Up police
-
బహ్రెయిచ్ నిందితుల అరెస్టు
బహ్రెయిచ్: దుర్గాదేవి విగ్రహ ఊరేగింపు సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని బహ్రెయిచ్ జిల్లాలో జరిగిన కాల్పులు, అల్లర్ల ఘటనలో నిందితులైన ఐదుగురిని యూపీ పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. నిందితుల్లో ఇద్దరు నేపాల్కు పారిపోయేందుకు ప్రయతి్నంచగా కాళ్లపై షూట్చేసి వారిని నిలువరించారు. తొలుత పోలీసులపైకి నిందితులు కాల్పులు జరపడంతో కొద్దిసేపు పరస్పర కాల్పుల ఘటన చోటుచేసుకుంది. బహ్రెయిచ్– నేపాల్ సరిహద్దులోఈ ఘటన జరిగిందని ఉత్తరప్రదేశ్ అదనపు డీజీపీ(శాంతిభద్రతలు), స్పెషల్ టాస్క్ఫోర్స్ చీఫ్ అమితాబ్ యష్ చెప్పారు. మొహమ్మద్ ఫహీన్, మొహమ్మద్ సర్ఫరాజ్, అబ్దుల్ హమీద్, మొహమ్మద్ తలీమ్ అలియాస్ సబ్లూ, మొహమ్మద్ అఫ్జల్లను అరెస్ట్చేశామని డీజీపీ ప్రశాంత్ కుమార్ పేర్కొన్నారు. తొలుత ఫహీన్, తలీమ్లను అరెస్ట్చేసి కాల్పులకు వాడిన ఆయుధాన్ని స్వా«దీనం చేసుకునేందుకు పోలీసులు గురువారం మధ్యాహ్నం నేపాల్ సరిహద్దు సమీపంలోని హడా బసేహరీ ప్రాంతానికి వెళ్లారు. అక్కడికి చేరుకోగానే హమీద్, సర్ఫరాజ్, అఫ్జల్ పోలీసులపైకి కాల్పులు మొదలెట్టారు. ఈ క్రమంలో సర్ఫరాజ్, తలీమ్ పోలీసుల నుంచి తప్పించుకుని నేపాల్కి పారిపోబోయారు. ఈ క్రమంలో పోలీసులు జరిపి ఎదురుకాల్పుల్లో సర్ఫరాజ్, తలీమ్ గాయపడ్డారు. ఒకరి కుడి కాలికి, ఇంకొకరి ఎడమ కాలికి బుల్లెట్లు దిగాయి. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు చెప్పారు. మహ్సీ తాహసిల్ పరిధిలోని మన్సూర్ గ్రామంలో అక్టోబర్ 13న దుర్గామాత విగ్రహం ఊరేగింపులో మరో మతానికి చెందిన ప్రార్థనాస్థలం ఎదురుగా భారీ శబ్ధంతో ‘మళ్లీ యోగీజీ వస్తారు’ అంటూ పాటలు, డీజే మోగించడంతో వివాదం మొదలైంది. ఈ సందర్భంగా ఒక ఇంటి పైనుంచి గుర్తు తెలియని వ్యక్తి ఊరేగింపుపై కాల్పులు జరిపాడు. దీంతో 22 ఏళ్ల రాంగోపాల్ మిశ్రా చనిపోగా, ఆరుగురు గాయపడ్డారు. వ్యక్తి మృతికి నిరసనగా 14వ తేదీన అల్లరి మూకలు ఇళ్లు, దుకాణాలు, షోరూమ్లు, ఆస్పత్రులు, వాహనాలను దగ్ధంచేయడం తెల్సిందే. పరిస్థితి గురువారినికి అదుపులోకి రావడంతో ప్రభుత్వం 4 రోజుల తర్వాత బహ్రెయిచ్ జిల్లాలో ఇంటర్నెట్ సేవలను పునరుద్దరించింది. పరిపాలనలో యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో జిల్లా, రాష్ట్ర యంత్రాలు పూర్తిగా విఫలమయ్యాయని సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ దుయ్యబట్టారు. -
మీరు జీవితకాల ప్రేమ పొందారు: యూపీ పోలీసు వినూత్న ట్వీట్
లక్నో: భారత జట్టు టీ20 ప్రపంచ కప్ను రెండోసారి సొంతం చేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్లో భారత్ 7 ఏడు పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడిచింది. దీంతో 17 ఏళ్ల నిరీక్షణ తర్వాత ధోని బృందం సాధించిన తొలి టీ20 ప్రపంచకప్ జట్టులోని సభ్యుడు రోహిత్ శర్మ సారథ్యంలో రెండో టీ20 ప్రపంచ కప్ను అందుకుంది. భారత్ టీ 20 ప్రపంచం కప్ సాధించటంతో ప్రధాని మోదీ నుంచి మొదలు.. సెలబ్రిటీలు అంతా అభినందనలు తెలియజేస్తున్నారు. తాజాగా ఉత్తర ప్రదేశ్ పోలీసులు కూడా భారత జట్టుకు అభినందనలు తెలిపారు. యూపీ పోలీసులు.. తమ ‘ఎక్స్’అకౌంట్లో ఆసక్తికర పోస్ట్ చేశారు.‘బ్రేకింగ్ న్యూస్.. భారత జట్టు బౌలర్లు దక్షిణాఫ్రికా హృదయాలను బద్దలు కొట్టడంలో దోషులుగా మిగిలారు. అలాగే భారత్లోని బిలియన్ క్రికెట్ అభిమానుల నుంచి జీవితకాల ప్రేమను పొందారు!’ అని పోస్ట్లో తెలిపారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ‘సరిగా చెప్పారు. భారత జట్టు బిలయన్ అభిమాను జీవితం కాలం పొందారు’అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. 𝑩𝒓𝒆𝒂𝒌𝒊𝒏𝒈 𝑵𝒆𝒘𝒔: Indian bowlers found guilty of breaking South African hearts.𝑺𝒆𝒏𝒕𝒆𝒏𝒄𝒆: Lifelong love from a billion fans! ❤️🏏 #INDvSAFinal#T20WorldCupFinal pic.twitter.com/UPaCzgf6vm— UP POLICE (@Uppolice) June 29, 2024 -
యూపీ బోర్డు పేపర్ లీక్ ప్రధాన నిందితుడు అరెస్ట్!
ఉత్తరప్రదేశ్ బోర్డు 12వ తరగతి పేపర్ లీక్ కేసులో ప్రధాన నిందితుడు వినయ్ చౌదరిని పోలీసులు అరెస్ట్ చేశారు. 12వ తరగతి బయాలజీ, మ్యాథమెటిక్స్ పేపర్ల ఫోటోలను నిందితుడు వినయ్ వాట్సాప్ గ్రూప్లో వైరల్ చేసినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 29న యూపీ బోర్డు సెకండ్ షిఫ్ట్ పరీక్షలో 12వ తరగతికి చెందిన రెండు పేపర్లు లీక్ అయ్యాయి. ఆగ్రాలోని శ్రీ అతర్ సింగ్ ఇంటర్ కాలేజీలో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ వినయ్ చౌదరి 12వ తరగతి బయాలజీ, మ్యాథమెటిక్స్ పేపర్ ఫొటోలను ‘ఆల్ ప్రిన్సిపల్స్ ఆగ్రా’ పేరుతో వాట్సాప్ గ్రూప్లో షేర్ చేశాడు. 12వ తరగతి పేపర్ లీక్ కేసును ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. పేపర్ లీక్ అయిన ఆగ్రాలోని సదరు కళాశాల గుర్తింపును రద్దు చేశారు. యూపీ బోర్డు సమావేశంలో శ్రీ అతర్ సింగ్ ఇంటర్ కాలేజ్ రోజౌలీ గుర్తింపును రద్దు చేయాలని నిర్ణయించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు వినయ్ చౌదరి, స్కూల్ సెంటర్ అడ్మినిస్ట్రేటర్ రాజేంద్ర సింగ్, అదనపు సెంటర్ అడ్మినిస్ట్రేటర్ గంభీర్ సింగ్, స్టాటిక్ మేజిస్ట్రేట్ గజేంద్ర సింగ్లపై ఫిబ్రవరి 29 న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అలాగే సెంటర్ నిర్వాహకుడు రాజేంద్ర సింగ్తో పాటు మరొక వ్యక్తిని కూడా అరెస్టు చేసి, జైలుకు తరలించారు. -
మేనకోడలిపై మోహంతో భార్యపై వేధింపులు.. చివరికి ఏమైందంటే?
లక్నో: యూపీలోని బుడౌన్ బుడౌన్లో ఓ మహిళా దారుణానికి ఒడిగటింది. తాగొచ్చి తన మేనకోడలిని లొంగదీసుకునే ప్రయత్నిస్తూ తనని తరచూ వేదిస్తున్నందుకు అతడి భార్య మిథ్లేశ్ దేవి(40) భర్త గొంతు కోసి చంపేసింది. కేసు దర్యాప్తు చేసిన యూపీ పోలీసులు చాకచక్యంగా అసలు నిజాన్ని రాబట్టారు. బుడౌన్లో ఆట వస్తువులను తయారు చేసే తేజేంద్ర సింగ్(43) ఆగస్టు 14న అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బిల్సి పట్టణంలోని తన ఇంటి ప్రాంగణంలో నిద్రిస్తున్న తేజేంద్ర సింగ్ రక్తపు మడుగులో పడి ఉండటాన్ని చూసిన కుటుంబ సభ్యులు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారని పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు అసలు విషయం తెలిసి ఖంగుతిన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మొదటి నుంచి తేజేంద్ర సింగ్ భార్య తడబడుతూ ఒకదానితో ఒకటి పొంతనలేని సమాధానాలు చెబుతుండటంతో అనుమానమొచ్చిందని తర్వాత ఆమెను విడిగా విచారణ చేయగా హత్య తానే చేసినట్లు అంగీకరించిందని తెలిపారు. తన మేనకోడలిని లొంగదీసుకోవడానికి తేజేంద్ర ప్రయత్నించేవాడని తనని ఒప్పించమని తరచూ వేధించేవాడని భర్త వేధింపుల నుండి విముక్తి పొందాలని ఎప్పటినుంచో అవకాశం కోసం ఎదురు చూస్తుండగా ఓ రోజు అతడు బాగా మద్యం సేవించి రావడంతో నిద్రిస్తున్న సమయంలో కొడవలితో గొంతు కోసి చంపినట్లు మిథ్లేశ్ దేవి నేరాన్ని అంగీకరించిందని వివరించారు బుడౌన్ ఎస్పీ ఓపీ సింగ్. ఇది కూడా చదవండి: HYD: మద్యం మత్తులో సీఐ కారు బీభత్సం.. -
అతీక్, అతని సోదరుడిపై ఉన్న 152 కేసులు క్లోస్!
లక్నో: గ్యాంగ్స్టర్, పొలిటీషియన్ అతీక్ అహ్మద్, అతని సోదరుడు ఖాలిద్ అజీమ్(అశ్రఫ్) ఏప్రిల్ 15న దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఇద్దరూ మరణించడంతో వీరిపై ఉన్న 152 పెండింగ్ కేసులను క్లోస్ చేయాలని ఉత్తర్ప్రదేశ్ పోలీసులు నిర్ణయించారు. ఈ ఇద్దరి డెత్ రిపోర్టును కోర్టుకు సమర్పించి కేసులన్నీ మూసివేయనున్నారు. 152 కేసుల్లో అతీక్పైనే 102 కేసులున్నాయి. ఉత్తర్ప్రదేశ్లోని పలు జిల్లాల్లో ఈకేసులు నమోదయ్యాయి. అయితే వీటిలో ఒక్క కేసులో మినహా అతీక్ ఎందులోనూ దోషిగా తేలలేదు. బెదిరింపులు, ప్రలోభాలతో శిక్ష పడకుండా చూసుకున్నాడు. కానీ గత కొన్నేళ్లుగా అతీక్ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇతనితో పాటు అనుచరులపైనా యూపీలోని యోగి సర్కార్ ఉక్కుపాదం మోపింది. రౌడీ షీటర్లను ఎన్కౌంటర్లలో కాల్చిపడేసింది. వాళ్ల ఇళ్లను కూడా కూల్చివేసింది. అతీక్పై 1979లోనే తొలిసారి హత్య కేసు నమోదైంది. అప్పుడు అతని వయసు 15 ఏళ్లే కావడం గమనార్హం. అలాగే అతని సోదరుడు అశ్రఫ్పై 1992లో తొలి కేసు నమోదైంది. వీరిద్దరిపై చివరిసారిగా ఈ ఏడాది ఫిబ్రవరి 24న ఉమేశ్పాల్ హత్యకు సంబంధించిన కేసు నమోదైంది. కాగా.. అతీక్, అతని సోదరుడిపై ఉన్న కేసులు క్లోస్ చేస్తున్నప్పటికీ వీటిలో ఇతర నిందితులపై అభియోగాలు అలాగే ఉంటాయని పోలీసులు స్పష్టం చేశారు. న్యాయపరంగా చర్యలు ఉంటాయని తెలిపారు. చదవండి: బ్రిడ్జిపైనుంచి పడిపోయిన బస్సు.. 14 మంది దుర్మరణం.. 20 మందికి గాయాలు -
ఊరేగింపుగా ఎందుకు తీసుకెళ్లారు ?
న్యూఢిల్లీ: గ్యాంగ్స్టర్ అతీక్ అహ్మద్, అతని సోదరుడు అష్రాఫ్ కస్టడీలో ఉండగా పోలీసుల కళ్లెదుటే హత్యకు గురైన ఘటనపై సుప్రీంకోర్టు శుక్రవారం ప్రశ్నల వర్షం కురిపించింది. దీనిపై దాఖలైన పిటిషన్పై విచారణ సందర్భంగా పోలీసులు, యూపీ సర్కారుకు పలు ప్రశ్నలు సంధించింది. ‘ అతీక్ను ఆస్పత్రికి తీసుకొస్తారని నిందితులకు ముందే ఎలా తెలుసు ? మేం కూడా టీవీలో చూశాం. ఆస్పత్రి గేటు నుంచి వారిని లోపలికి అంబులెన్స్లో ఎందుకు తీసుకెళ్లలేదు. మీడియా సమక్షంలో వారిని ఎందుకు ఊరేగింపుగా నడిపిస్తూ తీసుకెళ్లారు?. అతీక్ పోలీసు కస్టడీలో ఉండగా మీడియా చూస్తుండగా షూటర్లు హత్యకు ఎలా తెగించగలిగారు?’ అని యూపీ సర్కార్ తరఫున హాజరైన సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గీని జస్టిస్ ఎస్.రవీంద్ర భట్, జస్టిస్ దీపాంకర్ దత్తాల ధర్మాసనం ప్రశ్నించింది. దర్యాప్తు పురోగతిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. విద్వేష ప్రసంగాలపై కేసులు నమోదుచేయండి న్యూఢిల్లీ: దేశంలో మత సామరస్యానికి తీవ్ర భంగం వాటిల్లేలా విద్వేష ప్రసంగాలు చేసే వారిపై సుమోటో కేసులు నమోదుచేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలను సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది. లేదంటే కోర్టు ధిక్కార చర్య తప్పదని డీజీపీలను హెచ్చరించింది. -
యూపీ పోలీసుల మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఏడుగురు మాజీ ఎమ్మెల్యేలు..
లక్నో: ఉత్తర్ప్రదేశ్లో సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మాపియా, క్రిమినల్స్పై ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. అయితే యూపీ పోలీసులు తాజాగా విడుదల చేసిన మోస్ట్ వాంటెడ్ నేరగాళ్ల జాబితాలో ఏడుగురు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరంతా ఎస్పీ, బీఎస్పీ పార్టీలకు చెందినవారు. హత్య, బెదిరింపులు, భూ కబ్జాలు వంటి తీవ్ర నేరాల్లో నిందితులుగా ఉన్నారు. ఈ లిస్టులో టాప్లో ఉన్న వారిలో డాన్ నుంచి పొలిటీషియన్గా మారిన ముఖ్తర్ అన్సారీ, విజయ్ మిశ్రా, బీఎస్పీ మాజీ ఎమ్మెల్యే హాజి యాకూబ్ ఖురేషి, బీఎస్పీ మాజీ ఎమ్మెల్సీ హాజి ఇక్బాల్, మాజీ ఎమ్మెల్సీ బ్రిజేష్ సింగ్, ఎస్పీ మాజీ ఎంపీ రిజ్వాన్ జహీర్, బీఎస్పీ మాజీ ఎమ్మెల్సీ సంజీవ్ ద్వివేది, సుధీర్ సింగ్, దిలీప్ విశ్రా ఉన్నారు. కులం, మతం, ప్రాంతాలతో సంబంధం లేకుండా నేర చరిత్ర ఆధారంగానే చర్యలు తీసుకుంటున్నట్లు లా అండ్ ఆర్డర్ స్పెషల్ డీజీ ప్రశాంత్ కుమార్ తెలిపారు. మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న 66 మంది నేరగాళ్లపై దృష్టి సారించనున్నట్లు చెప్పారు. వీరిపై ఉన్న కేసులు త్వరగా విచారణ పూర్తయ్యేలా చూసి కోర్టులో శిక్ష పడేలా చేస్తామన్నారు. ఈ 66 మందిలో అతీక్ అహ్మద్, అదిత్య రాణా ఇప్పటికే చనిపోయారని, 27 మంది జైలులో ఉన్నారని ప్రశాంత్ కుమార్ పేర్కొన్నారు. ఐదుగురు పరారీలో ఉన్నట్లు చెప్పారు. కొందరిపై రూ.లక్షకుపైగా రివార్డు కూడా ఉన్నట్లు వివరించారు. చదవండి: మోదీ ఇంటి పేరు వివాదం.. రాహుల్ గాంధీకి పట్నా హైకోర్టులో ఊరట.. -
అతీక్ హత్య కేసులో ఐదుగురు పోలీసుల సస్పెన్షన్
ప్రయాగ్రాజ్: గ్యాంగ్స్టర్ అతీక్ అహ్మద్ పోలీసు వలయం మధ్యే హత్యకు గురవడాన్ని యూపీ పోలీస్ విభాగం సీరియస్గా తీసుకుంది. దీనిపై దర్యాప్తు చేస్తున్న సిట్ సిఫార్సు మేరకు ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేసినట్టు ఉన్నతాధికారి ఒకరు బుధవారం చెప్పారు. సస్పెన్షన్ వేటు పడిన వారిలో షాగంజ్ పోలీస్స్టేషన్ ఇన్చార్జ్ అశ్వనీకుమార్ సింగ్, ఒక సబ్ఇన్స్పెక్టర్, ముగ్గురు కానిస్టేబుళ్లు ఉన్నారు. గత శనివారం ప్రయాగ్రాజ్లో రాత్రివేళ మెడికల్ చెకప్ కోసం అతీక్, అతని సోదరుడు ఆష్రాఫ్లను పోలీసులు వైద్యకళాశాలకు తీసుకెళ్తుండగా మీడియా సమక్షంలోనే ముగ్గురు నేరగాళ్లు పాయింట్బ్లాంక్ రేంజ్లో కాల్పులు జరిపి హత్యచేయడం తెల్సిందే. -
తండ్రి పోలీసు, భర్త కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్.. అతీక్ భార్య పర్వీన్ ఎక్కడున్నారు?
లక్నో: పోలీసు కస్టడీలో ఉండగా దుండగుల చేతిలో హత్యకు గురైన గ్యాంగ్ స్టర్, మాజీ ఎంపీ అతిక్ అహ్మద్ భార్య షాయిస్తా పర్వీన్(51)కోసం ఉత్తర ప్రదేశ్లో పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఆమె ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ లిస్ట్లో ఉన్నారు. ఇప్పటికే పర్వీన్ను పట్టిస్తే రూ.50 వేల రివార్డు ఇస్తామని యూపీ పోలీస్ శాఖ ప్రకటించింది. అయితే అతిక్, అష్రఫ్ అంత్యక్రియల సమయంలో పర్వీన్ లొంగిపోతారనే ఊహాగానాలు వచ్చాయి. కానీ ఆమె హాజరుకాలేదు. అతిక్ హత్య నుంచి అజ్ఞాతంలో ఉన్నారు. దీంతో పోలీసులు ఆమె కోసం జల్లెడపడుతున్నారు. కాగా కేవలం రెండు రోజుల వ్యవధిలోనే షైస్తా తన కొడుకు అసద్, భర్త అతిక్ ఇద్దరిని కోల్పోయింది. అసద్ పోలీసు ఎన్కౌంటర్లో మరణించిన రెండు రోజుల తర్వాత, అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ను ప్రయాగ్రాజ్లో మీడియా ముసుగులో వచ్చిన ముగ్గురు వక్తులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ నేరానికి పాల్పడ్డ లవ్లేష్ తివారి(22), అరుణ్ మౌర్య(18), మోహిత్ అలియాస్ సన్నీ(23)లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్యలపై దర్యాప్తునకు యూపీ సీఎం యోగి ముగ్గురు సభ్యులతో జ్యుడీషియల్ కమిటీని, సిట్ను నియమించారు. భర్తను హత్య చేశారని తెలియగానే షాయిస్తా పర్వీన్ వెక్కివెక్కి ఏడ్చారని, అనంతరం ఆమె కళ్లు తిరిగి పడిపోయారని సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. చదవండి: గ్యాంగ్స్టర్ అతిక్ హత్య.. తొలిసారి స్పందించిన యూపీ సీఎం ఎవరీ షాయిస్తా పర్వీన్? షాయిస్తా తండ్రి పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసి రిటైర్ అయ్యారు. 1996లో అతిక్ని పెళ్లి చేసుకునే ముందు షాయిస్తా ప్రపంచం కూడా పూర్తిగా భిన్నంగా ఉండేది. ఇంటర్ పూర్తి చేసిన ఆమెకు అంతకుముందు ఎలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలతో సంబంధం లేదు. అయితే 2009 నుంచి షాయిస్తా పేరు మీద ప్రయాగ్రాజ్లో నాలుగు కేసులు నమోదయ్యాయి. వీటిలో మూడు చీటింగ్ కేసులు కాగా ఒకటి హత్య కేసు. మొదటి మూడు కల్నల్గంజ్ పోలీస్ స్టేషన్లో నమోదవ్వగా నాలుగోది ఉమేష్ పాల్ హత్య కేసు. ఫిబ్రవరి 24న హత్యకు గురైన ఉమేష్ కేసులో ప్రధాన నిందితుల్లో షాయిస్తా ఒకరు. ఈమెతోపాటు భర్త అతిక్ అహ్మద్, ఇద్దరు కుమారులు, సోదరుడు అష్రఫ్ కూడా ఈ కేసులో నిందితుగా ఉన్నారు. 2021లో షైస్టా AIMIMలో చేరారు. అనంతరం 2023 జనవరిలో బీఎస్పీలో చేరారు. ఈ సమయంలో తన భర్త అతిక్ ఎస్పీ అగ్రనేతతో స్నేహం కారణంగా క్రమశిక్షణ నేర్చుకోలేకపోయాడని తెలిపింది. అతిక్ ఎప్పుడూ బీఎస్పీని ఇష్టపడేవాడని.. ఆ పార్టీ అగ్రనేతలకు కూడా సహాయం చేశాడని చెప్పుకొచ్చారు. అయితే తరువాత జరిగిన మేయర్ ఎన్నికలో శాయస్తాను పోటీ చేయకూడదని మాయావతి నిర్ణయించుకున్నారు. ఉమేష్ పాల్ హత్యకు ప్రణాళిక రచించడం, దాన్ని అమలు చేయడంతో షాయిస్తా కీలకంగా వ్యహరించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇదిలా ఉండగా అతీక్ నేరసామ్రాజ్యాన్ని నడపడంలో పర్వీన్ కీలకంగా ఉన్నారని పోలీసులు గుర్తించారు. అతీఖ్ అహ్మద్ జైలులో ఉండగా మాఫియా సభ్యులతో అక్రమ వ్యవహారాలన్నీ ఆమెనే చక్కబెట్టారని తేలింది. సీఎం యోగికి షైస్తా లేఖ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు పర్వీన్ రాసిన లేఖ నెట్టింట్లో వైరల్గా మారింది. ఉమేష్ పాల్ హత్య కేసులో అతిక్, అష్రఫ్లను తప్పుగా ఇరికిస్తున్నారని లేఖలో ఆమె పేర్కొంది. ఉమేష్ పాల్ హత్యకు మంత్రి నంద్ గోపాల్ గుప్తా కీలక సూత్రధారి అని ఆరోపించారు. అయితే పర్వీన్ ఫిబ్రవరి 27న లేఖ రాయగా.. అతిక్ మరణానంతరం వెలుగులోకి వచ్చింది. సీఎం ఆదిత్యనాథ్ జోక్యం చేసుకోకపోతే నా భర్త, బావమరిది, కొడుకులను చంపేస్తామని లేఖలో రాసింది. చదవండి: క్రిమినల్ కథా చిత్రమ్.. అతీక్ అహ్మద్కు వ్యవస్థ మొత్తం దాసోహమైందా? -
షాకింగ్ ఘటన: కాళ్లు తెగిపడి పట్టాలపై దీనంగా రోదిస్తూ..
లక్నో: ఉత్తర ప్రదేశ్లో హేయనీయమైన ఘటన ఒకటి చోటు చేసుకుంది. వీధి వ్యాపారితో పోలీసులు దురుసుగా ప్రవర్తించడంతో.. ఆ కంగారులో ఆ యువకుడు రైలు పట్టాల మీదకు పరిగెత్తాడు. అయితే వేగంగా దూసుకొచ్చే రైలు అతన్ని చిధిమేయడంతో రెండు కాళ్లు పొగొట్టుకుని పట్టాలపై పడి ఆ బాధతో విలపించాడు. ఈ ఘటన వీడియో ద్వారా సోషల్ మీడియాకు చేరింది. యూపీ కాన్పూర్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సాహిబ్ నగర్కు చెందిన అర్సలాన్ అనే 18 ఏళ్ల యువకుడు.. కళ్యాణ్పూర్ ప్రాంతంలోని జీడీ రోడ్ దగ్గర కూరగాయలు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం పోలీసులు.. చిరువ్యాపారులను అక్కడి నుంచి వెళ్లగొట్టే యత్నం చేశారు. ఇంతలో ఇద్దరు కానిస్టేబుళ్లు అర్సలాన్ కూరగాయల దుకాణం వద్దకు వచ్చి వాగ్వాదానికి దిగారు. Shocker from Kanpur ! Policemen threw away a street vendor Irfan's articles on railway tracks in Kalyanpur. He was hit by Memu train while picking them back. He has lost both his legs. Police were clearing sides of GT Road of vendors selling vegetables, and other goods. pic.twitter.com/gbzY71rLg2 — Haidar Naqvi🇮🇳 (@haidarpur) December 2, 2022 ఆపై అర్సలాన్పై హెడ్ కానిస్టేబుల్ రాకేష్ చెయ్యి చేసుకుని.. అతని కూరగాయల తూకం రాయిని దూరంగా విసిరేశాడని ప్రత్యక్ష సాక్ష్యులు చెప్తున్నారు. అది రైలు పట్టాలపై పడడంతో దానిని తెచ్చుకునేందుకు పరిగెత్తాడు ఆ యువకుడు. అంతలో వేగంగా దూసుకొచ్చిన రైలు.. అతని కాళ్లను ఛిద్రం చేసేసింది. అక్కడికక్కడే కాళ్లను పొగొట్టుకున్న ఆ యువకుడు బాధతో పట్టాల మధ్యలో పడి విలపిస్తూ సాయం కోసం చేతులు చాచాడు. అక్కడే ఉన్న కొందరు అతన్ని రోదన పట్టించుకోకుండా వీడియో తీస్తూ ఉండిపోయారు. ఇంతలో జనం తిరగబడతారనే భయంతో ఆ ఇద్దరు కానిస్టేబుళ్లు అర్సలాన్ను పట్టాల మీద నుంచి పక్కకు తీసుకెళ్లారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఉన్నతాధికారుల దృష్టికి రావడంతో.. రాకేశ్ కుమార్ను సస్పెండ్ చేశారు. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. అక్కడ కొందరు తీసిన వీడియోల ఆధారంగా ఏం జరిగిందో తెలుసుకునే యత్నం చేస్తున్నట్లు ఓ అధికారి మీడియాకు వెల్లడించారు. ఇదీ చదవండి: పాముకి స్నానం.. ఇలాంటి వీడియోను చూశారా? -
క్రిమినల్ కోసం వెళ్లిన పోలీసులపై మర్డర్ కేసు!
దెహ్రాదూన్: నేరాలకు పాల్పడుతున్న వారిని పట్టుకుని కేసులు నమోదు చేస్తారు పోలీసులు. అయితే, నేరస్థులను పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపైనే మర్డర్ కేసు నమోదైన అరుదైన సంఘటన ఉత్తరాఖండ్లో జరిగింది. మైనింగ్ మాఫియాను పట్టుకునే క్రమంలో జరిగిన ఎదురు కాల్పుల్లో స్థానిక బీజేపీ నేత భార్య మృతి చెందింది. దీంతో ఆగ్రహించిన గ్రామస్థులు పోలీసులపై దాడి చేశారు. వారిపై హత్య కేసు సైతం నమోదు చేశారు. ఇంతకి ఏం జరిగిందంటే? ఉత్తర్ప్రదేశ్లోని మొరదాబాద్కు చెందిన ఐదుగురు పోలీసులు మైనింగ్ మాఫియాను పట్టుకునేందుకు ఉత్తరాఖండ్లోని జాస్పూర్కు వెళ్లారు. రూ.50,000 రివార్డ్ ఉన్న వాంటెడ్ క్రిమినల్ జాఫర్.. జాస్పూర్లోని భుల్లార్ అనే వ్యక్తి ఇంటిలో ఉన్నట్లు తెలిసి.. అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు, మైనింగ్ ముఠా మధ్య ఎన్కౌంటర్ మొదలైంది. ఈ ఎదురుకాల్పుల్లో స్థానిక బీజేపీ నేత గుర్తాజ్ భుల్లార్ భార్య గుర్ప్రీత్ కౌర్ ప్రాణాలు కోల్పోయింది. ఇద్దరు పోలీసులకు సైతం తూటాలు తగిలాయి. బీజేపీ నేత భార్య మృతితో గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులపై దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తరాఖండ్ వెళ్లిన ఐదుగురు ఉత్తర్ప్రదేశ్ పోలీసులపై హత్య కేసు సైతం నమోదైంది. ‘రూ.50వేల రివార్డ్ ప్రకటించిన వాంటెడ్ క్రిమినల్ కోసం వెతుకుతున్నాం. భరత్పుర్ గ్రామం నుంచి తప్పించుకుని పోయాడు. మా పోలీసు బృందం అక్కడికి వెళ్లిన క్రమంలో వారిపై దాడి చేసి ఆయుధాలు లాక్కున్నారు. ప్రస్తుతం ఐదుగురు పోలీసులు చికిత్స పొందుతున్నారు. నిందితులు పరారీలో ఉన్నారు. వారి కోసం వేట కొనసాగుతుంది.’ అని మొరదాబాద్ సీనియ్ పోలీసు అధికారి షలాబ్ మథూర్ తెలిపారు. ఇదీ చదవండి: హిజాబ్ తీర్పు: సుప్రీం కోర్టులో ఊహించని పరిణామం -
రాహుల్ గాంధీ ఫేక్ వీడియో కేసులో న్యూస్ యాంకర్ అరెస్టు!
న్యూఢిల్లీ: జీ టీవీ న్యూస్ యాంకర్ రోహిత్ రంజన్ని అతని నివాసంలోనే అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. వాస్తవానికి చత్తీస్గఢ్ పోలీసులు అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా ఘజియాబాద్ పోలీసులు జోక్యం చేసుకుని రంజన్ని అరెస్టు చేసి తీసుకువెళ్లారు. అయితే యాంకర్ రంజన్ను అరెస్టు చేస్తున్నట్లు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే నాటకీయ పరిణామాల మధ్య అతను అరెస్టు కావల్సి వచ్చింది. ప్రస్తుతం అతను యూపీ పోలీసుల అధీనంలో ఉన్నాడు. అసలేం జరిగిందంటే...రోహిత్ జీ టీవీ ఛానెల్లో పేరుగాంచిన డీఎన్ఏ షోకి వ్యాఖ్యతగా చేస్తున్నాడు. రాహుల్ గాంధీకి సంబంధించిన ఒక వీడియో న్యూస్ని తప్పుగా అందించారు. ఆ తర్వాత ఛానెల్ వెంటనే సరిచేసుకుని క్షమాపణల చెప్పింది. ఐతే ఆ వీడియోలో రాహుల్ గాంధీ ఏం మాట్లాడారంటే.."రాహుల్ గాంధీ తన వయనాడ్ కార్యాలయంపై దాడిని ప్రస్తావిస్తూ...ఇలా చేసిన యువకులు చాలా బాధ్యతారహితం ప్రవర్తించారు. అయినా వారు చిన్న పిల్లలు క్షమించండి. అని అన్నారు." అయితే జీ ఛానెల్ ఉదయపూర్లో కన్హయ్య లాల్ను చంపిన ఘటనతో లింక్ చేస్తూ... వారు చిన్నపిల్లలని, వారిని క్షమించాలంటూ చెబుతున్నట్లుగా వక్రీకరించి సమాచారాన్ని ఇచ్చింది. దీంతో ఆ యాంకర్పై చత్తీస్గఢ్, రాజస్తాన్లలో కేసులు నమోదయ్యాయి. అంతేకాదు ఆ ఛానల్ జర్నలిస్ట్ ట్విట్టర్లో..చట్టబద్ధమైన ప్రక్రియను పాటించకుండా తనని ఉత్తరప్రదేశ్లోని తన నివాసం నుంచి ఛత్తీస్గఢ్ పోలీసులు ఎలా తీసుకువెళ్లారని రంజన్ ప్రశ్నించారు. ఈ విషయమై పోలీసులు స్పందిస్తూ...సమాచారం ఇవ్వాలనే నియమం లేదు. అయినా ఇప్పడూ మీకు తెలిసింది కాబట్టి తమకు సహకరించాలని రంజన్కి చెప్పారు. దీంతో ఛత్తీస్గఢ్, రాజస్తాన్ పోలీసుల చర్యను వ్యతిరేకిస్తూ..బీజేపీ నాయకుడు అమిత్ మాల్వియా కాంగ్రెస్పై విమర్శలు గుప్పించారు. జర్నలిస్టుల పై దాడులు నిర్వహించేందుకు చత్తీస్గఢ్, రాజస్తాన్లను నిర్మోహమాటంగా కాంగ్రెస్ వినియోగించేస్తుందంటూ.. విమర్శలు చేశారు. కాంగ్రెస్ నాటి అధికార జ్ఞాపకాల మత్తులో కూరుకుపోయి ఇలాంటి ఘటనలకు పాల్పడతోందని అన్నారు. बिना लोकल पुलिस को जानकारी दिए छत्तीसगढ़ पुलिस मेरे घर के बाहर मुझे अरेस्ट करने के लिए खड़ी है,क्या ये क़ानूनन सही है @myogiadityanath @SspGhaziabad @adgzonelucknow — Rohit Ranjan (@irohitr) July 5, 2022 (చదవండి: శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు.. మహారాష్ట్రలో మధ్యంతర ఎన్నికలు?) -
అందుకే ఒవైసీపై దాడి చేశారట!
ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై కాల్పుల కేసులో ఇద్దరిని ఉత్తర ప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు యూపీ పోలీసుల ఛార్జీషీట్లో ఆసక్తికర విషయాల్ని పొందుపరిచారు. లోక్సభ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై కాల్పుల కేసులో సచిన్, శుభమ్ అనే ఇద్దరు వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన ఛార్జిషీట్ కాపీని ఓ జాతీయ మీడియా సంస్థ సంపాదించింది. అందులో ఆసక్తికరమైన విషయాలు ఉన్నట్లు వెల్లడించింది. ఒవైసీపై దాడిని అంగీకరించిన ఇద్దరు నిందితులు.. వారి దాడి వెనుక ఉద్దేశ్యం ఏమిటో వివరించారు. మరొక వర్గానికి చెందిన ఒక పెద్ద రాజకీయ నాయకుడిని చంపడం ద్వారా ‘హిందుత్వ నేతలు’గా పేరు సంపాదించుకోవాలనే, ఎదగాలనే ఉద్దేశంతోనే ఆ పని చేశారట!. ‘‘పూర్తి సన్నద్ధతతో గౌరవ ఎంపీని లక్ష్యంగా చేసుకుని హత్యాయత్నం చేశారు. దాడిలో ఎవరైనా గాయపడినా.. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించి ఉండేవి. కొన్ని సంఘ వ్యతిరేక శక్తులు పరిస్థితిని మరింత దిగజార్చేవి’’ అని ఛార్జిషీట్లో పోలీసులు పొందుపరిచారు. ఆధారాలు సమర్పణ యూపీ పోలీసులు సీసీటీవీ ఫుటేజీని ఛార్జ్షీట్లో ఆధారంగా పేర్కొన్నారు. కారు ఫోరెన్సిక్ పరీక్షల ఫలితంతో పాటు ఇద్దరు నిందితుల స్టేట్మెంట్, వాళ్లకు ఆయుధాలు సరఫరా చేసిన వాళ్ల స్టేట్మెంట్లను సైతం పొందుపరిచారు. ఒవైసీతో పాటు మొత్తం 61 మంది నుంచి తీసుకున్న స్టేట్మెంట్ను పొందుపరిచారట. ఈ ఏడాది ఫిబ్రవరి 3వ తేదీన.. పశ్చిమ యూపీలో అసెంబ్లీ ఎన్నికలు ప్రచారంలో పాల్గొని తిరిగి ఢిల్లీకి పయనమైన ఆయన వాహనంపై.. హపూర్–ఘజియాబాద్ మార్గంలో ఛిజార్సీ టోల్ప్లాజా సమీపంలో దుండగులు కాల్పులు జరిపారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఏం కాలేదు. చదవండి: దయచేసి జడ్ కేటగిరిని అంగీకరించండి: అమిత్ షా -
రన్నింగ్ బస్సులు ఎక్కి.. యువతులపై వికృత చేష్టలు
ఆడవాళ్లు వేధింపులు ఎదుర్కొని చోటంటూ కనిపించడం లేదు. ఇంటా బయట పని చోట.. అంతటా కామాంధులు చెలరేగిపోతున్నారు. ఒంటరిగా కనిపించడమే ఆలస్యం చూపులతో.. మాటలతో కుంగదీస్తున్నారు. తాజాగా ఓ నీచుడు బుర్ఖా ముసుగులో యువతులపై వికృత చేష్టలకు పాల్పడిన ఘటన వెలుగు చూసింది. మహ్మద్ సోహైల్.. వయసు 19 ఏళ్లు. ఉండేది ఉత్తర ప్రదేశ్ బిజ్నోర్లోని నజీబాబాద్ టౌన్ పతాన్పురా మొహల్లా ఏరియా. చదువుకుంటున్న ఈ టీనేజర్కి దుర్భుద్ది పుట్టింది. తన తల్లి బుర్ఖాను దొంగలించి.. ఆ ముసుగులో అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఓ కాలేజీ బస్టాప్ దగ్గర ఎదురు చూసేవాడు. ఆపై రన్నింగ్ బస్సులు ఎక్కి.. అమ్మాయిల సీట్లలో కూర్చుని అసభ్యంగా తాకేవాడు. ఎవరైనా గట్టిగా గదమాయిస్తే.. రన్నింగ్లోనే దిగిపోయి మరో బస్సును చూసుకునేవాడు. ఈ నీచుడి గురించి పలువురు అమ్మాయిలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో బిజ్నోర్ ఎస్పీ ధరమ్వీర్ సింగ్ స్వయంగా రంగంలోకి దిగారు. మఫ్టీలో లేడీ కానిస్టేబుల్స్ను బస్సుల్లో ప్రయాణం చేసేలా ఆదేశించారు. చివరకు సోహైల్ను ఓ బస్సులో రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారంతా. తొలుత బుర్ఖాలో ఉంది అమ్మాయే అని పోలీసులు సైతం భావించారట. తీరా.. ముసుగు తొలగించి చూస్తే అది సోహైల్. ఇదిలా ఉంటే సోహైల్.. ఈ బుర్ఖా ముసుగులోనే అబ్బాయిలకూ గాలం వేసేవాడని పోలీసులు గుర్తించారు. హనీట్రాప్ ద్వారా సోహైల్.. పలువురు యువకుల నుంచి డబ్బులు సైతం లాగేవాడని ఎస్పీ ధరమ్వీర్ తెలిపారు. UP के बिजनौर में बुर्का पहनकर छात्राओं को छेड़ने वाला सुहेल आज पकड़ा गया. वह 3 दिन से कॉलेज और बस में छात्राओं पर अश्लील कमेंट्स करता था. #Bijnor pic.twitter.com/QypMA01XKN — Sachin Gupta (@sachingupta787) March 12, 2022 -
రైతు మరణాలపై... రాజకీయ ఉద్రిక్తతలు
లక్నో: ఉత్తరప్రదేశ్లోని లఖీమ్పూర్ ఖేరిలో రైతు మరణాలపై రాజకీయంగా ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ, మరో 10 మందిపై శాంతిభద్రతలకు భంగం కలిగిస్తున్నారంటూ యూపీ పోలీసులు కేసు నమోదు చేశారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లోని సెక్షన్లు 144, 151, 107, 116ల కింద కేసులు నమోదు చేసినట్టు మంగళవారం మీడియాకి వెల్లడించారు. ప్రియాంకతో పాటు ఎంపీ దీపేందర్ హుడా, యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్కుమార్ లల్లూ, సందీప్ సింగ్ తదితరులపై కేసు నమోదైంది. అయితే ప్రియాంకా గాంధీని అదుపులోకి తీసుకొని దాదాపుగా రెండు రోజులవుతున్నా ఆమెను కోర్టు ఎదుట హాజరుపరచడం కానీ, ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వడంగానీ చేయలేదని కాంగ్రెస్ చెబుతోంది. అక్రమంగా నిర్బంధించారు: ప్రియాంక తనను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపిస్తూ ప్రియాంకగాంధీ ఒక ప్రకటన విడుదల చేశారు. ‘38 గంటలు గడిచినా నాకు ఎలాంటి నోటీసు ఇవ్వలేదు. మాపై బలప్రయోగం చేసి అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటివరకు కనీసం లాయర్ను కలవనివ్వలేదు. మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచలేదు’ అని ఆమె ఆ ప్రకటనలో పేర్కొన్నారు. మరణించిన రైతు కుటుంబ సభ్యులతో ఫోన్ ద్వారా ప్రియాంక మాట్లాడారు. లవ్ ప్రీత్ సింగ్, నక్షత్ర సింగ్ బంధువులతో మాట్లాడారు. వారికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. వ్యక్తిగతంగా వారిని కలుసుకుంటానని ప్రియాంక రైతు కుటుంబాలకు హామీ ఇచ్చినట్టు కాంగ్రెస్ నాయకుడు లలన్కుమార్ చెప్పారు. ఇదిలా ఉంటే ప్రియాంకా గాంధీని కలవడానికి వచ్చిన ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ను లక్నో ఎయిర్పోర్టులో పోలీసులు అడ్డుకున్నారు. ఆయనను విమానాశ్రయం వెలుపలికి రాకుండా నిరోధించారు. దీంతో ఆయన విమనాశ్రయంలోపల నేలపైనే కూర్చొని తన నిరసన తెలిపారు. ‘నన్ను ఎందుకు ఇక్కడ ఆపారు. నేను నిషేధాజ్ఞలు ఉన్న లఖీమ్పూర్ ఖేరికి వెళ్లడం లేదు. యూపీలో కాంగ్రెస్ కార్యాలయానికి వెళుతున్నాను’ అని బఘేల్ అన్నారు. లఖీమ్పూర్ ఖేరిని ముట్టడిస్తాం: సిద్ధూ రైతుల మరణాలకు కారణమైన మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ను అరెస్ట్ చేసి ప్రియాంక గాంధీని విడుదల చేయాలని పంజాబ్ కాంగ్రెస్ నేత నవజోత్ సింగ్ సిద్ధూ డిమాండ్ చేశారు. బుధవారంలోగా ప్రభుత్వం ఆ పని చెయ్యకపోతే పంజాబ్ కాంగ్రెస్ లఖీమ్పూర్ ఖేరిని ముట్టడిస్తుందని హెచ్చరించారు. అసలు సిసలు కాంగ్రెస్వాది ప్రియాంక కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తన సోదరిపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రియాంక గాంధీ ఎప్పటికీ ఓటమిని అంగీకరించరని, ఆమె అసలు సిసలు కాంగ్రెస్వాది అని కొనియాడారు. తాము చేస్తున్న సత్యాగ్రహం ఆగదని అన్నారు. రాహుల్ బుధవారం లఖీమ్పూర్ ఖేరి వెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారు. ముగ్గురు రైతులకు అంతిమ సంస్కారం ఈ ఘటనలో మరణించిన నలుగురు రైతుల్లో ముగ్గురు లవ్ప్రీత్ సింగ్, నక్షత్ర సింగ్, దల్జీత్ సింగ్ల అంత్యక్రియలు పూర్తయ్యాయి. అయితే మొహారియా గ్రామానికి చెందిన గుర్వీందర్ సింగ్ అనే రైతు కుటుంబం తమకు ఇచ్చిన పోస్టుమార్టమ్ రిపోర్టుపై నమ్మకం లేదని, తిరిగి పోస్ట్మార్టమ్ నిర్వహించాలని డిమాండ్ చేసింది. గుర్వీందర్ను కాల్చి చంపినట్టుగా తమకు అనుమానాలున్నాయని వారు చెప్పారు. దీంతో రెండోసారి పోస్టుమార్టమ్ చేయడానికి ప్రభుత్వ అధికారులు అంగీకరించారు. లఖీమ్పూర్ ఘటనపై న్యాయ విచారణ జరపండి లఖీమ్పూర్ ఘటనపై సీబీఐ నేతృత్వంలో దర్యాప్తు కొనసాగాలని కోరుతూ సుప్రీంకోర్టుకు ఇద్దరు న్యాయవాదులు మంగళవారం ఒక లేఖ రాశారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఈ దర్యాప్తు కొనసాగాలని, అత్యున్నత స్థాయిలో న్యాయ విచారణ జరగాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు వారు విన్నవించుకున్నారు. ఈ మేరకు శివకుమార్ త్రిపాఠి, సీఎస్ పాండా అనే ఇద్దరు న్యాయవాదులు సుప్రీంకోర్టుకు ఒక లేఖ రాశారు. తమ లేఖను ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)గా పరిగణించి ఈ విషయంలో సుప్రీం ధర్మాసనం జోక్యం చేసుకోవాలని లాయర్లు కోరారు. నిర్దాక్షిణ్యంగా తొక్కించారు లఖీమ్పూర్ ఖేరికి ప్రదర్శనగా వెళుతున్న రైతులపై ఎస్యూవీ దూసుకుపోయి నలుగురు అన్నదాతలను బలిగొన్న ఘటనకు సంబంధించిన వీడియో బయటకి వచ్చింది. నినాదాలు చేస్తున్న రైతులు మీదుగా అత్యంత వేగంగా వాహనం దూసుకుపోయిన దృశ్యాలతో కూడిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. రైతులను నిర్దయగా వాహనంతో తొక్కిస్తున్న దృశ్యాలు ఇందులో ఉన్నాయి. రైతులు ఎస్యూవీపై పడటం, బలంగా ఢీ కొట్టడంతో తీవ్ర గాయాలతో పక్కకు ఎగిరిపడటం కనిపిస్తోంది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక ఈ వీడియోని షేర్ చేస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీనుద్దేశించి పోస్టు పెట్టారు. అత్యంత హేయమైన నేరానికి పాల్పడిన మంత్రి కుమారుడిని వదిలేసి, తనను అరెస్ట్ చేయడమేంటని ప్రశ్నించారు. తనలాంటి వారిని కాకుండా నేరం చేసిన వారిని అదుపులోనికి తీసుకోవాలన్నారు. బీజేపీ నాయకుడు వరుణ్ గాంధీ, మరి కొందరు బీజేపీ నేతలు కూడా ఈ వీడియోని షేర్ చేశారు. అయితే ఆ కారు నడుపుతున్న వ్యక్తి ఎవరో ఆ విజువల్స్లో స్పష్టంగా తెలియడం లేదు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాయే కారుని నడుపుతున్నారని రైతు సంఘాలు ఆరోపిస్తుంటే, ఆ సమయంలో ఆ ప్రాంతంలో తన కుమారుడు లేడని మంత్రి వాదిస్తున్నారు. అందులో ఆశిష్ మిశ్రా ఉన్నాడు లఖీమ్పూర్ ఖేరీలో రైతుల పైనుంచి దూసుకెళ్లిన ఎస్యూవీ (మహీంద్రా థార్)లో కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా అలియాస్ మోనూ ఉన్నాడని ఉత్తరప్రదేశ్ పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. జగ్జీత్సింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ ఎఫ్ఐఆర్ను పోలీసులు నమోదు చేశారు. ‘రైతుల పైనుంచి నిర్దాక్షిణ్యంగా కాన్వాయ్లోని వాహనాలను తీసుకెళ్లిన ఘటన పక్కా వ్యూహం ప్రకారమే జరిగింది. మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లే రైతులు నిరసన ప్రదర్శనలకు దిగారు. బన్బీర్పూర్ సందర్శనకు వచ్చిన యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య, అజయ్ మిశ్రాలకు నల్లజెండాలతో శాంతియుతంగా నిరసన తెలుపడానికి రైతులు ఆదివారం స్థానిక కాలేజీ మైదానం సమీపంలో గుమిగూడారు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఆశిష్ మిశ్రా 15 నుంచి 20 మంది సాయుధులతో మూడు వాహనాల్లో అక్కడికి చేరుకున్నాడు. మహీంద్రా థార్లో డ్రైవర్ పక్కసీట్లో కూర్చున్నాడు. ఈ ఎస్యూవీయే తొలుత వేగంగా రైతుల పైనుంచి దూసుకెళ్లింది. ఆ సమయంలో ఆశిష్ కాల్పులు జరిపాడు. నాన్పరాకు చెందిన రైతు గుర్విందర్ సింగ్ ఈ కాల్పుల్లో చనిపోయాడు. రైతుల పైనుంచి దూసుకెళ్లిన వాహనాల నెంబర్లు యూపీ 31 ఏఎస్ 1000, యూపీ 32 కేఎం 0036 కాగా... మూడో వాహనం మహీంద్రా స్కార్పియో (నెంబరు తెలియదు)’ అని ఎఫ్ఐఆర్లో పోలీసులు పేర్కొన్నారు. రైతులను తొక్కించుకుంటూ ముందుకెళ్లిన ఆశిష్ వాహనం రోడ్డుకు ఓవైపునకు వెళ్లి బోల్తాపడింది. ఆశిష్ వాహనంలో నుంచి బయటపడి తిరిగి కాల్పులు ప్రారంభించాడు. చెరుకు తోటలోకి వెళ్లి దాక్కున్నారు’ అని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఆశిష్ మిశ్రాపై పోలీసులు హత్య, నేరపూరిత కుట్ర, నిర్లక్ష్యంగా వాహనాన్ని నడపటం, అల్లర్లకు కారణం అవడం... తదితర కేసులు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లో కేంద్రమంత్రి అజయ్ మిశ్రా పేరులేదు. -
మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ ఆటకట్టించిన పోలీసులు..
పట్నా: గత కొంత కాలంగా బిహర్ పోలీసులకు కంటిమీదకునుకు లేకుండా చేసిన గ్యాంగ్స్టర్ మున్న మిశ్రాను బిహర్ స్పెషల్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. యూపీకి చెందిన మిశ్రాను దేవోరియా ప్రాంతంలో యూపీ, బిహర్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి అదుపులోకి తీసుకున్నారు. అయితే, నిందితుడిపై ఇప్పటికే అనేక హత్యలకు సంబంధించిన కేసులు, కిడ్నాప్లు, లూటీ కేసులు ఉన్నాయని తెలిపారు. మున్న మిశ్రా ఆచూకీని తెలియజేస్తే యాభైవేలు ఇస్తామని గతంలోనే యూపీ ప్రభుత్వం ప్రకటించింది. కాగా, విశ్వసనీయ సమాచారం మేరకు.. యూపీలోని దియోవరియా ప్రాంతంలోని ఒక ఇంట్లో మున్న మిశ్రా ఉన్నట్లు స్పెషల్ టాస్క్ఫోర్స్ పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత దాడిచేసి అతడిని అదుపులోని తీసుకున్నామని యూపీ పోలీసులు పేర్కొన్నారు. నిందితుని దగ్గర నుంచి ఏకే 47 రైఫిల్ గన్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కాగా, యూపీలోనే మరొక గ్యాంగ్స్టర్ బదన్ సింగ్కు, పోలీసులకు మధ్య కాల్పులు జరిగిన మరుసటి రోజే మిశ్రాను పట్టుకున్నామని అధికారులు పేర్కొన్నారు. బదన్ సింగ్పై కూడా ఒక లక్ష రూపాలయల రివార్డు ఉందని తెలిపారు. కాగా, పోలీసులు ఆగ్రా, రాజస్థాన్ బార్డర్లో తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు అనుమానస్పదంగా ఉండటాన్ని గమనించారు. వారి వద్దకు చేరుకునేలోపే.. పోలీసులుపై కాల్పులకు తెగబడ్డారు. పోలీసులు కాల్పులలో నిందితులు కూడా తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ క్రమంలో వారిని ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందారని అధికారులు తెలియజేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు యూపీ పోలీసులు తెలిపారు. -
అమానుషం: మహిళను ఈడ్చి కొట్టి మీద కూర్చున్న ఎస్సై
ఒక మహిళపై అమానుషంగా దాడి చేశారనే విమర్శలు ఉత్తర ప్రదేశ్ పోలీసుల్ని చుట్టుముట్టాయి. కాన్పూర్ డెహత్ జిల్లాకు చెందిన ఓ పోలీస్ అధికారి.. ఓ వ్యక్తిని అక్రమంగా అరెస్ట్ చేయడంతో పాటు అతని భార్యపై దాడి చేశాడనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాన్పూర్ డెహత్(దెహత్) జిల్లా దుర్గాదాస్పూర్ గ్రామంలో శనివారం జరిగిన ఈ ఘటన తాలుకా వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. తన భర్త అక్రమంగా అరెస్ట్ చేశారని, వదిలిపెట్టాలంటే డబ్బు ఇవ్వాలని భోగిన్పూర్ ఎస్సై మహేంద్ర పటేల్ డిమాండ్ చేశాడని బాధితురాలు ఆరోపిస్తోంది. ఇవ్వనని చెప్పడంతో తనను లాగేసి నేల మీద పడేసి కొట్టాడని, మీద కూర్చుని ముఖం మీద దాడి చేశాడని, గ్రామస్తుల జోక్యం చేసుకోవడంతో తను వదిలేశాడని వాపోయిందామె. అయితే ఆ సమయంలో స్నేహితులతో శివం యాదవ్ జూదం ఆడుతున్నాడని. అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే అతని భార్య ఆర్తి, తల్లి తమను అడ్డుకోవాలని ప్రయత్నించారని, ఈ క్రమంలో వాళ్లే తన బృందంపై దాడి చేశారని ఎస్సై పటేల్ చెప్తున్నారు. ఇదిలా ఉంటే ఈ ఘటనపై కాన్పూర్ ఎస్పీ చౌదరి స్పందిస్తూ.. శివం పారిపోయేందుకు సాయం చేసేందుకే అతని భార్య తనను అడ్డగించే ప్రయత్నం చేస్తున్నారని పటేల్ భావించాడని, అందుకే అలా ప్రవర్తించాడని తెలిపారు. పటేల్ను భోగిన్పూర్ విధుల నుంచి తప్పించామని, ఘటనపై దర్యాప్తు చేయించి కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని కాన్పూర్ ఎస్పీ చౌదరి తెలిపారు. మరోవైపు సమాజ్వాదీ పార్టీ ఈ ఘటనపై రాజకీయ విమర్శలు చేస్తోంది. -
ఘజియాబాద్ వీడియో: ట్విటర్ ఎండీకి లీగల్ నోటీసులు.. వారం గడువు
న్యూఢిల్లీ: యూపీ ఘజియాబాద్లో వృద్ధుడిపై దాడి ఘటన కేసు కొత్త మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఆ వృద్ధుడి ఫిర్యాదుపై భిన్న వాదనలు వినిపిస్తుండగా.. తాజాగా ఈ వీడియోకు సంబంధించి ఉత్తర ప్రదేశ్ పోలీసులు ట్విటర్ ఇండియా ఎండీకి నోటీసులు జారీచేశారు. ఉత్తర ప్రదేశ్ పోలీసులు ట్విటర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మనీష్ మహేశ్వరికి నోటీసులు జారీచేశారు. వారం రోజుల్లోగా లోని పోలీస్ స్టేషన్కొచ్చి.. వివరణ ఇచ్చుకోవాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు పోలీసులు. కాగా, మత విద్వేషాల్ని రెచ్చగొట్టేలా ఆ వీడియోను వైరల్ చేసిందంటూ ట్విటర్పై అభియోగాల్ని యూపీ పోలీసులు నమోదుచేశారు. ‘‘ట్విటర్ మాధ్యమాన్ని ఉపయోగించి కొందరు ఆ వీడియోల్ని వైరల్ చేశారు. కానీ, ట్విటర్ మాత్రం ఆ అకౌంట్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సంఘ విద్రోహ శక్తుల సందేశాల్ని అలా ఎలా జనాలకు చేరవేస్తారు? అంటూ ఆనోటీసుల్లో పోలీసులు ట్విటర్ ఎండీని ప్రశ్నించారు. కాగా, ఈ వ్యవహారంలో ఇప్పటికే కొందరు జర్నలిస్టులకు, కాంగ్రెస్ లీడర్ల పేర్లను పోలీసులు ఎఫ్ఐఆర్లో నమోదు చేయగా, నటి స్వరభాస్కర్పై కూడా ఫిర్యాదు అందింది. మరోవైపు తాయెత్తులు అమ్మే సూఫీ అబ్దుల్ సమద్పై ఆ వ్యవహారంలోనే కక్షకట్టి దాడి చేశారని, ఇందులో మత కోణం లేదని పోలీసులు చెప్తుండగా.. మరోవైపు సమద్ కుటుంబం మాత్రం అది ఉద్దేశ్యపూర్వకంగా జరిగిన దాడేనని చెబుతోంది. Ghaziabad Police sent legal notice to Managing Director of Twitter India over viral video of an elderly man in Loni being assaulted with the intent of "provoking communal unrest" The MD has been asked to come to the Police Station Loni Border & record the statement within 7 days pic.twitter.com/u5Ct8Omq6l — ANI UP (@ANINewsUP) June 18, 2021 టైం కావాలి ఇక కాంగ్రెస్ నేత శశిథరూర్ నేతృత్వంలోని పార్లమెంటరీ ప్యానెల్ ముందు ఇవాళ ట్విట్టర్ ప్రతినిధులు హాజరయ్యారు. సామాజిక మాధ్యమ వేదికలు దుర్వినియోగం కాకుండా, పౌరహక్కులకు భంగం కలగకుండా.. ప్రత్యేకంగా మహిళల భద్రతపరంగా ఏవిధమైన నివారణ చర్యలు తీసుకోవాలనే విషయమై వివరణ ఇవ్వాల్సిందిగా ట్విటర్ ఉన్నతాధికారులను కమిటీ ఇదివరకే ఆదేశించింది. ఈ మేరకు ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ, ట్విటర్ అధికారుల అభిప్రాయాల్ని తీసుకుంది. కొవిడ్ కారణంగా పూర్తి చర్యలు చేపట్టేందుకు కొంచెం సమయం కావాలని ట్విటర్ కోరినట్లు తెలుస్తోంది. చదవండి: ఏం రాహుల్.. విషం నింపుతున్నావా? -
నా కొడుకు చచ్చి నెలైనా స్పందించరా? ఎమ్మెల్యే ఫైర్
లక్నో: ఆక్సిజన్ అందక తన కుమారుడు మృతి చెందాడని.. దానికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించడం లేదని బీజేపీ ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల రోజులైనా చర్యలు తీసుకోలేరా అని అధికార పార్టీ ఎమ్మెల్యే మండిపడ్డారు. కనీసం పోలీసులు ఆస్పత్రిపై కేసు కూడా నమోదు చేయడం లేదని ఎమ్మెల్యే వాపోయారు. ఉత్తరప్రదేశ్లోని హర్దియో జిల్లాలోని శాండిల్య నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే రాజ్కుమార్ అగర్వాల్ కుమారుడు అశిశ్ (35) ఏప్రిల్ 26వ తేదీన మృతి చెందారు. కకోరిలోని ప్రైవేటు ఆస్పత్రిలో ఆశిశ్ను చేర్చగా ఉదయం ఆక్సిజన్ 94 ఉండగా సాయంత్రానికి ఆక్సిజన్ స్థాయి తగ్గిందని వైద్యులు చెప్పినట్లు ఎమ్మెల్యే తెలిపారు. బయటి నుంచి ఆక్సిజన్ తీసుకొచ్చి అందిస్తున్నట్లు చెప్పారని ఆ కొద్దిసేపటికి తన కుమారుడు మరణించాడని ఎమ్మెల్యే రాజ్కుమార్ వాపోయాడు. ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యంతోనే తన కుమారుడు మరణించాడని ఎమ్మెల్యే రాజ్కుమార్ అగర్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతోపాటు ముఖ్యమంత్రి, కలెక్టర్, డీజీపీ, పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సీసీ ఫుటేజీ పరిశీలించి తన కుమారుడి మరణానికి సంబంధించి కేసు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. నా బిడ్డ మరణానికి ఆస్పత్రిదే బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. -
'నాకు పెళ్లి కావాలి'.. పిల్ల దొరికేసిందిగా..
లక్నో: ఉత్తరప్రదేశ్లోని కైరానాకు చెందిన అజీమ్ మన్సూరి.. వయసు 26. పెళ్లీడొచ్చిన అతడికి పిల్ల దొరకడం లేదట. కారణం అతడు 30 ఇంచుల పొడవు మాత్రమే ఉండటం. దీంతో కాబోయే భార్య కోసం ఐదేళ్లుగా కాళ్లరిగేలా తిరిగి తిరిగి అలిసిపోయాడు. ఇలా కాదని గత నెలలో ఏకంగా పోలీసులనే సాయం కోరాడు. తనకో మంచి వధువును వెతికిపెట్టమని అభ్యర్థించాడు. ఇంకేముందీ.. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో అతడికిప్పుడు రెండు పెళ్లి ప్రపోజల్స్ వచ్చాయి. అందులో ఒకటి ఘజియాబాద్కు చెందిన రెహనా అన్సారిది. అతడి హైటే ఉన్న ఈ యువతి అజీమ్ను పెళ్లి చేసుకునేందుకు రెడీగా ఉన్నానంటోంది. అంతేకాదు, తనను అర్ధాంగిగా స్వీకరిస్తే.. చేదోడువాదోడుగా ఉంటానంటోంది. ఆమె తండ్రి కూడా ఎలాగైనా ఈ పెళ్లి ఖాయమయ్యేందుకు అబ్బాయి కుటుంబంతో మంతనాలు జరుపుతున్నాడు. ఈ వివాహానికి అబ్బాయి తరపువాళ్లు అంగీకారం తెలుపుతారని ఆశిస్తున్నాడు. ఇక ఢిల్లీకి చెందిన మరో మహిళ అజీమ్తో జీవించేందుకు తహతహలాడుతోంది. "నేను అతడితో ఓ మాట చెప్పాలనుకుంటున్నా. అక్కడ ఆయన ఒంటరిగా ఉన్నాడు. ఇక్కడ నేనూ ఒంటరిదాన్నే. నేను అతడిని పెళ్లాడాలనుకుంటున్నాను" అని ఓ వీడియో రిలీజ్ చేసింది. ఈ వీడియో అజీమ్ వరకు చేరింది. తనకు రెండు సంబంధాలు రావడంతో సంతోషం వ్యక్తం చేసిన అజీమ్ ఈ ప్రపంచంలో తనకంటూ ఒకరున్నారని ఆ దేవుడు రుజువు చేశాడని చెప్పుకొచ్చాడు. ఈ రెండు మాత్రమే కాదు పలు చోట్ల నుంచి కూడా అమ్మాయి ఉంది చేసుకుంటారా? అంటూ ఎన్నో సంబంధాలు వస్తున్నాయట. అయితే అజీమ్ ఫ్యామిలీ మాత్రం హాపూర్కు చెందిన ఓ యువతితో పెళ్లి ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అతి త్వరలోనే వీళ్లిద్దరికీ నిశ్చితార్థం కూడా చేయనున్నారట. ఈ లెక్కన వీరి పెళ్లి ఈ ఏడాది చివర్లోనో, లేదా వచ్చే ఏడాది ప్రారంభంలోనో జరిగే అవకాశాలున్నాయి. చదవండి: రోడ్డు మీద బురద నీటిలో బొర్లుతూ స్నానం! జనం పరుగో పరుగు.. ఇండియన్ ఏనుగు అంతే! -
గుడిలో పూజారి దారుణ హత్య
లక్నో: ఆలయంలో పూజారి దారుణ హత్యకు గురయ్యాడు. తనకు తానే కాళికామాత అవతారంగా ప్రకటించుకున్న ఆ పూజారిని ఓ దుండగుడు కత్తితో పొడిచి హతమార్చాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని బదౌన్ జిల్లాలో చోటుచేసుకుంది. అయితే పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు మూడు బృందాలను ఏర్పాటుచేశారు. ఇస్లాంనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఢాక్నగ్ల గ్రామంలోని ఆలయంలో పూజారి జై సింగ్ యాదవ్ (75) ఆలయ ఆవరణలో ఉన్న ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడు. 20 ఏళ్లుగా పూజా కార్యక్రమాలు చేస్తూ జీవిస్తున్నాడు. అయితే జై సింగ్ యాదవ్ తనకు తాను కాళికామాత అవతారంగా ప్రకటించుకుని ఆ మేరకు చీర, గాజులు ధరించి కనిపించేవాడు. స్థానికంగా ఆయన సఖీ బాబాగా పేరు పొందాడు. సఖీబాబాను కలిసేందుకు శనివారం రాంవీర్ యాదవ్ వచ్చాడని స్థానికులు చెబుతున్నారు. ఈ సమయంలో ఓ విషయమై సఖీబాబాకు, రాంవీర్కు మధ్య వివాదం పెరిగింది. ఈ సమయంలో మాటామాట పెరగడంతో రాంవీర్ క్షణికావేశంలో సఖీ బాబాను కత్తీతో పొడిచి హత్య చేశాడు. కేకలు విన్న స్థానికులు రాంవీర్ను పట్టుకునేందుకు గ్రామస్తులు ప్రయత్నించగా లభించలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఆలయాన్ని పరిశీలించారు. ఆలయ ప్రాంగణంలోనే సఖీబాబా ఉండేవాడు. ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం నిందితుడిపై హత్య కేసును నమోదు చేశామని ఎస్పీ సంకల్ప్ శర్మ తెలిపారు. నిందితుడిని పట్టుకునేందుకు మూడు బృందాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. అయితే ఎందుకు హత మార్చాడనే విషయం ఇంకా తెలియలేదని చెప్పారు. -
మోదీతో పాటు నిన్ను చంపేస్తాం: ఎమ్మెల్యేకు పాక్ నుంచి బెదిరింపులు
లక్నో: ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు నిన్ను చంపేస్తామని తనకు బెదిరింపులు వచ్చాయని ఓ బీజేపీ ఎమ్మెల్యే పోలీసులను ఆశ్రయించింది. తనకు ప్రాణాపాయం పొంచి ఉందని.. భద్రత కల్పించాలని ఆ మహిళా ఎమ్మెల్యే పోలీసులకు విజ్ఞప్తి చేసింది. ఆమె ఎటావా సదర్ నియోజకవర్గం ఎమ్మెల్యేతో పాటు ఉత్తరప్రదేశ్ మహిళా, శిశు అభివృద్ధి జాయింట్ కమిటీ ఎటావా చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ఆమె కుటుంబంతో పాటు ఆమెను చంపేస్తామని బెదిరింపులతో పోలీసు శాఖ అప్రమత్తమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సీనియర్ బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకులను చంపేస్తామని తనకు వాట్సాప్లో బెదిరింపు సందేశాలు వచ్చాయని ఎమ్మెల్యే సరితా భదౌరియా సోమవారం తెలిపారు. పాక్ గూఢచార సంస్థ ఎస్ఐఎస్ లోగోతో వాట్సాప్లో సందేశాలు వచ్చాయని పోలీసులకు వివరించారు. శనివారం రాత్రి 11 గంటల సమయంలో తొలి సందేశం రాగా ఆ తర్వాత వరుస పెట్టి సందేశాలు వచ్చాయని వెల్లడించింది. ఆదివారం ఉదయం వరకు ఎమ్మెల్యేతో పాటు ప్రధాని, బీజేపీ సీనియర్, ఆర్ఎస్ఎస్ నేతలను చంపేస్తామంటూ 8 సందేశాలు వచ్చాయని పోలీసులకు ఆమె తెలిపింది. ఆమె ఫిర్యాదు స్వీకరించిన అనంతరం ఎటావా సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ ఆకాశ్ తోమర్ మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేకు వాట్సాప్లో వచ్చిన బెదిరింపు మెసేజ్లు పరిశీలించినట్లు తెలిపారు. పాకిస్తాన్కు చెందిన +92 సిరీస్తో ప్రారంభమైన మొబైల్ నంబర్ నుంచి సందేశాలు వచ్చాయని, వాటిపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే భద్రతా ఏర్పాట్లను సమీక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. సరితా భదౌరియా 1999లో భర్త అభయ్ వీర్ సింగ్ భదౌరియా హత్యానంతరం రాజకీయాల్లోకి వచ్చారు. అప్పటి నుంచి వివిధ పదవుల్లో కొనసాగుతున్నారు. -
హథ్రాస్ రేప్ కేసులో అనుమానాలెన్నో!
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హథ్రాస్ దళిత యువతి దారుణ హత్యా, అత్యాచారం కేసులో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఠాకూర్ కుటుంబానికి చెందిన నలుగురు యువకులు దారుణంగా దాడి చేయడం వల్ల దళిత యువతి మరణించినట్లు తెలుస్తోంది గానీ, వారి వల్ల అత్యాచారానికి గురైనట్లు ఆధారాలు లేవని, ఫోరెన్సిక్ సైన్స్ లాబరేటరీ నివేదిక కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోందని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అదనపు డీజీపీ ప్రశాంత కుమార్ గత గురువారం మీడియాకు వెల్లడించడం పలు అనుమానాలకు దారి తీసింది. పోలీసులే ఈ కేసును మసిపూసి మారేడు కాయను చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, బాధితురాలి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించకుండా బుధవారం తెల్లవారు జామున 3.30 గంటలకు పోలీసులే తగులబెట్టడం ఈ అనుమానాలకు బలం చేకూర్చింది. సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం రేప్ కేసుల్లో బాధితుల మృతదేహాలను తప్పనిసరిగా కుటుంబసభ్యులకే అప్పగించాలి. అలా చేయకపోగా కూతురు మృతదేహాన్ని కోరడానికి వెళితే పోలీసులు తమను నిర్బంధించి వేధించారని బాధితురాలి తల్లి, ఇతర కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సెప్టెంబర్ 14వ తేదీన దుండగుల దాడికి, అత్యాచారానికి గురైన దళిత యువతి ఆలీగఢ్ ఆస్పత్రిలో చేరిన ప్పుడు మీడియా ముఖంగా ఆమె తనపై అత్యాచారం జరిగినట్లు ఆరోపించారు. బాధితురాలిని రేప్ చేశారని చెప్పడానికి ఆ ఆస్పత్రి వైద్య నిపుణులు ‘కంప్లీట్ పెనట్రేషన్ ఆఫ్ వజీనా’ అంటూ తమ ప్రాథమిక నివేదికలో వెల్లడించారు. సెప్టెంబర్ 29వ తేదీన ఢిల్లీ ఆస్పత్రిలో ఉదయం 8.30 గంటల ప్రాంతంలో మరణించిన తర్వాత నిర్వహించిన ‘ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్’ నివేదికలో ‘వీర్యం’ ఆనవాళ్లు కనిపించలేదని ఇచ్చారు. ఇదే విషయాన్ని యూపీ అదనపు డీజీపీ మీడియా ముఖంగా వెల్లడించారు. (చదవండి : హథ్రాస్ ఘటన: న్యాయం చేసే ఉద్దేశముందా?) బాధితురాలపై సెప్టెంబర్ 14వ తేదీన అత్యాచారం జరిగినందున వాటి ఆనవాళ్లు సెప్టెంబర్ 29వ తేదీ వరకు ఉండే అవకాశం లేదని అలీగఢ్ ఆస్పత్రి వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. అత్యాచారం జరిగిన చాలా రోజుల వరకు పోలీసులు కేసు దాఖలు చేయక పోవడం, కనీసం నిందితులను అదుపులోకి తీసుకోక పోవడం కూడా పలు అనుమానాలకు దారితీసింది. ఈ కేసు విచారణను మొదట సిట్ దర్యాప్తునకు అప్పగించిన ఆదిత్యనాథ్ యోగి ప్రభుత్వం ఇప్పుడు ప్రజల ఒత్తిడి మేరకు సీబీఐకి అప్పగించింది. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని సీబీఐ వల్ల న్యాయం జరగక పోవచ్చని కాంగ్రెస్, దళిత పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎన్కౌంటర్లకు పెట్టింది పేరైన యూపీ పోలీసులు హైదరాబాద్లోని ప్రియాంక రెడ్డి హత్యా, అత్యాచారం కేసులో లాగా ఈ కేసులో నేరస్థులను ఎందుకు ఎన్కౌంటర్ చేయరని దళిత సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. (చదవండి : దళిత యువతి వీడియో క్లిప్పై హల్చల్) -
రాహుల్ గాంధీ అరెస్ట్
నోయిడా: హాథ్రస్ హత్యాచార బాధితురాలి కుటుంబ సభ్యులను కలిసేందుకు కాలినడకన వెళ్తున్న కాంగ్రెస్ సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలను గురువారం గ్రేటర్ నోయిడాలోని యమున ఎక్స్ప్రెస్ వే పై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని దగ్గర్లోని ఒక గెస్ట్హౌజ్కు తీసుకువెళ్లి, కాసేపైన తరువాత విడిచిపెట్టారు. హాథ్రస్కు శాంతియుతంగా, కాలినడకన వెళ్తున్న రాహుల్, ప్రియాంకను, పలువురు ఇతర నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారని కాంగ్రెస్ ప్రకటించింది. అంతకుముందు, హాథ్రస్కు వెళ్లేందుకు బయల్దేరిన రాహుల్, ప్రియాంకల వాహన శ్రేణిని యూపీ పోలీసులు పరి చౌక్ వద్ద అడ్డుకున్నారు. దాంతో, పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి కాలి నడకన 150 కిమీల దూరంలోని హాథ్రస్కు వెళ్లాలని రాహుల్, ప్రియాంక నిర్ణయించారు. పాదయాత్రగా వెళ్తున్న రాహుల్ను పోలీసులు అడ్డుకుంటున్న క్రమంలో.. ఆయన కిందపడ్డారు. ‘మీరు హిందూ మత రక్షకులమని చెప్పుకుంటారు. ఒక తండ్రి తన కూతురి చితికి నిప్పంటించనివ్వకూడదని, అంత్యక్రియల్లో కుటుంబ సభ్యులను పాల్గొననివ్వకూడదని ఏ గ్రంథంలో రాసి ఉంది?’ అని యోగి ఆదిత్యనాథ్పై ప్రియాంకగాంధీ మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకుల పర్యటన నేపథ్యంలో హాథ్రస్ జిల్లాలో అధికారులు 144 సెక్షన్ విధించారు. జిల్లా సరిహద్దులను మూసేశారు. రాహుల్, ప్రియాంకలతో పోలీసులు దౌర్జన్యపూరితంగా వ్యవహరించిన తీరును ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఖండించారు. నిషేధాజ్ఞలను ఉల్లంఘించినందువల్లనే రాహుల్, ప్రియాంకలను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించారని, దాంతో ఐపీసీ సెక్షన్ కింద వారిపై కేసు నమోదు చేశామని గౌతమబుద్ధ నగర్ కమిషనర్ లవ్ కుమార్ వెల్లడించారు. తర్వాత రాహుల్తో మాట్లాడుతున్న ప్రియాంక -
అత్యాచారం జరగలేదు
లక్నో: హాథ్రస్ బాధిత యువతిపై అత్యాచారం జరగలేదని యూపీ పోలీసులు ప్రకటించారు. ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలో కూడా అదే విషయం స్పష్టమైందని గురువారం యూపీ ఏడీజీ(శాంతి భద్రతలు) ప్రశాంత్ కుమార్ తెలిపారు. మెడపై అయిన తీవ్రస్థాయి గాయం కారణంగా ఆమె చనిపోయిందన్నారు. ‘ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది. అత్యాచారం కానీ, గ్యాంగ్ రేప్ కానీ జరగలేదని అందులో స్పష్టంగా ఉంది’ అన్నారు. ‘చనిపోకముందు, పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలోనూ.. నిందితులు తనను కొట్టారనే బాధితురాలు చెప్పింది కానీ, అత్యాచారం చేసినట్లు చెప్పలేదు’ అని వివరించారు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపేందుకు ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ప్రత్యేక పోలీస్ బృందాన్ని ఏర్పాటు చేశారన్నారు. అయితే, నలుగురు నిందితులు సందీప్, రాము, లవ్కుశ్, రవి తనను గ్యాంగ్ రేప్ చేశారని బాధిత యువతి వాంగ్మూలం ఇచ్చినట్లు గతంలో ఎస్పీ విక్రాంత్ వీర్ వెల్లడించడం గమనార్హం. వారి ప్రయత్నాన్ని అడ్డుకోవడంతో తన మెడను గట్టిగా నులిమారని, ఆ సమయంలో తన నాలుక తెగిపోయిందని ఆమె వివరించినట్లు ఎస్పీ చెప్పారు. కలెక్టర్ బెదిరింపు బాధితురాలి తండ్రిని హాథ్రస్ జిల్లా కలెక్టర్ బెదిరిస్తున్నట్లు కనిపిస్తున్న వీడియో ఒకటి వైరల్ అయింది. ‘మీడియా వాళ్లలో సగం మంది ఈరోజు వెళ్లి పోయారు. మిగతా సగం రేపు వెళ్లిపోతారు. ఇక్కడ స్థానికంగా మీతో ఉండేది మేమే. నీ స్టేట్మెంట్ను మారుస్తావా?లేదా? అనేది నువ్వే ఆలోచించుకుని నిర్ణయించుకో’ అంటూ కలెక్టర్ ప్రవీణ్ కుమార్ బాధితురాలి తండ్రితో బెదిరింపు స్వరంతో చెబుతున్నట్లు ఆ వీడియోలో ఉంది. దీనిపై మీడియా అడిగిన ప్రశ్నకు ప్రవీణ్ కుమార్ బదులివ్వలేదు. ఈ ఘటన విషయంలో అధికారులు, పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. అధికారులు చెప్పినట్లు వినకపోతే, సమస్యలు ఎదుర్కొంటారని జాయింట్ కలెక్టర్ కూడా బాధితురాలి కుటుంబ సభ్యులను బెదిరించినట్లు స్థానికులు వెల్లడించారు. ఒత్తిడి చేస్తున్నారు తన స్టేట్మెంట్ను మార్చుకోవాలని అధికారులు, పోలీసులు ఒత్తిడి చేస్తున్నారని బాధితురాలి తండ్రి పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్కు బలవంతంగా తీసుకువెళ్లి, తనతో పాటు తన కుటుంబ సభ్యులతో కొన్ని కాగితాలపై సంతకాలు తీసుకున్నారని ఆరోపించారు. తన కూతురి హత్యాచారంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. యూపీలో మరో కిరాతకం బలరాంపూర్: యూపీలోని బలరాంపూర్ జిల్లాలో 22 ఏళ్ల మరో దళిత యువతిపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందగా, బుధవారం అంత్యక్రియలు నిర్వహించారు. యువతిపై అత్యాచారం ఘటనలో షాహిద్, సాహిల్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. దుండగుల దాడిలో తన కుమార్తె కాళ్లు, వెన్నెముక విరిగిపోయాయని బాధితురాలి తల్లి తెలిపారు. మంగళవారం కాలేజీలో ప్రవేశం కోసం వెళ్లివస్తున్న తన బిడ్డను నలుగురు వ్యక్తులు అపహరించారని, మత్తు ఇంజెక్షన్ ఇచ్చి, దురాగతానికి పాల్పడ్డారని, తర్వాత రిక్షాలో తీసుకొచ్చి, తమ ఇంటి ముందు పడేశారని పేర్కొన్నారు. బాధితురాలి కాళ్లు, వెన్నుముక విరిగినట్లు పోస్టుమార్టంలో బయట పడలేదని జిల్లా ఎస్పీ దేవ్రంజన్ అన్నారు. -
గంజాయి కేసు; మహిళకు నోటీసులు
ఒడిశా, జయపురం: దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్లో నమోదైన గంజాయి కేసులో ఒడిశాకు చెందిన ఆదివాసీ నిరుపేద మహిళను నిందితురాలిగా చేసి కోర్టుకు హాజరుకావాలని ఉత్తరప్రదేశ్ డైరెక్టరేట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ నోటీసులు పంపింది. అవిభక్త కొరాపుట్లోని నవరంగపూర్ జిల్లా పపడహండి సమితిలో చిన్న కుగ్రామం సన్యాసిగుడలో పశువులు మేపుకుంటూ జీవనం సాగిస్తున్న గౌరిమణి భొత్ర అనే మహిళకు నాలుగు రోజుల క్రితం ఈ నోటీసులు అందాయి. గంజాయి కేసులో నిందితురాలు లక్నోలోని కార్యాలయంలో హాజరుకావాలని నోటీసు సారాంశం. ఇంతవరకూ ఆమె తన జిల్లా కేంద్రాన్నే చూసి ఎరుగదు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఎక్కడ ఉందో తెలియని నిరక్షరాస్య, నిరుపేద మహళా పశువుల కాపరికి ఆ నోటీసు ఎందుకు వచ్చిందో? ఎవరు పంపారో తెలియక, అందులో ఏముందో అర్థం కాక ముచ్చెమటలు పట్టి అందరి వద్దకు తిరిగి చదివి వినిపించమని వేడుకుంది. ఆ గ్రామంలోనే కాదు పరిసర గ్రామాలలో ఆ నోటీసు చదవగల వారు ఎవరూ లేక పోవడంతో మంత్రిగుడలో ఒక ఉపాధ్యాయుడితో చదివించుకుంది. ధైర్యం చెప్పిన ఎస్పీ కుశలకర్ నోటీసులో విషయం తెలిశాక తాను గంజాయి కేసులో ఎప్పుడు? ఎక్కడ? పట్టుబడ్డానంటూ తల పట్టుకుంది. మూడు నాలుగు రోజులు మానసిక వ్యధ పొందిన ఆమె చివరికి ఉపాధ్యాయుని సలహా మేరకు గురువారం నవరంగపూర్ వచ్చి ఎస్పీ కుశలకర్ను కలిసి నోటీసు చూపింది. నోటీసు చదివిన ఎస్పీ ఏమీ కాదని భరోసా ఇవ్వడంతో ఊరట చెంది ఇంటికి మళ్లింది. -
క్షమాపణ చెప్పిన యూపీ పోలీసులు
-
లాక్డౌన్: లెంపలేసుకున్న పోలీసులు
లక్నో: కరోనా వ్యాప్తి నివారణకు లాక్డౌన్ విధించిన నేపథ్యంలో బడుగులపై ప్రతాపం చూపిన ఉత్తరప్రదేశ్ పోలీసులు ఎట్టకేలకు క్షమాపణ చెప్పారు. వలస కార్మికులను విచక్షణారహితంగా వేధించినందుకు లెంపలు వేసుకున్నారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిచారన్న కోపంతో వలస కూలీల పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించిన ఘటన బదౌన్లోని సివిల్లైన్స్ ప్రాంతంలో గురువారం చోటుచేసుకుంది. లాక్డౌన్తో ఉపాధి లేక కాలినడక స్వస్థలాలకు పయనమైన యువకుల పట్ల పోలీసులు అవమానవీయంగా ప్రవర్తించారు. నిబంధనలు ఉల్లంఘించి రోడ్డు మీదకు వచ్చారన్న ఆగ్రహంతో ఐదుగురు యువకులను మోకాళ్లపై కూర్చొపెట్టి నడిపించారు. వీపు మీద బ్యాగులతో మోకాళ్లపై నడవలేక ఎంతో బాధ అనుభవించారు. (కరోనా నెగటివ్: అయ్యో పాపం) ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు స్పందించారు. వలస కార్మికుల పట్ల తమ సిబ్బంది వ్యవహరించిన తీరు బాధాకరంగా, అవమానకరంగా ఉందని బదౌన్ పోలీస్ చీఫ్ ఏకే త్రిపాఠి పేర్కొన్నారు. జరిగిన దారుణానికి క్షమాపణ చెప్పారు. ఇలాంటి ఘటన జరిగివుండకూదని, కారుకుడైన ట్రైనీ కానిస్టేబుల్ను విధుల నుంచి తొలగించామని చెప్పారు. అక్కడే ఉన్న మరో కానిస్టేబుల్ ప్రమేయంపై దర్యాప్తు జరిపి చర్య తీసుకుంటామన్నారు. కాగా, లాక్డౌన్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్న ఘటనలు చాలా చోట్ల వెలుగులోకి వస్తున్నాయి. అత్యవసర సేవల సిబ్బందిని కూడా అడ్డుకున్న ఉదంతాలు కూడా బయటపడ్డాయి. పోలీసులు సంయమనంతో వ్యవహరించి, ప్రస్తుత పరిస్థితులపై అవగాహన కల్పించాలని ప్రజలు కోరుకుంటున్నారు. (మఫ్టీలో వచ్చి.. కానిస్టేబుల్ అనుచిత చర్య) -
పౌర నిరసనలు : ‘పోలీసులే దొంగలయ్యారు’
లక్నో : నెల రోజులపాటు ఉధృతంగా సాగిన పౌరసత్వ నిరసనలు మరోసారి మొదలయ్యాయి. లక్నోలోని క్లాక్ టవర్ వద్ద శుక్రవారం రాత్రి సీఏఏకు వ్యతిరేకంగా సుమారు 50 మంది మహిళలు, విద్యార్థులు నిరవధిక నిరసనకు దిగారు. నిరసనకారుల సంఖ్య శనివారానికి మరింత పెరిగింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని చెదరగొట్టారు. అయితే, పోలీసుల తీరు దొంగల మాదిరిగా ఉందని నిరసనకారులు విమర్శిస్తున్నారు. ధర్నా జరిగే చోటు నుంచి బ్లాంకెట్లు, ఆహార పదార్ధాలను దౌర్జన్యంగా తీసుకెళ్లారని ఆరోపించారు. ఈ ఆరోపణలపై లక్నో పోలీసులు స్పందించారు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే క్లాక్ టవర్ వద్ద ఆందోళన చేపట్టారని పోలీసులు తెలిపారు. టెంట్లు వేసేందుకు నిరసనకారులు ప్రయత్నించారని, అందుకనే వారి వద్ద నుంచి బ్లాంకెట్లు, ఇంతర సామాగ్రిని సీజ్ చేశామని వెల్లడించారు. వందల కొద్దీ బ్లాంకెట్లను పంచి పెడుతుండగా.. అడ్డుకుని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. తమపై అసత్యాలు ప్రచారం చేయొద్దని హితవు పలికారు. ఇదిలాఉండగా.. పోలీసులు బ్లాంకెట్లు, టిఫిన్ బాక్స్లు తీసుకెళ్తున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్లో మైనారిటీలుగా ఉన్న ముస్లిమేతరులకు భారత పౌరసత్వాన్ని కల్పించే ఉద్దేశంతో మోదీ ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం తెచ్చిన సంగతి తెలిసిందే. Meanwhile this is the video of the ' kambals being taken into kabza ' by the @lkopolice at the clock tower 's #CAA_NRCProtests last night ... https://t.co/6rbLaRIKV9 pic.twitter.com/muvUMWlGlK — Alok Pandey (@alok_pandey) January 19, 2020 -
ప్రియాంకా..నిన్ను చూసి గర్విస్తున్నా!
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పట్ల లక్నోలో యూపీ పోలీసులు వ్యవహరించిన తీరును ఆమె భర్త రాబర్ట్ వాద్రా తీవ్రంగా ఖండించారు. మాజీ ఐపీఎస్ అధికారి ఎస్ఆర్ దారాపురి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళుతున్న ప్రియాంకను మహిళా పోలీసులు అడ్డగించి దౌర్జన్యపూరితంగా వ్యవహరించడం సరైంది కాదని అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసుల్లో ఒకరు ప్రియాంక గొంతు పట్టుకోగా, మరొకరు తోసివేయడంతో ప్రియాంక కిందపడ్డారని అన్నారు. ‘నీకు అవసరమైన వారిని కలిసేందుకు ఎంతదూరమైనా వెళ్లే నీ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నానని, నిన్ను చూసి గర్విస్తున్నాన’ని వాద్రా ట్వీట్ చేశారు. మహిళా పోలీసులు అడ్డగించినా టూ వీలర్పై మాజీ ఐపీఎస్ అధికారి ఎస్ఆర్ దారాపురి కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు వెళ్లడం ఆమె అంకితభావానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. ‘నీవు చేసింది సరైన పనే.. బాధలో మునిగి సహాయం కోసం వేచిచూసే వారిని కలిసేందుకు వెళ్లడం నేరమేమీ కాద’ని ఆ ట్వీట్లో పేర్కొన్నారు. కాగా తనపై మహిళా పోలీసులు అనుచితంగా వ్యవహరించారని ప్రియాంక చేసిన ఆరోపణలను యూపీ పోలీసులు తోసిపుచ్చారు. ప్రియాంక గాంధీపై పోలీసులు భౌతిక దాడికి పాల్పడ్డారని జాతీయ మానవహక్కుల కమిషన్లో ఫిర్యాదు నమోదైంది. చదవండి : పోలీసులు నాపై చేయి చేసుకున్నారు -
సీఏఏ: ఉక్కుపాదం మోపిన యూపీ ప్రభుత్వం
లక్నో : పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసన ప్రదర్శనల్లో హింసకు పాల్పడిన వ్యక్తుల ఫోటోలను ఉత్తరప్రదేశ్ పోలీసులు గురువారం విడుదల చేశారు. మవు జిల్లాలో నిందితుల పోస్టర్లతో పాటు వారిపై రివార్డు కూడా ప్రకటించారు. ఈ సందర్భంగా నిందితుల ఆచూకీ తెలిపిన వారి సమాచారం గోప్యంగా ఉంచుతామని పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు నిందితుల ఫోటోలను వాట్సాప్, ఫేస్బుక్లలో షేర్ చేశారు. యూపీలో ఇప్పటివరకు జరిగిన హింసలో దాదాపు 17 మంది చనిపోయారని, 213 కేసులలో 925 మందిని అరెస్ట్ చేశామని యూపీ డీజీపీ కార్యాలయం తెలిపింది. మవు జిల్లాలో సోమవారం జరిగిన అల్లర్లలో పాల్గొన్న 110 మంది నిందితుల ఫోటోలతో కూడిన పోస్టర్ను పోలీసులు విడుదల చేశారు. నిందితుల వీడియోలు, ఫోటోలన్నీ సీసీ కెమెరాలు, మీడియా నుంచి సేకరించామని పోలీసులు తెలిపారు. మవు జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజా ఆస్తులను ధ్వంసం చేసిన అంశంలో మూడు ఎఫ్ఐఆర్లు దాఖలు చేశామని, 21 మందిని అరెస్ట్ చేశామని వెల్లడించారు. కాన్పూర్ పోలీసులు శుక్ర, శనివారాలలో హింసకు పాల్పడిన 48 మంది నిందితులతో కూడిన పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ ఘటనలో ముగ్గురు చనిపోగా, 11 మంది గాయపడ్డారు. వీరిపై 17 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి 24 మందిని అరెస్ట్ చేసినట్టు స్థానిక పోలీసు అధికారి వెల్లడించారు. ఫిరోజాబాద్లో శుక్రవారం జరిగిన అల్లర్లలో పాల్గొన్న 80 మంది నిందితుల ఫోటోలతో కూడిన పోస్టర్ను విడుదల చేశారు. బిజ్నూర్లో ముగ్గురు నిందితులపై 25వేల రివార్డు ప్రకటించగా, అల్లర్లలో ఇద్దరు చనిపోయారు. 146 మందిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఎస్పీ సంజీవ్ త్యాగి మాట్లాడుతూ.. విచారణలో మాజీ మున్సిపల్ చైర్మన్ జావేద్ అఫ్తాబ్, డా. ఫుర్ఖాన్ మెహర్బాన్, ఆదిల్లను గుర్తించాము. ఈ ముగ్గురిపై 25వేల రూపాయల రివార్డు ప్రకటించాము. ఈ ముగ్గురూ ప్రసుతం పరారీలో ఉన్నారు. డా. ఫుర్ఖాన్ బిజ్నూర్లో ఓ మదర్సా కూడా నడుపుతున్నాడని వివరించారు. గోరఖ్పూర్లో పోలీసులపై రాళ్లు రువ్విన ఘటనలో 16 మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో 60 మంది నిందితుల ఫోటోలతో కూడిన పోస్టర్లను రిలీజ్ చేశారు. 33 మంది ఆస్తులను అటాచ్ చేస్తూ వారి ఇంటి గోడలపై నోటీసులు అంటించారు. ఈ విషయంపై పోలీస్ అధికారి జయదీప్ కుమార్ వర్మ మాట్లాడుతూ.. ఆ నోటీసులలో నిందితులు రెండు రోజుల్లో పోలీస్ స్టేషన్కు వచ్చి హాజరు కావాలని, లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నాం. అంతేకాకుండా అల్లర్లలో విధ్వంసానికి పాల్పడలేదని వారి దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే సమర్పించాలని కోరుతున్నామని వెల్లడించారు. మరోవైపు నిందితుల ఫోటోలతో కూడిన పోస్టర్లను విడుదల చేయడంపై సుప్రీంకోర్టు న్యాయవాది సరీం నవేద్ మాట్లాడుతూ.. పోలీసులు చట్టప్రకారమే వ్యవహరిస్తున్నారు. అయితే మైనర్ల విషయంలో చట్టాలు వేరేలా ఉంటాయి. నిబంధనల ప్రకారం మైనర్ల ఫోటోలను బహిరంగపరచకూడదు. ఈ విషయంలో పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. -
అమ్మో! జీలకర్ర
రాయబరేలి : జీలకర్ర దాదాపు ప్రతి భారతీయ ఇంటిలో ఉపయోగించే సాధారణ మసాలా (ఔషధ) దినుసు. కాదేదీ కల్తీకి అనర్హం అని రెచ్చిపోతున్న అక్రమార్కులు పెద్దమొత్తంలో నకిలీ జీలకర్రను సరఫరా తయారు చేస్తూ పోలీసులకు దొరికారు. ఉత్తర ప్రదేశ్, రాయ్ బరేలిలో ఈ ముఠా గుట్టును రట్టు చేశారు. చిపురు పుల్ల ముక్కలు, ఎండుగడ్డి, మొలాసిస్ ఉపయోగించి తయారు చేసిన 30వేల కిలోల నకిలీ జీలకర్ర (జీరా)ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని రూ. 60 లక్షలు వుంటుందని అధికారులు తెలిపారు. మహారాజ్గంజ్ డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ వినీత్ సింగ్ వెల్లడించిన సమాచారం ప్రకారం.. చీపురు ముక్కలతోపాటు ఎండు గడ్డిని చీపుర్లలా తయారు చేస్తారు. అనంతరం వీటిని వేడి వేడి మొలాసిస్లో ముంచి ఎండ బెడతారు. ఎండిన తర్వాత, నిజమైన జీలకర్రలా కనిపించేలా ముక్కలుగా చేసి కల్తీ చేసి వివిధ నగరాలకు రవాణా చేస్తున్నారని తెలిపారు. 80, 20 నిష్పత్తిలో కల్తి చేశారన్నారు. తద్వారా ముఠా సభ్యులు 50 నుంచి 60 రెట్లు ఎక్కువ లాభాలను ఆర్జించుకుంటారనితెలిపారు. గత ఏడాది కాలంతా ఈ ముఠా ఈ దందాను కొనసాగిస్తోందన్నారు. ఈ కేసులో ప్రశాంత్ సాడు, కమలేష్ మౌర్య, పంకజ్ వర్మ, ఇంద్రజీత్, పవన్ గుప్తా, రాజేంద్ర ప్రసాద్, చోతేలాల్పై కేసు నమోదు చేశారు. పరారీలోఉన్న వీరిని అరెస్టు చేయడానికి రెండు పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు అధికారి తెలిపారు. గత నెలలో ఢిల్లీ పోలీసులు దాదాపు ఇలాంటి భారీ రాకెట్టును ఛేదించిన సంగతి తెలిసిందే. సో.. నకిలీ ఏదో.. అసలు ఏదో నిర్ధారించుకోవాల్సిన పదార్థాల జాబితాలో జీలకర్ర కూడా చేరిందన్నమాట. ఇటీవల ఢిల్లీలో స్వాధీనం చేసుకున్న నకిలీ జీలకర్ర తయారీ దృశ్యాలు -
రేప్ చేయలేదు కదా? చేశాక చూద్దాం : పోలీసులు
లక్నో : ఉన్నావ్లో అత్యాచార బాధితురాలిపై దాడి ఘటనపై దేశం అట్టుడికిపోతుండగా, అదే జిల్లాలో మరో విస్మయకర సంఘటన వెలుగులోకి వచ్చింది. ఉన్నావ్ జిల్లాలోని సిందుపూర్ గ్రామానికి చెందిన ఓ యువతి తనపై ఐదుగురు యువకులు అత్యాచారయత్నం చేశారంటూ శనివారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వస్తే అత్యాచారం ఇంకా జరగలేదు కదా! జరిగాక వచ్చి ఫిర్యాదు చేయు. అప్పుడు చూద్దామని బదులిచ్చారు. బాధితురాలి కథనం ప్రకారం.. ‘స్వగ్రామంలో మందులు తీసుకురావడానికి వెళ్తున్న తనను ఐదుగురు యువకులు అడ్డగించి బలాత్కారం చేయబోయారు. వారిలో ముగ్గురిని గుర్తుపట్టగలను. వారి పేర్లు కూడా నాకు తెలుసు. ఈ ఘటనపై ఫిర్యాదు చేయడానికి మొదట నేను 1090 కి కాల్ చేశాను. వాళ్లు 100కు ఫోన్ చేయమన్నారు. 100కు ఫోన్ చేస్తే ఉన్నావ్ స్టేషన్కి వెళ్లమన్నారు. అక్కడికి వెళ్తే సంఘటన జరిగిన ప్రదేశం స్థానిక బిహార్ పోలీస్ స్టేషన్ పిరిధిలోకి వస్తుంది కాబట్టి అక్కడికి వెళ్లమన్నారు. మూడు నెలల నుంచి నన్ను ఇలాగే తిప్పించుకుంటున్నారు. నేను ఫిర్యాదు చేస్తున్నానని తెలిసి ఆ యువకులు రోజూ మా ఇంటికి వచ్చి కేసు ఫైల్ అయితే చంపేస్తామని బెదిరిస్తున్నారు. అయినా ఏదైనా ఘోరం జరగకముందే తగిన చర్యలు తీసుకోవాలి గానీ, జరిగాక హడావిడి చేస్తే న్యాయం ఎలా జరుగుతుంద’ని ఆమె ఓ జాతీయ మీడియాతో తన గోడు వెళ్లబోసుకుంది. ఈ విషయంపై అక్కడి ఐజీని మీడియా వివరణ కోరగా ఆయన అలాంటిదేమీ లేదని పేర్కొనడం గమనార్హం. (చదవండి) : ఉన్నావ్ అత్యాచార బాధితురాలు మృతి -
సోషల్ మీడియాకు స్ట్రాంగ్ వార్నింగ్
లక్నో: దశాబ్దాలుగా న్యాయస్థానాల్లో నలుగుతూ వస్తోన్న చారిత్రాత్మక అయోధ్య భూ వివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానం త్వరలోనే తన తీర్పును వెలువరించనుంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వినియోగదారులకు ఉత్తరప్రదేశ్ పోలీసులు స్పష్టమైన హెచ్చరికలు జారీచేశారు. అత్యంత సున్నితమైన, సమస్యాత్మకమైనదిగా భావిస్తోన్న రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదానికి సంబంధించిన తీర్పు వెలువడిన అనంతరం నెలకొనే పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. కోట్లాది మంది హిందువులు, ముస్లింల మనోభావాలతో ముడిపడి ఉన్న విషయం కావడం వల్ల అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. తీర్పు వెలువడిన తరువాత దానికి వ్యతిరేకంగా, సానుకూలంగా సోషల్ మీడియాలో పోస్టులు చేసే వారిపై కఠిన చర్యలను తీసుకోవడానికి రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుని శాంతి భద్రతలను దెబ్బతీస్తే అలాంటివారిని ఉపేక్షించబోమని, జాతీయ భద్రతా చట్టం కింద కేసులు నమోదు చేస్తామని ఉత్తరప్రదేశ్ డీజీ ఓపీ సింగ్ స్పష్టం చేశారు. ఈ నెల 17వ తేదీన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ పదవీ విరమణ నేపథ్యంలో ఆ లోపు రామజన్మభూమి-బాబ్రీ మసీదు కేసుపై తీర్పు వెలువడటం ఖాయంగా కనిపిస్తోంది. 17వ తేదీలోగా సుప్రీంకోర్టు పని దినాలు కూడా తక్కువగా ఉండడంతో ఏ రోజైనా సుప్రీంకోర్టు అయోధ్య భూ వివాదంపై తీర్పును వెలువరించే అవకాశం ఉంది. -
రక్షించారు.. కిడ్నాపర్లకే అప్పగించారు
లక్నో : ఓ కిడ్నాప్ కేసులో అనూహ్య మలుపు చోటు చేసుకుంది. కిడ్నాపర్ల చెర నుంచి యువతిని రక్షించిన పోలీసులు తిరిగి ఆమెను కిడ్నాపర్లకే అప్పగించారు. వినడానికి నమ్మశక్యంగా లేకపోయిన ఇది వాస్తవం. ఇంతకు ఇక్కడ అసలు విషయం ఏంటంటే.. కుటుంబ సభ్యులే సదరు యువతిని కిడ్నాప్ చేశారు. వివరాలు.. మత్లూబ్ అహ్మద్ అనే వ్యక్తి కుమార్తె ఈ నెల 11న ప్రేమించిన వ్యక్తితో కలిసి ఇంటి నుంచి వెళ్లి పోయింది. అనంతరం తమకు రక్షణ కల్పించాలంటూ.. అలహబాద్ హై కోర్టును ఆశ్రయించింది. అయితే కోర్టు ప్రాంగంణంలోనే గుర్తు తెలియని వ్యక్తులు ఆ జంటను కిడ్నాప్ చేశారు. దాంతో పోలీసులు ఆరు బృందాలుగా విడిపోయి సదరు జంట కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే దర్యాప్తులో యువతి కుటుంబ సభ్యులే ఆ జంటను కిడ్నాప్ చేశారని తెలిసింది. దాంతో యువతి తండ్రిని, సోదరుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అనంతరం ఆ జంటను వారి చెర నుంచి విడిపించారు. కథ సుఖాంతం అయ్యింది అనుకుంటుండగా.. సదరు యువతికి మైనారిటీ తీరలేదని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. దాంతో ఆ యువతిని తిరిగి కుటుంబ సభ్యులకే అప్పగించారు పోలీసులు. ఇదిలా ఉండగా యువతి తండ్రి మత్లూబ్ అహ్మద్ 2019 సార్వత్రిక ఎన్నికల్లో శివపాల్ యాదవ్ ప్రగతిశీల్ సమాజ్వాది పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. -
బైక్కు మంటలు.. తప్పిన పెను ప్రమాదం
ఆగ్రా : ఉత్తర్ప్రదేశ్ పోలీసుల సమయస్పూర్తి ఓ కుటుంబ ప్రాణాలు కాపాడింది. ఆగ్రా హైవేపై పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు ఓ కుటుంబం ప్రయాణిస్తున్న బైక్కు మంటలు అంటుకోవడం గమనించారు. అయితే బైక్ సైలెన్సర్ కింది భాగంలో మంటలు అంటుకోవడంతో దానిపై ప్రయాణిస్తున్నవారు గమనించకుండా అలానే ప్రయాణిస్తున్నారు. దూరం నుండే ప్రమాదం పసిగట్టిన పోలీసులు పెట్రోలింగ్ జీప్లో వారిని వెంబడించి, బైక్కు మంటలు అంటుకున్న విషయాన్ని చెప్పారు. వారిని బైక్ దూరంగా పంపించి పోలీసులు మంటలు ఆర్పారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్టయింది. బైక్పై ప్రయాణిస్తున్న సమయంలో బ్యాగ్ కిందవైపు రోడ్డుకు రాపిడి జరగడంతో మంటలు వ్యాపించాయి. ఈ ఘటన మొత్తాన్ని షూట్ చేసిన పోలీసులు వీడియోను తమ అధికారిక ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియోవైరల్గా మారింది. ఈ మొత్తం వ్యవహారంలో అప్రమత్తంగా వ్యవహరించిన పోలీసులను యూపీ డీజీపీ ప్రశంసించారు. -
నకిలీ బ్లడ్ బ్యాంక్ రాకెట్: ఐదుగురు అరెస్ట్
లక్నో: ఉత్తరప్రదేశ్ పోలీసులు ప్రయివేటు బ్లడ్ బ్యాంక్ యజమానులు చేస్తున్న కల్తీ రక్తం విక్రయాల రాకెట్ను ఛేదించారు. రాష్ట్రంలోని పలు బ్లడ్ బ్యాంకులు కల్తీ చేసిన రక్తాన్ని అంటగట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. ప్రత్యేక టాస్క్ ఫోర్స్ గురువారం రాత్రి నిర్వహించిన దాడుల్లో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. పక్కా సమాచారంతో రెండు ప్రయివేటు బ్లడ్ బ్యాంకుల్లో నిఖీలు చేపట్టిన అధికారులు అయిదుగురిని అదుపులోకి తీసుకున్నారు. మారువేషంలో అనేక ఆస్పత్రులు రక్త బ్యాంకులకు వెళ్లిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఈ రాకెట్ను ఛేదించింది. పరిశీలన కోసం కొన్ని కీలక పత్రాలు, లెడ్జర్ ఫైళ్లను స్వాధీనం చేసుకుంది. రిక్షా డ్రైవర్లు, ఇతర రోజువారీ కూలీలకు వెయ్యి, రెండువేల రూపాయలు చెల్లించి రక్తం తీసుకుంటారు. దీనికి కెమికల్, నీళ్లు కలిపి కల్తీ రక్తాన్ని యధేచ్చగా తయారు చేస్తారు. ఇలా ఒక ప్యాకెట్కు రెండు ప్యాకెట్ల చొప్పున తయారు చేసి విక్రయిస్తున్నారని అధికారులు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి రషీద్అలీ, రాఘవేంద్ర ప్రతాప్సింగ్, మహమ్మద్ నసీమ్, పంజక్ కుమార్, రజనీష్నిగం లను అరెస్ట్ చేశామని ఎస్టీఎఫ్ అధికారులు తెలిపారు. గత ఆరునెలలుగా ఈ దందా నడుస్తున్నట్టు గుర్తించామన్నారు. గత ఆరు నెలల కాలంలో దాదాపు వెయ్యి యూనిట్ల నకిలీ, కల్తీ రక్తం మార్కెట్లోకి తరలిపోయిందని చెప్పారు. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రులకు ఈ రక్తాన్ని విక్రయించినట్టు ప్రాథమికంగా అంచనా వేశారు. అంతేకాదు ఇందులో కొంత మంది డాక్టర్లు, నర్సులుకు కూడా భాగస్వామం ఉందని అధికారులు తెలిపారు. దీంతోపాటు ఇతర బ్లడ్బ్యాంకుల వ్యవహరాన్ని కూడా పరిశీలి స్తున్నట్టు చెప్పారు. -
కట్నం ఇవ్వలేదని ఫోన్లోనే తలాక్..
లక్నో : ఫోన్లో భార్యకు ట్రిపుల్ తలాక్ ఇచ్చిన యూపీకి చెందిన ఓ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రిపుల్ తలాక్ను నేరంగా పరిగణిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసిన క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కట్నం ఇవ్వలేదని తన కుమార్తెను ఆడపడుచులు, అత్తింటి వారు సూటిపోటి మాటలతో వేధిస్తున్నారని, సౌదీ అరేబియాలో నివసించే తన అల్లుడు ఫోన్ ద్వారా తన కుమార్తెకు విడాకులు ఇచ్చాడని బాధితురాలి తల్లి ఆరోపించారు. అత్తింటి వేధింపులతో విసిగిపోయిన తన కుమార్తెను పుట్టింటికి తీసుకువచ్చామని, అయినా వారు కట్నం తీసుకురావాలని వేధిస్తన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సౌదీ నుంచి తమ అల్లుడు తన కుమార్తెకు ఫోన్లో తలాక్ చెప్పాడని తమకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని బాధితురాలి తల్లి రేష్మా డిమాండ్ చేశారు. ఎనిమిది నెలల కిందట తనకు వివాహమైందని, కట్నం కింద రూ 50 వేల నగదు, మోటార్ బైక్ తీసుకురావాలని తన అత్త తనను కొడుతోందని బాధితురాలు నూరి వాపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణ అనంతరం నిందితులపై చర్య తీసుకుంటామని పోలీసులు తెలిపారు. -
ట్విస్ట్.. హత్యకేసు; పోలీసుల నిరసన
లక్నో : ఓ కేసులో నిందితుడిగా ఉన్న తమ సహచరుడి అరెస్ట్కు వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్ పోలీసులు నిరసన బాట పట్టారు. గత వారం రాత్రి పూట విధుల నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ప్రశాంత్ చౌదరి జరిపిన కాల్పుల్లో ఆపిల్ సంస్థలో మేనేజర్గా పనిచేస్తున్న వివేక్ తివారీ మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ప్రశాంత్ స్పందిస్తూ.. వివేక్ తనపై కారుతో దాడికి ప్రయత్నం చేయడంతోనే కాల్పులు జరపాల్సి వచ్చిందని పేర్కొన్నారు. మరోవైపు బాధితుడి బంధువులు మాత్రం ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనుమానం వస్తే కాల్చేస్తారా అని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఈ ఘటన తరువాత యూపీ పోలీసుల తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో ప్రభుత్వం ప్రశాంత్ని అరెస్ట్ చేయడంతో పాటు అతన్ని సస్పెండ్ చేస్తు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనపై విచారణ చేపట్టడానికి సిట్ను నియమించింది. కానీ, యూపీకి చెందిన చాలా మంది పోలీసులు ప్రశాంత్కు వ్యతిరేకంగా తీసుకున్న చర్యలను ఖండిస్తున్నారు. అతనికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అతన్ని వెంటనే విడుదల చేసి.. ఉద్యోగంలో చేర్చుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు నిరసనగా నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతున్నారు. అతనిపై చర్యలు ఉపసంహరించకుంటే అమరణ దీక్షకు దిగుతామని కూడా హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా అక్టోబర్ 5ను బ్లాక్డే పేర్కొంటూ పోలీసు అధికారుల సోషల్ మీడియాలో ఓ మెసేజ్ వైరల్గా మారింది. చదవండి: షాకింగ్ : కారు ఆపలేదని.. కాల్చేసిన కానిస్టేబుల్ ఆపిల్ ఉద్యోగి హత్యకు ఎవరు బాధ్యులు? -
25 లక్షలు వద్దు.. కోటి పరిహారం కావాలి..!
లక్నో : ఉత్తర ప్రదేశ్లో శనివారం జరిగిన యాపిల్ సంస్థ మేనేజర్ వివేక్ తివారి ఎన్కౌంటర్పై పెద్ద దుమారమే చెలరేగుతోంది. రాష్ట్రంలో జరుగుతున్న బూటకపు ఎన్కౌంటర్లకు బాధ్యత వహిస్తూ సీఎం యోగి ఆదిత్యానాథ్ రాజీనామా చేయాలని సమాజ్ వాదీ అధినేత అఖిలేష్ యాదవ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రభుత్వానికి వారి కుటుంబం నుంచి ఊహించని షాక్ తగిలింది. పోలీసుల కాల్పుల్లో మరణించిన వివేక్ కుటుంబాన్ని పరామర్శించేందుకు రాష్ట్ర మంత్రులు బ్రజేష్ పాఠక్, అశుతోష్ టాండన్లు ఆదివారం వారి ఇంటికి వెళ్లారు. ప్రభుత్వం తరుఫున నుంచి రూ. 25 లక్షల నష్టపరిహరం అందిస్తున్నట్లు ప్రకటించారు. దీనికి వివేక్ కుటుంబ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమకు 25 లక్షలు అవసరం లేదని.. కోటి పరిహారం కావాలని అతని భార్య కల్పన డిమాండ్ చేశారు. తమ కుటుంబమంతా వివేక్పైనే అధారపడి ఉందని.. పోలీసులు అక్రమంగా కాల్చి చంపారని, తమ పిల్లల భవిష్యత్తు ఏంటని ఆమె ప్రశ్నించారు. సీఎం యోగి ఆదిత్యా ఇక్కడి వచ్చి తమకు సమాధానం చెప్పే వరకు మృత దేహానికి దహన సంస్కారాలు నిర్వహించమని ఆమె తేల్చి చెప్పారు. ఆమెను కాసేపు మంత్రులు సముదాయించే ప్రయత్నం చేసిన వారి మాట వినకపోవడంతో మంత్రులు తిరిగి వెళ్లి పోయారు. తనంతరం ఆప్ నేత ఢిల్లీ మంత్రి సంజయ్ సింగ్ మృతుడి కుంటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ వారితో ఫోన్లో మాట్లాడి వివేక్ కుటుంబానికి న్యాయం జరిగేలా పోరాడతమని హామీ ఇచ్చారు. చదవండి : కారు ఆపనందుకు కాల్చేశారు -
హెలికాప్టర్ నుంచి పూల వర్షం.. వివాదం
లక్నో : కన్వార్ యాత్ర చేస్తున్న శివభక్తులపై యూపీ పోలీసు ఉన్నతాధికారులు పూల వర్షం కురిపించడంపై పలువురు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. మీరట్ జోన్ అడిషనల్ డైరెక్టర్ జనరల్(ఏడీజీ) ప్రశాంత్ కుమార్, మీరట్ కమీషనర్ అనిత మెశ్రమ్లతో పాటు మరికొందరు ఉన్నతాధికారులు శివభక్తులకు స్వాగతం పలుకుతూ హెలికాఫ్టర్ నుంచి పూలు చల్లారు. బుధవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే డ్యూటీలో ఉన్న పోలీసులు ఇలా ఎలా వ్యవహరిస్తారంటూ పలువురు విమర్శలు చేస్తున్నారు. ఒక వర్గానికి అనుకూలంగా పోలీసుల ప్రవర్తన ఉందంటూ మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఘటన వివాదస్పదంగా మారడంతో ఏడీజీ ప్రశాంత్ దీనిపై స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. తమపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. దీనిలో ఎటువంటి మతపరమైన కోణం లేదని వివరణ ఇచ్చారు. కన్వార్ యాత్ర చేపట్టిన శివ భక్తులకు స్వాగతం పలకడానికే పూలు చల్లినట్టు తెలిపారు. తమ వ్యవస్థ ప్రతి వర్గాన్ని గౌరవిస్తుందని పేర్కొన్నారు. అలాగే రంజాన్, బక్రీద్, జైన్ పండుగల్లో తాము పాలుపంచుకుంటామని అన్నారు. పోలీసు వాహనంపై భక్తుల దాడి కన్వార్ యాత్ర చేపట్టిన కొందరు శివభక్తులు ఇటీవల ఢిల్లీలోని మోతీ నగర్ ప్రాంతంలో ఓ కారుపై దాడి చేశారు. వారు దాడి చేస్తున్నా అక్కడే ఉన్న పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర పోషించారు. ఇందుకు సంబంధించి విమర్శలు రావడంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈ ఘటన మరువక ముందే మరి కొందరు శివభక్తులు మంగళవారం ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్లో ఏకంగా పోలీసు వాహనంపై దాడి చేశారు. కర్రలతో ఆ వాహనం అద్దాలను పగులకొట్టారు. పోలీసులు వారించినప్పటికీ లాభం లేకపోయింది. పరిస్థితి అదుపు తప్పడంతో.. పోలీసులు తమ వాహనాన్ని వెనక్కి తిప్పుకొని అక్కడి నుంచి బయటపడ్డారు. అయినా కొందరు పోలీసు వాహనం వెంట పరుగెత్తారు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో ఈ యాత్రకు సంబంధించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. కన్వార్ యాత్ర : శివభక్తులు ప్రతి ఏడాది శ్రావణమాసంలో కన్వార్ యాత్ర చేపడతారు. ఈ యాత్రలో భాగంగా శివ భక్తులు హరిద్వార్, గౌముఖ్, గంగోత్రి లాంటి పవిత్ర స్థలాలను సందర్శిస్తారు. అక్కడి నుంచి సేకరించిన గంగా జలాలను తమతో పాటు తీసుకెళ్తారు. ఆ పవిత్ర జలంతో తమ ప్రాంతంలోని దేవాలయాల్లో పూజలు నిర్వహిస్తారు. -
వివాదస్పదంగా మారిన యూపీ పోలీసుల చర్య
-
శివ భక్తుల దాడులు
-
యువతులపై పోలీసులు దాడి.. నెటిజన్ల ఫైర్
లక్నో: బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కాన్వాయ్ను అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఇద్దరి యువతుల పట్ల పోలీసులు అత్యంత అమానుషంగా ప్రవర్తించారు. కనీసం అమ్మాయిలన్న విషయం గుర్తించకుండా మగ పోలీసులే వారిని జుట్టు పట్టి మరి ఈడ్చిపడేశారు. ప్రస్తుతం ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రతిపక్షాలు యోగి ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఉత్తర ప్రదేశ్ పర్యటనలో భాగంగా అలహాబాద్కు బయలు దేరిన అమిత్ షా కాన్వాయ్ని ఇద్దరు యువతులు నల్ల జెండాలతో ‘అమిత్ షా గో బ్యాక్ అంటూ’ అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిని ఈడ్చిపడేశారు. అంతేకాకుండా వారిపై లాఠితో దాడి చేసి జట్టు పట్టి మరి బలవంతంగా జీపు ఎక్కించారు. అయితే మగ పోలీసులే యువతులను లాగేయడం ఏమిటని, మహిళా పోలీసులు ఏమయ్యారని, కీలక నేత పర్యటిస్తున్నప్పుడు మహిళా పోలీసులు లేకుండా ఎలా? అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఇక సోషల్ మీడియాలో అసలు యూపీలో మహిళా పోలీసులే లేరా? అని సెటైర్లు కూడా వస్తున్నాయి. ఈ ఘటన పట్ల సమాజ్ వాదీ పార్టీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ సునిల్ సింగ్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బేటీబచావో బేటీ పడావో’ అంటే ఇదేనా అని ఆయన ఎద్దేవా చేశారు. ఈ ఘటనతో మహిళల పట్ల ప్రభుత్వ విధానం ఎమిటో బహిర్గతమైందన్నారు. చట్ట ప్రకారం యువతులను మహిళా పోలీసులు అదుపులోకి తీసుకోవాలి. కానీ ఇక్కడ మగ పోలీసులే రెచ్చిపోయారని, ఈ విషయంలో సమాధానం చెప్పడానికి ప్రభుత్వం భయపడుతుందన్నారు. ఈ ఘటనకు కారణమైన భద్రతా అధికారులపై చర్యలు తీసుకోవాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. అత్యంత దారుణమైన ఘటనని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అన్షూ అవాస్థి అభిప్రాయపడ్డాడు. దీనికి కారణమనై అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. -
మగ పోలీసులే యువతులను లాగేయడం ఏంటి?
-
‘ఇక్కడ లంచాలు కామన్.. 3 లక్షలు ఉంటే చాలు’
మీరట్, ఉత్తరప్రదేశ్ : ప్రభుత్వం, ఉన్నతాధికారుల ప్రతిష్టను దిగజార్చే విధంగా ప్రవర్తించాడంటూ స్టేషన్ హౌజ్ ఆఫీసర్ను(ఎస్హెచ్ఓ)ను సస్పెండ్ చేసిన ఘటన ఉత్తర ప్రదేశ్లో చోటుచేసుకుంది. వివరాలు.. పరశురామ్ అనే వ్యక్తి బదిలీలో భాగంగా నోయిడాలోని దిబాయ్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓగా నియమితుడయ్యాడు. అయితే ఇలా కోరుకున్న చోట పోస్టింగ్ పొందేందుకు తాను ఉన్నతాధికారులకు లంచం ఇచ్చానంటూ పరశురామ్ చేసిన వాట్సాప్ చాట్ తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ గుర్తు తెలియని వ్యక్తితో చాట్ చేసిన పరశురామ్..‘ భయ్యా ఇది యోగి ప్రభుత్వం. ఇక్కడ లంచాలు ఇవ్వడం, తీసుకోవడం కామన్. నేను కూడా నా ట్రాన్స్ఫర్ కోసం ఏడీజీకి 50 వేల రూపాయలు ఇచ్చానంటూ పేర్కొన్నాడు. అంతేకాకుండా బులంద్షహర్ ఎస్ఎస్పీ గురించి చెబుతూ... ‘డబ్బులెవరైనా నేరుగా తీసుకుంటారా చెప్పు. ఆయన కూడా అంతే. నా ట్రాన్స్ఫర్ కోసం ఆయనకు 3 లక్షల రూపాయలు సమర్పించుకోవాల్సి వచ్చిందంటూ’ పరశురామ్ అవతలి వ్యక్తికి మెసేజ్ పంపించాడు. అవన్నీ అవాస్తవాలు.. పరశురామ్ చాట్ వైరల్ కావడంతో తమపై వస్తున్న ఆరోపణలు, విమర్శలపై ఉన్నతాధికారులు స్పందించారు. బులంద్షహర్ ఏడీజీ ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ... కేవలం తమ ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే పరశురామ్ ఇలా వ్యవహరించాడని తెలిపారు. అధికారులను కేవలం ఒక రేంజ్ నుంచి మరొక రేంజ్కు బదిలీ చేసే అధికారం మాత్రమే తనకు ఉంటుందని పేర్కొన్న ఆయన.. పరశురామ్ను బదిలీ చేసింది ఐజీ అని తెలిపారు. కాగా పరశురామ్ను సస్పెండ్ చేయడంపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వస్తోంది. -
‘బాధిత మహిళ తండ్రినీ బలిగొన్నారు’
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తర్ ప్రదేశ్లో బీజేపీ గూండా సర్కార్ నడుపుతోందని కాంగ్రెస్ ప్రతినిధి రణ్దీప్ సుర్జీవాలా ఆరోపించారు. బీజేపీ ఎంఎల్ఏ కుల్దీప్ సింగ్ సెంగార్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఆరోపించిన మహిళ తండ్రి పోలీసు కస్టడీలో మరణించారన్న వార్తలపై స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ నివాసం ఎదుట ఆదివారం బాధిత మహిళ ఆత్మహత్యకు యత్నించిన క్రమంలో ఆమె తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. యూపీ పోలీసులు చితకబాదడం వల్లే మహిళ తండ్రి మరణించారని సుర్జీవాలా ట్వీట్ చేశారు. అత్యాచార బాధితురాలు ఆత్మహత్యకు ప్రయత్నించడం, పోలీసు కస్టడీలో ఆమె తండ్రి మరణించడం అత్యంత హేయమని ఆయన ట్వీట్ చేశారు. నేరగాళ్లను అరెస్ట్ చేయడానికి బదులు యూపీ బీజేపీ సర్కార్ బాధితులను అరెస్ట్ చేస్తోందని, అక్కడ గూండాల పాలన సాగుతోందని ఆరోపించారు. అయితే తనపై వచ్చిన లైంగిక దాడి ఆరోపణలను బీజేపీ ఎమ్మెల్యే సెంగార్ తోసిపుచ్చారు. అయితే సెంగార్, ఆయన అనుచరులు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని, పోలీసులు కేసు నమోదు చేసేందుకు నిరాకరిస్తున్నారని బాధిత మహిళ ఆరోపించారు. అయితే పదేళ్లుగా ఈ వివాదం నడుస్తోందని, పూర్తి విచారణ అనంతరమే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు పేర్కొన్నారు. -
దారుణం.. యువతిని కాల్చేశారు!
లక్నో : ఉత్తరప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది. కూరగాయల కోసం మార్కెట్కు వెళ్లిన ఓ18 ఏళ్ల యువతిని గుర్తుతెలియని వ్యక్తులు సజీవ దహనం చేశారు. లక్నోకు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉన్నోజిల్లాలోని ఓ గ్రామంలో ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది. వారంతపు మార్కెట్కు వెళ్లడానికి గత సాయంత్రం బాధితురాలు సైకిల్పై ఇంటి నుంచి బయలు దేరింది. ఆ యువతిపై కొందరు దుండగలు పెట్రోలు పోసి నిప్పటించినట్లు తెలుస్తోంది. దీంతో ఆ యువతి 100 శాతం గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. గ్రామ శివారు పోలాల్లో ఓ మనిషిని కాల్చేశారనే వార్త ఉరంతా పాకింది. దీంతో బాధితురాలి కుటుంబసభ్యులు అక్కడికి వెళ్లారు. సైకిల్, చెప్పులు చూసి తమ కూతురే అని గుర్తుంచి బోరున విలిపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఘటనాస్థలిలో అగ్గిపెట్ట, సైకిల్, బాధితురాలి చెప్పులు పోలీసులకు లభించాయి. వీటి ఆధారంగా యువతిని పెట్రోల్తే సజీవంగానే కాల్చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అత్యాచారం జరిగిందా లేదనే విషయం పోస్ట్మార్టం రిపోర్ట్లో తెలుస్తోందన్నారు. -
యూపీలో యోగి ‘దబాంగ్’
లక్నో : ఉత్తర ప్రదేశ్లో ఇప్పుడు జైళ్లన్నీ క్రిమినల్స్తో కిటకిటలాడుతున్నాయి. ఏ క్షణాన తమల్ని లేపేస్తారేమోనన్న భయంతో వారంతా స్వచ్ఛందంగా పోలీసులకు లొంగిపోతున్నారు. ఇక మీద నేరాలు చెయ్యం.. ప్రాణాలతో వదిలేయండి బాబోయ్.. అంటూ అధికారులను వేడుకుంటున్న దృశ్యాలు కూడా దర్శనమిస్తున్నాయి. నేరాలను అదుపు చేసే క్రమంలో నేరస్థులపై ఉక్కు పాదం మోపుతూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ కఠిన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వరుస ఎన్కౌంటర్లతో భీతిల్లుతున్న నేరస్థులు స్టేషన్లకు క్యూ కడుతున్నారు. ఇప్పటిదాకా 142 మంది నేరస్థులు లొంగిపోయారని యూపీ డీజీపీ కార్యాలయం శనివారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘పోలీసులకు కాదు.. నేరానికి నేను భయపడుతున్నా సార్’ అంటూ దబాంగ్ సినిమాలోని డైలాగ్ను యూపీ పోలీస్ శాఖ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. అంతే సల్మాన్ ఫోటోకు యోగి తలను అంటించేసి పలువురు సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తున్నారు. అవి ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. కూలీపనులు చేసుకుని కుటుంబాలను పోషించుకుంటాం తప్ప ఇకపై నేరాల జోలికి వెళ్లబోమని వారంతా చెబుతున్నారంట. వీరిలో చాలా మందిపై భారీ రివార్డులే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వారి ఆస్తులను సీజ్ చేయటంతో ధరావత్తు కూడా కట్టలేని స్థితిలో కొందరు జైళ్లలోనే ఉండిపోయారు. ఇక గత నెలరోజుల్లో 60 ఎన్కౌంటర్లు చోటు చేసుకోగా.. 8 మంది గ్యాంగ్స్టర్లను పోలీసులు ఎన్కౌంటర్ లో లేపేశారు. గతేడాది యూపీలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా మొత్తం 1200 ఎన్కౌంటర్లు చోటు చేసుకున్నాయి. 40 మంది క్రిమినల్స్ను పోలీస్ శాఖ మట్టుబెట్టింది. ఎన్కౌంటర్ల పర్వంపై మానవ హక్కుల సంఘం నోటీసులు జారీ చేయగా.. యూపీ ప్రభుత్వం భిన్నంగా స్పందించింది. క్రిమినల్స్ పై ఉదాసీనత చూపటమే ప్రజా స్వామ్యానికి, సమాజానికి నిజమైన చేటు అని సీఎం యోగి చెబుతున్నారు. తుపాకీకి తుపాకీతో సరైన సమాధానం చెప్పాలని గోరఖ్పూర్లో జరిగిన ఓ ర్యాలీలో ఆయన ప్రకటించిన విషయం కూడా తెలిసిందే. पुलिस से नहीं, क्राइम से डर लगता है साहेब !! pic.twitter.com/HXmfRafCzN — UP POLICE (@Uppolice) 16 February 2018 -
ఉత్తరప్రదేశ్ పోలీసుల దూకూడు 18 ఎన్కౌంటర్లు
-
జైలులో ఎమ్మెల్యేకు గుండెపోటు
బాందా: ఉత్తర్ప్రదేశ్ బీఎస్పీ ఎమ్మెల్యే ముఖ్తార్ అన్సారీ లక్నోలోని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయి బాందా జైలుకు తిరిగి వచ్చారు. జనవరి 9న ఆయనకు గుండెపోటు రాగా జైలు అధికారులు ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆరోగ్యం కుదుటపడడంతో గత రాత్రి ఆస్పత్రి నుంచి పంపించారని, గట్టి బందోబస్తు మధ్య జైలుకు తిరిగి తీసుకొచ్చారని జైలర్ వివేక్షీల్ శుక్రవారం తెలిపారు. 55 సంవత్సరాల అన్సారీపై అనేక క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయని, జైలులో తన భార్యను కలుసుకున్నాక గుండెపోటుకు గురయ్యారన్నారు. గ్యాంగ్స్టర్ అయిన అన్సారీ మవు నియోజకవర్గం నుంచి గెలుపొందారని, 2015 నుంచి రాష్ట్రంలోని వివిధ జైళ్లలో ఉన్నారని పోలీసులు తెలిపారు. -
అయ్యా! ఆ గాడిదల అరెస్ట్కు మాకు సంబంధం లేదు!
సాక్షి, న్యూఢిల్లీ : పాపం! ఉత్తర ప్రదేశ్ పోలీసులు అన్యాయంగా అభాసుపాలయ్యారు. వారిని వెర్రిబాగుల కింద జమకట్టి సోషల్ మీడియా గత రెండు రోజులుగా ఆడిపోసుకుంటోంది. వారిపై జోకులను కేకుల్లా కట్చేస్తోంది. ఇంతకు ఏం జరిగిదంటే...ఉత్తరప్రదేశ్లోని ఒరాయ్ జిల్లా జైలుకు చెందిన పోలీసులు ఎనిమిది గాడిదలను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. నాలుగు రోజుల అనంతరం సోమవారం నాడు వాటిని విడిచిపెట్టారు. జైలు బయట చాలా ఖరీదైన మొక్కలను తినేస్తున్నాయన్న కోపంతో వాటిని జైల్లో పెట్టినట్టు తెల్సింది అలా జైలు నుంచి బయటకకు వస్తున్న గాడిదలను ఏఎన్ఐ వార్తా సంస్థ వీడియో తీసి మీడియాకు విడుదల చేసింది. ఆ వీడియో ఆంగ్ల పత్రికల్లో, టీవీ ఛానళ్లలో విస్తతంగా ప్రచారం అవడంతో సోషల్ మీడియా యూపీ పోలీసులపై తనదైన శైలిలో దండయాత్రకు దిగింది. గాడిదలను అరెస్టు చేసిన యూపీ పోలీసులు వాటిని నాలుగు రోజుల అనంతరం బెయిల్పై విడుదల చేశారంటూ ట్వీట్లు పెట్టారు. ఆ గాడిదల అరెస్ట్కు తమకు ఎలాంటి సంబంధం లేదు మొర్రో అంటూ యూపీ పోలీసులు ఎంత మొత్తుకున్నా సోషల్ మీడియా పట్టించుకోవడం లేదు. నిజంగా వారికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో సోషల్ మీడియాతోపాటు మెయిన్ మీడియా కూడా పొరపాటు పడింది. ఉత్తరప్రదేశ్ పోలీసు చట్టం ప్రకారం రాష్ట్ర హోం శాఖ ఆధ్వర్యంలో యూపీ పోలీసులు, జైలు పోలీసులు రెండు వేర్వేరు విభాగాలు. చివరకు ముచ్చటగా మూడోసారి అడిషనల్ ఎస్పీ–ప్రజా సంబంధాల అధికారి రాహుల్ శ్రీవాస్తవ కూడా ‘అయ్యా! ఆ గాడిదల అరెస్ట్కు మాకు ఎలాంటి సంబంధం లేదు. ఇప్పటికైనా అర్థం చేసుకోండి!’ అని పత్రికా ప్రకటనతో పాటు ట్వీట్లు కూడా పెట్టారు. -
వేధింపులు వద్దన్నందుకు యువతిపై కాల్పులు
సాక్షి,లక్నో: యూపీలో శుక్రవారం దారుణం చోటుచేసుకుంది. అయిదుగురు వ్యక్తులు తనను లైంగింకంగా వేధించడాన్ని అడ్డుకున్న ఓ యువతిపై దుండగులు కాల్పులు జరిపారు. లక్నోకు సమీపంలోని మలీహాబాద్ పట్టణంలో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించి నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకోగా ఒకరు పరారీలో ఉన్నాడని అధికారులు తెలిపారు. బాధితురాలిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు లక్నో రూరల్ ఎస్పీ సతీష్ కుమార్ చెప్పారు. వైద్య పరీక్షల నివేదికలు వస్తే మరిన్ని వివరాలు వెల్లడవుతాయన్నారు.ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు.కాగా,యూపీలో మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపుల ఉదంతాలు కొనసాగుతుండటం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. -
షాకింగ్: పోలీస్ వాహనంలో తీసుకెళ్లి గ్యాంగ్ రేప్!
సాక్షి, కాన్పూర్: సామాన్యులకు భద్రత కల్పించిన రక్షకభటులే మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడి కీచకపర్వం కొనసాగించారు. ఉన్నతాధికారుల దృష్టికి రావడంతో ఆ సిబ్బందిని సస్పెండ్ చేశారు. ఉత్తరప్రదేశ్లోని గోవింద్ నగర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఇన్స్పెక్టర్ దుర్గా రమాకాంత్ పాండే, మరో పోలీస్ ప్రవీణ్ ఉపాధ్యాయ్ లు స్థానికంగా నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో టెన్త్క్లాస్ చదివే ఓ విద్యార్థినిని వీరిద్దరూ నిత్యం వేధింపులకు గురిచేసేవారు. ఈ క్రమంలో ఇటీవల విద్యార్థిని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా వీరు ఆమెను అడ్డగించారు. ఆమెను వెంటనే పోలీసు వాహనంలో ఎక్కించుకుని గెస్ట్హౌస్కు తీసుకెళ్లారు. బాధితురాలు తనను ఏం చేయవద్దని ఎంతగా ప్రాధేయపడుతున్నా ఈ కీచకులు పట్టించుకోలేదు. మృగాళ్లుగా మారి ఆ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని బెదిరించి, మైనర్ను ఓ చోట వదిలేసి వెళ్లారు. బాధితురాలు ఇంటికి వెళ్లి జరిగిన విషయాన్ని చెప్పగా, కుటుంబసభ్యులు గోవింద్ నగర్ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేయకుండా వారిని ఇంటికి పంపించారు. సామాజిక కార్యకర్త లక్ష్మీ గౌతమ్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం, మీడియాలో జరిగిన విషాదం వెలుగుచూడటంతో మథుర ఎస్పీ స్పందించారు ఆయన ఆదేశాల మేరకు నిందితులపై కేసు నమోదుచేశారు. విద్యార్థినిని వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మైనర్పై అత్యాచారానికి పాల్పడ్డ ఇన్స్పెక్టర్ దుర్గా రమాకాంత్ పాండే, ప్రవీణ్ ఉపాధ్యాయ్ను విధుల నుంచి తొలగించినట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
యోగి హయాంలో 420 ఎన్కౌంటర్లు
సాక్షి, లక్నో : ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ అధికారం చేపట్టాక ఈ ఆరు నెలల్లో జరిగిన మొత్తం ఎన్కౌంటర్ల 420. ఇదే విషయాన్ని యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. శాంతి భద్రతలను కాపాడడం, నేరాలను అదుపు చేయడంలో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న ఆరోపణలను ఆయన గణాంకాలతో వివరిస్తూ తిప్పికొట్టారు. ఈ ఆరు నెలల్లో నేరాలను చాలా వరకు అదుపు చేయడంతో పాటు, శాంతి భద్రతలను పెంపొందించామని చెప్పారు. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక.. ఇప్పటి వరకూ పోలీసులు 420 ఎన్కౌంటర్లు చేశారని ఆయన తెలిపారు. ఈ ఎన్కౌంటర్లలో 15 మంది నేరస్థులు చనిపోగా.. పలువురు గాయాలపాలై లొంగిపోయారని తెలిపారు. చిత్రకూట్లో జరిగిన ఎన్కౌంటర్లో నేరస్థులు జరిపిన కాల్పుల్లో ఒక సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ మృతి చెందారని వివరించారు. నేరాలను అదుపు చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారని ఆదిత్యనాథ్ అన్నారు. -
ఉత్తరప్రదేశ్లో రెచ్చిపోయిన పోలీసులు
-
ఉత్తరప్రదేశ్లో కోట్టుకున్న పోలీసులు
-
అసలే పోలీసు.. ఆపై తాగి తందనాలు!
ఉత్తరప్రదేశ్లో ఒక పోలీసు తాగి తందనాలు ఆడుతూ వీడియోకు దొరికేశాడు. ఈ ఘటన శ్రావస్తి జిల్లాలో జరిగింది. అక్కడ ఏదో కార్యక్రమం సందర్భంగా అమ్మాయిల డాన్సు ఏర్పాటు చేశారు. అందులో బార్ గరల్స్తో ఆ పోలీసు డాన్సు చేస్తూ, వాళ్ల మీదకు నోట్లు విసురుతున్న దృశ్యాలు వీడియోలో రికార్డయ్యాయి. అందులోనూ అతగాడు యూనిఫాంలో ఉండే ఇదంతా చేయడం గమనార్హం. శ్రావస్తి జిల్లాలో బుధవారం జరిగిన ఓ కార్యక్రమానికి అతడు విధి నిర్వహణ కోసం వెళ్లాడని, తీరా అక్కడ వరకు వెళ్లిన తర్వాత తాగేసి బార్ గరల్స్తో డాన్సులు చేశాడని స్థానిక మీడియా కథనాలు తెలిపాయి. ఈ వీడియో ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్గా వెళ్లింది. ఇటీవలి కాలంలో అధికారుల పనితీరుపై తీవ్రంగా స్పందిస్తున్న యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరి ఈ తాగుబోతు పోలీసు విషయంలో ఏమంటారో చూడాలి. -
అసలే పోలీసు.. ఆపై తాగి తందనాలు!
-
చర్చిలో ప్రార్థనను అడ్డుకున్న పోలీసులు
మహరాజ్గంజ్: మత మార్పిడులకు పాల్పడుతున్నారని ఓ చర్చి కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్న ఘటన ఉత్తరప్రదేశ్లో శనివారం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని మహరాజ్గంజ్ జిల్లా దథౌలీ ప్రాంతంలో చర్చి పాస్టర్ యోహన్నన్ ఆడమ్ మతమార్పిడులకు పాల్పడుతున్నారని హిందూ యువవాహిని(హెచ్వైవీ)ఫిర్యాదు చేయడంతో పోలీసులు కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. స్థానిక ఎస్హెచ్వో ఆనంద్ కుమార్ గుప్తా మీడియాతో మాట్లాడుతూ, దాదాపు 150 మంది స్థానికులు, 10 మంది అమెరికన్లు పాల్గొన్న ఈ కార్యక్రమానికి ఎలాంటి ముందస్తు అనుమతి తీసుకోలేదని తెలిపారు. విచారణ జరిపి దోషులపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు. మరోవైపు పాస్టర్ యోహన్నన్ ఆడమ్ మాట్లాడుతూ, మత మార్పిడులు చేస్తున్నామన్న వాదనలు నిరాధారమనీ, తామంతా ప్రార్థనకే హాజరయ్యామని తెలిపారు. హిందూ యువవాహిని అధ్యక్షుడు సునిల్ సింఘాల్ మాట్లాడుతూ, ‘వారు(క్రైస్తవులు) తమ ప్రార్థనల్ని చర్చిల్లోనే నిర్వహించుకోవాలి. లేదా ఇంట్లో చేసుకోవాలి. అంతేకాని బహిరంగ ప్రదేశాల్లో చేసుకోవడం కుదరదు. ఒకవేళ బహిరంగ ప్రదేశాల్లోనే చేసుకుంటామంటే చర్చిలు కూడా సురక్షితంగా ఉండవ’ ని హెచ్చరించారు. గతంలోనూ ఈ సంస్థ సభ్యులు గోరఖ్పూర్లోని ఫుల్ గాస్పెల్ చర్చిని ధ్వంసం చేశారు. చర్చిలు అమాయకులైన హిందువులకు డబ్బుల్ని ఎరగా చూపి మతమార్పిడుల్ని ప్రోత్సహిస్తున్నాయని హిందూ యువవాహిని నాయకుడు కృష్ణ నందన్ ఆరోపించారు. మరోవైపు అమెరికా రాయబార కార్యాలయ అధికార ప్రతినిధి ఈ ఘటనపై స్పందిస్తూ.. తమకు అమెరికన్ పౌరుల క్షేమమే అత్యవశ్యకమని తేల్చిచెప్పారు. -
సీఎం యోగి మరో కీలక నిర్ణయం
-
సీఎం యోగి మరో కీలక నిర్ణయం
లక్నో: అధికారంలోకి రాగానే అక్రమ కబేలాపై చర్యలు చేపడతామన్న ఎన్నికల హామీని అమల్లోపెట్టిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథన్ మరో వాగ్దానం నిలబెట్టుకునేందుకు సిద్ధమయ్యారు. పోకిరీల ఆట కట్టించేందుకు ఆదేశాలు జారీ చేశారు. సీఎం యోగి ఆదేశాల మేరకు పోలీసులు ఈవ్ టీజింగ్ వ్యతిరేక బృందాలు ఏర్పాటు చేశారు. లక్నో జోన్ పరిధిలోని 11 జిల్లాల్లో ఈ బృందాలు ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు చేశారు. ప్రతి జిల్లాల్లోనూ యాంటి ఈవ్ టీజింగ్ టీమ్స్ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విద్యార్థినులను వేధించే వారిని పట్టుకునేందుకు కాలేజీలు, పాఠశాలల సమీపంలో ఈ బృందాలు ఉంటాయని పోలీసులు వెల్లడించారు. పిలిభిత్ లో ఇప్పటికే ఐదుగురు పోకిరీలను ఈవ్ టీజింగ్ వ్యతిరేక బృందం అరెస్ట్ చేసింది. మీరట్ లోనూ ఒకరిని ఈ బృందం పట్టుకుంది. యాంటి ఈవ్ టీజింగ్ టీమ్స్ పనితీరు గురించి స్కూళ్లు, కాలేజీల్లో పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఈవ్ టీజింగ్ కు చెక్ పెడతామని మీరట్ లో జరిగిన ఎన్నికల ర్యాలీలో అమిత్ షా హామీయిచ్చారు. యాంటి రోమియో బృందాలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాయని చాలా మంది మండిపడుతున్నారు. వేధింపులు, మోరల్ పోలీసింగ్ కు దిగుతున్నాయని ఆరోపిస్తున్నారు. లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా యాంటి రోమియో బృందాలు పనిచేస్తాయని బీజేపీ నేత సునీల్ భరాలా వ్యాఖ్యానించడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
సోషల్ ట్రేడ్: రూ.3,700 కోట్ల ఘరానా మోసం
-
పంజాబ్లో జైలు బద్దలు
‘ఖలిస్తాన్’ చీఫ్ హర్మిందర్తో పాటు మరో ఐదుగురు గ్యాంగ్స్టర్లను తప్పించిన దుండగులు - పోలీసు దుస్తుల్లో జైల్లోకి ప్రవేశం.. గాల్లో 35 రౌండ్ల కాల్పులు - తప్పించుకున్న వారిలో ఉగ్రవాది కశ్మీరా సింగ్ - ఘటన జరిగిన రెండు గంటల్లోనే యూపీలో సూత్రధారి అరెస్టు పటియాలా/చండీగఢ్/న్యూఢిల్లీ: నిరంతరం కట్టుదిట్టమైన భద్రత ఉండే పంజాబ్లోని నభా జైలుపై ఆదివారం కొందరు గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి తీవ్రవాది, ఖలిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ చీఫ్ హర్మిందర్ సింగ్ అలియాస్ మింటూతో పాటు మరో ఐదుగురు గ్యాంగ్స్టర్లను తప్పించి తీసుకెళ్లారు. తప్పించుకున్న వారిలో ఉగ్రవాది కూడా అయిన కశ్మీరా సింగ్ ఉన్నాడు. దీంతో పంజాబ్తోపాటు ఉత్తరాది రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు. పది తీవ్రమైన కేసుల్లో నిందితుడిగా ఉన్న మింటూను 2014లో పోలీసులు అరెస్టు చేశారు. కాగా, ఘటన జరిగిన రెండు గంటల్లోనే.. తప్పించుకోవటంలో దాడి సూత్రధారి పర్మిందర్ సింగ్ను యూపీ పోలీసులు అరెస్టు చేశారు. ఇతని నుంచి ఓ ఎస్సెల్లార్, మూడు రైఫిల్స్, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇతను అందించిన సమాచారంతో తప్పించుకున్న వారంతా బృందాలుగా విడిపోరుు నేపాల్ చేరుకునే అవకాశం ఉందని తెలిసింది. తప్పించుకున్న వారిలో ఖలిస్తాన్ చీఫ్ హర్మిందర్తో పాటు గ్యాంగ్స్టర్లు విక్కీ గౌండర్, అమన్దీప్ దోహతియాన్, గుర్ప్రీత్ సెకోన్, నీతా డియోల్, కశ్మీరా సింగ్లు ఉన్నారు. 2008లో డేరా సచ్ఛా సౌధా చీఫ్ గుర్మీత్ రాం రహీం సింగ్పై దాడికి పాల్పడిన ఘటనతో పాటు మరో పది కేసుల్లో హర్మిందర్ నిందితుడు. కాగా, జైలుకు 20 కిలోమీటర్ల దూరంలో నాకాబందీని దాటి వెళ్తున్న వాహనంపై పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ మహిళ చనిపోయింది. పోలీసు దుస్తుల్లో వచ్చి..: ఆదివారం ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో కొందరు పోలీసు దుస్తుల్లో వచ్చిన సాయుధులు జైలు సెంట్రీ వద్దకు వచ్చి.. ఇద్దరు ఖైదీలను తీసుకొచ్చామని చెప్పి గేటు తీరుుంచారు. లోపలకు వెళ్లగానే సినీ ఫక్కీలో సెంట్రీతోపాటు ఇతర సెక్యూరిటీ సిబ్బందిని బెదిరించారు. గాల్లోకి దాదాపు 35 రౌండ్ల కాల్పులు జరిపి అందరినీ భయభ్రాంతులకు గురిచేశారని డీజీపీ సురేశ్ అరోరా వెల్లడించారు. జైల్లో వీరిని కనీసం అడ్డుకునేందుకూ ఎవరూ ముందుకురాలేదు. నిర్లక్ష్యమా? కావాలనే చేశారా?: పంజాబ్ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ అత్యవసర భేటీ ఏర్పాటు చేసి.. ఉన్నతాధికారులతో చర్చించారు. ఘటనపై బాదల్ను కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆరా తీశారు. దీనిపై నివేదిక ఇవ్వాలని పంజాబ్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. జైలు బద్దలు కొట్టడంపై పంజాబ్ సర్కారు ఉన్నతాధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటుచేసింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు అధికారులను సస్పెండ్ చేసింది. ఈ ఘటనకు జైల్లోని అధికారులెవరైనా సహకరించారా అనే కోణంలోనూ దర్యాప్తు జరుపుతోంది. ఉప ముఖ్యమంత్రి సుఖ్భీర్ సింగ్ బాదల్ మాట్లాడుతూ.. భయపడాల్సిందేమీ లేదని, వారెక్కడికీ(ఖైదీలు) తప్పించుకుపోలేరని, త్వరలోనే వారిని పట్టుకుంటామని చెప్పారు. ఈ ఘటన వెనక పాక్ హస్తం ఉండొచ్చన్నారు. కేఎల్ఎఫ్ చరిత్ర ఇదీ... సిక్కులకు ప్రత్యేక రాజ్య స్థాపనే లక్ష్యంగా ప్రారంభమైన రాజకీయ జాతీయవాద పోరాటమే ఖలిస్తాన్ ఉద్యమం. ఇది క్రమేపీ మిలిటెంట్ రూపం సంతరించుకుంది. ఇందులో ముఖ్యపాత్ర పోషించిన సంస్థల్లో ఖలిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ (కేఎల్ఎఫ్) ఒకటి. సాయుధపోరుతోనే సిక్కు రాజ్యం సాధ్యమనే సిద్ధాంతంపై ఇది ఏర్పాటైంది. దీన్ని 1986లో అరూర్, సుఖ్వీందర్ సింగ్లు స్థాపించారు. 1990 తొలినాళ్లలో ఖలిస్తాన్ ఉద్యమాన్ని ప్రభుత్వం అణచివేసినప్పుడు దేశం విడిచి పారిపోరుున సంస్థ సభ్యులకు పాక్ ఆశ్రయం కల్పించిందన్న ఆరోపణలున్నారుు. కేఎల్ఎఫ్ హింసాత్మక దాడులకు పాల్పడింది. పలువురు రాజకీయ నేతలను, ప్రముఖులను హత్య చేసింది. 1991లో ఢిల్లీలో రుమేనియా రాయబారిని అపహరించింది. అరుుతే సిక్కు నేతలు విమర్శించడంతో అతన్ని సురక్షితంగా విడిచిపెట్టింది. 1992, జూలై 29న సంస్థ అప్పటి చీఫ్ గుర్జాంత్ సింగ్ను పోలీసులు హతమార్చారు. ఆ ఏడాది ఆగస్టులో కొత్త అధిపతి నవరూప్ను చంపామన్న పోలీసులు తర్వాత అతడు దేశం విడిచి పారిపోయాడన్నారు. 2005 దాక సంస్థ సభ్యుల అరెస్టులు సాగారుు. -
ఎటీఎం క్యూలైన్ తపారని చితకబాదారు
-
అనుప్రియపై దాడి, 158 మందిపై కేసు
ప్రతాప్గఢ్: కేంద్ర మంత్రి అనుప్రియ పటేల్ పట్ల అనుచితంగా ప్రవర్తించిన కేసులో 158 మందిపై ఉత్తరప్రదేశ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రాణిగంజ్ పోలీసు స్టేషన్ లో కేసులు పెట్టారు. స్థానిక నాయకుడు వినోద్ దూబే సహా 157 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు సీనియర్ పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. అనుప్రియ పటేల్, అప్నా దళ్ కార్యకర్తల పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించారన్న ఆరోపణలతో కేసు నమోదు చేసినట్టు చెప్పారు. అనుప్రియ పటేల్ ఆదివారం ప్రతాప్గఢ్ జిల్లాలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె కాన్వాయ్ పై దుండగులు దాడి చేశారు. అధికార సమాజ్వాదీ పార్టీ కార్యకర్తలే తన కాన్వాయ్పై దాడిచేశారని అనుప్రియ ఆరోపించారు. తమ రోడ్ షోను అడ్డుకోవాలన్న కుట్రతో తమపై దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. కేంద్ర మంత్రినైన తనకే రక్షణ లేకుంటే సామాన్యుల పరిస్థితి ఏంటని ఆమె ప్రశ్నించారు. -
మోకాళ్లతో ఒత్తిపట్టి మెడపై కూర్చొని..
-
మోకాళ్లతో ఒత్తిపట్టి మెడపై కూర్చొని..
లక్నో: ఉత్తరప్రదేశ్ పోలీసులు కర్కశంగా వ్యవహరించారు. దొంగగా అనుమానించి ఓ యువకుడిని గొడ్డునిబాదినట్లు బాదారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది. ఫలితంగా పోలీసులు వ్యవహరించిన తీరుపట్ల పోలీసు ఉన్నతాధికారులు కూడా విస్మయం వ్యక్తం చేయడంతోపాటు మానవ హక్కుల కార్యకర్తలు మండిపడుతున్నారు. పోలీసుల వివరాల ప్రకారం దొంగతనానికి పాల్పడినట్లు అనుమానించి ఓ యువకుడిని ఎత్వాహ్ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం విచారణ గదికి తీసుకెళ్లి టేబుల్ పై పడుకోబెట్టి ఆ యువకుడి తలను కదలకుండా ఓ పోలీసు మొకాళ్లతో ఒత్తిపట్టి మెడపై కూర్చుని ఉంచగా.. మరోపోలీసు అతడి కాళ్లను గట్టిగా పట్టుకున్నాడు. అప్పుడే ఓ దండనాయకుడి మాదిరిగా సివిల్ డ్రస్ లోఉండి బారెడు పొట్ట వేసుకున్న ఓ పోలీసు వచ్చాడు. చేతిలో బ్యాటులాంటిదానిని తీసుకున్నాడు. దానికి ఒక మందమైన రబ్బరు కూడా ఉంది. ఇక ఆ కుర్రాడు లబోదిబోమంటు కేకలు వేస్తున్నా దెబ్బమీదదెబ్బలతో ఫటాఫటా వాయించారు. ఆ వీడియో చూస్తే ఒళ్లు ఝల్లుమనడం మాత్రం ఖాయం. -
పోలీసులే కొట్టి, నగ్నంగా ఊరేగించారు..
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లోని దన్కౌర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోరం జరిగింది. తమ ఇంట్లో దొంగతనం జరిగిందని ఫిర్యాదు చేయటానికి వెళ్లిన ఓ దళిత కుటుంబానికి చేదు అనుభవం ఎదురైంది. యూపీ రాజధాని లక్నోకు కూతవేటులో దూరంలోనే ఈ అమానుషం చోటు చేసుకుంది. ఆ దళిత దంపతుల పట్ల పోలీసులు అతి కిరాతకంగా ప్రవర్తించారు. స్టేషన్ నుంచి బయటకు ఈడ్చుకొచ్చి... నడి రోడ్డు మీద వారిపై తమ ప్రతాపం చూపారు. వారిని వివస్త్రలను చేసి చితకబాదిన సంఘటన కలకలం రేపుతోంది. ఈ దారుణాన్ని ఓ వ్యక్తి తన సెల్ ఫోన్లో చిత్రీకరించి ఆన్లైన్లో పెట్టడంతో.. పోలీసుల వైఖరిపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళితే ఉత్తరప్రదేశ్లోని దన్కౌర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సునీల్ గౌతమ్ అనే వ్యక్తి ఇంట్లో బుధవారం రాత్రి దొంగతనం జరిగింది. ఆ విషయంపై ఫిర్యాదు చేయడానికి అతడు తన భార్య, మరి కొందరు బంధువులతో కలిసి పోలీస్ స్టేషన్కు వెళ్లాడు. అయితే విధుల్లో ఉన్న స్టేషన్ ఆఫీసర్ ప్రవీణ్ యాదవ్ కేసు నమోదు చేయడానికి నిరాకరించాడు. అంతేకాకుండా వారిపట్ల నిర్లక్ష్యంగా , అవహేళనగా మాట్లాడాడు. దీంతో తమ ఫిర్యాదును స్వీకరించి... కేసు నమోదు ఎందుకు చేయరో చెప్పాలని సునీల్ తదితరులు ఆ పోలీస్ అధికారిని నిలదీశారు. అంతే.... ఖాకీ అధికారికి ఎక్కడలేని కోపమొచ్చింది. నన్నే ఎదిరించి మాట్లాడతావా అంటూ చెలరేగిపోయాడు. ఆగ్రహంతో ఊగిపోతూ వారిపై దాడికి దిగాడు. స్టేషన్లో ఉన్న మరికొందరు ఖాకీలు ఆ అధికారికి తోడయ్యారు. పోలీసులందరూ కలిసి ఒక్కసారిగా సునీల్ కుటుంబ సభ్యులు, బంధువులపై దాడి చేసి.... వారిని కొట్టుకుంటూ రోడ్డు మీదికి ఈడ్చుకొచ్చారు. అంతేకాకుండా సభ్య సమాజం నివ్వెరపోయేలా దారుణానికి ఒడిగట్టారు. అంతా చూస్తుండగానే చేతిలో చంటిబిడ్డతో ఉన్న సునీల్ భార్య చీరను లాగి పడేశారు. ఈ చర్యను అడ్డుకున్నవారిని చితక్కొట్టారు. అడ్డుపడిన సునీల్ బట్టలను కూడా చించేశారు. ఇంతటి దుర్మార్గానికి ఒడిగట్టిన పోలీసులు అంతటితో ఊరుకోకుండా సునీల్ పై, అతని భార్య, బంధువులపై క్రిమినల్ కేసులు బనాయించినట్టు సమాచారం. అటు ఒక్క పక్క చంటిబిడ్డను, మరోపక్క తన దేహాన్ని, ఇంకో పక్క తన భర్తను కాపాడుకోవడానికి ఆ దళిత మహిళ పడిన ఆరాటం ..చేసిన పోరాటం ఇపుడు సోషల్ మీడియాలో పలువురిని దిగ్భ్రాంతికి, విస్మయానికి గురి చేసింది. షేమ్ ఇండియా అంటూ విరుచుకుపడుతున్నారు. ఒక పసిబిడ్డ తన అమ్మానాన్నల అభిమానాన్న, గౌరవాన్ని కాపాడిందంటూ నెటిజన్లు వ్యాఖ్యానించారు. ఇదేనా మన డిజిటల్ ఇండియా అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా.. ఈ ఘటనపై యూపీ సర్కారు అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా స్పందించింది. మీడియాలో వస్తున్న వార్తలకు భిన్నంగా వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయని పేర్కొంది. మరోవైపు బాధితుడు సునీల్ కూడా పోలీసుల చర్యను నిరసిస్తూ తామే నగ్నంగా మారి నిరసన తెలియ చేశామని తెలిపినట్టు తెలుస్తోంది. -
రెండేళ్ల పిల్లాడిపై దోపిడీ కేసు!
ఉత్తరప్రదేశ్ పోలీసులకు చదవేస్తే ఉన్నమతి పోయినట్లుంది. కేవలం ఎఫ్ఐఆర్లో పేరుందన్న కారణంగా రెండేళ్ల అబ్బాయిపై దోపిడీ కేసు నమోదు చేశారు. అంతేకాదు.. అసలు ఫిర్యాదులో ఏముందో చూసుకోకుండా, ఆ పిల్లాడిని అరెస్టు చేసేందుకు అతడి ఇంటికి కూడా వెళ్లారు. ఆ పిల్లాడి తండ్రి వెళ్లి, ఇదేంటని మొరపెట్టుకున్నా పట్టించుకోని ఉన్నతాధికారులు.. ఇప్పుడు మాత్రం ఎఫ్ఐఆర్ నుంచి పిల్లాడి పేరు తీసేస్తామని చెబుతున్నారు. విషయం ఏమిటంటే.. యూపీలోని బజేరా గ్రామానికి చెందిన అమిత్ కుమార్, అతడి ఇంటి ఇరుగుపొరుగువాళ్లు కలిసి కొందరు ఓ దోపిడీ దొంగను పట్టుకున్నారు. అతడు తనపేరు భరత్ అని, తనకు మరో వ్యక్తి సహకరించాడని చెప్పాడు. పోలీసులు ఆ రెండో వ్యక్తి పేరు కూడా ఎఫ్ఐఆర్లో రాసేశారు. తీరా అరెస్టు చయడానికి ఇంటికి వెళ్తే, అతడు రెండేళ్ల పిల్లాడని అతడి తల్లిదండ్రులు చెప్పారు. పోలీసులు ఆ మాట నమ్మలేదు. ఆ కుటుంబాన్ని వేధించారు. తర్వాతి రోజు ఆ తల్లిదండ్రులు పోలీసు ఉన్నతాధికారుల వద్దకు వెళ్లి, విషయం చెప్పారు. మీడియాకు విషయం తెలిసి అది కాస్తా భగ్గుమన్న తర్వాత.. అప్పుడు చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు వాళ్లు అతడి పేరును ఎఫ్ఐఆర్ నుంచి తీసేస్తామన్నారు. -
హెరాయిన్ స్వాధీనం: మహిళ స్మగ్లర్లు అరెస్ట్
ముజఫర్నగర్: ఉత్తరప్రదేశ్లోని షామిలి జిల్లాలో కైరానా పట్టణంలో గురువారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఓ ఇంట్లో దాచి ఉంచిన దాదాపు 200 గ్రాముల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి ఇద్దరు మహిళ స్మగ్లర్లు రిహనా, సోనను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం హెరాయిన్ సీజ్ చేసి... స్మగ్లర్లను పోలీసు స్టేషన్కు తరలించారు. నిందితులపై ఎన్డీపీసీ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కైరానా పట్టణంలో ఇటీవల కాలంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణ జోరుగా సాగుతుంది. ఈ నేపథ్యంలో పోలీసులు నిఘా పెంచారు. ఆ క్రమంలో ఓ ఇంట్లో హెరాయిన్ స్మగ్లింగ్ చేస్తున్నారంటూ పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు సదరు నివాసంలో తనిఖీలు నిర్వహించారు. సీజ్ చేసిన హెరాయిన్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ. 40 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. -
యూపీ పోలీసు అధికారులకు ఢిల్లీ కోర్టు వారంట్లు
న్యూఢిల్లీ: కారాగారంలో ఉన్న నక్సల్ నాయకుడు కోబడ్ గాంధీ కేసుకు సంబంధించి వాంగ్మూలమివ్వడానికి రానందుకుగాను ఉత్తరప్రదేశ్కు చెందిన ముగ్గురు పోలీసు అధికారులపై స్థానిక న్యాయస్థానం బెయిల్ మంజూరు కాగల వారంట్లను జారీచేసింది. విచారణ ఉన్నప్పటికీ గైర్హాజరైన యూపీకి చెందిన పోలీసు అధికారులు రాజేశ్ శ్రీవాస్తవ, సమీర్ సౌరభ్, రాజీవ్ ద్వివేదీలకు ఒక్కొక్కరికీ రూ. 5,000 బెయిలబుల్ వారంట్లను జారీచేస్తూ అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి రితేశ్ సింగ్ ఉత్తర్వులు జారీచేశారు. ఈ కేసు తదుపరి విచారణను వచ్చే నెల ఐదో తేదీకి వాయిదా వేశారు. -
సినిమా పిచ్చోళ్లకు షాక్!
సినిమాల ప్రభావం సామాన్య జనంపైనేకాదు పోలీసుల మీదా పడింది. 'రీల్ పోలీసు'ను గుడ్డిగా అనుకరించి ఉత్తరప్రదేశ్ లో ఇద్దరు రియల్ పోలీసులు సస్పెన్షన్ కు గురయ్యారు. ఇటీవల కాలంలో పోలీసు సినిమాల జోరు పెరిగింది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుండడంతో సినిమా రూపకర్తలు 'ఖాకీ' మంత్రం జపిస్తున్నారు. పోలీసు ఫార్ములాతో వచ్చిన సినిమాలు వరుసగా విజయాలు సాధించడంతో ఈ ట్రెండ్ కు మరింత ఊపు వచ్చింది. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన 'దబాంగ్', దానికి కొనసాగింపుగా వచ్చిన సినిమాలు అతడి కెరీర్ లో మైలురాళ్లుగా నిలిచాయి. ఇక అజయ్ దేవగన్ ఇమేజ్ ను ఒక రేంజ్ కు తీసుకెళ్లిన సినిమా సింగం. ఈ సినిమాలు ఉత్తరాదిని ఒక ఊపు ఊపాయి. ఈ చిత్రాల్లోని హీరోలను అనుకరించి ఆగ్రాకు చెందిన ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు శ్రీముఖం అందుకున్నారు. సినిమా పిచ్చిని ఒంటబట్టించుకుని మనీష్ సోలాంకి, భూపేంద్ర సింగ్ అనే ఇద్దరు కానిస్టేబుళ్లు ఉన్నతాధికారికి చిక్కారు. వీరిలో ఓ కానిస్టేబుల్ నల్లద్దాల కళ్లజోడు పెట్టుకుని హీరో ఫోజు పెట్టాడు. మరో కానిస్టేబుల్ సినిమా స్టైల్లో బిగుతు ప్యాంట్ వేసుకొచ్చాడు. ఉన్నతాధికారి తనిఖీకి వచ్చినప్పుడు ఈ విషయం బయటపడడంతో వారిద్దరిని సస్పెండ్ చేశారు. నిర్దేశిత పోలీసు యూనిఫాం నియమాలు ఉల్లంఘించినందుకు వీరిపై చర్యతీసుకున్నారు. పోలీసు నియమావళిని కాదని 'దబాంగ్, సింగం' తరహాలో వచ్చినందుకు వేటు వేశారు. క్రమశిక్షణ ఉల్లంఘన, అవిధేయతను సహించబోమంటూ క్లాస్ తీసుకున్నారు. డిపార్ట్మెంట్ లో మంచిపేరున్నప్పటికీ 'సినిమా వేషాలు' మనీష్, భూపేంద్రలకు షాక్ ఇచ్చాయి.