకట్టారు. అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వం, కో కన్వీనర్ పళనిస్వామి, ప్రిసీడియం(తాత్కాలిక) చైర్మన్ తమిళ్ మగన్ హుస్సేన్ నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేలు, ప్రతినిధులు పెద్దఎత్తున తరలివచ్చారు. నల్ల చొక్కాలు ధరించిన నేతలు అమ్మ సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు. అమ్మ సేవలను గుర్తు చేస్తూ ఆమె ఆశయ సాధన లక్ష్యంగా అందరి చేత పన్నీరు సెల్వం ప్రతిజ్ఞ చేయించారు. అన్నాడీఎంకేను కైవశం చేసుకునేందుకు పగటి కలలు కంటున్న వారి కుట్రలను భగ్నం చేస్తామని అమ్మ సమాధి సాక్షిగా ప్రతిజ్ఞ చేశారు. అమ్మకు నివాళులర్పించినానంతరం ఎంజీఆర్ సమా«ధి వద్దకు నేతలు వెళ్లడం సహజం. అయితే ఈసారి ఎంజీఆర్ను మరిచారు. అటు వైపుగా వెళ్లకుండానే నేతలు వెళ్లిపోవడం గమనార్హం బల ప్రదర్శనకు వేదికగా.. మెరీనా తీరంలోని అమ్మ సమాధి సాక్షిగా వర్ధంతి కార్యక్రమాన్ని అన్నాడీఎంకే, అమ్మమక్కల్ మున్నేట్ర కళగం వర్గాలు బల ప్రదర్శనకు వేదికగా చేసుకున్నాయి. దీంతో మెరీనా తీరంలో ఉద్రిక్తత నెలకొంది. పన్నీరు, పళని నివాళులర్పించి వెళ్తున్న సమయంలో ఏఎంఎంకే నేతలు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారి తీశాయి. పళని స్వామి వాహనంపై గుర్తుతెలియని వ్యక్తులు చెప్పులు, రాళ్లు విసరడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఇరు వర్గాలు పోటాపోటీ నినాదాలతో హోరెత్తించారు. దినకరన్ మద్దతుతో కొందరు దాడులకు ప్రయత్నించారని అన్నాడీఎంకే నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దినకరన్ ఓపెన్ టాప్ వాహనంలో ప్రచారానికి వెళ్తున్నట్టుగా మద్దతుదారులతో తరలిరావడం గమనార్హం. కన్నీటితో చిన్నమ్మ ప్రతిజ్ఞ జయలలిత నెచ్చెలి శశికళ సమాధి వద్దకు చేరుకుని అంజలి ఘటించారు. ఆమె వెన్నంటి మద్దతుదారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గెలుపే లక్ష్యంగా ప్రత్యర్థులను ఓడించడం కోసం అందరం ఏకం అవుదామని అమ్మ సమాధి వద్ద ప్రతిజ్ఞ చేస్తూ అన్నాడీఎంకే వర్గాలకు పరోక్షంగా చిన్నమ్మ పిలుపునిచ్చారు. ఈ సమయంలో ఆమె ఉద్వేగానికి గురై కన్నీటి నివాళులర్పించారు. అనంతరం అమ్మ మక్కల్మున్నేట్ర కళగం నేత దినకరన్ సమాధి వద్దకు చేరుకుని అంజలి ఘటించారు. -
మదురైలో మంతనాలు .. వేడెక్కిన అన్నాడీఎంకే రాజకీయం
సాక్షి, చెన్నై(తమిళనాడు): చిన్నమ్మ శశికళ రాజకీయ దూకుడు పెరగడంతో.. అన్నాడీఎంకేలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. చిన్నమ్మ ప్రతినిధిగా ముద్ర పడ్డ అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత దినకరన్తో పన్నీరుసెల్వం సోదరుడు రాజ భేటీ కావడం చర్చకు దారితీసింది. ఈ వ్యవహారాలతో సేలంలో ఉన్న పళనిస్వామి హుటాహుటిన గురువారం రాత్రి చెన్నైకు చేరుకున్నారు. ఇక చిన్నమ్మ శశికళను పార్టీలోకి మళ్లీ ఆహ్వానించే విషయంపై అన్నాడీఎంకే సమన్వ య కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వం చేసిన వ్యాఖ్యలకు రోజురోజుకూ మద్దతు పెరుగుతోంది. ఆయన వ్యాఖ్యలను సమర్థిస్తూ, మాజీ మంత్రి సెల్లూరు రాజుతో సహా పలువురు అన్నాడీఎంకే నేత లు గురువారం ప్రకటనలు చేశారు. దీంతో చిన్నమ్మ వ్యవహారం అన్నాడీఎంకేలో హట్టాఫిక్గా మారింది. ఈ వ్యవహారాలు ఓ వైపు ఉంటే, మరోవైపు చిన్నమ్మ రాజకీయ మంతనాలు ఊపందుకున్నాయి. బుధవారం నుంచి గురువారం మధ్యాహ్నం వరకు తంజావూరులో ఉన్న ఆమెను పలువురు నేతలు కలిసి మాట్లాడినట్టు తెలిసింది. దినకరన్ ఇంటి శుభ కార్యక్రమానికి చిన్నమ్మ హాజరు కావడం, అక్కడికి అమ్మ మక్కల్ మున్నేట్ర కళగంతో పాటుగా దక్షిణ తమిళనాడులో వివిధ సామాజిక వర్గాలకు చెందిన నేతలు, సన్నిహితులు రావడం చర్చనీయాంశమైంది. భేటీపై ఆసక్తి తంజావూరు పర్యటన ముగించుకుని మదురైకు గురువారం మధ్యాహ్నం చిన్నమ్మ వెళ్లారు. అక్కడ జరిగిన ఓ కార్యక్రమం అనంతరం ముఖ్య నేతలతో శశికళ భేటీ అయ్యారు. దక్షిణ తమిళనాడులోని దేవర్ సామాజిక వర్గాన్ని ఏకం చేసే రీతిలో, తనకు సన్నిహితంగా, మద్దతుగా ఉన్న అన్నాడీఎంకే మాజీలతో ఈ సంప్రదింపులు జరిగినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ముందుగా ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లే విధంగా చిన్నమ్మ శశికళ వ్యూహాలకు పదును పెట్టారని చెప్పవచ్చు. తాను పయనిస్తున్న మార్గంలో రైతులతో ముచ్చటిస్తూ, పంట పొలాల్లోకి వెళ్లి పలకరిస్తూ ముందుకు సాగారు. చెన్నైకు పళని స్వామి.. అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కో కన్వీనర్ పళనిస్వామి సేలం నుంచి గురువారం రాత్రి చెన్నైకు చేరుకున్నారు. చిన్నమ్మ రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన సైతం వ్యూహ రచనల్ని వేగవంతం చేశారు. ఇక, చిన్నమ్మకు మద్దతు గళం పెరుగుతున్న నేపథ్యంలో దినకరన్తో పన్నీరు సోదరుడు రాజ భేటీ కావడాన్ని తీవ్రంగానే పరిగణించారు. అదే సమయంలో మనస్సు నొప్పించే విధంగా ఇతరులపై వ్యాఖ్య లు చేయవద్దు అని తన మద్దతు దారులకు పళని స్వామి హితవు పలికినట్టు సమాచారం. ఇదిలా ఉండగా, పళనిస్వామి కేవలం వైద్య చికిత్స కోసం చెన్నైకు వచ్చారేగానీ, రాజకీయ వ్యూహాలకు పదును పెట్టేందుకు కాదంటూ ఆయన వర్గీయులు పేర్కొనడం గమనార్హం. చదవండి: మంత్రి వర్గంలో సంస్కార హీనులు -
అన్నాడీఎంకేలో మళ్లీ కోల్డ్ వార్.. ‘పళని’ ఎత్తు.. ‘పన్నీరు’ పైఎత్తు
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వం, కో– కన్వీనర్ పళని స్వామి మధ్య మళ్లీ అంతర్గత పోరు తెర మీదకు వచ్చింది. అన్నాడీఎంకే కైవసమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న చిన్నమ్మ శశికళ దూకుడు, పార్టీని కాపాడుకునేందుకు పన్నీరు, పళని సారథ్యంలోని సమన్వయ కమిటీ సాగిస్తున్న కుస్తీల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, హఠాత్తుగా సోమవారం సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వం చిన్నమ్మ శశికళ నామస్మరణను అందుకోవడం చర్చకు దారి తీసింది. చిన్నమ్మను ఆది నుంచి పళని స్వామితో పాటుగా సీనియర్లు వ్యతిరేకిస్తున్న తరుణంలో, అందరితో చర్చించి చిన్నమ్మ విషయంలో నిర్ణయం తీసుకుంటామని పన్నీరు సెల్వం వ్యాఖ్యానించడంలో ఆంతర్యాన్ని పసిగట్టే పనిలో రాజకీయ విశేష్లకులు నిమగ్నమయ్యారు. ( చదవండి: అన్నాడీఎంకే కైవసమే లక్ష్యంగా చిన్నమ్మ పయనం.. దినకరన్ మద్దతు ) టార్గెట్.. ప్రధాన కార్యదర్శి పదవి తానే ప్రధాన కార్యదర్శి అని శశికళ స్పష్టం చేస్తూ వస్తున్న తరుణంలో ఆ పదవి విషయంలో కీలక నిర్ణయం తీసుకునేందుకు పళని రచించిన వ్యూహం మంగళవారం రాజకీయ వర్గాల ద్వారా వెలుగులోకి వచ్చింది. డిసెంబర్లో అన్నాడీఎంకే కార్యవర్గం, సర్వసభ్య సమావేశం నిర్వహించి, రద్దు చేసిన ఆ పదవిని మళ్లీ పునరుద్ధరించి, చేజిక్కించుకునేందుకు పళని వ్యూహాలకు పదును పెట్టినట్టు సంకేతాలు వెలువడ్డాయి. జంట నాయకత్వాన్ని పక్కన పెట్టి, ఏకాధిప్యతం లక్ష్యంగా సీనియర్లతో పళని రహస్య మంతనాలు చేస్తున్న విషయం పన్నీరు దృష్టికి రావడంతోనే హఠాత్తుగా చిన్నమ్మను జపాన్ని ఆయన తెర మీదకు తెచ్చినట్టు సమాచారం. ప్రధాన కార్యదర్శి పదవి తన గుప్పెట్లోకి వచ్చిన తరువాత.. చిన్నమ్మ దూకుడుకు కళ్లెం వేయవచ్చన్న ధీమాతో పళని ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమయంలో ఎత్తుకు పైఎత్తు అన్నట్టుగా చిన్నమ్మ నినాదాన్ని పన్నీరు అందుకున్నట్టు అన్నాడీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి. చిన్నమ్మ పర్యటన ఓవైపు అన్నాడీఎంకేలో అంతర్గత కుమ్ములాట మళ్లీ తెర రాగా, మరోవైపు కేడర్లోకి చొచ్చుకు వెళ్లేందుకు చిన్నమ్మ దృష్టి పెట్టారు. మంగళవారం చెన్నై నుంచి ఆమె తంజావూరుకు బయలుదేరి వెళ్లారు. అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం వర్గాలే కాకుండా, మద్దతుదారులు ఆమెకు బ్రహ్మరథం పట్టడం గమనార్హం. మూడు రోజుల పాటుగా ఆమె తంజావూరు, మదురై, రామనాథపురంలో పర్యటించనున్నారు. చదవండి: Vijayakanth: నా ఆరోగ్యం క్షీణించిన విషయం నిజమే.. అంత మాత్రాన.. -
AIADMK: ‘ఓపీఎస్.. ఒకే నాయకత్వం’
అన్నాడీఎంకే అధికారం కోల్పోయిన నాటి నుంచి తరచూ వార్తల్లోకి ఎక్కుతోంది. జంట నాయకత్వం వద్దు, ఒకే నాయకత్వం కావాలి అంటూ మాజీ ఉప ముఖ్యమంత్రి ఓ పన్నీర్సెల్వం వర్గం మరోసారి నిరసన గళం విప్పి వివాదానికి తెరదీసింది. సాక్షి ప్రతినిధి, చెన్నై: 2011, 2016 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది అన్నాడీఎంకే పార్టీ పదేళ్ల పాటు అధికారంలో కొనసాగింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైంది. జయలలిత మరణం తరువాత పార్టీ ఇద్దరి (ఓపీఎస్, ఈపీఎస్) సారధ్యంలోకి వెళ్లింది. మూడోసారి గెలవడం ద్వారా హాట్రిక్ కొట్టగలమని ధీమా వ్యక్తం చేస్తూ ఎన్నికల బరిలోకి దిగినా అధికారం డీఎంకే చేతుల్లోకి వెళ్లిపోయింది. ఆనాటి నుంచి ఓటమితో కుంగిపోయిన పార్టీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఎన్నికల అనంతరం జరిగిన తొలి సమావేశంలో అన్నాడీఎంకే సమన్వయకర్త, మాజీ ఉప ముఖ్యమంత్రి పన్నీర్సెల్వం, ఉప సమన్వకర్త, మాజీ ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి మధ్య అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేత పదవి కోసం పోటీ నెలకొంది. తీవ్ర ఉత్కంఠ పరిస్థితుల నడుమ ప్రధాన ప్రతిపక్షనేతగా ఎడపాడి ఎన్నిక ఏకగ్రీవమైంది. ఉప నేతగా పన్నీర్సెల్వం పేరును ఎడపాడి ప్రతిపాదించారు. అధికారంలో ఉన్నా లేకున్నా నెంబర్ టూగా ఉండాలా అంటూ నిరాకరించిన పన్నీర్సెల్వం సీనియర్ నేతల బుజ్జగింపుల తరువాత ఒప్పుకున్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం చెన్నై రాయపేటలోని ప్రధాన కార్యాలయంలో కార్యదర్శుల సమావేశం జరిగింది. పార్టీ సంస్థాగత ఎన్నికలు, ప్రతిపక్ష పార్టీగా భవిష్యత్ కార్యక్రమాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునేందుకు పన్నీర్, ఎడపాడి సమక్షంలో అంతా సమావేశమయ్యారు. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు ఓపీఎస్ పార్టీ కార్యాలయ ప్రాంగణంలో అడుగుపెట్టగానే ‘పార్టీకి ఏక నాయకత్వం ఉండాలి’ అంటూ ఆయన వర్గం నేతలు నినాదాలు చేయడం కలకలం రేపింది. ఈ నినాదాలు చేసిన తన వర్గం నేతలను పన్నీర్సెల్వం వారించనూ లేదు, ప్రోత్సహించనూ లేదు. అందరికీ నమస్కరిస్తూ లోనికి వెళ్లిపోయారు. ఆరు తీర్మానాలు కాగా సంస్థాగత ఎన్నికలు, పార్టీ పరంగా భవిష్యత్ కార్యాచరణపై కొద్దిసేపు చర్చించిన పార్టీ అధినేతలు ఈ సందర్భంగా ఆరు తీర్మానాలు చేశారు. కావేరి నదీజలాల వాటా విషయంలో తమిళనాడు హక్కులను రాష్ట్ర ప్రభుత్వం కాపాడాలి, మేఘధాతు ఆనకట్ట నిర్మాణాన్ని అడ్డుకోవాలి, వరి ధాన్యాల కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వ జాప్యానికి ఖండన, కుటుంబ పెద్దకు రూ.1000ల హామీని నెరవేర్చకుంటే పోరాటం తదితర తీర్మానాల ఆమోదంతో సమావేశం ముగిసింది. -
AIADMK: ఉపనేత ఎంపికపై ఉడుంపట్టు
సాక్షి ప్రతినిధి, చెన్నై : శాసనసభాపక్ష ఉప నేత ఎన్నికపై తలెత్తిన భిన్నాభిప్రాయాలతో అన్నాడీఎంకేలో మరోసారి రసవత్తర రాజకీయాలకు తెరలేచింది. ఎప్పటిలాగే పార్టీ కో–ఆర్డినేటర్ పన్నీర్సెల్వం, డిప్యూటీ కో–ఆర్డినేటర్ ఎడపాడి పళనిస్వామి పరస్పరం ఢీకొంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకునేందుకు ఏర్పాటైన సమావేశంలో ఎడపాడి, పన్నీర్ పోటీపడ్డారు. నాలుగేళ్లు సమర్థవంతంగా ప్రభుత్వాన్ని నడిపించిన ఎడపాడినే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని ఆయన మద్దతుదారులు బహిరంగంగా గళం విప్పారు. పార్టీ అధినేతను కాబట్టి తానే సీఎం అభ్యర్థినని పన్నీర్సెల్వం పట్టుబట్టారు. పార్టీ ద్వితీయశ్రేణి నేతలు పన్నీర్సెల్వంను కలిసి పదిరోజులపాటు బుజ్జగించడంతో పట్టువీడారు. ఆ తర్వాత జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎడపాడిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో పన్నీర్సెల్వం తీవ్ర మనస్థాపం చెంది ఎడపాడిని అభినందించకుండానే సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే ప్రచారం చేశారు. ఎన్నికల్లో 65 సీట్లకే పరిమితం కావడంతో అన్నాడీఎంకేలో స్తబ్దత నెలకొంది. తాజాగా అసెంబ్లీ సమావేశాలు సమీపిస్తుండడంతో అన్నాడీఎంకేలో కదలిక వచ్చింది. శాసనసభాపక్ష నేతను ఎన్నుకునేందుకు అగ్రనేతలు, సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. ఈ సమయంలో మళ్లీ ఎడపాడి, పన్నీర్ మళ్లీ పోటీపడ్డారు. ఈ క్రమంలో నిర్ణయం తీసుకోకుండానే సమావేశం ముగిసిపోయింది. కొన్నిరోజుల తర్వాత నిర్వహించిన సమావేశంలో మెజార్టీ ఎమ్మెల్యేలు ఎడపాడి వైపే నిలవడంతో ఆయన పేరునే ఖరారు చేశారు. ‘టూ’ ఎంపికలో వన్ అండ్ టూ మళ్లీ ఢీ ఎన్నికలకు ముందు ఒకసారి, ఎన్నికలు ముగిసిన తర్వాత మరోసారి విభేదాలతో రచ్చకెక్కిన ఎడపాడి, పన్నీర్సెల్వం శాసనసభాపక్ష ఉప నేత ఎంపిక విషయంలో మూడోసారి పరోక్షంగా ముష్టియుద్దం సాగిస్తున్నారు. ఉప సభాపక్ష నేతగా పన్నీర్సెల్వంను ఎంపిక చేసుకోవాలని ఎడపాడి ఆశించారు. గత ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి, నేడు ప్రతిపక్షంలో ఉపనేత, తర్వాత పార్టీలో సైతం తనను ద్వితీయ స్థానానికి నెట్టే ప్రమాదం ఉందని అనుమానించిన పన్నీర్ సెల్వం అందుకు అయిష్టతను వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో శాసనసభాపక్ష ఉప నేత పదవికి ద్వితీయశ్రేణి నేతల్లో పోటీ ప్రారంభమైంది. ఎమ్మెల్యే వైద్యలింగం పట్ల పన్నీర్సెల్వం సుముఖుత వ్యక్తం చేస్తుండగా, దీన్ని ఎడపాడి వర్గీయులు వ్యతిరేకిస్తూ మాజీ మంత్రులు దిండుగల్లు శ్రీనివాసన్, నత్తం శ్రీనివాసన్ పేర్లను ప్రతిపాదించారు. వీరిద్దరూ ఎడపాడికి రబ్బర్స్టాంప్లా మారుతారనే విమర్శ రావడంతో మాజీ మంత్రి విజయభాస్కర్ పేరును సూచించారు. వైద్యలింగం మినహా మరెవరినీ అంగీకరించేది లేదని పన్నీర్సెల్వం భీష్మించుకుని కూర్చున్నారు. సీనియార్టీతోపాటు సామాజిక సమతుల్యం కూడా పాటించాలని కొందరు పేర్కొనడంతో కేపీ మునుస్వామి తదితరుల పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. ఎడపాడి, పన్నీర్సెల్వం ఏకాభిప్రాయానికి వస్తేగానీ ఉప నేత ఎంపిక వ్యవహారం కొలిక్కివచ్చే పరిస్థితి లేదు. చదవండి: ‘అన్నాడీఎంకే’ నా ఊపిరి: శశికళ -
అడ్డదారిలో సీఎం కాలేదు..
సాక్షి, చెన్నై: ప్రచారంలో ప్రధాన కూటముల సీఎం అభ్యర్థులు పళనిస్వామి, స్టాలిన్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఆదివారం సాగిన ప్రచారంలో పరస్పరం వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలు చేసుకున్నారు. మూడో కూటమి సీఎం అభ్యర్థి కమల్ కాలి గాయం వేధిస్తున్నా ప్రచారబాటలో పడ్డారు. అసెంబ్లీ ఎన్నికలకు రెండు వారాలే సమయం ఉండడంతో అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఆదివారం సెలవు కావడంతో జనం ఇళ్ల వద్దకే పరిమితం కావడాన్ని దృష్టిలో ఉంచుకుని ఇంటింటి ప్రచారం హోరెత్తింది. తమ నేతృత్వంలో గతంలో సాగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. డీఎంకే, అన్నాఎంకే పార్టీలు రూపొందించి మేనిఫెస్టో అంశాలతో కూడిన కరపత్రాల్లో పథకాలకు ప్రత్యేక ఆకర్షణ పేరిట ఒకే మహిళ ఫొటోను పొందు పరిచి ఉండడం అనేక చోట్ల గందరగోళం తప్పలేదు. అగ్రనేతలు ప్రచారంలో మాటల జోరు పెంచారు. అనేకచోట్ల అధికార అభ్యర్థులకు ప్రజల నుంచి వ్యతిరేకత రాగా, మరికొన్ని చోట్ల పుష్పాలతో ఆహ్వానాలు పలికిన ఓటర్లూ ఉన్నారు. అనేక జిల్లాల్లో భానుడు భగభగ మని ప్రతాపం చూపించినా, ఉక్క పోత నడుమ ప్రచారంలో అభ్యర్థులకు ముచ్చెమటలు తప్పలేదు. ద్రోహం పెను విషం.. కాంచీపురం జిల్లా పరిధిలోని ఉత్తర మేరు పరిసరాల్లో స్టాలిన్ ప్రచారం సాగింది. ఆయన మాట్లాడుతూ ప్రకృతి విలయాలు, కరోనా విపత్తుల సమయంలో కేటాయించాల్సిన నిధుల్ని సరిగ్గా ఇవ్వలేదని ఇప్పుడు మొసలి కన్నీళ్లు కారుస్తున్న వ్యక్తి, ఎందుకు బీజేపీతో తాజాగా పొత్తు పెట్టుకున్నారో అని ప్రశ్నించారు. పదవి ఇచ్చిన శశికళ గుండెల్లోనే తన్నిన వ్యక్తి పళని స్వామి అని పేర్కొన్నారు. పదే పదే తానేదో రైతు అని పళని జబ్బలు చరస్తున్నాడని, నిజంగా రైతే అయితే, ఎందుకు వ్యతిరేక చట్టాలకు మద్దతు ఇచ్చారో అని ప్రశ్నించారు. అడ్డదారిలో సీఎం కాలేదు.. తిరువణ్ణామలై జిల్లా ఆరణి, వందవాసిల్లో అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కో-కన్వీనర్ పళనిస్వామి సుడిగాలి పర్యటనతో ఓటర్ల వద్దకు వెళ్లారు. ప్రచార సభల్లో ఆయన ప్రసంగిస్తూ డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ను, కరుణానిధిని టార్గెట్ చేశారు. అన్నా మరణం తర్వాత నావలన్ నెడుం జెలియన్ సీఎం కావాల్సి ఉండగా, అడ్డదారిలో కరుణానిధి ఆ కుర్చీని కైవసం చేసుకున్నారని ధ్వజమెత్తారు. ఆయనలా తానేమి అడ్డదారిలో సీఎం కాలేదని, అన్నాడీఎంకే శాసన సభా పక్షం మద్దతుగా ఆ పదవిలో కూర్చున్నట్టు పేర్కొన్నారు. తాను రైతునని, అందుకే రైతు సంక్షేమం కోసం శ్రమిస్తున్నానని తెలిపారు. అయితే, తననే కాదు, రైతుల్ని కూడా కించ పరిచే విధంగా హేళన చేస్తూ స్టాలిన్ వ్యాఖ్యలు చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకసారి చరిత్రను ఆయన చూసుకుంటే మంచిదని, లేని పక్షంలో గట్టిగానే స్పందించాల్సి ఉంటుందని హెచ్చరించారు. వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలు చేస్తే, ప్రతి దాడికి తానూ రెడీ అని సవాల్ చేశారు. అన్నాడీఎంకేకు ప్రజలే వారసులని, అవినీతి పుట్ట డీఎంకేకు ఈ ఎన్నికల్లో మళ్లీ గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాలి నొప్పితోనూ.. మక్కల్ నీది మయ్యం నేత, కోయంబత్తూరు దక్షిణ నియోజకవర్గం అభ్యర్థి కమలహాసన్ గతంలో కాలికి శస్త్ర చికిత్స చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రచారంలో ఆయనకు ఇబ్బందిగా మారినట్టుంది. కాలి గాయం బాధిస్తున్నట్టుంది. అయినా, లెక్కచేయకుండా ప్రచారంలో దూసుకెళ్లే పనిలో పడ్డారు. ఆదివారం నియోజక వర్గం పరిధిలో ఉక్కడం పరిసరాల్లోని మైనారిటీలు అధికంగా ఉండే చోట్ల నడుచుకుంటూ కాసేపు, ఓపెన్ టాప్ వాహనంలో మరికాసేపు ప్రచారంలో ముందుకు సాగారు. డీఎంకేతో, బీజేపీతోగానీ తనకు ఎలాంటి సంబంధం లేదని, రాజకీయంగా తనను ఎదుర్కొనలేక ఈ విమర్శలు చేస్తున్నారని మైనారిటీల దృష్టికి కమల్ తీసుకెళ్లారు. తనకు కాషాయం రంగు పూయవద్దు అని విజ్ఞప్తి చేశారు. నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్, అమ్మ మక్కల్మున్నేట్ర కళగం నేత దినకరన్ ప్రచార సభలతో దూసుకెళుతున్నారు. చదవండి: చెత్తకుప్ప పక్కన ప్రముఖ విలన్.. చివరికి! -
ఎన్నికల వేళ బీజేపీకి షాకిచ్చిన తమిళనాడు సీఎం
చెన్నె: రహాస్య బంధాన్ని అసెంబ్లీ ఎన్నికల వేళ బహిరంగపరిచారు. అన్నాడీఎంకే, బీజేపీలు కలిసి ప్రస్తుతం జరగనున్న ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. పొత్తు కుదుర్చుకుని ఎన్నికలకు వెళ్లగా ఆదిలోనే అన్నాడీఎంకే బీజేపీకి షాకిచ్చింది. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి సీఏఏ విషయమై కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం జరిగిన ఓ సమావేశంలో పళనిస్వామి సీసీఏ రద్దు చేయాలని కేంద్రాన్ని కోరుతున్నట్లు స్పష్టం చేశారు. తమ ప్రభుత్వమే మైనార్టీలకు భద్రత కల్పిస్తుందని ప్రకటించారు. మైనార్టీలు తమను విజ్ఞప్తి చేశారని.. ఆ విజ్ఞప్తి మేరకు తాము సీఏఏ ఉపసంహరించుకోవడంపై కేంద్రాన్ని కోరుతామని పళనిస్వామి తెలిపారు. ఈ విషయమై తాము హామీ ఇస్తున్నట్లు చెప్పారు. సీఏఏ విషయమై తమ పార్టీ మానిఫెస్టోలో కూడా ప్రస్తావించినట్లు గుర్తుచేశారు. ఈ ప్రకటన బీజేపీకి షాక్కు గురి చేసింది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం సీఏఏ చట్టాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ చట్టం తప్పనిసరిగా అమలుచేయాలని భావిస్తోంది. ఈ సమయంలో అన్నాడీఎంకే తీసుకున్న ఈ నిర్ణయం బీజేపీకి నష్టం చేకూరుస్తుందని తెలుస్తోంది. డిసెంబర్ 22, 2019లో తీసుకువచ్చిన సీఏఏ చట్టం తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఈ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు చెలరేగిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ చట్టానికి దక్షిణాది రాష్ట్రాలు కూడా తీవ్రంగా వ్యతిరేకించాయి. అయితే మళ్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ అన్నాడీఎంకే ఈ చట్టం ప్రస్తావన తీసుకురావడం బీజేపీకి మింగుడు పడని విషయంగా భావించవచ్చు. అయితే ఈ ప్రకటన రావడానికి కారణం మొన్న స్టాలిన్ సీఏఏ చట్టాన్ని చెత్తకాగితంగా అభివర్ణించిన విషయం తెలిసిందే. శ్రీలంక తమిళులకు పౌరసత్వం ఇస్తామని హామీ ప్రకటించడంతో అన్నాడీఎంకే సీఏఏపై ఈ ప్రకటన చేసి ఉండవచ్చు. తమిళనాడులో ఏప్రిల్ 6వ తేదీన ఒకే విడతన ఎన్నికలు జరగనున్నాయి. చదవండి: కమల్హాసన్ ఆస్తులు ఎంతో తెలుసా..? చదవండి: కోటి రూపాయల్లేని ముఖ్యమంత్రి.. ఎవరాయన? -
నో ఎగ్జామ్స్.. వారంతా మళ్లీ పాస్!
చెన్నె: కరోనా మహమ్మారిపై పోరు కొనసాగుతున్న నేపథ్యంలో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 9, 10, 11వ తరగతి విద్యార్థుల పరీక్షలు రద్దు చేసి వారిని ప్రమోట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి గురువారం పరీక్షలు రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం తమిళనాడులో కరోనా రెండో దశ ప్రారంభమైనట్టు వైద్య నిపుణులు కొందరు చెప్తున్నారు. ప్రతిరోజూ అక్కడ పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతుండడంతో విద్యార్థుల పరీక్షలు రద్దు చేయాలని ప్రజలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యావేత్తలు విజ్ఞప్తి చేశారు. ఇక ప్రభుత్వ నిర్ణయంతో గతేడాదిలాగే ఈ ఏడాది కూడా విద్యార్థులు పరీక్షలు లేకుండానే పైతరగతులకు ప్రమోట్ కానున్నారు. కాగా, ఆయా రాష్ట్రాల్లో ఇటీవల కరోనా కేసులు పెరుగుతుండటంతో మహారాష్ట్ర, కేరళలో కూడా హైస్కూల్ పరీక్షలు రద్దు చేసే అవకాశం ఉంది. -
విద్యార్థులకు బంపరాఫర్.. 2జీబీ డేటా ఫ్రీ
సాక్షి, చెన్నై : విద్యార్థులకు ప్రతిరోజూ 2 జీబీ డేటాను తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి ఉచితంగా అందజేయనున్నారు. ఆన్లైన్ తరగతుల్లో పాల్గొనేందుకు వీలుగా ఈ ప్రకటన చేయడంతో విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు గత మార్చి 21వ తేదీ నుంచి లాక్డౌన్ ప్రకటించారు. దీంతో పాఠశాలలు, కళాశాలలు మూతబడ్డాయి. కరోనా నానాటికీ అధికమవుతున్నందున విద్యాసంస్థలను ప్రారంభించడంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో వార్షిక పరీక్షలు రద్దు చేసి ఆల్ పాస్ అని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రకటనను యూజీసీ, ఏఐసీటీఈ తీవ్రంగా ఖండించాయి. దీనికి సంబంధించిన కేసు న్యాయస్థానంలో పెండింగ్లో ఉంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 16 వర్సిటీల కళాశాల విద్యార్థులకు పరీక్షలు నిర్వహించేందుకు టైంటేబుల్ విడుదలైంది. దీంతో చెన్నై వర్సిటీ పదిరోజులుగా విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో లాక్డౌన్ ఉత్తర్వులు జారీ చేసి పదినెలలకు పైగా కావస్తున్న స్థితిలో ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో విద్యార్థుల చదువు కుంటుపడే పరిస్థితి ఏర్పడింది. దీంతో విద్యాసంస్థలను ప్రారంభించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో పీజీ కళాశాల విద్యార్థులకు డిసెంబర్ రెండవ తేదీ నుంచి తరగతులు ప్రారంభమయ్యాయి. యూజీ విద్యార్థులకు తరగతులను ప్రారంభించేందుకు నిర్ణయించారు. ఇలావుండగా కొత్త కరోనా వైరస్ వ్యాప్తితో కళాశాలలు ప్రారంభించేందుకు చిక్కులు ఏర్పడ్డాయి. దీంతో విద్యార్థులకు ఆన్లైన్, టీవీల ద్వారా విద్యాబోధన చేపట్టేందుకు నిర్ణయించారు. కొందరు విద్యార్థులు సాంకేతిక సౌకర్యాలు లేక కష్టపడుతున్నందున ప్రత్యేక మార్గాలను అన్వేషించాల్సి వచ్చింది. దీంతో ఆన్లైన్ తరగతులలో పాల్గొనేందుకు వీలుగా 9.69 లక్షల మంది కళాశాల విద్యార్థులకు ప్రతిరోజు 2 జీబీ డేటా ఉచితంగా అందజేసేందుకు ముఖ్యమంత్రి ఎడపాడి ఉత్తర్వులిచ్చారు. విద్యావేత్తల అసంతృప్తి : అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ తరహా ప్రకటన చేయడం సరికాదని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం పలు మొబైల్ సంస్థలు 1.5 జీబీ డేటా ఉచితంగా అందిస్తున్నాయని, వీటిని ఉపయోగించలేని స్థితిలో పలు నెట్వర్క్లు లభించడం లేదని ఫిర్యాదులందుతున్నట్లు తెలిపారు. -
సీఎం అభ్యర్థిపై పేచీ: రజనీతో అమిత్ షా భేటీ!
సాక్షి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అన్నాడీఎంకే, బీజేపీల మధ్య మిత్రభేద రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. కూటమి తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే అంశంపై రెండు పార్టీల నడుమ పొలిటకల్ వార్ నడుస్తుండగా బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా ఈనెల 14న చెన్నైకి వస్తున్నారు. ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామిని రాబోయే ఎన్నికలకు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు రెండు నెలల క్రితమే అన్నాడీఎంకే ప్రకటించింది. అయితే ఈ నిర్ణయాన్ని బీజేపీ రాష్ట్రశాఖ వ్యతిరేకిస్తోంది. ఇటీవల చెన్నైకి వచ్చిన కేంద్రమంత్రులు సైతం ఎడపాడి పేరును అంగీకరించలేదు. అన్నాడీఎంకే కూటమిలోనే బీజేపీ ఉందని ఆన్నాడీఎంకే నేతలు ఒకవైపు, ఎన్డీఏ కూటమిలో అన్నాడీఎంకే ఉందని బీజేపీ నేతలు మరోవైపు వాదిస్తున్నారు. ఎన్డీఏ కూటమి తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేదీ తమ పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని బీజేపీ తమిళనాడు అధ్యక్షులు మురుగన్ బహిరంగంగా ప్రకటించారు. (‘అమ్మ’కు వారసులు లేరా?) ఎడపాడి అభ్యర్థిత్వాన్ని అంగీకరిస్తేనే కూటమిలోకి రండి లేకుంటే పొండి అన్నట్లుగా అన్నాడీఎంకే వ్యవహరిస్తోంది. కూటమిలో ఇలాంటి మిత్రబేధ పరిస్థితులు నెలకొని ఉన్న తరుణంలో గత ఏడాది నవంబర్ 21న అమిత్షా చెన్నైకి వచ్చారు. అన్నాడీఎంకే కూటమిలో బీజేపీ కొనసాగుతుందని పార్టీ కన్వీనర్ పన్నీర్సెల్వం ఆనాడు స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో 60 స్థానాలు కేటాయించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. బీజేపీకే 60 సీట్లు కేటాయిస్తే కూటమిలోని పీఎంకే, డీఎండీకేలు సైతం ఎక్కువ సీట్లను డిమాండ్ చేసే పరిస్థితులు తలెత్తుతాయని వాదించి 34 సీట్లకు అన్నాడీఎంకే అంగీకరించినట్లు తెలుస్తోంది. 60 సీట్లు కేటాయిస్తే తాము పుదియనీది కట్చి, తమిళ మక్కల్ మున్నేట్ర కళగం తదితర చిన్న పార్టీలకు సీట్ల సర్దుబాటు చేస్తామని బీజేపీ చెబుతోంది. దీనికి అన్నాడీఎంకే సమ్మతించడం లేదు. ఇదే అదునుగా 40 సీట్లు కోరాలని పీఎంకే నిర్ణయించుకుంది. వన్నియర్ సామాజిక వర్గ మద్దతు బలంగా ఉన్న పీఎంకేకు గెలుపోటములను ప్రభావితం చేయగల సత్తా ఉంది. రాజ్యసభ సీటు ఒప్పందంపైనే గడిచిన లోక్సభ ఎన్నికల సమయంలో అన్నాడీఎంకే కూటమిలో పీఎంకే చేరింది. ఒప్పందం ప్రకారం పీఎంకే యువజన విభాగం అధ్యక్షులు అన్బుమణి రాందాస్ను రాజ్యసభకు పంపింది. (తలైవా.. నువ్వు రావాల్సిందే) రజనీ మద్దతు కోసం అమిత్ షా.. అన్నాడీఎంకే మళ్లీ అధికారంలోకి వచ్చి అధికసీట్లలో తమ అభ్యర్థులు గెలిస్తే ఈసారి ఉప ముఖ్యమంత్రి పదవికి ఒప్పందం కుదుర్చుకోవాలని పీఎంకే భావిస్తున్నట్లు సమాచారం. అన్నాడీఎంకేతో సీట్ల సంధి కుదరకుంటే డీఎంకే వైపు వెళ్లాలని పీఎంకే భావిస్తోంది. 14వ తేదీన జరగనున్న బీజేపీ – అన్నాడీఎంకే చర్చల కన్నా ముందే తమ డిమాండ్లను తెరపైకి తేవాలన్న ఉద్దేశంతో పీఎంకే ఈనెల 9వ తేదీన సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంది. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 స్థానాలుండగా, బీజేపీకి 60, పీఎంకేకి 40 కేటాయిస్తే, అన్నాడీఎంకే సహా కూటమిలోని మిగిలిన రెండు మూడు పార్టీలకు మిగిలేది 134 మాత్రమే. నటుడు విజయకాంత్ నేతృత్వంలోని మరో మిత్రపక్ష పార్టీ డీఎండీకే సీట్లపై ఇంకా నోరువిప్పలేదు. ఇలా కూటమిలో ప్రధానపార్టీలు అన్నాడీఎంకే మెడపై వేలాడుతున్న కత్తిలా మారాయి. సీట్ల సర్దుబాటులో పట్టుదలలు, ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై విభేదాలు నెలకొన్న తరుణంలో ఈనెల 14న అమిత్షా చెన్నై రాక ప్రాధాన్యతను సంతరించుకుంది. అమిత్షా సమక్షంలో రెండు ప్రధాన సమస్యలు ఒక కొలిక్కి వస్తాయని ఆశిస్తున్నారు. ఈ పర్యటనలో నటుడు రజనీకాంత్ను సైతం అమిత్షా స్వయంగా కలిసి, మద్దతు కోరుతారని సమాచారం. -
విధ్వంసంతో రిజర్వేషన్లు సాధ్యమేనా?
సాక్షి, న్యూఢిల్లీ : తమిళనాడులో కులాల డేటాను సేకరించడానికి అనుసరించాల్సిన పద్ధతులను సూచించేందుకు త్వరలోనే ఓ కమిషన్ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి సోమవారం ప్రకటించిన విషయం తెల్సిందే. విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో వెన్నియార్ సామాజిక వర్గానికి 20 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ మాజీ కేంద్ర మంత్రి అంబుమణి రాందాస్ నాయకత్వంలో పట్టాలి మక్కల్ కాట్చి ప్రతినిధి బృందం కలసి వెళ్లాక పళనిస్వామి ఈ ప్రకటన చేశారు. ప్రస్తుతం వెన్నియార్ సామాజిక వర్గం తమిళనాడులో ఎక్కువ వెనక బడిన వర్గాల (ఎంబసీ) జాబితాలోన కొనసాగుతోంది. ఓటర్లలో కూడా వారిది చాలా బలమైన వర్గం. 2021, ఏప్రిల్, మే నెలల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వెన్నియార్ వర్గం తమకు ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యా సంస్థల్లో 20 శాతం రిజర్వేషన్లు కావాలంటూ డిమాండ్ తీసుకొచ్చింది. తమిళనాడులో ఇప్పటికే 69 శాతం రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పట్టాలి మక్కల్ కాట్చి (పీఎంకే), ఏఐఏడిఎంకే, బీజేపీలతో కలసి పోటీ చేయాలనుకుంటోంది. 2019లో ఏఐఏడీఎంకేతో కలసి పొత్తు పెట్టుకోవడం వల్లనే రామదాస్ రాజ్యసభకు ఎన్నికయ్యారు. (కొత్త పార్టీ: రజనీకాంత్ కీలక ప్రకటన) వెన్నియార్ సామాజిక వర్గానికి ప్రత్యేకంగా రిజర్వేషన్లు కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా పీఎంకే ఆందోళన ప్రారంభించిన రోజునే కులాల డేటా సేకరణకు కమిషన్ను ఏర్పాటు చేస్తానంటూ పళనిస్వామి ప్రకటించారు. తమ డిమాండ్ను రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించేంత తీవ్రంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయాలంటూ పార్టీ కార్యకర్తలకు పార్టీ వ్యవస్థాపక నాయకుడు రామదాస్ పిలుపునివ్వడంతో ఆందోళన విధ్వంసం చోటు చేసుకుంది. చెన్నై నగరంలోకి ఎక్స్ప్రెస్ రైలు రాకుండా శివారులోనే దానిపై ఆందోళనకారులు రాళ్లతో దాడి చేశారు. ప్రధాన రహదారులన్నింటిని మూసివేశారు. దీంతో పీఎంకేను నిషేధించాలంటూ సోషల్ మీడియాలో డిమాండ్లు వెల్లువెత్తాయి. మద్రాస్ హైకోర్టు జోక్యం చేసుకొని విధ్వంసానికి బాధ్యులను చేస్తూ రామదాస్తోపాటు ఆయన కుమారుడు అంబుమణి రామదాస్లపై కేసులు నమోదు చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. (బీజేపీతో మైత్రి కొనసాగుతుంది: అన్నాడీఎంకే) ఆందోళనల్లో విధ్వంసం సష్టించడం పీఎంకేకు కొత్త కాదు. వెనకబడిన వర్గాల (బీసీ) జాబితా నుంచి ఎక్కువ వెనకబడిన వర్గాల (ఎంబీసీ) జాబితాను వేరు చేయాలంటూ 1987లో పీఎంకే ఆందోళనలో విధ్వంసకాండకు పాల్పడగా 21 మంది మరణించారు. ఆ నేపథ్యంలోనే 1989లో అప్పటి డీఎంకే ప్రభుత్వం 20 శాతం రిజర్వేషన్లతో ఎంబీసీ కోటాను ఏర్పాటు చేసింది. ప్రస్తుతానికి పీఎంకే ఆందోళనలను ఆపేందుకే కులాల డేటా సేకరణకు కమిషన్ను ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటించారు. దీనవల్ల విపరీత పరిణామాలు చోటుచేసుకొనే ప్రమాదం ఉంది. (నాన్న పార్టీ.. నాకు సంబంధం లేదు: విజయ్ ) తమిళనాడు కమిషన్ వేసినా కులాల డేటాకు సర్వే నిర్వహించక పోవచ్చు. ఒకవేళ నిర్వహించినా దాన్ని విడుదల చేయకపోవచ్చు. కులాల ప్రాతిపదికన కాకుండా దేశంలో సామాజికంగా, ఆర్థికంగా వెనకబాటు ప్రాతిపదికన 2011లో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వేనే ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా విడుదల చేసేందుకు సాహసించలేదు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ కూడా 2015లో ప్రజల సామాజిక, ఆర్థిక వెనకబాటుతనం మీద చేసిన సర్వేను ఇంతవరకు విడుదల చేయలేదు. ఇందుకు కారణం ఎఫ్సీ, బీసీ, ఓసీ, ఎంబీసీల డేటాకు సంబంధించి ఇప్పటి వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉజ్జాయింపుగా చెబుతున్న లెక్కలకు, ఆయా సామాజిక వర్గాలు చెబుతున్న లెక్కలకు, సర్వే లెక్కలు భిన్నంగా ఉండడమే. సర్వే వివరాలను బయటకు వెల్లడించడం వల్ల ప్రభుత్వాలకు, పార్టీలకు మధ్య గొడవలే కాకుండా, సమాజంలో కూడా అశాంతి పరిస్థితులు ఏర్పడుతాయన్న భయమే ప్రధాన కారణం. తమిళనాడులో సర్వే నిర్వహిస్తే రాష్ట్ర జనాభాలో వెన్నియార్ సామాజిక వర్గం వారు 20 శాతం కూడా లేరని తెలిస్తే గొడవలు జరగుతాయి. ఎంబీసీ జాబితా నుంచి వారిని వేరు చేసి, ప్రస్తుతం డిమాండ్ చేస్తున్నట్లు వారికి ప్రత్యేక క్యాటగిరీ కింద 20 శాతం రిజర్వేషన్లు కేటాయించిన ఇతర సామాజిక వర్గాలు ఆందోళనలకు దిగుతాయి. అప్పుడు రాష్ట్రంలో రిజర్వేషన్లు కూడా 89 శాతం చేరుకుంటాయి. రిజర్వేషన్లు 50 శాతం కోటాను మించకూడదంటూ సుప్రీం కోర్టు మార్గదర్శకాలు సూచించిన విషయ తెల్సిందే. -
తమిళనాడులో వీడిన ఉత్కంఠ
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకేలో రాజకీయ సంక్షోభం ముగిసింది. ప్రస్తుత సీఎం పళనిస్వామికి మరో అవకాశం దక్కింది. వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయన పేరునే ఎంపిక చేశారు. ఈమేరకు చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కొద్దిసేపటి క్రితం జరిగిన భేటీలో నిర్ణయం తీసుకున్నారు. సీఎం అభ్యర్థిగా పళనిస్వామి పేరును పన్నీర్ సెల్వం ప్రతిపాదించారు. పార్టీ వ్యవహారాల పర్యవేక్షణ బాధ్యతను పన్నీర్ సెల్వంకు అప్పగించారు. ఇందుకు సంబంధించిన ఒప్పంద పత్రాలపై పళనిస్వామి, పన్నీర్ సెల్వం సంతకాలు చేశారు. ఇక.. 11 మంది సభ్యులతో స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో పళనిస్వామి మద్దతుదారులు ఆరుగురు, పన్నీర్ సెల్వం మద్దతుదారులు ఐదుగురు ఉన్నారు. సీఎం అభ్యర్థి ఎవరనే అంశంపై పార్టీలో ఇప్పటి వరకు భారీ ఎత్తున వివాదం నడిచింది. నేనంటే నేనే అంటూ పళనిస్వామి, పన్నీర్ సెల్వం పరోక్షంగా ప్రకటనలిచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ పళనిస్వామికి అవకాశం దక్కడంతో సస్పెన్స్ వీడింది. (చదవండి: అన్నాడీఎంకేలో కుర్చీ వార్) -
చెన్నై: ఏఐడీఎంకేలో కీలక రాజకీయ పరిణామాలు
-
అన్నాడీఎంకేలో ‘సీఎం’ వేడి
చెన్నై: ఎన్నికలకు మరో 9 నెలల సమయముండగానే అన్నాడీఎంకేలో తదుపరి సీఎం ఎవరనే అంశంపై వేడి రాజుకుంది. కొన్నాళ్లుగా ఈ విషయంలో మంత్రులు బాహటంగా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. దీనికితోడు ఉపముఖ్యమంత్రి పన్నీరు సెల్వంను తదుపరి ముఖ్యమంత్రి అభ్యర్థిగా పేర్కొంటూ శనివారం పలుచోట్ల పోస్టర్లు దర్శనమివ్వడం కలకలం రేపింది. సీనియర్ మంత్రులు రంగంలోకి దిగి సీఎం పళనిస్వామి, పన్నీరు సెల్వంలతో భేటీ అవుతున్నారు. తమిళనాడు అసెంబ్లీకి వచ్చే ఏడాది మేలో ఎన్నికలు జరగనున్నాయి. సీఎం అభ్యర్థిపై ప్రచారాలు మొదలు కావడంతో పళనిస్వామి, పన్నీరు సెల్వం శనివారం ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. పార్టీలో కీలక నిర్ణయాలన్నీ సమష్టిగా జరుగుతాయని, వ్యక్తిగత అభిప్రాయాలను ఎవరూ బాహాటంగా ప్రకటించకూడదని కోరారు. ‘ఎవరితో పొత్తు పెట్టుకోవాలనే విషయంతో సహా నిర్ణయాలన్నీ కార్యకర్తల మనోభావాలను పరిగణనలోకి తీసుకొనే జరుగుతాయి. విజయం కోసం పార్టీశ్రేణులు కలిసికట్టుగా పనిచేయాలి. ఎవరూ వ్యక్తిగత అభిప్రాయాలను వెల్లడించకూడదు. ఎవరైనా దీన్ని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు’అని ఆ ప్రకటనలో అగ్రనేతలిద్దరూ హెచ్చరించారు. ఇటీవల సహకారశాఖ మంత్రి సెల్లూరు రాజు మాట్లాడుతూ ఎన్నికల తర్వాతే సీఎం ఎవరనే దానిపై నిర్ణయం ఉంటుందని అన్నారు. మరో మంత్రి కేటీ రాజేంద్ర స్పందిస్తూ పళనిస్వామే సీఎం అభ్యర్థని ప్రకటించారు. దీంతో పళనిస్వామి స్వయంగా రంగంలోకి దిగి ‘ఏఐఏడీఎంకే లక్ష్యం... వరుసగా మూడోసారి నెగ్గడం. అదే అమ్మ (జయలలిత) కల కూడా. అందరూ క్రమశిక్షణతో ఈ దిశగా కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను’అని ట్వీట్ చేశారు. -
చెన్నైలో మళ్లీ లాక్డౌన్
సాక్షి, చెన్నై: తమిళనాడులో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ భారీగా పెరుగుతుండటంతో నాలుగు జిల్లాల్లో మళ్లీ లాక్డౌన్ విధించాలని ముఖ్యమంత్రి పళనిస్వామి నిర్ణయం తీసుకున్నారు. గ్రేటర్ చెన్నై, చెంగల్పట్టు, తిరువల్లూర్, కాంచీపురం జిల్లాల్లో జూన్ 19 నుంచి 30వ తేదీ వరకూ లాక్డౌన్ అమల్లో ఉంటుంది. ఈ 12 రోజుల్లో రెండు ఆదివారాలు రానున్నాయి. ఆ రెండు రోజులు పూర్తిస్థాయిలో లాక్డౌన్ అమలు చేస్తారు. ఆటోలు, ట్యాక్సీలు, ప్రైవేట్ వాహనాలను అనుమతించరు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే నిత్యావసరాల కొనుగోలుకు అవకాశం ఇస్తారు. చెన్నై నుంచి ఎవరైనా బయటకు వెళ్లాలనుకుంటే ప్రభుత్వం నుంచి ఈ–పాస్ తీసుకోవాలి. -
తడబడి నిలబడిన.. ఈపీఎస్ – ఓపీఎస్!
చెన్నై: పురచ్చితలైవి జయలలిత ఆకస్మిక మరణానంతరం తమిళనాట ఏర్పడిన ఏఐఏడీఎంకే ప్రభుత్వం మూడేళ్ల పాలనను విజయవంతంగా పూర్తి చేసుకోబోతోంది. అంతర్గత కలహాలు, అంతగా ప్రజాదరణ లేని నేతలతో ఎప్పుడు పడిపోతుందో అన్నట్లుగా ఉన్న ఈ.పళని స్వామి(ఈపీఎస్), ఓ.పన్నీర్ సెల్వం(ఓపీఎస్)ల ప్రభుత్వం స్థిరంగా నిలిచి తలలుపండిన రాజకీయ విశ్లేషకుల అంచనాలను సైతం తలకిందులు చేసింది. ఈపీఎస్, ఓపీఎస్..ఈ ఇద్దరు నేతల్లో దిగ్గజ నేత జయలలిత నమ్మిన బంటు ఒకరైతే, జయలలిత రాజకీయ ఉత్థాన పతనాలను దగ్గర్నుంచి చూసిన శశికళను ఒప్పించి, మెప్పించి ఎదిగిన నేత మరొకరు. తొలి వ్యక్తి ఓపీఎస్ రాజకీయాల్లో ఆరితేరిన వాడైనా పళని స్వామి రాజకీయ చతురతకు వెనక్కితగ్గక తప్పలేదు. నిజానికి టీటీవీ దినకరన్ పార్టీలో ఉన్నంత కాలం శశికళ అనుయాయుడిగా మాత్రమే పళనిస్వామి ఉండేవారు. శశికళ జైలుకెళ్లడంతో 2017 ఫిబ్రవరిలో అనూహ్యంగా ఎడప్పాడి పళనిస్వామికి ముఖ్యమంత్రి పీఠం దక్కింది. అంతగా అనుభవంలేని ఈపీఎస్కు తిప్పలు తప్పవని అప్పట్లో అంతా భావించారు. ప్రభుత్వం నిలుస్తుందో లేదోనన్న బెంగ మొదట్లో ఆయనలోనూ ఉంది. అదే భయాన్ని తన ఎమ్మెల్యేల మెదళ్లలోకి ఇంకేలా చేయడంలో సఫలీకృతమయ్యారు పళని స్వామి. కలిసికట్టుగా లేకున్నా, ఒకే మాటపై నిలబడకున్నా ప్రభుత్వం పడిపోవడమే కాదు, వారికి భవిష్యత్తు కూడా ఉండదని ఈపీఎస్ హెచ్చరికలను ఎమ్మెల్యేలు ఆకళింపు చేసుకున్నారు. ఓపీఎస్నూ, ఆయన 10 మంది ఎమ్మెల్యేలనూ తనవైపు తిప్పుకోవడంతో జయలలిత లేకున్నా ఏఐఏడీఎంకే ప్రభుత్వం తమిళనాట సుస్థిరంగా నిలబడగలిగింది. బీజేపీ పాత్ర ఎంత? తమిళనాడులో కాంగ్రెస్, డీఎంకేలను నిలువరించేందుకు ఈపీఎస్–ఓపీఎస్ల కలయిక అనివార్యమని చెప్పి ఇరుపక్షాలనూ ఒప్పించడంలో బీజేపీ కీలకంగా వ్యవహరించింది. కేంద్రం నుంచి రాష్ట్రానికి తగు మద్దతిస్తానని మాటిచ్చి.. అందుకు తగ్గట్టుగానే వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగానే లోక్సభ ఎన్నికల్లో ఏఐఏడీఎంకే– బీజేపీ పొత్తు కుదిరింది. అయితే, ఆ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన డీఎంకే.. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో మాత్రం ప్రభావం చూపలేక పోయింది. ఉప ఎన్నికల్లో ఈపీఎస్ ప్రభుత్వం నిలబడటానికి కావాల్సిన 9 సీట్లను ఏఐఏడీఎంకే దక్కించుకోగలిగింది. ఏమాత్రం అనుభవం లేని ఈపీఎస్ సారథ్యంలోని ఏఐఏడీఎంకే విజయాన్ని చూసి విస్తుపోవడం డీఎంకే వంతయింది. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని సుస్థిరపరుచుకోవడమే ఈపీఎస్ లక్ష్యం. అందుకే ఆయన ఎన్నికల్లో సీట్ల గెలుపుపైనే దృష్టిపెట్టారు. తన ఎమ్మెల్యేలకు కావాల్సిన కాంట్రాక్టులిచ్చి లక్ష్యం సాధించుకున్నారు. దీనికితోడు తమిళనాడులోని విక్రవాండీ, నాన్గునేరీ ఉప ఎన్నికల్లో ఏఐఏడీఎంకే విజయం ఈపీఎస్కి ఉన్న యాక్సిడెంటల్ సీఎం అన్న పేరును మార్చివేసి, ఆయన భవిష్యత్తును చెప్పకనే చెప్పింది. పన్నీర్ సెల్వంకు ఏం దక్కింది? ఈపీఎస్–ఓపీఎస్ వర్గాల కలయికతో పన్నీర్ సెల్వంకు ఏం మిగిలిందన్న విషయం పక్కనబెడితే ప్రభుత్వం మాత్రం నిలదొక్కుకో గలిగింది. ఓపీఎస్కి డిప్యూటీ సీఎం పదవి, పార్టీ అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టి, పళనిస్వామి మాత్రం ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నారు. ఫలితంగా ఓపీఎస్కు ఎటువంటి నిర్ణయాధికారాలూ లేకుండా పోయాయి. దక్కిన డిప్యూటీ సీఎం పదవితోనూ పెద్దగా ఫలితం లేదన్నది వాస్తవం. తమ రెండు వర్గాల కలయికతో ఈపీఎస్కే తప్ప తనకు ఫలితం శూన్యమన్న విషయం ఓపీఎస్కు ఆలస్యంగా అర్థమైంది. దీంతోపాటు పార్టీ విలీనం తరువాత ఓపీఎస్ పక్షం ఎమ్మెల్యేలందరినీ ఏదో రకంగా ఈపీఎస్ తనవైపు తిప్పుకో గలిగారు. కేంద్రంలో ఓపీఎస్ కొడుక్కి సాయం చేస్తానన్న హామీ కూడా నెరవేకుండానే మిగిలిపోయింది. -
రజనీకాంత్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి ప్రతినిధి, చెన్నై: సీఎం అయ్యేందుకు ఏళ్లతరబడి కలలు కనక్కరలేదు.. సీఎం కావాలని ఏనాడైనా ఎడపాడి కలలు కన్నారా, అలాగే రేపు ఎవరైనా సీఎం కావచ్చు సూటిగా పేరుపెట్టి ఈ సంచలన వ్యాఖ్యలు చేసింది ఎవరోకాదు సూపర్స్టార్ రజనీకాంత్. అంతేకాదు, రాబోయే రోజుల్లో ఆశ్చర్యకరమైన పరిణామాలూ చోటుచేసుకుంటాయని మరో బాంబు పేల్చి కలకలం రేపారు. రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగవచ్చనే ఉదాహరణకు తమిళనాడు రాజకీయాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. జయలలిత హఠాన్మరణం వల్ల అన్నాడీఎంకేలోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లోనే పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. జయలలిత హయాంలో చక్రం తిప్పిన శశికళ జైలు పాలయ్యారు. పెద్దగా గుర్తింపులేని ఎడపాడి పళనిస్వామి అకస్మాత్తుగా సీఎం అయ్యారు. ఎడపాడి ప్రభుత్వం రోజుల్లోనో నెలల్లోనో కూలిపోగలదని అందరూ ఆంచనావేయగా సుస్థిరమైన ప్రభుత్వంలో ఏళ్లతరబడి కొనసాగుతున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో వెలిగిపోయిన జయలలిత, కరుణానిధి కన్నుమూసిన తరువాత కమల్హాసన్, రజనీకాంత్ రాజకీయ ప్రవేశం చేశారు. వీరిలో కమల్.. మక్కల్ నీది మయ్యం పార్టీని స్థాపించి గడిచిన పార్లమెంటు ఎన్నికల్లో గణనీయమైన ఓట్లను సాధించారు. ప్రస్తుతం రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల వాతావరణం నెలకొని ఉన్నా, ముఖ్యమంత్రి పీఠానికే గురిపెట్టి 2021లో రానున్న అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా కమల్ పనిచేస్తున్నారు. పార్టీ స్థాపనపై మీనమేషాలు 2017 డిసెంబర్లో రాజకీయ అరంగేట్రం చేసినా పార్టీ స్థాపనపై రజనీకాంత్ ఇంకా మీనమేషాలు లెక్కిస్తున్నారు. అప్పుడప్పుడూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నారు. జయలలిత మరణం తరువాత రాష్ట్రంలో నెలకొని ఉన్న రాజకీయశూన్యతను తాను భర్తీ చేస్తానని రజనీకాంత్ ఇటీవల చేసిన ప్రకటన చర్చనీయాంశమైంది. రజనీ, కమల్ ఇద్దరూ సీఎం కుర్చీపై కన్నేసి ఉన్నారని తేటతెల్లమైంది. రజనీ అనుకుంటున్నట్లుగా రాష్ట్రంలో రాజకీయ శూన్యత లేదని, అతని వ్యాఖ్యలను అన్నాడీఎంకే తిప్పికొట్టింది. రజనీకాంత్, కమల్ హాసన్ ఇద్దరూ రాష్ట్ర రాజకీయాల్లో మరో శివాజీగణేశన్లా మారిపోగలరని సీఎం ఎడపాడి వ్యాఖ్యానించారు. తమిళతెరపై ఎంజీ రామచంద్రన్ తరువాత నెంబరు 2 ఉండిన శివాజీగణేశన్ పెట్టిన పార్టీ ఘోరపరాజయం పాలైన సంగతిని ఆయన గుర్తుచేశారు. వారిద్దరికీ రాజకీయాలు ఏమితెలుసని ఎద్దేవా చేశారు. నిన్న ఎడపాడి, రేపు.. రజనీకాంత్ సీఎం ఎడపాడి చేసిన వ్యాఖ్యలపై కొన్నిరోజులుగా మౌనం పాటించిన రజనీకాంత్ ఆదివారం రాత్రి చెన్నైలో జరిగిన కమల్ జన్మదినోత్సవ సంబరాల్లో నోరు విప్పారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయని అన్నారు. సీఎం అవ్వాలని రెండేళ్ల క్రితం ఎడపాడి కలలో కూడా ఊహించి ఉండరు. ఆయన సీఎం అయ్యాక ఈ ప్రభుత్వం ఎంతోకాలం నిలవదని 99 శాతం మంది ప్రజలు భావించారు. ఇలాంటి ఆశ్చర్యాలు రేపుకూడా జరగవచ్చని వ్యాఖ్యలతో రాజకీయ కలకలం రేపారు. ఎడపాడిలానే తాను కూడా సీఎం కాగలననేదే రజనీకాంత్ మాటల్లోని మర్మమని అంటున్నారు. ఎడపాడితో రజనీకి పోలికా అని కొంగునాడు మక్కల్ దేశీయ కట్చి ప్రధాన కార్యదర్శి ఈశ్వరన్ విమర్శించారు. ఎడపాడి రాత్రికి రాత్రే సీఎం కాలేదు, పారీ్టలో గ్రామస్థాయి నుంచి పనిచేస్తూ సీఎంగా ఎదిగారని ఆయన గుర్తుచేశారు. -
కలలు సాకారం చేస్తాం
సాక్షి, చెన్నై: బలమైన భారత్ లక్ష్యంగా ముందుకు సాగుదామని, మరో అవకాశం ఇస్తే కలలు సాకారం చేస్తానని తమిళ ఓటర్లను ప్రధాని మోదీ బుధవారం కోరారు. చెన్నై శివారు కిలాంబాక్కం వేదికగా అన్నాడీఎంకే మెగా కూటమి నేతృత్వంలో ఎన్నికల శంఖారావ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. పుల్వామా దాడులు, ప్రతిదాడులు, వింగ్ కమాండర్ అభినందన్ మళ్లీ భారత్కు రావడాన్ని గుర్తు చేస్తూ, తీవ్రవాదంపై పోరాటంలో వెనక్కు తగ్గేది లేదన్నారు. ఎంతవరకైనా వెళ్లడానికి సిద్ధమేనని ప్రకటించారు. తమిళనాట అన్నాడీఎంకే–బీజేపీ నేతృత్వంలోని మెగా కూటమి ఖరారు అయింది. పొత్తులో భాగంగా తమిళనాడులో బీజేపీకి–5, పీఎంకేకు–7, పుదియ తమిళగం–1, పుదియ నిధి కట్చి –1, ఎన్ఆర్ కాంగ్రెస్కు పుదుచ్చేరిలోని దక్కాయి. మరికొన్ని చిన్న పార్టీలు కూటమిలో ఉన్న సీట్ల కేటాయింపులు అధికారికంగా వెలువడాల్సి ఉంది. మిగిలిన సీట్లలో అన్నా డీఎంకే పోటీ చేయనుంది. ఈ బహిరంగ సభతో పాటు అధికారిక వేడుక నిమిత్తం బుధవారం మోదీ చెన్నైకు వచ్చారు. ముందుగా తమిళనాడు సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీరుసెల్వంతో కలిసి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. భారతరత్న ఎంజీఆర్ పేరును చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్కు పెడుతున్నట్లు మోదీ ప్రకటించారు. కర్ణాటకలో రిమోట్ కంట్రోల్ సీఎం సాక్షి, బెంగళూరు: కర్ణాటక కలబురిగిలో బీజేపీ ఎన్నికల సభలోనూ మోదీ పాల్గొన్నారు. ‘ రాష్ట్ర సీఎం కుమారస్వామి ఒక రిమోట్ కంట్రోల్ సీఎం. రాష్ట్రంలో ఒక బలహీనమైన ప్రభుత్వం పాలన సాగిస్తోంది’ అని విమర్శించారు. రాష్ట్రంలో దొంగలు, అవినీతిపరుల దుకాణం బంద్ చేయడానికి సమయం ఆసన్నమైందన్నారు. రైతులకు నగదు బదిలీ పథకాన్ని ప్రారంభించిన తర్వాత దీన్ని కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకించాయని, అందులో కర్ణాటక ప్రభుత్వం కూడా ఒకటని ఆరోపించారు. ఎలాంటి అవినీతికీ తావు లేకుండా నేరుగా రైతుల ఖాతాల్లోకే నగదు బదిలీ చేస్తుండడంతో కమీషన్లకు అలవాటు పడిన రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు ఈ పథకాన్ని వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. మోదీ విరాళం 21 లక్షలు ప్రధాని మోదీ తన దాతృత్వాన్ని మరోసారి చాటారు. కుంభమేళాలో పని చేసిన పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమం కోసం తన సంపాదన నుంచి రూ.21 లక్షలు విరాళంగా ఇచ్చినట్టు ప్రధాని కార్యాలయం ప్రకటించింది. -
నన్నెవరూ ఆపలేరు : విశాల్
మొన్నటి నుంచి తమిళంలో నిర్మాతలకు, నిర్మాతల సంఘం ప్రతినిధులకు మధ్య వాగ్వివాదం జరుగుతోంది. ఈ సంఘంలోని సభ్యులు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు. ఒకవైపు విశాల్ వర్గం కాగా నిర్మాతలు అళగప్పన్, నందగోపాల్, సురేశ్ కమాట్చి, ఆర్కే సురేశ్ తదితరులు మరో వర్గంగా ఏర్పడ్డారు. ‘‘నిర్మాతల సంఘం కోసం విశాల్ ఇచ్చిన మాట నెరవేర్చలేదు, సంఘం అభివృద్ధికి కృషి చేయడం లేదు. విశాల్కు పలు పైరసీ వెబ్సైట్లతో సంబంధాలు కూడా ఉన్నాయి’’ అంటూ మరో వర్గం నిర్మాతలు ఆరోపించారు. బుధవారం నిర్మాతల మండలి ఆఫీస్కు తాళం కూడా వేసేశారు. గురువారం ఆ తాళం పగలగొట్టి నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ లోపలికి వెళ్లడానికి ప్రయత్నించగా, పోలీస్లు ఆయన్ను అరెస్ట్ చేశారు. ‘‘ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్కు తాళం వేసినప్పుడు మౌనంగా ఉన్నారు పోలీసులు. ఇప్పుడు ఏ తప్పూ లేకపోయినా నన్ను, నా సహచరులను అరెస్ట్ చేస్తున్నారు. పోరాడతాం. చిన్న చిన్న కారణాలకు నన్ను టార్గెట్ చేస్తున్నారు. సర్వం కోల్పోయిన నిర్మాతలకు మంచి చేద్దాం అనుకుంటున్నాను. దేవుడు, నిజం రెండూ నా వైపే ఉన్నాయి. ముందుకు అడుగు వేస్తాను. ఇళయరాజాగారి ఈవెంట్ను నిర్వహించకుండా నన్ను ఎవరూ ఆపలేరు’’ అని తన వాదనను ట్వీటర్ ద్వారా పంచుకున్నారు విశాల్. కాగా, వ్యతిరేక వర్గం నిర్మాతలు తమిళనాడు ముఖ్యమంత్రి పళనీస్వామిని కలిసి, విశాల్పై ఫిర్యాదు పత్రాన్ని అందించారు. అలాగే నాలుగు నెలల్లో నిర్మాతల మండలి ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు. -
మోదీతో తమిళనాడు సీఎం పళనిస్వామి భేటీ
-
నిలకడగా కరుణ ఆరోగ్యం
సాక్షి ప్రతినిధి, చెన్నై: డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్యం నిలకడగా ఉంది. చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో ఆయనకు చికిత్స కొనసాగుతోంది. ఆదివారం రాత్రి కరుణానిధి ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించడంతో ఒక్కసారిగా కుటుంబసభ్యులు, అభిమానుల్లో ఆందోళన నెలకొన్న విషయం తెలిసిందే. వైద్యుల చికిత్సతో ఆయన ఆరోగ్యం మెరుగైందని ఆ కాసేపటికి ఆసుపత్రి యాజమాన్యం ప్రకటించడంతో కొంతవరకు ఆందోళనలు తగ్గాయి. ప్రస్తుతం కరుణ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన కుమారుడు, డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ ప్రకటించారు. సోమవారం రాత్రి ఆసుపత్రి వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. ‘నిన్న రాత్రి ఆసుపత్రి యాజమాన్యం నాన్న ఆరోగ్యంపై ప్రకటన విడుదల చేసినప్పటి పరిస్థితే ఇప్పటికీ కొనసాగుతోంది. డాక్టర్లు ఇంటెన్సివ్ కేర్లో చికిత్స అందిస్తున్నారు’ అని తెలిపారు. కరుణానిధి ఆరోగ్యం ఒక్కసారిగా విషమించిందని, అయితే, వెంటనే తక్షణ చికిత్స అందించడంతో సాధారణ స్థాయికి వచ్చిందని ఆదివారం అర్ధరాత్రి కావేరీ ఆసుపత్రి ఒక ప్రకటన విడుదల చేయడం తెలిసిందే. సీఎం పరామర్శ మూడురోజుల పర్యటన నిమిత్తం సేలం జిల్లాకు వెళ్లిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి అర్ధాంతరంగా పర్యటన ముగించుకుని హడావుడిగా చెన్నైకి చేరుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్సెల్వం, మరికొందరు మంత్రులు వెంటరాగా సోమవారం ఉదయం కావేరి ఆస్పత్రికి వెళ్లి స్టాలిన్ను కలుసుకుని కరుణ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం ఎడపాడి మీడియాతో మాట్లాడుతూ, కరుణకు చికిత్స జరుగుతోందని, కోలుకుంటున్నారని చెప్పారు. ఎన్సీపీ అధినేత శరద్పవార్ సోమవారం చెన్నైకి వచ్చి కరుణను చూసి స్టాలిన్ను కలుసుకున్నారు. శ్రీలంక అధ్యక్షుడు, ప్రధాని తరఫున నలుగురు ప్రతినిధులు కావేరి ఆస్పత్రికి వచ్చారు. ఆగిన అభిమానుల గుండెలు తమ అభిమాన నేత కరుణానిధిని తలచుకుంటూ ఆవేదనకు గురై 8 మంది అభిమానుల గుండెలు ఆగిపోయాయి. ఓ అభిమాని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరో వ్యక్తి బలవన్మరణానికి ప్రయత్నించాడు. కొందరు డీఎంకే కార్యకర్తలు కరుణ కోలుకోవాలంటూ కావేరి ఆస్పత్రి ముందు గుండు కొట్టించుకుని దేవుళ్లకు మొక్కుకున్నారు. అనేకచోట్ల ప్రత్యేక ప్రార్థనలు చేశారు. -
శ్రీవారిని దర్శించుకున్న కీర్తిసురేశ్
సాక్షి, తిరుమల : తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని మంగళవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. నటి కీర్తిసురేశ్ ఉదయం వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. టీటీడీ అధికారులు కీర్తి సురేశ్ కు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆమెకు రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదశీర్వచనం అందించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల కీర్తి మీడియాతో మాట్లాడుతూ.. మహానటి సావిత్రి జీవిత చరిత్ర చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. మహానటి సినిమా విజయవంతం కావడంతో స్వామివారి దర్శించుకున్నట్టు కీర్తి చెప్పారు. అదే విధంగా స్వామివారిని తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామితో పాటు పెషావర్ పీఠాధిపతి విశ్వేశ్వర తీర్థ స్వామిజీ, ఉడిపి పీఠాధిపతి విశ్వ ప్రసన్న తీర్థ స్వామిజీలు కూడా స్వామి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా పెషావర్ పీఠాధిపతి స్వామికి బంగారు పాదాలు విరాళంగా అందజేశారు. కొనసాగుతున్న రద్దీ తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వదర్శనానికి 20 గంటలు, కాలిబాట దర్శనానికి 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటలు సమయం పడుతోంది. -
ఆ నలుగురు.. రంజుగా తమిళ రాజకీయం
సాక్షి, చెన్నై : అన్నాడీఎంకే తిరుగుబాటు నేత, ఆర్కే నగర్ ఎమ్మెల్యే దినకరన్ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి పళనిస్వామి తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. మూడు నెలల్లో పళని ప్రభుత్వం కూలిపోతుందంటూ ఫలితాల రోజున దినకరన్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై సీఎం పళని, శనివారం ఊటీలో నిర్వహించిన ఎంజీఆర్ జయంతి ఉత్సవాల్లో స్పందించారు. ‘‘1974లో నేను అన్నాడీఎంకేలో చేరా. కార్యకర్త స్థాయి నుంచి పని చేసి ఆ స్థాయికి ఎదిగా. నాతోపాటు చాలా మంది అన్నాడీఎంకే కోసం అహర్శిశలు కృషి చేశాం. కానీ, దినకరన్ మాత్రం దొడ్డి దారిలో పార్టీలోకి ప్రవేశించారు అని అన్నారు. ఆర్కే నగర్ లో దినకరన్ విజయం సాధించడానికి కారణం హవాలా ఫార్ములానే అని పళని ఉద్ఘాటించారు. ఇదే సమయంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్న దినకరన్ ఎక్కడకు వెళ్లాలో అక్కడికే వెళతారంటూ వ్యాఖ్యలు చేశారు. తాము ప్రజల కోసం పాటుపడుతుంటే... దినకరన్ సొంత కుటుంబం కోసం పాకులాడుతున్నారని పళని విమర్శించారు. ఎమ్మెల్యేగా గెలిచిన దినకరన్ ఆ పదవిని కొంత కాలం మాత్రమే అనుభవించగలరని.. భవిష్యత్తులో అతనికి గుణపాఠం చెప్పి తీరతామని పళని పేర్కొన్నారు. ఇక రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ అంశంపై స్పందించేందుకు ఆయన నిరాకరించారు. దినకరన్ ఓ బచ్చా... పన్నీర్ సెల్వం మరోవైపు డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం కూడా దినకరన్ పై మండిపడ్డారు. అన్నాడీఎంకేలో తాను సీనియర్ నని, దినకరన్ ఓ బచ్చా.. ఎల్కేజీ స్టూడెంట్ అని ఎద్దేవా చేశారు. జయలలిత చేత పార్టీ నుంచి బహిష్కరింపబడిన వారు ఇప్పుడు పార్టీపై పెత్తనం చెలాయించాలని చూస్తున్నారని మండిపడ్డారు. పార్టీని కూల్చాలని దినకరన్, డీఎంకేలు చేసే యత్నాలు ఫలించవని ఆయన చెప్పారు. రజనీ ఎంట్రీపై దినకరన్ స్పందన... రజనీకాంత్ రాజకీయ ప్రవేశ ప్రకటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన వేళ... దినకరన్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ప్రకటన వెలువడటానికి ముందే నిన్న ఓ జాతీయ మీడియాతో దినకరన్ మాట్లాడుతూ.. తమిళనాడుకు ఒకే ఎంజీఆర్.. ఒకే అమ్మ(జయలలిత) ఉంటారు. వారి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు అని తెలిపారు. అమ్మ విధేయులను తప్ప వేరే ఏ ముఖాన్ని ఆమె అభిమానులు అంగీకరించబోరని దినకరన్ చెప్పారు. తమిళ రాజకీయంలో ప్రస్తుతానికి ప్రతిపక్ష డీఎంకే ప్రేక్షక పాత్ర వహిస్తుండగా.. ఈ నలుగురు మాత్రం వార్తల్లో నిలుస్తూ ట్రెండింగ్గా మారారు. -
మళ్లీ చెడిందా!
సాక్షి, చెన్నై: రెండాకుల చిహ్నం తమకు దక్కడంతో అన్నాడీఎంకే వర్గాలు సంబరాల్లో మునిగాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మదురైలో శనివారం నిర్వహించిన విజయోత్సవ వేడుకకు డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వంను సీఎం పళనిస్వామి శిబిరం ఆహ్వానించకపోవడం చర్చకు దారితీసింది. తామిద్దరం ఒక్కటేనని చెప్పుకుంటూ వచ్చిన సీఎం, ఈ వేడుకలో పన్నీరు ఊసెత్తకుండా ప్రసగించడం గమనార్హం. పన్నీరు శిబిరానికి సీఎం ప్రాధాన్యం ఇవ్వడంలేదని వారం రోజులుగా తమిళనాట ప్రచారం జరుగుతోంది. పన్నీరు మద్దతు ఎంపీ మైత్రేయన్ ట్విట్టర్లో అసంతృప్తి వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో రెండాకుల చిహ్నం విజయోత్సవ వేడుక పళని, పన్నీరు మధ్య విభేదాల్ని బయటపెట్టింది. శనివారం రామనాథపురంలో ఎంజీఆర్ శత జయంతి ఉత్సవాలు నిర్వహించారు. మదురై నుంచి 120 కి.మీ దూరంలో ఉన్న రామనాథపురం వరకు రోడ్డు మార్గమంతా రెండాకులు, దివంగత నేతలు ఎంజీఆర్, జయలలితతో పాటు సీఎం పళనిస్వామి చిత్ర పటాలతో కూడిన ఫ్లెక్సీలు, హోర్డింగ్లు హోరెత్తాయి. అయితే, ఎక్కడా పన్నీరుకు చోటు కల్పించలేదు. అలాగే మదురై తిరుప్పర గుండ్రం వద్ద వంద అడుగులతో కూడిన భారీ జెండా స్తూపాన్ని ఏర్పాటు చేశారు. ఈ విజయోత్సవ స్తూపం శిలాఫలకంలో ఆ జిల్లా అన్నాడీఎంకే కార్యదర్శి, మంత్రి ఆర్బీ ఉదయకుమార్, సీఎం పళనిస్వామి పేరును మాత్రం పొందుపరిచారు. అలాగే, డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వంను ఆహ్వానించకుండా ఈ వేడుక జరిగింది. తమ శిబిరానికి చెందిన ఏ ఒక్కరినీ ఈ వేడుకకు పిలవకపోవడంపై పన్నీరు మద్దతు నేతలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇక, సాయంత్రం రామనాథపురంలో జరిగిన ఎంజీఆర్ శత జయంతి వేడుకలో సీఎం పళని, డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వం ఎడమొహం పెడమొహం అన్నట్టుగా కూర్చోవడం తమిళనాట చర్చకు దారితీసింది. -
గోదావరి–కావేరీ నదుల అనుసంధానం
చెన్నై: నదుల అనుసంధానంపై కేంద్ర ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో ఉందని, గోదావరి మిగులు జలాల్ని కావేరీకి తరలించేందుకు ప్రణాళిక రూపకల్పన కోసం ముఖ్యమంత్రుల సమావేశం నిర్వహిస్తామని కేంద్ర జల వనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కారీ చెప్పారు. గోదావరి–కావేరీ నదుల అనుసంధానానికి జల వనరుల శాఖ కృషి చేస్తోందని, ఇది కార్యరూపం దాల్చితే దక్షిణాది రాష్ట్రాల్లో నీటి కొరత తీరుతుందని పేర్కొన్నారు. ‘మిగులు జలాల్ని గోదావరి నది నుంచి కృష్ణకు, అక్కడి నుంచి పెన్నా.. చివరకు కావేరీకి తరలించాలని జల వనరుల శాఖ నిర్ణయించింది’ అని చెన్నైలో గడ్కారీ వెల్లడించారు. ఈ ప్రాజెక్టుల విషయంలో రాష్ట్రాల ఆందోళనలపై చర్చిస్తున్నామని, సమీప భవిష్యత్తులో నిర్ధిష్ట కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వస్తామని ఆయన చెప్పారు. ‘తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించి, వారి అనుమతితో ప్రణాళికను ఖరారు చేస్తాం. ఈ ప్రాజెక్టుల్ని జాతీయ ప్రాజెక్టులుగా పరిగణిస్తాం. 90 శాతం ఖర్చు కేంద్ర ప్రభుత్వం, 10 శాతం రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి’ అని తెలిపారు. మొదటి ప్రాజెక్టులో భాగంగా 300 టీఎంసీల గోదావరి నీటిని పోలవరం ప్రాజెక్టు నుంచి నాగార్జున సాగర్ డ్యాం ద్వారా కృష్ణాకు మళ్లిస్తారు. అక్కడి నుంచి పెన్నా నదిపై ఉన్న సోమశిల ప్రాజెక్టుకు.. అనంతరం కావేరీ నది పరివాహకంలోని గ్రాండ్ ఆనకట్టుకు మళ్లిస్తారు. కాల్వల ద్వారా కాకుండా స్టీలు పైపుల ద్వారా నీటిని తరలిస్తాయని గడ్కారీ వెల్లడించారు. మొదటి దశలో 100 టీఎంసీల నీరు కావేరీకి వెళ్తుందని, ఈ ప్రాజెక్టు ద్వారా తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు లబ్ధిపొందుతాయని తెలిపారు. రెండో ప్రాజెక్టులో భాగంగా ఇంద్రావతి నది నుంచి నీటిని నాగార్జున సాగర్ డ్యాంకు తరలిస్తాం. అక్కడి నుంచి సోమశిల ప్రాజెక్టుకు మళ్లించి అనంతరం కర్ణాటకతో సంబంధం లేకుండా కావేరీకి నీటిని తరలిస్తాం’ అని గడ్కారీ వెల్లడించారు. అలాగే చెన్నై – బెంగళూరుల మధ్య రూ. 20 వేల కోట్లతో ఎక్స్ప్రెస్ వేను నిర్మిస్తామని చెప్పారు. తమిళనాడులోని తాంబరం–చెంగల్పట్టు మధ్య రూ. 2,250 కోట్లు, పూనామలీ నుంచి మదురవొయల్ మధ్య రూ. 1500 కోట్లతో, చెన్నై– ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు మధ్య రూ. 1000 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్స్ నిర్మాణ ప్రతిపాదనలు ఉన్నాయని తెలిపారు. -
చేతులు కలిపిన ఓపీఎస్, ఈపీఎస్
-
మోడరన్ పోలీస్
► ఇక పోలీస్ వ్యవస్థ ఆధునికీకరణ ► సీఎం 54 వరాలు ► పళని వ్యాఖ్యలకు సభలో సెన్సార్ ► మోనో రైలుకు ఒకే ► ప్రయోగాత్మకంగా బ్యాటరీ బస్సులు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు కలిగిన తమిళ పోలీసు యంత్రాంగాన్ని మోడరన్గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఆధునికీకరణ, సరికొత్త టెక్నాలజీని అందిపుచ్చుకునేందుకు సిద్ధం అయింది. ఇందుకు తగ్గట్టుగా పోలీసులకు అసెంబ్లీ వేదికగా సీఎం పళని స్వామి శనివారం 54 వరాలను కురిపించారు. ఇక, చెన్నైలో మోనో రైలు, ప్రయోగాత్మకంగా బ్యాటరీ బస్సు సేవలు సాగుతాయని రవాణా శాఖ మంత్రి ఎంఆర్ విజయభాస్కర్ ప్రకటించారు. ఇదిలా ఉండగా సీఎం పళని స్వామి ప్రసంగంలోని కొన్ని వ్యాఖ్యలకు స్పీకర్ సెన్సార్ కట్ అన్నట్టుగా సభా పద్దుల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. సాక్షి, చెన్నై : రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థపై ముఖ్యమంత్రి పళని స్వామి ప్రశంసల వర్షం కురిపించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శనివారం ఉదయం ప్రశ్నోత్తరాల సమయంలో పలురు సభ్యుల ప్రశ్నలకు మంత్రులతో పాటుగా సీఎం కూడా సమాధానాలు ఇచ్చారు. ఇందులో రాజీవ్ హత్య కేసు నిందితుడు పేరరివాలన్కు పరోల్ విషయంగా ప్రధాన ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ సంధించిన ప్రశ్నకు పరిశీలిస్తామని సీఎం హామీ ఇచ్చారు. అలాగే, డీఎంకే శాసనసభా పక్ష ఉపనేత దురై మురుగన్ విజ్ఞప్తి మేరకు వేలూరు జిల్లా పరిధిలో పోలీసు స్టేషన్ల పరిధి పెంపు, అనుసంధానం తదితర అంశాలకు అంగీకారం తెలియజేశారు. తదుపరి సీఎం పళని స్వామి తన పరిధిలోని హోం శాఖకు నిధుల కేటాయింపులపై సాగిన చర్చలో ప్రసంగాన్ని అందుకున్నారు. పోలీసుల వ్యవస్థ వల్లే రాష్ట్రం శాంతివనం రాష్ట్ర పోలీసుల పనితీరును గుర్తుచేస్తూ సీఎం ప్రశంసలతో ముంచెత్తారు. రాష్ట్రంలో నేరాలు తగ్గుముఖం పట్టాయని గొప్పలు చెప్పుకునే యత్నం చేశారు. రౌడీలు, అసాంఘిక శక్తుల్ని ఉక్కుపాదంతో అణచివేస్తున్నామని ధీమా వ్యక్తంచేశారు. రాష్ట్రం శాంతివనంగా ఉండబట్టే, దేశ విదేశాల నుంచి పెట్టుబడుల్ని ఇక్కడ పెట్టేందుకు పెద్ద సంఖ్యలో సంస్థలు తరలివచ్చేందుకు సిద్ధం అవుతున్నాయని ఆశాభావం వ్యక్తంచేశారు. పోలీసుల నిత్యం ప్రజల కోసం శ్రమిస్తున్నారని వివరిస్తూ, వారిని విమర్శించడం కొందరు పనిగా పెట్టుకుని ఉన్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇక, రాష్ట్ర పోలీసు యంత్రాంగాన్ని మోడరన్గా తీర్చిదిద్దనున్నామని ప్రకటించారు. ఆ మేరకు ఆధునికీకరణ, అత్యాధునిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవడం లక్ష్యంగా సైబర్ వేదిక ఏర్పాటు కానుందని వివరించారు. అలాగే, పోలీసులకు 54 వరాలను ప్రకటించారు. ఆ మేరకు చెన్నైలో ట్రాఫిక్ జరిమానా మోత మోగించేందుకు ఎలక్ట్రానిక్ స్పాట్ ఫైన్ పరికరాలను కొనుగోలు చేయనున్నారు. విధుల్లో వీరత్వం, సాహసం ప్రదర్శించిన పోలీసులకు అందించే సీఎం పతకం భత్యం రూ.300 నుంచి రూ.900లకు, పోలీసు పతకానికి రూ.200 నుంచి రూ.300కు పెంచారు. పోలీసుల కోసం ప్రత్యేక స్టోర్స్, కోయంబత్తూరు, సేలం, ధర్మపురిలో కొత్త పోలీసు స్టేషన్లు, అగ్నిమాపక సిబ్బందికి వైద్య ఖర్చుల పెంపు, ఖాళీల భర్తీలు, పదోన్నతులు తదితర అంశాలు ఆ వరాల్లో ఉన్నాయి. మోనో రైలు, బ్యాటరీ బస్సు సీఎం ప్రసంగానికి ముందుగా రవాణాశాఖ మంత్రి ఎంఆర్ విజయభాస్కర్ ఓ ప్రకటన చేశారు. ఆమేరకు చెన్నైలో మోనో రైలు సేవకు తగ్గ పనులు త్వరలో చేపట్టనున్నామని వివరించారు. రూ.6,402 కోట్లతో ఈ పనులు సాగనున్నాయని తెలిపారు. పూందమల్లి–కత్తి పార, మార్గం మధ్యలో పోరూర్ నుంచి వడపళని వరకు రూ.3,267 కోట్లతో 20 కి.మీ దూరం మార్గం, వండలూరు నుంచి వేళచ్చేరి వరకు రూ.2,135 కోట్లతో 22 కి.మీ దూరం మార్గం పనులు చేపట్టనున్నామన్నారు. అలాగే, చెన్నైలో ప్రయోగాత్మకంగా బ్యాటరీ బస్సు సేవలకు చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. సీఎం వ్యాఖ్యల తొలగింపు సభలో టాస్మాక్ ఆందోళన గురించి సీఎం పళని స్వామి ప్రసంగిస్తూ, ఆందోళనలు ఫ్యాషన్గా మారాయని తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఇందుకు ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్ ఆక్షేపణ వ్యక్తంచేశారు. ప్రజల పోరాటాలను ఫ్యాషన్గా సీఎం వ్యాఖ్యానించడాన్ని ఖండించారు. దీంతో సీఎం వ్యాఖ్యలను సభ పద్దుల నుంచి తొలగిస్తున్నట్టు స్పీకర్ ధనపాల్ ప్రకటించారు. ఇక, అసెంబ్లీలో తన పరిధిలోని శాఖల నిధుల కేటాయింపుల చర్చ ముగియడంతో సీఎం పళని స్వామి నేరుగా మెరీనా తీరం చేరుకున్నారు. అక్కడ దివంగత సీఎం, అమ్మ జయలలిత సమాధి వద్ద నివాళులర్పించారు. -
అదే పట్టు!
► చర్చకు స్పీకర్ నిరాకరణ ► ప్రతిపక్షాల వాగ్యుద్ధం ► డీఎంకే వాకౌట్ ► ఎక్కడైనా ఎయిమ్స్కు ఓకే ► విద్యలో మార్పులు అసెంబ్లీలో గురువారం కూడా ముడుపుల వ్యవహారంపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. స్పీకర్ నిరాకరించడంతో, వాగ్యుద్ధం సాగింది. స్పీకర్ పాత పురాణం అందుకోవడంతో సభ నుంచి డీఎంకే సభ్యులు వాకౌట్ చేశారు. రాష్ట్రంలో ఎయిమ్స్ ఆస్పత్రి ఎక్కడ నిర్మించినా తమకు ఆమోదమేనని ప్రభుత్వం ప్రకటించింది. విద్యా విధానంలో మార్పులకు తగ్గ ముసాయిదాలు అసెంబ్లీకి చేరాయి. సాక్షి, చెన్నై :లియజేసింది. ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్ స్పందిస్తూ, ఐదుచోట్ల పరిశీలన సాగినట్టు గుర్తు చేశారు. ఎక్కడ ఏర్పాటుచేసినా, అందుకు తాము ఆమోదం తెలుపు అసెంబ్లీలో గురువారం కూడా ఉద్రిక్తత చోటుచేసుకుంది. సమావేశాల్లో భాగంగా ఉదయం ప్రశ్నోత్తరాల సమయంలో డీఎంకే సభ్యులు సంధించిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇచ్చారు. ఇందులో ఎయిమ్స్ ఆస్పత్రి ఏర్పాటు వ్యవహారం కూడా ఉండడంతో, ఈ విషయంలో తమ స్పష్టతను ప్రభుత్వం తెతామని స్పష్టంచేశారు. నీట్కు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయానికి తమ ప్రభుత్వం కట్టుబడే ఉందన్నారు. అలాగే, షోళింగనల్లూరులో వంద పడకల ఆస్పత్రి ఏర్పాటు చేయనున్నామని ప్రకటించా రు. సీఎం పళని స్వామి సైతం తన ప్రసంగంలో ఎయిమ్స్, నీట్ విషయంగా ప్రభుత్వ స్పష్టతను వ్యక్తంచేశారు. ఈ సమయంలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదంటూ డీఎంకే సభ్యులు రంగనాథన్, అన్భళగన్ స్పీకర్ ధనపాల్ను గురిపెట్టి మాటల తూటాలు పేల్చారు. రగడ సృష్టించమంటారా? అని హెచ్చరించడంతో స్పీకర్ తలొగ్గక తప్పలేదని చెప్పవచ్చు. విచారణకు పట్టు ప్రశ్నోత్తరాల అనంతరం సభలో ప్రధాన ప్రతి పక్షనేత ఎంకే స్టాలిన్ ముడుపుల వివాదాన్ని మళ్లీ తీసుకొచ్చారు. విచారణకు పట్టుబట్టారు. బుధవారం తమకు వ్యతిరేకంగా సభలో సాగిన తీరును ఎండగట్టే విధంగా ప్రసంగాన్ని అందుకోవడంతో స్పీకర్ ధనపాల్ అడ్డుకునే యత్నం చేశారు. కోర్టులో ఉన్న విషయం గురించి ఇక్కడ ప్రస్తావన అనవసరం అని తేల్చారు. దీంతో స్పీకర్, ప్రతిపక్ష నేత మధ్య కాసేపు వాగ్యుద్ధం సాగింది. స్పీకర్ స్వరాన్ని పెంచడంతో ప్రతిపక్ష సభ్యులు ఎదురు దాడికి దిగారు. సభలో కాసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. చివరకు స్పీకర్ పాత పురాణం అందుకుని, డీఎంకే హయంలో పత్రికల్లో వచ్చిన వార్తలను ఖాతరు చేయకుండా సాగిన సభాపర్వాన్ని గుర్తు చేస్తూ ప్రసంగాన్ని అందుకున్నారు. ఇప్పుడు ముడుపుల వ్యవహారం కూడా పత్రికల్లో వచ్చిన కథనమేనంటూ గుర్తుచేశారు. దీంతో స్పీకర్ తీరును నిరసిస్తూ సభ నుంచి డీఎంకే సభ్యులు వాకౌట్ చేశారు. ఈ సందర్భంగా స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ, ఈ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ గవర్నర్ను కలిసి ఒత్తిడి తీసుకురాబోతున్నామని ప్రకటించారు. విద్యావిధానంలో మార్పులు నీట్ పుణ్యమా అని రాష్ట్రంలోని విద్యావిధానంలో మార్పులకు ప్రభుత్వం సిద్ధం అయ్యింది. ఇందుకు తగ్గ ముసాయిదా అసెంబ్లీకి చేరింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సెంగోట్టయన్ ఈ ముసాయిదాలను అసెంబ్లీ ముందుంచారు. ప్లస్ ఒన్ పబ్లిక్, ప్లస్ టూ పరీక్షల్లో మార్కుల తగ్గింపులతో పాటుగా పాఠ్యాంశాల మార్పు తదితర అంశాలతో ఈ ముసాయిదాను సిద్ధం చేసి ఉన్నారు. అలాగే, 30 ప్రైమరీ స్కూళ్ల ఏర్పాటు, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకున్నట్టు సెంగోట్టయన్ అసెంబ్లీలో ప్రకటించారు. -
అన్నింటికీ ఆమోదం!
► రిజిస్ట్రేషన్లో మార్కెట్ విలువ తగ్గింపు ► జీఎస్టీకి ఆమోదం ► విద్యా మార్పునకు గ్రీన్ సిగ్నల్ ► అసెంబ్లీ వేదికగా అధికార ప్రకటనలు ► మంత్రి వర్గ భేటీలో నిర్ణయం అసెంబ్లీ వేదికగా చర్చించాల్సిన అంశాలు, తీసుకు రావాల్సిన ముసాయిదాలు, విద్యా విధానంలో మార్పులు, కొత్త పథకాల కు మంత్రి వర్గం ఆమోద ముద్ర వేసింది. భూముల రిజిస్ట్రేషన్లలో మార్కెట్ విలువ 33 శాతం మేరకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ వేదికగా అన్ని నిర్ణయాలు అధికారికంగా ప్రకటించనున్నారు. సాక్షి, చెన్నై : సీఎంగా ఎడపాడి పళని స్వామి పగ్గాలు చేపట్టినానంతరం మంత్రి వర్గంతో చర్చించకుండా ఏ నిర్ణయాన్ని తీసుకోవడం లేదని చెప్పవచ్చు. ఆయన పగ్గాలు చేపట్టిన వంద రోజుల్లో ఐదు సార్లు కేబినెట్ను సమావేశ పరచడం ఇందుకు ఓ నిదర్శనం. ఈనెల 14వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు సాగనున్నాయి. ఇందులో చర్చించాల్సిన అంశాలు, ప్రధాన ప్రతి పక్షాన్ని ఎదుర్కొనేందుకు తగ్గ అస్త్రాలను సిద్ధం చేసుకునే విధంగా గురువారం సచివాలయంలో మంత్రి వర్గ సమావేశం సాగింది. సీఎం పళని స్వామి నేతృత్వంలో జరిగిన ఈç Üమావేశానికి 33 మంది మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్తో పాటు అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు. గంటన్నర పాటు ఈ సమావేశం సాగింది. ప్రధానంగా అసెంబ్లీ సమావేశాలను దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిసింది. అన్నింటికీ ఆమోదం: మంత్రి వర్గంలో తొలుత శాఖల వారీగా సీఎం సమీక్ష సాగించినట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో శాఖల వారీగా నిధుల కేటా యింపుల చర్చ సాగనున్న దృష్ట్యా, ఆయా శాఖల పరిధిలోని పథకాలు, సమస్యలు, నిధులు, పెండింగ్ ప్రాజెక్టులు తదితర అంశాలను సమీక్షించారు. ఆయా శాఖలకు 2017–18కిగాను కేటాయింపుల గురించి చర్చించారు. అసెంబ్లీలో ఆయా శాఖల వారీగా ప్రవేశ పెట్టనున్న కొత్త ముసాయిదాలు మంత్రి వర్గం ముందుకు వచ్చినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఆ మేరకు ప్రధానంగా నీట్కు దీటుగా విద్యార్థులను తీర్చిదిద్దడం లక్ష్యంగా విద్యా విధానంలో మార్పు, జూలై ఒకటో తేది నుంచి అమల్లోకి రానున్న జిఎస్టీ గురించి చర్చ సాగింది. జిఎస్టీలో కొన్ని మినహాయింపుల మీద పరిశీలన సాగినట్టు తెలిసింది. అమ్మ పేరిట ఉన్న పథకాలను విస్తృతం చేయడం లక్ష్యంగా శాఖల వారీగా ప్రత్యేక నిధుల కేటాయింపు, కొత్త అంశాలను అసెంబ్లీ వేదికగా ప్రకటించేందుకు నిర్ణయించి ఉన్నారు.అలాగే, అసెంబ్లీలో అమ్మ జయలలిత తరహాలో 110 నిబంధనల మేరకు ప్రత్యేక ప్రకటనలు చేయడానికి కార్యచరణ సిద్ధం చేసి ఉన్నారు. అమ్మ పేరిట ఏదేని కొత్త పథకాలను అమల్లోకి తీసుకొచ్చేందుకు తగ్గ కసరత్తులకు ఈసందర్భంగా అధికారుల్ని ఆదేశించినట్టు తెలిసింది. ఇక, రాష్ట్రంలో నెలకొన్న ఇసుక సంక్షోభాన్ని పరిగణలోకి తీసుకుని ప్రభుత్వ నేతృత్వంలో 70 చోట్ల క్వారీల ఏర్పాటుకు పరిశీలన సాగించి, అందుకు తగ్గ ఆమోదం తెలిపినట్టు సంకేతాలు వెలువడ్డాయి.ఇక, కోర్టు ఆదేశాలు, గతంలో పెంచినభూమి విలువ మేరకు ప్రస్తుతం రిజిస్ట్రేషన్శాఖ ఢీలా పడ్డ విషయం తెలిసిందే.ఈ శాఖను బలోపేతం చేయడం లక్ష్యంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. భూముల రిజిస్ట్రేషన్ సమయంలో మార్కెట్ విలువలో స్థలం విలువ 33 శాతం తగ్గించేందుకు చర్యలు తీసుకుంటూ, శుక్రవారం నుంచే అమలు చేయడానికి నిర్ణయించడం విశేషం. అలాగే, స్థానిక ఎన్నికల మీద దృష్టి పెడుతూ కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిసింది. రిజర్వేషన్ల వర్తింపు వ్యవహారంపై చర్చ సాగినా, తది నిర్ణయం పెండింగ్లో పెట్టినట్టు తెలిసింది. ఇక, అసెంబ్లీలో ప్రధాన ప్రతి పక్షాన్ని ఎదుర్కొనే విధంగా మంత్రులు ఎవ్వరెవ్వరు ఏఏ సమయాల్లో స్పందించాలి, తలా ఓ దిక్కుగా ఉన్న పార్టీ ఎమ్మెల్యేల రూపంలో సభా మందిరంలో ఏదేని చిక్కులు ఎదురు కాకుండా, గాడిలో పెట్టడం లక్ష్యంగా కొందరు మంత్రులకు ప్రత్యేక బాధ్యతలను సీఎం అప్పగించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. లక్ష్యంగా విద్యా విధానంలో మార్పు, జూలై ఒకటో తేది నుంచి అమల్లోకి రానున్న జీఎస్టీ గురించి చర్చ సాగింది. జీఎస్టీలో కొన్ని మినహాయింపుల మీద పరిశీలన సాగినట్టు తెలిసిం ది. అమ్మ పేరిట ఉన్న పథకాలను విస్తృతం చేయడం లక్ష్యంగా శాఖల వారీగా ప్రత్యేక నిధుల కేటాయింపు, కొత్త అంశాలను అసెంబ్లీ వేదికగా ప్రకటించేందుకు నిర్ణయించి ఉన్నారు.అలాగే, అసెంబ్లీలో అమ్మ జయలలిత తరహాలో 110 నిబంధనల మేరకు ప్రత్యేక ప్రకటనలు చేయడానికి కార్యచరణ సిద్ధం చేశారు. అమ్మ పేరిట ఏదేని కొత్త పథకాలను అమల్లోకి తీసుకొచ్చేందుకు తగ్గ కసరత్తులకు ఈసందర్భంగా అధికారుల్ని ఆదేశించినట్టు తెలిసింది. ఇక, రాష్ట్రంలో నెలకొన్న ఇసుక సంక్షోభాన్ని పరిగణలోకి తీసుకుని ప్రభుత్వ నేతృత్వంలో 70 చోట్ల క్వారీల ఏర్పాటుకు పరిశీలన సాగించి, అందుకు తగ్గ ఆమోదం తెలిపినట్టు సంకేతాలు వెలువడ్డాయి.ఇక, కోర్టు ఆదేశాలు, గతంలో పెంచినభూమి విలువ మేరకు ప్రస్తుతం రిజిస్ట్రేషన్శాఖ ఢీలా పడ్డ విషయం తెలిసిందే.ఈ శాఖను బలోపేతం చేయడం లక్ష్యంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. భూముల రిజిస్ట్రేషన్ సమయంలో మార్కెట్ విలువలో స్థలం విలువ 33 శాతం తగ్గించేందుకు చర్యలు తీసుకుంటూ, శుక్రవారం నుంచే అమలు చేయడానికి నిర్ణయించడం విశేషం. అలాగే, స్థానిక ఎన్నికల మీద దృష్టి పెడుతూ కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిసింది. రిజర్వేషన్ల వర్తింపు వ్యవహారంపై చర్చ సాగినా, తది నిర్ణయం పెండింగ్లో పెట్టినట్టు తెలిసింది. ఇక, అసెంబ్లీలో ప్రధాన ప్రతి పక్షాన్ని ఎదుర్కొనే విధంగా మంత్రులు ఎవరెవ్వరు ఏఏ సమయాల్లో స్పందించాలి, తలా ఓ దిక్కుగా ఉన్న పార్టీ ఎమ్మెల్యేల రూపంలో సభా మందిరంలో ఏదేని చిక్కులు ఎదురు కాకుండా, గాడిలో పెట్టడం లక్ష్యంగా కొందరు మంత్రులకు ప్రత్యేక బాధ్యతలను సీఎం అప్పగించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. -
దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్
రాష్ట్రంలో దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్ అమల్లోకి వచ్చింది. ఇందుకు తగ్గ ఉత్తర్వులు మంగళవారం జారీ అయ్యా యి. ఈ మేరకు అంధులకు ఒక శాతం, బధిరులకు ఒక శాతం, డిసేబుల్డ్, మానసిక వికలాం గులకు ఒక్కొక్క శాతం అమలు చేయనున్నారు. ► అమల్లో రిజర్వేషన్ ► ప్రభుత్వం ఉత్తర్వులు సాక్షి, చెన్నై : రాష్ట్రంలోని దివ్యాంగులకు ఉద్యోగ నియామకాల్లో మూడు శాతం రిజర్వేషన్ వర్తింప చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. అమ్మ ఆశయ సాధన లక్ష్యంగా ముందుకు సాగుతున్న ప్రభుత్వం ఆ రిజర్వేషన్ పెంపునకు చర్యలు తీసుకుంది. దివ్యాం గుల హక్కుల చట్టం 2016 మేరకు వారికి నాలుగు శాతం రిజర్వేషన్ వర్తింప చేయడానికి నిర్ణయించారు. ఇందుకు తగ్గ కసరత్తులు ముగియడంతో సీఎం పళని స్వామి ఆదేశాల మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇందుకు తగ్గ ప్రకటనను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఆ మేరకు..1981 నుంచి రాష్ట్రం లోని దివ్యాంగుల సంక్షేమం లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక రిజర్వేషన్ను అమలు చేస్తూ వస్తున్నట్టు వివరించారు. దివ్యాంగులకు సంక్షేమ బోర్డు, వారికి సదుపాయాల మెరుగు లక్ష్యంగా ముందుకు సాగడమే కాకుండా, ఆ బోర్డు, శాఖలకు ప్రత్యేకంగా కొత్త భవనాల నిర్మాణం సాగినట్టు పేర్కొన్నారు. ఉద్యోగ పరంగా దివ్యాంగులకు మరింత అవకాశం కల్పించడం లక్ష్యంగా ప్రస్తుతం నాలుగు శాతం రిజర్వేషన్ అమల్లోకి తీసుకొచ్చామన్నారు. దీనిని నాలుగు విభాగాలు విభజించడం జరిగిందని వివరించారు. అంధులకు ఒక శాతం, బధిరులకు మరో శాతం, కాళ్లు, చేతులు దెబ్బ తిన్న వారికి, మానసిక వికలాంగులకు తలా ఓ శాతం చొప్పున రిజర్వేషన్ అమలు చేస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థలు, విద్యా సంస్థలు, ఈ రిజర్వేషన్ అమలు వర్తింప చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగిందని ప్రకటించారు. ముందుగా, సచివాలయంలో సీఎం పళనిస్వామి నేతృత్వంలో ప్రత్యేక పథకాలు, గ్రామీణాభివృద్ధి, దివ్యాంగుల సంక్షేమ శాఖ విభాగాలతో సమీక్ష సమావేశం జరిగింది. ఇందులో ఆయా శాఖల మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్ పాల్గొన్నారు. -
సమీక్షలకు శ్రీకారం
► సీఎం బిజీ ►మంత్రులతో చర్చ ► అసెంబ్లీకి సన్నద్ధం అసెంబ్లీ సమావేశాలను దృష్టిలో ఉంచుకుని శాఖల వారీగా సమీక్షలకు సీఎం పళనిస్వామి సిద్ధం అయ్యా రు. సోమవారం పర్యాటక, దేవాదాయ, ప్రజా పనుల శాఖ మంత్రులు, అధికారులతో సమావేశమయ్యారు. సీనియర్ మంత్రులతో భేటీ అయ్యారు. సాక్షి, చెన్నై: అసెంబ్లీ సమావేశాలు జూన్ ఏడు లేదా ఎనిమిదో తేదీ నుంచి ప్రారంభించేందుకు సన్నాహాలు సాగుతున్న విషయం తెలిసిందే. ప్రధాన ప్రతిపక్షం డీఎంకేను ఎదుర్కొనేందుకు తగ్గ అస్త్రాలను సిద్ధం చేసుకునే పనిలో పాలకులు నిమగ్నం అయ్యారు. శాఖల వారీగా కేటాయింపులు, పథకాలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల మీద దృష్టి కేంద్రీకరించి పనిలో పడ్డారు. ఉదయం సచివాలయంకు దాదాపుగా అందరూ మంత్రులు హాజరయ్యారు. వారి వారి శాఖల్లో సమీక్షలతో బిజీ అయ్యారు. ఆయా శాఖల్లోని వ్యవహారాల మీద సీఎం పళనిస్వామి సైతం దృష్టి సారించారు. ఇందులో భాగంగా రోజుకు రెండు మూడు శాఖలు చొప్పున సమీక్షించేందుకు నిర్ణయించారు. ఆ దిశగా దేవాదాయ, పర్యాటక, ప్రజా పనుల శాఖల్లో సాగుతున్న పనులు, నిధులు, వ్యయాలు, పథకాలు, పెండింగ్ ప్రాజెక్టులు, కొత్త కార్యక్రమాలు తదితర అంశాలపై సీఎం సమీక్షించారు. ఆయా శాఖల మంత్రుల సమక్షంలో కార్యదర్శులు పవర్పాయింట్ ప్రజంటేషన్ ద్వారా సీఎంకు వివరించారు. ఆయా శాఖల మీద చర్చ సాగే సమయంలో ప్రతిపక్షాల్ని ఎదుర్కొనే విధంగా అన్ని సమాధానాలు, అన్ని వివరాలు లెక్కలతో సహా ముందు ఉంచుకుని తిప్పికొట్టే ప్రసంగాలు సాగించాలని ఈ సందర్భంగా సీఎం ఆయా శాఖల మంత్రులకు సూచించే పనిలో పడ్డారు. ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు సీఎం పళని స్వామిని కలిసి వినతి పత్రం సమర్పించడం గమనార్హం. సీఎంతో భేటీ: పళని స్వామి సర్కారుకు వ్యతిరేకంగా పన్నెండు మంది ఎమ్మెల్యే కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇందులో మాజీ మంత్రులు పళనియప్పన్, సెంథిల్ బాలాజీ, తోపు వెంకటాచలం కూడా ఉన్నారు. వీరితో పాటుగా మరో ఐదుగురు ఎమ్మెల్యేలు ఉదయం సచివాలయం వచ్చారు. సమీక్షలో బిజీగా ఉన్న సీఎంను కలిసేందుకు యత్నించారు. సమీక్ష ముగిసినానంతరం వీరికి అనుమతి లభించిందని చెప్పవచ్చు. సీఎంతో ఈ ఎనిమిది మంది గంట పాటుగా సమావేశం అయ్యారు. నియోజకవర్గాల్లోని సమస్యలు, కూవత్తూరు క్యాంపులో తమకు ఇచ్చిన హామీల అమలు నినాదంతో ఓ చిట్టాను సీఎంకు అందజేసి వెళ్లినట్టు సమాచారం. దీంతో సీనియర్ మంత్రులు సెంగోట్టయన్, తంగమణి, జయకుమార్, ఎస్పీ వేలుమణిలను తన ఛాంబర్కు సీఎం పిలిపించుకుని ప్రత్యేకంగా భేటీ కావడం గమనార్హం. అసెంబ్లీ సమావేశాలకు చర్యలు చేపట్టిన నేపథ్యంలో ఈ ఎమ్మెల్యేలు తమకు ఇచ్చిన జాబితాను పరిశీలించి, వాటి అమలు మీద తగు నిర్ణయం తీసుకునే పనిలో సీఎం నిమగ్నమైనట్టు తెలిసింది. అమ్మ ప్రభుత్వానికి నేటితో ఏడాది : పాలన మీద పట్టు బిగించే విధంగా , ప్రతిపక్షాన్ని ఎదుర్కొనే రీతిలో పళని సర్కారు సిద్ధం అవుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారంతో అమ్మ ప్రభుత్వం మళ్లీ అధికార పగ్గాలు చేపట్టి ఏడాది కానున్నడం గమనార్హం. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు అమ్మ జయలలితకు మళ్లీ పట్టం కట్టారు. మే 23వ తేది వరుసగా రెండో సారి సీఎం పగ్గాలు జయలలిత చేపట్టారు. ఈ ఏడాది కాలంలో ఎన్నో విషాదాలు, ఎన్నో ఘటనలు సాగినా, ప్రజలకు ఒరిగిందేమీ లేదు. అమ్మ జయలలిత మరణంతో పన్నీరు సీఎం కావడం, ఆయన్ను పదవి నుంచి దించి చిన్నమ్మ శశికళ సీఎం అయ్యేందుకు ప్రయత్నాలు చేపట్టి, చివరకు అక్రమాస్తుల కేసు రూపంలో కటకటాల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి. ఇక, పళని తన నేతృత్వంలో అమ్మ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నా, ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు అంతంత మాత్రమే. ఢిల్లీకి సీఎం : ముఖ్యమంత్రి పళణిస్వామి మంగళవారం ఢిల్లీ బయలుదేరనున్నారు. ప్రధాని నరేంద్రమోదీతో బుధవారం భేటి కానున్నారు. మాజీ సీఎం పన్నీర్ సెల్వం ప్రధానితో రెండు రోజుల క్రితం భేటి అయిన నేపథ్యంలో హఠాత్తుగా సీఎం ఢిల్లీ పర్యటన సాగునుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. -
అన్నీతానై..
► సీఎం భుజస్కంధాలపై పార్టీ ► చిన్నచూపు చూస్తున్నారని చిన్నమ్మ కినుక అమ్మ మరణం, చిన్నమ్మ జైలు జీవనం, దినకరన్ కటకటాల పాలుతో ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి అన్నీతానై వ్యవహరించాల్సిన పరిస్థితి నెలకొంది. కుడి ఎడమలగా పార్టీని, ప్రభుత్వాన్ని నడిపిస్తూ నెట్టుకొస్తున్నారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: అక్రమ ఆస్తుల కేసులో పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ జైలుపాలయ్యారు. చిన్నమ్మ లేని లోటును తీర్చేం దుకు ఉప ప్రధాన కార్యదర్శిగా నియమితులైన టీటీవీ దినకరన్ పార్టీ సారధిగా కొన్ని నెలలపాటు హడావుడి చేశారు. ఆర్కేనగర్ ఎన్నికల్లో ఓటర్లకు నోట్లు పంచి, రెండాకుల చిహ్నం కోసం ఎన్నికల సంఘానికి లంచం ఎరవేసి అప్రతిష్టపాలైన దినకరన్ సైతం ఢిల్లీ పోలీసుల చేతికి చిక్కి జైలుపక్షిగా మారి పోయారు. అన్నాడీఎంకే నుంచి చీలిపోయిన మాజీ ముఖ్య మంత్రి పన్నీర్సెల్వంతో సంధి కుదుర్చుకోవడం ద్వారా పార్టీ పగ్గాలు అప్పగించాలని ఎడపాడి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో పార్టీ బాధ్యతలు ఎడపాడి భరించక తప్పలేదు. అన్నాడీఎంకే అమ్మ వర్గం ప్రధాన కార్యాలయ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. పార్టీ తరఫున సంతాపం, ఇతర ప్రకటనలను ఎడపాడే విడుదల చేస్తున్నారు. చిన్నమ్మ ఆవేదన: జెలుకెళ్లిన కొత్తల్లో వరుసపెట్టి వచ్చేవారంతా చాలించేశారు. అధికారం అనుభవిస్తున్న వారంతా తనను చిన్నచూపు చూస్తున్నారని బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ ఆవేదన చెందుతున్నట్లు సమాచారం. ఆస్తుల కేసులో శశికళకు నాలుగేళ్ల జైలు శిక్ష పడగానే తల్లడిల్లిపోయిన మంత్రులు, పార్టీ నేతలు జైలు వద్ద క్యూకట్టారు. మాజీ మంత్రులు వలర్మతి, గోకుల ఇందిర, పార్టీ అధికార ప్రతినిధి సీఆర్ సరస్వతి బెంగళూరు జైలు సిబ్బంది చేత తరిమివేయబడ్డారు. ములాఖత్ నిబంధనలను ధిక్కరించి జైలు వద్దకు వస్తే ఊరుకోమని బెంగళూరు జైలు అధికారులు నేతలను హెచ్చరించా ల్సివచ్చింది. శశికళ, ఇళవరసి, సుధాకరన్ రక్త సంబంధీకులను మాత్రమే అనుమతిస్తామని జైలు అధికారులు తేల్చిచెప్పారు. చిన్నమ్మ దర్శనం కోసం జైలు అధికారులను అంతగా విసిగించిన పార్టీ నేతల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టింది. నేతలెవరూ తనవైపు రాకపోవడంతో చిన్నమ్మ చిన్నబుచ్చుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ, ప్రభుత్వం తన చేతుల నుంచి జారి పోయినట్లుగా భావిస్తూ విరక్తి చెందుతోంది. ఇళవరసి కుమారుడు వివేక్ ఇటీవల శశికళను కలుసుకోగా ఒంటరి దాన్నై పోయాను అని వాపోయినట్లు సమాచారం. జయలలిత ధరించే ఆకుపచ్చ చీరను తెచ్చిస్తే కొంత ఊరటగా ఉంటుందని వివేక్ను కోరడంతో చెన్నై నుంచి తీసుకెళ్లి అప్పగించాడు. ప్రభుత్వాన్ని రద్దు చేయాలి: దీప రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించినందున ప్రభుత్వాన్ని వెంటనే రద్దు చేయాలని ఎంజీఆర్ అమ్మ దీప పేరవై ప్రధాన కార్యదర్శి దీప శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత తన హయాంలో తమిళనాడును దేశంలోనే శాంతిధామంగా పరిపాలించగా, ఆమె మరణం తరువాత బాధ్యతలు చేపట్టిన పన్నీర్సెల్వం, ఆ తరువాత అధికారంలోకి వచ్చిన ఎడపాడి పళనిస్వామి అరాచకపాలనకు తావిచ్చారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజల ప్రశాంత జీవనం కోసం ఆర్టికల్ 356 ప్రయోగించి శశికళ బినామీ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని కోరారు. -
సంకటంలో పళని సర్కారు
► ఐటీ లేఖతో ఉత్కంఠ ► మంత్రుల మెడకు ఉచ్చు ► శేఖర్రెడ్డి డైరీలో అవినీతి భాగోతం సాక్షి, చెన్నై: ఆదాయపన్ను శాఖ రూపంలో సీఎం పళనిస్వామి సర్కారు సంకటంలో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంట్రాక్టర్ శేఖర్రెడ్డి ఇంట్లో లభించిన డైరీలోని గుట్టును బయట పెట్టే రీతిలో ఐటీ వర్గాలు దూకుడు పెంచడం చర్చకు దారితీసింది. ఈ వ్యవహారం మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారుల మెడకు చుట్టుకోవచ్చన్న సంకేతాలు వెలువడుతున్నాయి. అమ్మ జయలలిత మరణం తదుపరి అన్నాడీఎంకేలో చోటు చేసుకుంటున్న పరిణామాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అదే సమయంలో పళని ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే విధంగా ఐటీ దాడులు హోరెత్తాయి. పెద్ద నోట్ల రద్దు సమయంలో సాగిన దాడులు ఓ వైపు ఉం టే, తదుపరి చోటు చేసుకున్న పరిణామాలు, ఆర్కేనగర్ ఉప ఎన్నికల నేపథ్యంలో సాగిన దాడులు మరోవైపు పళని ప్రభుత్వం నెత్తిన ఐటీ ఒత్తిడి పెరిగినట్టు అయింది. ఈ పరిస్థితుల్లో పెద్ద నోట్ల రద్దు సమయంలో పట్టుబడ్డ కాంట్రాక్టర్ శేఖర్రెడ్డి ఇంట్లో లభించిన డైరీ రూపంలో తాజాగా పళని ప్రభుత్వం సంకటంలో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ సమయంలో తాను సీఎంగా లేనప్పటికీ, తాజాగా, అప్పటి భారాన్ని తాను మోయాల్సిన పరిస్థితి పళనికి తప్పడం లేదని చెప్పవచ్చు. అప్పటి దాడుల్లో పట్టుబడ్డ శేఖర్రెడ్డి డైరీలో ఉన్న కమీషన్లు, అవినీతి చిట్టాను గురి పెట్టి పళని ప్రభుత్వానికి ఐటీ లేఖ సంధించడం చర్చకు దారి తీసింది. ఐటీతో సంకటం : టీనగర్లోని శేఖర్రెడ్డి ఇంట్లో సాగిన దాడుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సమయంలో అనేక కీలక ఆధారాలు, లెక్కలోకి రాని నగదు, డైరీలు ఐటీ వర్గాలకు చిక్కాయి. ఇందులో ఓ డైరీలో కాంట్రాక్టర్గా తాను పొందిన లబ్ధికి ప్రతిఫలంగా కమీషన్లు పొందిన వారి వివరాలు ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఇందులో పలువురు మంత్రులు, అ«ధికారులు, ఎమ్మెల్యేల పేర్లుకూడా ఉన్న సమాచారం చర్చకు దారి తీసింది. శేఖర్రెడ్డి వ్యవహారం ఓ వైపు సీబీఐ, మరో వైపు ఈడీ, ఇంకో వైపు ఆదాయపన్ను శాఖల చేతిలో ఉన్నా, ఆ డైరీ రూపంలో సంకటం మాత్రం పళని ప్రభుత్వానికి తప్పదేమోనన్న ఉత్కంఠ బయలు దేరింది. లేఖాస్త్రం ఉత్కంఠ : అన్నాడీఎంకేలోకి విలీనం అంటూ కొన్నాళ్లు సమయాన్ని సాగదీసిన మాజీ సీఎం పన్నీరు సెల్వం, శుక్రవారం తన రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుట్టే సమయంలో చేసిన ప్రకటన కొత్త చర్చకు తెర లేపింది. త్వరలో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు అని ఆయన చేసిన వ్యాఖ్యలతో పళని శిబిరంలో కలవరం బయలు దేరింది. మెజారిటీ శాతం ఎమ్మెల్యేలు తన వెంట ఉండగా, రాష్ట్రపతి ఎన్నికల నిమిత్తం కేంద్రం తమ మద్దతు ఓట్ల కోసం ఎదురు చూస్తున్న సమయంలో పన్నీరు వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించక తప్పలేదు. ఆయన ఆ వ్యాఖ్యలు చేసిన మరుసటిరోజే పళని ప్రభుత్వం సంకట పరిస్థితుల్ని ఎదుర్కొనే విధంగా ఐటీ లేఖాస్త్రం సంధించి ఉండడం ఆ శిబిరంలో ఉత్కంఠ రేపింది. ఆ డైరీలోని కమీషన్లు, అవినీతి చిట్టాలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఉండడం, ఏసీబీని రంగంలోకి దించే రీతిలో సూచనలు ఆ లేఖలో పేర్కొన బడి ఉండడంతో అస్సలు ఏమి జరగనుందోనన్న ప్రశ్న తప్పడం లేదు. రాష్ట్రంలో పర్యటించాల్సిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటన రద్దు కావడం, తమిళనాడు ప్రభుత్వాన్ని తాము కూల్చబోమని స్పష్టం చేస్తూ, పరోక్షంగా అదే కుప్పకూలడం ఖాయం అన్నట్టుగా ప్రధాన ప్రతి పక్ష నేత, డీఎంకే కార్య నిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ వ్యాఖ్యలు సంధించిన నేపథ్యంలో ప్రస్తుతం ఆదాయపన్ను లేఖాస్త్రంతో పళనిస్వామి ప్రభుత్వ మనుగడ మీద దెబ్బ తీస్తుందా అన్న చర్చ ఊపందుకుని ఉండడం గమనార్హం. అయితే, ఈ లేఖాస్త్రం ఇదివరకు కమలం పెద్దల కనుసన్నల్లో సాగినట్లుగా ప్రచారంలో ఉన్న బెదిరింపుల పర్వంలో ఒకటిగా మిగులుతుందా లేదా రాష్ట్రపతి ఎన్నికల తదుపరి కొత్త ట్విస్ట్ దిశగా అడుగు పడుతుందా అన్నది వేచి చూడాల్సిందే. -
నేడు కేబినెట్ భేటీ
► అత్యవసరంగా ఏర్పాట్లు ► చెన్నైకు మంత్రులు రాష్ట్ర మంత్రివర్గం మంగళవారం సమావేశం కానుంది. అత్యవసరంగా పిలుపు నివ్వడంతో సొంత జిల్లాలకు వెళ్లిన మంత్రులు చెన్నైకు తిరుగు పయనం అయ్యారు. హఠాత్తుగా కేబినెట్ భేటీకి ఏర్పాట్లు చేయడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. సాక్షి, చెన్నై: రాష్ట్ర ముఖ్యమంత్రిగా పళనిస్వామి పగ్గాలు చేపట్టి రెండున్నర నెలలు కావస్తోంది. ఈ కాలంలో రెండు సార్లు కేబినెట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న పదిహేను వందలకు పైగా ఫైల్స్ మీద సంతకాలతో ఆమోద ముద్ర వేశారు. గత నెల బడ్జెట్ను సభలో దాఖలు చేయించారు. ఇరకాటాలు, అడ్డంకులు ఎదురవుతున్నా, పదవిని కాపాడుకుంటూ ప్రజాకర్షణ దిశగా తీవ్రంగానే ప్రయత్నాల్లో మునిగి ఉన్నారు. మూడు రోజులుగా తన సొంత జిల్లా సేలం లో సుడిగాలి పర్యటనతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విస్తృతం చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం అత్యవసరంగా కేబినె ట్ మీటింగ్కు చర్యలు తీసుకోవడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. సచివాలయంలో ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీ కానుంది. సీఎం చెన్నైలో లేని దృష్ట్యా, మంత్రులందరూ తమ తమ సొంత జిల్లాలకు వెళ్లి ఉన్నారు. కేబినెట్ పిలుపుతో చెన్నైకు తిరుగు పయనం అయ్యారు. అత్యవసరంగా పిలుపునిచ్చిన దృష్ట్యా, ఈ సమావేశంలో ఎలాంటి అంశాలు చర్చకు రానున్నాయో అన్న ఎదురు చూపులు పెరిగాయి. ప్రధానంగా జులై నెలాఖరులోపు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ప్రక్రియ పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. కోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల కమిషన్కు రిజర్వేషన్ల వర్తింపు ఉత్తర్వుల జారీ, ఎన్నికల నిర్వహణకు తగ్గ ఇతర ప్రక్రియలకు ప్రభుత్వ సహకారం తప్పనిసరి. అందుకు కీలక నిర్ణయాలు కేబినెట్లో తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే రైతు సమస్యల మీద చర్చ, నీట్ నుంచి తమిళనాడుకు మినహాయింపు లక్ష్యంగా ఒత్తిడి పెంచే విధంగా చర్చ సాగే అవకాశాలు ఎక్కువే. అసెంబ్లీలో బడ్జెట్ దాఖలు చేసినా శాఖల వారీగా నిధుల కేటాయింపులపై చర్చ సాగలేదు. ఇందుకు తగ్గట్టు అసెంబ్లీని సమావేశపరిచే అవకాశాలు ఉన్నాయి. కోర్టు ముందు మరో వ్యవహారంగా గుర్తింపు లేని ఇళ్ల స్థలాలకు పట్టాల మంజూరు వివాదం ఉన్న విషయం తెలిసిందే. దీనిపై కూడా చర్చించి కోర్టుకు వివరణ ఇచ్చే అవకాశాలున్నాయి. -
రహస్యంగా..
► రాత్రంతా విలీన మంతనాలు ► ఉదయాన్నే బ్యానర్ల తొలగింపు ► కార్యదర్శులతో పళనిస్వామి సంతకాలు ► నిర్ణయాధికారం ఆయన చేతికే ► సమయం కోసం పన్నీరు శిబిరం ఎదురుచూపు ► చర్చలు సాగుతాయని మునుస్వామి స్పష్టీకరణ సాక్షి, చెన్నై: ఆగిందనుకున్న చర్చలకు మళ్లీ జీవం పోసే పనిలో రెండు శిబిరాల నేతలు నిమగ్నమైనట్టున్నారు. మంగళవారం అర్ధరాత్రి పరిణామాలతో బుధవారం ఉదయాన్నే సీఎం పళనిస్వామి శిబిరం దూకుడు పెంచింది. చిన్నమ్మ బ్యానర్ల తొలగింపు, జిల్లాల కార్యదర్శులతో సంతకాల సేకరణ వెరసి విలీన చర్చ మళ్లీ తెర మీదకు వచ్చింది. అన్ని కలిసి వస్తున్నాయని, సమయానుకూలంగా చర్చలకు వెళ్తామని పన్నీరు శిబిరం ప్రకటించడంతో ఎదురుచూపులు పెరిగాయి. అన్నాడీఎంకేలో పన్నీరు, పళని శిబిరాలు ఏకమయ్యే విధంగా వారం పది రోజులుగా రాష్ట్రంలో చర్చ సాగుతూ వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఇరు శిబిరాల మధ్య పేలుతూ వచ్చిన మాటల తూటాలు, తెర మీదకు వచ్చిన కీలక డిమాండ్ల పర్వాలు వెరసి ఆదిలోనే హంసపాదు అన్నట్టుగా విలీన వ్యవహారం మారింది. చర్చలకు తేదీ నిర్ణయించినా, చివరకు రెండు శిబిరాల ఒకే వేదిక మీదకు రాలేదు. దీంతో చర్చలు ఆగినట్టేనా అన్న ప్రశ్న బయలు దేరింది. ఈ నేపథ్యంలో మంగళవారం అర్ధరాత్రి ఓ హోటల్లో రెండు శిబిరాల మధ్య సుదీర్ఘచర్చ సాగడం వెలుగులోకి వచ్చింది. పన్నీరు శిబిరం నుంచి మాజీ మంత్రులు కేపీ మునుస్వామి, నత్తం విశ్వనాథన్, పళనిస్వామి శిబిరానికి చెందిన ఎంపీ వైద్యలింగం, మంత్రి సెంగోట్టయన్ రాత్రి ఎనిమిది గంటల నుంచి ఐదు గంటల మేరకు ఆ హోటల్లో చర్చలు సాగించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఈసందర్భంగా తమ వైపు ఉన్న వాదనలు, డిమాండ్లను పళనిస్వామి శిబిరానికి తెలియజేసినట్టు సమాచారం. అదే రాత్రి పార్టీ బహిష్కృత ఉప ప్రధానకార్యదర్శి టీటీవీ దినకరన్ అరెస్టుతో ఉదయాన్నే పళని స్వామి శిబిరం దూకుడు పెంచడం గమనార్హం. చిన్నమ్మ బ్యానర్లు తొలగింపు: ఉదయాన్నే రాయపేటలోని పార్టీ కార్యాలయంలో ఉన్న చిన్నమ్మ బ్యానర్లన్నీ తొలగించారు. ఈ సమాచారంతో టీటీవీ మద్దతుదారులు అక్కడికి వచ్చి హడావుడి సృష్టించారు. గెంగవళ్లికి చెందిన రాయప్ప అనే మద్దతుదారుడు ఆత్మహత్యాయత్నం చేసుకుంటానని బెదిరించడంతో అతడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసు పహార నడుమ ఆగమేఘాలపై ఆ బ్యానర్లు తొలగించారు. ఆ స్థానంలో అమ్మ జయలలిత ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం విశేషం. ఇక, మంగళవారం కొందరు జిల్లాల కార్యదర్శులు చెన్నైకు చేరుకున్నా, బుధవారం మరి కొందరు రావడంతో మొత్తంగా 31 జిల్లాల కార్యదర్శుల వద్ద సంతకాల సేకరణ సాగడం ఆలోచించదగ్గ విషయం. పార్టీకి పెద్ద దిక్కుగా ప్రస్తుతం సీఎం పళనిస్వామికే బాధ్యతల్ని అప్పగించే అంశాలు ఆ సంతకాలు చేసిన పత్రాల్లో ఉన్నట్టు సమాచారం. ఎన్నికల కమిషన్కు ఏదేని వివరాలు, సమాచారాలు ఇవ్వాల్సి ఉంటే, ఆ బాధ్యతలు, ఇతర నిర్ణయాధికారాలన్నీ సీఎంకే కల్పించి ఉండడం చూస్తే, మళ్లీ విలీనం చర్చ తెర మీదకు వచ్చినట్టేనన్న సంకేతాలు వెలువడుతున్నాయి. బుధవారం రాత్రి కూడా మళ్లీ మంతనాలు సాగనున్నట్టు సమాచారం. ఈ దృష్ట్యా, గురువారం మరింతగా దూకుడు పెంచే విధంగా పళనిస్వామి శిబిరం ముందుకు సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో తమ డిమాండ్ మేరకు చిన్నమ్మ బ్యానర్లను తొలగించడాన్ని పన్నీరుశిబిరం ఆహ్వానించడమే కాకుండా, అన్నీ కలిసి వస్తున్నాయని, చర్చలు సరైన సమయంలో జరుగుతాయని ఆ శిబిరానికి మాజీ మంత్రి కేపీ మునుస్వామి వ్యాఖ్యానించడం విశేషం. అలాగే, పళని శిబిరానికి చెందిన మంత్రి సీవీ షణ్ముగం పేర్కొంటూ, చర్చలకు ఆహ్వానించామని, ఎప్పుడు వచ్చినా సిద్ధంగానే ఉన్నట్టు స్పందించారు. చిన్నమ్మ బ్యానర్ల విషయంలో ముందుగానే నిర్ణయం తీసుకున్నా, తొలగింపునకు కొంత సమయం పట్టిందని ఆయన వ్యాఖ్యానించారు. -
ఆకు రాలు కాలం !
-
జయంతి సాక్షిగా వారసత్వ పోరు
-
తమిళనాడులో వీడని ప్రతిష్టంభన
-
వీడని ప్రతిష్టంభన
తమిళ సీఎం పీఠంపై వీడని చిక్కుముడి - రాజ్భవన్లో రాజకీయ బంతి - గవర్నర్తో పన్నీర్, పళనిస్వామి భేటీ - పళనిని పిలుస్తారా? సభను సమావేశ పరుస్తారా? - గవర్నర్ ఏం చేస్తారనే దానిపై ఉత్కంఠ - శశికళ, పళనిస్వామిపై కిడ్నాప్ కేసు - ఇది తగదంటూ సుబ్రమణ్యస్వామి ట్వీట్ సాక్షి ప్రతినిధి, చెన్నై తమిళనాడులో రాజకీయ ప్రతిష్టంభన ఇంకా తొలగిపోలేదు. అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎంపికైన పళనిస్వామి తనకు 128 మంది ఎమ్మెల్యేల మద్దతుందని, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరి రెండు రోజులైనప్పటికీ గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్రావునుంచి ఎలాంటి స్పందన లేకపోవడంపై రాజకీయవర్గాల్లో చర్చ మొదలైంది. మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతున్నవారిని ప్రభుత్వ ఏర్పాటుకు పిలవడమే పార్లమెంటరీ సంప్రదాయమని నిపుణులు చెబుతున్నారు. అయితే ఒకే పార్టీలోని ఇరువర్గాలు పోటీ పడుతున్నప్పుడు శాసనసభను ప్రత్యేకంగా సమావేశపరచి బలపరీక్షకు అవకాశమివ్వవచ్చని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ కూడా సోమవారం ఇదే సూచించిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. మరోవైపు సీఎం పదవికై పోటా పోటీగా పావులు కదుపుతున్న పన్నీర్సెల్వం, పళనిస్వామి బుధవారం రాత్రి వేర్వేరుగా గవర్నర్ను కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాల్సిందిగా పళనిస్వామి గవర్నర్ను కోరినట్లు సమాచారం. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదని, గవర్నర్ రాజ్యాంగం ప్రకారం నిర్ణయం తీసుకుంటారని కేంద్రమంత్రి అరుణ్జైట్లీ ప్రకటించారు. మరోవైపు కువత్తూరులో ఎమ్మెల్యేలను బలవంతంగా నిర్బంధించారని శశికళ, పళనిస్వామిలపై కేసు నమోదైంది. దీనిపై తమిళనాడు డీజీపీని హెచ్చరించాలని కేంద్ర హోంమంత్రిని కోరినట్లు బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్యస్వామి ట్వీట్ చేశారు. పళనిస్వామి సీఎం అయ్యాక భద్రతా కారణాల దృష్ట్యా శశికళను తమిళనాడుకు తరలించాలని కోరారు. వీటన్నింటి నేపథ్యంలో గవర్నర్ పళనిస్వామిని పిలుస్తారా? లేక ప్రత్యేక సమావేశం నిర్వహించి బలపరీక్షకు అవకాశమిస్తారా? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని రాష్ట్రమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. రెండు శిబిరాల్లోనూ ఆందోళన శశికళ జైలు కెళ్లగానే పన్నీర్సెల్వం వైపు ఎమ్మెల్యేల క్యూ కడతారని ఆశించిన వారికి నిరాశే మిగిలింది. పన్నీర్ ఇంటివద్ద బుధవారం జనం బాగా పలుచబడ్డారు. సినీనటి గౌతమి మాత్రమే పన్నీర్ను కలిసి మద్దతు ప్రకటించారు. తన మద్దతుదారులతో మంగళవారం వరకు చెదరని చిరునవ్వుతో పదే పదే మీడియాకు ముందుకు వచ్చిన పన్నీర్సెల్వం బుధవారం ఒక్కసారి కూడా ఇంటినుంచి బైటకు రాలేదు. ఆయన అనుచరులు సైతం నీరసపడిపోయినట్లు కనిపించారు. పళనిస్వామిని గవర్నర్ ఆహ్వానించిన పక్షంలో తమ పరిస్థితి ఏమిటని పన్నీర్ ఆలోచనలో పడినట్లు సమాచారం. మరోవైపు శశికళ ఉన్నంతవరకు హుషారుగా వ్యహరించిన కువత్తూరు రిసార్టులోని ఎమ్మెల్యేలు ఆమె జైలు కెళ్లడంతో డీలాపడిపోయారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడి, శశికళ జైలుకు వెళ్లిన తరువాత కూడా పళనిస్వామిని ప్రభుత్వ ఏర్పాటుకు పిలవకుండా గవర్నర్ జాప్యం చేయడంపై ఆందోళన నెలకొంది. రిసార్టులోని ఎమ్మెల్యేలు పన్నీర్వైపు జారిపోకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మాజీ మంత్రి సెంగొట్టయ్యన్ బుధవారం కువత్తూరులో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించేవరకు ఇక్కడున్న ఎమ్మెల్యేలు బైటకు వచ్చే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. కాంపోజిట్ బలపరీక్ష అంటే? ఒకే పార్టీకి చెందిన ఇద్దరు వ్యక్తులు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కోరినప్పుడు, ఎవరికి బలముందో స్పష్టత లేనప్పుడు గవర్నర్ శాసనసభను ప్రత్యేకంగా సమావేశపరచి బలాన్ని నిరూపించుకునే అవకాశమిస్తారు. సభకు హాజరైన వారిలో మెజారిటీ ఎవరికి ఉందో వారిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తారు. బలపరీక్ష వాయిస్ ఓట్, డివిజన్ ఓట్ ద్వారా జరగవచ్చు. డివిజన్ ఓట్ కోరినప్పుడు బ్యాలెట్ లేదా ఈవీఎంల ద్వారా ఓటింగ్ నిర్వహిస్తారు. ఇద్దరిలో ఎవ్వరికీ మెజారిటీ దక్కని పక్షంలో స్పీకర్ ఓటు వేస్తారు. ఉత్తరప్రదేశ్లో కళ్యాణ్సింగ్, జగదాంబికాపాల్ ఇరువురూ ప్రభుత్వ ఏర్పాటు కోసం పోటీపడినప్పుడు కాంపోజిట్ బలపరీక్ష నిర్వహించాలని 1998లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. తమిళనాడులో కూడా ఇదే పద్ధతి అనుసరించాలని, వారంలోగా సభను సమావేశపరిచి బలపరీక్షకు అవకాశమివ్వాలని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ సోమవారం గవర్నర్కు సూచించిన విషయం తెలిసిందే. శశికళ, ఎడపాడిపై కిడ్నాప్ కేసు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేసినట్లుగా వచ్చిన ఫిర్యాదులపై కువత్తూరు పోలీసులు శశికళ, ఎడపాడి పళనిస్వామిలపై మూడు సెక్షన్ల కింద బుధవారం కేసు నమోదు చేశారు. శశికళ నిర్వహిస్తున్న కువత్తూరు క్యాంప్ నుంచి ఈనెల 13వ తేదీన తప్పించుకు వచ్చిన మదురై పశ్చిమ ఎమ్మెల్యే శరవణన్ డీజీపీకి ఒక ఫిర్యాదు చేశారు. శశికళ తరఫు వ్యక్తులు ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేసి కువత్తూరులో దాచిపెట్టినట్లు అందులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై డీజీపీ, కాంచీపురం ఎస్పీ ఆదేశాల మేరకు శశికళ, పళనిస్వామిలపై కిడ్నాప్ కేసు నమోదు చేశారు. రెండాకుల చిహ్నం ఎవరికి? పన్నీర్సెల్వం, పళనిస్వామి వర్గాలుగా అన్నాడీఎంకే రెండుగా చీలిపోయిన పక్షంలో రెండాకుల చిహ్నం ఏ వర్గానికి దక్కుతుందని అప్పుడే చర్చ మొదలైంది. పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన శశికళ పార్టీలో కీలకపదవుల్లో కొన్ని నియామకాలు, తొలగింపులు చేశారు. అయితే తాత్కాలిక ప్రధాన కార్యదర్శికి నియామకాలు చేసే హక్కులు లేవని పన్నీర్సెల్వం వర్గం వాదిస్తోంది. వైరివర్గాల్లో పార్టీ ప్రిసీడియం చైర్మన్గా ఇద్దరు, కోశాధికారిగా ఇద్దరు ఉన్నారు. పార్టీ నియమావళి ప్రకారం తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎన్నిక చెల్లదని ఎన్నికల కమిషన్కు అందిన ఫిర్యాదు పరిశీలనలో ఉంది. ఈ పరిస్థితుల్లో అన్నాడీఎంకే రెండాకుల చిహ్నం ఎవరికి దక్కుతుందోనని రెండు శిబిరాల్లో చర్చించుకుంటున్నారు. -
సస్పెన్స్ సీరియల్
-
రొంబ సస్పెన్స్
-
శశి వర్గం కొత్త సీఎం అభ్యర్థి ఇతనే
చెన్నై: అనుకున్నట్లే అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ ప్లాన్ బీ అమలు మొదలైంది. శశివర్గం సీఎం అభ్యర్థిని ప్రకటించింది. తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పళనిస్వామి అంటూ స్పష్టం చేసింది. ఆయనే తమ శాసనసభా పక్ష నేత అంటూ ప్రకటించారు. అదే సమయంలో పన్నీర్ సెల్వాన్ని అన్నాడీఎంకే పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి పూర్తిగా తొలగించారు. ప్రస్తుతం పళని స్వామి రహదారులు, ఓడ రేవుల మంత్రిగా ఉన్నారు. ఈయన సేలం జిల్లా ఎడప్పాడి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ముఖ్యమంత్రి బాధ్యతలకు రాజీనామా చేసిన పన్నీర్ సెల్వం.. శశికళకు ఎదురుతిరిగిన విషయం ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు, తాను ముఖ్యమంత్రి అయ్యి తీరుతానని శశికళ ప్రకటించడంవంటి పరిణామాలు తెలిసిందే. ఈలోగా సుప్రీంకోర్టు తీర్పు శశికళ సీఎం ఆశలపై పిడుగులా పడిన నేపథ్యంలో శశివర్గానికి వేరే ముఖ్యమంత్రి అభ్యర్థిని తీసుకోవాల్సిరాడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. అయితే, వాస్తవానికి తొలుత శశివర్గం నుంచి ముఖ్యమంత్రి రేసులో కే పళని స్వామి, తంబిదురై, సెంగొట్టయన్ తాజాగా జయలలిత మేనళ్లుడు దీపక్ జయకుమార్ పేర్లు కూడా వినిపించాయి. అయితే, తమిళనాడు రహదారులు, ఓడరేవుల బాధ్యతలు నిర్వహిస్తున్న పళని స్వామికి జయలలిత వద్ద మంచి పేరున్నట్లు తెలుస్తోంది. పన్నీర్ తర్వాత అంతటి స్థాయి సౌమ్యుడు కూడా పళని స్వామి అని శశివర్గం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయననే సీఎం అభ్యర్థిగా తెరమీదికి తీసుకొచ్చినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. శశికళ కేసు.. మరిన్ని కథనాలు శశికళ దోషి: సీఎం పదవి ఆశలపై నీళ్లు జయలలిత ఉండి ఉంటే... సుప్రీం తీర్పుతో ఎన్నికలకు దూరం ఫుల్ జోష్గా పన్నీర్.. సంబురాల్లో శ్రేణులు శశికళ వద్ద ప్లాన్ బీ ఉందా? గవర్నర్ కు ముందే తెలుసా? ‘న్యాయం గెలిచింది’ శశికళ కేసు పూర్వాపరాలివి.. ఎమ్మెల్యేలను బయటికి రప్పించే యత్నాలు స్టాలిన్ సహా డీఎంకే శ్రేణుల సంబరాలు! 'తమిళనాడులో దీపావళి చేసుకుంటున్నారు' శశికళ దోషి: ట్విట్టర్ రియాక్షన్ ఎలా ఉందంటే... జయ నుంచి జైలు దాకా శశి పయనం? -
శశికళ కొత్త ముఖ్యమంత్రి అభ్యర్థి ఇతనే