Ramulu
-
ఉసురు తీసిన కుటుంబ కలహాలు!
సంగారెడ్డి: ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని అంసాన్పల్లి గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొల్చారం ఎస్ఐ గౌస్ కథనం మేరకు.. సంగముల రాములు (52)కు కుమారుడు మహేశ్ ఉన్నాడు. అదే గ్రామంలో ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఇది నచ్చని తండ్రి మరో అమ్మాయితో వివాహం నిశ్చయించాడు. ఇది తెలిసిన అమ్మాయి వర్గపు వారు గురువారం రాములు ఇంటికొచ్చి తమ అమ్మాయికి అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని గొడవ పడ్డారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రాములు శుక్రవారం ఉదయం పాడి గేదెలను తీసుకొని వ్యవసాయ పొలానికి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లాడు. మధ్యాహ్నం వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పొలం వద్దకు వెళ్లి చూడగా ఉరి వేసుకొని కనిపించాడు. ఇవి చదవండి: మూడు రోజుల క్రితం మహిళ హత్య! అడ్డా కూలీలపైనే అనుమానాలు.. -
బీజేపీలో చేరిన నాగర్కర్నూల్ ఎంపీ రాములు
ఢిల్లీ, సాక్షి: తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్కు బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీని వీడిన ఎంపీ రాములు బీజేపీలో చేరారు. గురువారం ఢిల్లీ పెద్దల సమక్షంలో కాషాయం కండువా కప్పుకున్నారాయన. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి చంద్రశేఖర్, బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జి తరుణ్ చుగ్, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పాల్గొన్నారు. కాగా, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, రాములుకు మధ్య విభేదాలు ముదిరాయి. తానే ఎంపీ అభ్యర్థిని అంటూ బాలరాజు ప్రచారం చేసుకుంటుండటంతో రాములు బీఆర్ఎస్ను వీడినట్లు తెలుస్తుంది. ఇక రాములు చేరికను స్వాగతించిన రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్.. తెలంగాణలో బీజేపీ తిరుగులేని శక్తిగా మారుతోందన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ మునిగిపోయిన నావ.. కారు రిపేర్ అయ్యే పరిస్థితి లేదు. మార్పులో భాగంగా కాంగ్రెస్ లాభపడింది. కానీ, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో కాంగ్రెస్ పరిస్థితి చూస్తున్నాం. తెలంగాణలో బీజేపీ బలపడుతోంది. చాలామంది మా పార్టీలోకి వచ్చేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. .. షెడ్యూల్ వచ్చే లోపు దాదాపు అభ్యర్థుల ఎంపిక పూర్తవుతుంది. పార్లమెంట్ఎన్నికల్లో బీజేపీదే గెలుపు. మొత్తం 17 స్థానాలు మేమే గెలుస్తాం. బీజేపీ అన్ని పార్టీల కంటే ప్రచారంలో ముందుగా దూసుకుపోతోంది. ప్రధాని మోదీ కూడా రెండ్రోజులు తెలంగాణలో పర్యటిస్తారు. తెలంగాణ అన్ని లోక్సభ స్థానాల్లో బీజేపీ గెలుపు ఖాయం అని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. -
కారు, ఆటో ఢీ... ముగ్గురి దుర్మరణం
బేస్తవారిపేట: నిద్రమత్తులో కారు... ఆటోను ఢీకొట్టి న ఘటనలో ఇద్దరు రైతులు, సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలంలోని పూసలపాడు రహదారిపై మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ షేక్ ఖాశీంషా, కారులోని బైనగాని ఓబయ్య, గురవయ్య తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే... బేస్తవారిపేట మండలంలోని ప్రకాశం జిల్లా, బార్లకుంటకు చెందిన చిత్తారు వెంకటేశ్వర్లు (53), చిత్తారు రాములు (40), బిళ్ల చిన్నవెంకటేశ్వర నాయుడు కలిసి ఎండుమిర్చి పంటను అమ్ముకునేందుకు గుంటూరు మిర్చియార్డుకు వెళా్లరు. విక్రయించిన సొమ్ముతో గుంటూరులో రైలు ఎక్కారు. కంభంలో దిగాల్సి ఉండగా, నిద్రపోవడంతో గిద్దలూరులో దిగారు. అక్కడ నుంచి బేస్తవారిపేటకు వచ్చేందుకు ఆటో ఎక్కారు. మరోవైపు విజయవాడలో కొత్తగా కొనుగోలు చేసిన కారును తీసుకుని తండ్రీకొడుకులు ఓబయ్య, గురవయ్య వెళుతూ మార్గమధ్యంలో నిద్రమత్తులో పూసలపాడు వద్ద ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టారు. దీంతో ఆటో నుజ్జు నుజ్జు అయ్యింది. అందులో ఇరుక్కుపోయిన ముగ్గురిలో వెంకటేశ్వర్లును రోడ్డుపై వెళ్లే వాహనదారులు బయటకు తీశారు. ఆ సమయానికే అతడు మృత్యువాత పడ్డాడు. రాములు, చినవెంకటేశ్వర నాయుడు ఆటోలో చిక్కుకుపోయారు. ఈలోగా లీకైన ఆయిల్ ట్యాంక్ నుంచి మంటలు వ్యాపించడంతో ఇద్దరి శరీరాలు కాలిపోయాయి. వారి వద్ద మిర్చి పంట విక్రయించిన సొమ్ము రూ.10లక్షలు కాలి బూడిదైపోయాయి. మృతుడు చిన్న వెంకటేశ్వర నాయుడు సీఎస్పురం మండలం, నల్లమడుగుల సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. -
కన్నకూతురిని కత్తులతో నరికి..
వైరా రూరల్: ఆస్తి కోసం కనీస విచక్షణ, మానవత్వం..చివరికి కన్నప్రేమను కూడా మరిచి మృగంలా మారిన ఓ తండ్రి కన్నకూతురును.. పైగా ఐదు నెలల గర్భవతి అని కూడా చూడ కుండా వేటకొడవళ్లు, గొడ్డలితో దాడి చేసి చంపేశాడు. ఈ ఘటనలో కుమార్తె అక్కడికక్కడే మృతిచెందగా అల్లుడు చావుబతుకుల మధ్య చికిత్స పొందుతున్నాడు. ఖమ్మం జిల్లా వైరా మండలం తాటిపూడి గ్రామంలో శుక్రవారం చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన వివరాలిలా ఉన్నాయి. తాటిపూడి గ్రామానికి చెందిన పిట్టల రాములు, మంగమ్మ దంపతులకు ముగ్గురు కుమారులతోపాటు కుమార్తె ఉషశ్రీ(35) ఉన్నారు. వీరిలో ఇద్దరు కుమారులు నరేశ్, వెంకటేష్ స్థానికంగానే ఉంటుండగా, మరొకరు దూరంగా నివసిస్తున్నారు. అదే గ్రామానికి చెందిన రాములు మామ (మంగమ్మ తండ్రి) మన్నెం వెంకయ్య చిన్నతనం నుంచే ఉషశ్రీని పెంచి పెద్దచేసి పదేళ్ల కిందట కొణిజర్ల మండలం గోపారానికి చెందిన పర్శబోయిన రామకృష్ణకు ఇచ్చి వివాహం జరిపించారు. ఈ సమయంలో వెంకయ్య తన రెండు ఎకరాల వ్యవసాయ భూమి, 10కుంటల ఇంటి స్థలాన్ని ఉషశ్రీ పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. దీంతో రామకృష్ణ ఇల్లరికంపై తాటిపూడికి రాగా, అక్కడే భార్యాభర్తలు టైలరింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నారు. పదేళ్ల క్రితం పెళ్లి కాగా, ఇన్నేళ్లకు ఉషశ్రీ గర్భం దాల్చింది. కాగా, తన మామ వెంకయ్య ఆస్తిని ఉషశ్రీకి రాయడాన్ని జీర్ణించుకోలేని ఆమె తండ్రి రాములు, సోదరులు నరేశ్, వెంకటేష్ తరచూ ఘర్షణ పడేవారు. ఈ విషయమై కేసు కూడా కోర్టులో పెండింగ్లో ఉంది. కూతురినీ నరికేశాడు.. శుక్రవారం ఉదయం ఉషశ్రీకి చెందిన ఇంటి స్థలంలో ఉన్న సుబాబుల్ చెట్లను నరికేందుకు పిట్టల రాములు, ఆయన కుమారులు నరేష్, వెంకటేశ్ వేటకొడవళ్లు, గొడ్డలి, గడ్డపలుగులతో వచ్చారు. ఇది చూసి రామకృష్ణ, ఉషశ్రీ అడ్డుకున్నారు. దీంతో వారు గడ్డపలుగు, వేటకొడవళ్లతో వెంటపడ్డారు. ఈ క్రమంలో రామకృష్ణపై దాడి చేస్తుండగా, ఉషశ్రీ తప్పించుకునే ప్రయత్నంలో ఇంకొకరి ఇంట్లోకి వెళ్లడంతో వెంబడించి మరీ నరికారు. ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రగాయాలపాలైన రామకృష్ణను స్థానికులు 108 వాహనంలో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆత్మరక్షణ కోసం ఉషశ్రీ, రామకృష్ణ ప్రతిదాడి చేయడంతో రాములు, వెంకటేశ్, నరేశ్కు కూడా గాయాలవడంతో ఆస్పత్రిలో చేరారు. వైరా ఏసీపీ ఎం.ఎ రెహమాన్, సీఐ నునావత్ సాగర్, ఎస్సై మేడా ప్రసాద్ ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు. -
పదేళ్ల నాటి ప్రతీకారంతో.. అంతమొందించి.. ఆపై దహనం!
సంగారెడ్డి: పదేళ్ల నాటి ప్రతీకారం ఒక వ్యక్తిని హత్యచేసి దహనం చేసిన ఘటన సిర్గాపూర్ మండలం ఖాజపూర్ శివారులోని అటవీ ప్రదేశంలో గురువారం వెలుగు చూసింది. కల్హేర్ మండలం మీర్ఖాన్పేటకు చెందిన ముప్పిడి రాములు(35) హత్యకు గురయ్యాడు. ప్రత్యర్థులు పెట్రోలు పోసి మృతదేహాన్ని దహనం చేశారు. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం వడ్డెపల్లి శివారులో ఖాజపూర్కు చెందిన కుర్మ లింగవ్వ పదేళ్ల క్రితం హత్యకు గురైంది. అప్పట్లో ముప్పిడి రాములుపై నిజాంసాగర్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. దీంతో ఏడేళ్ల జైలు శిక్ష అనుభవించాడు. రాములును చంపేందుకు లింగవ్వ కుటుంబ సభ్యులు కక్ష పెంచుకున్నారు. బుధవారం సాయంత్రం రాములును నమ్మబలికి హత్య చేసినట్లు తెలుస్తోంది. మృతదేహాన్ని అడవిలో దహనం చేశారు. అయితే లింగవ్వ కొడుకు కుర్మ గోపాల్, భర్త పాపిగొండ పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం. పదేళ్ల క్రితం హత్యకు గురైన లింగవ్వ కూతురు సత్యవ్వను చంపేందుకు రాములు యత్నించినట్లు ఖాజపూర్లో ప్రచారం జరుగుతోంది. అందుకే రాములును పథకం ప్రకారమే హత్య చేసినట్లు చెబుతున్నారు. ఘటనా స్థలాన్ని నారాయణఖేడ్ డీఎస్పీ వెంకట్రెడ్డి, కంగ్టీ సీఐ జక్కుల హన్మంతు సందర్శించారు. వారు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
తలకిందులుగా వేలాడదీసి..కింద మంట పెట్టి...
మందమర్రి రూరల్: మంచిర్యాల జిల్లా మందమర్రిలో దారుణం చోటు చేసుకుంది. మేకలు దొంగతనం చేశారని ఇద్దరు యువకులను కట్టేసి చిత్రహింసలు పెట్టారు. తలకిందులుగా వేలాడదీసి, కింద మంటపెట్టి నరకం చూపించారు. అవమానం భరించలేక ఓ యువకుడు కనిపించకుండా పోయాడు. అతని చిన్నమ్మ శనివారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఆలస్యంగా విషయం వెలుగులోకి వచ్చింది. మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని యాపల్ ఏరియా సమీపంలోని అబ్రహం నగర్కు చెందిన చాకలి రాములుకు కొన్ని మేకలు ఉన్నాయి. ఆ మేకలను కాసేందుకు తేజ అనే యువకుడిని కూలీగా పెట్టుకున్నాడు. అయితే మేకల షెడ్డు వద్ద ఉన్న ఓ పైపు, ఒక మేక ఇటీవల చోరీ అయ్యాయి. అదే ఏరియాకు చెందిన కిరణ్ ఈ పని చేసి ఉంటాడన్న అనుమానంతో రాములు పిలిచి ప్రశ్నించాడు. దీంతో తడబడిన కిరణ్ పైపు దాచిన చోటు చూపించాడు. తర్వాత చోరీ అయిన మేక గురించి కూడా ఆరా తీయగా స్థానికులు మేకను కూడా కిరణే ఎత్తుకెళ్లి అమ్ముకున్నాడని ఆరోపించారు. దీంతో ఆగ్రహించిన రాములు నిందితుడిని తాళ్లతో కట్టేసి తలకిందులుగా వేలాడదీసి చిత్రహింసలు పెట్టాడు. అంతటితో ఆగకుండా కింద మంట పెట్టాడు. చిత్రహింస భరించలేక కిరణ్, తనకు మేకల కాపరి తేజ సహకరించాడని చెప్పాడు. దీంతో అతడిని కూడా తీసుకువచ్చి షెడ్డులో కట్టేసి రాములు, అతని కుటుంబ సభ్యులు చిత్రహింసలు పెట్టారు. తర్వాత పెద్దమనుషుల వద్ద పంచాయితీ పెట్టగా మేకకు రూ.6 వేలు ఇవ్వాలని తీర్మానం చేశారు. ఇందుకు నిందితులు అంగీకరించారు. కిరణ్ చిన్నమ్మ ఫిర్యాదుతో.. ఘటన అనంతరం అవమాన భారంతో కిరణ్ కనిపించకుండాపోయాడు. దీంతో రాములు, అతని కొడుకు శ్రీనివాస్, భార్య స్వరూప, అతని వద్ద పనిచేసే నరేశ్ రెండు రోజుల క్రితం తన అక్క కొడుకు కిరణ్ను తీవ్రంగా హింసించారని కిరణ్ చిన్నమ్మ నిట్టూరి సరిత శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ అవమానం భరించలేక తన అక్క కొడుకు కిరణ్ కనిపించకుండా పోయాడని తెలిపింది. కిరణ్ దళితుడు కావడంతో నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై చంద్రకుమార్ పేర్కొన్నారు. ఘటన స్థలాన్ని బెల్లంపల్లి ఏసీపీ పంతాటి సదయ్య శనివారం పరిశీలించారు. -
ఆర్టీసీ డ్రైవర్ రాములుకు సజ్జనార్ అభినందన!
జగిత్యాల: ఆర్టీసీ డ్రైవర్ రాములును ఆ సంస్థ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ ద్వారా అభినందించారు. పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద గురువారం ఆర్టీసీ బస్సు కిందపడి ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించగా, డ్రైవర్ రాములు వెంటనే అప్రమత్తమై బస్సును నిలిపివేశాడు. ఈ సంఘటనలో ఆమెకు ప్రాణాప్రాయం తప్పింది. గాయాలతో ప్రస్తుతం హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతోంది. విషయం తెలుసుకున్న ఎండీ సజ్జనార్.. డ్రైవర్ను అభినందించారు. ‘చాకచక్యం, అప్రమత్తతతో నిండు ప్రాణం నిలిచింది. సమయస్ఫూర్తితో వ్యవహరించి ఓ మహిళ ప్రా ణాలు కాపాడిన డ్రైవర్ రాములుకు అభినందనలు’ అని సజ్జనార్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. సమయస్పూర్తితో వ్యవహారించి ఓ మహిళ ప్రాణాలు కాపాడిన మెట్పల్లి డిపో డ్రైవర్ పి.రాములుకు అభినందనలు. డ్రైవర్ చాకచాక్యం, అప్రమత్తత వల్ల ఓ నిండు ప్రాణం నిలిచింది. మెట్పల్లిలో జగిత్యాలకు వైపునకు వెళ్తొన్న బస్ కింద పడి ఆత్మహత్య చేసుకునేందుకు ఓ మహిళ యత్నించింది. బస్ కదలిక గమనించిన… pic.twitter.com/fylJs7zsH5 — V.C. Sajjanar, IPS (@SajjanarVC) July 21, 2023 -
కూటి కోసం కూలికెళ్తే !
వికారాబాద్: పొట్టకూటి కోసం ఓ ఫ్యాక్టరీలో కూలికి వెళ్లిన వ్యక్తిని మృత్యువు కబళించింది. భారీ క్రేన్ పైనపడటంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ ఘటన లక్ష్మీదేవిపల్లిలోని సుగుణ స్టీల్ ఫ్యాక్టరీలో చోటు చేసుకుంది. స్టానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ధారూరు మండలం ఇంతగుంట గ్రామానికి చెందిన రాములు(30) పరిగి మండలం లక్ష్మీదేవిపల్లిలోని సుగుణ స్టీల్ ఫ్యాక్టరీలో కూలి పని చేస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి క్రేన్ సాయంతో స్టీల్ లోడ్ చేస్తుండగా ఒక్కసారిగా క్రేన్ పైన పడింది. దీంతో రాములు అక్కడికక్కడే మృతి చెందాడు. ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే మా కుమారుడు మృతి చెందాడని మృతుని బంధువులు వాపోయారు. ఫ్యాక్టరీలో గతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయని వారు తెలిపారు. ఫ్యాక్టరీలో పనిచేస్తున్నప్పుడు ఎలాంటి భద్రతలు యాజమాన్యం పాటించడంలేదని వారు మండిపడ్డారు. మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. యాజమాన్యంపై చర్యలకు డిమాండ్ లక్ష్మీదేవిపల్లిలోని సుగణ స్టీల్ ఫ్యాక్టరీలో ఎలాంటి భద్రతా చర్యలు కానరావడంలేదని, కూలీ మృతికి యాజమాన్యమే బాధ్యత వహించాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు వెంకటయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం తహసీల్దార్ రాంబాబుకు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఫ్యాక్టరీ యాజమాన్యం బాధ్యతా రహితంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రతి ఏటా ఒకరిద్దరు మృతి చెందుతున్నా యాజమాన్యం మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. కంపెనీలో సేఫ్టీ పరికరాలు ఏమీ లేకుండానే పనులు చేయిస్తున్నారన్నారు. కార్మికులపై ఒత్తిడి తీసుకువచ్చి పనులను చేయిస్తుండటంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. వెంటనే ఫ్యాక్టరీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు సత్తయ్య, యాదగిరి, శేఖర్ పాల్గొన్నారు. -
మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: మెట్పల్లి(ప్రస్తుత కోరుట్ల నియోజకవర్గం) మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో భాదపడుతున్న ఆయన.. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు. కొమిరెడ్డి రాములు 2004-2009లో ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలా పనిచేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాంగ్రెస్ అనుబంధ ఎమ్మెల్యేగా ఆయన కొనసాగారు. కాగా మెట్పల్లి నియోజకవర్గం ఆ తర్వాత జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో కోరుట్ల అసెంబ్లీ స్థానంలో కలిసిపోయింది. కొమిరెడ్డి మృతిపట్ల స్థానిక ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు సంతాపం తెలియజేశారు. -
ఒమిక్రాన్కు ఆయుర్వేద మందును అనుమతించలేదు
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్కు ఆయుర్వేద మందును ఇంత వరకు ప్రభుత్వం అనుమతించలేదని రాష్ట్ర ఆయుష్ కమిషనర్ రాములు గురువారం స్పష్టం చేశారు. ఒమిక్రాన్ సోకకుండా, సోకిన వారికి తగ్గేలా ఆయుర్వేద మందు పంపిణీ చేస్తామని కొందరు ప్రచారం చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఒమిక్రాన్ను నివారించే ఆయుర్వేద మందు ఉచిత సరఫరా, అమ్మకానికి అనుమతి కోరుతూ ఆయుష్ శాఖను ఇంత వరకూ ఎవరూ సంప్రదించలేదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన కరోనా నిరోధక ఆయుర్వేద మందు ఆయుష్–64, ఆర్సెనిక్ ఆల్బమ్–30 వంటి హోమియో మందులను వైద్యుల సలహా మేరకు మాత్రమే ప్రజలు తీసుకోవచ్చని వివరించారు. -
తీజ్ సంబరాలు: తీన్మార్ వేసిన ఎంపీ, ఎమ్మెల్యేలు
అచ్చంపేట: తీజ్ సంబురాలు అచ్చంపేట లో ఆదివారం అంబరాన్నంటాయి. జాగో బంజారా.. బొరావ్ తీజ్ అంటూ.. గిరిజనులు మొలకల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈనెల 21న ప్రారంభించిన తీజ్ వేడుకలు తొమ్మిది రోజుల పాటు నిర్వహించారు. ఆదివారం ముగింపు వేడుకలు పురస్కరించుకుని సంప్రదాయ వాయిద్యం వాయిస్తూ యువతులు, మహిళలు చేసిన నృత్యాలు చేశారు. ఈ ఉత్సవాల్లో యువతులు తీజ్ బుట్టలను తలపై ఉంచి కుటుంబసభ్యులతో కలిసి బహిరంగ ఊరేగింపులో సంప్రదాయ నృత్యం చేశారు. ఉమ్మడి జిల్లాతో పాటు నల్లగొండ, హైదరాబాద్ ప్రాంతాల నుంచి గిరిజన బంధువులు తరలివచ్చారు. ఈ ఉత్సవాల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగింది. ఉత్సవాల్లో ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ వర్గీయులు వాగ్వాదానికి దిగారు. పోలీసులు జోక్యం చేసుకుని పరిష్కరించారు. చెరువులో నిమజ్జనం.. గిరిజన భవన్ వద్ద పందిరిపై ఏర్పాటు చేసిన తీజ్ బుట్టలను (మంచెపై) దింపి పీటమీద పెట్టి ఆట,పాటలతో తీజ్ నారును తెంపారు. రేగుచెట్టు వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గోధుమనారు(డోనా) చిన్న కర్ర(పీట)లతో యువతీ, యువకులు ఒకరిని ఒకరు ఆటపట్టించారు. మొలకల బుట్టలను తలపై పెట్టుకున్నారు. అమ్మాయిలతో పాటు కుటుంబసభ్యులు, పెద్దమనుషులు అంతాకలిసి ఊరేగింపుగా బయలుదేరారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోని గిరిజన తండాల నుంచి భారీగా గిరిజనులు తరలివచ్చారు. బుట్టలతో ఊరేగింపుగా నడింపల్లి చెరువు వద్దకు వెళ్లారు. చెరువు దగ్గర తమ సంప్రదాయ పద్ధతులతో మొలకల బుట్టలకు పూజలు నిర్వహించి చెరువులో నిమజ్జనం చేశారు. పూజలలో పాల్గొన్న అమ్మాయిలు తీసుకున్న రొట్టెలు, ఆకుకూరల ఆహారాన్నే సంప్రదాయ రీతిలో అందరూ అక్కడ తీసుకున్నారు. అనంతరం తొమ్మిది రోజులపాటు పూజలు నిర్వహించిన గిరిజన భవన్ వద్దకు చేరుకున్నారు. అక్కడ పెద్దమనషులకు యువతులు కాళ్లు కడిగి వారి ఆశీర్వాదం పొందారు. అమ్మాయిలకు కూడా పెద్దమనషులు కాళ్లు కడిగి ఆశీర్వదించారు. ఉత్సవాల్లో ఎంపీ, ఎమ్మెల్యే నృత్యం మొలకల పండుగ ఊరేగింపులో ఎంపీ రాములు, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, డీసీసీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, బీసీ కమిషన్ సభ్యులు ఆచారి, మనోహర్, మార్కెట్ చైర్మన్ మధుసూదన్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ నర్సింహగౌడ్, బీజేపీ జిల్లా కార్యదర్శి బాలజీ పాల్గొన్నారు. ఎంపీ రాములు గిరిజనులతో పాటు నృత్యం చేశారు. బంజారా గిరిజనులతో పాటు ఎమ్మెల్యేగువ్వల బాలరాజు సతీసమేతంగా పాల్గొన్నారు. అమల మొలకలను తలపై పెట్టుకుని చూపరులను ఆకర్షించారు. -
కుటుంబ సభ్యులకు మృతదేహాలు అప్పగింత
అచ్చంపేట/ఉప్పునుంతల: హైదరాబాద్–శ్రీశైలం జాతీయ రహదారిపై పిరట్వాన్పల్లి వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఏడుగురి మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. శనివారం ఉదయం 8 గంటలకు మృతుల కుటుంబ సభ్యులు అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆస్పత్రి ప్రాంగణంలో మృతుల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. కాగా, కార్తీక్ అలియాస్ సంపత్ కుటుంబసభ్యులకు సమాచారం అలస్యంగా చేరడంతో వారు ఉదయం 11.45 గంటలకు వచ్చారు. ఇతని పేరు, అడ్రస్ సరిగా లేకపోవడంతో గుర్తించడంలో జాప్యం జరిగింది. పోలీసులు కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించి, అనంతరం మృతదేహాలను అప్పగించారు. ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడ్డ క్షతగాత్రుడు నరేశ్ తనతో పాటు వచ్చిన స్నేహితులు లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. ప్రమాదంపై నరేశ్ ఫిర్యాదు మేరకు ఎస్ఐ అజ్మీర రమేశ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సంఘటన దురదృష్టకరం: ఎంపీ రాములు రోడ్డు ప్రమాదంలో ఏడుగురు చనిపోవడం దురదృష్టకరమని నాగర్కర్నూల్ ఎంపీ పి.రాములు అన్నారు. ఆయన అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. శ్రీశైలం హైవేపై ట్రామా సెంటర్ ఏర్పాటుతో పాటు ప్రస్తుతం ఉన్న రెండు వరుసల రోడ్డును నాలుగు లైన్లుగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని తెలిపారు. దీన్ని పార్లమెంట్లో ప్రస్తావించగా.. సర్వే చేయించి చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి గడ్కారీ హామీ ఇచ్చారని తెలిపారు. కాగా, సకాలంలో వైద్యులు ఆస్పత్రికి రాకపోవడంతో అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
14 నెలలుగా రైతు కుటుంబం గ్రామ బహిష్కరణ..
సాక్షి, వేల్పూరు(నిజామాబాద్): నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండలం వాడిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గత 14 నెలలుగా అంకం కిషన్ అనే రైతు కుటుంబానికి గ్రామాభివృద్ధి కమిటీ గ్రామ బహిష్కరణ విధించింది. నిత్యావసరాలు పాలు నీళ్ళు బియ్యము కిరాణా వస్తువులు ఏవీ ఇవ్వకుండా ఆంక్షలు విధించింది. చెంగల్ అనే గ్రామంలో కిషన్ మేనల్లుడు కొనుగోలు చేసిన భూమి విషయంలో కిషన్ సాయం చేశారని గ్రామాభివృద్ధి కమిటీ కక్ష్య కట్టింది. ఈ కమిటీ కిషన్ కుటుంబానికి ఐదు లక్షల 20 వేల రూపాయల జరిమానా వేసింది. కిరాణా షాపుల్లో కనీసం పిల్లలకు పాల ప్యాకెట్లు కూడా ఇవ్వని దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి.. అత్త కోడళ్ళ కు బీడీ కార్ఖానాలలో పని ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు. కిషన్ దంపతులు, ఇద్దరు కొడుకులు కోడళ్ళు నలుగురు పిల్లలు ఎనలేని కష్టాలు పడుతున్నారు. గ్రామాభివృద్ధి కమిటీ కట్టుబాట్లతో గ్రామస్తులు అందరూ సహాయ నిరాకరణ చేస్తున్నారు.14 నెలలుగా గ్రామంలో సహాయ నిరాకరణ కొనసాగుతోంది. వ్యవసాయంలో కూడా ఇబ్బందులు తలెత్తి ఐదు ఎకరాల జొన్న పంట కూడా నష్టపోయాం అని బాధితుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 14 నెలలుగా తీవ్ర మనస్థాపానికి గురైన బాధితులు…గ్రామ బహిష్కరణ ఎత్తి వేయించి తమకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ను కలిసి వేడుకున్నారు. మరోవైపు వాడి గ్రామాన్ని యాదవ సంఘం జాతీయ అధ్యక్షుడు రాములు సంఘ ప్రతినిదులు సందర్శించి బాధితులను పరామర్శించారు. చదవండి: ఫోన్ సిగ్నల్ కోసం చెట్టెక్కిన పిల్లలు..కానీ ఇంతలోనే -
Krishnapatnam Medicine: ఎంత ఆనందమయ్యా ఈ నిర్ణయం!
కరోనాకు మా పతంజలి మందు తయారు చేసిందని రామ్దేవ్ బాబా అట్టహాసంగా కొరోనిల్ మాత్రలను కేంద్ర ఆరోగ్యమంత్రి చేతుల మీదుగా విడుదల చేశాడు. ఎంత పని చేస్తుందో తెలియని మందు కరోనాను నిల్ ఎట్లా చేస్తుందని కోర్టుకెక్కితే అల్లోపతి మీద, ఆధునిక డాక్టర్ల మీద అడ్డగోలు కామెంట్లు చేశాడు. ఈ దుర్మార్గ వ్యాఖ్యలను వెనక్కు తీసుకుని వెయ్యి కోట్ల జరిమానా కట్టమని ఆందోళన చేస్తున్నారు డాక్టర్లు. కరోనా ఫ్రంట్లైన్ వారియర్స్గా వందల మంది డాక్టర్లు చనిపోతుంటే వాళ్ళనే కాపాడుకోలేని దద్దమ్మ అల్లోపతి అదో హంతకపతి అన్నాడు రామ్దేవ్. ఉత్తర భారతాన పెద్ద దుమారం రేగుతున్నా ఉలుకూ పలుకూ లేని కొన్ని తెలుగు మాధ్యమాలు... పెరటి మొక్కల్ని, సాధారణ మూలికల్ని మందుగా నూరి, కరోనాకు చెక్ పెట్టే అవకాశం ఉందని కృష్ణపట్నంలో ఆనందయ్య చెబుతుంటే మాత్రం ఏవేవో ప్రచారాలు, ఫిర్యాదులు, నానా రభస. ఆంధ్రప్రదేశ్ వ్యవస్థలన్నీ ఏదో ఓ నిర్ణయం తీసుకో వాల్సిన ఒత్తిడి. వేలమంది మందు కోసం బారులు కట్టి ఎదురు చూస్తుండగా బలవంతంగా ఆపి వేయాల్సిన పరిస్థితి. ఒక నిర్ణయం కోసం ఆయుష్ డైరెక్టర్ రాములు కృష్ణపట్నం వెళ్ళి మందులో మూలికలు, పరిమాణం, తయారీ విధానం తెలుసుకుని, రోగుల నుండి అభిప్రాయాలు తీసుకుని, ఆయుర్వేద పరిశోధన కేంద్ర సంస్థలో మూలికల శాస్త్రీయ విశ్లేషణ జరిగి ప్రభుత్వానికి రిపోర్టు ఇవ్వడం చకచకా జరిగింది. కోర్టు తీర్పులకు ముందే తాడేపల్లి సీఎం క్యాంపు ఆఫీసులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమీక్ష జరిపి ఏ మందులు అనుమతి ఇవ్వాలో, ఏ జాగ్రత్తలు తీసుకోవాలో స్పష్టం చేస్తూ, ఆనందయ్య చెప్పిన పి.ఎల్.ఎఫ్. అనే మూడు మందులకు అనుమతి ఇచ్చారు. ఆయుష్ రాములు మాట్లాడుతూ దీన్ని ఆయుర్వేదంగా గుర్తించడం లేదు, నాటుమందుగానే పరిగణించాలన్నారు. సన్నాయినొక్కు మెరుగైన సమాజాలు నిన్న చనిపోయిన కోటయ్య హెడ్మాస్టర్ను ఎన్నోసార్లు చంపేశారు. ఇప్పుడు కూడా ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా ప్రభుత్వమే అనుమతి ఇచ్చింది కనుక ఎంత ఆనందమయ్యా ఈ నిర్ణయం అని చాలామంది అనుకుంటు న్నారు. ప్రభుత్వం ప్రజల్ని భ్రమల్లో ముంచడం కోసం, తమ వైఫ ల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసం అనుమతి ఇచ్చిందని అనేవాళ్లూ ఉన్నారు. చికిత్స ఇంత చవకగా దొరికితే ఎట్లా? రెండు రాళ్ళు వేద్దామని కొందరు ఏవేవో విషయాలు ముందుకు తెస్తారు. ఆయుర్వేద వాత, కఫ, పిత్త సిద్ధాంతం, శుద్ధీకరణకు ముందే దేశవాళి మూలవాసు లది మూలికా వైద్యం. గ్రంథస్తం కాకున్నా కంఠస్తంగా, అనువం శికంగా కొనసాగుతున్నది. కరోనాకు అడ్డుకట్ట వేసిన చైనా ఆధునిక వైద్యంతో పాటు మూలికా వైద్యానికి కూడా పెద్దపీట వేసింది. హోమియోలోనూ మెటీరియా మెడికాకు మూలికలే సృజన. మూలికల నుండి చురుకైన మందును అల్లోపతికి ముందే సంగ్రహిం చడం మొదలుపెట్టారు. చెట్ల ఆల్కలాయిడ్స్ను ఇప్పటికీ సంగ్రహి స్తూనే ఉన్నారు. ఇన్ని తెలిసి మూలికా వైద్యాన్ని ఆయుర్వేదం కంటే, అల్లోపతి కంటే తక్కువ చేయడం హేతుబద్ధత ఎట్లవుతుంది? అన్ని శాస్త్రాల కంటే ముందు ఈ నాటువైద్యమే మేటి వైద్యమై మనుషుల్ని, జంతువుల్ని అనేక రోగాల నుండి కాపాడుకున్నది. కరోనా కష్టకాలంలో గొప్ప ధైర్యాన్ని ఇచ్చిన ఆనందయ్య మందు తప్పకుండా అన్ని కరోనా కేసులకు పని చేస్తుందని చెప్పలేకపోయినా, ఇప్పుడు మార్కెట్లోకి వచ్చిన ఇమ్యూనిటీ బూస్టర్ల కంటే బాగా పని చేస్తుందేమో. ఇప్పటికీ కామెర్లకు ఇచ్చే మూలికా వైద్యం, గాయాలు మాన్పడానికి ఇచ్చే పూత మందు అద్భుతంగా పనిచేస్తాయి. శరీర ప్రకృతిలో రోగ వికృతిని సృష్టిలో భాగమైన ఆకులు, అలములు సరి చేసినంత ప్రభావశీలంగా ఇతర పదార్థాలు చేయవని మనకు అర్థమ వ్వాలి. ఒక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల, దేశవాళీ వైద్యానికి ఆధునిక పరిశోధన తోడై గొప్ప ఫలితాలు సాధించాలి. చండీగడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్లో బెటాడిన్ బదులుగా వేపరసం వాడి అద్భుత ఫలితాలు రాబట్టినారు. లక్షల సంవత్సరాల మనిషి నాగరిక క్రమంలో తినే పంట చెట్లు, శరీర ధర్మాన్ని వ్యాధిని ఎదుర్కోవడానికి సిద్ధం చేసే మందుచెట్లను గుర్తించడంతో ఆధునికయుగం సారవంతం అయింది. నడమంత్రపు పెట్టుబడి శాస్త్రాలు తిమ్మిని బమ్మి చేయాలని చూసినా, ప్రతి దేశంలో తమకు అందుబాటులోని మూలికా వైద్యాన్ని ఆధునీకరించడం, వందల ఆనందయ్యలకు ప్రభుత్వాలే ప్రోత్సాహాన్నివ్వడం ఇప్పుడు అవసరం. హిమాలయాల నుండి హిందూ మహాసముద్రం దాక, చెట్లలో, పుట్లలో, నదీజలాల్లో, దూసర క్షేత్రాల్లో సంజీవనీ పర్వతాలు అడుగడుగునా ఉంటాయి. అందుకే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎంతో ఆనందమయ్యా! పక్క రాష్ట్రాలకైనా తన మందు సరఫరా చేస్తానంటున్నాడు ఆనందయ్య. తెలంగాణలోనూ కృష్ణపట్నం మందుతో కుదుట పడినవాళ్ళు ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా చొరవ చూపాలి. నిన్నటి జగన్ నిర్ణయం దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకం కావాలి. - డా. చెరుకు సుధాకర్ తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షులు. 9848472329 -
ఆనందయ్య మందును ౫ రకాలుగా వాడుతున్నారు
-
ఆనందయ్య మందు పై రేపు నివేదిక వస్తుంది
-
ఆనందయ్య మందులో ఎలాంటి హానికారక పదార్థాలు లేవు
-
ఆనందయ్య ఔషధం పై వివరాలు సీఎంకు అందించాం
-
18 హత్యలు: భర్తలుండి తప్పుచేసే ఆడవారినే..
సాక్షి, హైదరాబాద్: రాజధానితోపాటు చుట్టుపక్కల జిల్లాల్లో వరుసపెట్టి చోరీలు చేస్తున్న ఘరానా దొంగ మంత్రి శంకర్... మూడు కమిషనరేట్లు, ఇతర జిల్లాల్లోనూ మహిళల్ని హత్య చేస్తున్న సైకోకిల్లర్ మైన రాములు... వీరిలో ఒకరు 40 ఏళ్లుగా 256 చోరీలు చేస్తే, మరొకరు 17 ఏళ్లలో 18 హత్యలు చేశాడు. గత ఏడాది జైల్లో కలుసుకున్నప్పుడు వారి మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరిగిందని పోలీసులు చెప్తున్నారు. నరహంతకుడిని విచారించిన నేపథ్యంలోనే ఇది బయటపడిందని అంటున్నారు. హత్యలు చేయడం మానమంటూ శంకర్ ‘హితబోధ’చేశాడని.. దీన్ని విభేదించిన రాములు తన ‘లక్ష్యం’వేరంటూ చెప్పాడని పేర్కొంటున్నారు. నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం అరెస్టు చేసిన రాములును ఘట్కేసర్ పోలీసులు బుధవారం జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు. చదవండి: (భార్యలు మోసం చేయడంతో సైకోగా మారి 18 హత్యలు) జైల్లో సంభాషించుకున్న ఈ ద్వయం... రాములును పటాన్చెరు, శామీర్పేటల్లో జరిగిన రెండు హత్య కేసుల్లో పోలీసులు 2019లో అరెస్టు చేశారు. అప్పటికే కొన్ని పాత కేసులు కూడా ఉండటంతో గత ఏడాది జూలై 31 వరకు ఇతడు జైల్లోనే ఉన్నాడు. నగరంలోని వివిధ పోలీస్స్టేషన్ల పరిధిలో 12 చోరీలకు సంబంధించిన కేసుల్లో మంత్రి శంకర్ను హైదరాబాద్ పోలీసులు 2019, సెప్టెంబర్ 11న అరెస్టు చేశారు. ఇతడిపై పీడీ యాక్ట్ ప్రయోగించారు. ఈ నేపథ్యంలోనే శంకర్ గత ఏడాది డిసెంబర్ 4 వరకు జైల్లోనే గడిపాడు. ఇలా వీళ్లిద్దరూ జైల్లో ఉండటంతో అక్కడే కలుసుకున్నారు. రాములు వ్యవహారం తెలిసిన శంకర్ ‘హితబోధ’చేయడానికి ప్రయత్నించాడు. మహిళల ఒంటిపై ఉన్న సొత్తు కోసమే రాములు నేరాలు చేస్తున్నాడని భావించి అలా హత్యలు ఎందుకని, జైలు నుంచి బయటకు వచ్చాక తనతో వస్తే చోరీలు చేద్దామంటూ ‘ఆఫర్’ఇచ్చాడు. తాను చోరీలు చేయనంటూ చెప్పిన రాములు... కేవలం భర్తలు ఉండి పెడదారిలో నడుస్తున్న వారినే తాను చంపుతున్నానని, భర్తల్ని కోల్పోయి ఆ వృత్తిలోకి దిగిన వారిని ఏమీ చేయకుండా విడిచిపెట్టేస్తానని చెప్పుకొచ్చాడు. ఓ కోణంలో భిన్న ధ్రువాలు... ఓ కోణంలో మాత్రం శంకర్, రాములు భిన్న ధ్రువాలని పోలీసులు చెప్తున్నారు. ముగ్గురు భార్యలు ఉండగా... మరో ముగ్గురు మహిళలతో సహజీవనం చేస్తున్న గజదొంగ శంకర్ అయితే... మొదటి భార్య వివాహమైన పక్షం రోజులకే మరొకరితో వెళ్లిపోవడం, మూడేళ్లు కాపురం చేసిన రెండో భార్య విభేదాలతో వేరుకావడం, సహజీవనం చేసిన మూడో ఆమె మరొకరితో సన్నిహితంగా ఉండి కంటపడటంతో రాములు సైకోగా మారాడని వివరిస్తున్నారు. ఘట్కేసర్లో హతమైన వెంకటమ్మ కేసులో పోలీసులు రాములు అరెస్టును ప్రకటించారు. బుధవారం కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు. తదుపరి విచారణ నిమిత్తం కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు. -
భార్యలు మోసం చేయడంతో సైకోగా మారి 18 హత్యలు
సాక్షి, హైదరాబాద్: మొదటి భార్య వివాహమైన పక్షం రోజులకే మరొకరితో వెళ్లిపోయింది.. మూడేళ్లు కాపురం చేసిన రెండో భార్య విభేదాలు రావడంతో ఇద్దరు పిల్లల్ని తీసుకుని విడిపోయింది.. సహజీవనం చేసిన మూడో ఆమె మరొకరితో సన్నిహితంగా ఉంటూ కంటపడింది... దీంతో 2003లో తూప్రాన్ పోలీస్స్టేషన్ పరిధిలో ‘మూడో’ఆమెను హత్య చేశాడు. అప్పటి నుంచి భర్తలు ఉండి పెడదారిలో వెళ్తున్న మహిళల్ని ఎంపిక చేసుకుంటున్నమైన రాములు 18 మందిని చంపాడు. తాజాగా ఘట్కేసర్, ములుగు పోలీస్స్టేషన్ల పరిధిలో ఇద్దరిని చంపిన ఈ సైకో సీరియల్ కిల్లర్ని ఉత్తర మండల టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారని కొత్వాల్ అంజనీకుమార్ వెల్లడించారు. ఓఎస్డీ పి.రాధా కిషన్రావుతో కలసి మంగళవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించారు. సైకో కిల్లర్గా మారి హత్యలు.. సంగారెడ్డి జిల్లా ఆరుట్ల గ్రామానికి చెందిన రాములుకు తలారీ, సాయిలు అనే పేర్లూ ఉన్నాయి. వృత్తిరీత్యా స్టోర్ కటర్ అయిన ఇతను ప్రస్తుతం బోరబండలో నివసిస్తున్నాడు. ఇద్దరు భార్యలతో పాటు సహజీవనం చేసిన మహిళ ద్వారా ఎదురైన అనుభవాలతో సైకో కిల్లర్గా మారాడు. ఇటీవల మరో మహిళను వివాహం చేసుకుని ఆమెతో కలసి బోరబండలో నివసిస్తున్న రాములు.. భర్తలు ఉండి వారిని మోసం చేస్తూ వ్యభిచారం చేసే వారిని, డబ్బు కోసం పరాయి మగవాడికి లొంగిపోయిన వారిని ఎంచుకుని చంపుతుంటాడు. చదవండి: (మదనపల్లి జంటహత్యల కేసులో కొత్త ట్విస్ట్) ప్రధానంగా కల్లు కాంపౌండ్లలో ఉన్న ఈ తరహా మహిళలతో పరిచయం పెంచుకుంటాడు. వారితో కలసి కల్లు తాగే రాములు ఆపై డబ్బు ఆశ చూపి తన వెంట నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకువెళ్తాడు. అక్కడికి వెళ్లిన తర్వాత వారి పూర్వాపరాలు అడుగుతాడు. వారిలో ఎవరికైనా భర్తలున్నట్లు తేలితే... సైకోగా మారిపోయే రాములు వారిపై అత్యాచారం చేస్తాడు. ఆపై చీరతో ఉరి బిగించి లేదా బండ రాయితో మోది చంపేస్తాడు. కొన్నిసార్లు మృతదేహాన్ని ఎవరూ గుర్తుపట్టకుండా ముఖం తదితర భాగాలపై పెట్రోల్ పోసి కాల్చేస్తాడు. దీనికి ముందు మృతదేహంపై నుంచి చెవి కమ్మలు, కాళ్ల పట్టీలను తదితరాలు తస్కరిస్తాడు. ఏ ఆధారం వదలకుండా అక్కడ నుంచి జారుకుంటాడు. పిచ్చిపట్టినట్లు నాటకం... ఎనిమిది హత్యలు చేసిన ఇతడిని 2009, అక్టోబర్ 12న సైబరాబాద్ పోలీసులు తొలిసారిగా పట్టుకున్నారు. అప్పట్లో నార్సింగిలో జరిగిన హత్య కేసులో రంగారెడ్డి జిల్లా కోర్టు జీవితఖైదు విధించింది. 2011లో మరో కేసులోనూ ఇలాంటి శిక్షే పడింది. దీంతో చర్లపల్లి కేంద్ర కారాగారంలో కొన్నాళ్లు శిక్ష అనుభవించాడు. అక్కడ నుంచి తప్పించుకునే అవకాశం లేకపోవడంతో తనకు పిచ్చిపట్టినట్లు నాటకమాడాడు. దీంతో జైలు అధికారులు ఎర్రగడ్డలోని మానసిక చికిత్సాలయంలో చేర్చారు. 2011, డిసెంబర్ 29 రాత్రి రాములు అక్కడున్న ఇతర ఖైదీలు నర్సయ్య, అఫ్రోజ్ ఖాన్, గిరిజ సింగ్ వాఘేలా, యాదగిరి, లచ్చయ్యలతో కలసి పథకం వేసి తప్పించుకున్నాడు. దీనిపై ఎస్సార్నగర్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. ముగ్గురిని పోలీసులు అప్పట్లోనే పట్టుకోగా... రాములుతో పాటు లచ్చయ్య, అఫ్రోజ్ ఖాన్ కొన్నాళ్ల వరకు చిక్కలేదు. చదవండి: ('ఒకరోజు ఆగండి, మా పిల్లలు లేచి వస్తారు') చోరీ కేసులు కూడా.. పారిపోయిన రాములు నగర శివారుల్లో ఉంటూ స్టోన్ క్రషర్స్లో కార్మికుడిగా పని చేశాడు. మళ్లీ సైకోగా మారి చందానగర్ ఠాణా పరిధిలో ఇద్దరు మహిళలను హత్యచేశాడు. రాములు పని చేస్తున్న క్రషర్లోనే మేతారీ బాలనర్సింహ్మ పరిచయమైంది. వీరిద్దరు దుండిగల్, బోయిన్పల్లి పరిధుల్లో మరో ముగ్గురు మహిళల్ని చంపేశారు. ఈ ఐదు హత్య కేసుల్లో రాములు, బాలనర్సింహ్మను పోలీసులు 2013, మే 13న అరెస్టు చేశారు. జీవితఖైదు పడిన కేసుల్ని హైకోర్టులో సవాల్ చేసి, మిగిలిన కేసుల్లో బెయిల్ పొందిన రాములు 2018 అక్టోబర్ 3న బయటకొచ్చి శామీర్పేట, పటాన్చెరు పరిధుల్లో ఇద్దరు మహిళలను హత్య చేశాడు. పటాన్చెరు పోలీసులు అరెస్టు చేయగా.. గతేడాది జూలై 31న జైలు నుంచి విడుదలయ్యాడు. ఇతడిపై శామీర్పేట, మేడ్చల్, రాయదుర్గం, ఐడీఏ బొల్లారం ఠాణాల్లో చోరీ కేసులు కూడా ఉన్నాయి. సీసీ కెమెరాల ఆధారంగా.. గత ఏడాది డిసెంబర్ 10న బాలానగర్ కల్లు కాంపౌండ్ నుంచి ఓ మహిళను ములుగు ప్రాంతానికి తీసుకువెళ్లాడు. అక్కడ ఆమెతో కలసి మద్యం తాగి హత్య చేశాడు. డిసెంబర్ 30న యూసుఫ్గూడ కల్లు కాంపౌండ్ నుంచి వెంకటమ్మను తీసుకువెళ్లి ఘట్కేసర్ వద్ద హత్య చేశాడు. వెంకటమ్మ హత్య కేసును ఛేదించడానికి నార్త్జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వరరావు నేతృత్వంలోని బృందం రంగంలోకి దిగింది. ఎస్సైలు కె.శ్రీకాంత్, జి.రాజశేఖర్రెడ్డి, బి.పరమేశ్వర్ తదితరులు సీసీ కెమెరాల ఫీడ్లో చిక్కిన ఫీడ్ ఆధారంగా రాములును పట్టుకున్నారు. ములుగులో హత్యకు గురైన మహిళను గుర్తించాల్సి ఉంది. -
16 హత్యలు: సీరియల్ కిల్లర్ అరెస్ట్..
సాక్షి, హైదరాబాద్: ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేసుకొని హతమారుస్తున్న సీరియల్ కిల్లర్ రాములును రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సైకో కిల్లర్ 16 హత్యలు చేసినట్లు పోలీసులు నిర్థారించారు. 2011లో ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రి నుంచి పరారైన రాములు స్వగ్రామం సంగారెడ్డి జిల్లా కంది మండలం అరుట్ల కాగా, గతంలో రాములపై పలు పోలీస్స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. జైలు నుంచి పారిపోయి మళ్లీ హత్యలు చేస్తున్న సైకో కిల్లర్ను రాచకొండ పోలీసులు నిర్వహించిన జాయింట్ ఆపరేషన్లో పట్టుకున్నారు. నిందితుడిపై 16 హత్యలు, నాలుగు దోపిడీ, ఒక పోలీస్ కస్టడీ నుండి తప్పించుకున్న కేసులు ఉన్నాయి. చదవండి: ఈ దొంగ బాగా రిచ్, ఓ విల్లా.. 4 హైఎండ్ కార్లు హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ వివరాలను మంగళవారం మీడియాకు వెల్లడించారు. ‘‘చిన్న వయసులో పెళ్లి చేసుకున్న రాములు.. తన భార్య విడిపోవడంతో అప్పటి నుండి మహిళలపై కక్ష పెంచుకున్నాడు. మానసికంగా దెబ్బ తిన్న రాములు.. అప్పటి నుండి హత్యలకు పాల్పడుతున్నాడు. మొదట ములుగు పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళను హత్య చేశాడు. అతని చేతిలో హత్యకు గురైన వారందరు కూడా మహిళలే. మెదక్ జిల్లా తూప్రాన్, సంగారెడ్డి, నరసాపూర్, బోయినపల్లిలో ఇద్దరిని, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 11 మంది మహిళలను హత్య చేశాడు. చదవండి: కిడ్నాప్ కలకలం.. ఆడ వేషంలో వచ్చి మరీ.. నార్సింగ్ మహిళ హత్య కేసులో అతనికి జీవిత కాలం శిక్ష పడింది. అతని మానసిక స్థితి సరిగ్గా లేకపోవడంతో ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రికి పోలీసులు తరలించగా, 2011లో అక్కడ నుంచి రాములు తప్పించుకున్నాడు. ఆ తర్వాత కూడా తీరు మార్చుకోని రాములు.. ఐదు దోపిడీలకు పాల్పడ్డాడు. 2013 లో అతనిని బోయినపల్లి పోలీసులు అరెస్ట్ చేయగా, 2018 లో జైలు నుండి విడుదలయ్యాడు. జైలు నుండి విడుదలై వచ్చిన తరువాత వరుసగా రెండు హత్యలకు రాములు పాల్పడ్డాడని’’ సీపీ వెల్లడించారు. -
‘అప్పుడే ఎస్సీ, ఎస్టీలు అభివృద్ధి చెందుతారు’
సాక్షి, విజయవాడ : అంటరానితనం పోయినప్పుడే ఎస్పీ, ఎస్టీలు అభివృద్ధి చెందుతారని జాతీయ ఎస్సీ కమీషన్ మెంబర్ రాములు అన్నారు. గురువారం ఆయన కస్తూరిబాయిపేటలోని సాంఘీక సంక్షేమశాఖ బాలికల వసతి గృహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ.. ఈ హాస్టల్లో త్రాగు నీటి సమస్య, దోమల బెడద ఉందని వెంటనే పరిష్కరించాలని కోరారు. కిచెన్ సరిగాలేదని, నాణ్యమైన ఆహారం అందించడం లేదని మండిపడ్డారు. హాస్టల్లో వసతులు మంచిగా ఉంటేనే విద్యార్థులు చదవుల్లో రాణిస్తారని తెలిపారు. బడుగు, బలహీన వర్గాలకు విద్య ముఖ్యమైన ఆయుధమని, ప్రతి ఒక్కరూ చక్కగా చదువుకోవాలని సూచించారు. కార్పొరేట్ విద్యార్థులతో ప్రభుత్వ స్కూల్లో చదివే విద్యార్థులు పోటీపడి చదవాలన్నారు. ఒక్కో విద్యార్థి కి ప్రభుత్వం తరపున సంవత్సరానికి రూ. 2లక్ష ల50 వేలు ఖర్చు చేస్తుందని, దానికి తగ్గట్టుగా ఫలితాలు ఉండాలని సూచించారు. కులాల పేరుతో దూషించడం సబబు కాదన్నారు. గుంటూరులో తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవిని కులం పేరుతో దూషించడం దారుణమన్నారు. ఎమ్మెల్యేలకే రక్షణ కరవైతే, సామాన్యుల పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. రేపు గుంటూరులో పర్యటించి శ్రీదేశి విషమై వివరణ కోరుతామని తెలిపారు. -
పెద్ద జీతగాడిలా పనిచేస్తా
సాక్షి,నాగర్కర్నూల్: పార్లమెంట్ టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను భారీ మెజార్టీతో గెలిపిస్తే నియోజకవర్గ ప్రజలకు పెద్ద జీతగాడిలా పనిచేసి రుణం తీర్చుకుంటానని ఎంపీ అభ్యర్థి రాములు అన్నారు. నాగర్కర్నూల్లో ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి ఆధ్వర్యంలో పట్టణ ప్రధాన రహదారిపై పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు.హౌసింగ్ బోర్డు నుంచి బస్టాండ్ కూడలి వరకు బైక్ ర్యాలీ తీసిన అనంతరం అక్కడే కార్యకర్తలు, ప్రజలనుద్దేశించి మాట్లాడారు. రెండు రోజులు కార్యకర్తలు పనిచేస్తే ఐదేళ్లు కందనూలు అభివృద్ధికి శాయశక్తులా కృషిచేస్తానన్నారు. ఎంపీ నిధుల్లో సింహభాగం నాగర్కర్నూల్ నియోజకవర్గానికే కేటాయిస్తామని, గెలిచిన తర్వాత నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని సందర్శిస్తానన్నారు. 1996 నుంచి అచ్చంపేట ప్రజలకు సేవ చేస్తున్నానన్నారు. ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా తనను ఎంపిక చేసినందుకు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నేలపై జీవించిన నేను.. ఈ నేల ప్రజలకే సేవ చేసి తనువు చాలిస్తానన్నారు. 16 ఎంపీ సీట్లు గెలిచి సీఎంకు బహుమతిగా ఇస్తే కేంద్రం నుంచి రాష్ట్రానికి అభివృద్ధి కోసం అత్యధిక నిధులు తెచ్చుకునే అవకాశం ఉందన్నారు. ఎమ్మెల్యే మర్రిజనార్దన్రెడ్డి మాట్లాడుతూ నాగర్కర్నూల్కు సంబంధించిన రైతులు గతంలో హైదరాబాద్లో అడ్డా కూలీలుగా ఉన్నారని, కేఎల్ఐ నీటి రాకతో తిరిగి కొన్ని ప్రాంతాలకు చేరుకుని వ్యవసాయం చేస్తున్నారన్నారు. తెలంగాణ ప్రాంతాన్ని కేసీఆర్ సస్యశ్యామలం చేసినందుకే రెండోసారి సీఎం అయ్యారన్నారు. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే కేసీఆర్ ప్రధాని అవుతారన్నారు. ఎమ్మెల్సీ దామోదర్రెడ్డి మాట్లాడుతూ గతంలో నాగర్కర్నూల్ నుంచి పోటీ చేసిన అభ్యర్థులంతా వలస వచ్చిన వారేనని, ప్రస్తుతం స్థానికుడికి సీఎం కేసీఆర్ అవకాశం ఇచ్చారని, అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే ప్రజా సమస్యలు తీర్చే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్యాదవ్, రఘునందన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రాముడు కాదు.. రాక్షసుడు
షాద్నగర్రూరల్: ఒక్కరు కాదు... ఇద్దరు కాదు ఏకంగా ఐదు మందిని హతమార్చాడు.. బంధాల ను, బంధుత్వాలను పక్కన పెట్టి కిరాతకంగా వ్యవహరించాడు.. చిన్న చిన్న సంఘటన మనస్సులో పెట్టుకుని రాములు మానవ మృగంలా మారాడు. కన్న తండ్రిని, కట్టుకున్న భార్యలను, ప్రియురాలిని కర్కషంగా హతమార్చాడు. తాజాగా ప్రియురాలిని దారుణంగా హత్య చేసి మళ్లీ పోలీసులకు చిక్కాడు. కిరాతకుడి అరెస్టుకు సంబంధించిన వివరాలను శుక్రవారం సా యంత్రం షాద్నగర్ ఏసీపీ సురేందర్ వెల్లడించారు. కోరిక తీర్చలేదని ప్రియురాలి హత్య.... ఫరూఖ్నగర్ మండలం మహల్ ఎలికట్ట గ్రామా నికి చెందిన రాములు కొంత కాలంగా అదే గ్రామానికి చెందిన జంగం మంగమ్మతో పరిచయం ఏర్పడింది. దీంతో తన కోరిక తీర్చాలని రాములు మం గమ్మను వేధించాడు. అందుకు ఆమె నిరాకరిం చింది. అయితే తన కోరిక తీర్చలేదని ఎలాగైనా ఆ మెను అంతమొందించాలని రాములు కుట్రపన్నా డు. ఈ నేపథ్యంలో ఈనెల 26న సాయంత్రం జం గం మంగమ్మ కూలీ పనులు చేసి ఒంటరిగా ఇం టికి వెలుతున్న సమయంలో మహల్ ఎలికట్ట గ్రా మ శివారులో రాములు ఆమె ఒంటిపై కిరోసిన్ పో సి నిప్పటించాడు. ఈ విషయాన్ని గమనించిన సా ్థనికులు 108 సహాయంతో మంగమ్మను చికిత్స ని మిత్తం షాద్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స ని మిత్తం ఆమెను ఉస్మాని యా ఆసుపత్రికి తరలించ గా చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి మృతి చెందింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి రాములును శుక్రవారం అరెస్టు చేసి రిమాం డ్కు తరలించినట్లు ఏసీపీ సురేందర్ తెలిపారు. ఇప్పటికే నలుగురి హత్య... రాములుకు 24ఏళ్ళ కిందట మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండలం రంగారెడ్డిగూడ గ్రామానికి చెందిన పార్వతమ్మతో మొదటి వివాహమయింది. కొంత కాలం రాములు పార్వతమ్మల కాపురం సజావుగా సాగింది. ఆతర్వాత వారిద్దరి మధ్య గొడవలు చోటు చేసుకోవడంతో రాములు మొదటి భార్య పార్వతమ్మ ఒంటి పై కిరోసిన్ పోసి హత్య చేశాడు. తర్వాత కొందుర్గుకు చెందిన స్వప్నతో రెండో వివాహం చేసుకున్నాడు. ఆమెపై అనుమానం పెంచుకుని తండ్రి జంగం అలియాస్ పులాయిల అడివయ్యతో పాటుగా భార్య స్వప్నలను గొడ్డలితో నరికి హత్య చేశాడు. ఈ కేసులో రాములు జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత కిషన్నగర్ గ్రామానికి చెందిన మంజులను మూడో వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. రాములు నేర చరిత్ర తెలుసుకున్న మంజుల బంధువులు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ఎలికట్ట గ్రామంలో ఉన్న 20గుంటల పొలాన్ని మంజుల పేరిట రిజిస్ట్రేషన్ చేసి ఆమెను వివాహమాడాడు. ఈ నేపథ్యంలో మూడో భార్య మంజులను మభ్యపెట్టి ఆమె పేరు న ఉన్న భూమిని విక్రయించాడు. ఈ విషయంలో మూడో భార్య మంజుల కుటుంబ సభ్యులకు, రాములుకు మధ్య గొడవలు జరిగాయి. దీంతో కొంత కాలం పాటు మంజుల తన పుట్టింటికి వెళ్లింది. దీంతో భూ విక్రయ డబ్బులు ఇస్తానని మంజు ల కుటుంబ సభ్యులను ఒప్పించి భార్యను కాపురానికి తెచ్చుకున్నాడు. ఈ నేపథ్యం 2016లో డిసెంబర్లో మూడో భార్య మంజుల తండ్రి పోచయ్య మహల్ ఎలికట్ట గ్రామానికి వచ్చాడు. అప్పటికే మామ పోచయ్య పై పగపెంచుకున్న రాములు అతడిని మద్యం సేవించేందుకు మహల్ ఎలికట్ట గ్రామ శివారులోకి తీసుకెళ్లి బండరాళ్లతో దారుణంగా హతమార్చాడు. కన్న తండ్రిని, కట్టుకున్న వాడే అతికిరాతకంగా హతమార్చాడని తెలియడంతో మూడో భార్య మంజుల రాములును వదిలిపెట్టి పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో ఒంటిరిగా ఉన్న రాములు తాజాగా అదే గ్రామానికి చెందిన మంగమ్మ లోబర్చుకునేందుకు ఆమె వెంట పడ్డాడు. అందుకు ఆమె నిరాకరించడంతో ఆమెపై కోపం పెంచుకున్న రాములు మంగమ్మను హతమర్చాడు. ఇప్పటికే ఐదు హత్యలు చేసిన రాములు నరహంతకుడిగా మారాడు. జైలుకు వెళ్లినా మారని తీరు... నాలుగు హత్యలు చేసిన రాములు అన్ని కేసుల్లో జైలు శిక్షలు అనుభవించాడు. అయినా రాములు వ్యవహార శైలి మార్చకోలేదు. కన్న తండ్రిని, కట్టుకున్న భార్యను హతమార్చిన కేసులను కోర్టులో కొట్టేసినట్లు, 2016లో మామను హత్య చేసిన కేసు మహబూబ్నగర్ కోర్టులో నడుస్తున్నట్లు ఏసీపీ సురేందర్ తెలిపారు. ఐదు హత్యలకు పాల్పడిన రాములుపై పీడీ యాక్టు నమోదు చేయనున్నట్లు ఏసీపీ తెలిపారు. -
బుచ్చిరాములుకు కన్నీటి వీడ్కోలు
సూర్యాపేట: సీపీఎం సీనియర్ నేత వర్ధెల్లి బుచ్చిరాములుకు పార్టీ నేతలు, కుటుంబ సభ్యులు, బంధువులు మంగళవారం కన్నీటి వీడ్కోలు పలికారు. సూర్యాపేటలోని హిందూ శ్మశానవాటికలో అంతిమ సంస్కారాలనుఆయన తనయుడు, సాక్షి ఎడిటర్ వర్ధెల్లి మురళి నిర్వహించారు. అంతకుముందు సీపీఎం కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు, మాజీ ఎమ్మెల్యేలు నంద్యాల నర్సింహారెడ్డి, జూలకంటి రంగారెడ్డి, రాష్ట నేతలు ఎల్.రమణ, బి.వెంకట్ తదితరులు ఆయన పార్థివదేహంపై పార్టీ జెండా కప్పి శ్రద్ధాంజలి ఘటించారు. సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం, సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తి, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి, తెలంగాణ ఇంటిపార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్తో పాటు పలువురు నివాళులర్పించారు. తన జీవితాన్ని పేద ప్రజల కోసం ధారపోసి కమ్యూనిస్టు యోధుడిగా మిగిలారని.. నమ్మిన సిద్ధాం తం కోసం ఏనాడూ రాజీపడని వ్యక్తి బుచ్చిరాములు అని వారు కొనియాడారు. -
నేలకొరిగిన.. ఎర్రజెండా ముద్దుబిడ్డ
సూర్యాపేట: సీపీఎం సీనియర్ నాయకుడు, ఆ పార్టీ మాజీ రాష్ట్ర కమిటీ సభ్యుడు వర్ధెల్లి బుచ్చిరాములు (83) సోమవారం రాత్రి కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు నెలరోజుల కిందట నల్లగొండలోని నవ్య మల్టీస్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్సకోసం చేర్పించారు. గత ఏడాది డిసెంబర్ 23న ఆయన బ్రెయిన్ స్ట్రోక్తో కోమాలోకి వెళ్లారు. అదే నెల 18న ఆయన భార్య వర్ధెల్లి లక్ష్మమ్మ మృతి చెందారు. ఆమె మృతి చెందిన ఆరురోజులకే ఆయన అనారోగ్యానికి గురయ్యారు. ఆ సమయంలో ఆయనకు హైదరాబాద్లోని యశోద ఆస్పత్రిలో పది రోజులపాటు చికిత్స అందించారు. అనంతరం అక్కడి నుంచి నల్లగొండలోని నవ్య ఆస్పత్రికి తరలించారు. నెల రోజులుగా ఆయన ఐసీయూలోనే ఉన్నారు. పరిస్థితి విషమించడంతో సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. బుచ్చిరాములుకు కుమారుడు, సాక్షి దినపత్రిక సంపాదకులు వర్ధెల్లి మురళి, కుమార్తె పద్మలీల ఉన్నారు. మంగళవారం బుచ్చిరాములు అంత్యక్రియలను సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. కమ్యూనిస్టు పార్టీ నిర్మాణంలో.. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు భీంరెడ్డి నర్సింహారెడ్డి స్ఫూర్తితో బుచ్చిరాములు కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తగా చురుకైన పాత్ర పోషించారు. అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్ర కమిటీ సభ్యుడయ్యారు. 1975 నుంచి 1989 వరకు సూర్యాపేట తాలుకా కార్యదర్శిగా.. అనంతరం సూర్యాపేట, తుంగతుర్తి రెండు తాలూకాల కార్యదర్శిగా 1996 వరకు సుదీర్ఘకాలం పనిచేశారు. 1994లో తుంగతుర్తి అసెంబ్లీ స్థానం నుంచి సీపీఎం అభ్యర్థిగా పోటీ చేసి కేవలం వెయ్యి ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. తెలంగాణ సా«యుధ పోరాటంలో పాల్గొన్న యోధులకు కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న పింఛన్కు దరఖాస్తు చేసుకునేందుకు నిరాకరించిన యోధుడు బుచ్చిరాములు. పార్టీ కూడా పింఛన్కు దరఖాస్తు చేసుకోవాలని కోరినప్పటికీ తనకు వద్దని తిరస్కరించారు. జగన్ సంతాపం సీపీఎం సీనియర్ నేత వర్ధెల్లి బుచ్చిరాములు మృతిపట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు, ఆయన కుమారుడు, సాక్షి ఎడిటర్ వర్ధెల్లి మురళికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
కాంగ్రెస్ నుంచి కొమిరెడ్డి సస్పెన్షన్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు సస్పెన్షన్కు గురయ్యారు. ఆయ న్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ ఎం.కోదండరెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాములు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆధారాలతో ఆయనకు గత నెల 18న షోకాజ్ నోటీసు జారీ చేసి వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరామని, అయినా ఆయన స్పందించకపోవడంతో పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని నిర్ణయించినట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా, రాములు సస్పెన్షన్కు అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన ఘటన కారణమని తెలుస్తోంది. -
‘దళితులకు నాయ్యం చేసేందుకే ఢిల్లీ నుంచి వచ్చా’
సాక్షి, నెల్లూరు : దళితులకు నాయ్యం చేసేందుకే తాను ఢిల్లీ నుంచి వచ్చానని జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు కే రాములు అన్నారు. శుక్రవారం నెల్లూరు జిల్లా రాపూరు దళితవాడలో ఆయన బహిరంగ విచారణ చేపట్టారు. బాధిత కుటుంబాల ఇళ్ళకు వెళ్లి పరామర్శించారు. వారు ఆయన వద్ద తమ గోడును వెల్లబోసుకున్నారు. బాధిత కుటుంబాలు ఆయన ఎదుట కన్నీరు మున్నీరుగా విలపించాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళితవాడలో సుమారు 300 కుటుంబాలుంటే 100 మంది కూడా హాజరు కాలేదంటే పోలీసులు ఎంతగా భయబ్రాంతులకు గురి చేశారో అర్థమవుతోందని అన్నారు. సమావేశానికి కలెక్టర్, ఎస్పీలు రాకపోవటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జరిగిన ఘటనపై రాష్ట్రపతికి నివేదికను అందజేస్తామని తెలిపారు. -
తుపాకీతో కాల్చుకుని సీఆర్పీఎఫ్ మాజీ ఉద్యోగి ఆత్మహత్య
హైదరాబాద్: అనారోగ్యం, మానసిక ఒత్తిడి భరించలేక సీఆర్పీఎఫ్ మాజీ ఉద్యోగి తన లైసెన్స్డ్ గన్తో కాల్చు కుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని ప్రగతినగర్లో గురువారం చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా పరిగికి చెందిన మాదగోని రాములు(60), చంద్రకళ దంపతులు. వీరు 15 ఏళ్ల క్రితం జవహర్నగర్లోని ప్రగతినగర్లో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. రాములు సీఆర్పీఎఫ్లో హెడ్కానిస్టేబుల్గా విధులు నిర్వహించి 6 ఏళ్ల క్రితం పదవీ విరమణ పొందాడు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు ఆర్మీలో జవానుగా విధులు నిర్వహిస్తుండగా చిన్న కుమారుడు, కుమార్తె ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. నగరంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చంద్రకళ సహాయకురాలిగా పనిచేస్తున్నారు. గురువారం ఉదయం చంద్రకళ తన మనవడికి జ్వరం రావడంతో చూసి వద్దామని అదే కాలనీ సమీపంలో ఉన్న పెద్ద కుమారుడి ఇంటికి వెళ్లింది. కొన్ని రోజులుగా అనారోగ్యంగా ఉండటంతో రాములు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఇంట్లో ఎవరులేని సమయంలో తన లైసెన్స్ తుపాకీతో తలపై కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంటి పక్కన ఉన్న వారికి శబ్ధం రావడంతో వచ్చి చూసేసరికి రాములు రక్తపుమడుగులో పడి ఉన్నాడు. ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీంతో పరిసర ప్రాంతాలను గాలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఎస్సీలంటే అంత చులకనా?
పాతపోస్టాఫీసు (విశాఖ దక్షిణం): ఎస్సీల బాధల పట్ల రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదు.. వీరికి ఎటువంటి ప్రాధాన్యం ఇవ్వడం లేదు.. నేను వస్తున్నానని చెప్పినా జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ రాకపోవడంలోనే పరిస్థితి అర్థం అవుతోంది.. అంటూ జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు కె.రాములు ధ్వజమెత్తారు. పద్మజా ఆసుపత్రిలో తనను మోసం చేసి గర్భంలో రెండు పిండాల్ని ప్రవేశపెట్టారంటూ నేతల నాగలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కేజీహెచ్లో చికిత్స పొందుతున్న ఆమెను రాములు శుక్రవారం పరామర్శించారు. దీనికి ముందు ఆసుపత్రి సూపరింటెండెంట్ కార్యాలయంలో మహిళా సంఘాలు, ప్రజా సంఘాల నుంచి వివరాలు సేకరించి, బాధితురాలి ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు. అనంతరం బాధితురాల్ని పరామర్శించి విలేకరులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద, దళిత మహిళను మోసం చేయడం అన్యాయమన్నారు. ఇప్పటికే ముగ్గురు బిడ్డలకు తల్లి అయిన బాధితురాలు నాగలక్ష్మి తిరిగి ఎలా గర్భం ధరించేందుకు ఒప్పుకుంటుందని ప్రశ్నించారు. ఉష అనే అమ్మాయి వీరి ఆర్థిక పరిస్థితిని ఆసరాగా చేసుకుని పద్మశ్రీ ఆసుపత్రి ఎండీ పద్మశ్రీతో కుమ్మక్కై నాగలక్ష్మిని మోసం చేశారనన్నారు. నాగలక్ష్మికి ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే ఆమె గర్భంలో రెండు పిండాల్ని ప్రవేశపెట్టడం అన్యాయమన్నారు. ఇటువంటి ద్రోహానికి పాల్పడిన వైద్యురాలు పద్మశ్రీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేస్తామన్నారు. బాధితురాలకి ప్రభుత్వం నష్టపరిహారంగా రూ.8 లక్షలు, ఇంట్లో ఒకరికి ఉద్యోగం, ప్రభుత్వ గృహం మంజూరు చేయడంతోపాటు ఆమె సంతానం అయిన ముగ్గురికి సాంఘిక శాఖ ద్వారా ఉచిత విద్య అందించాలని డిమాండ్ చేశారు. ఐదుగురు సభ్యులతో కూడిన విచారణ కమిటీ వేయాలని, 24 గంటల్లో పూర్తి స్థాయి సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు. ఐదుగురు సభ్యులతో విచారణ కమిటీ ఏర్పాటు జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు రాములు ఆదేశానికి స్పందించిన కేజీహెచ్ సూపరింటెండెంట్ ఐదుగురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.వి.సుధాకర్, కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ జి.అర్జున, జిల్లా వైద్య,ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఆర్.రమేష్, కృష్ణా ఆసుపత్రి ప్రసూతి వైద్య నిపుణులు డాక్టర్ జి.ఎ.రామరాజు, ప్రభుత్వ విక్టోరియా (ఘోషా) ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ డి.హేమలతాదేవి కమిటీలో సభ్యులుగా ఉంటారు. నా అనుమతి లేకుండా పిండాల్ని ప్రవేశపెట్టారు భర్తగా నా అనుమతి లేకుండా నా భార్య నాగలక్ష్మి గర్భంలో ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ పద్మశ్రీ రెండు పిండాలను ప్రవేశపెట్టారు. ఎటువంటి అనుమతులు లేకుండా ఇలా చేయడం అన్యాయం. ఇటీవల కుటుంబంలో వచ్చిన కలహాల వల్ల నేను నా స్వంత ఊరు రాజాం వెళ్లి ఉంటున్నాను తప్ప నా భార్యను వదిలేయలేదు. మా ఆర్థిక స్థితి బాగులేకపోవడంతో నా భార్యను మోసం చేసి ఇలా చేసారు. ఇప్పటికే ముగ్గురు పిల్లలు ఉన్న నా కుటుంబం తిరిగి మరొ ఇద్దరిని (తండ్రి ఎవరో తెలియని) ఎలా పెంచగలను. నా కుటుంబానికి తగిన న్యాయం చేయాలి.-నేతల ఆదినారాయణ, బాధితురాలు నాగలక్ష్మి భర్త -
అకాల మరణాలతో ఆగినపెళ్లిళ్లు..!
సాక్షి, ఉప్పునుంతల (అచ్చంపేట): అప్పటి వరకు పెళ్లి సందడితో సంతోషంగా ఉన్న ఆ కుటుంబంలో పెనువిషాదం చోటుచేసుకుంది. తండ్రి అకాల మృతితో పెళ్లి పీఠల వరకు వచ్చిన పెళ్లి నిలిచిపోయింది. ఈ విషాదకర సంఘటన గురువారం రాత్రి మండలంలోని కాంసానిపల్లిలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన నాచర్ల నిరంజన్(50), రేణమ్మ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్దకూతురికి గతంలోనే వివాహం కాగా.. రెండో కూతురు అఖిల వివాహం ఆదివారం వంగూరు మండలం మిట్టసదగోడు గ్రామానికి చెందిన శంకర్తో నిశ్చయమైంది. ఈ క్రమంలో పెళ్లి పందిరి వేసి నిరంజన్ ఇంట్లో గురువారం సత్యనారాయణ వ్రతం నిర్వహించి అఖిలను పెళ్లి కూతుర్ని చేశారు. శుక్రవారం అమ్మాయి ఇంట్లో ప్రతానం కార్యక్రమం నిర్వహించాల్సి ఉండగా గురువారం రాత్రి అందరూ పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యారు. మరో రెండు గంటల్లో పెళ్లి కుమారునికి సంబంధించిన బంధువులు కాంసానిపల్లి రావాల్సి ఉంది. రాత్రి పదిగంటల సమయంలో నిరంజన్ భోజనం చేస్తుడంగా ఛాతిలో నొప్పి వస్తుందని కుప్పకూలి కొద్దిసేపటికే మృతిచెందాడు. దీంతో సంతోషంగా ఉన్న ఆ కుటుంబంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. తండ్రి మృతితో కూతురు పెళ్లి ఆగిపోవడం బంధువులను, గ్రామస్తులను తీవ్రంగా కలచివేసింది. వడదెబ్బతో కౌలురైతు... పాన్గల్ (వనపర్తి): పొలం పనులు చేస్తున్న ఓ కౌలురైతు వడదెబ్బకు గురై మృతిచెందాడు. ఈ సంఘటన శుక్రవారం పాన్గల్లో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన సంగనమోని రాములు(58) భార్య బాలమ్మతో కలిసి శుక్రవారం కౌలుకు తీసుకున్న పొలంలో చెత్తను, కంప చెట్లను తొలగించే పనులు చేస్తున్నారు. ఈ తీవ్రమైన ఎండకు వడదెబ్బకు గురై పొలంలోనే సొమ్మసిల్లి పడిపోయి మృతిచెందాడు. గత రెండు రోజులుగా వ్యవసాయ పనులు చేస్తుండటంతో వడదెబ్బకు గురై మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. రాములుకు భార్యతోపాటు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. ఇంటి యజమాని అకాల మరణంతో కటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కాగా రాములు మృతితో శనివారం జరగాల్సిన సోదరుని కుమారుని వివాహం నిలిచిపోయింది. వడదెబ్బతో మృతిచెందిన రాములు కుటుంబాన్ని తహసీల్దార్ అలెగ్జాండర్, ఆర్ఐ బాల్రాంనాయక్, సర్పంచ్ సురేఖ, మత్స్యకార్మిక సంఘం అధ్యక్షుడు ఆనందం, సింగోటం, నర్సింహ, వార్డుసభ్యులు భాస్కర్రెడ్డి పరామర్శించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ప్రభుత్వ పరంగా బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని మత్స్యకార్మిక సంఘం నాయకులు కోరారు. -
నా సమావేశానికే రారా?
సిద్దిపేటటౌన్/రాయపోలు(దుబ్బాక) : కేంద్ర కేబినెట్ స్థాయి కలిగిన తాను దళితుల సమస్యలపై సమీక్షించడానికి వస్తే జిల్లా ఉన్నతాధికారులు రాకపోవడంపై జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు కె.రాములు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీరు నా సమావేశానికే రాకపోతే, సామాన్యులకేం న్యాయం చేస్తారు’అని ప్రశ్నించారు. రాములు శనివారం సిద్దిపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. జిల్లా కేంద్రం సిద్దిపేటలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనం లో దళిత సంఘాలు, నాయకులతో సమావేశమయ్యారు. వారి సమస్యలపై చర్చించడానికి ఒక్కో విభాగం అధికారి వచ్చారా? లేదా? అని ఆరా తీశారు. 34 శాఖలకు ఇద్దరే అధికారులు వచ్చారని తేలడంతో సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. వచ్చే నెల రెండో వారంలో మళ్లీ వస్తానని చెప్పారు. శనివారం సమావేశానికి రాని అధికారులందరికీ ఢిల్లీ వెళ్లాక నోటీసులు పంపిస్తానని స్పష్టం చేశారు. -
రాములు పుస్తకాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి
సాక్షి, హైదరాబాద్: బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు రచించిన ‘బతుకుపోరు, విలువలు’పుస్తకాన్ని బుధవారం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆవిష్కరించారు. 90కిపైగా పుస్తకాలు రాసి బహుగ్రంథ కర్తగా పేరొందారు. తత్వశాస్త్రంతోపాటు తెలంగాణ వాస్తవ జీవన చిత్రంపై కథలు, నవలలు, కథానికలు, సాహిత్య విమర్శ, బీసీ సామాజిక వర్గాలపై రచనలు చేశారు. కార్యక్రమంలో కమిషన్ సభ్యులు కృష్ణమోహన్, ఆంజనేయగౌడ్, గౌరీశంకర్ పాల్గొన్నారు. -
యాదవ భవనాన్ని పదెకరాల్లో నిర్మించాలి
హైదరాబాద్: యాదవులకు ఇచ్చిన హామీకి కట్టుబడి పదెకరాల స్థలంలో రూ. 10 కోట్లతో యాదవ భవనాన్ని నిర్మించాలని యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మేకల రాములు యాదవ్ డిమాండ్ చేశారు. లేకుంటే ఈ నెల 29న కోకాపేటలో గొల్ల, కురుమ సంక్షేమ భవనానికి సీఎం చేయనున్న శంకుస్థాపన కార్యక్రమాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ మూడేళ్ల క్రితం సీఎం కేసీఆర్.. మంత్రి తలసాని సమక్షంలో పదెకరాల స్థలంలో రూ. 10 కోట్లతో యాదవ సంక్షేమ భవన్ నిర్మిస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ప్రస్తుతం ఆ హామీని మరచి ఐదెకరాల్లో యాదవులకు, మరో ఐదెకరాల్లో కురుమలకు భవనం నిర్మించేందుకు సమాయత్తం అవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో యాదవులు 20 శాతం ఉంటే కురుమలు 4 శాతమే ఉన్నారన్నారు. భవనంలో సగం వాటా ఇస్తే, మున్ముందు రాజకీయ రిజర్వేషన్లలోనూ కురుమలు సగం వాటా అడిగే అవకాశం ఉందన్నారు. దీంతో యాదవులు తీవ్రంగా నష్టపోతారని తెలిపారు. జాతికోసం పోరాడుతున్న మంద కృష్ణ మాదిగను అరెస్టు చేయడం అప్రజాస్వామికమన్నారు. విలేకరుల సమావేశంలో సమితి నాయకులు సత్యనారాయణ యాదవ్, కత్తెర రాజు తదితరులు పాల్గొన్నారు. -
‘విహారం దీర్ఘకావ్యం’ పుస్తకావిష్కరణ
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు రచించిన ‘విహారం దీర్ఘకావ్యం’ పుస్తకాన్ని సోమవారం ఢిల్లీలో ఆవిష్కరించారు. అమ్మ గురించి, ప్రకృతి గురించి, ఉద్యమ స్ఫూర్తిని వర్ణిస్తూ బీఎస్ రాములు రచించిన వందవ కవితాసంపుటిని తెలంగాణ భవన్ అసిస్టెంట్ రెసిడెంట్ కమిషనర్ రామ్మోహన్రావు ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఏపీ భవన్ పరిపాలనాధికారి కె.లింగరాజు పాల్గొన్నారు. -
కొనసాగుతున్న టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు
-
తెలంగాణ మొక్కులపై హైకోర్టులో పిల్
అవి కేసీఆర్ వ్యక్తిగత మొక్కులు: హైకోర్టుకు కంచ ఐలయ్య, రాములు నివేదన సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఇటీవల పలు దేవస్థానాల్లో బంగారు ఆభరణాలను సమర్పించి మొక్కులు చెల్లించుకోవడంపై ఉమ్మడి హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఆ మొక్కులు కేసీఆర్ వ్యక్తిగత మని, కానీ దేవాలయాల కామన్గుడ్ ఫండ్ (సీజీఎఫ్) నుంచి కోట్ల రూపాయలు వెచ్చించి చెల్లించడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ రిటైర్డ్ ప్రొఫెసర్ కంచ ఐలయ్య, సామాజిక కార్యకర్త గుండమాల రాములు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. అందులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్లను ప్రతివాదులుగా పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించాలంటూ ఉద్యమ సమయంలో కేసీఆర్ పలు మొక్కులు మొక్కుకున్నారు. అవి తీర్చడంలో భాగంగా కేసీఆర్ ఇటీవల వరంగల్ భద్రకాళి అమ్మవారికి బంగారు కిరీటం, తిరుచానూరు అమ్మవారికి ముక్కు పుడక, కురవి వీరభద్రస్వామికి బంగారు మీసాలు, తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి బంగారు సాలగ్రామ హారం, ఐదు పేటల కంటె సమర్పించిన విషయం తెలిసిందే. ఈ మొక్కులన్నీ కేసీఆర్ వ్యక్తిగతమైనవని.. వాటికి రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలతో ఎటువంటి సంబంధమూ లేదని పిటిషనర్లు హైకోర్టుకు విన్నవించారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని ప్రభుత్వ జీవోలను కొట్టివేయాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ కార్యదర్శి, దేవాదాయ శాఖ కార్యదర్శి, కమిషనర్లపై చర్యలు చేపట్టాలని, మొక్కుల నిమిత్తం వెచ్చించిన డబ్బును వారి నుంచి రికవరీ చేయాలని కోరారు. -
రాముడు కాదు రాక్షసుడు
మామను హతమార్చిన అల్లుడు ఇప్పటికే నలుగురిని చంపిన కిరాతకుడు షాద్నగర్ క్రైం: చిన్న విషయాన్నే మనసులో పెట్టుకుని పిల్లనిచ్చిన మామను దారుణంగా హతమార్చిన సంఘటన బుధవారం ఫరూఖ్నగర్ మండలం ఎలికట్ట గ్రామంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. ఎలికట్ట గ్రామానికి చెందిన రాములుకు 20 ఏళ్ల క్రితం బాలానగర్ మండలం రంగారెడ్డి గూడ గ్రామానికి చెందిన పార్వతమ్మతో వివాహం జరిగింది. కొంతకాలం భార్యతో సఖ్యతగానే ఉన్న రాములు ఓ రాత్రి ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించి హత్య చేశాడు. ఆ తర్వాత రెండే ళ్లకు కొందుర్గుకు చెందిన స్వప్నను పెళ్లి చేసుకున్న అతను కొద్ది రోజులకే అతను భార్యపై అనుమానం పెంచుకుని భార్య స్వప్నతో పాటు తన తండ్రి పులాయిల అడివయ్యను గొడ్డలితో నరికి హత్య చేశాడు. ఈ కేసులో జైలుకు వెళ్లి వచ్చిన రాములు మూడో వివాహం చేసుకునేందుకు సిద్దమయ్యాడు. కిషన్నగర్ గ్రామానికి చెందిన మంజులను పెళ్లి చేసుకోవాలని ప్రదిపాదన పంపాడు. అయితే రాములు నేర చరిత్ర తెలుసుకున్న మంజుల బంధువులు పెళ్లికి అంగీకరించకపోవడంతో గ్రామంలో తన వాటాకు వచ్చిన 20 గుంటల పొలాన్ని మంజుల పేరుపై రిజిష్టర్ చేసి వివాహం చేసుకున్నాడు. కొన్నేళ్ల పాటు వారి కాపురం సజావుగానే సాగింది. అయితే భార్యను మభ్యపెట్టి ఆమె పేరున ఉన్న భూమిని విక్రయించాడు. ఈ విషయంలో మంజుల కుటుంబ సభ్యులు, రాములు మధ్య గొడవ జరగడంతో ఆరు నెలల క్రితం మంజుల తన పుట్టింటికి వెళ్లింది. ఈ నేపథ్యంలో సోమవారం మంజుల బంధువులు రాములుకు నచ్చజెప్పే ప్రయత్నం చేయగా, మాటా మాటా పెరగడంతో గొడవ జరిగింది. దీంతో మంజుల తండ్రి పోచయ్యపై కోపం పెంచుకున్న రాములు అతడిని హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. సోమవారం రాత్రి మద్యం తాగేందుకు పోచయ్య(55)ను వెంటతీసుకెళ్లి గ్రామ శివార్లతో బండరాయితో మోది హతమార్చాడు. గ్రామ శివారులో ఓ వ్యక్తి మృతదేహం ఉన్నట్లు సమాచారం అందడంతో అక్కడికి వెళ్లి పరిశీలించిన కుటుంబ సభ్యులు హతుడు పోచయ్యగా గుర్తించారు. ఏసీపీ శ్రీనివాస్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. మృతుని భార్య పోచమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భార్య మృతదేహంతో 60 కి.మీ.!
-
భార్య మృతదేహంతో 60 కి.మీ.!
- కాలినడకన ప్రయాణించిన ఓ భర్త - సొంతూరు వెళ్లేందుకు డబ్బుల్లేకపోవడంతో శవాన్ని చక్రాల బండిపై వేసుకుని ప్రయాణం అనంతగిరి/మనూరు: జీవిత సహచరి కన్నుమూసిందన్న బాధను గుండెల్లో నింపుకొని ఆమె శవంతో దాదాపు 60 కి.మీ. నడిచాడు ఓ భర్త! సొంతూరు వెళ్లేందుకు డబ్బులు లేకపోవడంతో చక్రాల బండిపై మృతదేహాన్ని ఉంచి తోసుకుంటూ వెళ్లాడు. మార్గం మధ్యలో కొందరు ఆపన్నహస్తం అందించడంతో చివరకు అంబులెన్స్లో సొంతూరికి చేరుకున్నాడు. అందరి హృదయాలను ద్రవింపజేసిన ఈ ఘటన శనివారం వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. బీదర్ నుంచి వచ్చి.. సంగారెడ్డి జిల్లా మనూరు మండలం మారుుకోడ్కు చెందిన రాములు(53), కవిత(45) దంపతులు. ఇద్దరూ కుష్టువ్యాధితో బాధపడుతున్నారు. ఊరి వదిలి బతుకుతెరువు కోసం వీరు వేరే ప్రాంతాలకు వెళ్లారు. కొంత కాలంగా కర్ణాటకలోని బీదర్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో భిక్షాటన చేస్తూ జీవనం సాగించారు. హైదరాబాద్లోని మౌలాలి ప్రాంతంలో అమెరికాకు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినెలా యాచకులకు నాలుగైదు కిలోల బియ్యం ఇస్తుందని తెలుసుకున్న ఈ దంపతులు... శుక్రవారం రాత్రి బీదర్ నుంచి షిర్డీ ఇంటర్సిటీ రైల్లో వచ్చి లింగంపల్లి స్టేషన్ లో దిగారు. ఉదయం చాయ్ తాగి మౌలాలికి వెళ్లేందుకు రాములు సిద్ధమయ్యాడు. అంతలోనే భార్య కవిత అస్వస్థతకు గురై ప్రాణాలు విడిచింది. కళ్లముందే భార్య చనిపోవడంతో రాములు కన్నీరుమున్నీరయ్యాడు. శవాన్ని తీసుకువెళ్లేందుకు చేతిలో చిల్లిగవ్వ లేదు. అయినా భార్యకు సొంతూరిలో అంత్యక్రియాలు చేయాలని రాములు భావించాడు. ఓ యాచకుడి వద్ద చక్రాలతో కూడిన ఓ తోపుడు బండి తీసుకున్నాడు. దానిపై భార్య మృతదేహాన్ని ఉంచి మారుుకోడ్కు బయల్దేరాడు. హైదరాబాద్ నుంచి కాలినడకన దాదాపు 60 కి.మీ. ప్రయాణించి వికారాబాద్కు చేరుకున్నాడు. అక్కడికి రాగానే కొందరు రాములు దీనస్థితిని తెలుసుకొని స్పందించారు. సమాచారం అందుకున్న సీఐ రవి అక్కడికి చేరుకున్నారు. అంగీకరిస్తే మృతదేహాన్ని ఇక్కడే ఖననం చేసే ఏర్పాటు చేస్తానని చెప్పగా అందుకు రాములు ఒప్పుకోలేదు. సొంతూరిలో అంత్యక్రియలు చేస్తానని దీనంగా చెప్పాడు. దీంతో అక్కడున్న కొందరు తోచిన సాయం చేశారు. సీఐ రవి.. స్వామివివేకానంద సేవా సమితి అంబులెన్ ్స ద్వారా రాములును సొంతూరికి పంపారు. సాయంత్రం 7 గంటలకు ఆయన స్వగ్రామానికి చేరుకున్నాడు. సొంతూరిలో రాములుకు ఇల్లు కూడా లేదు. వీరు ముగ్గురు అన్నదమ్ములు. పెద్దన్న మరణించాడు. ఇంకో అన్న ఇంటి వద్దే పొలం చూస్తూ జీవనం సాగిస్తున్నాడు. -
రామాయంపేటలో వ్యక్తి హత్య
రామాయంపేట మండల శివారులో ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. మృతుడు నార్సింగి గ్రామానికి చెందిన గంగారపు రాములు(35)గా గుర్తించారు. గుర్తుతెలియని దుండగులు రాములు గొంతు కోసి దారుణంగా హతమార్చారు. ఈ సంఘటన రాత్రి జరిగి ఉండవచ్చు. స్థానికులు గురువారం ఉదయం గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అక్కమ్మ చెరువులో వ్యక్తి గల్లంతు
మెదక్ జిల్లా జిన్నారం మండలం అక్కమ్మ చెరువులో పడి బుధవారం ఉదయం ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. స్థానికంగా నివాసముంటున్న చాకలి రాములు(39) చెరువు సమీపంలో బహిర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి మునిగిపోయాడు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసుల సాయంతో గాలింపు చర్యలు చేపడుతున్నారు. -
పాఠశాలలో స్కావెంజర్లను నియమించాలి
మహబూబ్నగర్ విద్యావిభాగం: పార్ట్టైమ్ స్వీపర్లు ఉన్న పాఠశాలల్లో స్కావెంజర్లను నియమించకపోవడం వల్ల ప్రధానోపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీసీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు రాములు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏకోపాధ్యాయ పాఠశాలలకు విద్యాబోధకులను ఇవ్వాలని డిమాండ్ చేశారు. పుష్కరఘాట్లలో వినియోగించిన ఆర్ఓప్లాంట్లను ప్రభుత్వ పాఠశాలకు ఇవ్వాలని కోరారు. నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న డిఎస్సీ నోటిఫికేషన్ వేసి వెంటనే పోస్టులు భర్తీ చేయాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వి.రమేష్, గురుప్రసాద్, రాజు, పాండురంగాచారి, ఎన్.రమేష్, సదాశివుడు, నర్సిములు తదితరులు పాల్గొన్నారు. -
నకిలీ మావోయిస్టుల ముఠా అరెస్ట్
మావోయిస్టుల పేరు చెప్పి ఆయుధాలతో బెదిరిస్తూ డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రెండు పిస్తోళ్లు, రూ.3 లోల నగదు, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయినవారిలో దాసరి రాములు, గుండ భూమేశ్, పిల్లి సంపత్ ఉన్నారు. -
ప్రజల్లో చైతన్య కోసమే సైకిల్ యాత్ర
బొమ్మలరామారం : ప్రభుత్వాలు చేపడుతున్న సంక్షేమ పథకాలపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకే తాను సైకిల్ యాత్ర చేస్తున్నట్లు హైదరాబాద్ రామాంతపూర్కు చెందిన మిట్టగోరు రాములు గౌడ్ తెలిపారు. వేములవాడ రాజన్న సన్నిధిలో తన సైకిల్ యాత్ర విరమించేందుకు వెళ్తున్న క్రమంలో మండల కేంద్రానికి చేరింది. కేంద్రం చేపట్టిన స్వచ్ఛ భారత్, యోగా, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు మిషన్ కాకతీయ, హరిత హారంలాంటి పథకాలపై చైతన్యం కల్పిస్తున్నారు. గతంలో ప్రత్యేక తెలంగాణ కోసం సోనియా గాంధీ, ప్రధాని వద్దకు రెండు పర్యాయాలు ఢిల్లీకి సైకిల్ యాత్ర చేసానని తెలిపారు. ఇటివలే జూలై1న స్వచ్ఛ భారత్ నినాదంతో ఢిల్లీ వరకు సైకిల్ యాత్ర చేసి యాత్ర విరమించేందుకు వేముల వాడ రాజన్న సన్నిధికి బయలు దేరానని పేర్కొన్నారు. నేటికి 28000 కిలో మీటర్లు తిరిగి సైకిల్ యాత్ర చేశానన్నారు. 70 ఏళ్ల వయసులోనూ యాత్రను కొనసాగిస్తున్న రాములును పలువురు అభినందిస్తున్నారు. -
డెంగీతో ఒకరి మృతి
తాడ్వాయి : తాడ్వాయి మండలంలోని భస్వన్నపల్లి గ్రామానికి చెందిన గెర్రె చిన్న రాములు (42) డెంగీ జ్వరంతో మృతి చెందాడు. నాలుగు రోజుల క్రితం తీవ్రంగా జ్వరం రావడంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం కామారెడ్డిలోని జీవదాన్ హాస్పిటల్కు తరలించారు. అక్కడి వైద్యులు రాములుకు డెంగీ లక్షణాలు ఉన్నాయని వెంటనే హైదరాబాద్కు తీసుకెళ్లాలని సూచించారు. రాములును హైద్రాబాద్లోని ప్రవేటు హాస్పిటాల్కు తరలించగా చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. అదే గ్రామానికి మరికొందరు డెంగీతో బాధపడుతున్నారని గ్రామస్తులు తెలిపారు. -
ఇద్దరు అంతర్జిల్లా దొంగల అరెస్ట్
వరంగల్ కమిషనరేట్ పరిధిలో తాళం వేసి ఉన్న ఇండ్లలో చోరీలకు పాల్పడుతోన్న ఇద్దరు అంతర్ జిల్లా దొంగలను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి అరకిలో బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో బైరి రాములుది నల్గొండ జిల్లా ఆలేరు మండలం మందనపల్లి కాగా..శీల యాదగిరిది వరంగల్ జిల్లా దేవరుప్పల మండలం మాదాపురం. నిందితులను శుక్రవారం ఆర్ ఎన్టీ రోడ్లోని బులియన్ మార్కెట్లో అరెస్ట్ చేశారు. వీరు హన్మకొండ, సుబేదారి, కేయూ, ఖాజీపేట, మడికొండ, వర్ధన్నపేట్, ఆత్మకూరు, జనగాం ప్రాంతాల్లో చోరీలకు పాల్పడ్డారు. -
పాత పెన్షన్ విధానాన్నే అమలు చేయాలి
సంగారెడ్డి మున్సిపాలిటీ : విద్యారంగ సమస్యలతో పాటు ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వచ్చే నెల 3న ఇందిరా పార్క్ వద్ద నిర్వహించే సామూహిక నిరహార దీక్షకు జిల్లా నుంచి అధిక సంఖ్యలో పాల్గొనాలని ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కార్యదర్శి రాగి రాములు కోరారు. ఆదివారం ఐబీలో నిరాహార దీక్ష వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా అయన మట్లాడుతూ కంట్రిబ్యూషన్ పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన అరోగ్యకార్డులు అన్ని కార్పోరేట్, ప్రయివేట్ అసుపత్రులలో అన్ని రకాల జబ్బులకు ఉచిత చికిత్సలతో పాటు ఓపీ సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రమేష్, ప్రధాన కార్యదర్శి భాస్కర్, దత్తాత్రి, భాస్కర్దేశ్, నర్సింలు, తిరుపతి, అశోక్ తధితరులు పాల్గొన్నారు. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
రంగారెడ్డి జిల్లా యాలల మండలం బెన్నూరు గ్రామానికి చెందిన కౌలు రైతు కొత్త రాములు(35) విద్యుదాఘాతంతో గురువారం సాయంత్రం మృతిచెందాడు. పొలానికి నీళ్లు పెట్టేందుకు మోటారు ఆన్ చేయగా కరెంట్ షాక్ కొట్టి అక్కడికక్కడే చనిపోయాడు. మృతునికి బార్య మునెమ్మ, కుమార్తె శ్వేత ఉన్నారు. -
నిజామాబాద్లో రెండు దొంగతనాలు
నిజామాబాద్జిల్లా వర్ని మండలం జలాల్పూర్లో బుధవారం రాత్రి రెండిళ్లలో దొంగతనాలు జరిగాయి. గ్రామానికి చెందిన వేముల గంగాభవానీ కుటుంబసభ్యులు ఇంటికి తాళం వేసి బంధువుల ఊరికి వెళ్లారు. గుర్తు తెలియని దుండగులు ఆ ఇంటి తాళాలు పగులగొట్టి రూ.5వేల నగదుతోపాటు ఒకటిన్నర తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకుపోయారు. అలాగే, ఆ పక్కనే ఉన్న చింతం రాములు ఇంట్లో ప్రవేశించిన దుండగులు నిద్రిస్తున్న వారిపై మత్తు మందు చల్లి తాపీగా ఇంట్లో వస్తువులను చిందరవందర చేశారు. దాచి ఉంచిన రూ.24వేల నగదుతోపాటు రాములు కోడలు అనిత మెడలోని బంగారు గొలుసు సహా 5 తులాల బంగారు ఆభరణాలను, 5 తులాల వెండి ఆభరణాలను పట్టుకుపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్సై అంజయ్య సంఘటన స్థలిని పరిశీలించి, దర్యాప్తు చేపట్టారు. -
వడదెబ్బకు వ్యవసాయ కూలీ మృతి
వడదెబ్బకు గురై వ్యవసాయ కూలీ మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని ఇటిక్యాల గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. గ్రామస్తులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఎరోల్ల రాములు(47) అనే వ్యక్తి గ్రామంలో తన వ్యవసాయ పనులు చూసుకుంటూ ఆదే గ్రామానికి చెందిన లకా్ష్మరెడ్డి దగ్గర పాలేరుగా పనిచేస్తున్నారు. అయితే బుధవారం ఉదయం వ్యవసాయ పనుల కోసం పొలానికి వెళ్లారు. ఎండ తీవ్రత వల్ల వడదెబ్బకు గురయ్యారు. సాయంత్రం కుటుంబ సభ్యులు గ్రామంలో ఉన్నా ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. కాగా గురువారం తెల్లవారుజామున మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతినికి భార్య నాగమణి, కొడుకు, కుతూరు ఉన్నారు. -
రైల్లో నుంచి జారిపడి వ్యక్తి మృతి
ఒక రైల్లో నుంచి మరో రైల్లోకి ఎక్కడానికి ప్రయత్నించిన ఓ వ్యక్తి రైలు కిందపడి మృతిచెందాడు. ఈ సంఘటన మహబూబ్నగర్ జిల్లా మదనాపురం- వనపర్తిరోడ్ రైల్వే స్టేషన్ వద్ద ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. వనపర్తికి చెందిన రాములు(45) అనే వ్యక్తి గుంటూరు రైల్వే ప్యాసింజర్ ఎక్కే క్రమంలో.. ప్రమాదవశాత్తు దాని కిందపడి మృతిచెందాడు. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
వడదెబ్బకు ఇద్దరి మృతి
మండు టెండలకు ఓ వ్యక్తికి వడదెబ్బ తగిలి మృతి చెందిన సంఘటన బూర్గుంపాడు మండలం నాగినేని ప్రోలులో గురువారం జరిగింది. బూర్గుంపాడు మండలం నాగినేనిప్రోలు గ్రామానికి చెందిన కడారి రాములు(55)లకు వడదెబ్బ తగిలింది. చికిత్స చేస్తుండగానే మృతి చెందాడు. అలాగే గురువారం అశ్వారావుపేట నందమూరి కాలనీకి చెందిన హుస్సేన్(25) వడదెబ్బకు మరణించాడు. -
ట్రాక్టర్ బోల్తా..ఒకరి మృతి
బిజినేపల్లి మండలం వెలిగొండ గ్రామంలో ట్రాక్టర్ అదుపుతప్పి పొలంలోకి దూసుకెళ్లిన ఘటనలో ఒకరు మృతి చెందారు. ప్రమాద సమయంలో ట్రాక్టర్పై కూర్చున్న రాములు(18) అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. అదుపు తప్పిన ట్రాక్టర్ పొలంలోకి దూసుకెళ్లింది. దీంతో ట్రాక్టర్ పైన కూర్చున్న వ్యక్తులు పక్కనున్న చెట్టుకు ఢీకొన్నారు. దీంతో రాములు అక్కడికక్కడే మరణించగా..హరీశ్ అనే మరో యువకుడు స్వల్పంగా గాయపడ్డాడు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కోరలు తిరిగిన నాగైనా.. తోక ముడవాల్సిందే..
40 ఏళ్లుగా పాముల్ని పడుతున్న రాములు వాటితో ఆటాడిస్తేనే కుటుంబానికి సాపాటు నెల్లిపాక: సాధారణంగా మనుషులకు పామును చూస్తేనే గుండె జల్లుమంటుంది. అరుుతే హరిపిలి రాములు మామూలు మనిషి కాదు..పిల్లలు బొమ్మలతో ఆడుకున్నంత ధీమాగా విషసర్పాలతో చెలగాటమాడే మొనగాడు. తన ఒడుపుతో వాటిని తోకముడిపించగల సాహసికుడు. తెలంగాణ లోని ములకలపల్లి మండలానికి చెందిన రాములుకు గత 40 ఏళ్లుగా వందలాది పాములను పట్టి, కోరలు, పీకి ఆడిం చారు. గత కొన్నేళ్లుగా మండలంలోని గ్రామాల్లో సంచారజీవనం సాగిస్తూ, తన లావంతో ‘పాముల రాములు’గా పేరొందారు. ఆయన కుటుంబంతో పాటు ఒక్కోచోట కొన్నాళ్లుగా గుడారం వేసుకుని ఉంటారు. తనతో పాటు కొద్దిపాటి పందులు, మేకలు, గాడిదలనూ వెంట తీసుకువెళుతుంటారు. మకాం వేసిన ప్రతిచోటా పరిసరాల్లో తెల్ల, గోధుమ, నల్ల, కోడె వంటి తాచులనూ, చింతనాగులనూ ఎక్కడున్నా పసిగట్టి అవలీలగా పట్టేస్తుంటారు. వాటి కోరలను పీకి, బుట్టల్లో పెట్టి, ఊళ్లలో ఆడిస్తుంటారు. తన నాదస్వరంతో పాముల్ని నాట్యం చేరుుస్తుంటే సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యే జనం ఇచ్చే డబ్బులతో బతుకుతుంటారు. ఇప్పటికి ఎన్ని వందల పాముల్ని పట్టానో గుర్తు లేదని, పట్టిన పాములను కొన్నిరోజుల పాటు ఆడించి తిరిగి అడవిలోనే వదిలేస్తానని ఆయన ‘సాక్షి’కి చెప్పారు. పాములు పట్టే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటానని, అరుునా కొన్నిసార్లు వాటి నుంచి ప్రమాదాలు జరిగాయని తెలిపారు. తనలాగే పాముల్ని పట్టి ఆడించే తన పాముకాటుతోనే ప్రాణాలు పోగొట్టుకున్నాడని, అరుునా బతుకుతెరువుకు ఆ పాములపైనే ఆధారపడ్డానని నిట్టూర్చారు. -
మున్సిపల్ కమిషనర్పై కలెక్టర్కు ఫిర్యాదు
ఎన్నిసార్లు నోటీసు పంపినా లోక్ అదాలత్కు హాజరుకాని హిందూపురం మున్సిపల్ కమిషనర్ వీరభద్రరావుపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయనున్నట్లు జిల్లా లోక్ అదాలత్ చైర్మన్, జిల్లా అదనపు జడ్జి రాములు పేర్కొన్నారు. శనివారం హిందూపురంలో మెగా లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సమావేశానికి మున్సిపల్ కమిషనర్ సహా అధికారులెవరూ హాజరుకాలేదు. మున్సిపల్ కమిషనర్ గత రెండేళ్లుగా ఏ లోక్ దాలత్కు హాజరుకాలేదని, ఎన్నిసార్లు నోటీసులు పంపినా స్పందించడంలేదని జిల్లా అదనపు జడ్జి రాములు ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టు గైడ్లైన్స్ మేరకే ప్రజలకు సత్వర న్యాయం జరిగేందుకు వీలుగా లోక్ దాలత్లను నిర్వహిస్తున్నామని, వాటిపట్ల అధికారుల్లో చులకన బావం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. -
డ్రైనేజీ శుభ్రం చేస్తూ కార్మికుడి గల్లంతు
హైదరాబాద్: డ్రైనేజీ శుభ్రం చేస్తూ జీహెచ్ఎంసీ కార్మికుడు ఒకరు గల్లంతైన సంఘటన నల్లకుంటలో చోటుచేసుకుంది. కార్మికులు రాములు, శ్రీనివాస్ లు ఆదివారం మధ్యాహ్నం నల్లకుంటలోని డ్రైనేజీని శుభ్రం చేసేందుకు లోపలికి దిగారు. అంతలోనే శ్రీనివాస్ ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యాడు. మరో కార్మికుడు రాములు కనిపించకుండా పోయాడు. సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సంఘటనా స్థలి వద్దకు చేరుకుని బోరున విలపించారు. జీహెచ్ ఎంసీ అధికారులు.. రాములు కోసం పెద్ద ఎత్తున గాలింపుచర్యలు చేపట్టారు. కాగా, డ్రైనేజీలో విషవాయువులు వెలువడటం వల్లే రాములు సృహకోల్పోయి గల్లంతై ఉంటాడనే అనుమానం వ్యక్తమవుతోంది. -
‘కేసీఆర్ రాష్ట్రాన్ని శ్మశానంలా మార్చారు’
అచ్చంపేట : ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని శ్మశానంలా మార్చేశారని మాజీ మంత్రి పి.రాములు విమర్శించారు. శుక్రవారం ఆయన మహబూబ్నగర్ జిల్లా అచ్చంపేటలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు, కల్తీకల్లు చావులు, రోడ్డు ప్రమాదాలు పెరిగిపోయాయని తెలిపారు. సుమారు 1300 మంది అన్నదాతలు అసువులు బాసినా ప్రభుత్వంలో చలనం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.6 లక్షల పరిహారం ఇటీవల మృతి చెందిన రైతు కుటుంబాలకే కాకుండా గతంలో మరణించిన వారికి కూడా వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. మహబూబ్నగర్ జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలని రాములు కోరారు. -
సెల్ పోయింది.. ఓటుకు కోట్లు కేసులో నోటీసు
హైదరాబాద్: రెండేళ్ల క్రితం సెల్ఫోన్ పోగొట్టుకున్న ఓ వ్యక్తికి ఏసీబీ నోటీసు వచ్చింది. ఈ నోటీస్ చూసి అతనితో పాటు కుటుంబ సభ్యులు షాకయ్యారు. వివరాలిలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం సారంపల్లి గ్రామానికి చెందిన పాలకుర్తి రాములు అనే వ్యక్తికి ఏసీబీ నోటీసు జారీ చేసింది. ఓటుకు కోట్లు కేసులో విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశించారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా టీడీపీ నేతలు.. రాములు పేరుతో ఉన్న సిమ్ను వాడినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. దీంతో విచారణకు రావాలని నోటీసు ఇచ్చారు. అయితే ఓటుకు కోట్లు కేసులో తనకెటువంటి సంబంధాలు లేవని రాములు చెబుతున్నాడు. హైదరాబాద్లో రెండేళ్ల క్రితం సెల్ పోగొట్టుకున్నానని చెప్పాడు. ఆ ఫోన్ ఎవరికి దొరికొందో.. ఆ నెంబర్తో ఎవరు ఫోన్ చేశారో తనకు తెలియదని అన్నాడు. వాస్తవమేంటన్నది ఏసీబీ విచారణలో తేలాల్సివుంది. -
గుండెపోటుతో ఉపాధి కూలీ మృతి
విజయనగరం జిల్లా: గుండెపోటుతో ఉపాధి కూలీ మృతి చెందాడు. ఈ సంఘటన గురువారం విజయనగరం జిల్లా సాళూరు మండలం కోట్టుపరువు గ్రామంలో జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన రాములు (60) ఉపాధి కూలీగా పనిచేస్తున్నాడు. రోజులాగే గురువారం పనికి వెళ్లిన రాములుకి గుండెపోటు రావడంతో అక్కడే కూలబడిపోయాడు. రాములుకి భార్య, ఇద్దరు కుమారులున్నారు. విషయం తెలిసిన ఏపీవో రాములు కుటుంబానికి ప్రభుత్వం తరపున అందాల్సిన ఆర్థిక సహాయాన్ని అందించి ఆదుకుంటామని ప్రకటించారు. (సాళూరు) -
త్యాగానికీ, ఆత్మ గౌరవానికీ మారు పేరు
ఈ దేశంలో కులవ్యవస్థపై పోరాటం చేసిన మహా పురుషులు, నాయకులు తమ జీవిత కాలంలో ఏదో ఒక సంద ర్భంలో అవమానాలకు, వివక్షకు గురైన వారే. కొలియలకు, శాక్య వంశస్తులకు మధ్య నీటి యుద్ధం అనివార్యమై క్షత్రి యుడైన సిద్ధార్థుడు యుద్ధాన్ని వ్యతిరేకిం చినప్పుడు క్షత్రియ ధర్మమైన రాజ్యపా లనకు అనర్హుడని సొంత సమాజం నుం చి అవమానానికి గురయ్యాడు. ఆ అవమానమే ప్రపంచంలో తొలి సామాజిక విప్లవకారుడి ఆవిర్భావానికి, గౌతమ బుద్ధుడు ఉద్భవిం చడానికి కారణమైనది. బ్రాహ్మణ స్నేహితుడి పెళ్లి ఊరేగింపులో జ్యోతిరావు ఫూలేకి జరిగిన అవమానం... ఆధునిక సామాజిక విప్లవకారుడు మహాత్మా ఫూలేను, తొలి మహిళా ఉపాధ్యాయిని సావిత్రి బాయిని ఈ దేశానికీ అందించింది. శూద్ర రాజర్షులైన శివాజీ, సాహుజీలకు పట్టాభిషేకం సమయంలో జరిగిన అవమా నాలు- వారిని ఛత్రపతులుగా తీర్చిదిద్దాయి. అఖిల భారత జాతీ య కాంగ్రెస్లో జరిగిన అవమానంతో- పెరియార్ రామస్వామి ఆత్మగౌరవ, హేతు, నాస్తికవాద పునాదులు బలపడ్డాయి. గుడిలోకి అడుగు పెట్టనివ్వని వివక్ష- కేరళలో అయ్యంకాళి, నారాయణ గురువులను పుట్టించి ఆ రాష్ర్ట పాలనలో నేటికి మనుధర్మ ఛాయ లు రాకుండా చేసింది. బాల్యం నుంచి భీమ్రావుకి జరిగిన అవ మానాలు, మానసిక క్షోభ- ప్రపంచానికి ఒక మేధావిని, అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి రాజ్యాంగాన్ని నిర్మించిన బాబా సాహెబ్ అంబేద్కర్ని అందించి కోటానుకోట్ల బడుగు, బలహీన, దళిత, మైనారిటీలతో పాటు అన్ని కులాల్లోని స్త్రీలు, కార్మిక, కర్షక లోకా నికి సౌకర్యవంతమైన జీవనానికి అవకాశాన్ని కల్పించాయి. వీటన్నింటికీ భిన్నంగా పంజాబ్లోని సైనిక నేపథ్య చమార్ కుటుంబంలో పుట్టి, కుల వివక్షకు ఏ మాత్రం గురికాని ఓ వ్యక్తి, పుణెలోని రక్షణ సం స్థలో ఉద్యోగిగా చేరాక అక్కడి ఉద్యోగ సంఘ నాయకుడు ఇచ్చిన అంబేద్కర్ రాసిన ‘కులనిర్మూ లన’ చదివి తెలుసుకున్న మనువాద మర్మం - భారతదేశంలో అంబేద్కర్ పునరుజ్జీవనానికి నాం ది పలికి, భారత రాజకీయాల దశ, దిశను మార్చే శక్తి కలిగిన కాన్షీరామ్కి పురుడుపోసింది. కుల వివక్ష గురించి ఏ మాత్రం తెలియని ఒక మాదిగ వ్యక్తికి ఒక చిన్న పుస్తకం, ప్రజాస్వామ్య భారతాన్ని ప్రభావి తం చేయగల మహాశక్తిని అందించింది. కాన్షీరామ్ తన తల్లికి రాసి న 24 పేజీల ఉత్తరంలో ఇకపై ఎలాంటి కుటుంబ శుభ, అశుభకా ర్యాలకు రానని, పెళ్లి చేసుకోనని చెప్పి కోట్లాది దయనీయ బహు జన జీవితాలకై ఉద్యోగాన్ని సైతం వదలి అంబేద్కర్ ఉద్యమానికి ఊపిరి పోశాడు. 1956, మార్చి, 18 నాడు ఆగ్రాలో జరిగిన షెడ్యూల్డ్ క్యాస్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సమావేశంలో రిజర్వే షన్ల ఫలితాలు అనుభవిస్తున్న ఉద్యోగులు మాట్లాడిన స్వార్థపూరిత మాటలతో మానసిక వేదనకు గురై, అనారోగ్యంతో మరణించిన బాబాసాహెబ్ ఉద్యమానికి, అదే ఉద్యోగస్తుల టైమ్, టాలెంట్, ట్రెజర్ ద్వారా కాన్షీరామ్ ప్రాణం పోశాడు. నేటి దళిత నాయకులు, వివిధ కుల సంఘ నేతల వలె కాన్షీరామ్ ఏనాడూ అగ్ర కులాలను నిందించడమే పనిగా పెట్ట్టుకోలేదు, ఇతర కులాలను ద్వేషించ లేదు, సొంత ఫిలాసఫీ చెప్పలేదు. గాంధీ- అంబేద్కర్ల అయిష్ట పూనా ఒడంబడికలోని రహస్య కోణాలను బహిర్గ తం చేసి ప్రత్యేక నియోజకవర్గాల విషయంలో అంబేద్కర్ని బ్లాక్ మెయిల్ చేసిన కుట్రలను ప్రధా న ఎజెండాగా అందించి గెలుపొందిన యోధుడు కాన్షీరామ్. ఫూలే ‘గులాంగిరి’, అంబేద్కర్ ‘కులని ర్మూలన’, కాన్షీరామ్ ‘చెంచాయుగం’ బహుజన జాతులకు కనువిప్పు కలిగించే పుస్తకాలు. ప్రతి కులంలోని వ్యక్తులు ఎక్కడో ఒకచోట మానసిక, శారీరక సంఘర్షణలకు గురవక తప్ప దు. కులనిర్మూలనకై సాగాల్సిన ఉద్యమాలు కులం బలపడేటట్లు తయారై, కులానికో అవధూత తయారై, సవాలక్ష అవలక్షణాలతో అంబేద్కర్కి అపప్రథ తెస్తూ ఉద్య మాన్ని ప్రేమిం చే ఉద్యోగులను మోసం చేస్తున్నాయి. రాబోయే తరాలు వారిని చరిత్ర పుటల్లోంచి తొలగిస్తాయి. ఆత్మగౌరవం అనేది ప్రతి వ్యక్తి విజయానికి భూమిక. అదిలేని ఏ పోరాటం చరిత్రలో విజయం సాధించిన దాఖలాలు లేవు, నిరంతరం బ్రాహ్మణులను, అగ్రవర్ణా లను నిందించడం మాని ఇతర కులాలను ప్రేమించి ఆత్మగౌర వంతో జీవిస్తూ, లక్ష్యసాధనలో వెన్నుచూపని ధైర్యం అలవర్చు కున్న వారే కాన్షీరామ్ అసలైన వారసులు. కాబట్టి ‘పే బ్యాక్ టు సొసైటీ’లో స్వచ్ఛందంగా పాల్గొని. కులరహిత సమాజాన్ని నిర్మి ద్దాం. అదే కాన్షీరామ్కి మనమిచ్చే నిజమైన నివాళి. (నేడు కాన్షీరామ్ 81వ జయంతి సందర్భంగా) రాములు, ప్రెసిడెంట్, అగ్రి డాక్టర్స్ అసోసియేషన్ ఫోన్: 8886-612415 - రాములు బహుజన రచయితల వేదిక ఆవిర్భావ సదస్సు బహుజనుల ఆరాధ్య నేత కాన్షీరాం 81వ జయంతి సందర్భంగా బహుజన రచయితల వేదిక ఆంధ్రప్రదేశ్ సదస్సు నేడు ఉదయం 10 గంటలకు విజయవాడ ప్రెస్ క్లబ్లో జరుగనుం ది. దళిత ఉద్యమం, సాహిత్యం ఉవ్వెత్తున ఎగిసిపడే తరుణం లోనే ఉత్తరప్రదేశ్లో మాయావతిని సీఎం చేయడం ద్వారా కాన్షీరాం భారత పీడిత కులాలకు ఒక సరికొత్త కలను సాక్షా త్కారం చేశారు. ఆ ఊపు అప్పట్లో ఆంధ్రాలో కూడా బాగా ప్రచారమైనప్పటికీ, అంబేద్కర్ వాదాన్ని కేవలం నినాదాలకే పరిమితం చేసిన శక్తులు నీరసించిపోయి బహుజన ఉద్యమ కాడిని వదిలేశాయి. అంబేద్కర్ మార్గం, కాన్షీరాం రాజకీయ చతురత, ఫూలే సంస్కరణాత్మక కార్యాచరణలను జెండాగా, ఎజెండాగా స్వీకరిస్తూ బహుజన రచయితల వేదిక పురుడు పోసుకుంటున్నది. ఆయా కులాల అస్తిత్వ విశిష్టతను పరిరక్షిం చుకుంటూనే, అణగారిన కులాల అస్తిత్వ రాజకీయాలను పున రుత్తేజం చేయడం బహుజన రచయితల వేదిక కర్తవ్యం. పార్ల మెంటరీ రాజకీయాలను ప్రభావితం చేస్తున్న అన్ని రంగాలను బహుజన విముక్తి దృష్టి కోణంతో విశ్లేషిస్తూ సృజనరంగంలోకి వేదిక అడుగుపెడుతుంది. బహుజనులను రాజ్యాధికారం వైపు తీసుకువెళ్లటం లక్ష్యంగా ప్రయాణించే బహుజన సాహితీ వేత్త లకు, కవులు, రచయితలు, మేధావులకు ఇదే మా స్వాగతం. (నేడు బహుజన రచయితల వేదిక ఆవిర్భావ సదస్సు) డాక్టర్ కాకాని సుధాకర్, కన్వీనర్ మొబైల్: 9440184788 -
సార్.. కొడుకు సాకడం లేదు
ఎమ్మెల్యే ఎదుట ప్రభుత్వ ఉద్యోగి తండ్రి ఆవేదన హసన్పర్తి : ‘ఎమ్మెల్యే సార్.. నా కొడుకుకు సర్కార్ నౌకరి ఉంది. పోలీస్ ఉద్యోగం చేస్తున్నాడు. నాకు మాత్రం తిండి పెట్టడం లేదు’ అంటూ వరంగల్ జిల్లా వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ ఎదుట చింతగట్టుకు చెందిన మూల రాములు అనే వ్యక్తి సోమవారం ఆవేదన వ్యక్తం చేశాడు. డెంగీ మృతురాలి కుటుంబాన్ని పరామర్శించడానికి ఎమ్మెల్యే చింతగట్టుకు వచ్చారు. ‘ఎమ్మెల్యే గారూ.. నాకు పింఛన్ ఇప్పించండి. కొడుకుకు నౌకరు ఉందని నాకొచ్చే పింఛన్ తీసేశారని ప్రాధేయపడ్డాడు. సర్కారే ధిక్కంటూ ఆవేదన వ్యక్తం చేశాడు’. దీనికి స్పందించిన ఎమ్మెల్యే అరూరి రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రభుత్వ ఉద్యోగి తల్లిదండ్రులకు పింఛన్లు ఇవొద్దని ఉత్తర్వులు ఉన్నాయి. ఓ ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ తల్లిదండ్రులు పోషించని వారిని ఎవరితో పోల్చాలని అడిగారు. కాగా, అర్హులందరికీ పింఛన్లు అందజేయాలని గణపురం, చిట్యాల మండలాల్లో పలు గ్రామాలకు చెందిన వృద్ధులు, వితంతువులు, వికలాంగులు ఎంపీడీ ఓ కార్యాలయాల ఎదుట సోమవారం ఆందోళనకు దిగారు. పరకాల మండలం వరికోల్లో అర్హులందరికీ పింఛన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. పింఛన్లు మంజూరైన వారు కూడా తీసుకోకుండా అధికారులను వెనక్కి పంపించారు. అలాగే రఘునాథపల్లి మండలం ఖిలాషాపురం లో పంచాయతీ కార్యదర్శిని నిర్బంధించారు. -
ఉసురు తీసిన అప్పులు
పెద్దశంకరంపేట, పాపన్నపేట: అప్పులు ఉసురుతీశాయి. ఆర్థిక ఇబ్బందులు తాళలేక జిల్లాలో ఇద్దరు మృతిచెందారు. ఒకరు ఆత్మహత్యకు పాల్పడగా మరొకరి గుండె ఆగింది. పెద్దశంకరంపేట మండలం మాడ్చెట్పల్లి శనివారం రాత్రి, పాపన్న పేట మండలం గాంధారిపల్లిలో ఆదివారం ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. వివరాల్లోకి వెళ్తే..మాడ్చెట్పల్లి గ్రామానికి చెందిన తలారి లక్ష్మయ్య, సత్యమ్మల కుమారుడు నాగరాజు (30) హైద్రాబాద్లో ఉంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. గ్రామంలో రెండెకరాల పొలం ఉంది. ఆధార్ కార్డు తీసుకోవడానికి శుక్రవారం గ్రామానికి వ చ్చాడు. ఇంటి నిర్మాణానికి సంబంధించిన ఆర్థిక ఇబ్బందులతో గత కొంతకాలంగా సతమతమవుతున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో శనివారం రాత్రి ఒంటిపై కిరోసిన్ పో సుకొని నిప్పంటించుకున్నాడు. చుట్టుప్రక్కల వారు, కుటుంబీకులు వచ్చి మంటలు ఆర్పేప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. శరీరం ఎక్కువశాతం కాలిపోవడంతో నాగరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా మృతుడికి భా ర్య ప్రమీల, ఇద్దరు కుమారులు ఉన్నారు. సం ఘటన స్థలంలో కుటుంబీకుల రోదనలు అం దర్నీ కన్నీరు పెట్టించాయి. లక్ష్మయ్యకు ముగ్గు రు కుమారులు. కాగా ఒకరు అనారోగ్యంతో గతంలోనే చనిపోయాడు. మృతుడి కుటుంబా న్ని టీఆర్ఎస్ ఖేడ్ ఇన్చార్జ్ భూపాల్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు విజయరామరాజు పరామార్శించి అర్థిక సాయం అందజేశారు. గాంధారిపల్లిలో.. పాపన్నపేట మండలం గాంధారిపల్లి గ్రామానికి చె ందిన టేక్మాల్ రాములు(40) అనే వికలాంగుడు గతంలో ఇందిరమ్మ ఇల్లు వస్తుందనే ఆశతో అప్పు చేసి ఇల్లు కట్టుకున్నాడు. ఇల్లు మంజూరు కాకపోవడంతోపాటు అప్పులు పెరిగాయి. రేషన్కార్డును సైతం అధికారులు రద్దు చేశారని మృతుని బార్య అనిత తెలిపింది. దీంతో రాములు గత కొంతకాలంగా మనోవేదనకు గురవుతున్నాడు. ఆదివారంతెల్లవారుజామున గుండెపోటుకు గురై రాములు మృతి చెందినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. మృతునికి కుమారుడు ఉపి, కూతురు ఉదయ ఉన్నారు. -
తాగిన మైకంలో తండ్రిని చంపిన తనయుడు
తొర్రూరు : తాగిన మైకంలో గొడవపడి ఓ వ్యక్తి కన్నతండ్రినే హతమార్చిన సంఘటన మండలంలోని బొ మ్మకల్ గ్రామశివారు కండ్యి తండాలో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. ఎస్సై కరుణాకర్రావు కథనం ప్రకారం.. తండాకు చెందిన దారవత్ సర్యి(65), మీరమ్మ దంపతుల కుమారుడు రాములుకు సుమారు 15 ఏళ్ల క్రితం దోళ్లతో వివాహమైంది. రాములు, దోళ్ల దంపతులకు కుమార్తె రేణుక జన్మించింది. కొన్నాళ్ల తర్వాత రాము లు తన భార్యతో తరచూ గొడవపడుతుండగా ఆమె విసుగుచెంది విడాకు లు తీసుకుని వెళ్లిపోయింది. ఈ క్రమంలో రాముల మూడేళ్ల క్రితం బొమ్మకల్ గ్రామశివారు నెహ్రూనాయక్ తండాకు చెందిన రాధను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఏడాది గడవకముందే వారిద్దరి మధ్య కూడా గొడవలు జరుగుతుండడంతో రాధ తన పుట్టింటికి వెళ్లిపోరుుంది. అప్పటి నుంచి రాములు తన మొదటి భార్య కుమార్తె రేణుకతో తల్లిదండ్రులు వద్ద ఉంటున్నాడు. రోజూలాగే శుక్రవారం రాత్రి రాములు తాగి ఇంటికి వచ్చాడు. అదే సమయంలో గంప కింద ఉన్న కోడి బయటకు వచ్చి అరుస్తుండగా దానిని పట్టుకుని గంపలో వేసేందుకు ప్రయత్నిస్తున్న తండ్రి సర్యితో రాములు గొడవపడ్డాడు. తల్లి మీరమ్మ అతడిని ఆపేందుకు ప్రయత్నించ గా ఆమెను కొట్టాడు. అనంతరం మళ్లీ తండ్రి సర్యితో గొడవపడి గొంతు నులిమి, గట్టిగా మర్మాంగాలపై తన్ని కొట్టి చంపాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతుడి భార్య మీరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నిందితుడు రాములును అదుపులోకి తీసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మానుకోట ఏరియా ఆస్పత్రికి తరలించారు. కుమారుడే తండ్రిని హత్య చేయడంతో కుటుంబ సభ్యులు, బంధువులు, తండవాసులు కన్నీరుమున్నీరుగా రోదించారు. -
కారుణ్య నియామకాలు కలేనా!
ఆర్టీసీలో 1,868 కుటుంబాల నరకయాతన ప్రభుత్వం అనుమతించినా పట్టని యంత్రాంగం సాక్షి, హైదరాబాద్: కరీంనగర్ జిల్లాకు చెందిన రాములు ఏపీఎస్ ఆర్టీసీలో డ్రైవర్.. 2011 మార్చిలో అనారోగ్యంతో మృతి చెందాడు. కారుణ్య నియామకాల కోటాలో తనకు అవకాశం కల్పించాలంటూ ఆయన భార్య ఆర్టీసీకి దరఖాస్తు చేసింది. ఆమె దరఖాస్తు ఇప్పుడు ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితి. ఆ పేద కుటుంబానికి ఇప్పుడు ఆసరా లేకుండాపోయింది. ఆ ఇంట్లో ఆడపిల్ల పెళ్లి.. కొడుకు ఉన్నత చదువు.. ఈ రెండూ పెద్ద సమస్యగా మారాయి. పూట గడవటమే కష్టంగా మారిన తరుణంలో ఆమె కుట్టుమిషన్తో కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. ఇది ఒక్క రాములు ఇంటి దుస్థితి కాదు.. 1,868 కుటుంబాలను నరకయాతనకు గురిచేస్తున్న ఆర్టీసీ యంత్రాంగం నిర్లక్ష్యం. ఆర్టీసీలో కారుణ్య నియామకాలు అధికారుల ఇష్టారాజ్యంతో అభాసుపాలవుతున్నాయి. కుటుంబ పెద్ద అకస్మాత్తుగా మృత్యువాత పడితే.. ఆ కుటుంబాన్ని ఆదుకునే క్రమంలో అర్హత ఆధారంగా ఆర్టీసీలో ఉపాధి కల్పించే వెసులుబాటు ఉంది. కండక్టర్, డ్రైవర్, మెకానిక్.. ఈ మూడు పోస్టుల్లో ఏదో ఓ దానిలో నియమించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిం చింది. కానీ ఆ నియామకాల విషయంలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో ప్రస్తుతం 1,868 దరఖాస్తులు కార్యాలయాల్లోనే దుమ్ము కొట్టుకుపోతున్నాయి. ఆ కుటుంబసభ్యులు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా.. నియామకాలు మాత్రం జరగటం లేదు. 2011 జనవరి 1వ తేదీ తర్వాత చనిపోయిన కార్మికుల కుటుంబాలను ఆదుకునేందుకు వీలుగా కారుణ్య నియామకాలకు అనుమతి ఇస్తూ గత ఫిబ్రవరి ఏడో తేదీన ప్రభుత్వం జీఓ ఎంఎస్ నం.15ను జారీ చేసింది. తొమ్మిది నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఆ కసరత్తే మొదలు కాలేదు. అంతకుముందు చనిపోయిన కుటుం బాలకు సంబంధించి 1,120 దరఖాస్తులు అంద గా వాటిని పరిశీలించి 800 మందిని ఎంపిక చేశారు. కండక్టర్ పోస్టుకు అవసరమైన ఎత్తు లేకపోవటం, వయసు మరీ ఎక్కువగా ఉండటం, కనీస విద్యార్హత లేకపోవటం లాంటి కారణాలతో 300 దరఖాస్తులను తిరస్కరించారు. కొత్త జీవో ప్రకారం నెలలు గడుస్తున్నా కసరత్తు మొదలు కాకపోవటంతో ఆ కార్మికుల కుటుం బాలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి. వేలాదిగా డ్రైవర్ పోస్టుల ఖాళీ డ్రైవర్, కండక్టర్, శ్రామిక్ (మెకానిక్) పోస్టులనే కారుణ్య నియామకాలకు కేటాయించారు. వీటికి దాదాపు మహిళలే దరఖాస్తు చేస్తున్నందున వారు డ్రైవర్, మెకానిక్ పనిని ఇష్టపడక పోతుండటంతో ఒక్క కండక్టర్ పోస్టుకే పోటీ నెలకొంది. మహిళల కోటాలో ప్రస్తుతం ఆర్టీసీలో 13 వేల మంది కండక్టర్లు పనిచేస్తున్నారు. వారికి అంతే సంఖ్యలో డ్రైవర్ పోస్టులు ఉన్నా.. ఎవరూ రాకపోవటంతో అవన్నీ ఖాళీగా ఉన్నాయి. మహిళలను డ్రైవర్లుగా నియమించే విషయంలో అధికారులు చైతన్య కార్యక్రమాలు నిర్వహించకపోవటంతో ఈ పరిస్థితి నెల కొంది. -
పోలీసుల అదుపులో రాములు హత్యకేసు నిందితులు
-
భయపడ్డట్టుగానే...
హత్యకు గురైన‘కొనపురి’ భువనగిరి/వలిగొండ, న్యూస్లైన్, మావోయిస్టు అగ్రనేత సాంబశివుడి సోదరుడైన రాములు తన హత్యకు కుట్ర పన్నారని మొదటినుంచీ చెబుతున్నట్టుగానే జరిగిపోయింది. రాములు మావోయిస్టు దళంలో పనిచేసి లొంగిపోయారు. జిల్లాలోని ఆలేరు, కృష్ణపట్టి దళాల్లో పనిచేసిన ఆయనపై జిల్లాలో 9 పోలీస్ కేసులు నమోదయ్యాయి. ఇతను 1998లో దళంలో చేరాడు. ఆలేరు, కనగల్లు దళాల్లో పనిచేశాడు. 2001 నుంచి 2002 వరకు కృష్ణపట్టి దళంలో, 2002 నుంచి 2003 వరకు స్పెషల్ గెరిల్లా కమాండర్గా పనిచేశాడు. 2001, 2003లో చందంపేట వద్ద మావోయిస్ట్లు నిర్వహించిన ట్రైయినింగ్ కాంపులలో పాల్గొన్నాడు. 2003లో ఎస్పీ సజ్జనార్ సమక్షంలో లొంగిపోయాడు. తిరిగి 2006లో అజ్ఞాతంలోకి వెళ్లాడు. 2007లో లొంగిపోయాడు. 2008లో టీఆర్ఎస్లో పార్టీలో చేరాడు. రాములపై పలుమార్లు హత్యా ప్రయత్నాలు జరిగినా చాకచక్యంగా తప్పించుకున్నారు. దళసభ్యురాలినే వివాహం.. దళంలో ఉన్న సమయంలోనే చండూరు మండలం కొండాపురానికి చెందిన దళ సభ్యురాలు కవితను వివాహామాడాడు. ఆయనకు కూతురు, కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో కొత్తపేట సమీపంలో నివసిసిస్తున్నారు. భువనగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీచేయాలని ఆశించారు. అది దక్కుతుందో లేదోనని ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికలలో జెడ్పీటీసీగా పోటీ చేయాలని ఆశించారు. కానీ చివరి నిమిషంలో నిర్ణయాన్ని మానుకున్నారు. రెండుసార్లు హత్యాయత్నం అయితే 2008 సంవత్సరంలో ఆయనపై రెండు సార్లు హత్యాయత్నం జరిగింది. ఆయన స్వగ్రామమైన వలింగొండ మండలం దాసిరెడ్డి గూడెంలో కోబ్రాల పేరుతో ఇంట్లో విషసర్పాలను వదిలారు. మరోసారి అన్నంలో విషం కలిపారు. రెండు సార్లు ఆయన బయటపడ్డారు. హైదాబాద్లో ఒకసారి, భూదాన్పోచంపల్లి మండలం అంతమ్మగూడెంలో బహింరంగ సభలో హత్యాయత్నానికి ప్రయత్నించారు. కోనపురి రామలు సోదరుడు మాజీమావోయిస్టు నేత, టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు సాంబశివున్ని 2011లో మార్చిలో వలిగొండ మండలం గోకారం స్టేజేవద్ద కొందరు వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. అనాటి నుంచి రాములు తనకు ప్రాణ హాని ఉందని చెబుతూ వచ్చారు. గ్రామంలో విషాదఛాయలు... రాములు హత్య సమాచారంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కొడుకు హత్య జరిగిందన్న సమాచారంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ ప్రత్యేక వాహనంలో జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. గ్రామస్తులు తండోపతండాలుగా ఆ ఇంటికి వచ్చి సానుభూతి ప్రకటించారు. మండలకేంద్రంలో టీఆర్ఎస్ శ్రేణులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. -
మాజీ మావోయిస్టు నేత సాంబశివుడు సోదరుడి హత్య
నల్గొండ: మాజీ మావోయిస్టు నేత సాంబశివుడు సోదరుడు రాములును దారుణంగా హత్య చేశారు. ఆదివారం పట్టపగలే నల్గొండలో రాములును కాల్చిచంపారు. దుండగులు ఆయన ముఖంపై కారంపొడి చల్లి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కుతురు వివాహానికి వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. ఫంక్షన్ హాల్లో అందరూ చూస్తుండగానే రాములుపై దాడి చేశారు. రాములు గన్మెన్ ప్రతిఘటించడంతో దుండుగులు పారిపోయారు. రాములును వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రత్యర్థుల నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ రాములు గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో కూడా ఆయనపై దాడి జరిగింది. నల్గొండకు వచ్చిన టీఆర్ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర రావు ఈ సంఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాసేపట్లో ప్రభుత్వాసుపత్రికి వెళ్లనున్నారు. -
అంగన్వాడీల పనివేళల్లో మార్పు
ఇందూరు, న్యూస్లైన్ : వేసవిని దృష్టిలో ఉంచుకుని అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్న పిల్లలు ఇబ్బందులు పడకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉండే అంగన్వాడీ పని వేళల్లో మార్పులు చేశారు. వేసవి కాలం ముగిసే వరకు ఇక నుంచి ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు వరకు అంగన్వాడీ కేంద్రాలను నడిపించాలని ఐసీడీఎస్ కమిషనర్ చిరంజీవి చౌదరి ఉత్తర్వులు జారీ చేశారు. వీటిని సోమవారం జిల్లా ఐసీడీఎస్ కార్యాలయానికి పంపించారు. మే నెల నుంచి వేసవి ముగిసే వరకు ఈ సమయ వేళలను పాటించాలని, పిల్లలకు పౌష్టికాహారం పంపిణీలో కార్యకర్తలు, ఆయాలు ఎలాంటి అంతరాయం కలుగకుండా చూడాలని ఐసీడీఎస్ పీడీ రాములు జిల్లాలోని అంగన్వాడీ నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశారు. కాగా కార్యకర్తలకు, ఆయాలకు, లింక్ వర్కర్లకు పెండింగ్లో ఉన్న ఫిబ్రవరి, మార్చి నెలల వేతనాలను ఈ నెల 15వ తేదీలోగా విడుదల చేసి వారి ఖాతాల్లో వేయాలని ఐసీడీఎస్ కమిషనర్ పీడీ రాములుకు ఆదేశాలు ఇచ్చారు. కార్యక్తలకు, ఆయాలకు 15 రోజుల సెలవులు అంగన్వాడీ కార్యకర్తలకు, ఆయాలకు 15 రోజుల పాటు వేసవి సెలవులు ఇచ్చినట్లు ఐసీడీఎస్ పీడీ రాములు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మే ఒకటి నుంచి 15వ తేదీ వరకు కార్యకర్తలు, 15 నుంచి 30వ తేదీ వరకు ఆయాలు సెలవులో వెళ్లాలని సూచించారు. ప్రస్తుతం కార్యకర్తలు సెలవులో ఉన్నందున ఆయాలే అంగన్వాడీలను నడపాలని, ఆయాలు సెలవులో వెళ్లినప్పుడు కార్యకర్తలు నడపాలన్నారు. ఇందులో ఎలాంటి నిర్లక్ష్యం చేసి, అంగన్వాడీలను నడపకుంటే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
ఆర్ఐపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడి
పాల్వంచ, న్యూస్లైన్: ఎన్నికల విధుల్లో ఉన్న రెవెన్యూ అధికారిపై పాల్వంచలో టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు దాడి చేశారు. కొత్తగూడెం నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి జలగం వెంకట్రావ్ ప్రచార కార్యక్రమం ఆదివార ం మధ్యాహ్నం పాల్వంచలోని ఇందిరా కాలనీలో ఏర్పాటైంది. దీనికి ముందస్తుగా ఆ పార్టీ కార్యకర్తలను స్థానిక నాయకుడు, న్యాయవాది గంగాధర్ సమాయత్తపరుస్తున్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలు ఎన్నికల నియామవళిని అతిక్రమించి, ఇందిరా కాలనీలో పార్టీ జెండాలు కడుతున్నారని తహశీల్దార్ సమ్మిరెడ్డికి సమాచారమందింది. ఆయన ఆదేశాలతో వీడియో సర్వేలైన్ టీం అధికారి, ఆర్ఐ ప్రసాద్ బాబ్జి, వీఆర్వో రాములు అక్కడి చేరుకుని, టీఆర్ఎస్ ప్రచార సరళిని వీడియోలో చిత్రీకరిస్తున్నారు. అదే సమయంలో అటుగా గంగాధ ర్ కారు వచ్చింది. అందులో పార్టీ జెండాలు ఉన్నాయన్న సమాచారంతో తనిఖీ చేసేందుకు దానిని ఆర్ఐ ఆపబోయారు. కారు ఆగకుండా వెళ్లడంతో ఆయన వెంబడించి నిలిపేశారు. కారులోంచి గంగాధర్, కొందరు కార్యకర్తలు దిగి ఆర్ఐపై దాడి చేసి దుర్భాషలాడారు. ‘ఓ పార్టీకి కోవర్టులుగా పనిచేస్తున్నారు’ అని ఆరోపించారు. దీనిపై ఆర్డీవో సత్యనారాయణకు, తహశీల్దార్ సమ్మిరెడ్డికి, పోలీసులకు ఆర్ఐ ఫిర్యాదు చేశారు. ఎస్ఐ ఆనంద్ వెంటనే అక్కడికి చేరుకుని గంగాధర్ను జీప్లో పోలీస్ స్టేషన్కు తరలించారు. జీపుకు అడ్డుపడిన టీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు పక్కకు లాగేశారు. ఇంతలో అక్కడికి చేరుకున్న టీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రావ్కు కార్యకర్తలు విషయం తెలిపారు. అధికారులతో మాట్లాడతానని చెప్పి ఆయన ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. పోలీసులకు ఆర్ఐ ఫిర్యాదు ఎన్నికల విధి నిర్వహణలో ఉన్న తనపై దాడి చేసి దుర్భాషలాడారని, విధులను అడ్డుకున్నారని పాల్వంచ పోలీసులకు ఆర్ఐ ప్రసాద్ బాబ్జి ఆదివారం ఫిర్యాదు చేశారు. దీనిపై ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కొత్తగూడెం ఆర్డీవో అమయ్కుమార్కు, డీఎస్పీకి కూడా ఫిర్యాదు చేయనున్నట్టు ఆర్ఐ బాబ్జి చెప్పారు. నాన్ బెయిలబుల్ కేసు నమోదు.. ఆర్ఐ బాబ్జీ ఫిర్యాదు మేరకు గంగాధర్పై నాన్బెయిలబుల్ కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ షణ్ముఖాచారి తెలిపారు. మరో 20 మందిపై కూడా కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. -
వాటర్ ఇండియా కార్యాలయంలో అగ్నిప్రమాదం
బేగంపేట,న్యూస్లైన్: పూజ వాణిజ్య సముదాయంలో అగ్నిప్రమాదం జరిగి పక్షం రోజు కాకముందే బేగంపేటలో శుక్రవారం మరో ప్రమాదం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... స్థానిక పైగా కాలనీలో రుక్మిణి టవర్స్ పేరుతో ఓ భవనం ఉంది. జీ ప్లస్ 4గా నిర్మించిన ఈ భవనం 1వ అంతస్తులో వాటర్ ఇండియా కార్యాలయం, 2వ అంతస్తులో ఇన్స్టెన్సి సాఫ్ట్వేర్ కార్యాలయం, 3వ అంతస్తులో ఆసియా ఇంజినీర్స్, 4వ అంతస్తులో భవన యజమాని కుటుంబం నివాసముంటోంది. శుక్రవారం ఉదయం 5.30కి మెదటి అంతస్తులోని వాటర్ఇండియా కార్యాలయంలో మంటలు, పొగలు వచ్చాయి. ఇంటి యజమాని రాములు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. మౌలాలి, ఫ్యారడైజ్, సనత్నగర్ అగ్నిమాపక కేంద్రాల నుంచి ఏడు ఫైర్ ఇంజిన్లు వచ్చి మంటలను ఆర్పివేశాయి. అయితే, అప్పటికే భవనం పూర్తిగా కాలిపోయింది. ప్రమాదానికి కారణం తెలియరాలేదు. ఆస్తిన ష్టం లక్షల్లో ఉంటుందని అంచనా వేస్తున్నట్లు ఫైర్ ఆఫీసర్ ఎంఎ షరీఫ్ తెలిపారు. పై అంతస్తులో ఉన్న యజమాని రాములు కుటుంబ సభ్యులను నారికల్ సహాయంతో అగ్నిమాపక సిబ్బంది సురక్షింతంగా కిందకు తీసుకొచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని బేగంపేట, మహంకాళి ఏసీపీలు మనోహర్, మహేందర్తో పాటు వైఎస్ఆర్సీపీ నేతలు జంపన ప్రతాప్, వెంకట్రావు సందర్శించారు. -
రామన్న బలిదానం
నిజాంసాగర్, న్యూస్లైన్: ‘‘ఎలాంటి ఆంక్షలు లేకుండా హైదరాబాద్ రాజధానిగా పదిజిల్లాలతో కూడిన తెలంగాణను ఇవ్వాలని, భద్రాచలాన్ని మా నుంచి విడదీయొద్దని సోనియాగాంధీ అమ్మను కోరుతున్నా..’’ అంటూ లేఖ రాసి ప్రాణం విడిచాడు రాములు. ఈప్రాంత ప్రజల దశాబ్దాల ఆకాం క్షను పక్కనపెట్టి ఎవరూ కోరుకోని రాయల తెలంగాణ ప్రతిపాదనను తెరపైకి తీసుకురావడాన్ని జీర్ణించుకోలేని నిజాంసాగర్ మండలం హసన్పల్లికి చెందిన మొకిరె రాములు(23) బుధవారం వేకువజామున ఆత్మహత్య చేసుకున్నాడు. తెలంగాణ ఏర్పాటుపై తర్జనభర్జనలతో కలత చెంది క్రిమిసంహారక మందు సేవించి ప్రాణం తీసుకున్నాడు. . మొకిరె దుర్గయ్య, దేవవ్వ దంపతుల కుమారుడైన రాములు ఎంఎస్సీ బీఎడ్ పూర్తి చేశాడు. ప్రస్తుతం బాన్సువాడలో పీజీడీసీఏ చేస్తున్నాడు. హోరెత్తిన నిరసనలు విద్యార్థి రాములు ఆత్మహత్యతో జిల్లావ్యాప్తంగా తెలంగాణ వాదులు, ఉద్యోగులు, రాజకీ య ఐకాస నాయకులు ఆందోళనకు దిగారు. రాములు ఆత్మకు శాంతి చేకూరాలంటే పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. వారంతా హసన్పల్లి గ్రామానికి చేరుకొని తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ, ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నేతత్వంలో నిర్వహించిన ధర్నా, రాస్తారోకోలో జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్సింధే పాల్గొన్నారు. రెండు గంటల పాటు బొగ్గుగుడిసె చౌరస్తా వద్ద హైదరాబాద్-బోధన్-నిజాంసాగర్-ఎల్లారెడ్డి ప్ర ధాన రహదారులపై ఆందోళనలు నిర్వహించా రు. సీఎం కిరణ్కుమార్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. విద్యార్థి మృతితో తెలంగాణవాదులు, నాయకులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు రాస్తారోకో, ధర్నాలు చేపట్టడంతో పోలీసులు చాకచక్యంగా మృతదేహాన్ని ఎల్లారెడ్డి ప్రభుత్వా స్పత్రికి తరలించారు. టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు పోచారం శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే పల్లె రవీందర్రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బాణాల లక్ష్మారెడ్డి తదితరులు రాములు తల్లిదండ్రులను పరామర్శించారు. ఆందోళనలో స్థానిక నాయకులతో పాటు ఉపాధ్యాయులు, ఉద్యోగులు పాల్గొన్నారు. హసన్పల్లిలో అంత్యక్రియలు.. రాములు మృతదేహాన్ని పోలీసులు ఎల్లారెడ్డి ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహిం చారు. అనంతరం కుటుంబసభ్యులకు అందించారు. హసన్పల్లిలో నిర్వహించిన అంత్యక్రియల్లో గ్రామస్తులు, అధికసంఖ్యలో తెలంగాణవాదులు పాల్గొన్నారు. జెతైలంగాణ, రాములు అమర్ రహే అంటూ నినదించారు. -
కారు బీభత్సం
గచ్చిబౌలి,న్యూస్లైన్: డ్రైవింగ్ రాని వ్యక్తి మద్యం మత్తులో కారు నడిపేందుకు ప్రయత్నించి ఆరుగురుని గాయపరిచాడు. ఒకరి పరిస్థితి విషమంగా ఉం ది. మాదాపూర్ ఎస్సై సురేష్బాబు తెలిపిన ప్రకారం.. పర్వతనగర్లో ఉంటూ మేస్త్రీగా పనిచేసే రాములు (45) తన ఇంటి ముందు పార్కు చేసి ఉన్న ఇండికా కారును మద్యం మత్తులో స్టార్ట్ చేశాడు. 50 మీటర్ల దూరం ముందుకు దూసుకెళ్లిన కారును అదుపు చేయలేకపోయాడు. దీంతో అది వెళ్లి ఓ ఇంటి ముం దు కూర్చున్న శంకరమ్మ, బీరప్ప, పుష్పలను ఢీకొట్టింది. వారికి గాయాలయ్యాయి. అప్పటి కీ కారు అదుపుకాక ఓ రేకుల ఇంట్లోకి దుసుకెళ్లింది. ఆ ఇంట్లో అద్దెకు ఉంటోన్న శ్యామ్సుం దర్, పూజ అనే పాపను ఢీకొట్టింది. వారికి తీ వ్ర గాయాలయ్యాయి. పుష్ప పరిస్థితి విషమం గా ఉండడంతో నిమ్స్కు తరలించారు. రాము లు కూడా గాయపడ్డాడు. అతన్ని కొండాపూర్ ఆసుపత్రికి తరలించారు. మద్యం మత్తులో, డ్రైవింగ్ రాకుండా కారు నడిపి బీభత్సం సృష్టించిన రాములుపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
35 మార్కులు దాటితే డోకాలేనట్లే !
ఇందూరు,న్యూస్లైన్ : జిల్లాలో 44 ఐసీడీఎస్ సూపర్వైజర్ పోస్టులకు దాదాపు తొమ్మిది వందల మంది పరీక్ష రాశారు. ఒక్కో పోస్టుకు సుమారు 20మంది అంగన్వాడీ కార్యకర్తలు పోటీ పడుతున్నారు. అక్టోబర్ 27న హైదరాబాద్లో పరీక్ష రాయగా, నెలాఖరునా ఫలితాలను వెలుబడ్డాయి. కాని అధికారులు కటాఫ్ మార్కులను ఇంకా ప్రకటించలేదు. కటాఫ్ మార్కులు, రోస్టర్కు సంబంధించిన మార్గదర్శకాలు అందలేవని, మరో మూడు రోజుల్లో ప్రకటిస్తారని ఐసీడీఎస్ ప్రాజేక్టు డెరైక్టర్ రాములు ‘న్యూస్లైన్’కు తెలిపారు. సూపర్వైజర్ పదోన్నతి పోటీకి పరీక్ష ద్వారా తాము అర్హత సాధించామా..లేదా.. అని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. అయితే పరీక్ష పేపరు మొత్తం మార్కులు 45 ఉండగా 35 మార్కులుపైబడి వచ్చిన వారికి సూపర్వైజర్గా పదోన్నతి లభించినట్లే..! ఇక వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 35మార్కులు పైబడిన వారిని ఓపెన్ కేటరిగిలో పిలువనున్నారు. అత్యధిక మార్కులు వచ్చినందుకు రోస్టర్ పాయింట్ను,రిజర్వేషన్లను లెక్కలోకి తీసుకోరు. అంటే అత్యధికంగా మార్కులు వచ్చినవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మూడు రోజుల తర్వాత కటాఫ్ మార్కులు ప్రకటించిన అనంతరం 35మార్కులకు లోబడి ఉన్న అర్హులైన వారందరికి రోస్టర్ ప్రకారం ఒక్కో పోస్టునకు ముగ్గురు అభ్యర్థులను పిలిచి ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేస్తారు. -
దోపిడీకి పాల్పడిన ఇద్దరి అరెస్టు
విశాఖపట్నం, న్యూస్లైన్: అద్దెకు ఇల్లు కావాలని వెళ్లి ఇల్లు చూపిస్తున్న మహిళ మెడలోని పుస్తెల తాడు తెంచేయడమేకాక ఆమెపై హత్యాయత్నం చేసిన ఇద్దరు వ్యక్తులను పెందుర్తి క్రైం పోలీసులు బుధవారం అరెస్టుచేసి రిమాండ్కు తరలించారు. కమిషనరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నార్త ఏసీపీ సి.ఎం.నాయుడు తెలిపిన వివరాలివి. పెందుర్తి బ్రాహ్మణ వీధిలో ఆళ్ల సత్యనారాయణకు ఓ ఇల్లుంది. ఈ ఇంటిని ఎవరైనా అద్దెకు అడిగితే ఇవ్వాలంటూ తాళాలను ఆయన వీధిలో ఉన్న పీలా జయలక్ష్మికి అప్పగించారు. ఈనెల 14వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళికి చెందిన కింజరాపు రాములు (33), బాలి చంద్రశేఖర్ అలి యాస్ శేఖర్ (20)లు అద్దెకు ఇల్లుందా అంటూ జయలక్ష్మిని సంప్రదించారు. ఆమె అదే వీధిలో ఉంటున్న దొడ్డి సత్యవతికి తాళాలు ఇచ్చి వచ్చిన వారికి ఇల్లు చూపించాలని కోరింది. దీంతో సత్యవతి రాములు, శేఖర్ను రెండో అంతస్తులో ఉన్న ఇల్లు చూపించేందుకు తీసుకువెళ్లింది. గది తలుపుతీసి సత్యవతి ఇంటిలోకి వెళ్లగా రాముల్ని బయట నిలబడమని చెప్పి చంద్రశేఖర్ గదిలోకి వెళ్లాడు. సత్యవతి వెనుకగా వెళ్లి ఆమె నోట్లో గు డ్డలు కుక్కి మెడలో ఉన్న నాలుగు తులా ల పుస్తెలతాడును తెంచేశాడు. ఈ హఠాత్పరిణామంతో అవాక్కయిన సత్యవతి గట్టిగా కేకలు వేయడంతో నిందితులిద్ద రూ ఆమెను పీకనులిమి చంపే ప్రయత్నం చేశారు. చాలాసేపైనా సత్యవతి రాకపోవడంతో అనుమానం వచ్చిన జయలక్ష్మి మేడపైకి వెళ్లగా అక్కడ సత్యవతిపై హత్యాయత్నం జరుగుతుండడాన్ని చూసి గట్టిగా అరిచింది. దీంతో నిందితులిద్దరూ సత్యవతిని వదిలేసి 16 అడుగుల మేడపై నుంచి దూకి పారిపోయారు. బాధితురాలి కుమారుడు దొడ్డినరసింగరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్రైం సీఐ ఎస్.అడమ్, ఎస్ఐ ప్రసాద్లు ఘ టనా స్థలికి చేరుకుని విచారణ జరిపారు. స్థానికులు తెలిపిన ఆధారాల మేరకు నిందితులపై నిఘా పెట్టారు. బుధవారం నిందితులు విశాఖ నగరానికి వెళ్లేందుకు పెందుర్తి రైల్వేస్టేషన్లో వేచి ఉండగా అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి పుస్తెలతాడును స్వాధీనం చేసుకున్నారు. ఈజీ మనీ కోసం... నిందితుల్లో రాము ఆర్టీసీలో డ్రైవర్. ఉద్యోగాలిప్పిస్తానని చెప్పి పలువురి వద్ద నుంచి రూ.3 లక్షలు వసూలు చేసినట్లు ఆరోపణలు రావడంతో యాజమాన్యం ఉద్యోగం నుంచి తొలగించింది. డబ్బుల కోసం ఒత్తిడి పెరగడంతో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. చంద్రశేఖర్ బీకాం చదువుతున్నాడు. నాలుగు నెలల క్రితమే ఇద్దరి మధ్యా స్నేహం కుదిరింది. సులువుగా డబ్బు సంపాదించేందుకు ఇద్దరూ ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు పోలీసులు తెలిపారు.