puppy
-
45 కిలోల భారీ ఆకారంలో.. బుజ్జి కుక్క పిల్ల!
‘పెంపుడు కుక్క పిల్ల’.. అనగానే ముద్దుగా మన కాళ్లకు అడ్డుపడే బుజ్జి కుక్కపిల్ల మనకు గుర్తుకువస్తుంది. అయితే దీనికి భిన్నంగా 45 కిలోల బరువైన భారీ కుక్క పిల్లను మీరు ఎప్పుడైనా చూశారా? దాని ఆకారం చూసి కూడా దానిని ఒడిలోకి తీసుకుని దాని యజమాని మురిసిపోతుంటాడు. ఆరడుగుల పొడవు, దాదాపు 45 కేజీల బరువున్న ఈ బుల్ డాగ్ పేరు రోల్ఫ్. భారీ ఆకారం ఉన్నప్పటికీ అది బుజ్జి కుక్క పిల్ల మాదిరిగానే ప్రవర్తిస్తుంటుంది. దాని యజమాని క్రెయిగ్ కూడా దానిని ఒడిలో పెట్టుకుని మురిసిపోతుంటాడు. దాని చేష్టలు చూసి, దీనికి ఇంకా చిన్నతనం పోలేదని అందరికీ చెబుతుంటాడు. క్రెయిగ్ కొన్నేళ్ల క్రితం స్ట్రోక్తో నడవలేకపోయేవాడు. అదే సమయంలో రోల్ఫ్ను ఇంటికి తీసుకువచ్చాడు. రోల్ఫ్ రాకతో తన జీవితమే మారిపోయిందని. క్రెయిగ్ చెప్పాడు. రోల్ఫ్ అతని జీవితాన్ని తిరిగి ట్రాక్లోకి తీసుకువచ్చేందుకు సహాయపడిందట. తాను అనారోగ్యం నుంచి కోలుకున్నానంటే దానికి రోల్ఫ్ కారణమని క్రెయిగ్ చెబుతుంటాడు. సాధారణంగా శునకాలు వయసే పెరిగేకొద్దీ తమ చేష్టలను తగ్గిస్తుంటాయి. అదే సమయంలో తమ యజమానిపై ప్రేమను కురిపిస్తాయి. అయితే రోల్ఫ్ విషయంలో దాని వయసు, ఆకారం పెరిగినా అది పిల్ల చేష్టలను ఇంకా మానలేదట. -
కుక్కపిల్లను కొట్టిచంపాడు
భోపాల్: అటుఇటు తిరుగుతూ తన వద్దకు వచి్చన కుక్కపిల్లను ఓ వ్యక్తి అత్యంత నిర్దయగా నేలకేసి కొట్టి చంపాడు. మధ్యప్రదేశ్లోని గుణ జిల్లాలో జరిగిన ఈ దారుణం అక్కడి సీసీటీవీలో రికార్డయింది. వీడియో వైరల్గా మారడంతో వేలాది మంది.. ఆ వ్యక్తి కర్యశ చర్యపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింథియా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ దృష్టికి తీసుకెళ్లడంతో అరెస్ట్కు ఆదేశాలిచ్చారు. కఠిన శిక్ష పడేలాచూస్తామని ముఖ్యమంత్రి శివరాజ్ హామీ ఇచ్చారు. శనివారం సాయంత్రం గుణ జిల్లాలోని సుభాష్ కాలనీలో జరిగిన ఈ దారుణ ఘటన తాలూకు వీడియో చూసిన వారంతా వ్యక్తిని తీవ్రంగా శిక్షించాలంటూ పోస్టులు పెట్టారు. దాదాపు 30 ఏళ్ల వయసున్న ఆ వ్యక్తి ఆరుబయట కూర్చోగా అక్కడికి రెండు బుల్లి కుక్కపిల్లలు తిండి కోసం తచ్చాడుతూ వచ్చాయి. వాటిల్లో ఒకటి ఇతడి సమీపానికి రాగానే వెంటనే ఆగ్రహంతో కుక్క పిల్లను ఎత్తిపట్టుకుని నేలకేసి బలంగా కొట్టాడు. అక్కడి నుంచి లేచి వచ్చి దానిని కుడికాలితో పలుమార్లు తొక్కిచంపాడు. ఈ హృదయవిదారక దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ‘‘ఇది నా హృదయాన్ని కలిచివేసింది. అతనికి కఠిన శిక్ష పడేలా చేస్తాం’’ అని ముఖ్యమంత్రి చౌహాన్ ‘ఎక్స్’లో వ్యాఖ్యానించారు. -
Disturbing Video: ‘తీవ్రంగా ఖండిస్తున్నా.. కఠినశిక్ష విధిస్తాం’
భోపాల్: మధ్యప్రదేశ్లోని గుణా జిల్లాలో చోటుచేసుకున్న ఓ అనాగరిక ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ స్పందించారు. ఆ ఘటనకు పాల్పడిన వ్యక్తిపై అత్యంత కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. దారుణమైన ఘటన వివరాల్లోకి వెళ్లితే.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గుణా జిల్లాలో ఓ వ్యక్తి తన ఇంటి మందు కూర్చొని ఉండగా .. అతని వద్దకు రెండు చిన్న కుక్క పిల్లలు వచ్చాయి. Dear CM @ChouhanShivraj sir @MPPoliceDeptt @JM_Scindia ji -- This is a revolting & barbaric video involving cruelty by a man on a puppy that has shocked collective conscience Incident took place in Guna. Sacred texts say dogs have souls of God. 🙏💔pic.twitter.com/RCJ2CM7sO3 — Rohan Dua (@rohanduaT02) December 9, 2023 దీంతో అతను ఓ కుక్క పిల్లను పట్టుకొని విచక్షణరహితంగా నేలకు విసిరికొట్టాడు. అక్కడికి ఆగకుండా ఆ కుక్క పిల్లను కాలుతో నలిపేశాడు. ఈ దారుణ ఘటన అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. శుక్రవారం జరిగిన ఈ ఘటన సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటన తన దృష్టికి రావటంతో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పందిస్తూ.. ఈ అనాగరికమైన ఘటనకు పాల్పడిన వ్యక్తిపై జరిమానా విధించాలని సీఎం చౌహాన్ను ఎక్స్( ట్విటర్) ద్వారా కోరారు. Deeply disturbed by the horrifying incident. Swift and strict action will be taken to ensure justice is served. We unequivocally condemn such acts of barbarism, and the individual responsible will face the consequences. https://t.co/yYdCyKli64 — Shivraj Singh Chouhan (@ChouhanShivraj) December 10, 2023 దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. ‘అనాగరిక ఘటన తీవ్రంగా కలిచివేసిది. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. కచ్చితంగా బాధ్యులు పర్యవసానాలు ఎదుర్కొంటారు’అని ఆయన ఎక్స్లో పేర్కొన్నారు. -
శునకానికి సీమంతం
అన్నానగర్: కడలూరు జిల్లా శ్రీముష్ణం తాలూకా కవలక్కుడి గ్రామానికి చెందిన పళనివేల్, అంబుజ వల్లి దంపతుల కుమార్తె పవిత్ర. ఈమె ఒక కుక్కపిల్లని పెంచుతోంది. దానికి లూసీ అని పేరు పెట్టారు. కుటుంబంలో ఒకరిలా చూస్తు న్నారు. ప్రస్తుతం లూసీ గర్భిణి కావడంతో పళనివేల్ కుటుంబం లూసీకి సీమంతం షవర్ నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. లూసీని ప్రత్యేకంగా అలంకరించి పూలమాల వేసి కుర్చీలో కూర్చోబెట్టారు. బంగారు హారాన్ని ధరించి పసుపు, కుంకుమ పెట్టారు. అలాగే, లూసీకి ఇష్టమైన ఆహార పదార్థాలను దాని ముందు ఉంచి మంచి పిల్లలకు జన్మనివ్వాలని దేవుడిని ప్రార్థించారు. -
నాకు కావాలసినది కుక్కపిల్ల కాదు.. కోడలు పిల్లా..!
నాకు కావాలసినది కుక్కపిల్ల కాదు.. కోడలు పిల్లా..! -
సోనియాకు రాహుల్ సర్ప్రైజ్ గిఫ్ట్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తన తల్లి సోనియాగాంధీకి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. ఒక బుజ్జి కుక్క పిల్లను కానుకగా ఇచ్చారు. ఆ కుక్క పిల్లకి నూరీ అని పేరు పెట్టారు. బుధవారం ప్రపంచ జంతు దినోత్సవాన్ని పురస్కరించుకొని తల్లి సోనియాకు కుక్కపిల్లని ఇచ్చి ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఇదంతా వీడియో తీసి యూట్యూబ్లో ఉంచారు. అమ్మకి ఒక సర్ప్రైజ్ అంటూ రాహుల్ గాంధీ సోనియాను బయటకు తీసుకురావడంతో వీడియో మొదలవుతుంది. రాహుల్ ఇచ్చిన బాక్స్ తీసి చూసిన సోనియా గాంధీ అందులో బుజ్జి కుక్క పిల్ల ఉండడంతో సంతోషంతో ఉప్పొంగిపోయారు. చాలా క్యూట్గా ఉందంటూ మురిసిపోయారు. ఇప్పుడు తమ కుటుంబంలోకి మరో సభ్యురాలు వచ్చిందంటూ రాహుల్ చెబుతున్నారు. జాక్ రస్సెల్ టెర్రియర్ జాతికి చెందిన ఈ ఆడకుక్క పిల్లను రాహుల్ గోవా నుంచి ప్రత్యేకంగా తీసుకువచ్చారు. -
రాహుల్ గాంధీ ఇంటికి కొత్త అతిథులు.. గోవా వెళ్లి మరీ తీసుకొచ్చారు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇంటికి కొత్త అతిథులు వచ్చి చేరాయి. గోవా పర్యటనకు వెళ్లిన ఆయన.. అక్కడ నుంచి వచ్చేటప్పుడు రెండు కుక్క పిల్లలను ఢిల్లీలోని తన నివాసానికి తీసుకొచ్చారు. జాక్ రస్సెల్ టెర్రియర్ జాతికి చెందిన మూడు నెలల వయసు రెండు కుక్క పిల్లలను పెంచుకునేందుకు తీసుకున్నారు. కాగా బుధవారం సాయంత్రం గోవా వెళ్లిన రాహుల్ గాంధీ గురువారం ఉదయం మళ్లీ ఢిల్లీ చేరుకున్నారు. తన పర్యటనలో గోవాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అమిత్ పట్కర్తో ఓ హోటల్లో భేటీ అయ్యారు. వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికలకు పార్టీ సన్నద్ధతపై వారితో చర్చించారు. పర్యటన ముగించుకొని మోపాలోని మనోహర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే ముందు షేడ్స్ కెన్నెల్ అనే పెంపుడు జంతువుల విక్రయ సంస్థను సందర్మించారు. శివాని పిత్రే అనే మహిళ తన భర్తతో కలిసి నార్త్ గోవాలోని మపుస ప్రాంతంలో దీనిని నడుపుతోంది. అక్కడ జాక్ రస్సెల్ టెర్రియర్ జాతికి చెందిన ఒక మగ, ఒక ఆడ కుక్కను కొనుగోలు చేశారు. అయితే విమానయాన నిబంధనల కారణంగా ఒక కుక్కను మాత్రమే తనతో దిల్లీ తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ విమానాశ్రయానికి బయలుదేరే ముందు కొద్దిసేపు కెన్నెల్లో కుక్క పిల్లలతో గడిపారని పిత్రే పేర్కొన్నారు. చదవండి: అరుదైన దృశ్యం.. విపక్షాల హామీతో సభలోకి స్పీకర్ అడుగు ఆయన అత్యంత నిరాడంబరుడని, తమతో ఓ స్నేహితుడిలా మాట్లాడారని తెలిపారు. కెన్నెల్లో కుక్కపిల్లలతో కలిసి రాహుల్ గాంధీ ఆడుకున్నారని చెప్పారు. రాహుల్ గాంధీ రెండు కుక్క పిల్లలను కొనుగోలు చేశారని, వీటిలో ఒక పప్పీని ఆయన ఇంటికి తీసుకెళ్లారని మరో దానిని తరువాత పంపిస్తామని శివాని తెలిపారు. ముందుగా రాహుల్ గాంధీ సిబ్బంది ఒకరు వచ్చి పప్పీల గురించి తెలుసుకున్నారని, అయితే వాటిని కొనుగోలు చేసే ముందు ఆయనే స్వయంగా వాటిని చూసేందుకు ఇక్కడికి వచ్చారని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా అజీమ్ ప్రేమ్ జీ, కరీనా కపూర్ వంటి పలువురు ప్రముఖులు ఈ జాతి కుక్కలను కొనుగోలు చేశారు. జాక్ రస్సెల్ టెర్రియర్ జాతి శునకాలకు బ్రిటన్లో విపరీతమైన జనాదరణ ఉంది. వీటి ఆహార్యం చిన్నగా కన్పించినా.. అవి చాలా తెలివిగా వ్యవహరిస్తాయి. 4 నుంచి 7 కిలోల బరువుండే ఈ కుక్కలు 25 సెంటీమీటర్ల దాకా ఎత్తు పెరుగుతాయి. వీటి జీవిత కాలం కూడా ఎక్కువే. రష్యాకు చెందిన మందుపాతరలు, బాంబులను పసిగట్టినందుకు ఇదే జాతికి చెందిన పీట్రన్ అనే శునకానికి ఇటీవల ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ పతకాన్ని బహూకరించారు. చదవండి: అరుదైన దృశ్యం.. విపక్షాల హామీతో సభలోకి స్పీకర్ అడుగు -
మమతా బనెర్జీ ఏం చేస్తుందో చూడండి..!
-
మెక్సికోకు 'కుక్కపిల్ల'ను గిఫ్ట్గా ఇచ్చిన టర్కీ!..అదే ఎందుకంటే?..
మెక్సికోకు టర్కీ మూడు నెలల వయసున్న జర్మనీ షెపర్డ్ కుక్కపిల్లను ఇచ్చించి. ఈ మేరకు మెక్సికో సైన్యం బుధవారం టర్కీ గిఫ్ట్గా ఇచ్చిన ఆ కుక్క పిల్లను స్వాగతించింది. అసలు టర్కీ ఎందుకు ఆ కుక్కపిల్లనే గిఫ్ట్గా ఇచ్చిందంటే..ఈ ఏడాది ప్రారంభంలో ఫిబ్రవరి నెలలో టర్కీ, సిరియాలలో భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఆ ప్రకృతి విలయతాండవానికి వేలాదిగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. నాటి ఘటనలో భూకంప శిథిలాల కింద చిక్కుకున్న ప్రజలను రక్షించేందుకు మెక్సికో రెస్క్యూ డాగ్లతో మోహరించింది. ఆ టర్కీ రెస్క్యూ ఆపరేషన్లో ప్రొటీయో అనే జర్మన్ షెషర్డ్ జాతికి చెందిన కుక్క చాలా చురుకుగా సేవలందించింది. ఐతే అది విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయింది. ఈ జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన కుక్క భూకంపాలు, ప్రకృతి వైపరిత్యాలకు గురయ్యే ప్రదేశంలో చిక్కుకుపోయిన వారిని గుర్తించడంలో ప్రత్యేకత కలిగి ఉంది. ఆయా ప్రదేశంలోని శిథిలాల కింద ప్రాణాలతో ఉన్నవారి ఆచూకిని కనిపెట్టడంలో ప్రసిద్ధి చెందింది. దీంతో టర్కీ ఆ జాతికి చెందిని మూడు నెలల వయసున్న కుక్క పిల్లను విధి నిర్వహణలో ప్రాణాలొదిలేసిన కుక్క పిల్లకు బదులుగా మెక్కికోకు గిఫ్ట్గా ఇచ్చింది. ఆ కుక్కపిల్లకు 'ఆర్కాదాస్గా' నామకరణం ఈ కుక్కపిల్లకు మెక్కికో సైన్యం స్వాగతం పలకడమే గాక ఆర్కాదాస్ అని పేరుపెట్టింది. టర్కిష్లో ఆర్కాదాస్ అంటే స్నేహితుడు అని అర్థం. మృతి చెందిన ప్రోటియోని సంరక్షించిన ట్రెయినరే ఆర్కాదాస్కి కూడా శిక్షణ ఇస్తారని మెక్సికో సైన్యం తెలిపింది. ఈ మేరకు సదరు కుక్కపిల్ల గ్రీన్కలర్ సైనిక యూనిఫాం ధరించి బుధవారం మెక్సికో సైనిక స్థావరంలో జరుగుతున్న అధికారిక వేడుకలో పాల్గొంది. సరిగ్గా మెక్కికో జాతీయ గీతం స్పీకర్ల నుంచి వస్తుండగా.. ఒక్కసారిగా ఆ కుక్కపిల్ల ఉద్వేగభరితంగా మొరిగి తన విశ్వాసాన్ని చాటుకుంది. ఈ నేపథ్యంలో మెక్కికో రక్షణ మంత్రిత్వ శాఖ ఆర్కాదాస్ తరుఫున ఒక ట్వీట్ కూడా చేసింది. ఆ ట్వీట్లో.."నన్ను ఎంతో ఆప్యాయంగా స్వాగతించిన మెక్సికోకు చెందిన స్నేహితులకు ధన్యవాదాలు. రెస్క్యూ డాగ్గా ఉండేందుకు నావంతుగా కృషి చేస్తానని వాగ్దానం చేస్తున్నాను ". అని పేర్కొంది రక్షణ శాఖ. కాగా, టర్కీ రెస్క్యూ ఆపరేషన్లో మరణించిన ప్రోటీయో కుక్కుకు మెక్కికో ఘనంగా సైనిక అంత్యక్రియలు నిర్వహించి నివాళులర్పించింది. (చదవండి: మరో ఆప్షన్ లేదు.. లొంగిపోతానన్నా వినొద్దు.. జెలెన్స్కీని మట్టుబెట్టాల్సిందే!) -
కుక్క పిల్లను కిడ్నాప్ చేసిన కోతి.. వీడియో వైరల్
-
వైరల్ వీడియో: ఎయిర్పోర్టు అధికారులను ముప్పుతిప్పలు పెట్టిన శునకం
ప్రయాణాల్లో కొంతమంది తమ పెంపుడు జంతువులను కూడా తీసుకెళ్తుంటారు. సొంత వాహనాల్లో పెంపుడు జంతువులను తీసుకెళ్లడం సులువే కానీ.. ట్రైన్, విమానం వంటి వాటిల్లో తీసుకెళ్లడం కొంచెం కష్టం. అవి ఎదుటి వారికి ఎలాంటి హానీ చేయకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఓ ఎయిర్పోర్టులో ఒక శునకం అధికారులు ముప్పుతిప్పలు పెట్టింది. విమానాశ్రయం రన్వే అంతా పరుగులు పెట్టించింది. ఈ సంఘటన మెక్సిలో చోటుచేసుకుంది. గ్వడలాజరలో గల మిగ్వుల్ హిడాల్గొ వై కాస్టిల్లా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు ఓ కుటుంబం తమ పెంపుడు కుక్కను తీసుకొచ్చింది. సరిగ్గా బోర్డిండ్ సమయానికి కుక్కకు కట్టిన తాడు తెగిపోయింది. ఇంకేముంది ఆ కుక్క యాజమాని నుంచి తప్పించుకొని విమానం నుంచి బయటకు వచ్చేసింది. విమానం కింద నుంచి. రన్ వైపే మొత్తం కలియ తిరిగింది. ఉరుకులు పరుగులు తీసింది. దీంతో కుక్క వెంబడి అధికారులు పరుగులు తీశారు. అయినా ఎంతకూ అది దొరకలేదు. అయితే ఆ సమయంలో రన్వే పైకి వాహనాలు రాకుండా అధికారలు జాగ్రత్తలు తీసుకున్నారు. చివరికి తిరిగి తిరిగి అలసిపోయిన సిబ్బంది ఎలాగోలా ఆ కుక్కను పట్టుకోవడంతో అందరూ హమ్మాయ్యా అంటూ ఊపిరి పీల్చుకున్నారు. దీనిని ప్రత్యక్ష సాక్షి ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.ఆ వీడియోలో శునకం పరుగు పెట్టించే అంశం స్పష్టంగా కనిపిస్తోంది. కాగా కుక్క ఎలా తప్పించుకుందనేదానిపై క్లారిటీ లేదు. ఇక పప్పీని పట్టుకునే క్మంలో వారికి ఎలాంటి గాయం కాలేదని తెలిసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది. ఇప్పటికే 2 లక్షల మంది వీక్షించారు. దీనిని చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. అధికారులకు శునకం మంచి వ్యాయామం చేయించిందని కామెంట్ చేస్తున్నారు. -
కుక్కపిల్లపై మోజుతో ఆ యువకుడు ఏం చేశాడంటే.. చివరికి..
పెనుకొండ(అనంతపురం జిల్లా): కుక్క పిల్ల కోసం చోటు చేసుకున్న ఘర్షణలో ముగ్గురు గాయపడ్డారు. వివరాలు.. పెనుకొండ మండలం మంగాపురంలో రైతు అమరనాథరెడ్డి తన పొలంలోని షెడ్ వద్ద ఆదివారం ఉదయం ఓ కుక్క పిల్లను కట్టి ఉంచాడు. కుక్కపిల్లపై మోజుతో దానిని అదే గ్రామానికి చెందిన యువకుడు శబరీష్ ఎత్తుకెళ్లాడు. కాసేపటి తర్వాత ఈ విషయం తెలుసుకున్న అమరనాథరెడ్డి.. వెంటనే శబరీష్ను మందలించాడు. చదవండి: పాపం ఏమైందో గానీ పెళ్లయిన నెలకే జవాను, భార్య ఆత్మహత్య ఆ సమయంలో ఇద్దరి మధ్య మాటామాట పెరిగి కొట్టుకున్నారు. అంతటితో ఆగకుండా శబరీష్ ఇంటికి వెళ్లి తన సోదరుడు మంజునాథరెడ్డికి విషయం తెలిపి.. అమరనాథరెడ్డి వద్దకు పిలుచుకెళ్లాడు. ఆ సమయంలో ఘర్షణ చోటు చేసుకుని పరస్పరం దాడి చేసుకున్నారు. ముగ్గురికీ గాయాలయ్యాయి. ఘర్షణకు సంబంధించి బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
నువ్వే స్టెప్ వేస్తే అదే స్టెప్ వేస్తా!!: వైరల్ అవుతున్న క్యూట్ వీడియో
ఇటీవలకాలంలో జంతువులు భలే చక్కగా మనుషులను అనుకరిస్తూ రకరకాల పనులను చేస్తున్న వాటిని చూస్తునే ఉన్నాం. పైగా అవి మనం చేసే రోజువారి పనులను చూసి అవి కాపీ కొట్టి చక్కగా చేసేస్తున్నాయి. అంతేందుకు మనం ఎలాంటి భావాలు పలుకుతామో అలానే అనుకరించేస్తున్నాయి కూడా. అలాంటి వీడియోలు ఈ మధ్యకాలంలో తెగ వైరల్ అవుతున్నాయి. అచ్చం అలాంటి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. (చదవండి: ప్రపంచంలోనే అత్యంత ప్రీమెచ్యూర్ బేబిగా గిన్నిస్ రికార్డ్) అయితే ఈ వీడియోలో ఒక కుక్కపిల్ల తన యజమాని ఎలా డ్యాన్స్ చేస్తే తాను అలానే చేస్తోంది. పైగా ఈ వీడియోలో సదరు యజమాని ఏ విధంగా గత్తులేస్తూ డ్యాన్స్ చేస్తాడో అది అచ్చం అలానే చేస్తుంది. పైగా ఆ క్కక్కపిల్ల చాల చిన్నగా క్యూట్గా ఉంటుంది. అయితే ఈ కుక్కపిల్ల తన యజమానిని భలే అనుకరిస్తుంది. అంతేకాదు ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్, లైక్లు వచ్చాయి. మీరు కూడా ఓ లుక్ వేయండి. (చదవండి: నా ముందు నగ్నంగా కూర్చోబెడితేనే గుప్తనిధి కనబడుతుందంటూ..!) Dance battle with a puppy.. pic.twitter.com/i73mqEp9lb — Buitengebieden (@buitengebieden_) November 10, 2021 -
నీరజ్ చోప్రాకి అభినవ్ బింద్రా క్యూట్ గిఫ్ట్..
ఒలింపిక్స్లో స్వర్ణం సాధించిన తొలి భారత అథ్లెట్ నీరజ్ చోప్రాకు తొలి వ్యక్తిగత స్వర్ణం గెలిచిన షూటర్ అభినవ్ బింద్రా తన ఇంట్లో ఆతిథ్యం ఇచ్చాడు. ఈ సందర్భంగా నీరజ్ను అభినందించిన బింద్రా.. .తన తరఫునుంచి ‘టోక్యో’ పేరు గల కుక్కపిల్లను బహుమతిగా ఇచ్చి దానికి తోడుగా ‘పారిస్’ను తీసుకురావాలని ఆకాంక్షించాడు. వరల్డ్ ఆర్చరీ చాంపియన్షిప్ ఫైనల్లో సురేఖ బృందం యాంక్టాన్ (యూఎస్ఏ): వరల్డ్ ఆర్చరీ చాంపియన్షిప్లో వెన్నం జ్యోతి సురేఖ సభ్యురాలిగా ఉన్న భారత జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. కాంపౌండ్ విభాగంలో సురేఖ, ముస్కాన్ కిరార్, ప్రియ గుర్జర్ లతో కూడిన జట్టు సెమీ ఫైనల్లో 226–225 తేడాతో అమెరికాపై విజయం సాధించింది. శుక్రవారం జరిగే ఫైనల్లో కొలంబియాతో భారత్ తలపడుతుంది. అంతకు ముందు భారత జట్టు... ప్రిక్వార్టర్ ఫైనల్లో డెన్మార్క్పై, క్వార్టర్ ఫైనల్లో గ్రేట్ బ్రిటన్పై గెలుపొందింది. చదవండి: ఇక ‘బ్యాట్స్మన్’ కాదు.. బ్యాటర్! -
Viral: కుక్కపిల్లతో సీతాకోకచిలుకల చిలిపి ఆట!
సాధారణంగా సీతాకోకచిలుకలు చెట్ల, జంతువులు మీద వాలుతూ గాల్లో ఎగురుతుంటాయి. గార్డెన్, మైదానాల్లో తిరుగుతూ మనుషులకు దగ్గరగా వస్తుంటాయి. మనం వాటిని పట్టుకోవాలని ప్రత్నించగానే రివ్వున గాల్లోకి ఎగిరిపోతాయి. అయితే తాజాగా ఓ సీతాకోకచిలుక చిన్న కుక్కపిల్లతో చేసిన సందడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైలర్గా మారింది. ఈ వీడియోను బ్యూటెంజిబిడెన్ పేరుతో ట్విటర్లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో చిన్న కుక్కపిల్ల బంతిని తన నోటితో ఒక చోటు నుంచి మరోచోటుకి తీసుకువస్తుంది. అదే సమయంలో రెండు సీతాకోకచిలుకలు కుక్కపిల్లలో ఆడుకుంటాయి. ఒక సీతాకోకచిలుక కుక్కపిల్ల ముక్కు మీద వాలుతుంది. అది గ్రహించిన కుక్కపిల్ల వెంటనే దాన్ని పట్టుకోవాలని ప్రత్నించగానే గాల్లోకి ఎగిరి ఆటపట్టిస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వీడియోను వీక్షించిన నెటిజన్లు.. ‘సూపర్గా ఉంది వీడియో!! బుజ్జి కుక్క పిల్ల తీసుకోచ్చిన బంతి కదలకుండా ఉంది. కానీ, సీతాకోకచిలుక మాత్రం గాల్లో ఎగిరింది’.. ‘ ప్రశాంతమైన గార్డెన్లో.. చాలా అద్భుతంగా ఉంది వీడియో’.. ‘కుక్కపిల్లలో సీతాకోకచిలుక చిలపి ఆట బాగుంది’ అని సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోను ఇప్పటికే 10 లక్షల మంద వీక్షించారు. This is what Twitter is meant for.. pic.twitter.com/wY8r1IWyrw — Buitengebieden (@buitengebieden_) September 2, 2021 -
సూపర్ క్రేజ్.. 1.7 మిలియన్ లైక్స్
కరోనా ఎఫెక్ట్తో షూటింగ్లకు తాత్కాలికంగా విరామం దొరకడంతో హీరోలు, హీరోయిన్లు ఇళ్ల దగ్గరే తమకు నచ్చిన వ్యాపకాలతో బిజీగా ఉంటున్నారు. ఈ క్రమంలో యంగ్ హీరో విజయ్ దేవరకొండ తన పెంపుడు కుక్కలతో టైం పాస్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు విజయ్. ఇప్పటికే ఈ ఫోటోను 1.7 మిలియన్ల మంది లైక్ చేశారు. దీనిలో విజయ్ తన పెంపుడు కుక్కలు స్టార్మ్, చెస్టర్లతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. ‘చిల్లింగ్ విత్ దిస్ బాయ్స్’ అనే క్యాప్షన్తో షేర్ చేసిన ఈ ఫోటో అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. గత నెల తొలిసారి స్టార్మ్ ఫోటోను షేర్ చేశారు విజయ్. (అవకాశాలు అంత తేలికకాదు..) View this post on Instagram Chilling with these boys @thestormdeverakonda and @chester.thesamoyed. A post shared by Vijay Deverakonda (@thedeverakonda) on Aug 23, 2020 at 9:24am PDT ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఫైటర్’ సినిమాలో నటిస్తున్నారు. ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్గా నటిస్తోంది. -
కూతురికి కోసం తల్లే కుక్క పిల్లలా...
లండన్: ఆ తల్లికి కుక్కపిల్లలంటే ఎంతో ఇష్టం. ఆమె బిడ్డకు శునకాలంటే పిచ్చి. వెరసి తల్లీకూతుళ్లిద్దరూ విచిత్రంగా ప్రవర్తిస్తూ వార్తల్లోకెక్కారు. వినడానికి వింతగా ఉన్న ఈ అలవాటు చాలా ఏళ్ల నుంచి జరుగుతూ వస్తోందట. యూకేకు చెందిన 68 ఏళ్ల మెర్సియాకు 21 ఏళ్ల కూతురు అలినా. ఎంజైమ్ లోపంతో బాధపడుతున్న ఆమెను దత్తత తీసుకున్నప్పటికీ మెర్సియా సొంతబిడ్డకన్నా ఎక్కువగా చూసుకుంటుంది. (కరోనాతో ఆస్పత్రికి.. కట్ చేస్తే పెళ్లి) అయితే అలినాకు కుక్కపిల్లలు పెంచుకోవాలన్నది ఆశ. కానీ అది కుదరలేదు. దీంతో ఆమె తల్లే కుక్కపిల్లలా అవతారం ఎత్తింది. కూతురును నాకుతూనే మెర్సియా నిద్రలేపుతుంది. లేకపోతే ఆమె అస్సలు లేవదట. ఇలా చేయడానికి ముందు ఆమె కుక్కపిల్లలా శబ్ధాలు చేస్తూ కూతురిని సంతోషపెడుతుంది. ఈ దినచర్య కొన్నేళ్ల నుంచి జరుగుతూ వస్తోంది. తల్లి తనను నాకుతూ నిద్ర లేపడం మహా ఇష్టమని ముసిముసి నవ్వులు నవ్వుతోంది అలినా. ఖాళీ సమయాల్లో ఇలా ఒకరినొకరు నాకుతూ కుక్కపిల్లల్లా ఆడుకుంటామని ఈ తల్లీకూతుర్లు చెప్పుకొస్తున్నారు (ఇంతకంటే దారుణమైన ప్రమాదం ఉండదు.. కానీ!) -
వైరల్: కుక్కపిల్లను కొత్త పెళ్లికూతురిలా..
కొత్తగా కుక్కపిల్లను ఇంటికి తీసుకురావటమంటే శునక ప్రేమికులకు చెప్పలేనంత ఆనందం. ఆ ఆనందాన్ని తమకు తోచినట్లుగా తెలియజేస్తూ ఉంటారు. కొంతమందైతే దాన్నో వేడుకలా జరుపుకుంటారు. ఫ్లోరిడాకు చెందిన ఓ కుటుంబం అయితే ఓ కొత్త పెళ్లికూతుర్ని ఇంటికి ఆహ్వానించినట్లు కుక్కపిల్లను స్వాగతించింది. కొత్తగా ఇంటికి తెచ్చుకుంటున్న కుక్కపిల్లకు బెంజీ పాటెల్ అని పేరు పెట్టి, హారతి ఇచ్చి, ఎర్రనీళ్లతో దాని అడుగులను పదిలం చేసి మరీ ఇంట్లోకి ఆహ్వానించారు కుటుంబసభ్యులు. ఈ వీడియోకు ‘కబీ ఖుషీ కబీ గమ్’ బ్యాంక్ గ్రౌండ్ మ్యూజిక్ను జోడించి టిక్టాక్లో విడుదల చేశారు. దీంతో వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. (క్షమించు సుశాంత్: సన్నీ లియోన్) -
ఒకే కాన్పులో 18 కుక్కపిల్లలు
లండన్: సాధారణంగా కుక్క ఐదు నుంచి ఆరు పిల్లలకు జన్మనిస్తుంది. తల్లి కుక్క వయసు ఆధారంగా కూడా పిల్లల సంఖ్య మారుతుందట. కానీ శునకం గరిష్టంగా 15 మందికి జన్మనివ్వగలదు. అయితే అనూహ్యంగా ఓ కుక్క మాత్రం ఒకే కాన్పులో 18 మంది పిల్లలకు జన్మనిచ్చింది. ఈ అరుదైన ఘటన ఇంగ్లండ్లోని ప్రిస్టన్లో చోటు చేసుకుంది. మూడేళ్ల వయసున్న డాల్మటియన్ జాతి కుక్క నెల్లీ ఒకే కాన్పులో 10 మగ కుక్కలతోపాటు, ఎనిమిది ఆడ కుక్కలను జన్మనిచ్చింది. (ఇంతకీ పులి చిక్కిందా.. లేదా!) ఇవి ఉండాల్సిన పరిమాణం కన్నా రెట్టింపు సైజులో ఉండటం గమనార్హం. ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతుంటాయని వైద్యులు చెప్పుకొస్తున్నారు. ఇక నెల్లీ యజమాని లూయిస్ అప్పుడే పుట్టిన ఒక్క కుక్కపిల్ల మినహా మిగతా అన్నింటినీ దత్తత ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. కాగా అత్యధిక మందికి జన్మనిచ్చిన రికార్డు మాత్రం ఇంగ్లండ్లోని టియా కుక్క పేరు మీద ఉంది. ఇది 2014 నవంబర్లో ఒకే కాన్పులో 24 మందిని కన్నది. (మొదటిసారి డేటింగ్కు వెళుతున్నాడు అందుకే..) -
అది కుక్కపిల్ల కాదు: అక్కడే వదిలేయ్!
టోక్యో : దారి తప్పిపోయిన అడవి నక్కపిల్లను కుక్కపిల్ల అనుకున్న ఓ వ్యక్తి దాన్ని యాజమానితో కలపటానికి తీవ్రంగా శ్రమించాడు. చివరకు నిజం తెలుసుకుని కంగుతిన్నాడు. ఈ సంఘటన జపాన్లో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు.. మార్సీ.కామ్ అనే ట్విటర్ యూజర్కు కొద్దిరోజుల క్రితం రోడ్డుపక్కన ఓ జంతువు కనిపించింది. అది కుక్కపిల్ల అనుకున్న అతడు దాన్ని ఇంటికి తీసుకువచ్చాడు. కుక్కపిల్ల అనుకుంటున్న నక్కపిల్లను యాజమానితో కలపాలన్న ఉద్ధేశ్యంతో ట్విటర్ ద్వారా దాని యాజమాని ఎవరికైనా తెలిస్తే చెప్పాలని, యాజమాని వద్దకు చేర్చడానికి సహకరించాలని ప్రార్థించాడు. అయితే దీనిపై స్పందించిన ఓ నెటిజన్ ‘‘ అది కుక్కపిల్లకాదు, నక్కపిల్ల. దాన్ని ఎక్కడినుంచి తెచ్చావో అక్కడే వదిలేయ్!’’ అని చెప్పాడు. ( బుల్లోడా! నువ్వు సామాన్యుడివి కాదు..) దీంతో అతడికి అది నక్కపిల్లా? కుక్కపిల్లా? అన్న అనుమానం కలిగింది. వెంటనే దాన్ని దగ్గరిలోని జంతు వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లాడు. దాన్ని పరీక్షించిన ఆ వైద్యుడు అది కుక్కపిల్ల కాదని, అడవి నక్కపిల్ల అని తేల్చాడు. మార్సీ.కామ్ ట్విటర్ యూజర్ ఇక చేసేదేమీ లేక దాన్ని నక్కల అభయారణ్యంలో వదిలేశాడు. ( ఇలాంటి బాయ్ఫ్రెండ్ కావాలి! ) -
కుక్కకు పట్టిన గతే పట్టింది
-
లాక్డౌన్: కుక్కకు పట్టిన గతే పట్టింది
లాక్డౌన్ వల్ల మనుషులేనా, మూగజీవాలు ఎంతో ఇబ్బంది పడుతున్నాయి. పార్కుల వెంట పరుగులు తీయడం, రోడ్ల వెంట తోకూపుతూ నడవటం, మిగతా జీవులనూ రెచ్చగొడుతూనే యజమానుల ముందు ఏమీ తెలియనట్లు మొహం పెడుతూ కాళ్ల అతనిచ్చే బిస్కట్ కోసం బంతాట ఆడటం, అంతెంతుకు.. వీధి చివర తన ప్రేయసి/ప్రియుడుతో ఆటలాడటం ఇలా ఎన్నింటినో శునకాలు కూడా మిస్ అవుతున్నాయి. బిగ్ పొప్ప అనే మూడేళ్ల ఇంగ్లిష్ బుల్డాగ్ కూడా వీటి గురించే దీర్ఘాలోచనలో పడినట్లుంది. పాపం విచారంగా తల కిందికేసి చూస్తున్న దాని ఫొటోను యజమాని రే ఎల్లీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. (కరోనా : అమ్మా! మీ సేవకు సలాం) "ఇవాళెందుకో నా కుక్కపిల్ల బాధగా కనిపిస్తోంది. బహుశా పిల్లలతో కలిసి ఆడుకోలేకపోతున్నందుకు కావచ్చు" అంటూ క్యాప్షన్ జత చేసింది. ఇంకేముందీ, నెటిజన్లు అచ్చంగా ఆ కుక్క పరిస్థితే తమది కూడా అంటూ దాని ఫీలింగ్ను షేర్ చేసుకుంటున్నారు. కుక్కపిల్లపై సానుభూతి వర్షం కురిపిస్తున్నారు. అలా ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దాని యజమానురాలు రే ఎల్లీ మాట్లాడుతూ.. దానికి అన్నింటికన్నా పిల్లలే ఇష్టమని, వాటితో ఆడుకుంటే పొప్పకు ఎక్కడలేని సంతోషమని చెప్పుకొచ్చింది. కానీ ప్రస్తుత పరిస్థితుల వల్ల అది సాధ్యం కావట్లేదని పేర్కొంది. (మొసలికి ఊపిరాడకుండా చేసి..) -
ఆమె ప్లాన్ అదిరింది.. కుక్కపిల్ల చెడగొట్టింది!
-
ప్లాన్ అదిరింది.. కుక్కపిల్ల చెడగొట్టింది!
మీరు ఈ వీడియోను ప్లే చేయగానే... ఓ యువతి హ్యాండ్స్టాండ్ చేయటం. ఆ పక్కనే ఓ ముసలాయన చెక్క బల్లపై కూర్చుని పేపర్ చదవటం గమనిస్తారు. ఆ యువతి ఎంతో నేర్పుగా విన్యాసాలు చేస్తూ మనతో‘ అరే! భలే చేస్తోందే’ అనిపించుకుంటుంది. ఇంతలో ఓ కుక్కపిల్ల సీనులోకి అడుగుపెట్టడంతో అసలు కథ మొదలవుతుంది. ఓ క్షణం మనకు ఏమీ అర్థం కాదు. కుక్కపిల్ల గోడమీద నడవడమేంటి అనిపిస్తుంది. కొద్దిసేపటి తర్వాత ఆ ఇద్దరూ చేసిన జిమ్మిక్కు అర్థమై నవ్వొస్తుంది. ఇంతకీ విషయమేంటంటే.. ఆ యువతి హ్యాండ్స్టాండ్ చేస్తున్నట్టు, ఆ ముసలాయన గోడ దగ్గర బల్ల మీద కూర్చుని పేపర్ చదువుతున్నట్లు కెమెరా సహాయంతో మనకు భ్రమ కలిగించారు. అయితే ఆ ఫ్లోర్ మీదకు కుక్క నడుచుకుంటూ రావటంతో వారి ప్లాన్ ఫెయిలయింది. వారి ప్లాన్ ఫెయిలయినా వీడియో మాత్రం పెద్ద హిట్ అయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు‘‘ స్పైడర్ డాగ్.. ఆ ముసలాయన కూర్చున్న తీరు, పేపర్ చదవటం నిజంగా భ్రమ కలిగించాయి’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. -
కుక్కతో లైవ్ టెలికాస్ట్ చేసిన జర్నలిస్ట్
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విస్తరిస్తున్న వేళ అనేక దేశాలు లాక్డౌన్ విధించుకున్నాయి. అందులో భాగంగా ప్రజలెవరూ బయటకు రావద్దని స్పష్టమైన ఆదేశాలిచ్చాయి. మరోవైపు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటు కల్పించాయి. అయితే ఇంట్లో నుంచే పనులు చేయడం అందరికీ అంత సులువు కాదని నిరూపించిందీ సంఘటన. మైక్ స్లిఫర్ అనే జర్నలిస్ట్ ఇంట్లో నుంచే లైవ్ వీడియో చేస్తున్నాడు. వాతావరణ స్థితిగతుల గురించి చెప్తూ ఉండగా.. అతని కుక్క పిల్ల వచ్చి పక్కనే నిలబడింది. అతను వార్తలు చెప్పడం పూర్తవగానే కెమెరా వైపు సంతోషంగా చూసింది. దీనికి సంబంధించిన క్లిప్పింగ్ను మైక్ ట్విటర్లో షేర్ చేశాడు. (ప్లాన్ అదిరింది కానీ, బెడిసి కొట్టింది!) దీంతో నెటిజన్లు ఆ వీడియోకు ఫిదా అయిపోయారు. కుక్కపిల్ల అచ్చంగా నవ్వినట్లే ఉందని అబ్బురపడుతున్నారు. ఈ క్రమంలో తన కుక్కపిల్లతో కలిసి చేసిన వార్తలకు ఎంత రేటింగ్ ఇస్తారని ట్వీట్ చేయగా పదికి పదిచ్చినా తక్కువే అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే జర్నలిస్టులకు ఇలాంటి సమస్యలు ఎదురవడం కొత్తేమీ కాదు. జర్నలిస్ట్ లైవ్ రికార్డింగ్ చేస్తుండగా అతని తండ్రి చొక్కా లేకుండా తిరగడం, ఓ మహిళా జర్నలిస్టు వార్తలు చెప్తున్న సమయంలో పిల్లలు పదేపదే అంతరాయం కలిగించడం వంటి ఎన్నో నవ్వు తెప్పించే సంఘటను ఇదివరకే చూశాం. (క్లోరోక్విన్.. మాకూ ఇవ్వండి) -
టిక్టాక్ వీడియోపై రష్మి ఆగ్రహం
-
టిక్టాక్ వీడియోపై రష్మి ఆగ్రహం
టిక్టాక్ కోసం మనుషులు తమ ప్రాణాలను లెక్కచేయకుండా వీడియోలు చేస్తుండటం చూశాం. కానీ కొంతమంది వ్యక్తులు వారు ఫేమస్ అవడానికి జంతువులను ఆయుధంగా వాడుకుంటున్నారు. వాటితో విన్యాసాలు చేయిస్తూ, హింసిస్తూ రాక్షసానందం పొందుతున్నారు. తాజాగా ఓ టిక్టాక్ యూజర్ జంతువుల పట్ల నిర్దయగా వ్యవహరిస్తున్న వీడియో యాంకర్ రష్మీ గౌతమ్ కంట్లో పడింది. నరేశ్ అనే ఐడీ పేరుతో ఉన్న టిక్టాక్ వీడియోలో ఓ వ్యక్తి కుక్క పిల్లను పట్టుకుని నిల్చున్నాడు. కెమెరా వైపు చూసి అతని స్నేహితుడు ఓకే చెప్పగానే నిర్దాక్షిణ్యంగా ఆ కుక్కపిల్లను కాలువలోకి పడేశాడు. (ఓ కూతురి స్పందన ఇది: సీఎం) పాపం.. ఆ మూగప్రాణి బతుకుజీవుడా అని ఈదుకుంటూ ఎలాగోలా ఒడ్డుకైతే రాగలిగింది. అతని చేతిలో ఉన్న జంతువు పరిస్థితి తల్చుకున్న రష్మీకి మనస్సు చివుక్కుమంది. "అందుకే మనుషులు అంతరించేందుకు అర్హులవుతున్నారు" అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జంతువుల పట్ల క్రూరంగా వ్యవహరించిన వ్యక్తిపై చర్యలు తీసుకోండంటూ జంతు ప్రేమికురాలైన బీజేపీ నేత మేనకా గాంధీకి ఫిర్యాదు చేసింది. కాగా ఈ వీడియోపై జంతు ప్రేమికులు సైతం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. "కుక్క ప్రాణాలతో చెలగాటం ఆడేందుకు సిగ్గు లేదా?" అని కామెంట్లు చేస్తున్నారు. టిక్టాక్ ఐడీ ఆధారంగా అతని జాడను వెతికే పనిలో పడ్డారు.(అనసూయకు చాలెంజ్ విసిరిన రష్మీ) -
ఒంటి కన్నుతో బహు ముచ్చటగా..
-
ఒంటి కన్నుతో బహు ముచ్చటగా..
సాక్షి, న్యూఢిల్లీ : థాయ్లాండ్లోని చాకోయెంగ్సావోలో అదివారం నాడు ఒంటి కంటితో ఓ కుక్కపిల్ల చిత్రంగా పుట్టింది. మినియన్స్ కార్టూన్ సినిమాలో కార్టూన్లాగా ఆ కుక్కపిల్ల ఉండడంతో ‘మినియన్స్ కెవిన్’ అని పేరు పెట్టారు. ఒంటి కన్నుతో పుట్టినప్పటికీ పూర్తి ఆరోగ్యంతో ఉండడంతో ఇంటి యజమాని సోమ్జాయ్ ఫుమ్మామాన్ (45) బాటిల్ పాలతో చంటి పిల్లాడిలా సాకుతున్నారు. ఆదివారం రెండో తేదీన యజమాని పెంచుకుంటున్న ఆస్పిన్ కుక్క రెండు కుక్క పిల్లలకు జన్మనివ్వగా అందులో ఓ కుక్క పిల్ల ఒంటి కన్నుతో వింతగా పుట్టింది. ఆ కుక్క పిల్లను చూసేందుకు ఇరుగు పొరుగు ప్రాంతాల నుంచి ఎంతో మంది వచ్చి చూసి పోతున్నారట. కుక్క పిల్ల అలా పుట్టడం ఇంటికి అదృష్టమని, అది పుట్టిన వేళ, ఇంకా విశేషమైనదని, ఆ తేదీని అదృష్ట తేదీగా పరిగణించాలంటూ ఇరుగుపొరుగు వారు చెబుతున్నారని ఆ ఇంటి యజమాని కూతురు పార్న్ చెబుతున్నారు. -
యువతి సాహసం: ప్రాణాలను పణంగా పెట్టి
-
యువతి సాహసం: ప్రాణాలను పణంగా పెట్టి
మంగళూరు: తోటి మనిషి ఆపదలో ఉన్నాడంటే ముందుకొచ్చి సాయం చేసేవాళ్లు అరుదుగా ఉంటారు. మరి మూగజీవాలకు ఆపద వస్తే.. ఇదిగో నేనున్నాంటూ వాటిని రక్షించేందుకు పూనుకుందో మహిళ. తన ప్రాణాలను పణంగా పెట్టి మరీ బావిలో పడ్డ కుక్కను రక్షించి అందరిచేత శభాష్ అనిపించుకుంటోంది. మంగళూరు ప్రాంతంలో ఓ కుక్క ఆకస్మాత్తుగా బావిలో పడింది. దాని కేకలు విన్న స్థానికులు అయ్యో పాపం అంటున్నారే తప్పితే దాన్ని ఎలా రక్షించాలో తెలియక చూస్తూ ఉండిపోయారు. ఇంతలో ఓ మహిళ తన నడుముకు తాడు కట్టుకుని ఎంతో లోతుగా ఉన్న బావిలోకి దిగింది. కుక్కకు కట్టడానికి పైనున్న వాళ్లు ఓ తాడును విసిరేయగా ఆమె దాన్ని చేతబుచ్చుకుని శునకానికి కట్టింది. దీంతో బావి వెలుపల ఉన్నవాళ్లు ఆ తాడును పైకి లాగడంతో శునకం సునాయాసంగా పైకి వెళ్లింది. | ముందుగా ఏం జరుగుతుందో అర్థం కాని ఆ కుక్క బయటకు రాగానే తనదారివైపు పరుగందుకుంది. అయితే దాన్ని రక్షించిన మహిళకు మాత్రం పైకి రావడం అంత సులువు కాలేదు. కాస్త కష్టపడుతూనే మరింత జాగ్రత్తగా బావి పైకి చేరుకుంది. ఇక ఈ సాహస వీడియోను ఓ యువతి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. నాకు మాత్రం తనే హీరో అంటూ క్యాప్షన్ జోడించింది. ప్రస్తుతం అది వైరల్గా మారింది. ప్రజలు జంతువుల పట్ల మరింత సున్నితంగా మెలుగుతారని ఆశిద్దాం. తద్వారానైనా జంతు వధ, కౄరత్వం లేని ప్రపంచం ఆవిష్కృతమవుతుంది.’ అని ఓ నెటిజన్ భావోద్వేగంగా కామెంట్ చేశాడు. అయితే ఆ సాహస మహిళ పేరు రజనీ శెట్టిగా ఓ నెటిజన్ పేర్కొన్నాడు. -
లెమన్ ఎల్లో కుక్కపిల్లను చూశారా!
ఉత్తర కరోలీనాలో వింత సంఘటన చోటు చేసుకుంది. ఓ పెంపుడు కుక్క లెమన్ ఎల్లో రంగు కుక్కపిల్లకు జన్మినిచ్చింది. నార్త్ కరోలినాకు చెందిన షానా స్టామీ అనే మహిళా తెల్లటి జర్మన్ షెపర్డ్ కుక్కను పెంచుకుంటున్నారు. దాని పేరు జిప్సీ. ఈ క్రమంలో జిప్సీ గత శుక్రవారం ఉదయం 8 కుక్క పిల్లలకు జన్మినిచ్చింది. ఈ విషయాన్ని ఆ మహిళ బుధవారం ఫేస్బుక్లో షేర్చేశారు. ‘మా జర్మన్ వైట్ షెపర్డ్ బ్రైట్ గ్రీన్ కలర్ కుక్కపిల్లకు జన్మనిచ్చింది. పేరు హల్క్.. ప్రస్తుతం దీని వయసు 5 రోజుల’ అనే క్యాప్షన్తో షేర్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ‘ దీంతో హల్కి ఫొటోలను చూసి నెటిజన్లంతా అశ్యర్యపోతూ ‘ఇట్స్ టైమ్ టూ మిస్టర్ లైమ్’, ‘వావ్ ఎంత ముద్దుగా ఉంది హల్క్. ఐ లవ్ హల్క్ కలర్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు దీనిపై యాజమాని మాట్లాడుతూ.. జిప్సి శుక్రవారం ఎనిమిది కుక్కపిల్లలకు జన్మనిచ్చింది. ఇందులో నాలుగవది నియాన్ గ్రీన్ కలర్లో జన్మించడంతో నేను ఆశ్చర్యానికి లోనయ్యాను. హల్క్ నియాన్ రంగులో ఉన్నప్పటికీ మిగతా కుక్కపిల్లలాగే ఇది సంపూర్ణ ఆరోగ్యంతో ఉంది’ అని చెప్పారు. ఇక హల్క్ రంగుపై వైద్య నిపుణులు మాట్లాడుతూ.. తల్లి కుక్క గర్బంతో ఉన్నప్పుడు గామా కిరణాలు పడకపోవడం వల్ల ఇలాంటి అరుదైన సంఘటనలు జరుగుతాయని తెలిపారు. గామా కిరణాలు తగలకపోతే గర్బధారణ సమయంలో కొన్ని ద్రవాలు విడుదల అవుతాయని, ఆ ద్రవాలు వివిధ రంగుల్లో ఉండటం వల్లే పుట్టే కుక్కిపల్లలు సాధారణ రంగులో కాకుండా భిన్నమైన రంగుల్లో జన్మిస్తాయన్నారు. అందువల్లే ‘హల్క్’ నియాన్ గ్రీన్లో జన్మించి ఉంటుందని నిపుణులు వివరణ ఇచ్చారు. Story tonight about a German Shepherd puppy born green just days ago in Canton. Animal experts say it happens from time to time, staining from birth fluids and not harmful, fades away. This pup's human family named him "Hulk. " More at 6. @WLOS_13 #LiveOnWLOS pic.twitter.com/7ex4i2wbOI — Rex Hodge (@RexHodge_WLOS) 15 January 2020 -
అయ్యప్ప కోసం 480 కి.మీ నడిచిన కుక్క..
బెంగళూరు : శబరిమల ఆలయ తలుపులు తెరుచుకున్నాయి. ఇప్పటికే ఇరుముడి కట్టుకున్న వేలాదిమంది భక్తులు ఆలయానికి క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో ఓ కుక్క వార్తల్లో నిలిచింది. భక్తుల వెంట శబరిమలకు పయనమైన కుక్క గురించి తెలిసినవారంతా దాని భక్తికి ఔరా అంటున్నారు. మరి అలుపు లేకుండా వందల కిలోమీటర్లు నడక సాగించిన శునకం దివ్యక్షేత్రానికి చేరుకుంటుందో లేదో చూడాలి. వివరాలు.. తిరుమల నుంచి 13మంది భక్తులు అయ్యప్ప క్షేత్రానికి తరలి వెళ్లాలనుకున్నారు. అక్టోబర్ 31న తిరుమల నుంచి కాలి నడక ప్రారంభించారు. వీరి వెంట ఓ శునకం కూడా నడక ప్రారంభించింది. అయితే తమ వెంట కుక్క వస్తున్న విషయాన్ని వారు గమనించలేదు. కానీ వెనక్కు చూసిన ప్రతీసారి కుక్క ఉండటంతో వారి కళ్లను నమ్మలేకపోయారు. అలా స్వాములతో కలిసి కుక్క 480 కిలోమీటర్లు ప్రయాణించింది. స్వాములు ప్రతినిత్యం వారు తెచ్చుకున్నదాంట్లో కొంత ఆ కుక్కకు పెడుతూ దాని ఆకలి తీరుస్తూ వచ్చారు. సుధీర్ఘ ప్రయాణం అనంతరం వారు నవంబర్ 17న కర్ణాటకలోని కొట్టిగెరాకు చేరుకున్నారు. తాము ప్రతి సంవత్సరం కాలినడకన శబరిమల వెళ్తామని, ఈ సంవత్సరం తమతో పాటు ఓ కుక్క శబరిమలకు ప్రయాణం అవ్వటం మర్చిపోలేనిదని స్వాములు సంతోషం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. శునక భక్తిని మెచ్చిన నెటిజన్లు దాన్ని వేనోళ్ల కొనియాడుతున్నారు. అనేక మంది భక్తుల మనసులను అది గెలుచుకుంది అనడానికి వారు చేస్తున్న కామెంట్లే నిదర్శనం. కాగా రెండు నెలల తర్వాత ఆదివారం శబరిమల ఆలయం తెరుచుకోగా మొదటిరోజే యాభైవేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు వెల్లడించారు. -
‘నుదటి మీద తోకతో కుక్కపిల్లా.. అచ్చం ఏనుగు తొండంలా’
-
‘తోకతో కుక్కపిల్ల.. అచ్చం ఏనుగు తొండంలా’
వాషింగ్టన్: కొన్ని జంతువులు ఏదో ఒక లోపంతో జన్మిస్తుంటాయి. అది సాధారణ విషయమే అయినప్పటికీ ఓ కుక్కపిల్ల మాత్రం దానికున్న లోపంతోనే ప్రపంచమంతా ఫేమస్ అయ్యింది. నుదుటి మీద తోకతో జన్మించిన పది వారాల వయస్సున్న ఈ కుక్కపిల్ల ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. శనివారం ఫేస్బుక్లో షేర్ చేసిన ఈ కుక్కపిల్లను చూసి పెటిజన్లంతా ఫిదా అవుతున్నారు. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని మిస్సోరి నగర వీధుల్లో పుట్టిన ఈ కుక్క పేరు ‘నార్వాల్ ది లిటిల్ మ్యాజికల్ ఫ్యూరీ యునికార్న్’ అని డాగ్ రెస్య్కూ సంస్థ ‘మాక్స్ మిషన్’ తెలిపింది. ఆ సంస్థ సిబ్బందికి ఈ కుక్కపిల్ల (నార్వాల్) మిస్సోరి వీధుల్లో దొరికినట్లు సమాచారం. కాగా రెండు కనుబొమ్మల మధ్య మొలిచిన ఈ తోక.. చిన్నగా ఉండి ఏనుగు తొండాన్ని తలపించేలా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. సంస్థ షేర్ చేసిన వీడియోలో నార్వాల్ ఆడుకుంటున్నప్పుడు దాని తోక అటూ ఇటూ కదులుతూ భలే ముద్దుగా ఉండటం అందర్ని ఆకట్టుకుంటోంది. నార్వాల్ వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతూ.. దీనిని చూస్తుంటే ఓ కలలా ఉందని, ఎంతకు అమ్ముతారంటూ కామెంట్లు పెడుతున్నారు. మాక్స్ మిషన్ సంస్థ ఇలాంటి లోపాలున్న కుక్కలను తీసుకొచ్చి వాటికి వైద్యం అందిస్తుంది. నార్వాల్ ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగా ఉందని సంస్థ ఫేస్బుక్ పోస్ట్ ద్వారా తెలిపింది. నార్వాల్కు స్కానింగ్ చేయించగా ఈ తోక ఏ శరీర భాగంతో కలసి లేనందున దానికి ఎలాంటి నొప్పి ఉండదని డాక్టర్లు తెలిపారు. అలాగే నుదుటిపై మొలిచిన ఈ తోక వల్ల కుక్కకు ఎలాంటి ప్రమాదం లేదని, ఆరోగ్యవంతమైన మిగతా కుక్కల్లాగే అదీ చురుగ్గా ఆడుకోవడానికి ఎక్కవగా ఇష్టపడుతుందని పేర్కొన్నారు. అలాగే దీనిని పెంచుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారని, ఇప్పటికే పలువురు సంస్థకు 50కి పైగా దత్తత దరఖాస్తులు వచ్చినట్లు మాక్స్ మిషన్ సంస్థ వెల్లడించింది. -
నిరాహారదీక్ష చేస్తున్న శునకం
మిస్సిసిపి: కుక్కపిల్ల ఎదురు చూస్తోంది.. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని కాదు..! తన యజమాని వస్తారని, తనతోపాటు తీసుకెళ్తారని..! ఆహార అన్వేషణను కూడా మానేసి ఉన్నచోటులోనే కదలకుండా ఉండిపోయింది. ఈ హృదయ విదారకమైన ఘటన మిస్సిసిపీలోని బ్రూక్హావెన్లో చోటుచేసుకుంది. ఒక వ్యక్తి తనకు అవసరం లేదని భావించిన కుర్చీ, టీవీలను రోడ్డు పక్కన పాడేశాడు. ప్రాణం లేని వస్తువులతో పాటు అతను పెంచుకుంటున్న కుక్కపిల్లను సైతం కుర్చీలో వదిలేసి వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని గుర్తించిన జంతు నియంత్రణ అధికారిని శారన్ నార్టన్ తన ఫేస్బుక్లో పోస్ట్ చేయగా అనతికాలంలోనే వైరల్గా మారింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన యజమానిని ఉద్దేశించి.. ‘కుక్కపిల్ల కుర్చీని వదలటానికి కూడా భయపడుతోంది. మీరు తిరిగి వస్తారేమోనని వేచి చూస్తూ తిండి కూడా మానేసి కుర్చీనంటిపెట్టుకుని కూర్చుంది. ఇలాగైతే ఆ కుక్కపిల్ల ఆకలితో అలమటిస్తూ.. చిక్కి శల్యమై చనిపోతుంది. దాన్ని అలా రోడ్డుపై వదిలేసి వెళ్లినందుకు సిగ్గనిపించట్లేదా..?’ అంటూ నార్టన్ పోస్ట్ చేశారు. నెటిజన్లు కూడా శునకాన్ని వదిలేసిన యజమానిపై నిప్పులు చెరుగుతున్నారు. మరోవైపు ఎంతో దీనంగా చూస్తున్న కుక్కపిల్ల ఫోటోలను చూసి సోషల్ మీడియా చలించిపోయింది. మూగజీవిని రోడ్డు పక్కన పాడేయడానికి మనసెలా వచ్చిందంటూ జంతు ప్రేమికులు ఆవేదన చెందుతున్నారు. దానికున్న విశ్వాసంలో కొంతభాగమైనా ఆ యజమానికుంటే బాగుండేది అంటూ అభిప్రాయపడుతున్నారు. -
ఆ కుక్కపిల్ల నిలబడే నిద్రపోతుంది.. ఎందుకంటే..
అట్లాంట : ఆ కుక్క పిల్లకు ఎదురైన కష్టం అలవాటుగా మారింది. అదే దాన్ని అన్ని కుక్కలకంటే భిన్నమైనదాన్ని చేసింది. నిలబడితే తప్ప నిద్రపోలేని స్థితికి తీసుకొచ్చింది. వివరాల్లోకి వెళితే.. జార్జియాకు చెందిన మెలిసా లెంజ్ అనే మహిళ కొద్ది రోజుల క్రితం ధీన స్థితిలో ఉన్న కొన్ని కుక్కపిల్లలను రక్షించి వాటిని సంరక్షణా నిలయానికి పంపించేసింది. అందులో ముద్దుగా ఉన్న ఓ కుక్కపిల్లను ఇంటికి తెచ్చుకుని పెంచుకుంటోంది. దానికి జార్డన్ నైట్ అని పేరు కూడా పెట్టింది. ఒక రోజు నిలబడి అటూ ఇటూ తూలుతూ ఉన్న జార్డన్ను దగ్గరకు వెళ్లి చూసింది. అది నిలబడి నిద్రపోతోందని తెలిసి ఆశ్చర్యపోయింది. తరుచూ అది అలాగే చేస్తుంటే ఎందుకని ఆరాతీసింది. గతంలో అది ఉన్న కుక్కల బోనులో ఎక్కువ కుక్కలను ఉంచటం కారణంగా నిద్రపోవటానికి స్థలం ఉండేది కాదు. చలి, బోనులో రోత కారణంగా నిలబడి నిద్రపోవాల్సి వచ్చేది. ఇక అక్కడినుంచి బయటకు వచ్చినా నిలబడి నిద్రపోవటం అలవాటుగా మారింది. ఈ విషయం తెలుసుకున్న మెలిసా కంట నీళ్లు తిరిగాయి. దాన్ని ఎలాగైనా కిందపడుకునే విధంగా చేయాలని ప్రయత్నించి విఫలమైంది. జార్డన్ మామూలు సమయాల్లో క్రిందకూర్చున్నా, నిద్రపోవటానికి మాత్రం నిలబడుతోంది. -
కొట్టుకోవద్దు.. ప్లీజ్ ఆపండి..!
కోయంబత్తూరు: ముద్దు ముద్దుగా ఉండే కుక్కపిల్లలను చాలా మంది ఇష్టపడతారు. అలాంటి ఓ కుక్కపిల్ల చేసిన ప్రయత్నం మాత్రం నెటిజన్లకు విపరీతంగా నవ్వు తెప్పిస్తోంది. వివరాల్లోకి వెళ్తే తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన వ్యాపారవేత్త మురళీధరన్కు జంతువులంటే చాలా ఇష్టం. అందుకే ఆయన తన ఇంటి వద్ద కోళ్లు, పిల్లులు, కుక్కల్ని పెంచుతున్నారు. ఇటీవల ఆయన ఇంటి వద్ద ఉన్న ఓ రెండు కోళ్లు ఒకదానితో ఒకటి పోటీపడుతున్న క్రమంలో వీడియోను తీశారు. అందులో విశేషం ఎంటని అనుకుంటున్నారా రెండు కోళ్లు పోటీపడుతుంటే ఓ కుక్కపిల్ల మాత్రం వాటిని ఆపేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. వాటితో కలిసి పెరగడం వల్లనో ఎమో తెలియదుగానీ రెండు కోళ్లను వీడదీయడానికి ఆ కుక్కపిల్ల విశ్వప్రయత్నం చేసింది. ‘కొట్టుకోవద్దు.. ప్లీజ్ ఆపండి’ అని అర్థం వచ్చేలా ఆ కొట్లాటను ఆపడానికి తన వంతు ప్రయత్నం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
కొట్టుకోవద్దు.. ప్లీజ్ ఆపండి..
-
రాజసం ఉట్టిపడేలా..
అది అమెరికాలోని కాలిఫోర్నియా.. పామ్ ఎడారిలో బర్కింగ్హమ్ అనే హోటల్.. సకల సదుపాయాలతో విలాసవంతంగా ఉంటుంది. ఈ హోటల్కో ప్రత్యేకత ఉంది.. ఏంటో తెలుసా.. అందులో మీ పెంపుడు కుక్కపిల్లల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తుంది. పొద్దున మీ కుక్క నిద్ర లేచినప్పటి నుంచి పడుకునే వరకు మహారాజులా చూసుకుంటారు. వాటి కోసం ప్రత్యేకమైన సూట్ గదులుంటాయి. అందులో ఉదయం అల్పాహారం నుంచి రాత్రి భోజనం వరకు ఏది కావాలంటే ఆ వంటకాలను ప్రత్యేకంగా తయారుచేసి అందిస్తారు. భోజనం చేసిన తర్వాత కసరత్తులు చేసేందుకు ప్రత్యేకమైన జిమ్ను కూడా ఏర్పాటు చేశారు. జిమ్ చేయడం నచ్చకపోతే వాటికోసం స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. ఆ తర్వాత వాటికి జుట్టు కత్తిరించాలనుకుంటే కూడా వాటికోసం హెయిర్సెలూన్ కూడా ఉంది. మడ్ బాత్.. చర్మం నిగనిగలాడేందుకు ప్రత్యేకమైన స్నానాలే కాదు.. శరీరానికి మసాజ్ చేస్తారు. అంతెందుకు మీ కుక్క పిల్లల అందం కోసం పలు రకాల ఫేస్ ప్యాక్లు కూడా ఉన్నాయి. పడుకునేందుకు మెత్తటి పరుపులు ఏర్పాటుచేశారు. ఇప్పుడు ఇలాంటి హోటళ్లకు అమెరికాలో తెగ గిరాకీ ఉందట. -
కుక్కకు ముద్దులే ముద్దులు..!!
వాషింగ్టన్ : వ్యవసాయ క్షేత్రంలో తమతో పాటు కలిసి నివసించే కుక్కపై ఆవులు తెగ ప్రేమను పెంచేసుకున్నాయి. కెనైన్ జాతికి చెందిన కుక్కను, బొవైన్ జాతికి చెందిన ఆవులు గుంపుగా ముద్దులతో ముంచెత్తాయి. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. రచయిత క్రిస్ ఇవాన్గెలిస్టా ఈ ఫొటోను ట్విట్టర్లో పోస్టు చేశారు. కొద్ది రోజుల్లోనే బాగా పాపులర్ అయిన ఫొటో సోషల్మీడియాలో హల్చల్ చేస్తోంది. మరి మీరూ ఆ ఫొటోను చూసేయండి. -
షాక్.. పప్పీ అనుకుని పెంచింది.. కానీ..
బీజింగ్ : చాలా మందికి జంతువులను పెంచుకోవడం ఇష్టం. అలానే ఓ మహిళ చిన్న పప్పీని పెంచుకుకోవడానికి రెండేళ్ల క్రితం ఇంటికి తెచ్చుకుంది. ఆ తర్వాత మహిళకు తాను పెంచుతున్నది పప్పీ కాదు ఎలుగుబంటి అనే వాస్తవం తెలిసింది. అంతే ఇంకేముంది ప్రాణం పోయినంత పని అయింది. ఆమె వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించింది. ఈ ఘటన చైనాలోని యూనాన్లో చోటుచేసుకుంది. వివరాలివి.. చైనాకు చెందిన ఓ మహిళ ఓ నల్లని జంతువును శునకంగా భావించి ఇంటికి తెచ్చుకుంది. అది శునకం జాతుల్లో ఒక రకమని భావించింది.కానీ కొన్నిరోజుల తర్వాత దాని బరువు 200 కేజీలకు చేరుకుంది. దీంతో ఆ మహిళకు అనుమానం వచ్చి పప్పీని పరిశీలించింది. అంతే అది శునకం కాదు ఎలుగుబంటి అని తెలుసుకుంది. భయంతో ఆ మహిళ అటవీ అధికారులకు సమాచారం అందించింది. వెంటనే అధికారులు ఆమె ఇంటికి చేరుకుని ఆ ఎలుగుబంటిని బోనులో బందించారు. ఆ ఎలుగు బంటి చాలా ప్రమాదకమైననదిగా వారు చెప్పారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘ దానిని ఇంటికి తీసుకొచ్చి ‘లిటిల్ బ్లాక్’ అని పెరు పెట్టాను. కానీ అది రోజు రోజుకు పెరుగుతూ వచ్చింది. అప్పుడు నాకు అనుమానం వచ్చింది. అంతే అది ఎలుగు బంటి అని తెలిసే సరికి చాలా భయపడ్డాను. అంతేకాక అది రోజుకు రెండు బకెట్ల న్యూడిల్స్ తినేది’ అని ఆమె తెలిపింది. -
కుక్కా.. బాగుందే ఎంచక్కా..
ఈ ఫొటోలో ఉన్న కుక్క పిల్లను చూడగానే ఠక్కున ఏం గుర్తొస్తుంది..? కార్టూన్లు చూసే పిల్లలెవరైనా మిక్కీ మౌస్ అని చెప్పేస్తారు. గోళీల్లాంటి నల్లటి కళ్లు.. తెల్లటి వెంట్రుకలతో చూడముచ్చటగా ఉన్న ఈ కుక్క పేరు గోమా. నాలుగేళ్ల వయసున్న ఈ గోమా జపాన్లోని టోక్యోలో ఉంటుంది. అంత అందంగా ఉంది కదా అని.. దీని యజమాని ప్రత్యేకంగా ఇన్స్టాగ్రామ్లో గోమాకు ఖాతా కూడా తెరిచాడు. ఇంకేముంది ఇక గోమాకు అభిమానుల సంఖ్య బీభత్సంగా పెరిగిపోయింది. ఇప్పటివరకు దాదాపు 60 వేల మంది ఫాలోవర్లు ఉన్నారట. అమెరికాలో దీని గురించి తెలిసి చాలా ఫేమస్ అయిపోయింది. ఆ తర్వాత గోమును ఫాలోవర్లు ‘మిక్కీ మౌస్ డాగ్’ అని ముద్దుగా పిలుచుకుంటున్నారు. -
పప్పీ అని పెంచుకుంటే ఎలుగుబంటి అయింది
-
పప్పీ అని పెంచుకుంటే ఎలుగుబంటి అయింది
బీజింగ్ : చైనాలో ఓ వ్యక్తికి ఊహించని అనుభవం ఎదురైంది. ఓ పర్వత ప్రాంతంలో దిక్కూమొక్కు లేకుండా తిరుగుతున్న ఓ కుక్కపిల్లలాంటి జంతువుపై జాలిపడి ఇంటికి తెచ్చి పెంచిన అతడు షాక్ తిన్నాడు. ఎందుకంటే అది పెరిగి పెద్దదై ఎలుగుబంటిగా మారింది. అప్పుడుగానీ అతడికి అర్ధం కాలేదు.. తాను తీసుకొచ్చి పెంచుకుంది ఓ ఎలుగు బంటి పిల్లను అని. చిన్నపిల్లగా ఉన్నప్పుడు తాను ఇంటికి తీసుకొచ్చానని, దానికి పాలు, కార్న్ తదితర ఆహార పదార్థాలు పెట్టినట్లు తెలిపాడు. అయితే, ఎనిమిది నెలల్లోనే అది 1.7 మీటర్లు పెరిగిందని, 80 కేజీల బరువుతో పూర్తి ఎలుగుబంటి రూపంలోకి వచ్చిందని చెప్పారు. తన ఇంట్లో ఉన్న కుక్క పిల్ల అది కలిసి పెరిగాయని, చాలా చక్కగా ఆడుకునేవని తెలిపాడు. అయితే, పెద్దయ్యాక దానితో ఇతరులకు ఎలాంటి ప్రమాదం రాకుడదని గొలుసులతో కట్టేసి దానికి ప్రత్యేక బోనును తయారుచేసి పెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు దానిని అలా బోనులో పెట్టి ఇంట్లో ఉంచి నేరం అవుతుందని చెప్పడంతో వారికి అప్పగించారు. దాంతో దానిని వన్యమృగప్రాణి సంరక్షణ కేంద్రానికి తరలించారు. -
పా–టర్నిటీ లీవ్!
మెటర్నిటీ లీవ్ అంటే తెలిసిందే. గర్భిణికి ప్రసవానికి ముందు, ప్రసవం తర్వాత కంపెనీ ఇచ్చే లీవు. ఆ లీవులకు జీతం కట్ ఉండదు. అలాగే పాటర్నిటీ లీవ్ అని మరో లీవ్ ఉంది. భార్య ప్రసవానికి కాస్త ముందు కానీ, ప్రసవం తర్వాత కానీ భర్తకు కంపెనీ ఇచ్చే లీవు. ఈ లీవులకూ జీతం కట్ ఉండదు. మరి ఈ ‘పా–టర్నిటీ’ లీవ్ ఏంటీ? ఏం లేదు. పిల్లలు పుడితే ఇచ్చినట్లే, కుక్కపిల్లను కొని తెచ్చుకుంటే ఇచ్చే లీవ్. ఇలాంటిదొక సదుపాయం ఇంతవరకూ ప్రపంచంలో ఎక్కడా లేదు కానీ, బెర్డీన్ సిటీ (ఇంగ్లండ్) లోని ‘బ్రూడాగ్’ అనే బీరు తయారీ కంపెనీ ఇటీవల ఒక ప్రకటన చేసింది. తమ కంపెనీలోని ఉద్యోగులు ఎవరైనా కొత్తగా కుక్కపిల్లను పెంచుకుంటుంటే... దాని ఆలనాపాలన కోసం వారానికొకరోజు వారికి సెలవు ఇస్తుందట! ఆ సెలవుకు కంపెనీ పెట్టిన పేరే ‘పా–టర్నిటీ’ లీవు. ఇంగ్లిషులో ‘పా’ అంటే జంతువు పాదాకృతి. ఇంతకీ ఆ కంపెనీకి అంత ఉత్సాహం ఎందుకు వచ్చినట్టు? తన కంపెనీలో ‘డాగ్’ అనే పేరుంది కదా. అందుకు కావచ్చు. డాగ్ల గౌరవార్థం. మీరు చూస్తున్న బీర్డాగ్ల ఫొటో ఆ కంపెనీ విడుదల చేసిందే. -
కుక్క పిల్లను పెంచుకుంటున్న కోతి
న్యూఢిల్లీ: కోతి ఓ కుక్కపిల్లను అక్కున చేర్చుకోవడం అందరిని ఆకట్టుకుంటోంది. ఆశ్రయం లేకుండా వీధుల్లో తిరుగుతున్న ఓ కుక్కపిల్లను తన సొంత బిడ్డలా ఓ కోతి పెంచుతోంది. ఈ సంఘటన దేశ రాజధాని న్యూఢిల్లీలో చోటు చేసుకుంది. ఇతర కుక్కలు ఆ బుల్లికుక్కపై దాడి చేయడానికి వస్తే ఆ కోతి కాపాడుతోంది. అంతే కాకుండా తను సేకరించిన ఆహారాన్ని కుక్క పిల్ల తిన్న తర్వాతే ఆకోతి తింటోంది. ఇప్పుడు ఆ కోతి, కుక్కపిల్లల ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో ప్రపంచ వ్యాప్తంగా చక్కర్లు కోడుతున్నాయి. -
'డీజిల్' లేని లోటు తీరుస్తున్న పప్పీ!
మాస్కో: అది 'డీజిల్' కాకపోవచ్చు. కానీ 'డీజిల్' లేని లోటును కొంత తీర్చేందుకు ఫ్రాన్స్ వాసుల ఒడికి చేరింది. అదే 'పప్పీ'.. రష్యా ఈ మేలుజాతి శునకాన్ని ఫ్రాన్స్ కు కానుకగా ఇచ్చింది. గత నెల పారిస్లోని సెయింట్ డెనిస్లో జరిగిన ఉగ్రవాద దాడిలో 'డీజిల్' అనే పోలీసు కుక్క ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే. విధి నిర్వహణలో ప్రాణాలు విడిచిన ఆ శునకం స్మృతులు పారిస్ వాసులను వెంటాడుతున్న నేపథ్యంలో రష్యా వారికి 'డొబ్రిన్య' పేరిట పప్పీడాగ్ను బహుమానంగా ఇచ్చింది. 'మీరు ఈ రోజు అందిస్తున్న ఈ పప్పీ.. డీజిల్ స్థానాన్ని భర్తీ చేయనుంది. అదేవిధంగా ఇది మన స్నేహాన్ని చాటుతుంది' అని ఫ్రాన్స్ రాయబారి జీన్ మౌరిస్ రిపర్ట్ తెలిపారు. మాస్కోలోని ఫ్రెంచ్ రాయబార కార్యాలయంలో జరిగిన పప్పీ బహుమాన కార్యక్రమంలో రిపర్ట్ మాట్లాడుతూ ఫ్రాన్స్ వాసులు 'పప్పీ' కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. పారిస్లో ఉగ్రవాదులు నరమేధం సృష్టించి 130 మందిని పొట్టనపెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన ఐదు రోజులకు పారిస్ శివార్లలో ఉన్న సెయింట్ డెనిస్లో ఉగ్రవాదులు, పోలీసుల మధ్య భారీ షుటౌట్ జరిగింది. ఈ సందర్భంగా జరిగిన ఆత్మాహుతి దాడిలో 'డీజిల్' ప్రాణాలు విడువడం ఫ్రాన్స్ వాసులను కలిచివేసింది. 'నేను శునకం' (జె స్యూస్ చీన్) హాష్ట్యాగ్తో 'డీజిల్'కు పెద్ద ఎత్తున వారు నివాళులర్పించారు. ఫ్రెంచ్ వ్యంగ్య దినపత్రిక చార్లీ హెబ్డోపై దాడి జరిగినప్పుడు కూడా ఇదే విధంగా 'నేను చార్లీ' హాష్ట్యాగ్తో ఫ్రాన్స్ ప్రజలు భారీ ఎత్తున సంతాపం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 'పప్పీ' బహుమానం ఇరుదేశాల ఐక్యతకు, ఉగ్రవాదంపై తమ రాజీలేని పోరాటానికి నిదర్శనమని రష్యా డిప్యూటీ ఇంటీరియర్ మినిష్టర్ ఇగోర్ జుబావ్ తెలిపారు. -
జాతి వైరాన్నిమరచి...
పగలూ, ప్రతీకారాలు మరచిపోయాయి. రెండు విభిన్న జాతులమన్న ఆలోచననూ కనీసం ఆ దరిదాపులకు రానివ్వలేదు. ఓ కుక్కపిల్లా, బాతు కలసి మెలసి ఆనందంగా ఆడుతున్నాయి. స్నేహబంధానికి ఎటువంటి హద్దులూ ఉండవని నిరూపిస్తున్నాయి. జాతి వైరాన్ని మరచి చూపరులకు కనువిందు చేసిన ఆ వీడియో ఇప్పుడు అందర్నీ ఆకట్టుకుంటోంది. ఆకారంలోనూ, జాతుల్లోనూ ఏమాత్రం పోలిక లేకపోయినా... కక్షలూ, కార్పణ్యాలకు దూరంగా ఒకేచోట బతుకుతున్న ఆ జంతువులు.. కల్మషంతో కుళ్ళుకునే మనుషులకు కనువిప్పు చేస్తున్నాయి. పక్షుల్ని చూస్తే పీక పట్టుకునే కుక్క... కుక్కను చూడగానే ముక్కు పెట్టి పొడిచేందుకు తయారయ్యే బాతూ... ఇక్కడ మాత్రం ఒకదానికొకటి మంచి స్నేహితులుగా కనిపిస్తూ...చూపరులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. చాలా సీరియస్ గా కొట్టుకుంటున్నా దెబ్బలు తగలని ఈ దృశ్యం.. ఓ రెజ్లింగ్ క్రీడను తలపిస్తోంది. ఒకదాన్నొకటి కొరుకుతూ..ముందుకు నెడుతూ వాటి బలాబలాలను పరీక్షించుకుంటున్నాయి. ఏది ఏమైనా సరదాకు, ఆగ్రహానికి మధ్య ఉన్న చిన్నపాటి గీతను దాటకుండా సంయమనం పాటిస్తూ ఆటలాడుతున్న ఆ జంతువుల వీడియో... స్నేహ బంధాన్ని మరోసారి రుజువు చేస్తోంది. యజమాని తోటలో జతగా బలపరీక్షకు దిగిన ఈ పెంపుడు జంతువులు...ఎటువంటి హాని కలగకుండా సున్నితంగా ఆడుకోవడం వాటిలోని ఆలోచనా శక్తిని ప్రస్ఫుటిస్తుంది. -
పప్పీ కోసం బాలిక ప్రాణం తీసిన బాలుడు
చికాగో: కుక్కపిల్లకోసం ఇద్దరు చిన్నారుల మధ్య తలెత్తిన గొడవ ప్రాణం తీసింది. పదకొండేళ్ల బాలుడు తన పక్కింట్లో ఉంటున్న ఎనిమిదేళ్ల బాలికపై కాల్పులు జరపడంతో ఆ బాలిక ప్రాణాలు కోల్పోయింది. అమెరికాలోని టెన్నస్సీ నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాలిక తల్లి లటాషా ఈ ఘటనపై మాట్లాడుతూ తన కుమార్తె మెక్ కాయ్లా బయట పప్పీతో ఆడుకుంటుండగా ఓ పదకొండేళ్ల బాలుడు చూశాడు. తనకు ఒకసారి పప్పీ ఇవ్వాలని కోరాడు. అందుకు ఆ పాప నిరాకరించడంతో ఆ బాలుడు ఇంట్లోకి వెళ్లి తన తుపాకీ తీసుకొచ్చి బాలిక ఛాతిపై కాల్పులు జరిపాడు. దీంతో ఆ పాప చనిపోయింది. అంతకుముందు రోజుల్లో కూడా ఆ బాలుడు తన కూతురుతో సరదాగా గడుపుతుండేవాడని, పలుపేర్లతో పిలుస్తూ ఏడిపిస్తుండేవాడని, కానీ, చివరికి ఇలాంటి ఘటనకు పాల్పడతాడని తాను అస్సలు ఊహించలేదని లటాషా వాపోయింది. తన కూతురు ప్రాణాలు తీసిన ఆ బాలుడు.. తన జీవితంలో ఏం తప్పు చేశాడో తప్పక తెలుసుకుంటాడని పేర్కొంది. -
ఆకలైతే చెప్పేస్తుంది..
లండన్: మీ పెంపుడు కుక్కపిల్లకు ఆకలిగా ఉంది.. లేదా ఏదో సమస్యతో బాధపడుతోంది.. పనిలో బిజీగా ఉన్న మీకు ఈ విషయం తెలియదు.. మరెలా? జస్ట్ ‘ది పెట్పేస్ స్మార్ట్ కాలర్’ను మీ పెంపుడు కుక్క మెడకు పెట్టేస్తే చాలు.. దానికి ఆకలైనా, ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్నా.. మీ ఫోన్కు మెసేజ్ వచ్చేస్తుంది. బ్రిటన్లోని బర్లింగ్టన్కు చెందిన పెట్పేస్ సంస్థ తయారు చేసిన ఈ స్మార్ట్ కాలర్... ఎప్పటికప్పుడు పెంపుడు జంతువుల శరీర ఉష్ణోగ్రతను, గుండె కొట్టుకునే వేగం, శ్వాసక్రియను పరిశీలిస్తుంది. వీటితోపాటు అవి ఏదైనా నొప్పితో బాధపడుతుంటే గుర్తించి.. యజమాని ఫోన్కు మెసేజ్ పంపుతుంది. ఈమెయిల్కూడా చేస్తుంది. పెంపుడు జంతువులను ఎప్పటికప్పుడు కనిపెట్టుకుంటూ ఉండలేనివారికి ఈ స్మార్ట్ కాలర్ ఎంతగానో తోడ్పడుతుందని పెట్పేస్ సంస్థ పశు శాస్త్రవేత్త అసఫ్ డాగన్ పేర్కొన్నారు. వచ్చే ఏడాది మార్కెట్లో ప్రవేశపెట్టనున్న దీని ధరెంతో తెలుసా.. దాదాపు రూ. 10 వేలు మాత్రమే. -
ముద్దొస్తున్నానా..!
పెదకాకాని: కుక్కపిల్ల, కోడిపెట్ట ముద్దులాడుకుంటున్నట్టు ఉంది కదూ ఈ ఫొటో. ఇది నిజమేనండీ.. పెదకాకాని భ్రమరాంబ కాలనీలోని పొద్దుటూరి మేరి ఇంటి ముంగిట బుధవారం ఈ దృశ్యం కనిపించింది. సాధారణంగా కోడిపిల్ల కనిపిస్తే కుక్క గుటుక్కుమనిపించేద్దామనుకుంటుంది. అలాగే తన పిల్లలను ఎక్కడ తింటుందోనని భయంతో కుక్కను కోడిపెట్ట వెంటబడి మరీ తన్ని తరిమేస్తుంది. అయితే ఒకే ఇంట్లో పెరిగేవైతే మాత్రం అవి ఇలాగే కలిసిమెలిసి జీవిస్తాయి మరి. ఈ రెండూ నిత్యం ఇలా సరదాగా పోట్లాడుకుంటూ, ముద్దులాడుకుంటూ స్థానికులను ఆకట్టుకుంటున్నాయి. -
బ్రిటన్ తొలి క్లోనింగ్ డాగ్.. మినీ విన్నీ!
ఇంకా కళ్లు కూడా తెరవని ఈ బుజ్జి కుక్కపిల్ల బ్రిటన్కు చెందిన తొలి క్లోనింగ్ డాగ్. పశ్చిమ లండన్ మహిళ రెబెక్కా స్మిత్ పెంపుడు కుక్క విన్నీ చర్మ కణాలతో దక్షిణ కొరియాలోని ఓ ల్యాబ్వారు దీనిని సృష్టించారు. పొట్టికాళ్లు, పొడవాటి శరీరం ఉండే డాక్శాండ్ జాతికి చెందిన 12 ఏళ్ల విన్నీ అంటే రెబెక్కాకు చాలా ఇష్టం. ఒకవేళ అది చనిపోతే? అన్న ఆలోచనతో దిగులు చెందిన ఆమె.. అచ్చం దానిలాగే ఉండే క్లోన్డ్ కుక్కను సృష్టించుకోవాలని భావించింది. దక్షిణ కొరియాలోని సోయామ్ బయోటెక్ ల్యాబ్వారిని సంప్రదించింది. వారు విన్నీ చర్మకణాలను సేకరించారు. ఆ కణాల్లోంచి ఒకదానిని ఎన్నుకుని దానిలోంచి కేంద్రకాన్ని వేరుచేశారు. తర్వాత డాక్శాండ్ జాతికే చెందిన మరో శునకం అండంలో కేంద్రకాన్ని తొలగించి, విన్నీ కేంద్రకాన్ని ఆ కుక్క అండంలో ప్రవేశపెట్టి విద్యుత్ షాక్తో ఫలదీకరణం చెందించారు. అనంతరం మరో కుక్కను ఎంచుకుని దాని గర్భంలో ఈ పిండాన్ని ప్రవేశపెట్టారు. ఇంకేం.. గత నెల 30వ తేదీన మినీ విన్నీ ఈ లోకంలోకి వచ్చేసింది. దీన్ని క్లోన్ చేసేందుకు ల్యాబ్వారు 60 వేల పౌండ్లు (రూ. 60 లక్షలు) వసూలుచేశారట. అయితే 1996లో ప్రపంచంలోనే తొలిసారిగా క్లోనింగ్ ద్వారా డాలీ అనే గొర్రెను సృష్టించి చరిత్రకెక్కిన సర్ ఇయాన్ విల్మట్ మాత్రం కుక్కల క్లోనింగ్పై పెదవి విరుస్తున్నారు. ఇంత డబ్బు తగలేసి వాటిని సృష్టించినా.. అవి రూపంలో ఒకేలా పుట్టినప్పటికీ, వాటి ప్రవర్తన వివిధ కారణాల వల్ల మారిపోవచ్చని, అప్పుడు యజమానులకు తీవ్ర నిరాశ తప్పదని అంటున్నారు.