poor family
-
మంచి కాదు ముంచే ప్రభుత్వం.. గుర్తు పెట్టుకోండి మేము ఓట్లు వేస్తే గెలిచారు
-
Supreme Court: ఆ విద్యార్థికి ఐఐటీ సీటివ్వండి
న్యూఢిల్లీ: నిరుపేద కుటుంబంలో పుట్టి కష్టపడి చదివినా సమయానికి ప్రవేశరుసుం కట్టలేక ప్రతిష్టాత్మక ఐఐటీ ధన్బాద్లో సీటు కోల్పోయిన దళిత విద్యార్థికి సర్వోన్నత న్యాయస్థానంలో భారీ ఊరట లభించింది. వెంటనే ఆ విద్యార్థి అతుల్ కుమార్కు సీటు ఇవ్వాలని ఐఐటీ ధన్బాద్ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం సోమవారం ఆదేశించింది. జూన్ 24వ తేదీ సాయంత్రం ఐదింటిలోపు అడ్మిషన్ ఫీజు రూ.17,500 కట్టలేకపోవడంతో బీటెక్ సీటు కోల్పోయిన తనకు న్యాయం చేయాలంటూ విద్యార్థి సుప్రీంకోర్టును ఆశ్రయించడం తెల్సిందే. ‘‘ విద్యార్థి ఆరోజు ఆన్లైన్లో ఫీజు చెల్లింపు కోసం మధ్యాహ్నం మూడు గంటలకే లాగిన్ అయ్యాడు. తర్వాత పదేపదే ఎస్ఎంఎస్లు, వాట్సాప్లో రిమైండ్లతో గడువును గుర్తుచేశాం’’ అని ఐఐటీ సీట్ల కేటాయింపు విభాగం వాదించింది. దీంతో సీజేఐ కలగజేసుకుని ‘‘మీరెందుకంతగా వ్యతిరేకిస్తున్నారు?. ఈ పిల్లాడికి ఏమైనా చేయగలవేమో చూడండి. ఆ డబ్బులే ఉంటే కట్టకుండా ఎందుకుంటాడు? అణగారిన వర్గాలకు చెందిన రోజువారీ కూలీ కుమారుడు. పైగా అతనిదిదారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబం. ఐఐటీలో సీటు కోసం ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డాడు. ప్రతిభగల ఇలాంటి విద్యార్థిని మనం ఊరకనే వదిలేయలేం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ద్వారా సుప్రీంకోర్టుకు సంక్రమించిన అసాధారణ అధికారంతో మిమ్మల్ని ఆదేశిస్తున్నాం. ఇదే ఏడాది అదే బ్యాచ్ ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్ కోర్సులో విద్యార్థికి సీటివ్వండి. హాస్టల్ వసతి సహా అర్హతగల అన్ని ప్రయోజనాలు అతనికి అందేలా చూడండి’’ అని ఐఐటీ కాలేజీ విభాగాన్ని కోర్టు ఆదేశించింది. కిక్కిరిసిన కోర్టు హాలులో అంతసేపూ చేతులు కట్టుకుని నిలబడిన విద్యార్థితో ‘‘ ఆల్ ది బెస్ట్. బాగా చదువుకో’’ అని సీజేఐ అన్నారు. బాగా చదువుతూ ఇంజనీరింగ్ చేస్తున్న అతని ఇద్దరు అన్నల బాగోగులు తదితరాల గురించి కూడా ఆయన ఆరాతీశారు.ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్జిల్లా టిటోరా గ్రామానికి చెందిన అతుల్ ఐఐటీ ధన్బాద్లో సీటు వచ్చినా పేదరికం కారణంగా డబ్బులు కట్టలేక నిస్సహాయుడయ్యాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు తలో చేయి వేసి నగదు సర్దినా చివరి నిమిషంలో ఆన్లైన్ చెల్లింపు విఫలమై ఫీజు కట్టలేకపోయాడు. జార్ఖండ్ హైకోర్టు లీగ్ సర్వీసెస్ అథారిటీని ఆశ్రయించగా పరీక్షను ఐఐటీ మద్రాస్ నిర్వహించినందున మద్రాస్ హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. దీంతో మద్రాస్ హైకోర్టుకు వెళ్లారు. అక్కడ విచారణ నెమ్మదించడంతో ఈసారి నేరుగా సుప్రీంకోర్టు తలుపు తట్టారు. -
Hassan Nasrallah: అరబ్బుల హీరో
హెజ్బొల్లా గ్రూప్నకు సుదీర్ఘకాలం సారథ్యం వహించిన షేక్ హసన్ నస్రల్లా ప్రస్థానం ముగిసిపోయింది. నిరుపేద కుటుంబంలో జని్మంచి, ఉన్నత స్థాయికి చేరుకొని, లక్షల మందిని అభిమానులుగా మార్చుకున్న నస్రల్లా మరణం హెజ్బొల్లాకు తీరని నష్టమే అని చెప్పొచ్చు. ఆయన 1960 ఆగస్టు 31న ఉత్తర లెబనాన్లో షియా ముస్లిం కుటుంబంలో జని్మంచారు. కూరగాయలు విక్రయించే నస్రల్లా తండ్రికి మొత్తం 9 మంది సంతానం. అందరిలో పెద్దవాడు నస్రల్లా. ఆయన బాల్యం తూర్పు బీరూట్లో గడిచింది. మత విద్య అభ్యసించారు. చిన్నప్పటి నుంచే మత గ్రంథాలు విపరీతంగా చదివేవారు. తనకు కావాల్సిన పుస్తకాల కోసం సెకండ్–హ్యాండ్ బుక్ షాపుల్లో గాలించేవారు. షియా పండితుడు మూసా అల్–సదర్ను ఆరాధించేవారు. రాజకీయాలపై, షియా వర్గం సంక్షేమంపై నస్రల్లాకు చిన్నప్పుడే ఆసక్తి ఏర్పడింది. తమవాళ్ల కోసం పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు. 32 ఏళ్లకే నాయకత్వ బాధ్యతలు 1975లో అంతర్యుద్ధ సమయంలో నస్రల్లా కుటుంబం దక్షిణ లెబనాన్కు తరలివచి్చంది. ఆయన 1989లో ఇరాన్లోని నజఫ్ సిటీలో కొంతకాలం మత సిద్ధాంతాలు అభ్యసించారు. లెబనాన్కు తిరిగివచ్చి 16 ఏళ్ల వయసులో షియా రాజకీయ, పారామిలటరీ గ్రూప్ అయిన అమల్ మూవ్మెంట్లో చేరారు. ఆ సంస్థలో చురుగ్గా పనిచేశారు. పాలస్తీనియన్ లిబరేషన్ ఆర్గనైజేషన్(పీఎల్ఓ)ను అంతం చేయడానికి 1980లో లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ దాడిలో పీఎల్ఓకు భారీ నష్టం వాటిల్లింది. ప్రతీకారమే లక్ష్యంగా ఇజ్రాయెల్ నిఘా సంస్థ కార్యాలయంపై షియా ఇస్లామిక్వాదులు దాడికి దిగారు. ఈ ఘటనలో చాలామంది ఇజ్రాయెల్ అధికారులు మరణించారు. అనంతరం షియా ఇస్లామిక్వాదులతో హెజ్బొల్లా గ్రూప్ ఏర్పాటైంది. ఈ సంస్థ ఏర్పాటు వెనుక సయ్యద్ అబ్బాస్ ముసావీతోపాటు నస్రల్లా కీలక పాత్ర పోషించారు. 1992లో ఇజ్రాయెల్ దాడిలో ముసావీ మరణించారు. దీంతో 32 ఏళ్ల వయసులో హెజ్బొల్లా నాయకత్వ బాధ్యతలను నస్రల్లా స్వీకరించారు. హెజ్బొల్లా శక్తివంతమైన సంస్థగా తీర్చిదిద్దారు. లెబనాన్ సైన్యం కంటే హెజ్బొల్లా పవర్ఫుల్ అనడంలో అతిశయోక్తి లేదు. మధ్యప్రాచ్యంలోని అరబ్ దేశాల్లో నస్రల్లా పలుకుబడి అమాంతం పెరిగిపోయింది. హెజ్బొల్లాకు ఇరాన్ ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలిచింది. ఆయుధాలు, డబ్బు అందజేసింది. హమాస్తోపాటు మధ్యప్రాచర్యంలోని పలు ఉగ్రవాద సంస్థలకు హెజ్బొల్లా శిక్షణ ఇచి్చంది. సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాలుపంచుకుంది. ఇజ్రాయెల్కు బద్ధ శత్రువు ఇజ్రాయెల్పై నస్రల్లా అలుపెరగని పోరాటం సాగించారు. పూర్తి అంకితభావంతో పనిచేశారు. 2000 సంవత్సరం నాటికల్లా దక్షిణ లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ సేనలను తరిమికొట్టారు. అరబ్ ప్రపంచానికి ఒక ఐకాన్గా మారారు. 1997లో ఇజ్రాయెల్ సైన్యం చేసిన దాడిలో నస్రల్లా కుమారుడు హదీ మరణించాడు. 1997లో హెజ్బొల్లాను ఉగ్రవాద సంస్థగా అమెరికా ప్రకటించింది. 2006లో ఇజ్రాయెల్పై హెచ్బొల్లా సాగించిన యుద్ధం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. లెబనాన్లో 34 రోజులపాటు జరిగిన ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ ఓడిపోయింది. నస్రల్లాను పలు దేశాలు హీరో అంటూ కీర్తించాయి. తమకు కంటిమీద కునుకు లేకుండా చేసిన నస్రల్లాను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంది. గత 20 ఏళ్లలో ఆయన చాలా అరుదుగానే బహిరంగంగా కనిపించారు. టీవీ, రేడియో ద్వారా తన అనుచరులకు సందేశం చేరవేసేవారు. ఇజ్రాయెల్ ఏ క్షణమైనా దాడిచేసే ప్రమాదం ఉందన్న ఉద్దేశంతో నస్రల్లా ఎక్కువగా అండర్ గ్రౌండ్ బంకర్లలోనే ఉండేవారు. ఇజ్రాయెల్తోపాటు అమెరికాను నస్రల్లా తమ బద్ధ శత్రువుగా ప్రకటించారు. క్యాన్సర్ లాంటి ఇజ్రాయెల్ను సమూలంగా నాశనం చేయాలని తన అనుచరులకు పిలుపునిచ్చారు. నస్రల్లా వేషధారణ షియా మత బోధకుడిలాగే ఉండేది. వేలాది మంది హెజ్బొల్లా సాయుధులను ముందుకు నడిపించే నాయకుడంటే నమ్మడం కష్టం. ఉర్రూతలూగించే ప్రసంగాలకు ఆయన పెట్టిందిపేరు. హెజ్బొల్లాను రాజకీయ శక్తిగా కూడా మార్చారు. 2005లో లెబనాన్ పార్లమెంటరీ ఎన్నికల్లో హెజ్బొల్లా పోటీ చేసింది. రెండు సీట్లు గెలుచుకుంది. అంతేకాదు మంత్రివర్గంలో సైతం హెజ్బొల్లా చేరిందంటే నస్రల్లా చాతుర్యం అర్థం చేసుకోవచ్చు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
దయాగుణ సంపన్నుడు
పేదింటి భార్యాభర్తలు, వారి ముగ్గురు పిల్లలు ఆకలితో ఉన్నారు. ‘పిల్లలు ఆకలితో ఉన్నారు. మా దగ్గర డబ్బులు లేవు. సహాయం చేయండి’ అని ఆశిష్ అనే యువకుడిని అడిగారు ఆ దంపతులు. పదో పరకో వారి చేతిలో పెట్టి తన దారిని తాను వెళ్లిపోలేదు ఆశిష్. దగ్గరలో ఉన్న రెస్టారెంట్కు తీసుకువెళ్లి వారు కోరిన పదార్థాలు తినిపించాడు. ఆ తరువాత వారిని ఆటో ఎక్కించి డ్రైవర్కు తానే డబ్బులు ఇచ్చాడు. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఈ వీడియోకు సోషల్ మీడియా యూజర్ల నుంచి భారీ స్పందన లభించింది. పోస్ట్ చేసిన రెండు రోజుల్లోనే పదిలక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ‘ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం అంటే వారి ఆకలి తీర్చడం మాత్రమే కాదు మీ ప్రయాణంలో మీరు ఒంటరి వారు కాదు అని ధైర్యం చెప్పడం కూడా’ అని రాశాడు ఆశిష్. ‘దయాగుణానికి ఉన్న గొప్పదనం ఏమిటంటే వినికిడి శక్తి లేని వారు కూడా వినగలరు. కంటిచూపు లేని వారు కూడా చూడగలరు. దయాగుణాన్ని మించిన సంపద లేదు’ అని ఒక యూజర్ రాశాడు. -
ఇస్రో చైర్మన్ ఆత్మకథ
తిరువనంతపురం: ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ ఆత్మకథ రాశారు. ‘నిలవు కుడిచ సింహగల్ (వెన్నెల గ్రోలిన సింహాలు)’ పేరిట మలయాళంలో రాసిన ఈ ఆత్మకథ త్వరలో రానుంది. యువతరానికి తన జీవితం స్ఫూర్తిగా నిలవాలనే ఈ ఆత్మకథ రాసినట్లు ఆయన వెల్లడించారు. అత్యంత నిరుపేద గ్రామీణ కుటుంబంలో పుట్టిన ఆయన ఇస్రో చైర్మన్ స్థాయికి ఎదిగిన తీరు, ఆ క్రమంలో ఎదురైన కష్టాలను ఆయన ఇందులో హృద్యంగా వివరించారు. చంద్రయాన్ మిషన్ విజయం తనను ఆత్మకథ రచనకు పురిగొల్పిందని చెప్పారాయన. ఇంజనీరింగ్ కాలేజీకి పాత డొక్కు సైకిల్ మీద వెళ్లిన వైనం తదితరాలను పుస్తకంలో పొందుపరిచారు. -
రేపు పేదల గృహ నిర్మాణాలకు సీఎం వైఎస్ జగన్ భూమిపూజ
-
పేద కుటుంబాల ఇళ్ల స్థలాలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
-
మరోసారి వాత్సల్యం చూపిన సీఎం జగన్ మోహన్ రెడ్డి
-
ఆపత్కాలంలో ఆదుకున్న ఆత్మ బంధువు
-
కష్టాలు చుట్టుముట్టినా.. చెదరని బాలుడి సంకల్పం.. చెల్లిని భుజాన ఎత్తుకొని!
సాక్షి, మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఏ పిల్లలైనా ఆడిపాడడం తప్పా మరో లోకం తెలీదు. కానీ, చిన్నతనంలోనే తన కుటుంబానికి వచ్చిన కష్టాన్ని తన కష్టంగా బావించి బాధ్యతలను తన భుజంపై మోస్తూ.. చదువును ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ప్రతి రోజు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ.. చదువు కోసం పోరాటం చేస్తున్న 11ఏళ్ల బాలుడే వినయ్. ఏ చీకూచింతా లేని ఆ బాలుడి కుటుంబంలో భవన కూలీగా పనిచేసే తండ్రి ప్రమాదవశాత్తు పైఅంతస్తు నుంచి కింద పడి నడుము విరిగిపోవడంతో కష్టాలు చుట్టుముట్టాయి. తండ్రికి తల్లిలా మారి.. బాలుడి తండ్రి మల్లయ్య భవన నిర్మాణ కూలీగా పనిచేసేవాడు. అయితే, పని చేసే చోట ప్రమాదవశాత్తు భవనంపై నుంచి కింద పడడంతో మల్లయ్య వెన్నుముక విరిగిపోయింది. నాటి నుంచి మంచంపై నుండి కదల్లేని పరిస్థితి. దీంతో ఇళ్లు గడిచేందుకు ఆదాయం లేకపోవడంతో తల్లి లక్ష్మీ చేసే కష్టం మాత్రమే వీరికి ప్రధాన ఆదాయమైంది. తల్లి ఉదయం కూలి పనికి వెళ్తే తండ్రిని, ఏడాదిన్నర వయస్సున చెల్లిని ఇంటి వద్దే ఉండి చూసుకునే బాధ్యత వినయ్ మీదనే పడింది. ఈ విషయాన్ని కొద్దిగా ఆలస్యంగా ఉపాధ్యాయులు గుర్తించారు. అనారోగ్యంతో ఉన్న తండ్రి అన్నం తినలేని పరిస్థితి, చిన్న వయస్సు ఉన్న చెల్లి అన్నం తినలేని పరిస్థితి. వారి ఇద్దరికి వినయ్ క్రమం తప్పకుండా అన్నం తినిపించి, సాయంత్రం తల్లివచ్చే వరకు వారి ఆలనా పాలన చూసుకునే వాడు. ఇన్ని ఇబ్బందులు ఉన్న కానీ చదువుకోవాలని ఉత్సాహం ఉన్న వినయ్ వీరిద్దరినీ చూసుకుటూ చదువుపై ఉన్న మక్కువతో బడికి వస్తున్నాడని గ్రహించారు. దీంతో తన చెల్లిని తనతో పాటు స్కూల్కు తీసుకువచ్చేందుకు ఉపాధ్యాయులు అనుమతించారు. అంతేగాక తండ్రి ఇబ్బందులు తీర్చేందుకు వినయ్ పాఠశాల మధ్యలో వెళ్లేందుకు అనుమతి ఇస్తున్నారు. ఆదుకునేవారు లేక.. అప్పులు చేసి వైద్యం తండ్రి మలయ్యకు ప్రమాదం జరిగిన తర్వాత కార్మిక శాఖ నుంచి కానీ, ప్రభుత్వం నుండి సహాయం అందలేదు. ప్రమాదం జరిగిన ఇంటి యజమాని కొంత డబ్బుమాత్రమే ఇచ్చారు. దీంతో వైద్యానికి కొంత మేర డబ్బు సరిపోయిన మిగిలిన డబ్బును అప్పు రూపంలో సమకూర్చారు. దీంతో కుటుంబం అప్పుల పాలైంది. ఇప్పటికి గాయాలు మానకపోవడంతో వారానికి ఓ సారి రూ.2వేల వరకు ఖర్చు చేసి వైద్యం చేయించుకునే పరిస్థితి. ప్రమాదం జరిగిన తర్వాత ప్రభుత్వ పింఛన్ కోసం దరఖాస్తులు చేశారు. ఇప్పటికి పింఛన్ రాలేదు. ఇళ్లు గడవలేని పరిస్థితి ఇబ్బందులు, భార్యా పిల్లలను పోషించేందుకు మల్లయ్య దిక్కుతోచక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఖాళీ జాగాను అమ్మేశారు. తన కన్న కొడుకును అందరికంటే బాగా ప్రైవేటు పాఠశాలల్లో చదివించాలన్న తన కోరిక నెరవేరకపోగా, పిల్లలు తనమూలంగా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయాడు. తల్లీ లక్ష్మీ, కొడుకు నవీన్ చెల్లిని భుజాన ఎత్తుకొని స్కూలుకి.. మహబూబ్నగర్ రూరల్ మండలం మణికొండ ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నాడు వినయ్. మల్లయ్య, లక్ష్మి దంపతులకు వినయ్తోపాటు ఏడాదిన్నర కూతురు ఉంది. అయితే, మొదటి నుంచి బాలుడికి చదువుకోవాలని ఉత్సాహం ఎక్కువ. పాఠశాలకు విద్యార్థులందరూ ఒక్కరే వెళ్తే వినయ్ మాత్రం తనతో పాటు తన ఒకటిన్నర సంవత్సరాల వయస్సు ఉన్న తన చెల్లి గౌతమిని కూడా తనతో పాటు తరగతి గదిలోకి తీసుకెళ్లే వారు. మధ్యాహ్న భోజనం తనకు పెట్టిన భోజనంలో చెల్లికి కూడా తినిపించే వాడు వినయ్. ఈ విషయంపై పాఠశాల ఉపాధ్యాయులు ఓ సారి మందలించారు. అంత చిన్న వయస్సు ఉన్న పాపను పాఠశాలకు తీసుకురావద్దని వాదించారు. కానీ వినయ్ నుంచి ఎటువంటి సమాధానం వచ్చేది కాదు. చివరకు విషయం ఏంటని తెలుసుకునే ఆరా తీసిన ఉపాధ్యాయులకు గుండె తరుక్కు పోయే విషయాన్ని తెలుసుకోవాల్సి వచ్చింది. బడి మానిపిస్తారేమోనని.. అమ్మ కూలి పనికి వెళ్లడంతో ఇంటి వద్ద నాన్నకు ఏవైనా ఇబ్బందులు వచ్చినా నేనే చూసుకోవాలి. చెల్లి చిన్నది కావడంతో ఆమెను పాఠశాలకు తీసుకెళ్లి అన్నం పెట్టాలి. ఏవైనా ఇబ్బందులు వస్తే చూసుకోవాలి. కొన్ని రోజులు ఇంటి వద్దే ఉన్నా. దీంతో బడి పూర్తిగా మానిపిస్తారేమో అనుకుని, బడికి వెళ్తూ చెల్లిని, నాన్నను చూసుకుంటున్నారు. – వినయ్, విద్యార్థి సహాయం చేసి ఆదుకోండి వెన్నెన్నుముక విరిగాక రెండు కాళ్లు పనిచేయడం లేదు. వైద్యం కోసం రూ.లక్షలు ఖర్చు చేశాం. అయినా ఇప్పటికి గాయాలు మానలేదు. సమస్య తీరలేదు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా. దీంతో కూలిపనికి వెళ్లి ఒక్కదాన్నే కుటుబాన్ని పోషిస్తున్నా. పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. పెద్దమనసుతో ప్రభుత్వం, సంస్థలు, వ్యక్తులు తమను ఆదుకోవాలని వేడుకుంటున్నాం. – లక్ష్మీ, వినయ్ తల్లి -
పేదింట్లో వైద్య కాంతులు.. ఆ కల వాళ్లని ఇంత వరకు నడిపించింది!
సాక్షి,మల్యాల(చొప్పదండి): నిరుపేద కుటుంబాల విద్యార్థులు చదువులో సత్తాచాటి ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో ఉచితంగా సీటు సాధించి తమ కలలను సాకారం చేసుకున్నారు. తల్లిదండ్రుల ఆశలు, ఆశయాలకు అనుగుణంగా లక్ష్యసాధనకు నిరంతరం తపించారు. దీంతో కోట్లాది రూపాయల విలువైన వైద్య విద్య వారి దరికి చేరింది. కష్టసుఖాలు.. తాము అనుభవించిన పేదరికాన్ని పిల్లలు అనుభవించకూడదనే తల్లిదండ్రుల ఆలోచనలకు అనుగుణంగా.. సమాజానికి సేవ చేసే ఉన్నతమైన స్థాయికి చేరుకోవాలనే తమ కలలను నెరవేర్చుకున్నారు. పేదరికాన్ని రుచి చూస్తూ పెరిగిన పిల్లలు వైద్య వృత్తి బాటలో పయనిస్తూ నిరుపేదలకు చేయూతనందిస్తామంటున్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో.. మల్యాల మండలం తాటిపల్లి గ్రామానికి చెందిన బింగి నర్సయ్య– మంజుల కూతురు మనీషా కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో వైద్య విద్యవైపు అడుగులు వేసింది. తండ్రి బట్టల వ్యాపారి, తల్లి బీడీ కార్మికురాలు. నూకపల్లి మోడల్స్కూల్లో పదో తరగతిలో 9.8 జీపీఏ, ఇంటర్లో 985 మార్కులు సాధించింది. తండ్రి గ్రామాల్లో తిరుగుతూ బట్టల వ్యాపారం, మరోవైపు టైలరింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. పెద్ద కూతురు మనీషా ఈ ఏడాది నీట్లో 543 మార్కులు సాధించి వైద్యురాలిగా తన కల నెరవేర్చుకునేందుకు మార్గం సుగమం చేసుకుంది. చిన్న కూతురు అనూషను సైతం నీట్ కోసం సిద్ధం చేస్తున్నారు. విరిసిన దళిత కుసుమం.. మల్యాల మండలం మ్యాడంపల్లి గ్రామానికి చెందిన పేద దళిత కుటుంబం పద్మ–గంగయ్యల ఒక్కగానొక్క కూతురు నిఖిత. తల్లి బీడీ కార్మికురాలు, తండ్రి ఉపాధి కోసం గల్ఫ్బాట పట్టాడు. ఆది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చదివింది. పదో తరగతిలో 9.3 జీపీఏ, ఇంటర్లో 953 మార్కులు సాధించింది. గతేడాది వైద్య విద్యలో సీటు సాధించి డాక్టర్ కావాలనే కలను నెరవేర్చుకుంది. వైద్య విద్య అడ్మిషన్కు కూడా డబ్బులు కట్టలేని స్థితిలో నిఖితకు “సాక్షి’ తోడుగా నిలవగా.. డాక్టర్ కావాలనే కల సాకారం చేసుకుంది. తనలాంటి పేద విద్యార్థులకు చేయూతనందిస్తానని, నిరుపేదలకు ఉచితంగా సేవలందిస్తానని నిఖిత చెబుతోంది. తండ్రి కల నెరవేర్చిన తనయ మల్యాల మండలం ముత్యంపేటకు చెందిన పన్నాటి మల్లేశం కూతురు అలేఖ్య. గ్రామంలో రెండు దశాబ్దాలుగా మల్లేశం ఆర్ఎంపీగా జీవనం సాగిస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. భార్య గీత బీడీ కార్మికురాలు. తన కూతురును డాక్టర్ చేయాలనే తండ్రి ఆశయానికి తోడు తనయ కష్టపడి చదివి ఉస్మానియాలో ఉచితంగా సీటు సాధించింది. పదో తరగతిలో 10జీపీఏ, ఇంటర్లో 988 సాధించింది. మూడేళ్లక్రితం ఉస్మానియా వైద్య కళాశాలలో సీటు సాధించి, తండ్రి ఆశయాన్ని, తన కలను నెరవేర్చుకుంది. ఆది నుంచి ముందువరుసలో.. మల్యాల మండల కేంద్రానికి చెందిన బండారి అశోక్ రెండు దశాబ్దాలుగా ఆర్ఎంపీగా పనిచేస్తున్నాడు. డాక్టర్ కావాలంటూ చిన్నప్పటి నుంచి తన కుమారుడు గాయత్రినందన్కు బీజాలు నాటాడు. తండ్రి మాటలకు అనుగుణంగా గాయత్రినందన్ డాక్టర్ కావడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఆదినుంచి ప్రణాళికతో చదివి పదో తరగతిలో 10 జీపీఏ, ఇంటర్లో 988 మార్కులు సాధించాడు. ఎలాంటి కోచింగ్ లేకుండానే నీట్లో 583 మార్కులు సాధించి ఇటీవలే ప్రభుత్వ వైద్య కళాశాలలో ఉచితంగా సీటు సాధించాడు. మట్టి పరిమళం కల్పన మల్యాల మండలం సర్వాపూర్ గ్రామానికి చెందిన మిర్యాల మల్లారెడ్డి– వనిత దంపతులది వ్యవసాయ కుటుంబం. డాక్టర్ కావాలనే కూతురు కల్పన కలకు బాసటగా నిలిచారు. చదువుకోసం వ్యవసాయ భూమి అమ్మేందుకుసైతం వెనకాడబోమని భరోసానిచ్చారు. తల్లిదండ్రుల భరోసాతో కల్పన మరింత కష్టపడి చదివింది. పదో తరగతిలో 10జీపీఏ, ఇంటర్ మొదటి సంవత్సరంలో 436/440 మార్కులతో రాష్ట్రస్థాయిలో మూడో ర్యాంకులో నిలిచింది. అదే ఉత్సాహంతో ఇంటర్లో 986 మార్కులు సాధించింది. కష్టపడి చదివి ఉచితంగా వైద్య కళాశాలో సీటు సాధించి ప్రస్తుతం నాలుగో సంవత్సరం చదువుతోంది. గ్రామంలో నెట్వర్క్ లేకపోతే చదువుకు ఆటంకం కలుగవద్దని నేరుగా శ్మశానంలో కూర్చుండి కూడా ఆన్లైన్ తరగతులు వింటూ చదువును కొనసాగించి, డాక్టర్ కావాలనే తనలోని దృఢ సంకల్పాన్ని చాటి చెప్పింది. -
మానవత్వం చాటుకున్న మంత్రి హరీశ్
సాక్షి, సిద్దిపేట : పదేళ్ల క్రితం ఆ ఇంటి పెద్ద గుండె ఆగిపోయింది. ప్రకృతి పగబట్టినట్టు వర్షాల కారణంగా ఆ కుటుంబానికి ఆసరాగా ఉన్న ఇల్లు కాస్తా కూలిపోయింది. మగదిక్కులేకుండా వయసులో ఉన్న కూతురుతో తల్లి దొంతరబోయిన బాలవ్వ సర్కారు బడి లో తలదాచుకుంది. సిద్దిపేట జిల్లా చిన్నకో డూరు మండలం రామంచకి చెందిన వీరి దీనస్థి తిని సెప్టెంబర్ 23న ‘సారూ.. సాయం చేయరూ’ శీర్షికన ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. దీనికి ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు స్పందించారు. నిరుపేదల గోడు విని సొంత ఖర్చుతో ఇల్లు కట్టించారు. శనివారం దగ్గరుండి తల్లీకూతుళ్లకు కొత్త బట్టలు పెట్టి గృహ ప్రవేశం చేయించారు. నాడు కూలిన ఇల్లు.. నేడు కొత్తగా నిర్మించిన ఇల్లు -
శభాష్.. పోలీస్
ప్రొద్దుటూరు క్రైం : నిరుపేద కుటుంబానికి ఆర్థిక సాయం చేసి పోలీసులు శభాష్ అనిపించుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ప్రొద్దుటూరులోని ఎర్రగుంట్ల రోడ్డులో నివాసం ఉంటున్న తిరుమల దుర్గాప్రసాద్కు మానసిక దివ్యాంగులైన ఇద్దరు పిల్లలు ఉన్నారు. లాక్డౌన్ కారణంగా అతను పనికి వెళ్లలేకపోయాడు. దీంతో కొన్ని రోజుల నుంచి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. పలువురి సూచన మేరకు అతను శుక్రవారం సాయంత్రం జిల్లా ఎస్పీ అన్బురాజన్కు ఫోన్ చేసి.. తన కుటుంబ ఆర్థిక పరిస్థితి గురించి విన్నవించుకున్నాడు. ఎస్పీ సూచన మేరకు డీఎస్పీ లోసారి సుధాకర్, రూరల్ సీఐ విశ్వనాథ్రెడ్డి, ఎస్ఐ సునీల్రెడ్డి శుక్రవారం రాత్రి దుర్గాప్రసాద్ ఇంటికి వెళ్లారు. రూ. 5 వేల నగదుతోపాటు రెండు బియ్యం బస్తాలు, నిత్యావసర సరుకులు అందజేశారు. ఎంపీడీఓ, తహసీల్దార్తో మాట్లాడి ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు వచ్చే విధంగా కృషి చేస్తామని దుర్గాప్రసాద్తో అన్నారు. అలాగే బ్యాంకు అధికారులతో మాట్లాడి సొంత ఆటో కోసం రుణం ఇచ్చేలా మాట్లాడుతామని చెప్పారు. మానవత్వంతో తమ కుటుంబాన్ని ఆదుకున్న ఎస్పీ, డీఎస్పీ, సీఐ, ఎస్ఐలకు వారు కృతజ్ఞతలు తెలిపారు. -
మంత్రి కేటీఆర్ చొరవతో పేద దంపతులకు చేయూత
నేరేడ్మెట్ (హైదరాబాద్): లాక్డౌన్ నేపథ్యంలో బిజీగా ఉన్నప్పటికీ ట్విట్టర్లో వివిధ సమస్యలు, ప్రజల ఇబ్బందులపై వస్తున్న మేసేజ్లకు వెంటనే స్పందిస్తూ పరిష్కారానికి చొరవ చూపుతున్నారు రాష్ట్ర మంత్రి కేటీఆర్. ఇందులో భాగంగా అనారోగ్యంతో బాధపడుతున్న తమ కొడుకుకు మందులు కొనుగోలు చేయలేక ఇబ్బంది పడుతున్నామని..ఆదుకోవాలని ఓ పేద దంపతులు ట్విట్టర్లో పంపిన మేసేజ్కు కేటీఆర్ స్పందించారు. వివరాల్లోకి వెళితే..వినాయకనగర్లో నివాసం ఉంటున్న శ్రావణి, ప్రవీణ్లకు ముగ్గురు సంతానం. ప్రవీణ్ డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆమె కూలి పనులు చేస్తుంది. ముగ్గురు సంతానంలో పెద్ద కొడుకు ప్రణీత్(8) కొంతకాలం క్రితం నీటిసంపులో పడి బ్రెయిన్, ఊపిరితిత్తులు దెబ్బతిని, అంగవైకల్యంతో బాధపడుతున్నాడు. వైద్యులు సూచించిన ప్రకారం తల్లిదండ్రులు మందులు వాడుతూ వస్తున్నారు. ఇటీవల మందులు అయిపోయాయి. ఈ క్రమంలో లాక్డౌన్ అమల్లోకి వచ్చింది. తల్లిదండ్రులు ఇంటికే పరిమితమయ్యారు. పని లేకపోవడంతో కొడుకుకు మందులు, నిత్యావసర సరుకులు కొనడానికి చేతిలో డబ్బులు లేని దయనీయ పరిస్థితి. దాంతో తమ సమస్యను తెలిసిన వారి ద్వారా వారం రోజుల క్రితం మంత్రి కేటీఆర్కు పేద దంపతులు ట్వీట్ చేయించారు. ఈ ట్వీట్కు స్పందించిన కేటీఆర్ వెంటనే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని, మేడ్చల్ జిల్లా కలెక్టర్కు సూచించారు. కలెక్టర్ మల్కాజిగిరి తహసీల్దార్ బి.గీతకు సమాచారం ఇచ్చారు. తహసీల్దార్ గీత ఆ పేద దంపతులను శనివారం నేరేడ్మెట్లోని తన కార్యాలయానికి పిలిపించారు. కావాల్సిన నిత్యావసర సరుకులను తహసీల్దార్, ప్రణీత్కు అవసరమైన మందులను నేరేడ్మెట్ ఆఫీసర్స్ కాలనీకి చెందిన గోపు రమణారెడ్డి అందజేశారు. తమ సమస్యపై స్పందించిన కేటీఆర్తోపాటు కలెక్టర్, తహసీల్దార్, రమణారెడ్డిలకు పేద దంపతులు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. -
కబడ్డీ అంటే ప్రాణం.. కాసులు లేక దైన్యం
అసలే నిరుపేద కుటుంబం. ఆపై పెద్ద దిక్కు కోల్పోవడం, అన్ని తానై తండ్రిలేని లోటును కనిపించకుండా తన కుమారుడిని ఉన్నతుడిని చేయాలనే సంకల్పంతో కూలి పనులు చేస్తూ చదివిస్తోంది ఓ తల్లి.. అదే ఉన్నత ఆశయంతో, తల్లి సంకల్పాన్ని సాకారం చేసేందుకు చదువుతోపాటు కబడ్డీలో రాణిస్తూ జాతీయ స్థాయిలోనూ అవార్డులు సాధిస్తున్నారు కొందుర్గుకు చెందిన విద్యార్థి శ్రీకాంత్. అయితే ఈ నెల 22న మధ్యప్రదేశ్లో జరిగే పోటీలలో పాల్గొనేందుకు దాతల సహకారాన్ని అర్థిస్తున్నాడు. రంగారెడ్డి :కొందుర్గు గ్రామానికి చెందిన పార్వతమ్మ, కృష్ణయ్య దంపతులకు పావని, శ్రీకాంత్ అను ఇద్దరు సంతానం. పావని పెళ్లైంది. అయితే రెండేళ్ల క్రితం తండ్రి కృష్ణయ్య మృతిచెందాడు. ఇక ఈ కుటుంబంలో మిగిలింది తల్లి పార్వతమ్మ, కూమారుడు శ్రీకాంత్. తన కూమారుడిని ఎలాగైనా మంచి చదువులు చదివించి ఉన్నతమైన భవిష్యత్ అందించాలన్నదే పార్వతమ్మ కోరిక. తల్లి ఆశయాన్ని నెరవేర్చేందుకు శ్రీకాంత్ చదువులోనూ, అటు క్రీడలోనూ రాణిస్తున్నారు. ప్రాథమిక స్థాయిలో కొందుర్గు బాలుర ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలు లక్ష్మీదేవి సైతం శ్రీకాంత్ను క్రీడలో ప్రోత్సహిస్తూ వస్తున్నారు. ఉన్నత పాఠశాలలో పీఈటీలు అనితారాణి, రామచంద్రుడు సూచనలు, సలహాలు పాటిస్తూ ఎన్నో జాతీయ పతకాలు సాధించారు. శ్రీకాంత్ సాధించిన విజయాలు ప్రస్తుతం కొందుర్గు ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న శ్రీకాంత్ 2017 డిసెంబర్లో నిర్వహించిన కబడ్డీ అండర్–17 విభాగంలో చెన్నైలో జరిగిన జాతీయ క్రీడా పోటీల్లో తెలంగాణ తరఫున పాల్గొని ప్రథమ బహుమతి అందుకున్నారు. అదేవిధంగా 2018 నవంబర్లో రాజస్థాన్లో నిర్వహించిన జాతీయ కబడ్డీ పోటీల్లోనూ ఢిల్లీ జట్టుతో పోటీపడి ప్రథమ స్థానం పొందారు. ఇక 2019 సెప్టెంబర్లో పాండిచ్చేరి జరిగిన అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్నారు. ఇక ప్రస్తుతం ఈ నెల 22న మధ్యప్రదేశ్లో జాతీయ స్థాయి కబడ్డీ పోటీల కోసం ఎన్నికయ్యారు. దాతల సహకారంతోనే .. కాగా వివిధ రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న క్రీడాపోటీల్లో పాల్గొనేందుకు శ్రీకాంత్కు ఆర్థిక పరిస్థితులు అంతగా లేకపోవడం వల్ల దాతల సహకారంతోనే అన్ని పోటీల్లో పాల్గొంటున్నారు. ఈ నెల 22న మధ్యప్రదేశ్లో నిర్వహించే పోటీల్లో పాల్గొనేందుకు ఆర్థిక వనరుల కోసం దాతల కోసం ఎదురు చూస్తున్నారు. జాతీయ స్థాయిలో రాణించాలన్నదే లక్ష్యం జాతీయ క్రీడాకారుడిగా గుర్తింపు పొందాలన్నదే నా కోరిక. చిన్నతనంలో లక్ష్మీదేవి టీచర్, పెద్దయ్యాక పీఈటీలు అనితారాణి, రామచంద్రుడు ఇద్దరు టీచర్లు సూచించిన సలహాలు నాకు స్ఫూర్తిని నింపాయి. ఇక నాయకుల ఆర్థిక సహాయంతోపాటు మా పాఠశాల ఉపాధ్యాయులు రూ. 500 చొప్పున అందించి నన్ను జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు పంపించడం నాలో మరింత పట్టుదలను నింపింది.– కబడ్డీలో రాణిస్తున్న శ్రీకాంత్ నా కొడుకు ఉన్నత స్థాయికి చేరుకోవాలి నా కొడుకు ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నదే నా కోరిక. కుటుంబాన్ని పోషించే నా భర్త మృతిచెందాడు. ఇక ఉన్న ఒక్కగానొక్క కొడుకును ఉన్నతమైన భవిష్యత్ అందించాలని ఉంది. నా కొడుకు జాతీయ కబడ్డీ పోటీల్లో బహుమతి అందుకున్నాడని తెలియగానే చెప్పరాని సంతోషం వచ్చింది. మరిన్ని ఉత్తమ బహుమతులు అందుకొని మంచి భవిష్యత్ పొందాలని నా కోరిక. ఇందుకు దాతలు సహకరించాలి. – పార్వతమ్మ, శ్రీకాంత్ తల్లి -
అక్కాచెల్లెళ్ల ఆత్మహత్యాయత్నం
సాక్షి, జడ్చర్ల: నిరుపేద కుటుంబం.. ఆర్థిక ఇబ్బందులు.. అంతా ఆడ సంతానం.. దీనికి తోడు కుటుంబ పెద్దలు పట్టించుకోకపోవడంతో ఆ ఆడపిల్లలు ఏమనుకున్నారో.. ఎంతగా మానసిక క్షోభకు గురయ్యారో.. తండ్రి పట్టించుకోవడం లేదనో.. తమకు పెళ్లిళ్లు కావడం లేదనో.. తెలియదు గాని వారు ఒక్కసారిగా ఇంట్లో ఉన్న పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టారు.. ఈ సంఘటన మండలంలోని చర్లపల్లిలో గురువారం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పోలెమోని వెంకటయ్య (65), సాయమ్మ (60) దంపతులకు ఆరుగురు కూతుళ్లు. వెంకటమ్మ అలియాస్ మానస (36), అనిత (34), కృష్ణవేణి (30), యాదమ్మ (27), మౌనిక అలియాస్ ప్రవళిక (25), స్వాతి (20) ఉన్నారు. వీరిలో మౌనిక బీఫార్మసీ పూర్తి చేయగా.. స్వాతి ఇంటర్ పూర్తి చేసింది. మిగతా వారు కూడా పదో తరగతిలోపు చదువుకున్నారు. అయితే గురువారం మానస, అనిత, కృష్ణవేణి, యాదమ్మలు ఇంట్లో ఉన్న పురుగు మందును తాగారు. అస్వస్థతకు గురవడంతో వెంటనే ఇంట్లో నుంచి బయటకు వచ్చి వాంతులు చేసుకున్నారు. చుట్టుపక్కల వారు గమనించి వెంటనే ఆటోలో, ద్విచక్రవాహనంపై వారిని బాదేపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో 108లో జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించారు. నిరుపేద కుటుంబం గ్రామానికి చెందిన వెంకటయ్యది నిరుపేద కుటుంబం. ఈయనకు భార్య సాయమ్మతో పాటు తల్లి శాంతమ్మ, ఆరుగురు కూతుళ్లు ఉన్నారు. తన స్థోమతకు తగ్గట్టుగా కూతుళ్లను చదివించాడు. వీరికి గ్రామ శివారులో ఏడు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమిలో పండే పంటలతోపాటు కూలీ పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. వెంకటయ్యతోపాటు మరో ఇద్దరు సోదరులకు కలిపి మూడు గదుల ఇళ్లు ఉంది. ఇందులో వెంకటయ్య పాలికి వచ్చిన చిన్నపాటి గదిలోనే వీరంతా జీవనం సాగిస్తున్నారు. ఆ గది కూడా చిన్నగా ఉండటం, శిథిలావస్థకు చేరుకుంది. అంతా పెళ్లీడు వారే.. ఆరుగురు ఆడపిల్లలు. అంతా పెళ్లీడు దాటిన వారే. దీంతో ఆ ఆడకూతుళ్లు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. తమ తండ్రి వెంకటయ్య తమను పట్టించుకోవడం లేదని, తమకు పెళ్లిళ్లు చేయడం లేదన్న మానసిక వ్యథ ఒక వైపు కుంగదీస్తుండగా.. మరోవైపు పేదరికం అడుగడుగునా వెక్కిరించింది. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో వారు పురుగు మందు తాగి అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా బుధవారం తమ చెల్లెలు కృష్ణవేణి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఈమె ఎవరినో పెళ్లి చేసుకుని ఉంటుందని వీరి అనుమానం. దీంతో తండ్రి వెంకటయ్య తన కూతురు కృష్ణవేణి కోసం యాదగిరిగుట్ట, శ్రీశైలం తదితర ప్రాంతాల్లో వెతికేందుకు వెళ్లాడు. తమ చెల్లెలు ఇంటి నుంచి బయటకు వెళ్లి తమ పరువు తీసిందని భావించారో.. మరో కారణంగానో ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఉంటారని గ్రామస్తులు భావిస్తున్నారు. 25 ఏళ్ల క్రితం సర్పంచ్ వెంకటయ్య దాదాపు 25 సంవత్సరాల క్రితం చర్లపల్లికి సర్పంచ్గా బాధ్యతలు నిర్వర్తించినట్లు గ్రామస్తులు తెలిపారు. అనంతరం బాదేపల్లి పట్టణం తదితర ప్రాంతాల్లో చిన్నపాటి కాంట్రాక్టు పనులు చేపట్టి నష్టపోయినట్లు తెలిసింది. దీంతో ఒకవైపు ఆడపిల్లలు, మరోవైపు పేదరికంతో వెంకటయ్య మానసికంగా కుంగిపోయి మౌనస్థితికి చేరినట్లు అనుమానిస్తున్నారు. గతంలోనే పోలీసుల దృష్టికి.. తమను తమ తండ్రి వెంకటయ్య పట్టించుకోవడం లేదని, తమకు పెళ్లిళ్లు చేయడం లేదని, పెద్దదిక్కుగా ఉన్నా తండ్రి పట్టించుకోకపోవడంతో తమకు సంబంధాలు రావడం లేదని ఆవేదన చెందిన కూతుళ్లు తమకు న్యాయం చేయాలని కొద్దిరోజుల క్రితం జడ్చర్ల పోలీసులను ఆశ్రయించారు. దీంతో సీఐ బాలరాజుయాదవ్ వారికి, తండ్రి వెంకటయ్యకు కౌన్సిలింగ్ నిర్వహించి ధైర్యంగా ఉండాలని చెప్పి పంపించారు. పెళ్లికి సహాయంగా తమవంతుగా సహకరిస్తామని కూడా సీఐ వారికి భరోసా ఇచ్చారు. కేను నమోదు అక్కాచెల్లెళ్ల ఆత్మహత్యాయత్నం ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బాలరాజుయాదవ్ తెలిపారు. ఆరుగురు ఆడపిల్లలు, పెళ్లిళ్లు కాకపోవడం, వీరిలో ఒక చెల్లెలు ఇంటి నుంచి చెప్పకుండా బయటకు వెళ్లిపోవడం కారణంగా ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు. నలుగురిలో మానస, అనితల పరిస్థితి విషమంగా ఉండడంతో ఏనుగొండలోని ఎస్వీఎస్ ఆస్పత్రికి తరలించారు. మిగతా ఇద్దరు కృష్ణవేణి, యాదమ్మలకు జిల్లా ఆస్పత్రిలో చికిత్స నిర్వహిస్తున్నారు. -
సిటీలో సాహసి పర్వతాలు ఎక్కేసి..
దుండిగల్: ఎముకలు కొరికే చలి.. కడుపులో ఆకలి మంట.. అడుగు తీసి వేయలేని పరిస్థితి. మరోపక్క తీవ్రంగా వీచే గాలులు.. విరిగి పడుతున్న మంచు కొండ చరియలు. అయినా చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో ఎంచుకున్న లక్ష్యాన్ని చేధించే దిశగా అడుగులు వేశాడు ఓ యువకుడు. సాహస క్రీడలపై మక్కువ పెంచుకున్న అతడు ప్రపంచంలోనే అతి ఎత్తయిన మౌంట్ ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించాలని జీవితాశయంగా ఎంచుకున్నాడు. అతడే కుత్బుల్లాపూర్ ప్రాంతానికి చెందిన బాదా రమేష్. సాహసమే ఊపిరిగా.. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట గ్రామానికి చెందిన రాజు, బాలామణి దంపతులు 18 ఏళ్ల క్రితం నగరానికి వలస వచ్చి సూరారంలోని రాజీవ్ గృహకల్పలో నివాసముంటున్నారు. వీరి కుమారుడు రమేష్ (21) డిగ్రీ పూర్తి చేసిన ఇతడు చిన్ననాటి నుంచే సాహస క్రీడలపై మక్కువ పెంచుకున్నాడు. రమేష్ తండ్రి ఏటీఎం కేంద్రం వద్ద సెక్యూరిటీ గార్డు కాగా, తల్లి ప్రైవేట్ పరిశ్రమలో దినసరి కూలీ. డిగ్రీలో ఉండగా రమేష్ సికింద్రాబాద్లోని ఎస్డీఎస్ కళాశాలలో 2టీ బెటాలియన్ సికింద్రాబాద్ గ్రూప్ నేషనల్ క్యాడెట్ క్రావ్స్ గ్రూప్లో మూడేళ్ల పాటు శిక్షణ పొందాడు. అనంతరం పర్వతారోహణలో బేసిక్ మౌంటెనీరింగ్ కోర్సు (బీఎంసీ) పూర్తిచేశాడు. ఈ కోర్సులో నెలరోజుల పాటు మంచు కొండల్లో అన్ని కేటగిరీల్లో ప్రతిభ కనబరిచిన వారినే పర్వతారోహణకు అర్హులుగా ప్రకటిస్తారు. అనంతరం ఇండియన్ మౌంటెనీరింగ్ ఫౌండేషన్ (ఐఎంఎఫ్) కోర్స్లోసైతం శిక్షణ పూర్తి చేశాడు. రెండు పర్వతాల అధిరోహణ ఎన్ఐఎంఏఎస్లో పూర్తి స్థాయిలో శిక్షణ పొందిన రమేష్ 2018లో మొదటి సారి అరుణాచల్ ప్రదేశ్లోని 16,414 అడుగుల మీర్తంగ్ పర్వతాన్ని అధిరోహించాడు. అదే ఏడాది జమ్ము–కశ్మీర్లోని మచాయ్ (17,901 అడుగులు) పర్వతాన్ని అధిరోహించాడు. ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఉన్న పర్వతాలను ఎక్కాలనే ప్రయత్నంలో ఉన్నాడు. అన్ని అంశాల్లో తర్ఫీదు.. పర్వతల అధిరోహణ శిక్షణతో పాటు వివిధ విభాగాల్లో రమేష్ తర్ఫీదు పొందాడు. ఎత్తయిన కొండల నుంచి పారే జలపాతాలపై నుంచి కిందకు దిగే రాక్ క్లైంబింగ్, గాలిలో బెలూన్ల సహాయంతో ఎగిరే పారా సైలిన్, కొండలపై నుంచి తాడు సహాయంతోనే కిందకు దిగే ర్యాప్లింగ్, జుమారింగ్, నదుల్లోని నీటిపై చేసే రాప్టింగ్, ట్రెక్కింగ్లో భాగంగా స్పైడర్ వెబ్తో పాటు రివర్స్ క్రాసింగ్, స్పోర్ట్స్ క్లైంబింగ్లో సైతం రాటుదేలాడు. అడ్వైంచర్ క్లబ్ ఆఫ్ తెలంగాణ స్టేట్లో ప్రవేశం పొంది పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించాడు. అనంతరం 330 ఫీట్ల ఎత్తున్న ఆదిలాబాద్లోని గాయత్రి జలపాతంలో 120 మంది సభ్యులు పాల్గొనగా అందులో రమేష్ రివర్స్ ట్రెక్కింగ్, కళ్లకు గంతలు కట్టుకుని కిందకు దిగడం వంటి విన్యాసాలు చేసి బంగారు పతకం, వెండి పతకాలు సాధించాడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ క్లైంబింగ్ స్టేట్ లెవెల్ పోటీల్లో పాల్గొని సెలెక్టయ్యాడు. అటు నుంచి బెంగళూరులో జరిగిన సౌత్ జోన్ పోటీల్లో అర్హత సాధించడంతో అతనికి జేఐఎంలో నెలరోజుల పాటు శిక్షణ పొంది, అరుణాచల్ప్రదేశ్లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్ ఎలైడ్ స్పోర్ట్స్ (ఎన్ఐఎంఏఎస్)లోను కఠోర శిక్షణ పూర్తిచేశాడు. ఇంటర్నేషనల్ ఒలంపిక్స్ డే సందర్భంగా నిర్వహించిన 12 గంటల పాటు నాన్స్టాప్ క్లైంబింగ్ పోటీల్లో రమేష్ ఏకంగా 13 సార్లు రికార్డు నెలకొల్పాడు రమేష్. చిన్నప్పటి నుంచి సాహస క్రీడలంటే ప్రాణం. వాటి ద్వారానే స్ఫూర్తి పొందాను. ఇప్పటి వరకు రెండు పర్వతాలను అధిరోహించాను. ఎవరెస్ట్ శిఖరంపై త్రివర్ణ పతాకం ఎగరేయాలన్నది నా చిరకాల కోరిక. పర్వతం ఎక్కేటప్పుడు ఎంతో క్లిష్ట పరిస్థితులుంటాయి. వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనే స్థైర్యం ఉంది. కానీ ఆర్థిక పరిస్థితే బాగాలేదు. ఎవరన్నా సాయం చేసేవారుంటే ఎన్నో విజయాలు సాధిస్తానన్న నమ్మకముంది’’. – రమేష్ వెంటాడుతున్న పేదరికం తల్లిదండ్రులు రాజు, బాలామణి ప్రతిరోజు కష్టపడితేనేగాని పూట గడవని పరిస్థితి. ప్రభుత్వం కేటాయించిన రాజీవ్ గృహకల్పలో నివాసముంటూ కాలం వెళ్లదీస్తున్నారు. తమ కొడుకు కలను నెరవేర్చేందుకు తమకు స్తోమత లేదని వారు కన్నీటి పర్యంత మవుతున్నారు. రమేష్ సైతం ప్రస్తుతం చేసేదేమీ లేక ఓ రిసార్ట్లో ఆటవిడుపుగా వచ్చే పిల్లలకు సాహస క్రీడలపై అవగాహన కల్పిస్తూ ఉపాధి పొందుతున్నాడు. రమేష్కు సాయం చేయాలనుకునేవారు 8099079372, 9182117796 నంబర్లలో సంప్రదించవచ్చు. -
ఆశే బతికిస్తోంది..!
పెద్దలిచ్చిన ఆస్తిపాస్తులు లేవు..పెద్ద కుటుంబమేమీ కాదు..కూలి పని చేస్తే రోజు గడుస్తుంది..లేదంటే పస్తులతో కాలం వెళ్లదీయాల్సిందే..ఉన్నదాంట్లో సర్దుకుపోతున్న తరుణంలో కుటుంబ పెద్దకు పెద్ద కష్టమొచ్చింది. మతిస్థిమితం కోల్పోవడంతోపాటు కాళ్లు విరిగి మంచానికే పరిమితమయ్యాడు. సహచరి ధైర్యాన్ని కోల్పోకుండా భర్త కోసం రెక్కల కష్టాన్ని నమ్ముకుంది. ఎప్పటికైనా మంచి రోజులు వస్తాయనే ఆశతో ఆమె పోరాటం చేస్తోంది. ఇటీవల చిన్న కుమారుడు కూడా అస్వస్థతకు గురయ్యాడు. దీంతో ఆమె దుఃఖాన్ని దిగమింగి.. గుండె దిటువు చేసుకుంది. ఏ దేవుడైనా రాకపోతాడా.. తమను ఆశీర్వదించకపోతాడా అనే ఆశతో ఆమె బతుకుతోంది. పత్తికొండలోని మడ్డిగేరికి చెందిన లక్ష్మీ దేవి కుటుంబం దీనగాథ ఇది.. కర్నూలు, పత్తికొండ రూరల్: పత్తికొండ మేజర్ గ్రామపంచాయతీలో కాంట్రాక్టు పారిశుద్ధ్ద్య కార్మికుడుగా పాపన్న పనిచేస్తుండే వాడు. పూరిగుడిసెలో నివాసం ఉంటున్న పాపన్న, లక్ష్మీ దంపతులకు కుమార్, కుమారి, పుల్లన్న సంతానం. పెద్దకుమారుడైన కుమార్ ఆరేళ్ల కిందటే వివాహం చేసుకుని వేరుగా కాపురం ఉంటున్నాడు. పంచాయతీ కార్మికుడుగా ఉన్న పాపన్న 2011లో పక్షవాతానికి గురయ్యాడు. ఆదోని, కర్నూలు ఆసుపత్రుల్లో సుమారు రూ.2లక్షల వరకు ఖర్చుచేసి వైద్యం చేయించినా వ్యాధి నయం కాలేదు. మెదడులో సమస్య ఉందని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యులు ధ్రువీకరించారు. మతిస్థిమితం కూడా కోల్పోయి వీధిలో వెళ్తున్న పాపన్నను పరిగెత్తుకుంటూ వెళ్తున్న గుర్రాలు తగిలాయి. దీంతో ఆయన కాళ్లు విరిగి ఏడేళ్లుగా లేవలేని స్థితిలో మంచం పట్టాడు. ఎప్పుడూ పడుకునే ఉండడం వల్ల చర్మం కూడా దెబ్బతిని కుళ్లిపోతోంది. పాపన్నకు మెదడు చికిత్సతో పాటు కుళ్లిపోయిన చర్మవ్యాధికి ఆధునిక వైద్యంకోసం సుమారు రూ.10 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు సూచించారు. అంతభారం భరించలేమని కుటుంబ సభ్యులు నిట్టూర్చారు. సంసారాన్ని అతికష్టంపై నెట్టుకొస్తున్న పాపన్న భార్య లక్ష్మి...నాలుగేళ్ల క్రితం రూ.లక్ష వరకు అప్పుచేసి కుమార్తె కుమారి వివాహం చేసింది. ప్రస్తుతం కనీసం నడవలేని స్థితిలో పాపన్న మంచానికే పరిమితమయ్యాడు. వైద్యం చేయించడం చేతకాక దేవుడిపై భారం వేసి దయగల మారాజుల వైద్యసాయం కోసం దీనంగా ఎదురుచూస్తున్నారు. చిన్నకుమారుడు పుల్లన్నకు కిడ్నీలో రాళ్లు పాపన్న చిన్నకుమారుడైన పుల్లన్న బేల్దారి పనిచేసుకుంటూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు. అయితే పుల్లన్నకు కిడ్నీలో రాళ్లు అని వైద్యులు తేల్చడంతో మూలిగే నక్కపై తాటికాయ పడినట్లయింది. బరువుపని చేస్తే ఆరోగ్యం మరింత దెబ్బతింటుందని వైద్యులు సూచించారు. దీంతో ఆభారం కూడా ఆ తల్లిపైనే పడింది. దాతల్లారా దీవించండి నా భర్త లేవలేడు..కూర్చోలేడు.. నడవడం కూడా చేతకాదు.. మంచానికి పరిమితమైపోవడంతో అన్నీ నేనే చూసుకోవాల్సి వస్తోంది. కూలి పనులు చేసుకుని బతకడమే కష్టంగా ఉన్న మాకు వైద్యం చేయించుకునే స్థోమత లేదు. మానవత్వం ఉన్న మారాజులు స్పందించి చేయూతనందిస్తే నా భర్త ప్రాణాలతో బయటపడే అవకాశం ఉంది. – దుడ్డు లక్ష్మి పాపన్న భార్య దుడ్డు లక్ష్మి, ఎస్బీఐ అకౌంటు నంబరు : 37881191962 ,ఐఎఫ్ఎస్సి కోడ్ ఎస్బిఐఎన్0000981 సంప్రదించాల్సిన సెల్ : 9666332260 -
ఒకరు పాడెపై.. మరొకరు స్ట్రెచర్పై..
సాక్షి, ఏటూరునాగారం: డెంగీ మహమ్మారి ఆ కుటుంబంతో ఆడుకుంటోంది. చేతిలో చిల్లిగవ్వలేక.. ఆపదలో ఆదుకునే ఆరోగ్యశ్రీ కూడా వర్తించకపోవడంతో ఆ తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. మెరుగైన వైద్యం చేయించలేని పరిస్థితుల్లో ఒక కొడుకు పాడెపై పడుకుంటే.. మరో కుమారుడు వెంటిలెటర్పై కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న హృదయవిదారక సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్నాయిగూడెం మండలం ఏటూరు పంచాయతీ పరిధిలోని సింగారంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వావిలాల పోతరాజు, జయమ్మకు ఇద్దరు సంతానం. పెద్ద కొడుకు వావిలాల వినయ్ (9) డెంగీ జ్వరంతో బాధపడుతూ శనివారం ఉదయం ఎంజీఎంలో మృతి చెందాడు. వినయ్కి వారం రోజుల క్రితం జ్వరం రావడంతో ఏటూరునాగారంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. అయినప్పటికీ నయం కాలేదు. కాలేయానికి ఇన్ఫెక్షన్ వచ్చిందని, రక్తకణాలు పూర్తిగా తగ్గిపోయాయని వైద్యులు చెప్పడంతో ఆర్థిక స్థోమత లేని ఆ తల్లిదండ్రులు కుమారుడిని చికిత్స నిమిత్తం వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడ నాలుగు రోజులుగా చికిత్స అందిస్తుండగా శనివారం మృతిచెందాడు. వెంటిలెటర్పై రెండో కుమారుడు పెద్ద కుమారుడు చనిపోవడంతో తల్లి జయమ్మ ఆయన మృత దేహాన్ని పట్టుకుని సింగారం గ్రామంలోని తన ఇంటికి చేరింది. రెండో కుమారుడు వావిలాల వినోద్కు కూడా జ్వరం రావడంతో హన్మకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో సేవలు చేస్తున్నాడు. వినోద్ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో వైద్యులు ఆయనను వెంటిలేటర్పై పెట్టి చికిత్సలు అందిస్తున్నారు. ఇటు మృతిచెందిన పెద్ద కుమారుడికి దహన సంస్కారాలు నిర్వహించలేక.. చిన్న కుమారుడిని ఎలా బతికించుకోవాలో తెలియక గుండెలవిసేలా రోదిస్తున్నాడు. బిడ్డా.. కానరాని లోకానికి పోతివా... పండుగొచ్చిందని కొత్త బట్టలు కూడా కుట్టిస్తిని బిడ్డా.. అవి మాసిపోకుండానే మట్టిలో కలిసిపోతివా.. నీ దగ్గర నేను ఉన్నా... తమ్ముడి దగ్గర అయ్య ఉన్నాడు. ఏం చేయాలి బిడ్డా.. దేవుడా మమ్మల్లి ఇంత కష్టంలో ఎందుకు నెట్టావు. ఆలన పాలన తెలియని బిడ్డలను ఆగం చేస్తివి. నా కొడుకును పొట్టనపెట్టుకుంటివి అంటూ వినయ్, వినోద్ తల్లి జయమ్మ విలపించడం అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. అయ్యా.. నా బిడ్డను కాపాడండి... మాకు ఆరోగ్య శ్రీ కూడా లేదు. నా పెద్ద కొడుకును డబ్బులేకనే పోగొట్టుకున్నా. నా చిన్న కొడుకు వినోద్కు కూడా జ్వరం రావడంతో హన్మకొండలో చికిత్స చేయిస్తున్నా. చేతిలో చిల్లిగవ్వలేదు. ఆడ ఈడ అప్పులు చేసి తెచ్చుకున్న డబ్బులు అయిపోయాయి. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. నా బిడ్డకు ప్రాణభిక్ష పెట్టండి. డబ్బులుంటనే నా కొడుకు బతుకుతాడు. తెలిసిన వారికల్లా ఫోన్ చేసి అడుగుతున్నా. నా కొడుకును కాపాడాలని. – పోతరాజు, వినోద్ తండ్రి -
ఈ బంధం.. ఎందరికో ఆదర్శం
పేదరికంతో తాను చదువుకోలేక పోయాననే బాధను దిగమింగుకుని.. ఓ శిష్యున్ని తన కష్టార్జితంతో ఉన్నత శిఖరాలకు చేర్చిన ఓ గురువు జీవత గాథ ఇది. నా శిష్యుడిని గొప్ప శాస్త్రవేత్తను చేయాలనే ఆ గురువు తపన.. గురువు లక్ష్యానికి అనుగుణంగా శిష్యుడి కష్టం.. వెరసి ఈ అనుబంధం ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ గురు శిష్యుల బంధంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.... కష్టాల కడలిని జయించి.. జనగామ : వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలం ఆశాలపల్లి చెందిన నాసం రాజయ్య, సరోజని దంపతుల కుమారుడు నాసం రమేష్ 7వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలోనే చదివాడు. పేదరికంలో పుట్టిన ఆ బిడ్డకు మంచి విద్యను అందించాలనే తపనతో తల్లిదండ్రులు గీతాంజలి ఆశ్రమ పాఠశాలలో 8వ తరగతిలో చేర్పించారు. కూలీ పని చేస్తూ కొడుకును చదివించుకున్నారు. చదువుకోవాలనే తపన ఉన్నా... ఆర్థికంగా వెనకబడి.. తల్లిదండ్రులతో కలిసి పనికి వెళ్లేవాడు. పని చేస్తూనే పదో తరగతి పూర్తి చేశాడు. ఈ సమయంలోనే కొంతమంది స్నేహితులు, గురువులు కొంతం రవీందర్, బొల్లెబోయిన. కిషోర్, బండి. శ్రీనివాస్, వంగ రవీందర్.. రమేష్ను వెన్నుతట్టి ముందుకు నడిపించారు. గీతాంజలి స్కూల్లోనే పీఈటీగా(ప్రైవేటు) పోస్టింగ్ ఇప్పించారు. విద్యార్థులకు శిక్షణ ఇస్తూనే... రమేష్ పోలీసు జాబ్ కోసం అహోరాత్రులు కష్టపడి చదివాడు. రెండున్నరేళ్ల పాటు స్కూల్లోనే పని చేస్తూ... 2004లో సీఆర్పీఎఫ్ జవాన్గా ఎంపికయ్యాడు. శిష్యుడికి చేయూత.. గీతాంజలి స్కూల్లో నాసం రమేష్ పని చేస్తున్న సమయంలో సంగెం మండలం గవిచర్ల గ్రామానికి చెందిన బుట్టి రమేష్ చదువుకునే వాడు. బుట్టి రమేష్కు ఆరేళ్ల వయస్సు ఉన్నప్పుడే తన తండ్రి గుండె పోటుతో చనిపోయాడు. అప్పటి నుంచి తల్లి మల్లికాంబ కూలీ పని చేస్తూ.. కొడుకును చదివించింది. కుటుంబ పోషణ భారమవడంతో.. కుమారుడిని ఏడో తరగతిలోనే చదువు మాన్పించే ప్రయత్నం చేసింది. దీంతో అదే పాఠశాలలో పీఈటీగా పని చేస్తున్న గురువు నాసం రమేష్ను శిష్యుడు బి.రమేష్ (విద్యార్థి) కలిసి.. తన బాధను చెప్పకున్నాడు. అప్పటి నుంచి ఆ విద్యార్థిని నాసం రమేష్ తన సొంతఖర్చులతో బాగా చదివించాడు. తాను చేరలేని లక్ష్యాన్ని శిష్యుడైనా చేరుకోవాలనే లక్ష్యంతో ప్రోత్సహించాడు. బుట్టి రమేష్ఇంటర్ పూర్తి చేసిన తర్వాత ఏపీలోని కర్నూల్ ఏపీఆర్జేసీ ఎంట్రన్స్లో జీవరసాయన శాస్త్రంలో ఉస్మానియా రీజియన్లోనే మొదటి ర్యాంకు సాధించాడు. ఆ తర్వాత హైదరాబాద్ యూనివర్సిటీలో బయోకెమిస్ట్రీలో అడ్మిషన్ లభించింది. ఒక్కో మెట్టు ఎక్కుతూ.. శిష్యుడు రమేష్ పూణేలోని ‘నేషనల్ సెంటర్ ఫర్ సెల్ సైన్స్’ గేట్లో 129 ఆల్ ఇండియా ర్యాంక్తో పాటు ఐసీఎంఆర్, జేఆర్ఎఫ్ సాధించి.. తనపై గురువు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఇందులోనే రమేష్కు క్యాన్సర్పై రీసెర్చ్ చేయడానికి అవకాశం రావడంతో.. వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. సైనికుడిగా నేను, శాస్త్ర వేత్తగా నా శిష్యుడు.. భారతమాత రుణం తీర్చుకోవాలి. మా మనసులు వేరైనా.. ఆలోచన, లక్ష్యం, కష్టం, బాధ్యత మాత్రం ఒక్కటిగా పంచుకున్నాం. నేను నెరవేర్చలేకపోయిన ఆశయాన్ని మా శిష్యుడు సాధిస్తున్నాడు. ఈ ప్రపంచంలో తల్లిదండ్రుల తర్వాత.. శిష్యుడికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. మా పదహారేళ్ల ప్రయాణంలో చాలా సమస్యలు ఎదుర్కొన్నాం. వాటిని ఇష్టంగా స్వీకరిస్తూ.. ముందుకు వెళ్లాం. నా శిష్యుడిని గొప్ప శాస్త్ర వేత్తగా తయారుచేసి, జీవశాస్త్రంలో నోబెట్ బహుమతి సాధించేలా చేయాలన్నదే నా లక్ష్యం. – నాసం రమేష్, గురువు, సీఆర్పీఎఫ్ జవాన్ రమేష్సార్ మార్గదర్శకత్వమే నాకు బలంతల్లి బడికి వద్దురా బిడ్డా అన్న సమయంలో రమేష్ సార్ కనిపించి వెన్నుతట్టి ప్రోత్సహించారు. ఆ రోజును నేను మరచిపోలేను. రమేష్ సర్ క్రమశిక్షణకు మారుపేరుగా ఉండేవారు. ఒక వ్యక్తి జీవితంలో పైకి రావడానికి కావాల్సినవి పట్టుదల, మార్గదర్శకత్వం. నాకు పట్టుదల ఉంది, రమేష్ సార్ నాకు మార్గదర్శనం చేశారు. అదే నా బలమైంది. సాధారణ విద్యార్థిని అయినా.. నా గురువు గొప్పమనిషిగా నన్ను తీర్చి దిద్దడానికి ప్రయత్నాలు కొనసాగించారు. జీవితంలో వైఫలాలు ఉన్నా.. తనకు మాత్రం ఏ లోటు చేయలేదు. కుటంబ సభ్యుడిగా ఆరాధించారు. నా బంధువులు సహాయం చేసే స్థితిలో ఉన్నప్పటికీ ఎవరూ కూడా అండగా నిలబడలేదు. తన ప్రతి విజయం వెనక సార్ ప్రోత్సాహం కనిపిస్తుంది. గురువు అనే వ్యక్తి తనకు ఉన్న లక్ష్యాలను నెరవేర్చుకోలేకపోయినా.. ఆ లక్ష్యాలను చేరుకునేలా గొప్ప విద్యార్థులను తయారు చేయగలరని నిరూపించాడు మా రమేష్ సార్. – బుట్టి రమేష్, శిష్యుడు -
వయసు చిన్న.. బాధ్యత మిన్న
మల్కన్గిరి : పాఠశాలకు వెళ్లి చదువుకోవాల్సిన వయసుఆ బాలికది. తోటి పిల్లలతో చెంగు చెంగున గెంతుతూ ఆటలాడుకోవాల్సిన పసిప్రాయం ఆమెది. అయితే ఎవ్వరూ దిక్కు లేని ఇంటికి తానే అన్నీ అయి బాధ్యతలు మోస్తూ కుటుంబాన్ని నడిపిస్తోంది.జిల్లాలోని మల్కన్గిరి సమితి బోయిళపరి గ్రామానికి చెందిన బాలిక జానకీ దురువ(12) ఇంటి పెద్దై బరువు బాధ్యతలు మోస్తోంది. వివరాలిలా ఉన్నాయి.. అదే గ్రామానికి చెందిన సోంబారీ దురువ(83) సామారీ దురువ అనే స్వాతంత్య్ర సమరయోధుడి భార్య. 1940వ సంవత్సరంలో స్వాతంత్య్ర సమరయోధుడు సహిద్ లక్ష్మణ్నాయక్తో పాటు సామారీ దురువ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నాడు. 1942లో మల్కన్గిరి జిల్లా మత్తిలి బ్రిటిష్ పోలీస్స్టేషన్పై చేసిన దాడిలో సామారీ దురువ తీవ్ర గాయాలపాలయ్యాడు. 1942 నుంచి 1944 వరకు సహద్ లక్ష్మణ్నాయక్తో పాటు బరంపురం జైల్లో ఉండి వచ్చాడు. అనంతరం గిరిజన పోరాటయోధుడు అల్లూరి సీతారామరాజుతో పాటు ఎన్నో ఉద్యమాలు, పోరాటాల్లో పాల్గొన్నాడు. చివరికి స్వాతంత్య్రం వచ్చిన 1947 తర్వాత కొంత కాలానికి ప్రభుత్వం స్వాతంత్య్ర సమరమోధులకు పింఛన్లు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో సామారీ దురువకు కూడా పింఛన్ వచ్చేది. దీంతో కుటుంబాన్ని పోషించుకునేవాడు. సామారీ దురువకు ఇద్దరు సంతానం. ఒక ఆడపిల్ల, ఒక మగపిల్లవాడు. కొడుకు పక్షవాతంతో బాధపడుతూ మంచానికే పరిమితమయ్యాడు. కానీ కూతురికి పెళ్లి చేశాడు. ఆమెకు పుట్టిన బిడ్డ జానకీ దురువ. సామారీ దురువకు 2010వ సంవత్సరానికి రూ.3 వేలు పింఛన్ వచ్చేది. అనారోగ్య కారణాలతో సామారీ దురువ 2010లో చనిపోయాడు. ఢిల్లీ వరకు వెళ్లినా.. తర్వాత సంవత్సరానికే కూతురు, అల్లుడు కూడా చనిపోయారు. వారి బిడ్డయైన జానకీ దురువను అమ్మమ్మ సాంబారీ దురువ పెంచి, పెద్ద చేసింది. ఇప్పుడు ఆమె వృద్ధాప్య దశకు చేరుకోవడంతో ఏ పనీ చేయలేకపోతుండడంతో ఇంటికే పరిమితమయింది. ఇప్పుడు సాంబారీ దురువకు వృద్ధాప్య పింఛన్ రూ.300 మాత్రమే వస్తోంది. తన భర్తకు వచ్చే స్వాతంత్య్ర సమరయోధుల పింఛన్ తనకు ఇప్పించాలని కోరుతూ ఎన్నో ప్రయత్నాలు చేసి ఆఖరికి ఢిల్లీ వరకు వెళ్లినా ఫలితం లేకపోయింది. ఈ పరిస్థితుల్లో మనుమరాలు జానకీ దురువ కూలీ నాలీ చేస్తూ అమ్మమ్మ, మేనమామను పోషిస్తోంది. ఈ కుటుంబ పరిస్థితులను చూస్తున్న గ్రామస్తులు దిక్కు లేని ఈ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. -
పేదింట డాక్టర్..!
కొణిజర్ల : ఆ విద్యార్థి పేరు సాదిక్. తండ్రి ఓ సామాన్య ఆర్ఎంపీ వైద్యుడు. అష్టకష్టాలు పడి పిల్లలను చదివించాడు. తండ్రిలానే తానూ వైద్యుడినై నిరుపేదలకు సేవ చేయాలని చిన్నతనంలోనే అనుకున్నాడు. దానిని నిజం చేసుకోబోతున్నాడు. ఆ ప్రయత్నంలో మొదటి మెట్టు ఎక్కేశాడు. నీట్ పరీక్షలో మంచి ర్యాంక్ సాధించాడు. మొదటి ప్రయత్నంలోనే ఎంబీబీఎస్ సీటు సాధించాడు. కొణిజర్లకు చెందిన షేక్ సలీమ్, ఫాతిమా దంపతుల కుమారుడు షేక్ సాదిక్. ఈ ఏడాది నీట్ ఫలితాలలో ఆలిండియా స్థాయిలో 11,889వ ర్యాంక్ సాధించాడు. హైదరాబాద్లోని దక్కన్ మెడికల్ కళాశాలలో సీటు పొందాడు. ఇతడు చిన్నప్పటి నుంచి చదువులో చురుగ్గా ఉండేవాడు. 5వ తరగతి వరకు గోర్కి పబ్లిక్ స్కూల్లో, ఖమ్మంలోని మరో ప్రయివేట్ స్కూల్లో పదోతరగతి వరకు చదివాడు. పదోతరగతిలో 10 జీపిఏ సాధించాడు. ఖమ్మంలోని ప్రయివేట్ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివాడు. 979 మార్కులు సాధించాడు. టీఎస్ ఎంసెట్లో 1089వ, ఏపీ ఎంసెట్లో 3850వ ర్యాంక్ పొందాడు. నీట్లో ఆలిండియా కేటగిరీలో 11,889వ ర్యాంక్, లోకల్లో 1363వ ర్యాంక్ సాధించాడు. మొదటి ప్రయత్నంలోనే హైదరాబాద్లోని దక్కన్ మెడికల్ కళాశాలలో సీటు లభించింది. నీట్ ప్రవేశపెట్టిన తర్వాత ఎటువంటి లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకోలేదు. తమ బిడ్డడి విజయంతో ఆ తల్లిదండ్రులు సంతోషంతో పొంగిపోతున్నారు. న్యూరాలజిస్ట్ కావాలనుంది ఎంబీబీఎస్ పూర్తయిన తర్వాత న్యూరాలజీ స్పెషలైజేషన్తో పీజీ చేస్తానని అంటున్నాడు సాదిక్. గ్రామీణ ప్రాంత ప్రజలకు సేవ చేయాలన్నదే తన లక్ష్యమని అన్నాడు. -
మమ్మల్ని ఆదుకోరూ..
సుజాతనగర్: కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించాడు... ఇద్దరు కూతుళ్ల పెళ్లిళ్లు కూడా చేశాడు.. కాని విధి వక్రీకరించి ప్రస్తుతం అనారోగ్యంతో మంచానపడ్డాడు. కుటుంబ బాధ్యత నెత్తికెత్తుకున్న మరో కూతురు విద్యుదాఘాతంతో మృతి చెందింది. కూతురిని కాపాడబోయి తల్లి కూడా విద్యుదాఘాతానికి గురైంది. దీంతో ఒక చేయి పనిచేయడం లేదు. కుటుంబ పోషణే భారమైన తరుణంలో ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారీ నిరుపేద దంపతులు సుజాతనగర్ మండలం సింగభూపాలేనికి చెందిన ఉగ్గం వెంకటేశ్వర్లు, భార్య సత్యవతికి ముగ్గురు కూతుళ్లు. కూలీనాలి చేసుకోవడంతోపాటు ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. ఏడాది క్రితం అనారోగ్యం పాలయ్యాడు. నిరుపేద కుటుంబానికి చెందిన వెంకటేశ్వర్లు అప్పోసప్పో చేసి వైద్య పరీక్షలు చేయించుకున్నాడు. ఒక కిడ్నీ పాడైందని వైద్యులు చెప్పడంతో ఆర్థికస్థోమత అంతంతమాత్రంగా ఉన్న వెంకటేశ్వర్లు మెరుగైన వైద్యం చేయించుకోలేకపోయాడు. దీంతో రెండో కిడ్నీసైతం చెడిపోయింది. ప్రస్తుతం వెంకటేశ్వర్లు మంచానికే పరిమితమై తన పనులు కూడా తాను చేసుకోలేని పరిస్థితి నెలకొంది. ఒకరి ఊతం లేనిదే మంచం పైనుంచి లెగిసే పరిస్థితి లేదు. తల్లిదండ్రుల బాధ చూడలేని పెద్దకూతురు అరుణ ఇంటి బాధ్యతను స్వీకరించి తాను కూడా కూలీకి వెళ్తూ, కాయగూరలు అమ్ముతూ బతుకుబండిని నెట్టుకొస్తుండేది. విధి వక్రించి ఇంటి పనులు చేసుకుంటున్న తరుణంలో అరుణ ఇంట్లోనే విద్యుదాఘాతానికి గురైంది. కూతురిని రక్షించే క్రమంలో తల్లి సత్యవతి కూడా విద్యుత్ షాక్కు గురైంది. ఈ ప్రమాదంలో అరుణ అక్కడికక్కడే మరణించగా, సత్యవతికి కుడిచేయి సరిగ్గా పనిచేయని స్థితికి చేరుకోవడంతోపాటు కాలి వేళ్లు కూడా తెగిపోయాయి. సంవత్సర కాలం నుంచి జీవనం సాగించడానికి ఆ దంపతులిద్దరూ పడే వేదన వర్ణణాతీతం. పూట గడవడమే కష్టంగా ఉన్న దంపతులకు అనారోగ్యం మరింత కుంగదీస్తోంది. కూలీపనులు సైతం చేసుకునే పరిస్థితిలో లేని సత్యవతి చుట్టుపక్కలవారి సాయంతో రోజులు నెట్టుకొస్తోంది. మెరుగైన వైద్యానికి డబ్బులు లేకపోవడంతో భర్త ఆరోగ్య పరిస్థితి రోజురోజుకీ క్షీణిస్తుండటంతో కన్నీటిపర్యంతమవుతోంది. ఉండటానికి కనీసం సరైన ఇళ్లు కూడా లేక పూరిగుడిసెలోనే జీవనం సాగిస్తున్నారు. తన భర్తకు మెరుగైన వైద్యం అందితే కుటుంబ పోషణ బాగుంటుందని భార్య సత్యవతి ఆవేదన వ్యక్తం చేస్తుంది. దాతలు ఉంటే సాయం చేయాలంటూ ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తోంది. -
సార్లు...సీఎంను కలువాలే..
హూజూరాబాద్ : సార్లు.. నా భర్త పులి రాములుకు 90 ఏళ్లు ఉంటాయి. పదేళ్లుగా మంచానికే పరిమితమయ్యాడు. సాకడం కష్టమైతంది. సీఎం సారు వస్తున్నాడని మా చుట్టు పక్కన వారు చెప్పిండ్రు. తోపుడు బండి మీద మా భర్తను జమ్మికుంట నుంచి తీసుకువచ్చిన. సారును కలువాలే అంటూ రాములు భార్య లచ్చమ్మ అధికారులను వేడుకోవడం పలువురిని కలిచివేచింది. నడవలేని స్థితిలో ఉన్న అతను భార్య సాయంతో తోప్పుడు బండి మీద ఎక్కించుకొని నాలుగు కిలోమీటర్ల దూరం తోసుకువచ్చింది. భర్త పరిస్థితి సీఎంకు చెప్పుకుంటానని అధికారుల కాళ్ల ఏళ్ల పడింది. మరోక్క ప్రక్క ఎండ విపరీతంగా ఉండటంతో రాములు తట్టుకోలేకపోయాడు. అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో మళ్లీ ఎండలో తోప్పుడు బండి మీద భర్త తీసుకోని జమ్మికుంట వరకు తోసుకెళ్లింది. సభకు వచ్చిన జనం భార్య, భర్తల మలి దశ అనుబంధంపై చర్చించుకోవడం గమనార్హం. -
గుడిసె నీడన బతుకు..గుండె నిండ బాధ
ఆ కుటుంబం రెక్కల కష్టాన్నే నమ్ముకుంది. కూలీ చేసి జీవనం సాగిస్తోంది. ఉన్ననాడు తింటూ.. కూలీ దొరక్కన్నాడు పస్తులున్నారు. అయినా వారెప్పుడూ ఆధైర్యపడలేదు. ఎప్పుడో ఒకప్పుడు మనకూ మంచిరోజులు వస్తాయనే ఆశతో ఆనందంగా జీవనం సాగించారు. గుడిసె తప్ప ఇంకేమీ ఆస్తుల్లేని ఆఇంట్లోకి అనారోగ్యం చొరబడింది. రెండు కిడ్నీలు పాడై పోవడంతో కుటుంబ పెద్ద మంచానికే పరిమితమయ్యాడు. కనీసం ఆరోగ్య శ్రీ ద్వారా వైద్యం పొందుదామన్నా ఇప్పటికీ వారికి రేషన్ కార్డే లేదు. ఇలా కష్టాలన్నీ ఒక దాని వెంట ఒకటి తరుముకొస్తుంటే చికిత్స కోసం రూ. 8 లక్షలు అప్పు చేశారు. చెన్నూర్, మంచి ర్యాల, వరంగల్, హైదరాబాద్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించారు. అయినా వ్యాధి నయం కాకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. ఆ ఇంటి దీపం కూలీ పనులకెళ్లి కుటుంబాన్ని సాకుతోంది. మనసున్న మా రాజులు చేయూతనందిస్తారని ఆ కుటుంబం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తోంది. చెన్నూర్రూరల్: భార్య, కుమారుడితో సరదాగా గడిపే ఆ ఇంటి పెద్దను కిడ్నీల వ్యాధి కుంగదీసింది. ఆ ఇంటి పెద్ద కూలీ పనులు చేసి భార్య పిల్లలను పోషించుకునేవాడు. కానీ ప్రస్తుతం ఏ పని చేయలేక భార్య కూలీకి వెళ్తేగాని పూట గడవని పరిస్థితి నెలకొంది. మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలంలోని దుగ్నెపల్లి పంచాయతీ పరిధిలోని వెంకంపేట గ్రామానికి చెందిన జాడి పోశయ్యది నిరుపేద కుటుంబం. ఉండేందుకు సరైన ఇళ్లు కూడా లేదు. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్ధితి. పోశయ్య తండ్రి మల్లయ్య చిన్నతనంలోనే మృతి చెందాడు. తల్లి వీరక్క కూలీ పనులు చేసి పెంచి పెద్ద చేసింది. పోశయ్యకు భార్య ఎల్లక్క, మూడేళ్ల బాబు మల్లిఖార్జున్ ఉన్నాడు. కుటుంబాన్ని కుదిపేసిన కిడ్నీ వ్యాధి.. రెండేళ్ల క్రితం పోశయ్య శరీరం వాపు రావడంతో మంచిర్యాల ప్రభుత్వాస్పత్రికి వెళ్లాడు. అక్కడి వైద్యులు కరీంనగర్కు వెళ్లమని సూచించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం హైదరాబాద్కు వెళ్లాలని సూచించడంతో హైదరాబాద్లోని యశోద ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడి వైద్యులు పరీక్షలు చేసి రెండు కిడ్నీలు చెడిపోయాయని నిర్ధారించి చెప్పారు. పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో అప్పటి నుంచి నెలకు ఒక్కసారి హైదరాబాద్కు వెళ్లి పరీక్షలు చేయించుకుని డయాలసిస్ చేయించుకుంటున్నాడు. భార్య ఎల్లక్క కూలీ పనులు చేసి కుటుంబాన్ని పోషిస్తోంది. ఇప్పటి వరకు అందిన చోటల్లా సుమారు రూ.8 లక్షల వరకు అప్పులు చేసి మరీ వైద్యానికి ఖర్చు చేశారు. ఒక కిడ్నీ మారిస్తే సుమారు రూ.30 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పడంతో గుడిసె తప్ప వేరే ఆస్తి లేని తాము అన్ని డబ్బులు ఎక్కడి నుంచి తీసుకు రావాలని పోశయ్య భార్య ఎల్లక్క కన్నీరుమున్నీరవుతోంది. ప్రతి నెలా హైదరాబాద్కు డయాలసిస్కు వెళ్లిన ప్పుడల్లా సుమారు రూ.6వేల వరకు ఖర్చు అవుతోందని పోశయ్య ఆందోళన చెందుతున్నాడు. కనీసం తమకు రేషన్ కార్డు కూడా లేదని, ఆరోగ్యశ్రీ కార్డు కూడా లేదని వారు ఆందోళన చెందుతున్నారు. ఆపన్న హస్తం కోసం ఎదురు చూపులు.. వైద్యానికి ఇప్పటికే అప్పులు చేసి రూ.8 లక్షల వరకు ఖర్చు చేశామని ఇప్పుడు కిడ్నీ అమర్చేందుకు రూ.30 లక్షలు ఎక్కడి నుంచి తీసుకు వచ్చేదని భార్య ఎల్లక్క కన్నీరు మున్నీరవుతోంది. ప్రభుత్వం ఆదుకోవాలని, దాతలు తన భర్త వైద్యానికి ఆపన్న హస్తం అందించి ఆదుకోవాలని వారు కోరుతున్నారు. అలాగే రేషన్కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు ఇప్పించాలని వారు వేడుకుంటున్నారు. నా భర్తను కాపాడండి.. నాభర్త ఆరోగ్యం బాగా లేదు. కుటుంబం నడుసుడు కష్టమైతాంది. నేను కూలీ పనికి పోతాన. వచ్చిన డబ్బులతో ప్రతినెలా ఆస్పత్రికి తీసుకపోతాన. మాకు ఆస్తి కూడా లేదు. నా భర్త ఆరోగ్యం మంచిగ కావాలని తిరగని హాస్పటల్ లేదు. ఎన్నో చోట్ల అప్పుజేసినం. పెద్దసార్లు, గవర్న మెంటు ఆదుకోవాలి. నా భర్తకు వైద్యం అందించేందుకుసాయం అందించాలి.– జాడి ఎల్లక్క, వెంకంపేట -
కన్నీరు చెప్పే నిజం
-
ఆపన్నహస్తం అందించరూ
జగిత్యాలజోన్: వారిది నిరుపేద కుటుంబం. రెక్కాడితేకాని డొక్క నిండని దుస్థితి. అయినా విధి వారిని చిన్నచూపు చూసింది. ‘జీబీసీ సిండ్రోమ్’ అనే వ్యాధి రోడ్డుపాలు చేసింది. కూలీచేసిన పోగు చేసిన డబ్బులను కొడుకుకు సోకిన వ్యాధి నిర్దారించుకోవడానికే ఖర్చయ్యాయి. ప్రస్తుతం చేతిలో చిల్లిగవ్వ లేక వ్యాధిని నయం చేసుకోడానికి ఆ కుటుంబం దయార్థహృదయుల వైపు చూస్తోంది. తన కొడుకుకు సోకిన వ్యాధిని గురించి తల్లిదండ్రులు నలువాల జనార్దన్, లక్ష్మి కన్నీళ్లతో వివరించారు. జగిత్యాల మండలం లక్ష్మిపూర్కు చెందిన దంప తులు కూలీపని చేస్తుంటారు. వీరికి కొడుకు వేణు(20) ఉన్నాడు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదివాడు. తరువాత చదివి ంచే స్థోమత లేకపోయినా, చదువుకుంటే ఉద్యో గం వస్తుందన్న కొడుకు మాటలకు అతడిని హైదరాబాద్లోని ఐటీఐ కళాశాలలో చేర్పిం చారు. రోజూవారిగా కళాశాలకు వెళ్లి వస్తుండగా ఓ రోజు కిందపడిపోయాడు. తోటి విద్యార్థులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి జీబీసీ సిండ్రోమ్ అనే వ్యాధి సోకిందని తెలిపారు. దీంతో కొన్నిరోజులకు నరాలు పనిచేయకుండా అయ్యాయి. నడిచే ఓపికలేక మంచానికే పరిమితం అయ్యాడు. ఎదిగొచ్చిన కొడుకును బాగు చేయించుకోవాలని తల్లిదండ్రులు అప్పుచేసి వైద్యం చేయించడం మొదలు పెట్టారు. అయినా ఫలితం లేకపోయింది. కొంతకాలం వైద్యం అందిస్తే వ్యాధినయం అవుతుందని చెప్పడంతో జగిత్యాలలోని ఓ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వైద్యం ఖర్చులకు చేతిలో చిల్లిగవ్వలేక ఆపన్నహస్తాలకోసం ఎదురుచూస్తున్నారు. -
పేదరికం వెక్కిరిస్తున్నా.. దృష్టిలోపం వేధిస్తున్నా..
సాక్షి, గుంటూరు: ఆ యువకుడికి చదువు లేదు.. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి.. కంటి చూపు కూడా అంతంత మాత్రమే.. ఆదరించేవారు.. ప్రోత్సహించేవారు లేరు. కానీ అపార ప్రతిభ, పట్టుదలతో చదరంగం (చెస్)లో అసమాన విజయాలు సాధిస్తున్నాడు. అడుగడుగునా ప్రతిబంధకాలు ఎదురవుతున్నప్పటికీ ఆత్మవిశ్వాసంతో, ధైర్యంగా ముందుకు సాగుతున్నాడు. అతడే శాగం వెంకటరెడ్డి. 75 శాతం దృష్టి లోపంతో జన్మించినా.. గుంటూరు జిల్లా గురజాల మండలంలోని జంగమహేశ్వరపురం గ్రామానికి చెందిన పేద కూలీ శాగం నారాయణరెడ్డి కుమారుడైన వెంకటరెడ్డి 80 శాతం దృష్టి లోపంతో జన్మించాడు. వెంకటరెడ్డి ఓ ముఠా కూలీ. అతడు రాష్ట్రస్థాయి చదరంగం క్రీడాకారుడంటే ఎవరూ నమ్మలేరు. చిన్నతనంలోనే చదరంగంపై మక్కువ పెంచుకున్న వెంకటరెడ్డి ఆడేవారి వద్ద నిలబడి ఆటను చూస్తూ ఉండిపోయేవాడు. అలా క్రమేణా ఆట నేర్చుకున్నాడు. పేద కుటుంబం కావడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు కూలి పనులు చేస్తూ తల్లిదండ్రులకు సహాయపడుతున్నాడు. రాత్రి పూట గురజాలలోని వీఎంఏఎస్ క్లబ్లో చదరంగం సాధన చేస్తున్నాడు. గల్లీ స్థాయి నుంచి జాతీయ స్థాయికి.. గుంటూరు ఎల్వీఆర్ క్లబ్లో 2005, నవంబర్లో జరిగిన రాష్ట్ర స్థాయి చదరంగం పోటీల్లో నాలుగో స్థానంలో నిలిచి నిర్వాహకులను అబ్బురపరిచాడు. చదరంగంలో ప్రావీణ్యం ఉన్నవారిని సైతం ఓడించి పలువురి మన్ననలు పొందాడు. 2012లో వరంగల్లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో మూడో స్థానంలో, 2013 జూలైలో చెన్నైలో జరిగిన జాతీయస్థాయి చెస్ టోర్నమెంట్లో 12వ స్థానంలో నిలిచాడు. 2014 నవంబర్లో కన్యాకుమారిలో జరిగిన సౌత్జోన్ అంధ చదరంగ క్రీడాకారుల సెలక్షన్స్లో రెండో బహుమతి సాధించి నేషనల్ –బి జట్టుకు ఎంపికయ్యాడు. 2017 నవంబర్లో జరిగిన సౌత్జోన్ చాంపియన్షిప్ (విజువల్లీ చాలెంజ్డ్)లో ప్రథమ స్థానం దక్కించుకున్నాడు. 2017 డిసెంబర్లో హరియాణాలో జరిగిన నేషనల్–బి చాంపియన్షిప్ (విజువల్లీ చాలెంజ్డ్) పోటీల్లో 7వ స్థానంలో నిలిచాడు. త్వరలో బల్గేరియాలో జరిగే వరల్డ్ బ్లైండ్ చెస్ చాంపియన్షిప్ పోటీలకు ఎంపికై విజయమే లక్ష్యంగా కృషి చేస్తున్నాడు. కాగా, సౌత్జోన్ పరిధిలోని ఐదు రాష్ట్రాల్లో వెంకటరెడ్డి టాప్ ర్యాంక్లో ఉండడం విశేషం. మట్టిలో మాణిక్యం గ్రామీణ నిరుపేద కుటుంబంలో జన్మించి చదరంగంలో అసమాన ప్రతిభాపాటవాలు చూపుతున్న వెంకటరెడ్డి మట్టిలో మాణిక్యమని అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. కనీసం కోచ్ కూడా లేకుండా, దృష్టి లోపాన్ని సైతం అధిగమించి విజయాలు సాధిస్తుండటం చూసి చదరంగ శిక్షకులు సైతం ఆశ్చర్యపోతున్నారు. చెస్లో ఉన్నత శిఖరాలకు చేరుకుని దేశానికి మంచి పేరు తీసుకొస్తానని వెంకటరెడ్డి చెబుతున్నాడు. ఇతర రాష్ట్రాల్లో చెస్ పోటీలకు ఆహ్వానం అందుతున్నా పేదరికం కారణంగా వెళ్లలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. రాష్ట్ర చెస్ అకాడమీ, ప్రభుత్వం తనను ఆదుకోవాలని కోరుతున్నాడు. ఇలాంటి ప్రతిభావంతులను గుర్తించి ప్రభుత్వం వారికి ఉచితంగా శిక్షణ ఇప్పించి ప్రోత్సాహాన్నందించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని క్రీడా ప్రేమికులు అభిప్రాయపడుతున్నారు. చెన్నైలో జరిగిన సౌత్జోన్ చాంపియన్షిప్ (విజువల్లీ చాలెంజ్డ్)లో మొదటి స్థానంలో నిలిచి మొమెంటో అందుకుంటున్న వెంకటరెడ్డి -
‘బతుకు’ పోరు
అనంపురం ఎడ్యుకేషన్: డెబ్బయి వసంతాల స్వతంత్ర భారతంలో పేదరిక నిర్మూలన కలగానే మిగిలిపోయింది. నేటికీ ఒక్కపూట కడుపు నిండా భోజనం చేయని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. బతుకు పోరులో ఎన్నో కష్టనష్టాలను వారు చవిచూస్తున్నారు. ఉపాధి అవకాశాలు మెరుగు పరచాల్సిన ప్రభుత్వాలు ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. విద్య, వైద్య వారికి అందని ద్రాక్షగా మారింది. కనీసం ప్రభుత్వ సంక్షేమ పథకాలు సైతం వారి దరి చేరడం లేదు. ఇలాంటి ఓ కుటుంబంలోని ముగ్గురు.. బుధవారం అనంతపురం నగరంలోని డ్రెయినేజీల్లో ఇనుప ముక్కలు ఏరుకుంటూ ఇలా కనిపించారు. తమకు లభ్యమైన ఇనుప ముక్కలను గుజరీలో విక్రయించి, వచ్చిన కొద్దిపాటి డబ్బుతో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. -
మాతృదేవోభవ
- మంచాన పడిన అమ్మకు కుమారుడి సపర్యలు - స్ఫూర్తిగా నిలిచిన పేద కుటుంబం కర్నూలు (వైఎస్ఆర్ సర్కిల్): ఆధునిక జీవన శైలి..మారుతున్న నాగరిక ప్రపంచంలో తల్లిదండ్రులను పోషించలేక వసతి గృహాల్లోనూ, ఆశ్రమాల్లోనూ వదిలేస్తున్న ఘటనలను నిత్యం చూస్తూనే ఉన్నాం. అయితే ఓ నిరుపేద.. పదేళ్లుగా మంచాన పడిన తల్లికి సపర్యలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. కర్నూలు నగర శివారులోని జొహరాపురంలో నివాసముంటున్న చాట్ల ఓబులేసు, భాగ్యమ్మ దంపతులకు గత 35 ఏళ్ల క్రితం వివాహమైంది. రోజుకు రూ.250 కూలితో జీవనం సాగించే ఓబులేసు తండ్రి నాగన్న పదేళ్ల క్రితం మృత్యువాత పడ్డారు. అప్పటి నుంచి తల్లి సుబ్బమ్మ మంచం పట్టింది. నడవలేని దీనస్థితికి చేరుకుంది. రోజు రోజుకు ఆరోగ్యం క్షీణించి సొంత పనులు కూడా చేసుకోలేని స్థితికి చేరుకుంది. ఈ స్థితిలో కుమారుడు.. అమ్మకు తోడుగా నిలిచాడు. ఆయన భార్య భాగ్యమ్మ సైతం సహకారం అందిస్తోంది. చీదరించుకోకుండా.. ముదిమిలో సుబ్బమ్మను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. ఆమె వైద్యం, తిండి, మందులు తదితర ఖర్చులకు కుమారుడు ఓబులేసు కూలి డబ్బులు సరిపోయేవి. ఈ నేపథ్యంలో తన పెద్దకుమారుడు నాగేశ్వరరావును పదో తరగతిలోనే చదువును మాన్పించారు. తండ్రి సూచనల మేరకు అతను కూడా కూలికి వెళ్తున్నాడు. ప్రతి రోజూ తనకు, తన కుమారుడికి వచ్చే దినసరి కూలి రూ. 500లలో తల్లి ఆరోగ్యం కోసం రూ.200 వ్యయం చేస్తున్నట్లు ఓబులేసు చెప్పారు. తన రెండో కుమారుడు రామాంజనేయులు..డీఎడ్ చదువుతున్నాడని, కుమార్తె భారతి.. ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతోందని చెప్పారు. అమ్మకు కష్టకలకుండా చూసుకోవడంలో ఉన్న తృప్తి ఎక్కడా దొరకదని ఓబులేసు తెలిపారు. -
దాతల సాయం కోసం ఎదురు చూపులు
-
కుటుంబాన్ని చిధ్రం చేసిన ప్రమాదం
ఆదుకోవాలని బాధితుల వేడుకోలు ముందుకొచ్చిన కార్పొరేటర్ గుండా ప్రకాశ్రావు వరంగల్ చౌరస్తా : రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబం వారిది. ఊరూరా తిరిగి ఉల్లిగడ్డలు అమ్ముకుంటూ జీవనం సాగించే ఆ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం చిధ్రం చేసింది. కుటుంబ పోషణ భారాన్ని మోసే తండ్రి రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా, తల్లి చావుబతుకుల నడుమ చికిత్స పొందుతుండగా, కుమారుడు కాలు విరిగి నడవలేని స్థితిలో ఉన్నాడు. వరంగల్లోని 26వ డివిజ¯ŒS బొందిలొల్లిగల్లీ్లకి చెందిన బట్టి జయసింగ్, లక్ష్మి దంపతులు రోజు జిల్లాలోని ఏదో ఒక సంతకు వెళ్లి ఉల్లిగడ్డలు అమ్ముకుంటూ వచ్చే సొమ్ము తో కాలం వెళ్లదీస్తున్నారు. అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. ఈ క్రమంలో ఉల్లిగడ్డలు విక్రయించి తిరిగొస్తుండగా నర్సింహులపేట మండలం దంతాలపల్లి వద్ద జరిగిన ఆటో ప్రమాదంలో జయసింగ్ అక్కడికక్కడే మృతిచెందాడు. అతడి భార్య లక్ష్మి తీవ్ర గాయాలపాలై ఎంజీఎం ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య చికిత్సపొందుతోంది. వారి కుమారుడు కార్తీక్ సింగ్ కాలు విరిగి నడువలేని స్థితిలో ఉన్నాడు. ఆర్థిక లేమితో కొట్టుమిట్టడుతున్న కుటుంబం తీవ్ర మానసిక వేదనను అనుభవిస్తూ ఆదుకునే వారికి కోసం చేతులు జోడించి వేడుకుంటుంది. ఆర్థిక సాయం అందించిన గుండా ప్రకాశ్రావు దుర్భర పరిస్థితిలో కాలు విరిగి నడవలేని స్థితిలో ఉన్న కార్తీక్ సింగ్ను గురువారం టీఆర్ఎస్ నాయకుడు, స్థానిక కార్పొరేటర్ గుండా ప్రకాశ్ రావు పరామర్శించి, ఆర్థిక సాయం అందజేశారు. తాత్కాలిక వైద్య ఖర్చుల కోసం రూ.6 వేల ఆర్థిక సాయం అందచేశారు. స్థానికులు, మహానగర ప్రజలు ఆ కుటుంబానికి తమ వంతు సాయం అందించాలని కార్పొరేటర్ ప్రకాశ్రావు విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట టీఆర్ఎస్ నాయకులు మబ్బు ప్రవీణ్, సకినాల శ్రీకాంత్, కానుగంటి రామారావు, కొలిపాక శ్రీనాథ్, కర్రె సుదర్శ¯ŒS, మూగ శ్రీను, లావణ్య పాల్గొన్నారు. -
ఆరేళ్లలో.. ఐదు
పేద కుటుంబాన్ని వెంటాడిన విధి విషజ్వరంతో కూలీ మృతి, చందాలతో దహన సంస్కారాలు పెళ్లైన 7 నెలలకే మృత్యు ఒడిలోకి రామచంద్రాపూర్లో విషాదం సిరిసిల్ల రూరల్: రోజంతా రెక్కలు ముక్కలు చేసుకుంటేగానీ ఐదేళ్లూ నోట్లోకి పోని కూలీ బతుకులు వారివి. నిత్యం పనికిపోయి ఏపూటకు ఆ పూటే బతుకులీడ్చేవారికి రోగమొస్తే ఎక్కడికని పోతారు? తడిసి మోపెడయ్యే బిల్లులకు భయపడి ఖరీదైన వైద్యం జోలికి వెళ్లకుండా.. ప్రాణాలమీదికొస్తున్నా నిస్సహాయంగా నిట్టూర్చాల్సిన దుస్థితి వారిది. విధి వంచించిన ఆ కుటుంబంలో ఆరేళ్లలో ఐదుగురు మృత్యువాత పడ్డారు. ఆ కుటుంబ వ్యథ తెలిస్తే అయ్యో పాపం అనని వారుండరు. సిరిసిల్ల మండలం రామచంద్రాపూర్లో జరిగిన సంఘటన మనసున్న ప్రతిమనిషినీ కదిలిస్తుంది. నిరుపేద దళిత కుటుంబానికి చెందిన మేడిపల్లి ప్రభాకర్(30) అనే కూలీ పెళ్లైన ఏడు నెలలకే విషజ్వరం సోకి మరణించాడు. వారం రోజులుగా విషజ్వరంతో బాధపడుతూ శుక్రవారం ఆస్పత్రిలో మృతి చెందాడు. ప్రభాకర్కు జనవరిలో లావణ్యతో పెళ్లైంది. లావణ్య ప్రస్తుతం గర్భవతి. జీవితంపై ఆమె కన్న కలలన్నీ కల్లలయ్యాయి. ఉన్నట్లుండి ప్రభాకర్కు జ్వరం సోకడంతో తగ్గుతుందని భావించి స్థానికంగానే వైద్యం చేయించుకున్నారు. ఎంతకూ తగ్గకపోవడంతో సిరిసిల్లలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లగా షుగర్ కూడా∙ఉన్నట్లు తేలింది. మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ తీసుకెళ్లాలని సూచించారు. వైద్యానికి డబ్బులు లేక సిరిసిల్లలో వైద్య చికిత్సలు చేయించుకుంటుండగా.. ప్రభాకర్ తీవ్ర అస్వస్థతకు గురై శుక్రవారం మరణించాడు. దీంతో రామచంద్రాపూర్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆరేళ్లలో ఐదు చావులు రామచంద్రాపూర్ గ్రామానికి చెందిన మేడిపల్లి నర్సయ్య–లీలావతి కుటుంబాన్ని విధి కాటేసింది. ఆరేళ్ల క్రితం నర్సయ్య అనారోగ్యంతో మరణించాడు. నర్సయ్య మరణించిన ఆరు నెలలకే పెద్ద కొడుకు సుదర్శన్ అనారోగ్యంతో మరణించాడు. ఇదే ఇంట్లో ఉంటున్న నర్సయ్య మనవడు, రెండేళ్ల చిన్నారి రోహి నాలుగేళ్ల క్రితం నీటి గుంతలో పడి మరణించాడు. కొన్నాళ్లకు పెద్ద మనవడు రమేశ్ (16) పసరికలు సోకి మరణించాడు. శుక్రవారం ప్రభాకర్ మరణంతో ఈ సంఖ్య ఐదుకు చేరింది. ఈ సంఘటనలను తలచుకుని గ్రామస్తులు కంటతడిపెట్టారు. ఒంటరిగా మిగిలిన తల్లి లీలావతి ఇంట్లో మగదిక్కు లేకుండా పోయిందని బోరున విలపించారు. తామేం పాపం చేశామంటూ రోధించడం అందరినీ కలచివేసింది. -
చిన్నారిని ఆదుకోరూ..
శామీర్పేట్: గొంతు, ఆహారవాహిక శస్ర్త చికిత్సకు ఆర్థిక సహాయం అందించి తమ కుమారుడు భగత్ను ఆదుకోవాలని శామీర్పేట్కు చెందిన ఓ పేద కుటుంబీకులు వేడుకున్నారు. బాధితుడి తల్లిదండ్రులు నవనీత, రమేష్లు ‘సాక్షి’కి వివరాలను వెల్లడించారు. శామీర్పేట్ మండల కేంద్రానికి చెందిన కనకాల నవనీత, రమేష్ దంపతులు నిరుపేదలు. రోజువారి కూలీతో జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. వీరి కుమారుడు కనకాల భగత్(5)గత సంవత్సరం డిసెంబర్ 25న రసాయన మందు ప్యాకెట్ కొరికాడు. దీంతో భగత్ గొంతు పూర్తిగా చెడిపోయింది. ఆపరేషన్ కోసం నగరంలోని వివిధ ఆస్పత్రులకు తిప్పిన తల్లిదండ్రులకు ఆర్థిక స్థోమత లేక పోవడంతో ఇంటి వద్దనే భగత్కు వైద్యుల సలహామేరకు పాల పాకెట్లతో సాకుతున్నారు. త్వరగా భగత్కు ఆపరేషన్ చేయించాలని వైద్యులు సూచించారు. ఆపరేషన్ చేయాలంటే రూ. సుమారు 6లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు తెలియజేసినట్లు తెలిపారు. పేద కుటుంబానికి చెందిన భగత్ తల్లిదండ్రులు తమ బిడ్డకు ఆపరేషన్ చేయించాలంటే ఎవరైనా ఆదుకోవాలని వేడుకుంటున్నారు. -
ఆర్థిక సాయం అందించండి
ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్న క్రీడాకారులు ఏటూరునాగారం : నిరుపేద కుటుంబంలో పుట్టిన క్రీడా కుసుమాలకు ఆర్థిక ఇబ్బం దులు ఎదురయ్యాయి. పల్లె నుంచి పొరు గు దేశంలో జరిగే ప్రతిష్టాత్మక పోటీలకు ఎంపికైనప్పటికీ అక్కడికి వెళ్లే స్తోమత లేక ఆందోళన చెందుతున్నారు. దాతలు చేయూతనిస్తే పోటీల్లో సత్తా చాటుతామంటున్నారు. మండల కేంద్రానికి చెందిన క్రికెట్ క్రీడాకారులు సయ్యద్ రియాజ్, ఎండి. ఖయ్యుం మహారాష్ట్రలోని ఔరంగబాద్లో ఈనెల 13 నుంచి 17 వరకు జరి గిన అండర్ –19 క్రికెట్ ఫస్ట్ యూత్ గేమ్స్ జాతీయ స్థాయి పోటీలలో తెలంగాణ జట్టు తర ఫున పాల్గొని ప్రతిభ కనబర్చారు. దీంతో నిర్వాహకులు వీరిని నేపాల్లో ఈ నెల 25 నుంచి ఆగస్టు 4 వరకు జరిగే సౌత్ ఏషియన్ క్రికెట్ పోటీలకు భాతర జట్టు తరపున ఎంపిక చేశారు. అయితే నిరుపేద కుటుంబాలకు చెందిన ఇద్దరికి నేపాల్ వెళ్లేందుకు ప్రయాణ, ఇతర ఖర్చులకు డబ్బు లేక మనోవేదనకు గురవుతున్నారు. ప్రభుత్వం, దాతలు ఆదుకుంటే పోటీల్లో పాల్గొని సత్తా చాటుతామంటున్నారు. సయ్యద్ రియాజ్కు సాయం చేసేవారు 8500178436, ఎండి. ఖయ్యుంకు సా యం చేసేవారు 9912613312 నంబ ర్లలో సంప్రదించాలని వారు కోరారు. -
సాయం కోసం ఎదురుచూపు
♦ కిడ్నీలు దెబ్బతిని మంచాన పడ్డ మెకానిక్ ♦ దయనీయ స్థితిలో దళిత కుటుంబం ♦ ప్రభుత్వ సాయం కోసం విన్నపాలు వర్గల్ : అతనిది నిరుపేద కుటుంబం. రేకుల షెడ్డే ఇల్లు. అతను మెకానిక్గా.. భార్య కూలి పనిచేస్తే తప్ప కుటుంబం గడవలేని పరిస్థితి. అయినా, పిల్లల్ని ప్రైవేటు స్కూళ్లో చదివిస్తున్నారు. ఇంతలో అతని ఆరోగ్యం దెబ్బతిన్నది. కిడ్నీలు పాడవడంతో డియాలసిస్ చేయించుకోవాల్సిన దుస్థితి. స్నేహితులు కొంతమేర సహాయం చేస్తున్నా.. ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఆదుకోవాలని ఆ కుటుంబం వేడుకుంటోంది. వర్గల్ మండలం పాములపర్తిలో దళిత కుటుంబానికి చెందిన చిగురుపల్లి శ్రీనివాస్(30) పదో తరగతి వరకు చదువుకున్నాడు. ఆపై ఫ్యాన్లు, కూలర్లు, సబ్మెర్సిబుల్ మోటార్ల రిపేరింగ్ నేర్చుకున్నాడు. ఎనిమిదేళ్ల క్రితం ప్రజ్ఞాపూర్లో పనిచేస్తూ మంగమ్మను వివాహం చేసుకున్నాడు. వారికి మహేశ్(8), మాధురి(7) పిల్లలు. శ్రీనివాస్ మెకానిక్గా కలిగారు. తాను మెకానిక్గా, భార్య కూలి చేస్తూ పిల్లల్ని ప్రైవేటు స్కూల్లో చదివిస్తున్నారు. ఇదిలా ఉండగా, ఏడాది క్రితం శ్రీను అకస్మాత్తుగా జర్వపీడితుడై.. నడవలేని స్థితికి చేరాడు. ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించగా మూత్రపిండాలు దెబ్బతున్నట్టు తెలిసింది. దీంతో ఆ కుటుంబం ఒక్కసారిగా కుదుపునకు గురైంది. పొందుపు చేసిన డబ్బులు, తెచ్చిన అప్పులు ప్రాథమిక పరీక్షలు, చికిత్సలకే సరిపోయాయి. దీంతో పిల్లల చదువులు ప్రైవేటు స్కూల్ నుంచి ఊళ్లోని సర్కార్ బడికి మారింది. వారానికి మూడుసార్లు డయాలసిస్ చేసుకుంటే తప్ప.. ప్రాణాలు నిలవవని, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం లక్షల్లో ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పడంతో ఆ కుటుంబం మరింత ఆందోళనకు గురైంది. డయాలసిస్, మందులకు వారానికి సగటున రూ.8 వేలు ఖర్చు అవుతున్నాయి. ఖరీదైన వైద్యం చేయించుకోలేక ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు. మిత్రులే అండగా.. గ్రామానికి చెందిన కరుణాకర్, రవి, రాజేశ్ తదితరులు స్నేహితుడు శ్రీనివాస్కు తోడుగా నిలిచారు. ప్రైవేటు ఉద్యోగాలు చేసుకునే వీరంతా భారీగా ఆర్థిక సహాయం చేయలేకపోయినా.. డయాలసిస్కు అవసరమైన డబ్బులు సమకూర్చుతున్నారు. ఎవరైనా కనపడితే చాలు మిత్రుడి దుస్థితి వివరించి ఆదుకోవాలని కోరుతున్నారు. కుటుంబానికి గుదిబండ అయ్యా రేకుల షెడ్డే మా ఇల్లు. నిరుడు నా ఆరోగ్యం దెబ్బతిన్నది. హైదరాబాద్ల టెస్టులు చేయిస్తే రెండు కిడ్నీలు దెబ్బతిన్నట్టు తెలిసింది. వైద్యం కోసం నా దగ్గర ఉన్న డబ్బులు మొత్తం ఖర్చు చేసిన. జీవితాంతం డయాలసిస్ చేయించుకోవాలని డాక్టర్లు చెప్పిన్రు. వారానికి రెండుసార్లు బ్లడ్ ఇంజెక్షన్లు, ఐరన్ ఇంజెక్షన్లు తీసుకోవాలి. కిడ్నీలు మార్పించుకోవాలన్నరు. ఆరోగ్యశ్రీ ద్వారా గాంధీ ఆస్పత్రిల్లో డయాలసిస్ చేయించుకుంటున్న. వారానికి అన్ని ఖర్చులు కలిపి రూ. 8,000 అయితున్నయ్. దోస్తుల సాయంతోనే ఇప్పటిదాక నెట్టుకొచ్చిన. నెలకు రూ. 32,000 ఖర్చు ఎవలిస్తరు. ‘జీవన ధార’ల కిడ్నీల కోసం దరఖాస్తు పెట్టినం. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావులు సాయం చేస్తే బతికినంత కాలం రుణపడి ఉంట. సాయం చేయాలనుకున్నవారు సెల్నెంబర్: 83749 86639కు కాల్ చేయండి. - శ్రీనివాస్ దోస్తులే దేవుళ్లు ఆయన, నేను కూలి చేసుకునేటోళ్లమే. అన్నదమ్ములు సా యం చేసే పరిస్థితి లేదు. మా ఆయన కిడ్నీలు దెబ్బతిని మంచం పట్టిండు. నీళ్లు ఎక్కువ తాగొద్దు, తిండి ఎక్కువ తినొద్దు. ఏది తేడా అయినా కడుపు ఉబ్బుతది, అజీర్ణం అయితది. మనిషి ఆగమాగం చేస్తడు. దీంతో కూలీ పని వదిలి ఇంటి వద్దే ఉంటున్న. ఆయన దోస్తులే దేవుళ్ల లెక్క మాకు సాయం చేస్తున్నరు. సర్కారు సాయం చేసి మా ఆయనను కిడ్నీ వ్యాధి నుంచి కాపాడాలె. కిరాణా దుకాణం పెట్టుకునేటందుకు సాయం జేస్తె బాగుంటది. - మంగమ్మ, శ్రీనివాస్ భార్య -
పేదల స్థలాన్ని కాజేశారు
నిరుపేదల కిచ్చిన ఇళ్ల స్థలాలను వారు నిర్ధాక్షిణ్యంగా కాజేశారు. తమ జిరాయితీగా చెప్పి దర్జాగా అమ్మేశారు. అధికారం అండ చూసుకుని పేట్రేగిపోయారు. అప్పనంగా వచ్చిన భూమిని లక్షలాది రూపాయలకు అమ్మేసి ఎంచక్కా జేబులో వేసేసుకున్నారు. అన్నీ చూస్తున్న అధికారులు సైతం కిమ్మనకుండా... ప్రేక్షక పాత్ర వహించారు. సమాచార హక్కు చట్టంలో అది ప్రభుత్వభూమేనని తేలినా పేదలకు న్యాయం జరగలేదు. టెక్కలి(నెల్లిమర్ల): సొంతగూడు లేని నిరుపేదలకు ప్రభుత్వమిచ్చే ఇళ్ళస్థలాలనూ టీడీపీ నేతలు వదలడంలేదు. దశాబ్దం క్రితం సర్కారు పంపిణీచేసిన స్థలాలను ఆక్రమించుకుని, గుట్టుచప్పుడు గాకుండా అమ్మేసుకున్నారు. లబ్ధిదారులు అడిగితే అధికారం తమేననీ ఏమైనా చేస్తాం అని దబాయిస్తున్నారు. దీనికి ఉదాహరణ నెల్లిమర్ల మండలంలోని టెక్కలి గ్రామంలో తాజాగా వెలుగు చూసిన అక్రమం. అధికారం అండగా... యథేచ్ఛగా అమ్మకం టెక్కలి గ్రామంలో 53మంది సొంత ఇళ్ళులేని నిరుపేదలకు 2002లో అప్పటి ప్రభుత్వం ఇళ్ళస్థలాలను పంపిణీచేసింది. గ్రామాన్ని ఆనుకుని ఉన్న సర్వేనంబరు 21లోగల 1.62 ఎకరాల భూమిలో లేఅవుట్ వేసి స్థలాలను అప్పగించింది. ఒక్కో లబ్ధిదారునికి రెండేసిసెంట్లు రాగా.. వాటిపై ఈనాటివరకూ ఎలాంటి ఇల్లూ నిర్మించుకోలేదు. నాడు తమకు స్థలాలు మంజూరు చేసిన టీడీపీ ప్రభుత్వమే మళ్ళీ అధికారంలోకి రావడంతో ఇళ్లు మంజూవుతాయని భావించారు. ఇంతలో ఆ స్థలంపై విజయనగరానికి చెందిన ఓ టీడీపీనేత కన్ను పడింది. ఎలాగైనా దాన్ని కొట్టేయాలని, భావించి గతంలో ఇక్కడ పనిచేసిన వీఆర్వో సహాయంతో పట్టా తయారుచేసి, విజయనగరానికి చెందిన ఓ వ్యక్తికి దర్జాగా విక్రయించాడు. సమాచారహక్కు చట్టంద్వారా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆ స్థలం వివరాలు సంపాదించాడు. దీంతో ఆ బాగోతం వెలుగు చూసింది. దీని ప్రకారం స్థలం 2002లో టీడీపీ ప్రభుత్వం నిరుపేదలకు ఇచ్చినదేనని రుజువైంది. అయితే ఆ స్థలాన్ని మాత్రం ఆ టీడీపీ నేత రూ. 40 లక్షలకు విజయనగరానికి చెందిన బడాబాబుకు అమ్మేసినట్టు తెలుస్తోంది. ఆ స్థలం తన బంధువులకు చెందిన జిరాయితీ అని, అందుకే విక్రయించామని ఆ నాయకుడు ప్రచారం చేసుకుంటున్నారు. ‘మీ కోసం’లో ఫిర్యాదు టెక్కలిలో చోటుచేసుకున్న భూ కుంభకోణంపై శుక్రవారం ‘మీకోసం’ గ్రీవెన్సుసెల్లో ఫిర్యాదు అందింది. దీనిపై నెల్లిమర్ల రెవెన్యూ అధికారులకు విచారణ చేపట్టమని ఆదేశాలు సైతం అందాయి. ఆ నేత భూ ఆక్రమణపై లబ్దిదారులంతా సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్సెల్లో కూడా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. విచారణ చేపడతాం టెక్కలి గ్రామంలో పేదలకు ప్రభుత్వం పంపిణీచేసిన ఇళ్ళస్థలాలను స్వాహా చేసినట్లు మీకోసంలో ఫిర్యాదు అందింది. ఆ స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని, గతంలో ఇచ్చిన పేదలకు అందజేయాలని ఫిర్యాదుదారులు కోరారు. దీనిపై విచారణ చేపడతాం. అసైన్డ్ భూములు కొనడం, అమ్మడం నేరం. ఆక్రమణకు గురైనట్లు రుజువైతే ఆక్రమణదారుడిపై చర్యలు చేపడతాం. - కె.చిన్నారావు, తహసీల్దార్, నెల్లిమర్ల -
విధి వంచితులు
♦ రెండు కిడ్నీలు చెడిపోయిన భర్త ♦ గుండె జబ్బుతో భార్య ♦ ఉపయోగపడని ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు ♦ నెలకు రూ. 7 వేలు మందుల ఖర్చు వారిది పేద కుటుంబం. భార్యా భర్తలు కష్టపడితే గానీ ఇల్లు గడవదు. ఈ తరుణంలో కొండంత అవాంతరం వచ్చి పడింది. భర్తకు రెండు కిడ్నీలు చెడిపోయాయి. భార్యకు గుండె జబ్బు ఉంది. దీంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో భార్యా భర్తలు.. వారి పరిస్థితిని చూసి పిల్లలు రోదిస్తున్నారు. మనసున్న మారాజులు దయతలచి ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ప్రొద్దుటూరు క్రైం: ప్రొద్దుటూరు ఈశ్వరరెడ్డినగర్కు చెందిన బెజవాడ సుబ్బరాయుడు పాత చీరెల వ్యాపారం చేస్తుంటాడు. అతనికి భార్య భాగ్యలక్ష్మి, కుమార్తె లక్ష్మిప్రసన్న, కుమారుడు శ్రీనివాసులు ఉన్నారు. కుమార్తె 10, కుమారుడు 8వ తరగతి చదువుతున్నారు. సుబ్బరాయుడు స్థానికంగానే పాత చీరెలు కొనుగోలు చేసి వాటిని విక్రయించడానికి పల్లెలకు వెళ్లి నాలుగైదు రోజుల పాటు అక్కడే ఉంటాడు. భార్య ఇంట్లోనే చీరెలకు ఫాల్స్ వేస్తుంటుంది. ఉన్నట్టుండి మంచాన పడ్డాడు.. సుబ్బరాయుడుకు ఎలాంటి చెడు అలవాట్లు లేవు. ఇటీవల కాలంలో ఏ రోజూ ఆస్పత్రికి వెళ్లినోడు కాదు. మూడు నెలల క్రితం అతనికి దగ్గు, ఆయాసం రావడంతో పట్టించుకోలేదు. మూడు రోజుల తర్వాత ఉన్నట్టుండి అతను కళ్లు తిరిగి పడిపోయాడు. వెంటనే ఒక ప్రైవేట్ డాక్టర్ వద్దకు వెళ్లగా 220/150 బిపి ఉందని చెప్పాడు. ఎందుకు బీపీ ఎక్కువ ఉందో నిర్ధారించుకోవడానికి డా క్టర్ ఈసీజీ చేయించుకోమని పంపించాడు. ఈసీజీలో ఎ లాంటి రిమార్కు లేదు, అంతా బాగానే ఉంది. తర్వాత గుండె సంబంధిత పరీక్షలు కూడా చేయించుకోగా అందు లో కూడా తేడా కనిపించలేదు. తర్వాత కిడ్నీ పరీక్ష చే యించుకోగా అందులో కిడ్నీలు చిన్నగా ఉన్నట్లు కనిపిం చాయి. దీంతో వెంటనే తిరుపతి స్విమ్స్కు వెళ్లారు. పనికి రాని ఎన్టీఆర్ వైద్యసేవ కార్డు.. తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రికి వెళ్లగా పరిశీలించిన వైద్యులు రెండు కిడ్నీలు 70 శాతం మేర చెడిపోయాయని చెప్పారు. కేవలం 30 శాతం మాత్రమే చిన్నగా ఉన్నాయని చెప్పారు. సుబ్బరాయుడికి తెలియకుండానే రక్తకామెర్లు వచ్చాయని, దాని వల్ల బీపీ ఎక్కువై కిడ్నీలపై ప్రభావం చూపిందని వైద్యులు వివరించారు. కాగా సుబ్బరాయుడు ఎన్టీఆర్ వైద్యసేవ కార్డు తీసుకొని వెళ్లగా కేవలం పరీక్షలు మాత్రమే ఉచితంగా నిర్వహించారు. మందులు మాత్రం డబ్బు పెట్టి తీసుకోవాల్సిందేనని చెప్పారని సుబ్బరాయుడు అన్నాడు. నెలకు రూ.7 వేల మందులు అవసరం అవుతాయని అతను తెలిపాడు. మా లాంటి పేదలకు వైద్యసేవ కార్డు ఉపయోగపడకుంటే ఎలా అని సుబ్బరాయుడు ఆవేదన చెందుతున్నాడు. గత మూడు నెలల నుంచి అతను ఇంట్లో నుంచి బయటికి వెళ్లే పరిస్థితి లేదు. పూర్తి విశ్రాంతి తీసుకోవడమే గాక ఎలాంటి వస్తువులు మోయరాదని వైద్యులు సూచించడంతో ఇంటికే పరిమితమయ్యాడు. రూ. 2 లక్షలు అప్పు చేసి తె చ్చిన చీరెలన్నీ అలానే ఇంట్లో ఉండిపోయాయి. దీంతో అప్పుకట్టమని బాకీ ఇచ్చిన వారు ఒత్తిడి తెస్తున్నారని భార్య భాగ్యలక్ష్మి రోదిస్తోంది. చేతిలో డబ్బు లేకపోవడంతో నెలలో 15 రోజుల మందులను మాత్రమే తెచ్చుకుంటున్నామని ఆమె ఆవేదన చెందుతోంది. భర్త పరిస్థితి చూసి గుండె పోటు.. భర్త పరిస్థితిని చూసిన భాగ్యలక్ష్మికి గుండె పోటు వచ్చింది. దీంతో ఆమెను వెంటనే స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆమెను పరిశీలించిన వైద్యులు వెంటనే హైదరాబాద్కు వెళ్లాలని సూచించారు. అయితే చేతిలో చిల్లి గవ్వ కూడా లేకపోవడంతో భాగ్యలక్ష్మిని ఎక్కడికీ తీసుకొని వెళ్లలేదు. భర్తను చూసి భార్య, భార్య పరిస్థితిని చూసి భర్త రోదిస్తున్నారు. తల్లి దండ్రులకు ఈ పరిస్థితి రావడంతో పిల్లలిద్దరూ తీవ్ర ఆవేదన చెందుతున్నారు. చదవాలని ఉన్నా చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నామని వారంటున్నారు. ఈ క్రమంలో సుబ్బరాయుడు కుటుంబం గడవడమే కష్టంగా ఉంది. మనసున్న మా రాజులు సాయం చేస్తే తల్లిదండ్రులను బతికించుకుంటామని పిల్లలు శ్రీనివాసులు, లక్ష్మీప్రసన్న కోరుతున్నారు. -
పేదింటికి పెద్ద కష్టం
లావేరు : వారిది రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కుటుంబం. అటువంటి కుటుంబానికి పెద్ద కష్టం వచ్చింది. వారి ఇద్దరు కుమార్తెల్లో పెద్ద కుమార్తె సికిల్ సెల్ ఎనీమియా వ్యాధితో బాధపడుతోంది. ఎప్పటికప్పుడు రక్త కణాలు తగ్గిపోతున్నాయి. నిత్యం రక్తం ఎక్కించాలని వైద్యులు చెప్పారు. ఇంతవరకు అప్పులు చేసి సుమారు రూ.4 లక్షల వరకు ఖర్చు చేశారు. బయట అప్పులు పుట్టకపోవడంతో వైద్యం చేయించలేక దీనంగా ఉండిపోయారు. దాతలు సహకరించి తమ కుమార్తెకు ప్రాణభిక్ష పెట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. తరుచూ రక్తం మార్చాలి పాలకొండకు చెందిన తేగల రాజు, తేగల జానకమ్మ భార్యాభర్తలు. వారికి ఇద్దరు కుమార్తెలు. సుమారు 10 ఏళ్ల క్రితం ఉపాధి కోసం రణస్థలం మండలం జేఆర్పురం గ్రామానికి వలస వచ్చారు. ఇక్కడ భార్యాభర్త లిద్దరూ కూలి పనులు చేసుకుంటూ బతుకు బండిని సాగిస్తున్నారు. పెద్ద కుమార్తె వనితకు 2011వ సంవత్సరంలో సికిల్ సెల్ ఎనీమియా అనే వ్యాధి సోకింది. ఈ వ్యాధి కారణంగా శరీరంలోని రక్త కణాలు తరుచూ తగ్గిపోతాయి. ఎప్పటికప్పుడు రక్తం ఎక్కించాలి. పాలకొండ, శ్రీకాకుళంలోని ప్రైవేటు ఆస్పత్రులు, రిమ్స్లో వైద్యం చేయించారు. ఇప్పటివరకు సుమారు రూ.4లక్షలు అప్పు చేశారు. ఎలాగైనా కుమార్తె ఆరోగ్యం బాగు చేయించుకోవాలన్న తపనతో స్థోమతకు మించి అప్పులు చేసి వైద్యం చేయించారు. ఇక అప్పులు పుట్టకపోవడంతో చేసేదేమిలేక తల్లిదండ్రులు మిన్నకుండిపోయారు. కుమార్తె పరిస్థితిని చూసి తల్లిదండ్రులు కంటతడి పెడుతున్నారు. దాతలు సహకరించి తన కుమార్తెకు ప్రాణభిక్ష పెట్టాలని వేడుకుంటున్నారు. దాతలు సహకరించి ఎస్బీహెచ్ బ్యాంకు ఖాతా నంబరు 62400418658కు సాయం చేయాలని కోరుతున్నారు. -
నాకు దారిచూపింది అంబేద్కరే..
కల్హేర్: నిరుపేద కుటుంబంలో జన్మించిన తనకు ఐపీఏస్ అధికారిగా పని చేయడానికి అంబేద్కర్ చూపిన బాటే కారణమని రాష్ట్ర సాంఘీక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి డాక్టర్ ప్రవీణ్కుమార్ అన్నారు. అంబేద్కర్ ఆశయాలతో ముందుకు పోవడంతో ఐపీఏస్ ఉద్యోగం చేస్తూ... రూ.1.50 లక్షల వేతనం పొందుతున్నట్టు తెలిపారు. శుక్రవారం ఆయన కల్హేర్ మండలం బీబీపేట, పోచాపూర్లో అంబేద్కర్ విగ్రహాలను ఆవిష్కరించారు. బీబీపేటలో అంబేద్కర్ విజ్ఞాన కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో ప్రవీణ్కుమార్ మాట్లాడారు. ప్రతి ఒక్కరూ కుల, మతాలకతీతంగా అంబేద్కర్ చూపిన బాటలో నడిస్తే అన్ని రంగాల్లో విజయం సాధించవచ్చన్నారు. ఉన్నత చదువులు చదివి ప్రయత్నిస్తే ప్రభుత్వ ఉద్యోగాలను దక్కించుకోవచ్చని సూచించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ రాజన్న, పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు గుండు లక్ష్మణ్, మనూర్ ఎంఈఓ నాగరం శ్రీనివాస్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కృష్ణమూర్తి, సర్పంచ్లు రాములు, సంతోషమ్మ, ఎంపీటీసీ కిష్టాగౌడ్, తెలంగాణ విద్యావంతుల వేదిక నాయకులు గైని బాలయ్య, స్వేరోస్ ప్రతినిధి గుండు మోహన్, రాజు, దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. నల్లవాగు గురుకులం తనిఖీ.. మండలంలోని నల్లవాగు గురుకుల పాఠశాలను రాష్ర్ట కార్యదర్శి ప్రవీణ్కుమార్ తనిఖీ చేశారు. పాఠశాలలో బోధనతీరు, భోజన వసతి, ఇతర అంశాలను ప్రిన్సిపాల్ మెవాబాయిని అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో నిర్మిస్తోన్న భవనాల పనులు నత్తనడకన సాగుతుండడంతో ఇంజినీరింగ్ విభాగం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు సత్వరం పూర్తి చేయాలని ఆదేశించారు. -
రేషన్ బియ్యం ఇస్తారా.. చావమంటారా..!
బీర్కూర్ : రేషన్ బియ్యం ఇస్తారా.. లేదంటే పురుగుల మందు తాగి చావమంటారా అని ఓ నిరుపేద కుటుంబం బీర్కూర్ తహసీల్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగింది. తమకు ఏడాది కాలంగా రేషన్ బియ్యం రావడం లేదంటూ బొప్పాస్పల్లికి చెందిన సంగ్రాంనాయక్ సోమవారం భార్య, పిల్లలతో కలిసి తహసీల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ విషయమై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదన్నారు. కరువు కాలంలో నిరుపేదనైన నేను ఏం తిని బతకాలంటూ కన్నీరు పెట్టుకున్నాడు. సమస్య పరిష్కరించకపోతే కుటుంబ సభ్యులమంతా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామన్నారు. దీంతో సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి బాధితుల నుంచి పురుగుల మందును స్వాధీనం చేసుకున్నారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజేశ్ స్పందిస్తూ సంగ్రంగా సింగ్ కుటుంబ సభ్యుల ఆధార్నెంబర్లు ఎస్ఆర్డీహెచ్కు అనుసంధానం కాలేదన్నారు. దీంతో 8 నెలలుగా బియ్యం రావడం లేదని చెప్పారు. సమస్యను పరిష్కరించి వచ్చేనెల నుంచి రేషన్ బియ్యం మంజూరయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. -
మా అమ్మను బతికించండి
వారిదో నిరుపేద కుటుంబం. భార్యాభర్త... ఇద్దరు పిల్లలు. భర్త అంధుడు కావడంతో కుటుంబపోషణంతా ఆమెపైనే... రెక్కలు ముక్కలు చేసుకుని కూలీ పనిచేస్తూ కుటుంబాన్ని సాకింది. ప్రభుత్వం ఇచ్చిన 20 గుంటల భూమికి మరో 20 గుంటలు కౌలుకు తీసుకుని పత్తి వేయగా... కలిసిరాని కాలం కరువు రూపంలో వెంటాడింది. పెట్టుబడి, కుటుంబపోషణకు చేసిన అప్పు తీర్చే మార్గం కనిపించక చావే శరణ్యమనుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రస్తుతం చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. మెరుగైన వైద్యం అందిస్తే బతికే అవకాశముండడంతో తల్లిని బతికించుకునేందుకు ఆ పన్నెండేళ్ల పిల్లాడు చేతులు జోడించి వేడుకుంటున్నాడు. * అప్పులబాధతో మహిళా రైతు ఆత్మహత్యాయత్నం * చికిత్సకు చిల్లిగవ్వ లేక చావుబతుకుల మధ్య పోరాటం * అంధుడైన భర్త.. ఇద్దరు పిల్లలకు ఆమే ఆధారం * దాతలు సాయం చేస్తే నిలువనున్న నిండుప్రాణం జమ్మికుంట: వీణవంక మండలం పోతిరెడ్డిపల్లికి చెందిన కారుపాకల రమ-రవిది నిరుపేద కుటుంబం. వీరికి కుమారుడు అంజి(12), కుమార్తె అమూల్య(7) ఉన్నారు. రవి అంధుడు కావడంతో కుటుంబపోషణ భారమంతా రమపైనే. కూలీ పనులకు వెళ్తూ రెక్కలు ముక్కలు చేసుకుంటూ కుటుంబాన్ని వెళ్లదీస్తోంది. ప్రభుత్వ పాఠశాలలో అంజి ఏడో తరగతి, అమూల్య రెండో తరగతి చదువుతున్నారు. ప్రభుత్వం గతంలో వీరికి 20 గుంటల భూమి మంజూరు చేసింది. ఈ 20 గుంటలతోపాటు పక్కనే ఉన్న మరో 20 గుంటలు కౌలుకు తీసుకుని ఈ ఏడాది పత్తిపంట వేశారు. మిగతా సమయంలో ఆమె కూలీకి వెళ్తుంది. సాగు పెట్టుబడి కోసం రూ.20 వేలు అప్పు చేశారు. కరువు వెంటాడడంతో పంట చేతికి రాకుండా కళ్లముందే ఎండిపోయింది. తెలిసినవారి వద్ద అప్పు చేసి కుటుంబాన్ని నెట్టుకొచ్చింది. కరువు ఛాయలతో చేసేందుకు పనిలేకపోగా కుటుంబపోషణ భారంగా మారింది. అప్పులు ఇచ్చినోళ్లు ఇంటిచుట్టూ తిరుగుతుండడంతో మనోవేదన చెందింది. అప్పు కట్టే స్థోమత లేక ఆత్మహత్యే శరణ్యమనుకుంది. ఈ నెల 3న పిల్లలిద్దరినీ పాఠశాలకు పంపించింది. అనంతరం ఇంట్లోనే క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తన ముందే భార్య పురుగుల మందు తాగుతున్నా... కళ్లు కనిపించకపోవడంతో రవి ఏమీ చేయలేకపోయాడు. కిందపడి కొట్టుకుంటున్నా.. ఏం జరిగిందో తెలుసుకోలేకపోయాడు. ఇరుగుపొరుగు ఆ సమయంలో రమ కోసం ఇంటికి రాగా ఆమె ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతూ కనిపించింది. వెంటనే ఆమెను జమ్మికుంటలోని విజయ్సాయి ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వెంటిలేటర్పై చికిత్స పొందుతోంది. అమ్మ ఆస్పత్రిలో ఉండగా, తండ్రి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండడంతో తాత(రమ తండ్రి) వచ్చి పిల్లలను చూసుకుంటున్నాడు. ఆస్పత్రిలో కుమారుడే తల్లికి సపర్యలు చేస్తున్నాడు. ఇప్పటికే రూ.1.50 లక్షల ఖర్చు రమ వారం రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఇప్పటికే లక్షన్నర రూపాయలు ఖర్చయ్యాయి. చేతిలో చిల్లి గవ్వలేక... కుటుంబాన్ని పోషించలేక... అప్పులు చెల్లించలేక చనిపోవాలని నిర్ణయించుకున్న రమ ప్రాణపాయస్థితిలో ఉండగా కుమారుడు అంజి తన తల్లిని బతికించాలని వేడుకుంటున్నాడు. ఇంటి పెద్ద దిక్కు చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో ఉంటే కనిపించినవారినల్లా తమ తల్లిని కాపాడాలని వేడుకుంటున్నాడు. తన తల్లి లేకుంటే నాన్న, తాను, చెల్లి ఎలా బతికేదంటూ కన్నీరు పెట్టుకుంటున్నాడు. మా అందరికీ అమ్మే దిక్కని, అమ్మ లేకుంటే తాము బతకలేమని విలపిస్తున్నాడు. మెరుగైన వైద్యం చేస్తే తన తల్లి బతికే అవకాశముందని డాక్టర్లు చెబుతున్నారని... చేతిలో చిల్లిగవ్వ లేక తామెలా వైద్యం చేయించేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పటివరకు అయిన రూ.లక్షన్నర ఖర్చు ఆస్పత్రి వైద్యుడే భరిస్తున్నాడు. రమను బతికించాలనే తపనతో డాక్టర్ సురంజన్ శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. తన తల్లి ప్రాణాలు కాపాడేందుకు దాతలు ముందుకు రావాలని కుమారుడు అంజి, రమ తండ్రి ఐలమల్లు వేడుకుంటున్నారు. మెరుగైన వైద్యం అందితే బతికే అవకాశం రమ పరిస్థితి విషమంగా ఉంది. వారం రోజులుగా చికిత్స అందిస్తున్నాం. సకాలంలో తీసుకురావడం వల్ల చికిత్స చేసే అవకాశం వచ్చింది. ఇప్పుడు ఆమెను ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడేందుకు మెరుగైన చికిత్సతో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వారం రోజులుగా వెంటిలేటర్పై ఆక్సీజన్ అందిస్తూ ఖరీదైన మందులు వేస్తూ ప్రాణాలు కాపాడుతున్నాం. ఇప్పటికే రూ.లక్షన్నర ఖర్చు వచ్చింది. మరో రూ.లక్షన్నర ఖర్చయ్యే అవకాశముంది. దాతలు ముందుకు వస్తే ఆమెకు పునర్జన్మ ప్రసాదించినవారవుతారు. పేదరికం, కుటుంబపోషణలో ఇబ్బందులతో తొందరపాటులో ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం బాధాకరం. ఇద్దరు చిన్న పిల్లలు, తండ్రి అంధుడు అయిన ఈ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిస్తే బాగుంటుంది. దాతలు కూడా ముందుకు రావాలి. - సురంజన్, వైద్యుడు, విజయ్సాయి హాస్పిటల్ -
నేనున్నాను!
- సాక్షి కథనానికి స్పందన - ఆ చిన్నారులను దత్తత తీసుకుంటా.. - ముందుకొచ్చిన ఆస్ట్రేలియా వాసి గుప్తా జిన్నారం: అనారోగ్యంతో తల్లి.. ఆ బాధతో తండ్రి ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోతే దిక్కులేనివారయ్యారు వారిద్దరు పిల్లలు. ఈ చిన్నారుల ఆలనాపాలనా వృద్ధాప్యంలో కాలం వెళ్లదీస్తున్న నానమ్మ, తాతయ్యలపై పడింది. నిరుపేద కుటుంబం... ఏ దిక్కూ లేని దైన్యం... అనాథలైన చిన్నారులను ఆదుకోవాలంటూ ‘సాక్షి’ బుధవారం ప్రచురించిన ‘అయ్యో.. పాపం’ కథనానికి ఆస్ట్రేలియా మెల్బోర్న్లో ఉంటున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి గుప్తా స్పందించారు. జిన్నారం మండలం దోమడుగుకి చెందిన చిన్నారులు యశ్వంత్, సాత్వికలకు సాయం చేస్తానని, వారిని దత్తత తీసుకుంటానని ఆయన ‘సాక్షి’ కార్యాలయానికి ఫోన్ చేసి చెప్పారు. చిన్నారులు, వారి కుటుంబ వివరాలను తనకు అందించాలని కోరారు. -
కుటుంబం ఆత్మహత్యాయత్నం
- భార్య మృతి - విషమ పరిస్థితిలో భర్త - ప్రమాదం నుంచి బయట పడిన చిన్నారులు - సంఘటనా స్థలాన్ని పరీశీలించిన డీసీ, ఎస్పి. మండ్య : పేద కుటుంబం అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యకు ప్రయత్నిం చింది. ఈ ఘటనలో భార్య మృతి చెం దగా, భర్త మృత్యువుతో పోరాడుతున్నారు. ఈ సంఘటన జిల్లాలోని పాండవపుర తాలూకా చినకురళి గ్రామంలో ఆదివారం వెలుగు చూసింది. పాండవపుర పోలీసులు కథనం మేరకు చినకురళి గ్రామానికి చెందిన దినేష్(30) కూలీ. ఈయనకు భార్య శ్వేత (27), కు మార్తె స్పందన(4), మోనిక(3)ఉన్నా రు. అయితే కుటుంబ అవసరాల కోసం దినేష్ పలుచోట్ల అప్పులు చేశాడు. రుణదాతల ఒత్తిళ్లు అధికం కావడంతో, అప్పుడు తీర్చలేక కుటుం బం మొత్తం ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆదివారం ఉదయం కాలం చెల్లిన మాత్రలు తీసుకుని నీటిలో వేసుకుని మింగారు. మొదట భర్త దినేష్, భార్య శ్వేత ఆ నీటిని తాగారు. అనంతరం పెద్ద కుమార్తె స్పందనకు ఆ నీటిని తాపిస్తుండగా చిన్నకుమార్తె భయంతో ఏడచు కుంటూ పారిపోయింది. బయటికి వెళ్లిన చిన్నారి ఏడుస్తుండగా స్థానికులు గమనించి, బాలికతోపాటు ఇంటిలోకి వచ్చారు. అప్పటికే ఇంట్లో ముగ్గురూ కిందపడిపోయి విలవిల్లాడుతున్నారు. వెంటనే 108 వాహనానికి ఫోన్ చేసి కుటుంబం మొత్తాన్ని మైసూరు నగరంలోని కే.ఆర్.ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స చేయిస్తుండగా శ్వేత మృతి చెందింది. భర్త దినేష్ చావు బతుకుల మధ్యకొట్టుమిట్టాడుతున్నారు. అయితే చిన్నారికి ఎలాంటి ప్రాణ హాని లేదని డాక్టర్లు తెలిపారు. చికిత్స పొందుతున్న వారిని జిల్లా అధికారి డాక్టర్ అజయ్ నాగభూషన్, జిల్లా ఎస్పీ భూషన్ జీ బోరసే పరామర్శించారు. పాండవ పుర పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఎంత కష్టం.. ఎంత కష్టం!
♦ అసలే నిరుపేద కుటుంబం ♦ ముగ్గురు సంతానం అంధులు ♦ నాలుగో కుమారుడికి లుకేమియా (క్యాన్సర్) ♦ ఆపన్నహస్తం కోసం ఎదురుచూపు వారిది నిరుపేద కుటుంబం.. నలుగురు సంతానం.. అందులో మొదటి ముగ్గురు అంధులు.. నాలుగో కుమారుడు లుకేమియా అనే రక్త క్యాన్సర్తో బాధ పడుతున్నాడు.. కుమారుడి వ్యాధి బాగు చేయించే ఆర్థిక స్థోమత లేక ఆవృద్ధ తల్లిదండ్రులు ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్నారు. అట్లూరు : అట్లూరు గ్రామ పంచాయతీలోని గాండ్లపల్లికి చెందిన భూర్సు చిన్నవెంకటయ్య, వెంకటసుబ్బమ్మ దంపతులకు నలుగురు సంతానం. సుబ్బమ్మ, నరసమ్మ, పెంచలయ్య ఈ ముగ్గురూ పుట్టుకతోనే గుడ్డివారు. ఈ సారైనా అన్ని అవయవాలు సక్రమంగా కలిగిన సంతానం కలగాలని ఆ దంపతులు పూజలు, నోములు చేశారు. వారికి కుమారుడు పుట్టాడు. ఆ చిన్నారికి కళ్లు బాగా కనిపిస్తాయని సంతోషించారు. అంధులను చూసి బాధపడుతూ.. వెంకటసుబ్బయ్యను చూసి సంతోష పడుతూ వారు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించే వారు. వెంకటసుబ్బయ్యను 7వ తరగతి వరకు చదివించారు. భార్యాభర్తల సంపాదన అంధులైన పిల్లల పోషణకు చాలకపోవడంతో వెంకటసుబ్బయ్యను బడి మానిపించారు. ఆ బాలుడినీ కూలీ పనులకు తీసుకెళ్లే వారు. మరోసారి విధి వక్రీకరించింది: వారి పట్ల దేవుడు మరో సారి చిన్నచూపు చూశాడు. నెల రోజులుగా వెంకటసుబ్బయ్య జ్వరంతో మంచం పట్టాడు. కడపలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందాడు. ఫలితం కనిపించ లేదు. తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో చికిత్స చేయించారు. జ్వరం నయం కాలేదు. స్విమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. పరీక్షల అనంతరం వైద్యులు మెల్లిగా గుండె ఆగి పోయేలాంటి వార్త చెప్పారు. వెంకటసుబ్బయ్యకు లుకేమియా అనే రక్త క్యాన్సర్ వచ్చిందని తెలిపారు. క్యాన్సర్ ఆస్పత్రికి తీసుకెళ్లి బాగు చేయించుకోవాలని సూచించారు. ఆ వ్యాధి చికిత్సకు రూ.12 నుంచి 15 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పారు. దిక్కుతోచని స్థితిలో తల్లిదండ్రులు కుమారుడిని ఇంటికి తీసుకొచ్చారు. వచ్చిన వ్యాధి గురించి చెప్పడం, ఏడ్చడం తప్ప వారు ఏమీ చేయలేని స్థితి. ఇప్పటికే అప్పు చేసి రూ.70 వేల వరకు ఖర్చు పెట్టామని, ఇక చేతిలో చిల్లిగవ్వ కూడా లేదని కన్నీటిపర్యంతమవుతున్నారు. ఎవరైనా దాతలు ముందుకొచ్చి తమ కుమారుడికి ప్రాణభిక్ష పెట్టాలని వారు కోరుతున్నారు. కాగా, చిన్నవెంకటయ్య, వెంకటసుబ్బమ్మది వరుసగా మూడో తరం మేనరికపు వివాహం. అందువల్లే ఈ అనర్థాలు అంటూ గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. సహాయం చేయాలనుకునే వారు ఫోన్ నంబర్: 7093725038ను సంప్రదించవచ్చు. వైద్యాధికారి ఏమంటున్నారంటే.. వెంకటసుబ్బయ్యకు సోకిన లుకేమియా క్యాన్సర్కు వైద్యం చేయించాలంటే చాలా ఖర్చు అవుతుంది. చికిత్స కోసం ఢిల్లీలోని ఎయిమ్స్, తమిళనాడులోని అడయార్, పూణె తదితర ప్రాంతాల్లో ఎక్కడికో ఒక చోటుకు వెళ్లాల్సి ఉంటుంది. బాధితుడి వయస్సు 18 ఏళ్లు కనుక చికిత్సకు అనుకూలించవచ్చు. త్వరితగతిన స్పందిస్తే ఫలితం ఉంటుంది. - జబిఉల్లా, వైద్యాధికారి, అట్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం -
చిన్నారికి అంతుచిక్కని వ్యాధి
మిర్యాలగూడ టౌన్ : అది ఓ నిరుపేద కుటుంబం. పిల్లాపాపలతో హాయిగా గడపాలనుకున్న ఆ కుటుంబం ఆశలు అడియాసలయ్యాయి. ఇద్దరు సంతానంలో ఒకరు అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్నారు. అందరు పిల్లల్లా తమ కళ్లముందు ఆడుతూ పాడుతూ ఉండాల్సిన కొడుకులో ఎలాంటి ఎదుగుదల లేకపోవడాన్ని చూసి ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. అప్పులు చేసి వైద్యం చేయించినా ఎలాంటి ప్రయోజనంలేకుండాపోయింది. దాతలెవరైనా ముందుకువచ్చి ఆపన్నహస్తం అందిస్తారని ఆ కుటుంబం ఎదురుచూస్తోంది. మహబూబ్నగర్ జిల్లా తెల్కపల్లి మండలం వట్టెపల్లితండాకు చెందిన మూఢావత్ రూప్లానాయక్ వివాహం అదే జిల్లా లింగాల మండలం చిల్కపల్లికి చెందిన తిరుపతమ్మతో 2007లో జరిగింది. రూప్లానాయక్, తిరుపతమ్మ దంపతులు బతుకుదెరువు కోసం మిర్యాలగూడ పట్టణానికి ఆరే ళ్ల క్రితం వలస వచ్చారు. పట్టణంలోని రైల్వే స్టేషన్కు వెళ్లే రోడ్డులో గల అద్దంకి-నార్కట్పల్లి రహదారి వద్ద నివాసం ఉంటున్నారు. వీరిది నిరుపేద కుటుంబం. రూప్లా నాయక్ వృత్తి రీత్యా కిరాయి ఆటో డ్రైవరుగా పని చేస్తున్నాడు. 2010లో వీరికి మొదటి సంతానం అయిన శిరీష పుట్టింది. ఆ తరువాత 2011లో మూఢవత్ శివకుమార్ పుట్టాడు. పుట్టిన ఆరు నెలల వరకు మంచి ఆరోగ్యాంగానే ఉన్న శివకుమార్ అనంతరం 7వ మాసం నుంచే శరీరంలో మార్పులు రావడంతో పాటు కాళ్లు, చేతులు చచ్చుబడిపోయాయని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక వైపు శరీరంలో కూడా ఎదుగుదలలేకుండా పోయింది. దీంతో పాటు ఆ చిన్నారిలో ఎలాంటి స్పర్శ కనబడటం లేదు. తమ కొడుకు ఉదయం వేళల్లో మంచిగానే ఉంటా డు కానీ రాత్రి వేళల్లో మాత్రం నిద్రపోకుండా ఎడుస్తూనే ఉంటాడు. ఆ చిన్నారికి ఇప్పటి వరకు మాటలు కుడా రావు. నడవలేడు. తనకు ఇద ్దరు పిల్లలు చాలంటూ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కూడా చేయిం చుకున్నానని తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. పట్టణంలోని పిల్లల డాక్టర్లకు చూయించినప్పటికీ వ్యాధి ఏమిటో చెప్పడం లేదు. మహబూబ్నగర్, గుంటూరు, విజయవాడ, హైదరాబాద్లలోని పలు ఆసుపత్రులకు తీసుకువెళ్లినప్పటికీ ఈ వ్యాధి ఎమిటనేది కూడా తెలియడం లేదని డాక్టర్లు అంటున్నారు. డబ్బులు ఖర్చు చేసినా ఫలితం లేకపోవడంతో హైదరాబాద్లో కొందరు ఆయుర్వేదిక్ డాక్టర్ల వద్దకు తీసుకెళ్లామని చెప్పారు. సొమ్ములు అమ్మి.. అంతు చిక్కని వ్యాధితో బాధపడుతున్న కొడుకును రక్షించుకునేందుకు ఆ తల్లిదండ్రులు పడుతున్న బాధ అంతా ఇంతా కాదు. ఆసుపత్రులలో చూపించేందుకు కావాల్సిన డబ్బులు లేకపోవడంతో ఉన్న సొమ్ములను కూడా అమ్ముకోగా సుమారు 3 లక్షల రూపాయల వరకు వచ్చాయి. వివిధ ఆసుపత్రుల్లో చూపించగా ఆ డబ్బులు కూడా అయిపోయాయి. దీంతో రూ.5లక్షల వరకు అప్పులుకూడా చేశారు. ఏ డాక్టర్కు చూపించినా వ్యాధిఏమిటో గుర్తించలేపోతున్నారని ఆ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. నా కొడుకును ఆదుకోండి అంతు చిక్కని వ్యాధి తో బాధపడుతున్న నా కుమారుడిని ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలి . నా కుమారుడు కేవలం పాలతోనే ఇంత కాలం వరకు గడుపుతున్నాడు. దాతలెవరైనా ఆదు కోవాలనుకుంటే బ్యాంకు అకౌంట్ నంబరు-34597646858 ,ఎస్బీఐ నాగర్ కర్నూల్ బ్రాంచ్లో డబ్బులు వేయవచ్చు. పూర్తి స మాచారం కోసం సెల్ నంబర్లు 970 1585842, 9912677530 లలో సంప్రదించవచ్చు. - తిరుపతమ్మ, చిన్నారి తల్లి -
అయ్యో పాపం.. అనూహ్య
⇒ చిన్నారిని వేధిస్తున్న రక్తహీనత ⇒ ఏడాదిన్నరగా మంచానికే పరిమితం ⇒ రూ.25 లక్షలుంటేనే వైద్యం ⇒ తల్లడిల్లుతున్న నిరుపేద కుటుంబం ⇒ దాతల కోసం ఎదురుచూపు బంజారాహిల్స్: ఓ నిరుపేద కుటుంబానికి పెద్ద కష్టమొచ్చింది. ఆడుతూ పాడుతూ బడికి వెళ్లాల్సిన చిన్నారి ఏడాదిన్నర కాలంగా మంచానికే పరిమితమైంది. తీవ్రమైన రక్తహీనతతో బాధపడుతుండడంతో ఆ చిన్నారి తల్లిదండ్రులను కలిచివేసింది. రూ.లక్షలు వెచ్చించి వైద్యం చేయించే స్థోమత లేక.. కన్నపేగును కాపాడుకునే మార్గం తెలియక తల్లడిల్లిపోతున్నారు. వివరాలిలా.. పి.శ్రీనివాసరావు, భారతి దంపతులు. వీరికి ఒక బాబు, ఓ పాప. శ్రీనివాస్రావు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. బంజారాహిల్స్లో నివాసం ఉంటున్నారు. బాబు బధిరుడు. కొన్నేళ్లపాటు అవస్థపడి శక్తికి మించి ఖర్చు చేసి వైద్యం చేయించి ఓ కొలిక్కి తీసుకువచ్చారు. పరిస్థితి మెరుగుపడిందనుకున్న దశలో పాప అనూహ్య (8) ఒక్కసారిగా కుప్పకూలింది. చదువుతోపాటు ఆట, పాటల్లో రాణిస్తూ ఎంతో హుషారుగా ఉండేది. వైద్యులకు చూపించగా ఏడాదిన్నర క్రితం భయంకరమైన వాస్తవం బయటపడింది. అప్లాస్టిక్ ఎనీమియా (తీవ్రమైన రక్తహీనత)తో బాధపడుతుందని వైద్యులు నిర్ధారించారు. ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి కాకపోవడం, ఎముకల్లో ఉండే తెల్లని పదార్థం రక్తకణాలను, ప్లేట్లెట్స్ను ఉత్పత్తి చేయడం మానేసింది. ఎర్ర రక్తకణాలు తగ్గిపోవడంతో రక్తానికి ఆక్సీజన్ అందక అనూహ్య నీరసించి పోయింది. ఈ వ్యాధి నయం చేయాలంటే స్టెమ్సెల్ ట్రాన్స్ప్లాంటేషన్కు రూ.8.50 లక్షలు, నిమ్స్లో చికిత్సకు రూ.16.50 లక్షలు మొత్తం రూ.25 లక్షలు ఖర్చుఅవుతుందని చిన్నారి తండ్రి శ్రీనివాస్రావు తెలిపాడు. ఇంత మొత్తం వెచ్చించే పరిస్థితి లేదని వాపోతున్నాడు. దాతలెవరైనా ముందుకు వచ్చి తన కూతురికి ప్రాణ భిక్ష పెట్టాలని వేడుకుంటున్నాడు. సహాయం చేయాలనుకునే వారు 9059705169, 9052301145 నంబర్లలో సంప్రదించాలని కోరుతున్నాడు. బ్యాంకులో డబ్బులు వేయాలకునే వారు ‘పి.కెరెన్ అనూహ్య, అకౌంట్ నం.20202376033, ఎస్బీఐ, శ్రీపురం మలక్పేట, హైదరాబాద్, ఐఎఫ్ఎస్సీ కోడ్: ఎస్బీఐఎన్0060339’ శ్రీనివాస్రావు తెలిపాడు. -
నేనూ పేదింట్లోనే పుట్టాను
బాగా చదివా.. ఉన్నత స్థాయికి వచ్చా కూలిపనులు చేస్తూ పిల్లల్ని చదివించడం అభినందనీయం సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్కుమార్ నిరుపేద కుటుంబంతో మాటామంతీ పరిగి: ఆయనో సీనియర్ ఐపీఎస్ అధికారి, సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు రంగారెడ్డి జిల్లా పరిగి మండలం నస్కల్కు వచ్చారు. ఇంతలో ఆ కార్యక్రమానికి వెళ్లకుండా స్థానిక ఎస్సీ కాలనీలోకి నడిచారు. గ్రామం చివరలో ఉన్న సీనయ్య, సాయమ్మ దంపతులు ఇంటి తలుపు తట్టారు. రెక్కాడితే గానీ డొక్కాడని దయనీయ పరిస్థితి ఆ కుటుంబానిది. ఆ దంపతులకు ఇద్దరు కూతుళ్లు.. ఓ కుమారుడు.. ఎప్పటిలాగే పిల్లలకు వంటచేసి సద్ది కట్టుకుని కూలిపనులకు పోదామని తయారయ్యారు. అదే సమయంలో అనుకోని అతిథి రావడంతో ఆశ్చర్యపోయారు. తేరుకునేలోపే.. అమ్మా.. పెద్దాయనా.. బాగున్నరానే అంటూ ఆయన ఆప్యాయంగా పలకరించారు.. మీరెవరో గుర్తొస్తలేరు.. ఎవరు నాయనా అంటూ వారు అనుమానంగా పలకరించారు. ఇంతలో ఆ గ్రామానికి చెందిన చదువుకున్న యువకుడు వెళ్లి సీనయ్య దంపతుల చెవిలో విషయం చెప్పాడు. ఆయన ప్రవీణ్కుమార్ సార్ అని పెద్దసారు.. మన ఇండ్లల్ల ఎంట్ల బతుకుతున్నరు.. పిల్లల్ని మంచిగ చదివిస్తున్నారా లేదా అని తెలుసుకోనీకే వచ్చిండు.. అని చెప్పటంతో వారు అవాక్కయ్యారు. ఏం మాట్లాడాలో.. ఏంచేయాలో వారికి తోచలేదు.. ఇంతలో ప్రవీణ్కుమార్ కల్పించుకుని మీరు ఏం పని చేస్తరు.. అని అడిగారు. కూలిపనులు చేస్తం సారు అని సమాధానమిచ్చారు.. రోజుకు ఎంతిస్తరు..? నాకు రెండు నూర్లు.. మా ఆవిడకు నూరు ఇస్తరు.. పొలం ఉందా?.. లేదు సారు.. మీకెంతమంది పిల్లలు..? ముగ్గురు పిల్లలు బాబూ అని చెప్పారు సీనయ్య దంపతులు. వారు ఏం చదివారు ప్రవీణ్కుమార్ అడగడంతో.. పెద్దమ్మాయిని డిగ్రీ చదివించినం.. ఇప్పుడు ప్రైవేటు దవాఖాన్ల నర్సు ఉద్యోగం చేస్తోంది. చిన్నబిడ్డ.. కొడుకు పరిగిల కాలేజ్కి పోతున్నరు.. అంటూ ఆ దంపతులు ప్రవీణ్కుమార్ అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇచ్చారు. సీనయ్య ఇంట్లో ప్రవీణ్కుమార్ గంటసేపు ఉన్నారు. వారితో చాయ్ పెట్టించుకుని తాగారు. వారి సాధకబాధకాలు అడిగి తెలుసుకున్నారు. ఎస్సీ కాలనీల్లో సామాజిక, ఆర్థిక స్థితిగతులపై ఆయన ఆరా తీశారు. 'నేనూ.. మీలాగే పేదింట్లో పుట్టాను.. చదువుకోవటంవల్లే ఈ స్థాయికి వచ్చాన'ని వివరించారు. కూలిపనులు చేసుకుంటూ పిల్లలను చదివిస్తున్న ఆ దంపతులను ఆయన కొనియాడారు. అనంతరం అక్కణ్నుంచి వెళ్లిపోయారు. -
శ్రమయేవ జయతే !
నిరుపేద కుటుంబంలో పుట్టానని ఆమె ఏనాడూ కుంగిపోలేదు. కుటుంబ పోషణ భారమై తల్లిదండ్రులు బాలసదనంలో చేర్పించినా అధైర్యపడలేదు. అహర్నిశలు కష్టపడి విద్యనభ్యసించారు. గురువుల నమ్మకాన్ని నిలబెడుతూ..తల్లిదండ్రుల ఆశలు నెరవేరుస్తూ ప్రభుత్వ ఉద్యోగం సాధించారు. విధి నిర్వహణలో రాణిస్తూ అంచెలంచెలుగా పదోన్నతులు పొందుతూ కష్టేఫలి సూత్రానికి ఉదాహరణగా నిలిచారు. ఆమే కమలాపురం ఐసీడీఎస్ ప్రాజెక్ట్ సూపర్వైజర్ జయలక్ష్మి. కమలాపురం: పులివెందుల తాలూకా, తొండూరు మండలం గోటూరు గ్రామానికి చెందిన సాలెమ్మ, వెంకటేష్ల చివరి సంతానం జయలక్ష్మి. ఆమెకు ఐదుగురు సోదరులు, ఇద్దరు సోదరీమణులు. అసలే నిరుపేద కుటుంబం.. అపై సంతాన భారం ఎక్కువ. అలాంటి సమయంలో కడప అక్కాయపలెలోని ప్రాంతీయ బాలసదనం అధికారులు జయలక్ష్మిని తల్లిదండ్రుల సహకారంతో బాలసదనంకు తీసుకెళ్లారు. నిరుపేదలను తీర్చి దిద్దే ఆ సంస్థలో తమ చిన్నారి చదవడానికి తల్లిదండ్రులు పూర్తి అంగీకారం తెలిపారు. 1 నుంచి 10వ తరగతి వరకు జయలక్ష్మి బాలసదనంలో చదవుకున్నారు. కడప గర్ల్స్ కళాశాలలో ఇంటర్ పూర్తి కాగానే అంగన్వాడీ వర్కర్గా ఉద్యోగంలో చేరారు. వేంపల్లె మండలం పాలమూరులో తొలిసారిగా ఆమె ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. 1997లో పదోన్నతిపై గ్రేడ్-2 సూపర్వైజర్గా రాయచోటి నియోజకవర్గంలోని సుండుపల్లె మండలానికి సూపర్ వైజర్గా పని చేశారు. 2007లో బదిలీపై కమలాపురం వచ్చిన జయలక్ష్మి 2013లో గ్రేడ్-1 సూపర్ వైజర్గా పదోన్నతి పొందారు. ప్రస్తుతం కమలాపురం ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని వీఎన్ పల్లె మండలంలో సూపర్వైజర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రతిభకు దక్కిన పురస్కారం.. బాలసదనంలో చదివి ఉన్నత స్థానం పొందిన వారిని ఈనెల 14న విజయవాడలో జరిగిన చిన్నారుల దినోత్సవ వేడుకల్లో సన్మానించారు. అందులో భాగంగా జిల్లా నుంచి జయలక్ష్మిని సన్మానించారు. గోల్డ్ మెడల్, మెమెంటో, ప్రశంసా పత్రాలను ప్రిన్సిపల్ సెక్రటరి నీలం సహాని, మంత్రి పీతల సుజాత చేతుల మీదుగా అందుకుని శభాష్ అని పించుకున్నారు. ఈ అవార్డుకు ఎంపికైం ది జిల్లానుంచి ఈమె ఒక్కరే కావడం విశేషం. ఈ సందర్భంగా స్థానిక సీడీపీఓ శ్రీమతమ్మ, ఇతర సూపర్వైజర్లు, అంగన్వాడీ కార్యకర్తలు ఆమెను మంగళవారం అభినందించారు. -
హామేరీకోమ్స్
పేదరికం ఎదురు నిలిచినా... కుటుంబం బాధ్యతలు మోపినా... సంకల్పమే ఆమెకు బలం. పట్టుదలే ప్రోత్సాహం. లక్ష్యం ఉండాలే గానీ... ఏవీ అడ్డంకులు కాదన్నది ఆమె నమ్మిన సిద్ధాంతం. కృషే పెట్టుబడిగా... సవాళ్లే నిచ్చెనగా చేసుకొని ఎదిగిన వుట్టిలో మాణిక్యం.. బాక్సింగ్ చాంపియన్ మేరీకోమ్. పవర్ పంచ్లతో రింగ్లో ప్రత్యర్థులను వుట్టికరిపిస్తున్న ఈ వుణిపూర్ వుణిపూస స్ఫూర్తితో వున సిటీలోనూ పుట్టుకొస్తున్నారు మేరీకోమ్లు. కృష్ణప్రియ, ధ్రువిక, ప్రవల్లిక, ఒసామా, సునీత, నసీరున్, తన్మయ్ యాదవ్... ఒకరా ఇద్దరా... మెరుపు పంచ్లు విసురుతూ అకుంఠిత దీక్షతో ‘టార్గెట్’ వైపు దూసుకుపోతున్నారు ఎందరో బాలికలు. కృష్ణప్రియ. నిరుపేద కుటుంబం. నాన్న జ్ఞానేశ్వర్ ఫుట్పాత్పై హెల్మెట్స్ అమ్ముతుంటాడు. ప్యారడైజ్ నల్లగుట్ట గవర్నమెంట్ గర్ల్స్ హైస్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతోంది. పీఈటీ, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో జింఖానా గ్రౌండ్లో రెండేళ్ల నుంచి బాక్సింగ్లో కోచింగ్ తీసుకుంటోంది. ఎల్బీ స్టేడియంలో జరిగిన ఇంటర్ డిస్ట్రిక్ట్ బాక్సింగ్ పోటీల్లో గోల్డ్మెడల్ సాధించింది. నగ్మా రెడ్హిల్స్లోని ఇండో గ్రామర్ హైస్కూల్లో పదో తరగతి చదువుతోంది. తండ్రి షేక్ ముక్తా నాంపల్లిలో మెకానిక్. ఆమె గతేడాది అసోంలో జరిగిన నేషనల్ బాక్సింగ్ చాంపియన్షిప్లో ప్రతిభ చూపింది. జిల్లాస్థాయి టోర్నీల్లోనూ పలు పతకాలను సాధించింది. ఆ నలుగురు... బి.కృష్ణవేణి, మౌనిక, నవ్య, రోజా సీతాఫల్మండిలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో చదువుకుంటున్నారు. పీఈటీలు హరిశ్చంద్రప్రసాద్, శ్రీనివాస్మూర్తిల పర్యవేక్షణలో బాక్సింగ్లో రాటుదేలుతున్నారు. గతేడాదిలో రాష్ట్రస్థాయి పోటీల్లో పతకాలు సాధించారు. ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నీలో గోల్డ్మెడల్స్ దక్కించుకున్నారు. కృష్ణవేణికి అమ్మ లే దు. నాన్న గాంధీ వాచ్మన్. మౌనిక నాన్న నాగేశ్వర్రావు చిరు వ్యాపారి. నవ్య తండ్రి యాదగిరి రిక్షాపుల్లర్. రోజా ఫ్యామిలీదీ రెక్కాడితేగానీ డొక్కాడని పరిస్థితి. తండ్రి హనుమంతు, తల్లి కమలమ్మ మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికులు. వీరందరూ కడుపుకట్టుకొని కన్నబిడ్డల కలలు నెరవేర్చేందుకు కష్టపడుతున్నారు. ఈ అమ్మాయిలందరిదీ ఒకేమాట.. ‘లక్ష్యాన్ని చేరుకునేదాకా పిడిగుద్దుల వర్షం కురిపిస్తాం.’ శిక్షణ ఇలా... ఎల్బీ స్టేడియం, సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్లో బాక్సింగ్లో శాప్ ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తున్నారు. ఇక్కడ ‘పే అండ్ ప్లే’ పద్ధతిలో ప్రవేశం పొందవచ్చు. నిజాం కాలేజీలోని శిక్షణ కేంద్రానికి ఉస్మానియా వర్సిటీ నిధులు సమకూరుస్తోంది. ఎల్బీ స్టేడియం కోచ్ ఓంకార్ యాదవ్ -99851 55357, జింఖానా మైదానం కోచ్ శ్రీకాంత్రెడ్డి -94920 35789, నిజాం కళాశాల కోచ్ కేఆర్ స్టీవన్ -92465 38129. ఎల్బీ స్టేడియం కేంద్రంలో ప్రవేశానికి కనీసం 11 ఏళ్లు నిండి ఉండాలి. 14 ఏళ్లలోపు వారు రూ.35, 14 ఏళ్లు పైబడినవారు రూ.70 ప్రవేశ రుసుం చెల్లించాలి. నెల ఫీజూ అంతే మొత్తం. జింఖానాగ్రౌండ్లో ప్రవేశానికి 14 ఏళ్ల లోపు బాలలు రూ.70, ఆ వయసు పైబడినవారు రూ.110 ప్రవేశ రుసుం చెల్లించాలి. 14 ఏళ్లలోపు వారు రూ.30, 14 ఏళ్లు పైబడినవారు రూ.50 ప్రతినెలా ఫీజు చెల్లించాలి. నగరంలోని వివిధ ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో బాక్సింగ్ శిక్షణ ఇస్తున్నారు. మెళకువలపై పట్టు ముఖ్యం... పదిహేనేళ్లుగా బాక్సింగ్ శిక్షణ ఇస్తున్నా. మెలకువల్లో పట్టు సాధిస్తే బాక్సింగ్లో రాణించడం తేలికే. మా కేంద్రంలో బాక్సర్లకు కావలసిన సామగ్రి అంతా అందుబాటులో ఉంది. - ఓంకార్ యాదవ్, శాప్ బాక్సింగ్ కోచ్, ఎల్బీ స్టేడియం జీహెచ్ఎంసీ శిక్షణ కేంద్రాలు.. కోచ్లు రీహ ంపురా ప్లే గ్రౌండ్- పురానాపూల్-అనిల్ కుమార్-99081 99383 కులీకుతుబ్ షా-మోహన్దాస్ మఠ్ పురానాపూల్-బహుదూర్ సింగ్-8801093421 సలర్-ఈ-మిల్లార్ చందూలాల్ బరాదరి- బహుదూర్పురా ఇస్మాయిల్ 9885963502 ఫలక్నుమా ప్లే గ్రౌండ్ అబిద్ ముస్తఫా-9652924694 విక్టరీ ప్లే గ్రౌండ్-చాదర్ఘాట్ దుర్గాప్రసాద్-98666 72227 జీహెచ్ఎంసీ ప్లే గ్రౌండ్- షెనాయ్ నర్సింగ్ హోం-మారేడ్ పల్లి కె.కృష్ణ -9290218047 గురుమూర్తి స్విమ్మింగ్ పూల్ పరేడ్ గ్రౌండ్స్ (అశోక్ కుమార్) - వాంకె శ్రీనివాస్ -
బాధ్యత తీసుకోండి
ప్రేరణ ఎవరి జీవితం ఎలా ఉంటుందనేది వారి పనులను బట్టే ఉంటుంది. ఎవరి భవితవ్యానికి వారే బాధ్యత వహించాలి. మరెవరో బాధ్యత తీసుకోవడం కష్టమైన పని. నా జీవితం ఇలా కావడానికి ఫలానా వ్యక్తులు, పరిస్థితులే కారణమంటూ సాకులు చెప్పి తప్పించుకోవాలని చూస్తే నష్టపోయేది ముమ్మాటికీ మీరే. ఇతరులపై నిందలేయడం సరి కాదు. ముళ్ల పొదల్లా గజిబిజిగా ఉన్న జీవితాన్ని సుందర నందనవనంగా మార్చుకోవాలి. ఒకేరకమైన పరిస్థితుల మధ్య పెరిగిన ఇద్దరు కుర్రాళ్లు వాటిని తమ జీవితానికి ఏ విధంగా అన్వయించుకున్నారో తెలుసుకుందాం.. పేద కుటుంబం, నాన్న తాగుబోతు ఓ నగరంలో ఓ యువకుడు చిన్న నేరం చేసి పోలీసులకు దొరికాడు. ఉద్యోగం దొరక్కపోవడంతో చిన్నచిన్న నేరాలు చేస్తూ బతుకుతున్నాడని పోలీసుల విచారణలో తేలింది. ఇలా ఎందుకు మారావని పోలీసులు ప్రశ్నించగా.. ‘‘మాది చాలా పేద కుటుంబం. రెండు పూటలా కడుపు నింపుకోవడానికి కూడా డబ్బు లేదు. మా నాన్న తాగుబోతు. నన్ను, మా తమ్ముడిని చావ బాదేవాడు. చదువుకుందామంటే డబ్బుల్లేవు. మాది చిన్న ఇల్లు. అందులో చదువుకోవడానికి అనువైన వాతావరణం లేదు. ఇలాంటి పరిస్థితుల మధ్య పెరిగిన నేను దొంగను కాక ఇంకేమవుతాను? నేను ఇలా మారిపోవడానికి కచ్చితంగా మా నాన్న, నేను పుట్టి పెరిగిన పరిస్థితులే కారణం’’ అంటూ.. చెప్పాడు. ఈ యువకుడి వాదన ఇలా కొనసాగుతుండగా ఇక్కడికి సమీపంలోనే ఓ సన్మాన కార్యక్రమం జరుగుతోంది. విధిని, తలరాతను నేనే నిర్దేశించుకున్నా.. మురికివాడలో పుట్టి, కష్టపడి చదువుకొని, ప్రతిష్టాత్మక బిజినెస్ స్కూల్ ప్రవేశ పరీక్షలో మొదటి ర్యాంకు సాధించిన యువకుడిని అక్కడ సన్మానిస్తున్నారు. అతడికి పూల దండలేసి, శాలువాలు కప్పి గొప్పవాడంటూ పొగిడారు. ఇదంతా ఎలా సాధించావో చెప్పాలని కోరగా ఆ యువకుడు ఇలా ప్రసంగించాడు.. ‘‘మాది చాలా పేద కుటుంబం. రెండు పూటలా కడుపు నింపుకోవడానికి కూడా డబ్బు లేదు. మా నాన్న తాగుబోతు. మద్యం మత్తులో నన్ను, మా అన్నను చావ బాదేవాడు. చదువుకుందామంటే డబ్బుల్లేవు. మాది చిన్న ఇల్లు. అందులో చదువుకోవడానికి అనువైన వాతావరణం లేదు. అలాంటి పరిస్థితుల నుంచి బయటపడి, మంచి జీవితం గడపాలంటే బాగా కష్టపడాలని అర్థం చేసుకున్నాను. నా జీవితానికి నేనే బాధ్యత తీసుకున్నాను. నా విధిని, తలరాతను నేనే నిర్దేశించుకున్నాను. రాత్రింబవళ్లూ శ్రమించి అనుకున్నది సాధించాను’’ అని చెప్పాడు. మనం ఎలా స్పందిస్తున్నాం? ఇప్పుడు మీరు ఊహించింది నిజమే. వారిద్దరూ సొంత అన్నదమ్ములే. కారణం చిన్నదే.. అన్న తన జీవితానికి ఇతరులను బాధ్యులను చేసి, చిల్లర దొంగగా మారిపోయాడు. తమ్ముడేమో బాధ్యతను తన భుజాలపైనే వేసుకొని, బతుకును బంగారంగా మార్చుకున్నాడు. మనకు ఏం జరిగింది అనే దాన్ని బట్టి కాకుండా.. జరిగిన దాని పట్ల మనం ఎలా స్పందిస్తున్నాం అనేదాన్ని బట్టే మన జీవితాలు ఆధారపడి ఉంటాయి. ఇతరులను, పరిస్థితులను నిందించడం, సాకులు చెప్పడం ద్వారా మనం బాధ్యత నుంచి తప్పుకుంటున్నాం. తద్వారా జీవితాలను మార్చుకొనే అవకాశాన్ని చేజేతులా జారవిడుచుకుంటున్నాం. నిమ్మరసం చేయడం నేర్చుకోవాలి ‘జీవితం నీకు నిమ్మకాయ ఇస్తే.. దాంతో నిమ్మరసం చేసుకోవడం నేర్చుకో..’ అనే సామెత ఉంది. నిమ్మకాయలో చేదు కూడా ఉంటుంది. చేదు తగలకుండా రసాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియాలి. పరిస్థితులు కూడా అలాంటివే. వాటిలో చెడును వదిలేసి, మంచిని గ్రహించడం మన చేతుల్లోనే ఉంది. నిందలు, సాకులు మానేయండి పరిస్థితులపై నిందలేయడం, సాకులు వెతకడం ఈరోజే మానేయండి. అదృష్టం, తలరాత, తల్లిదండ్రులు, టీచర్లు, యజమానులు.. మీ జీవితానికి వీరిని బాధ్యులను చేయకండి. మిమ్మల్ని మీరే బాధ్యులను చేసుకోండి. అనుకున్నది సాధించి చూపండి. మీ మనస్సు అనే కాక్పిట్లో ఒకే సీటు ఉంది. అందులో ఏ పైలట్ను కూర్చోబెడతారు. బాధ్యత నుంచి తప్పించుకొనే సాకునా? లేక బాధ్యతనా? నిర్ణయించుకోవాల్సింది మీరే. -‘కెరీర్స 360’ సౌజన్యంతో.. ప్రకాశ్ అయ్యర్, ఎండీ, కింబర్లీ- క్లార్క్ లీవర్ -
మూడుముళ్లు కాదని..చదువులమ్మ ఒడికి
ఫలించిన కవలల కల బాల్యవివాహానికి యత్నించిన తండ్రి పెళ్లొద్దు.. చదువుకుంటామన్న బాలికలు అధికారుల చొరవతో కళాశాలలో చేరిక వారిది నిరుపేద కుటుంబం. సంతానం ఎక్కువ. వారిలో రామక్క, లక్ష్మక్క కవల పిల్లలు. ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదివారు. మంచి మార్కులతో పాసయ్యారు. ఉన్నత చదువులు చదవాలని ఆశపడ్డారు. కటిక పేదరికాన్ని ఈదలేని ఆ తండ్రి వారికి పెళ్లిచేసి పంపేయాలని నిర్ణయించుకున్నాడు. పెళ్లిచూపులు కూడా జరిగాయి. వారిలో రామక్కను పెళ్లికి అంతా సిద్ధమైంది. ఇదంతా చూసిన రామక్క తన లక్ష్యం కోసం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. పెళ్లి ఇష్టం లేదని, చదువుకుంటామని తల్లిదండ్రులను ఎదిరించింది. ఈ విషయంపై ఉన్నతాధికారులకు సమాచారం అందించింది. ఎట్టకేలకు ఆ కవలల కల ఫలించింది. ఈ సంఘటన బెరైడ్డిపల్లె మండలం చిన్నపురంలో ఈనెల 4న వెలుగు చూసింది. అధికారుల చొరవతో ఇద్దరికీ ప్రభుత్వ కళాశాలలో శనివారం ఇంటర్మీడియెట్లో ప్రవేశం దొరికింది. పలమనేరు: చిన్నపురానికి చెందిన రాజప్పది పేద కుటుంబం. ఆయనకు ఏడుగురు సంతానం. వారిలో రామక్క, లక్ష్మక్క కవల పిల్లలు. వీరు లక్కనపల్లె హైస్కూల్లో ఈ ఏడాది పదో తరగతి ఉత్తీర్ణులయ్యా రు. ఒకరు 8.5. మరొకరు 6.5 పాయింట్లు సాధించి ప్రతిభ చూపారు. వారు బాగా చదవడమే ఆ కుటుం బానికి శాపమైంది. పై చదువులకు ఆర్థిక స్తోమత లేక ఇరువురికీ పెళ్లిళ్లు చేసి పంపేయాలని తండ్రి భావించాడు. దీంతో పొరుగూరికి చెందిన ఓ వ్యక్తితో ఈనెల 4న పెళ్లి చూపులు జరిగాయి. ఆ ఇద్దరు కవల పిల్లల్లో రామక్కను పెళ్లి చేసుకోవడానికి లగ్నం కుదిరింది. అయితే ఆ ఇద్దరు అమ్మాయిలు పెళ్లికి ససేమిరా ఒప్పుకోలేదు. చదువుకుంటామంటూ తల్లిదండ్రులను బతిమలాడారు. వారు కుదరదన్నారు. దీంతో రామక్క గ్రామంలోని ఓ కాయిన్ బూత్లో తనకు తెలిసిన వారికి ఈ విషయం గురించి ఫోన్లో చెప్పింది. ఈ విషయం ఐసీడీఎస్ సీడీపీవో రాజేశ్వరి చెవినపడింది. దీంతో ఆమె హుటాహుటిన ఆ శాఖ పీడీ ఉషాఫణికర్, ఆర్జేడీ శారదకు సమాచారమిచ్చింది. వెంటనే గ్రామంలోని డ్వాక్రా మహిళలను వారి ఇంటి వద్దకు పంపారు. 1098 చైల్డ్లైన్కు సమాచారం అందించారు. వీరందరూ కలసి అదేరోజు రాత్రి పది గంటల ప్రాంతంలో ఆ గ్రామానికి చేరుకున్నారు. గ్రామ ఎంపీటీసీ వాసు సహకారంతో పంచాయితీ పెట్టారు. అక్కడ కూడా ఆ ఇద్దరు అమ్మాయిలు తాము చదువుకుంటామంటూ విన్నవించారు. దీంతో గ్రామస్తులంతా కలసి వారు చదువుకోవాల్సిందేనంటూ నిర్ణయం తీసుకున్నారు. ఈ భారాన్ని నెత్తినేసుకున్న సీడీపీవో తమ అధికారులతో పాటు పలమనేరులోని రోప్స్ స్వచ్ఛంద సంస్థ, చిత్తూరులోని ఐసీపీఎస్ (ఇంటిగ్రేటేడ్ చైల్డ్ ప్రొటెక్షన్ సర్వీసెస్)తో సంయుక్తంగా వారిని కళాశాలలో చేర్పిం చేందుకు ఇన్నాళ్లుగా ప్రయత్నించారు. తిరుపతి, అనంతపురంలో ప్రయత్నించగా అప్పటికే ఇంటర్ అడ్మిషన్లు పూర్తయిపోయాయి. ఎట్టకేలకు వీరంతా జిల్లా అధికారులను సంప్రదించి స్పెషల్ కేటగిరి ద్వారా చిత్తూరులోని క్రిష్ణవేణి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శని వారం ఇద్దరినీ చేర్పించారు. అక్కడే ఎస్సీ బాలికల హాస్టల్లో సీటు ఇప్పించారు. ఇన్నాళ్లు అధికారులు పడ్డ శ్రమ ఫలించింది. ఆ ఇద్దరు కవలల ఆశ నెరవేరింది. ఇద్దరూ చదువుల తల్లి ఒడిని చేరారు. -
బాల్ మిత్రులు
వారిద్దరూ బాల్యమిత్రులే కాదు, ‘బాల్’ మిత్రులు కూడా. ఇద్దరిదీ నిరుపేద నేపథ్యమే. బడిలో కలసి చదువుకున్నారు. ఆటలాడుకున్నారు. కష్టసుఖాలు పంచుకున్నారు. ఎదిగే వయసులో ఫుట్బాల్ను లక్ష్యంగా ఎంచుకున్నారు. ఏకంగా ‘ఫిఫా’ స్లమ్ సాకర్ టోర్నీలో పాల్గొనే భారత జట్టులో చోటు సాధించారు. తారిఖ్ చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు. ఆయన మరణంతో అక్క, అన్నలతో కలసి టోలిచౌకిలోని అమ్మమ్మ ఇంటికి చేరుకున్నాడు. తమ్ముడు, చెల్లి .. పాతబస్తీలోనే అమ్మ జహెరబాను బేగం వద్దే ఉంటున్నారు. ఆమె టైలరింగ్ చేస్తూ బతుకుబండిని నెట్టుకొస్తోంది. అమ్మమ్మ ఇంటి వద్ద ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి వరకు తారిఖ్ చదువు ఇబ్బందిగానే సాగింది. అమ్మమ్మ ఇళ్లలో పనులు చేసి సంపాదించేది. ఆమె సంపాదనతోనే తారిఖ్ చదువు ముందుకు సాగింది. ఇక సిమర్ప్రీత్ తండ్రి స్కూటర్ స్పేర్పార్ట్స దుకాణంలో ఉద్యోగి. చాలీచాలని సంపాదన. ఆర్థికంగా ఎలాంటి ఆసరా లేకున్నా సిమర్ప్రీత్.. స్కాలర్షిప్తో చదువు కొనసాగించాడు. తారిఖ్, సిమర్లు ఆరో తరగతి నుంచే మిత్రులు. ఇంటర్ చదువుతుండగా, మాసబ్ట్యాంక్లోని స్పోర్ట్స కోచింగ్ ఫౌండేషన్ సహకారంతో ‘అవేక్’ ఫౌండేషన్ మురికివాడల్లోని విద్యార్థులతో ఫుట్బాల్ మ్యాచ్లు ఆడించారు. వారిలో తారిఖ్, సిమర్లు అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించారు. వారి ఆటకు ఫిదా అయిన కోచ్ మహమ్మద్ సలేద్.. వారికి శిక్షణ ఇచ్చారు. కళాశాల కాగానే మైదానానికి... తారిఖ్ షాదాన్ కాలేజీలో ఇంజనీరింగ్ చేస్తున్నాడు. సిమర్ప్రీత్ ఏవీ కాలేజీలో బీకాం రెండో సంవత్సరం చదువుతున్నాడు. కళాశాల కాగానే ‘బాల్’మిత్రులిద్దరూ నేరుగా మైదానానికి చేరుకుంటారు. మూడు నాలుగు గంటలు ఏకదీక్షతో సాధన చేస్తారు. వీరిద్దరూ మిడ్ఫీల్డర్లే! ఇటీవల నాగపూర్లో జరిగిన ఆలిండియా స్లమ్ సాకర్ టోర్నీలో స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్ జట్టును రన్నరప్గా నిలపడంలో తారిఖ్, సిమర్లు కీలక పాత్ర పోషించారు. తమ ఆటతీరుతో అక్టోబర్లో చిలీలో నిర్వహించనున్న ‘ఫిఫా’ స్లమ్ సాకర్ టోర్నీకి ఎంపికయ్యారు. - వాంకె శ్రీనివాస్ -
పాణమున్నా.. బొమ్మే!
విధి వెక్కిరించింది. ఆ కుటుంబం వెన్ను విరిచింది. రెక్కలొచ్చిన కొడుకు.. తన రెక్కల కష్టంతో తన పేద కుటుంబాన్ని కొంతైనా ఆదుకోవాలని భావిస్తే.. అతన్ని రెక్కలు విరిచి జీవచ్ఛవాన్ని చేసింది. మంచానికి కట్టి పడేసింది. లారీ రూపంలో విధి జరిపిన దాడిలో చెట్టంత కొడుకు మృత్యుముఖంలోకి వెళ్లాడు. తల్లడిల్లిన తల్లిదండ్రులు దాతల కరుణతో కొడుకు ప్రాణాలు నిలపగలిగారు గానీ.. అతన్ని మంచం నుంచి దించలేకపోయారు. లక్షల రూపాయలు పెట్టి చికిత్స చేయించడం తమ తలకు మించిన పని అని రోదిస్తున్నారు. పాలకొండ రూరల్: 2014, జనవరి 12.. ఓ కుర్రాడు రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతున్నాడు. ఇంతలో ఒక లారీ భూతంలా దూసుకొచ్చి అతని పైనుంచి వెళ్లిపోయింది. అంతే పనికి వెళుతున్నానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరిన ఆ కుర్రాడు ఆస్పత్రిపాలయ్యాడు. దాంతో ఆ కుటుంబం కష్టాలు ప్రారంభమయ్యాయి. పాలకొండ పట్టణం గురువుగారి వీధికి చెందిన సోమరిపేట దుర్గారావుది నిరుపేద కుటుంబం. కులవృత్తిపైనే ఆధారపడిన ఆయన రెక్కల కష్టంతో కొడుకు శివప్రసాద్ను ఉన్నత చదువులు చెప్పించాలన్న లక్ష్యంతో డిగ్రీ వరకు చదివించాడు. ఇంతకాలం తన చదువు కోసం అష్టకష్టాలు పడిన తండ్రికి కొంతైన చేదోడువాదోడుగా ఉందామన్న ఉద్దేశంతో శివప్రసాద్ మరింత ఉన్నత చదువులకు ప్రయత్నిస్తూనే స్థానిక బట్టల షాపులో పనిలో చేరాడు. తానొకటి తలస్తే.. దైవం మరొకటి తలచినట్లు.. జనవరి 12న పని చేస్తున్న దుకాణానికి వెళుతున్న అతన్ని వెనుక నుంచి వచ్చిన లారీ పైనుంచి దూసుకుపోయింది. తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో పడిన కొడుకును రక్షించికోవడానికి తల్లిదండ్రులు నానా అవస్థలు పడ్డారు. దాతల సాయంతో లక్ష రూపాయలకుపైగా వైద్య చికిత్సలకు ఖర్చు చేసి ప్రాణాలు నిలబెట్టగలిగారు. మంచం మీదే అన్నీ.. ప్రాణమైతే దక్కింది గానీ.. లేచి నిలబడ లేక, నడవలేక శివ జీవచ్ఛావంలా మారాడు. మంచానికే పరిమితమయ్యాడు. ఆసరాగా ఉంటాడనుకున్న కొడుకు కొన్ని నెలలుగా మంచానికే పరిమితం కావడంతో ఆ కుటుంబం వెన్ను విరిగినట్టయింది. చికిత్సకు ఇప్పటికే దాతల సాయంతోపాటు చేతిలో ఉన్న డబ్బంతా కరిగిపోయింది. కదలలేని స్థితిలో ఉన్న కొడుక్కి సపర్యలతో పాటు అన్ని అవసరాలు తీర్చాల్సిన పరిస్థితి ఏర్పడటంతో వారు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. శివను తిరిగి ఆరోగ్యవంతుడిగా నిలబెట్టడానికి అవసరమైన చికిత్స కోసం వైద్యులను ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని, దానికి రూ.6 లక్షలకు పైగా ఖర్చు అవుతుందని వారు చెబ్బడంతో తల్లిదండ్రులు కుంగిపోయారు. కులవృత్తి, కూలి పనులు చేస్తే తప్ప కడుపు నిండని స్థితిలో అంత సొమ్ము ఎక్కడి నుంచి తేగలమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగని కొడుకు దుస్థితి చూడలేక కన్నీరుమున్నీరవుతున్నారు. మనస్సున్న మారాజులు స్పందించి ఆర్థికంగా చేయూతనిస్తే కొడుకు జీవితంతోపాటు.. తమ కుటుంబాన్ని నిలబెట్టినవారవుతారని ఆశగా ప్రార్థిస్తున్నారు. -
పట్టుదలతో ఏదైనా సాధించవచ్చు
నిరుపేద కుటుంబంలో పుట్టిన.. కేబినెట్ మంత్రిగా పనిచేశా.. 965 సినిమాల్లో ఆ మూడు ఎన్నటికీ మరువలేను హాస్యనటుడు బాబుమోహన్ దుగ్గొండిలో స్కూల్ వార్షికోత్సవానికి హాజరు దుగ్గొండి, న్యూస్లైన్: ‘చిన్న పల్లెలో నిరుపేద కుటుంబంలో పుట్టాను. పూరిపాక పాఠశాలలో చదివాను. ఇప్పుడు కోట్లాది మంది అభిమానులను సం పాదించుకున్నా.. ఈ రోజు ఈ స్థాయిలో ఉం టానని ఎన్నడూ ఊహించలేదు’ అని ప్రముఖ హాస్యనటుడు బాబుమోహన్ అన్నారు. దుగ్గొండి మండల కేంద్రంలోని కృష్ణవేణి టా లెంట్ స్కూల్లో గురువారం రాత్రి జరిగిన చైత్ర-2014 వార్షికోత్సవ సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. గ్రామీ ణ ప్రాంతాలలో పుట్టిన ఎంతో మంది కలెక్టర్ లు, డాక్టర్లు అయ్యారని, తాను ఒక మారుమూల పల్లెలో నుంచి వచ్చి పట్టుదలతో ఎంఏ, ఎల్ఎల్బీ చదివి రెండు సార్లు ఎమ్మెల్యే గా, ఒకసారి కేబినెట్ మంత్రిగా పనిచేశానని చెప్పారు. పట్టుదల ఉంటే ఏదైనా సాధించ వచ్చని చెప్పారు. చిన్నప్పుడే తల్లిదండ్రులు చిన్నారులకు వినయ విధేయతలు నేర్పించాల న్నారు. తాను ఇప్పటికి 965 సినిమాలలో నటించానని, వాటిలో మూడు సినిమాలను ఏనాటికీ మరువలేనని ఆయన అన్నారు. అంకుశం.. యాక్టర్ను చేస్తే, మామగారు.. కమెడియన్ చేయగా, మాయలోడు.. హీరో చేసిందని బాబుమోహన్ చెప్పారు. సభలో ప్రసంగిస్తూనే ‘నీలిమబ్బు కురులలోన’ ‘ఇంత కూరుంటేయ్యమ్మా.. బువ్వుంటేయ్య మ్యా’ అంటూ పాట పాడుతూ స్టెప్పులు వేసి సభికులను ఆనందంలో ముంచెత్తారు. కొందరు ఆయనతో గొంతు కలిపి స్టెప్పులేశారు. అనంతరం బాబుమోహన్ సర్కిల్ సీఐ మధు, పాఠశాల డెరైక్టర్ పెంచాల శ్రీనివాస్ పూలమాలలు, శాలువాలతో సన్మానించారు. అనంతరం వార్షికోత్సవ సభలో విద్యార్థులు ప్రదర్శించిన నృ త్యాలు, నాటికలు ఆహూతులను ఆకట్టుకున్నాయి.కార్యక్రమంలో కాకతీయ యునివర్శిటి ప్రిన్సిపాల్ రామస్వామి, ఎంవీ రంగారావు, భూపాల్రావు, ఎస్సై ముజాహిద్, సర్పంచ్ ఆరెల్లి చందన, పాఠశాల ఇం చార్జీ రాంబాబు, కళాశాల ఇంచార్జీ దానం వీరేందర్, పేరెంట్స్ కమిట బాధ్యులు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
నవ్వింత: పేదకుటుంబం అంటే...
ఒక ధనవంతుడి కొడుకుని స్కూల్లో ‘పేదకుటుంబం’ అనే విషయం మీద వ్యాసం రాయ మన్నారు. అతడు ఇలా రాయసాగాడు. ‘‘అనగనగా ఓ బీద కుటుంబం. తండ్రి చాలా బీదవాడు. తల్లి కూడా ఎంతో పేదది. వాళ్ల పిల్లలు కూడా అంతే. పాపం వాళ్ల కారు డ్రైవరు, వంటమనిషి, తోటమాలి... అంతా పేదవాళ్లే. చివరకు వాళ్లింట్లో పనిచేసే వాచ్మేన్ కూడా బీదవాడే. ఒక రోజున వాళ్లు తినడానికి తిండిలేక, ఆహారం వెతుక్కంటూ కారులో బయలుదేరారు...’’ పెళ్లాడేదెవరిని? అతడు: ఇక మన పెళ్లి జరగదు రాధా... ఆమె: ఎందుకు గోపీ? అతడు: పొద్దున మీ ఇంటికి వెళ్లాను. ఆమె: మా నాన్నను కలిశావా? వద్దన్నాడా?! అతడు: కాదు మీ చెల్లిని చూశా! వార్నీ... ఏం చెప్పావ్! టీచర్: నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు? స్టూడెంట్: డాక్టర్నవుతా. దాని కోసం ఇప్పటి నుంచే జీవశాస్త్రం, గణిత శాస్త్రం బాగా నేర్చుకొంటున్నా. టీచర్: డాక్టర్ అవ్వాలంటే జీవశాస్త్రం నేర్చుకొంటే చాలుగా, గణితం ఎందుకు? స్టూడెంట్: బిల్స్ రాసివ్వడానికి! నాకూ రాదులే! స్విమ్మింగ్పూల్లోకి దూసుకెళ్తున్న గణేష్ని అక్కడి గార్డ్ అడ్డుకొన్నాడు. గార్డ్: అందులో నీళ్లు లేవు సార్.. గ ణేష్: నాక్కూడా ఈత రాదు లేవయ్యా! -
బతుకు గూడులో తుపాను విధ్వంసం
నరసాపురం టౌన్, న్యూస్లైన్ : రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కుటుంబం వారిది. పూరిగుడిసెలో జీవనం సాగిస్తున్న ఆ పేద కుటుంబాన్ని తుపాను నిలువ నీడ లేకుండా చేసింది. తలదాచుకోవడానికి గూడులేక అష్టకష్టాలు పడుతున్నారు. పాక్షికంగా ఇంటికి నష్టం వాటిల్లిందటూ అందికారులు అరకొరగా సాయం అందించి చేతులు దులుపుకున్నారు. దీంతో బాధితులు గత్యంతరం లేక బంధువుల ఇంట్లో తలదాచుకుంటున్నారు. పూర్తి సాయం చేసి పుణ్యం కట్టుకోండి బాబూ అంటూ 28వ వార్డు గోగులమ్మ చెరువునకు చెందిన జడ్డు పద్మావతి అధికారులకు, ప్రజా ప్రతినిధులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. హెలెన్ తుపాను ఆమె పూరిల్లు పూర్తిగా కూలిపోయింది. నిలువ నీడ కరువవడంతో బంధువులు ఆసరా ఇవ్వడంతో కుటుంబ సభ్యులంతా వారి ఇంటి వసారాలో తలదాచుకుంటున్నారు. పద్మావతి భర్త వీరవెంకట సత్యనారాయణ అనారోగ్యంతో కదలలేని పరిస్థితుల్లో ఉన్నాడు. కొడుకు కూలి పని చేసి తీసుకువచ్చే డబ్బుతో ఆమె కుటుంబాన్ని పోషిస్తోంది. ఇల్లు నేలకూలడంతో ప్రభుత్వం సహాయం కింద ఇచ్చే రూ.5 వేలతో మళ్లీ పూరిగుడిసె వేసుకోవాలని ఆమె భావించింది. కొంత మేర అప్పు చేసి మళ్లీ రాటలు నిలబెట్టుకుంది. ఈ లోగా అధికారులు వచ్చి ఇల్లు పాక్షికంగా దెబ్బతిందంటూ పరిహారంగా రూ.1900 నగదు, 10 కిలోల బియ్యం అందించి చేతులు దులుపుకున్నారు. ప్రభుత్వం అందించిన సహాయం కనీసం తాటాకు కొనేందుకు కూడా సరిపోదని గోడలు, తలుపులు, తదితర ఇంటి సామగ్రి అమర్చుకునే ఆర్థిక స్థోమత తమకు లేదని ఆమె వాపోతోంది. పూర్తి సహాయం కింద రూ. 5 వేలు ఇప్పించాలని పలుమార్లు ప్రభుత్వ కార్యాలయం చుట్టూ తిరిగింది. అధికారులు కనికరించకపోవడంతో మానవత్వం ఉన్న వారి సహాయం కోసం ఆమె బేలగా ఎదురు చూస్తోంది. -
కూలీ బతుకులు ఛిద్రం
అమ్మా...అమ్మా.... గాదెనబోయిన సంతోష రోజువారికూలీ. భర్తేమో లారీ డ్రైవర్. వారి కుమారుడు జశ్వంత్(4), కూతురు శరణ్య(2). రోజు మాదిరిగానే సాయంత్రానికి ఇంటికి చేరే తల్లి ఎంతకీ రాకపోవడంతో ఆ చిన్నారుల రోదనలు మిన్నంటాయి. పాపం ఆ పిల్లలకు తెలియదు తమ తల్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిందని. అయితే సంతోష రెండు రోజుల క్రితమే పౌల్ట్రీ ఫామ్లోకి పని కుదిరింది. జనవరి ఫస్ట్న పనికి వెళ్లలేదు. కూలికి వెళ్లిన రెండోరోజే లారీ సంతోషను పొట్టనపెట్టుకుంది. వారంతా కూలీలు.. రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కుటుంబాలు. భర్తలు వివిధ పనులు చేస్తుండగా ఇంటి బండి లాగడానికి తమవంతు కష్టపడుతున్నారు. కానీ వారి జీవితాల్లో లారీ చీకటి నింపింది. పని ముగించుకుని ఇంటికి వస్తున్న వారిని చిదిమేసింది. వారి కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. నార్కట్పల్లి మండలం ఏపీ లింగోటం వద్ద గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మహిళా కూలీలు దుర్మరణం పాలయ్యారు. - న్యూస్లైన్, కట్టంగూర్ కట్టంగూర్, న్యూస్లైన్ : నార్కట్పల్లి మండల పరిధిలోని ఏపీలింగో టం వద్ద జాతీయ రహదారిపై గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో మం డలంలోని ముత్యాలమ్మగూడానికి చెందిన నలుగురు కూలీలు మృతి చెందారు. గ్రామానికి చెందిన చెరుకు వెంకమ్మ(50), కట్టెకుంట్ల ధనమ్మ(30), గాదెనబోయిన సంతోష(28), కట్టెకుంట్ల ముత్తమ్మ(50) మృతి చెందారనే వార్త తెలియడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఒకే కుటుంబంలో అత్తాకోడళ్లు ప్రమాదంలో దుర్మరణం చెందారు. బంధువుల, గ్రామస్తుల రోదనలతో గ్రామం శోకసంద్రంగా మారింది. పొట్టకూటి కోసం వెళ్లిన తొలిరోజే మృత్యుఒడికి చేరిన అత్తాకోడళ్లు గ్రామానికి చెందిన కట్టెకుంట్ల ముత్తమ్మ, కట్టెకుంట్ల ధనమ్మలు అత్తాకోడళ్లు. డిసెంబర్ 31న నార్కట్పల్లి మండలం ఏపీలింగోటం సమీపంలో ఉన్న పౌల్ట్రీ ఫాంలో కూలి పనికి ఒప్పందం కుదుర్చుకున్నారు. కాగా జనవరి 1 నూతన సంవత్సరం కావడంతో పనికి వెళ్లలేదు. దీంతో గురువారం పనుల్లోకి వెళ్లిన తొలిరోజునే మృత్యువాత పడడంతో కుటుంబంలో తీరని విషాదం అలుముకుంది. మృతురాలు ముత్తమ్మకు ఒక్కడే కొడుకు. కాగా ధనమ్మకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. అత్తాకోడళ్లు ఇద్దరు వృత్తిరీత్యా కూలీలు. కాగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గ్రామంలో పంటపొలాలు, పత్తి పూర్తిగా దెబ్బ తిన్నాయి. దీంతో కూలీ పనులు దొరకపోవటంతో పౌల్ట్రీ ఫాంలో పనులకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చేందుకు రహదారిపై ఉండగా లారీ రూపంలో మృత్యువు కబలించింది. రె క్కాడితే డొక్కాడని కుటుంబం వెంకమ్మది చెరుకు వెంకమ్మ వృత్తిరీత్యా కూలీ. గతంలోనే భర్త మృతి చెందాడు. ఈమెకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. కూలినాలీ చేసుకుంటూ ఇద్దరు కుమార్తెల వివాహం చేసింది. కొడుకు కుమార్ను ఇంటర్ చదివిస్తోంది. రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబం వీధిన పడే పరిస్థితి ఏర్పడింది. -
ఎందరికో పండు తనువు పుండు
కామారెడ్డి, న్యూస్లైన్: పొట్ట నింపుకోవడం కోసం కొందరు మ హిళలు పరువాలను పణంగా పెడుతున్నారు. అరువు దెచ్చుకున్న నవ్వుల తో, అలంకరించుకొని బేరాల కోసం దారులు వెదుక్కుంటున్నారు. అప్పుడప్పుడు పోలీసులు దాడులు చేస్తే అరెస్టు అయి జరిమానాలు కట్టి తిరిగి అదే వృత్తిని కొనసాగిస్తున్నారు. కామారెడ్డి పట్టణంలోని కొత్త బస్టాండ్ పరిసరాలలో రహదారులకు ఇరువైపులా శరీరాల సంత సాగుతోం ది. బస్టాండ్ ప్రాంతంలో ఉన్న లాడ్జీల సాక్షిగా పడుపువృత్తి నడుస్తోంది. కొందరు మహిళలు దీనినే జీవనాధారంగా మార్చుకున్నారు. గతంలో పాతబస్టాండ్ అడ్డాగా సాగిన వీరి దందా, ఇప్పుడు కొత్తబస్టాండ్ పరిసరాలలోకి మారింది. వచ్చిన దాంట్లో సగభాగం లాడ్జీ యజమానులకు చెల్లించాల్సిందే. శారీరకంగా కృశిస్తున్నా వచ్చే కొద్దిపాటి డబ్బులతో కుటుంబ పోషణ ఏమోగాని రోగాలను నయం చేసుకునేందుకే సరిపోతోంది. వైద్యం చేయించుకు నేందుకు డబ్బులు లేక మృత్యువాత పడుతున్నవారూ ఉన్నారు. రోజూ మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వీరి దందా కొనసాగుతోంది. బస్టాండ్ ప్రాంతంలో నిత్యం వందలాది మంది ప్రజలు సంచరిస్తుంటారు. తాగిన మత్తులో వచ్చే విటులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా వారిని ఎదిరించలేక, ఈ శరీరం తమది కాదన్నట్టుగా ఒదిగిపోయే విధానానికి అలవాటు పడిపోయారు. పొట్టపోసుకునేందుకు తమ బతుకులింతేననుకుని ఈ రోజు ముగిసింది, రేపటి రోజు చూసుకుందామనే దారిలో సాగిపోతున్నారు. ఇక్కడ వ్యభిచారం చేసే వారంతా పేదరికంతోనే ఈ వ ృత్తిలోకి వచ్చారనేది మాత్రం నిజం. గతంలో ఓ లాడ్జీలో మహిళ హత్యకు గురైంది. ఇటీవల కామారెడ్డి పట్టణ శి వారులో, సదాశివనగర్ మండలంలోని అటవీ ప్రాంతంలో ఇద్దరు మహిళల హత్యలు కూడా ఈ కారణంతోనే జరిగాయి. హత్య కేసులను చేదించడం పోలీసులకు సవా ల్గా మారుతోంది. క్లూ దొరికేదాక ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఈ వృత్తిని నిర్మూలిస్తే ఇలాంటి హత్య లు కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. ఇబ్బందులు పడుతున్న ప్రజలు ఈ మహిళలు రహదారుల వెంట నిలబడే తీరు ఇతర మహిళలను ఇబ్బందులకు గురిచేస్తోంది. పురుషులు సైతం ఇక్కడి వాతావరణాన్ని చూసి ఇబ్బందులు పడుతు న్నారు. లాడ్జీలలో వ్యభిచారం అనేది బహిరంగ రహస్యం. అప్పుడప్పుడు పోలీసులు దాడులు చేసి దొరికినవారిని పట్టుకెళ్లి రిమాండుకు పంపి చేతులు దులుపుకుంటారు. ఆ మహిళ లు ఎందుకు ఈ వృత్తిలోకి వచ్చారన్న విషయాన్ని ప్రభుత్వ యం త్రాంగం పట్టించుకోవడం లేదు. వారిలో పరివర్తన తీసుకువచ్చేందుకు సంబంధిత అధికారులు చొరవ చూపితే కొంతవరకు మార్పు వచ్చే అవకాశం ఉంది. పోలీసు అధికారులతోపాటు ఇతర అధికారులు ఒక ప్రణాళిక రూపొందించి పడుపు వృత్తిలోకి దిగిన మహిళలకు కౌన్సెలింగ్ నిర్వహించి, వారు ఇరత వృత్తులు చేసుకునేందుకు మార్గం చూపాలి. ప్రభుత్వ పథకాలను అందించి వారిలో మార్పు తీసుకురావాలి. ఒక్క కామారెడ్డి పట్టణంలోనే కాకుండా జిల్లావ్యాప్తంగా నడుస్తున్న వ్యభిచారాన్ని నిరోదించేందుకు తగు ప్రణాళికలు రూపొం దించాలి. దాబాల్లో మద్యం తాగడాన్ని నిషేధించి పకడ్బం దీగా అమలు చేస్తున్న పోలీసు యంత్రాంగం పడుపు వృత్తిపై కూడా దృష్టి సారిస్తే మంచి ఫలితాలు వస్తాయని పలువురు సూచిస్తున్నారు. -
నేడు వైఎస్సార్ నాలుగో వర్ధంతి
సాక్షి, నల్లగొండ: నిరుపేదల పెన్నిధిగా, రైతు బాంధవుడిగా, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా కీర్తిగడించిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి దూరమై సోమవారంతో నాలుగేళ్లు గడిచాయి. ప్రజల్లో భౌతికంగా లేకున్నా.. అంతర్లీనంగా ఆయన గుర్తులు జ్వలిస్తూనే ఉన్నాయి. ఆయన అమలుచేసిన ఎన్నో పథకాలతో బడుగు, బలహీన వర్గాలు ఎనలేని లబ్ధిపొందాయి. కర్షకుడు, కార్మికుడు, విద్యార్థి, వికలాంగుడు, మహిళ, నేతన్న, వృద్ధాప్య.. ఇలా అన్ని వర్గాలకు ఆయన చేసిన సేవలు అజరామరం. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ఎందరికో పునర్జన్మ నిచ్చారు. మహామనిషి శ్రీకారం చుట్టిన పథకాల ద్వారా లబ్ధి పొందిన ప్రతి వ్యక్తి ఆయనను నిత్యం స్మరించుకుంటున్నారు. సోమవారం వైఎస్సార్ నాలుగో వర్ధంతిని ఘనంగా జరుపుకునేందుకు అభిమానులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అన్ని ఏర్పాట్లు చేశారు. వైఎస్సార్ విగ్రహాలకు క్షీరాభిషేకం, అన్నదానం, దుప్పట్లు, పండ్లు పంపిణీ తదితర కార్యక్రమాలు చేసేందుకు ప్రజలు సన్నద్ధమయ్యారు. పల్లెపల్లెలో మహానేతను గుర్తుచేసుకునేందుకు సిద్ధమయ్యారు. మహానేత వైఎస్సార్ వర్ధంతిని ఘనంగా నిర్వహించాలని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ బీరవోలు సోమిరెడ్డి పిలుపునిచ్చారు. జిల్లాకేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. వైఎస్సార్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద తరలిరావాలని కోరారు. 3కోమటిరెడ్డి బ్రదర్స్ తెలంగాణ ద్రోహులే ^èlండూరు, న్యూస్లైన్ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి బ్రదర్స్ తెలంగాణ ద్రోహులేనని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్రెడ్డి అన్నారు. ఆదివారం చండూరు రహదారి బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి దగ్గరగా ఉంటూ కోట్లాది రూపాయాల కాంట్రాక్టులు దక్కించు కున్నారని ఆయన ఆరోపించారు. ఇటీవల ముఖ్యమంత్రి కిరణ్కుమార్ నుంచి కూడ *3 వేల కోట్ల విలువ గల పనులను దక్కించుకున్నారన్నారు. ప్రభుత్వం నుంచి 10 శాతం డబ్బులను అడ్వాన్స్గా పొంది ఇందులో 5 శాతం ముఖ్యమంత్రి తమ్ముడికి అందిచారని పేర్కొన్నారు. ఈ నెల 7 తేదీన జరిగే క్యాబినేట్ సమావేశంలో తెలంగాణ బిల్లుపై తీర్మానం చేస్తారన్నారు. ఈ తీర్మానాన్ని అధిష్టానానికి పంపించనున్నట్లు ఆయన చెప్పారు. తెలంగాణలో ఉండి దాగుడు మూతలు ఆడుతున్న ద్రోహులను ఆంధ్రాకు తరిమి కొట్టాలన్నారు. సమావేశంలో జిల్లా నాయకుడు కె.శ్రీనివాస్రెడ్డి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. 4