ravulapalem
-
అవినీతి అందిపుచ్చుకుంటూ..
రావులపాలెం: కుర్చీ మహిమో.. చేతినిండా సంపాదించాలనే తాపత్రయమో.. అవినీతి మరకను ఒకరి తర్వాత ఒకరు పుచ్చుకుంటూ తలవంపులు తెస్తున్నారు. ప్రతి పనికీ చేయిచాపి, చివరికి ఏసీబీ వలకు చిక్కుతూ ఉన్న పరువును రచ్చకెక్కిస్తున్నారు. ఇప్పుడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జిల్లాలోని రావులపాలెం పోలీస్ స్టేషన్ అంతటా హాట్టాపిక్గా మారింది. ఐదు నెలల వ్యవధిలోనే ఇక్కడ పనిచేసిన అధికారులు ఇద్దరు లంచం తీసుకుంటూ దొరికిపోవడం చర్చనీయాంశం అయ్యింది. నాడు ఎస్సై అవినీతికి పాల్పడుతూ వలలో చిక్కుకోగా, నేడు అదే స్థానంలో బాధ్యతలు నిర్వహిస్తున్న సీఐ ఏసీబీకి పట్టుబడటం గమనార్హం. ఆ వివరాల్లోకి వెళ్తే.. గతంలో రావులపాలెం పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓకి ఎస్సై ర్యాంకు అధికారి ఉండేవారు. కొత్త జిల్లా ఏర్పడిన తర్వాత ఈ స్టేషన్ను అప్గ్రేడ్ చేసి ఎస్సై స్థానంలో సీఐ స్థాయి అధికారిని నియమించారు. గత జనవరిలో ఇదే స్థానంలో ఎస్సై హోదాలో ఉన్న అప్పటి ఎస్సై ఎం.వెంకటరమణ ఒక కేసులో 41 నోటీస్ జారీ చేసే విషయంలో ముద్దాయిని స్టేషన్కు పిలిచి చార్జిïÙట్లో తక్కువ శిక్షపడేలా సెక్షన్లు మార్చి సహాయ పడతానంటూ, ఆ కేసులో అనపర్తి మండలం పొలమూరుకు చెందిన సత్తి విజయరామకృష్ణారెడ్డి నుంచి రూ. లక్ష డిమాండ్ చేశారు. దానికి బాధితుడు అంగీకరించకపోవడంతో రూ.25 వేలు ఇవ్వాలని డిమాండ్ చేసి ఆ సొమ్ము తీసుకుంటూ అప్పటి ఎస్సై వెంకటరమణ, కంప్యూటర్ ఆపరేటర్ సత్యప్రసాద్లు ఏసీబీకి చిక్కారు. జనవరి 9న ఈ ఘటన జరగ్గా, అదే నెలలో 13న అప్గ్రేడ్ స్టేషన్గా మారిన రావులపాలెం పోలీస్ స్టేషన్కు సీఐగా తణుకు రూరల్ నుంచి బదిలీపై వచ్చిన సీహెచ్ ఆంజనేయులు బాధ్యతలు స్వీకరించారు. మొదటి నుంచీ సీఐపై పలు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఎన్నికల అనంతరం తిరిగి పశి్చమ గోదావరి జిల్లా వెళ్లేందుకు ఇప్పటికే సీఐ సన్నాహాలు చేసుకున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో పాత కేసుల్లో నిందితుల నుంచి సొమ్ము దండుకోవాలనే లక్ష్యంతో వారం రోజులుగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. దీనికోసం కిందిస్థాయి సిబ్బందితో వివిధ కేసుల్లో బాధితులకు ఫోన్లు చేయించి స్టేషన్కు రావాలని పిలుపిస్తున్నారు. గతనెల 16న రావులపాలెం మండలం పొడగట్లపల్లి వద్ద కోడిపందేల శిబిరంపై పోలీసులు దాడి చేసి, పలువురిని అరెస్ట్ చేయడంతో పాటు, వాహనాలు, కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో లక్ష్మణరాజును రూ.50 వేలు ఇవ్వాలని పలుమార్లు బాధించడంతో, అతను విసిగిపోయి రాజమహేంద్రవరం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో శనివారం స్థానిక పోలీస్ స్టేషన్లో అతని నుంచి రూ.50 వేల లంచాన్ని తీసుకుంటూ సీఐ ఆంజనేయులు ఏసీబీ అధికారులకు చిక్కాడు. వెసులుబాటును అస్త్రంగా మలచుకుని.. నాడు ఎస్సై రూ.25 వేలు, నేడు సీఐ రూ. 50 వేలు తీసుకుంటూ పట్టుబడడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది. ఇక్కడకు ఏ అధికారి వచ్చినా అవినీతి మాత్రం తగ్గడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఏడేళ్ల లోపు శిక్షపడే కేసులను కోర్టుకు తీసుకు వెళ్లకుండా 41 నోటీస్ జారీచేసి పంపించే విధంగా చట్టంలో ఉన్న వెసులుబాటును అస్త్రంగా మలచుకుని రూ. వేలల్లో డబ్బులు దండుకుంటున్నారన్న ఆరోపణలులు వినిపిస్తున్నాయి. దీనిపై పోలీస్ ఉన్నతాధికారులు, జిల్లాస్థాయి అధికారులు దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. -
ఏసీబీ వలలో రావులపాలెం సీఐ
రావులపాలెం : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం టౌన్ సీఐ సీహెచ్ ఆంజనేయులు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ డి.శ్రీహరిరాజు కథనం ప్రకారం.. గత నెల 16న రావులపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కోడిపందాల కేసు నమోదు చేశారు. మండలంలోని పొడగట్లపల్లిలో నిర్వహించిన కోడిపందాలపై పోలీసులు దాడి చేసి, అప్పట్లో పలువురిని అరెస్టు చేశారు. కొన్ని వాహనాలను, కోళ్లను స్వా«దీనం చేసుకున్నారు.ఈ కేసులో కోడిపందాలు నిర్వహించిన స్థల యజమాని కుంచెర్లపాటి లక్ష్మణరాజు నుంచి సీఐ ఆంజనేయులు అప్పట్లో కొంత మొత్తం లంచంగా తీసుకున్నాడు. అనంతరం చార్జిషీటులో తక్కువ సెక్షన్లు నమోదు చేసేందుకు, లక్ష్మణరాజుపై రౌడీ షీట్ తెరవకుండా ఉండేందుకు మరో రూ.50 వేలు లంచం ఇవ్వాలని పలుమార్లు డిమాండ్ చేశాడు.దీంతో విసిగిపోయిన లక్ష్మణరాజు రాజమహేంద్రవరం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారుల పథకం ప్రకారం సీఐ ఆంజనేయులుకు లక్ష్మణరాజు స్థానిక పోలీస్ స్టేషన్లో శనివారం రూ.50 వేలు లంచం ఇచ్చాడు. ఆ మొత్తాన్ని తీసుకుంటున్న సీఐ ఆంజనేయులును అక్కడే మాటు వేసిన ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఏసీబీ డీఎస్పీ శ్రీహరిరాజు తెలిపారు. -
జననేత కోసం పోటెత్తిన రావులపాలెం జనం
-
రావులపాలెంలో టీడీపీ సభలో వ్యాపారులపై నోరు జారిన చంద్రబాబు
-
కిరాణా దుకాణాల్లో గంజాయి అమ్మకాలు.. చంద్రబాబుకు మరో వర్గం దూరం..
-
ఫొటోగ్రాఫర్ దారుణ హత్య
ఆలమూరు/మధురవాడ/పీఎం పాలెం : సోషల్ మీడియాలో పరిచయం పెంచుకుని ఈవెంట్ చేద్దామని పిలిచి, స్నేహితుడితో కలిసి ఓ ఫొటోగ్రాఫర్ను హత్య చేసిన దారుణ ఘటన ఇది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. విశాఖ మధురవాడ సమీపంలోని బక్కన్నపాలేనికి చెందిన పోతిన సాయి(21)కి ఫొటోలు, వీడియోలు తీయడం హాబీ. అతడికి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మూలస్థాన అగ్రహారం గ్రామానికి చెందిన షణ్ముఖ తేజతో సోషల్ మీడియాలో పరిచయమేర్పడింది. ఈ క్రమంలో సాయి వద్ద రూ.12.70 లక్షల విలువైన కెమేరాలు, ఇతర పరికరాలున్నాయని తేజ గుర్తించాడు. వాటిని ఎలాగైనా స్వా«దీనం చేసుకోవాలనే దుర్బుద్ధి పుట్టడంతో అతడు పన్నాగం పన్నాడు. ఈ క్రమంలో తాను కూడా ఫొటోగ్రాఫర్నని, ఏవైనా ఈవెంట్లు ఉంటే కలసి చేద్దామని సాయిని నమ్మించాడు. రాజమహేంద్రవరంలో ఈవెంట్ ఉందని సాయిని తేజ నమ్మించాడు. సాయి గత నెల 26వ తేదీ మధ్యాహ్నం విలువైన కెమేరాలు, పరికరాలతో రైల్లో రాజమహేంద్రవరం చేరుకున్నాడు. అప్పటికే తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం పొట్టిలంకకు చెందిన స్నేహితుడు వినోద్కుమార్తో తేజ రైల్వేస్టేషన్లో వేచి ఉన్నాడు. అద్దెకు తీసుకున్న కారులో సాయిని ఎక్కించుకుని, సొంతంగా డ్రైవింగ్ చేసుకుంటూ సాయంత్రానికి వేమగిరి చేరుకున్నారు. పథకం ప్రకారం అక్కడే సాయిని తేజ, వినోద్కుమార్లు హత్య చేసి మృతదేహాన్ని అదే రోజు అర్ధరాత్రి 216ఎ జాతీయ రహదారిపై ఉన్న జొన్నాడ గ్రామం వరకూ వచ్చి.. అక్కడి గౌతమీ గోదావరి తీరంలో పూడ్చివేశారు. అనుమానం వచ్చిందేమో! కారులో తనను ఇష్టానుసారంగా తిప్పడం వల్లో ఏమోగానీ తేజపై సాయికి అనుమానం వచ్చింది. మధ్యలో కారు ఫొటోతో పాటు తేజ ఫోన్ నంబర్ను కూడా తన తల్లి రమణమ్మకు వాట్సాప్లో పంపాడు. ఈ నేపథ్యంలో మూడు రోజులైనా సాయి ఇంటికి రాకపోవడం, అతడి ఫోన్, తేజ ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ కావడంతో సాయి తల్లిదండ్రులు గత నెల 29న విశాఖపట్నం పోతినమల్లయ్యపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి కారు యజమానిని ప్రశి్నంచి కొంత సమాచారం రాబట్టారు. కాగా, విశాఖ కంచరపాలేనికి చెందిన యువతితో తేజ చాటింగ్ చేస్తున్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. యువతిని విచారించగా.. ఈ హత్యాపన్నాగం బయట పడినట్లు తెలుస్తోంది. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. మృతదేహాన్ని పూడ్చిన ప్రదేశాన్ని గుర్తించిన పోలీసులు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
బీసీ, దళిత, మైనారిటీలను అణగదొక్కేందుకే చంద్రబాబు కుట్ర..
-
మిద్దెతోట పెంపకంలో ఆదర్శంగా నిలుస్తున్న సిద్దిపేట దంపతులు
-
కోనసీమ నుంచి తమిళ సీమకు.. అరటిపండ్లలో ఈ అరటి వేరయా..!
‘అరటిపండ్లలో ఎర్ర చక్కెరకేళి అరటి వేరయా..’ అంటారు పండించే రైతులు, వైద్యనిపుణులు. సాధారణ అరటి కన్నా మిన్నగా అరుదైన పోషకాలు ఉండే ఈ పండును ఆరోగ్యదాయినిగా భావిస్తారు. పండించే రైతుకు నిలకడైన ఆదాయాన్ని అందించే ఈ రకం అరటికి చెన్నై మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. గోదావరి లంకల్లో పండే ఈ రకం అరటి తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు ఎగుమతి అవుతోంది. ఈ ఎగుమతుల విలువ ఏటా కోట్లలో ఉంటోంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం పరిధిలో ఎర్ర చక్కెరకేళి సాగు అధికం. కొత్తపేట, ఆత్రేయపురం, రావులపాలెం, అలమూరుతో పాటు అయినవిల్లి, అంబాజీపేట మండలాల్లో ఈ రకం పంటను సాగుచేస్తారు. తూర్పు గోదావరి జిల్లా పెరవలి, పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ, తణుకు ప్రాంతాల్లో కూడా ఈ రకం అరటి సాగు ఎక్కువే. ఈ మూడు జిల్లాల్లో సుమారు రెండువేల ఎకరాల్లో ఈ పంట సాగవుతోందని అంచనా. ఎకరాకు 700 నుంచి 800 చెట్ల వరకు పెంచుతారు. అధికంగా గోదావరి లంక భూముల్లో ఈ పంటను సాగుచేస్తారు. ఇక మైదాన ప్రాంతంలోని కొబ్బరి తోటల్లో అంతరపంటగా కూడా వేస్తారు. – సాక్షి, అమలాపురం ధర ఘనం ఎర్ర చక్కెరకేళి అరటిపండుకు మంచి డిమాండ్ ఉంది. దీని గెల ధర ఏడాదిలో సగటున రూ.350 వరకు ఉంటోంది. డిమాండ్ అధికంగా ఉన్నప్పుడు రూ.400 నుంచి రూ.500 వరకు పలుకుతోంది. ప్రస్తుతం రావులపాలెం మార్కెట్లో గెల సైజును బట్టి రూ.200 నుంచి రూ.500 వరకు ధర ఉంది. అప్పుడప్పుడు ధరలు నేల చూపులు చూసినా సీజన్లో ఢోకా ఉండదని చెబుతున్నారు. కర్పూరం, చక్కెరకేళి, అమృతపాణి వంటి రకాలతో పోలిస్తే ఎర్ర చక్కెరకేళీకి నిలకడైన ధర ఉంటోంది. రావులపాలెం కేంద్రంగా.. ఈ మూడు జిల్లాల్లో పండే అరటిపంటను రావులపాలెం మార్కెట్ యార్డు నుంచి ఎగుమతి చేస్తుంటారు. ఇక్కడి నుంచే ఎర్ర చక్కెరకేళి అధికంగా తమిళనాడు, తక్కువ మొత్తంలో కేరళకు ఎగుమతి అవుతోంది. సాధారణంగా ఫిబ్రవరిలో మొదలయ్యే సీజన్ ఆగస్ట్ వరకు ఉంటుంది. ప్రస్తుతం రోజుకు 6 నుంచి 10 వ్యాన్ల గెలలు ఎగుమతి అవుతున్నాయి. ఒక్కో వ్యాన్లో 350 వరకు గెలలుంటాయి. వీటివిలువ సుమారు రూ.10 లక్షలు ఉంటుందని అంచనా. ఏటా రూ.52 కోట్ల మేర ఎర్ర చక్కెరకేళి ఎగుమతులు జరుగుతాయి. సీజన్లో యార్డు వద్దకు రాకుండా నేరుగా రైతు తోటల వద్ద నుంచే రవాణా చేస్తుంటారు. పోషకాలు అధికం ఎర్ర చక్కెరకేళి అరటిలో ఎక్కువగా ఉన్న పొటాషియం ఎంతో మేలు చేస్తుంది. ఈ అరటి శరీరంలో క్యాల్షియం పెంచుతుంది. ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. సాధారణ అరటిపండ్లలో కన్నా దీన్లో పోషకాలు అధికం. ఖనిజాలు, విటమిన్లు, పీచు పదార్థాలు, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. ఇతర అరటిపండ్ల కన్నా బీటా కెరోటిన్ అధికం. ఇది గుండె ధమనుల్లో రక్తం గడ్డకట్టకుండా చూస్తుంది. తక్కువ కేలరీలు ఉన్నందున బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఆహారం. విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం. హిమోగ్లోబిన్ శాతాన్ని గణనీయంగా పెంచుతుంది. సాగులో ప్రతికూలతలు ఎర్ర చక్కెరకేళి సాగుకు కొన్ని ప్రతికూలతలున్నాయి. సాధారణ అరటి దిగుబడి ఎనిమిది నెలలకే మొదలవుతుంది. ఇది ఏడాదిన్నర సమయం పడుతుంది. కార్శి తోటగా సాగుచేయడం పెద్ద ప్రయోజనకరం కాదు. బలమైన పోషకాలున్న నేలలు అవసరం. ఇతర అరటి రకాల కన్నా ఎరువులు, పురుగుమందులు అధికంగా వినియోగించాలి. పెట్టుబడి సైతం ఎకరాకు రూ.లక్ష అవుతుంది. చెట్టు ఎత్తు పెరుగుతున్నందున తుపాన్లు, భారీ వర్షాలు, వరదల సమయంలో పడిపోయే ప్రమాదం ఎక్కువ. తమిళనాడు ఎగుమతులపైనే వ్యాపారం రావులపాలెం మార్కెట్ యార్డ్కు వచ్చే అరటిగెలల్లో 10 శాతం ఎరుపు చక్కెరకేళి అరటి గెలలు ఉంటాయి. ఇవి ఎక్కువగా తమిళనాడుకు, తక్కువగా కేరళకు ఎగుమతి అవుతాయి. స్థానికంగా కొనుగోలు చేయడం చాలా తక్కువ. తమిళనాడు మార్కెట్పైనే ఇక్కడ వ్యాపారం ఆధారపడి ఉంటోంది. కానీ దీనికి నిలకడైన ధర మాత్రం దక్కుతోంది. – కోనాల చంద్రశేఖరరెడ్డి, అరటి వ్యాపారి, రావులపాలెం పెట్టుబడి అధికం ఎర్ర చక్కెరకేళి సాగులో పెట్టుబడి అధికం. ఇతర అరటి రకాల సాగు కన్నా ఎకరాకు రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకు అధికం. పంటకాలం కూడా ఎక్కువ. ఒకసారి మాత్రమే మంచి దిగుబడి వస్తుంది. కార్శి పంట దిగుబడి పెద్దగా రానందున గిట్టుబాటు కాదు. కానీ ధర మాత్రం లాభసాటిగా ఉంటోంది. మంచి దిగుబడి వచి్చ, రికార్డుస్థాయి ధర ఉన్నప్పుడు మాత్రం ఎకరాకు రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు లాభం వస్తోంది. – పెదపూడి బాపిరాజు, రైతు, వాడపాలెం, కొత్తపేట మండలం ఆరోగ్యానికి ఎంతో మేలు ఎరుపు రకం అరటిపండ్లలో చక్కెరకేళి రకంలో ఇతర రకాల అరటిపండ్ల కన్నా వైవిధ్యకరమైన పోషకాలున్నాయని గుర్తించారు. బీటా కెరోటిన్ అనే పిగ్మెంట్ మిగిలిన పండ్ల కన్నా ఎక్కువగా ఉంటుంది. అధికంగా పొటాషియం, విటమిన్ సీ, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. రక్తపోటు, ఒబేసిటీ బాధితులకు ఇది మంచిది. – వడ్డాది సురేశ్, ఎండీ జనరల్, వడ్డాది ఆస్పత్రి, రాజమహేంద్రవరం -
బిగ్షాట్లే టార్గెట్: కిడ్నాపులు, హత్యలే అతడి నైజం
సాక్షి, అమలాపురం టౌన్: కోటీశ్వరులను ఎంచుకుని అతడు తొలుత బెదిరింపులకు పాల్పడతాడు. దారికి రాకపోతే కిడ్నాపులు చేస్తాడు. దానికీ దిగిరాకపోతే హత్యలకు సైతం తెగబడతాడు. ఐ.పోలవరం మండలానికి చెందిన త్రినాథవర్మ ఒకటిన్నర దశాబ్దాల నేర చరిత్ర ఇది. గత నెలలో రావులపాలెంలోని ఓ ఫైనా న్స్ వ్యాపారి ఇంటి వద్ద తుపాకితో కాల్పులకు తెగబడ్డ ఘటనలో ఇతడే ప్రధాన నిందితుడని పోలీసులు గుర్తించారు. రెండు రోజుల కిందట అరెస్టు చేసి, రిమాండుకు తరలించారు. పోలీసు రికార్డుల ప్రకారం ఒకటిన్నర దశాబ్దాల కాలంలో త్రినాథవర్మ రెండు హత్యలు, నాలుగు కిడ్నాపులకు పాల్పడ్డాడు. 2011 ఆగస్టు 28న అమలాపురంలో ఆక్వా రైతు కేవీ సత్యనారాయణరాజును డబ్బుల కోసం కిడ్నాప్ చేశాడు. శ్రీశైలం అటవీ ప్రాంతానికి తీసుకు వెళ్లి సత్యనారాయణరాజుకు సజీవదహనం చేశాడు. సాక్ష్యాధారాలు మా యం చేశాడు. అలాగే హైదరాబాద్కు చెందిన మరో ధనికుడిని డబ్బుల డిమాండ్ చేశాడు. చివరకు అతడి ని కూడా కిడ్నాప్ చేసి, హతమార్చాడు. అప్పట్లో ఈ కేసు అమలాపురంలో సంచలనం రేపింది. డబ్బుల డిమాండ్ చేస్తూ బెదిరింపులు, కిడ్నాప్లకు సంబంధించి త్రినాథవర్మపై నాలుగు కేసులు ఉన్నాయి. డబ్బుల కోసమే రావులపాలెం కాల్పులు రావులపాలెంలో పైనాన్షియర్ గుడిమెట్ల వెంకట సత్యనారాయణరెడ్డి (కాటా బాస్) కుమారుడు ఆదిత్యరెడ్డిని కూడా బెదిరించి డబ్బులు గుంజాలనే లక్ష్యంతోనే గత నెల ఐదున త్రినాథవర్మ గ్యాంగ్ వెళ్లింది. ఆదిత్యరెడ్డి అనూహ్యంగా ఎదురు తిరగడంతో దుండగులు తుపాకి కాల్పులకు తెగబడ్డారు. ఈ తరహా నేరాలకు త్రినాథవర్మే సూత్రధారి అని, అతడి అనుచరులు పాత్రధారులని పోలీసులు చెబుతున్నారు. పోలీసు తనిఖీల్లో వర్మ రెండుసార్లు తుపాకులతో పట్టుబడ్డాడు. రావులపాలెం కాల్పుల ఘటనకు సంబంధించి జిల్లా ఎస్పీ సీహెచ్ సుధీర్కుమార్రెడ్డి ఆధ్వర్యంలో డీఎస్పీ వై.మాధవరెడ్డి, రావులపాలెం ఇన్చార్జి సీఐ డి.ప్రశాంతకుమార్లు ఈ కేసులో తీగ లాగారు. దీంతో త్రినాథవర్మ నేరాల డొంక కదిలింది. అతడిని విచారణ నిమిత్తం తమ కస్టడీకి ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరుతున్నారు. -
కోనసీమ జిల్లాలో తుపాకీ కాల్పుల కలకలం
సాక్షి, రావులపాలెం (కోనసీమ జిల్లా): డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కాల్పులు కలకలం రేగింది. రావులపాలేనికి చెందిన ఫైనాన్స్ వ్యాపారి సత్యనారాయణరెడ్డి ఇంటికి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారు. వారిని చిన్న కుమారుడు ఆదిత్యరెడ్డి చూసి ఎవరంటూ ప్రశ్నించారు. దీంతో ఆయనపై కాల్పులు జరిపి దుండగులు పరారయ్యారు. కాల్పుల్లో ఆదిత్యరెడ్డి చేతికి గాయాలయ్యాయి. ఆదిత్యరెడ్డి ఎదురు తిరగడంతో గన్, బ్యాగ్ వదిలి దుండగులు పరారయ్యారు. దుండగులు వదిలి వెళ్లిన బ్యాగ్లో నాటు బాంబులు లభ్యమయ్యాయి. చదవండి: ఆ వెబ్సైట్ను చూస్తుండగా వాట్సాప్కు వీడియో.. తీరా చూస్తే అందులో.. -
తమలపాకు.. పోక సాగు చేస్తున్న కోనసీమ రైతులు
సాక్షి, అమలాపురం: కోనసీమలో పండే కొబ్బరి.. కోకో... చేపలు... రొయ్యలకే కాదు. ఇక్కడ పండే తమలపాకు, పోక (వక్క)కు సైతం దేశంలో మంచి డిమాండ్ ఉంది. తమలపాకు, పోకకు ఉత్తర... దక్షిణ భారత దేశంలోని పలు రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. ఒకప్పటి తమలపాకు సాగు విస్తీర్ణం తగ్గినా... అడపాదడపా ధరలు తగ్గుతున్నా కూడా ఇక్కడ తమలపాకు పలు రాష్ట్రాలకు ఎగుమతి అవుతోంది.. పోక సైతం ఉత్తర, దక్షిణ భారతాలకు ఎగుమతి అవుతుండడం గమనార్హం. ఇక్కడ నుంచి ఎగుమతి అవుతున్న ఈ రెండు పంటల విలువ నెలకు రూ.రెండు కోట్లు ఉంటుందని అంచనా. ఉత్తరాదికి కోనసీమ తమలపాకు పి.గన్నవరం, రావులపాలెం, అయినవిల్లి లంక గ్రామాల్లో తమలపాకు సాగు జరుగుతోంది. సాగు విస్తీర్ణం తగ్గినా ఇక్కడ 218.24 ఎకరాల్లో పంట పండుతోంది. గన్నవరం లంకలను ఆనుకుని పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోకి వచ్చే చాకలిపాలెం, కనకాయిలంక, దొడ్డిపట్ల వంటి ప్రాంతాల్లో పండే తమలపాకు సైతం ఈ జిల్లా నుంచే ఎగుమతవుతోంది. మహారాష్ట్రలోని ముంబై, పూనే, నాగపూర్, అమరావతి, బుషావళీ, యావత్మాల్కు వెళుతోంది. అక్కడి నుంచి గుజరాత్లోని సూరత్, వడోదర, అహ్మదాబాద్, మధ్యప్రదేశ్లోని కాండ్వా, ఇండోర్లతోపాటు ఛత్తీస్గఢ్లకు మన తమలపాకును ఎగుమతి చేస్తారు. పొన్నూరు, కళ్లీ, పావడ రకాలు చేస్తున్నారు. గతంలో ఇక్కడ నుంచి రోజుకు సగటున రెండు లారీల చొప్పున ఎగుమతి కాగా, ఇప్పుడు పశ్చిమ నుంచి వచ్చే ఆకుతో కలిపి రోజుకు ఒక లారీ ఎగుమతి జరుగుతోంది. బుట్టకట్టుబడి కళాత్మకం ఇతర రాష్ట్రాలకు తమలపాకు ఎగుమతి చేసేందుకు వెదురుబుట్టలలో వట్టిగడ్డి వేసి తడిపిన 150 తమలపాకును ఒక మోద (పంతం) చొప్పున కట్టుబడి కడతారు. ఇది ఎంతో కళాత్మకంగా ఉంటుంది. బుట్టకు వచ్చి 20 మోదలు (3వేల) ఆకులుంటాయి. అన్ సీజన్ కావడంతో బుట్ట ధర రూ.600 వరకు ఉంది. ఈ ఏడాది సీజన్లో రూ.1,200 వరకు పలికింది. స్థానికంగా ఎగుమతి చేసే తమలపాకును పెద్దబుట్టలో 100 మోదలు (15 వేల ఆకులు)లు ఉంచి ఎగుమతి చేస్తారు. కేరళకు కోనసీమ వక్క కోనసీమలో అంబాజీపేట, పి.గన్నవరం, అయినవిల్లి, కొత్తపేటతోపాటు ద్వారపూడి మండలాల్లో సుమారు 386 ఎకరాలలో పోక సాగు జరుగుతోంది. కొబ్బరి తోటల్లో గట్ల మీద విరివిరిగా కూడా సాగవుతోంది. దేశవాళీ రకం మల్నాడు (కర్ణాటక రకం), హైబ్రీడ్లో మంగళ, సుమంగళను సాగుచేస్తున్నారు. ఇక్కడి నుంచి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిస్సాకు పోక అధికంగా ఎగుమతి అవుతోంది. పోక విస్తృతంగా పండే కేరళలో దిగుబడి తగ్గడంతో ఇక్కడ నుంచి ఆ రాష్ట్రానికి ఎగుమతి అవుతుండడం విశేషం. ప్రస్తుతం దీని ధర కేజీ రూ.400 వరకు ఉంది. ఎర్రచెక్కలు (పూజా సుపారీ) తయారీ ప్రత్యేకం. పోక చెక్కలను మరిగేనీటిలో కవిరి, సున్నంతో కలిపి ఉడకబెడతారు. ఇలా చేయడం వల్ల పోక చెక్కలకు ఎరుపు రంగు వస్తోంది. ఎర్రచెక్కల కేజీ ధర రూ.450 నుంచి 500 వరకు ఉంటుంది. కిళ్లీలకు అధికం కోనసీమ నుంచి వెళుతున్న తమలపాకు, వక్కలను కిళ్లీల తయారీలో ఎక్కువగా వినియోగిస్తారు. గోదావరి నీటి మాహత్మ్యమో ఏమో కాని కోనసీమలో పండే తమలపాకు రుచి బాగుంటుందని ఉత్తరాది వ్యాపారులు దీని కొనుగోలుకు ఆసక్తి చూపుతారు. వీటితో తయారు చేసే కిళ్లీలకు డిమాండ్ ఎక్కువ. ఉత్తర, దక్షణాదిలలో జరిగే శుభ కార్యక్రమాలలో సైతం వీటి వినియోగం ఎక్కువ. పంట తగ్గినా డిమాండ్ ఉంది మన ప్రాంతంలో పండే తమలపాకుకు మహారాష్ట్రలో మంచి డిమాండ్ ఉంది. అక్కడ నుంచే మిగిలిన రాష్ట్రాలకు వెళుతోంది. మన దగ్గర లేకపోతేనే మిగిలిన ప్రాంతాల్లో కొంటారు. ఇప్పుడు సీజన్ కాకపోవడం వల్ల ధర తగ్గింది. పెట్టుబడులు పెరగడం వల్ల తమలపాకు సాగు కష్టాలతో కూడుకున్నదిగా మారిపోయింది. – మయిగాపుల రాంబాబు, గోపాలపురం, రావులపాలెం మండలం స్థానికంగా కూడా డిమాండ్ తమలపాకుకు ఇతర రాష్ట్రాల్లోనే కాకుండా స్థానికంగా కూడా డిమాండ్ ఉంది. ఇక్కడ వ్యాపారులకు పంపాల్సి వస్తే 100 మోదలు పంపుతాము. స్థానికంగా కూడా కిళ్లీలు, పెళ్లిళ్లు వంటి శుభకార్యక్రమాలకు తమలపాకును అధికంగా వినియోగిస్తారు. – గోవిందరాజులు, గోపాలపురం, రావులపాలెం మండలం పూజా సుపారీ ప్రత్యేకం కాయల నుంచి పోక చెక్కలను తయారు చేయడం శ్రమతో కూడుకున్నదే. వక్కలను వేరు చేసి ఎండబెట్టడం, వచ్చిన దానిని గ్రేడ్ చేసి ప్యాకింగ్ చేయడం మేమే చేస్తాం. ఒక విధంగా ఇది శ్రమతో కూడుకున్నదే. పూజా సుపారీని మాత్రం ప్రత్యేకంగా తయారు చేస్తాం. అందుకే దీనికి ఎక్కువ ధర ఉంటుంది. – కడలి దుర్గాభవాని, తయారీదారు, బండారులంక, అమలాపురం మండలం -
రావులపాలెంలో భారీ భద్రత బలగాలు
-
ద్విముఖ రూపుడు.. జగన్మోహనుడు
ఆత్రేయపురం(కోనసీమ జిల్లా): ముందు పురుష రూపం వెనుక భాగాన స్త్రీ రూపంతో ఏకశిలలో శివవిష్ణువులు సాక్షాత్కరించే అద్భుత నిలయం ర్యాలి జగన్మోహినీ కేశవస్వామి ఆలయం. సృష్టికి ఆదిలోనే స్వయంభూ క్షేత్రంగా ఖ్యాతికెక్కిన ఈ పుణ్యక్షేత్రంలో ముందు భాగం కేశవ రూపం, వెనుక భాగం జగన్మోహినీ స్త్రీ రూపం ఆకారంలో స్వయంభువుగా అవతరించాడు. స్త్రీ, పురుష రూపధారణతో కొలువైన శివ, విష్ణు దేవతామూర్తులను దర్శించుకుంటే సర్వపాపాలు హరిస్తాయని భక్తుల విశ్వాసం. ఈ ఆలయంలో మరో విశేషమేమంటే భక్తులందరికీ గర్భాలయ ప్రవేశం ఉండటం. అంతేకాక ఈ ఆలయానికి ఎదురుగానే పడమర వైపు ఉమా కమండలేశ్వర స్వామి శివాలయం ఉండటం ఒక విశేషం. శివాలయంలో నీరు ఇంకిపోవడం, జగన్మోహునుడి ఆలయంలో స్వామి వారి పాదాల నుంచి నిరంతరం గంగ ఉద్భవించడం సృష్టి రహస్యాలుగా చరిత్ర చెబుతుంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నుంచి ర్యాలి చేరుకునేందుకు గంట సమయం పడుతుంది. రావులపాలెం చేరుకున్న భక్తులు అక్కడ నుంచి ఊబలంక మీదుగా ర్యాలి చేరుకునేందుకు 6 కిలోమీటర్లు ప్రయాణం చేయవలసి వుంటుంది. రావులపాలెం బస్టాండ్ నుంచి రెండు గంటలకోసారి ఆర్టీసీ బస్ సౌకర్యం ఉండడంతో పాటు ప్రైవేటు వాహనాల ద్వారా ర్యాలి దివ్య క్షేత్రానికి చేరుకోవచ్చు. కల్యాణ మహోత్సవ కార్యక్రమాలు 10న ఉదయం స్వామికి ప్రత్యేక పూజలు, మధ్యాహ్నం గరుడ వాహనసేవ, రాత్రి 9 గంటలకు స్వామి వారి కల్యాణం, 14న సదస్యం, 16న చక్రస్నానం, 17న శ్రీపుష్పోత్సవంతో కల్యాణ మహోత్సవ కార్యక్రమాలు ముగుస్తాయని ఆలయ ఈవో బి.కృష్ణ చైతన్య తెలిపారు. -
ఆలయ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు: మంత్రి వెల్లంపల్లి
-
తందూరీ టీ.. దీని కథేంటీ.. ఎలా తయారు చేస్తారో తెలుసా..?
కొత్తపేట/రావులపాలెం(తూర్పుగోదావరి జిల్లా): బెల్లం టీ, అల్లం టీ, గ్రీన్ టీ, లెమన్ టీ, మిరియాల టీ వంటి వివిధ రకాల టీల గురించి విన్నాం.. తాగుతున్నాం.. భిన్న రుచులను ఆస్వాదిస్తున్నాం. కానీ ఈ తందూరీ చాయ్ (టీ) ఏమిటనుకుంటున్నారా! ఇదో కొత్త రకం చాయ్.. సహజంగా అందరికీ తందూరీ అనే పదం చికెన్ వంటకాల్లో వింటాం. కోడి మాంస ప్రియులకు ఈ పదం గురించి బాగా తెలుస్తుంది. రెస్టారెంట్లలో కోడిని శుభ్రం చేసి, నిప్పులపై కాల్చి వండి తందూరీగా అందిస్తారు. మరి ఇక్కడ చాయ్లో తందూరీ ఏమిటనే సందేహం కలుగుతుంది కదా... చాయ్ను కూడా నిప్పుల పైనే తయారు చేస్తారు. దీని కథా కమామీషు ఏమిటో తెలుసుకోవాలంటే రావులపాలెం అక్షర సినిమా థియేటర్స్ సమీపాన తందూరి చాయ్ సెంటర్కు వెళ్లాల్సిందే. చదవండి: ఆరేసుకోబోయి పారేసుకున్న బీజేపీ నేతలు.. వీడియో వైరల్ ఇలా చేస్తున్నారు.. మట్టితో తయారు చేసిన గ్లాసులను ఎర్రగా కాల్చేందుకు ఇనుప పీపాలో కొలిమి మాదిరిగా ఏర్పాటు చేశారు. దీనిలో బొగ్గులు వేసి రోజంతా మండేలా తయారు చేశారు. ఎర్రగా బట్టీల్లో ఇటుకలా కాలుస్తుంటారు. సాధారణ టీ మాదిరిగానే పాలు, పంచదార, టీ పొడి, నీళ్లతో కలిపి తయారు చేసి దానిని జార్లోకి తీసుకుని కొలిమి వద్దకు తీసుకువస్తారు. కొలిమిలో ఎర్రగా కాలుతున్న మట్టి గ్లాసును బయటకు తీసి ఒక ఇత్తడిపాత్రలో ఉంచుతారు. ఎర్రటి మట్టి గ్లాసులోకి ఆ చాయ్ పోస్తారు. వెంటనే అది మట్టిపాత్ర వేడికి పొగలు చిమ్ముతూ, నురగలుగా పొంగుతుంది. అలా పొంగిన చాయ్ ఇత్తడి పాత్రలో చేరుతుంది. స్వచ్ఛమైన మట్టిలో మరిగిన చాయ్కు తందూరి రుచి.. వాసన వస్తుంది. ఆ పాత్ర నుంచి మళ్లీ మట్టి గ్లాసులో పోసి విక్రయిస్తున్నారు. దీనిని తాగేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపుతున్నారు. మంచి టేస్ట్ రిలాక్స్గా.. యాంత్రిక జీవనంలో పని ఒత్తిడి నుంచి కాస్త రిలాక్స్ కోసం చాలా మంది చాయ్ తాగుతుంటారు. ఏదైనా పనిలో ఉన్నప్పుడు చురుకుదనం, ఉత్సాహాన్ని పొందేందుకు చాలా మందికి చాయ్ని ఆస్వాదించడం అలవాటు. ఇప్పుడు మార్కెట్లో అనేక రకాల చాయ్లు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో కొన్ని ఆరోగ్యపరంగా తయారు చేస్తుంటే, కొన్ని రుచి కోసమే తయారు చేస్తున్నారు. ఫిల్టర్ టీ, కాంటినెంటల్ టీ, స్ట్రాంట్ టీ, ధమ్ టీ పేర్లతో రకరకాలుగా అందిస్తున్నారు. రావులపాలెంలో యువకులు కొత్తగా ఆలోచించి ఉత్తరాది తందూరి చాయ్ను ఇక్కడ తయారుచేస్తూ స్థానికులను, టీ ప్రేమికులను ఆకట్టుకుంటున్నారు. ఇదేవిధంగా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కూడా కొందరు తందూరీ చాయ్ తయారు చేస్తూ టీ ప్రేమికులను ఆకట్టుకుంటున్నారు. -
ఆరుగురు విలేకరులు అరెస్ట్..
సాక్షి,రావులపాలెం: రావులపాలెం వద్ద జాతీయ రహదారిపై బియ్యం లారీని అడ్డగించి, డ్రైవర్ను, రూ.లక్షల్లో డబ్బులు ఇవ్వాలని సరకు యజమానిని బెదిరించిన ఆరుగురు విలేకరులను అరెస్టు చేసినట్టు అమలాపురం డీఎస్పీ వై.మాధవరెడ్డి తెలిపారు. గురువారం రావులపాలెం పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. ఈ నెల 14 తేదీ తెల్లవారుజామున స్థానిక అరటిమార్కెట్ యార్డు సమీపంలో తణుకు నుంచి రావులపాలెం వస్తున్న బియ్యం లోడు లారీని కొత్తపేట నియోజకవర్గానికి చెందిన ఏడుగురు విలేకరులు ఆపారు. లారీ డ్రైవర్ను కిందకు దిగమని బిల్లులు చూపించాలని బెదిరించారు. డ్రైవర్ బిల్లులు చూపించినా ఇవి పీడీఎఫ్ రైస్, మీ ఓనర్కు ఫోన్ చేయ్, లేకపోతే కేసు పెట్టి జైలుకు పంపుతామని బెదిరించారు. ఫోన్లో రైస్మిల్లు గుమస్తాతో మాట్లాడి రూ.రెండు లక్షలు ఇస్తే లారీని వదులుతామని లేకపోతే సీజ్ చేస్తామని బెదిరించారు. ఈ ఘటనపై సరకు యజమాని గుంటూరుకు చెందిన కె.గంగాధరరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏడుగురిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వీరిలో ఆకొండి వీరవెంకటసత్య సూర్యనారాయణమూర్తి (పశ్చిమవాహిని, తిరుపతి), చిర్రా నాగరాజు (ఆర్టీఐ యాక్ట్ న్యూస్ చానల్), అయినవిల్లి విజయబాబు (అనంత వాయిస్ తెలుగు దినపత్రిక), ఉందుర్తి రవికుమార్ (డీఆర్ఎస్ యూట్యూబ్ చానల్), పలివెల రాజు (జైజనని తెలుగు దినపత్రిక), ఉమ్మిడిశెట్టి వెంకటేశ్వరరావు (గోదావరి దినపత్రిక)లను అరెస్టు చేసి వారి వద్ద నుంచి నాలుగు మోటారు సైకిళ్లు, ఏడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఏడో ముద్దాయి సీహెచ్ రాజేంద్రప్రసాద్ (వి10 న్యూస్ చానల్) పరారీలో ఉన్నాడని అతన్ని పట్టుకోవడానికి ఒక టీమ్ను ఏర్పాటు చేసినట్టు డీఎస్పీ తెలిపారు. ముద్దాయిలను కొత్తపేట జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ వద్ద హాజరు పర్చనున్నట్టు తెలిపారు. సమావేశంలో సీఐ వి.కృష్ణ, ఎస్సై పి.బుజ్జిబాబు, అడిషనల్ ఎస్సై ఆర్. బెన్నిరాజు ఉన్నారు. -
అమ్మ ఎక్కడంటే ఏం చెప్పాలి..
సాక్షి, రావులపాలెం: పండగకు కొత్త వస్త్రాలు తెస్తారని ఎదురుచూస్తున్న పిల్లలకు.. అమ్మ రాదనే విషయాన్ని ఎలా చెప్పాలి.. తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయిందని ఎలా వివరించాలని భార్య మృతదేహం వద్ద భర్త విలపించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది.. సంక్రాంతి పండగకు కొత్త దుస్తులు తీసుకొస్తామని పిల్లలకు చెప్పి ఇంటి నుంచి వెళ్లిన దంపతులు రోడ్డు ప్రమాదానికి గురైన వార్త ఆ ఇంట విషాదాన్ని నింపింది. ప్రమాదంలో భార్య మృత్యువాత పడగా, భర్త గాయాలతో ఆస్పత్రి పాలవడం అందరినీ కలచివేసింది. రావులపాలెం మండలం ఈతకోట జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. చదవండి: ‘చోర్ సింగర్’.. సిటీలోనూ వాంటెడ్ !! పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం చివటం గ్రామానికి చెందిన అద్దంకి విజయ్కుమార్, జ్యోతికుమారి దంపతులు. వారు పిల్లలకు కొత్త దుస్తులు కొందామని మోటార్ సైకిల్పై రావులపాలేనికి వచ్చారు. చిన్నారులైన కొడుకు, కూతుర్లకు సరిపోయే అందమైన దుస్తులు వారికి దొరక్కపోవడంతో తణుకులో కొనుగోలు చేద్దామని సాయంత్రం రావులపాలెం నుంచి తిరుగు పయనమయ్యారు. మార్గ మధ్యంలో ఈతకోట వద్దకు వచ్చేసరికి వెనుక నుంచి వచ్చిన లారీ వారి మోటారు సైకిల్ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కిందపడి పోయిన జ్యోతికుమారి (32)కి తలకు గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. స్వల్ప గాయాలపాలైన విజయ్కుమార్ను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్టు ఎస్సై పి.బుజ్జిబాబు తెలిపారు. పిల్లలకు ఎలా చెప్పేది... పండగకు అమ్మ కొత్త వస్త్రాలు తీసుకొస్తుందని ఇంటి వద్ద ఎదురుచూస్తున్న పిల్లలకు నేనేమి చెప్పాలంటూ భర్త విజయ్కుమార్ సంఘటనా ప్రాంతంలో విలపించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. కొత్త దుస్తులతో పండగ చేసుకుందామని వచ్చి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయావా... నేను పిల్లలను ఎలా పెంచాలి.. వారి ఆలనా పాలనా ఎవరు చూస్తారంటూ ఆయన ఆవేదన చెందాడు. -
ట్యాంకర్ నుంచి గ్యాస్ లీక్
రావులపాలెం: ఎల్పీజీ గ్యాస్తో వెళుతున్న ట్యాంకర్ను క్రేన్తో వెళుతున్న లారీ వెనుకనుంచి ఢీ కొట్టడంతో గ్యాస్ లీకైన ఘటన తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం ఈతకోట టోల్ప్లాజా వద్ద మంగళవారం చోటుచేసుకుంది. పెను ప్రమాదం తప్పటంతో అక్కడి వారంతా ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళితే.. విశాఖపట్నంలోని ఎల్పీజీ ప్లాంట్లో 17,920 కేజీల గ్యాస్ను నింపుకున్న ఒక ట్యాంకర్ హైదరాబాద్లోని చర్లపల్లి హెచ్పీసీఎల్ బాట్లింగ్ ప్లాంట్కు బయలుదేరింది. ఆ ట్యాంకర్ జాతీయ రహదారిపై రావులపాలెం మండలం ఈతకోట టోల్ప్లాజా వద్దకు చేరుకోగా.. దాని వెనుక వస్తున్న లారీలోని క్రేన్ కొక్కెం ట్యాంకర్ వెనుక భాగాన్ని బలంగా ఢీకొంది. దీంతో ట్యాంకర్కు గల ప్రెజర్ వాల్వ్ నాబ్ విరిగిపోయి గ్యాస్ లీకైంది. పెద్ద శబ్దంతో గ్యాస్ బయటకు రావడంతో టోల్ప్లాజా సిబ్బంది, రహదారి వెంబడి ఉన్న వాహన చోదకులు భయాందోళనలకు గురయ్యారు. కొందరు పరుగులు తీశారు. హైవే సిబ్బంది అప్రమత్తమై రహదారిపై ఇరువైపులా వాహనాల రాకపోకలను నిలిపివేసి సహాయక చర్యలు చేపట్టారు. కొత్తపేట, మండపేట, అమలాపురం, తణుకు పట్టణాల నుంచి అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని గ్యాస్ ట్యాంకర్పై నీళ్లు చల్లుతూ నిప్పంటుకోకుండా చూశారు. సుమారు రెండు గంటల పాటు గ్యాస్ లీకవుతూనే ఉంది. కాగా, ఈ గ్యాస్ ట్యాంకర్కు ముందు వెళుతున్న మరో గ్యాస్ ట్యాంకర్ డ్రైవర్ జార్ఘండ్కు చెందిన ఇర్ఫాన్ ఆలామ్ ఒక చెక్క ముక్కను గ్యాస్ లీకవుతున్న రంధ్రంలోకి నెట్టి ‘ఎంసీల్’ పూశాడు. ఈ చర్యలు ఫలితమిచ్చి గ్యాస్ లీకేజీ అదుపులోకి రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో హైవేపై రెండు వైపులా కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోయింది. అమలాపురం డీఎస్పీ షేక్ మాసూమ్ బాషా, సీఐ వి.కృష్ణ, ఎస్ఐ పి.బుజ్జిబాబు ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. ప్రమాదానికి కారణమైన లారీ డైవర్ను అదుపులోకి తీసుకున్నామని డీఎస్పీ చెప్పారు. టోల్ ప్లాజా వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతుండటంపై హైవే అధికారులకు నివేదిక ఇస్తామన్నారు. -
అదుపుతప్పిన లారీ; ఒకరి మృతి
సాక్షి, తూర్పు గోదావరి : రావులపాలెం మండలం రావులపాడు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అరటి లోడుతో వేగంగా వస్తున్న లారీ రావులపాడు వద్దకు రాగానే ఒక్కసారిగా అదుపు తప్పి సర్వీస్ రోడ్లో నిలబడి ఉన్న భార్యభర్తలపై బోల్తా కొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. కాగా, ఈ ఘటనలో ఉప్పలపాటి సూర్యకుమారి మృతి చెందగా ఆమె భర్త పరిస్థితి విషమంగా మారడంతో దగ్గర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. -
పంట కాల్వలోకి దూసుకెళ్లిన కారు..
సాక్షి, రాజమండ్రి : తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. వివరాలోకి వెళితే అయినవిల్లి మండలం మడుపల్లి వద్ద డస్టన్ కారు అదుపు తప్పి పక్కనే ఉన్న పంట కాలువలోకి దూసుకెళ్లింది. రావులపాలెంకు చెందిన మోతమర్రి రాంబాబు తన పెళ్లిరోజు కావడంతో భార్యా,కుమార్తెతో కలిసి సోమవారం అయినవిల్లి విఘ్నేశ్వర దేవాలయానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు ....వారిని బయటకు తీశారు. కాగా వినాయకుడి దయవల్లే తాము ఘోర ప్రమాదం నుంచి తృటిలో ప్రాణాలతో బయటపడ్డామని రాంబాబు పేర్కొన్నాడు. -
రావులపాలెంలో సినీ నటుల సందడి
రావులపాలెం : రావులపాలెం సీఆర్సీలో జరుగుతున్న రాష్ట్రస్థాయి నాటిక పోటీలకు పలువురు సినీ నటులు హాజరుకావడంతో సందడి నెలకొంది. సీఆర్సీ కాట¯ŒS కళా పరిషత్ గౌరవ అధ్యక్షుడు తనికెళ్ళ భరణితోపాటు కృష్ణ భగవాన్, గౌతంరాజు, కోట శంకరరావు, బొడ్డు రాజుబాబులు ఆఖరి రెండు రోజులు పోటీలకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దీంతో పలువురు వారితో ఫొటోలు దిగేందుకు పోటీ పడ్డారు. ఈ సందర్భంగా సీఆర్సీ ప్రత్యేక ప్రదర్శన చూసిన సినీ నటుడు కృష్ణభగవా¯ŒS మాట్లాడుతూ వచ్చే ఏడాది మంచి హాస్య నాటికను తనికెళ్ళ భరణి రచించాలని, తమంతా ఆ నాటికను ప్రదర్శిస్తామన్నారు. ప్రత్యేక ప్రదర్శన ఇచ్చిన నటులను అభినందించారు. -
సమాజాన్ని మేల్కొలుపుతూ..
ఆలోచింపజేసిన నాటికలు సీఆర్సీ చేయూత అభినందనీయం : సినీనటుడు తనికెళ్ల భరణి రావులపాలెం (కొత్తపేట): భారతీయ సంస్కృతులను, సంప్రదాయాలను నేటి తరానికి అందించాలనే సంకల్పంతో కాస్మోపాలిట¯ŒS రిక్రియేష¯ŒS క్లబ్ (సీఆర్సీ) ఆధ్వర్యంలో ఏటా నిర్వహిస్తున్న నాటిక పోటీలు నాటక రంగానికి చేయూతనందిస్తున్నాయని సినీ నటుడు, సీఆర్సీ కాట¯ŒS కళాపరిషత్ గౌరవ అధ్యక్షుడు తనికెళ్ల భరణి అన్నారు. సీఆర్సీ రాçష్ట్రస్థాయి 19వ ఉగాది నాటిక పోటీల్లో ఆఖరి రోజైన శుక్రవారం పోటీలను తనికెళ్ల భరణి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా భరణి మాట్లాడుతూ నాటక రంగానికి జీవం పోసేలా 19 ఏళ్లుగా ఎంతగానో కృషి చేస్తున్న కళాపరిషత్ సేవలు అభినందనీయమన్నారు. ఈ పరిషత్కు తాను గౌరవ అధ్యక్షుడిగా ఉండటం సంతోషంగా ఉందన్నారు. అనంతరం ఈ ఏడాది సీఆర్సీ కాట¯ŒS కళాపురస్కారాన్ని నెల్లూరుకి చెందిన ప్రముఖ రంగస్థల నటుడు పొన్నాల రామసుబ్బారెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో సినీ నటులు కృష్ణభగవాన్, గౌతమ్రాజు, కోట శంకరరావు, సీఆర్సీ రూపశిల్పి డాక్టర్ గొలుగూరి వెంకటరెడ్డి, అధ్యక్షుడు మల్లిడి కనికిరెడ్డి, కార్యదర్శి కర్రి అశోక్రెడ్డి, నాటకపరిషత్ డైరెక్టర్ కుడుపూడి శ్రీనివాస్, డైరెక్టర్లు కర్రి సుబ్బారెడ్డి, చిర్ల కనికిరెడ్డి, నల్లమిల్లి వీర్రాఘవరెడ్డి, కొవ్వూరి నరేష్కుమార్రెడ్డి, తదితరులు ఉన్నారు. ఆకట్టుకున్న నాటికలు ఆఖరి రోజు ప్రదర్శించిన రెండు నాటికలు ప్రేక్షకులను ఆలోజింపజేశాయి. విజయవాడ యంగ్థియేటర్ ఆర్గనైజేష¯ŒS అనగనగా నాటిక ప్రదర్శించారు. ప్రభుత్వాలు మారినా ప్రజల కష్టాలు మారవని పాలక వర్గాల్లోనే మార్పురావాలని ప్రభోదిస్తూ నడిచిన ఈ నాటికను పి.మృత్యుంజయ రచించగా ఆర్.వాసు దర్శకత్వం వహించారు. అలాగే హైదరాబాద్ ఆర్ట్ ఫామ్ క్రియేష¯Œ్స ప్రదర్శించిన ఓ కాశీవాసీ రావయ్య నాటిక మానవతా విలువలను తెలియజేప్పింది. మానవత్వపు విలువలు లోపిస్తున్న సమాజంలో ఎవరి తలకు వాళ్లే కొరివి పెట్టుకునే రోజు వస్తుందనేది ఈ నాటిక ఇతివృత్తం. పీటీ మాధవ్ రచించిన ఈ నాటికకు నామాల మూర్తి దర్శకత్వం వహించారు. ఈ పోటీలకు న్యాయనిర్ణేతలుగా అదృష్టదీపక్, పి.గోవిందరావు, బొడ్డు రాజబాబు వ్యవహరించారు. -
సందేశాత్మకంగా సీఆర్సీ నాటికల పోటీలు
రెండో రోజు నాటికలను ప్రారంభించిన సినీ నటుడు తనికెళ్ల భరణి రావులపాలెం (కొత్తపేట): ఉగాది పండుగను పురస్కరించుకుని రావులపాలెంలోని కాస్మోపాలిట¯ŒS రిక్రియేష¯ŒS క్లబ్ (సీఆర్సీ) కాట¯ŒS కళాపరిషత్ ఆధ్వర్యంలో సీఆర్సీ కళావేదికలో నిర్వహిస్తున్న 19వ రాష్ట్ర స్థాయి ఉగాది ఆహ్వాన నాటిక పోటీలు సందేశాత్మకంగా సాగుతున్నాయి. రెండో రోజు గురువారం రాత్రి పోటీలను సీఆర్సీ కాట¯ŒS కళాపరిషత్ గౌరవ అధ్యక్షుడు, సినీ నటుడు తనికెళ్ల భరణి ప్రారంభించారు. రెండోరోజు మూడు నాటికలను ప్రదర్శించారు. సినీ నటులు గౌతంరాజు, కోట శంకరరావు ఈ నాటికలను తిలకించారు. మొదటిగా తాడేపల్లి అరవింద ఆర్ట్స్ వారి ‘స్వర్గానికి వంతెన’ నాటిక దేహదానం విలువను తెలియజేసింది. మరణించిన తరువాత దేహం మట్టికో కట్టెకో అర్పించడం సరైంది కాదని రచయిత వల్లూరి శివప్రసాద్, దర్శకుడు గంగోత్రి సాయి ఈ నాటికలో సందేశమిచ్చారు. అనంతరం కొలకలూరి శ్రీ సాయిఆర్ట్స్ వారు ‘చాలు..ఇక చాలు’ నాటికను ప్రదర్శించారు. పీవీ భవానీప్రసాద్ రచించిన ఈ నాటికకు దర్శకుడు గోపురాజు విజయ్. ఆఖరిగా విశాఖపట్నం శిరీషా ఆర్ట్స్వారు ప్రదర్శించిన ‘ఒక రాజకీయ కథ’ నాటిక ఆలోచన రేకెత్తించింది. స్త్రీని ఆకాశంలో సగం అంటూ చెప్పడం కాదని, ఆచరణలో ఎంత వరకూ వారికి న్యాయం జరుగుతోందని దర్శకుడు, రచయిత దండు నాగేశ్వరరావు ఈ నాటిక ద్వారా ప్రశ్నించారు. ఈ నాటికల పోటీలకు న్యాయనిర్ణేతలుగా అదృష్టదీపక్, పి. గోవిందరావు, బొడ్డు రాజబాబు వ్యవహరించారు. సీఆర్సీ రూపశిల్పి డాక్టర్ గొలుగూరి వెంకటరెడ్డి, అధ్యక్షుడు మల్లిడి కనికిరెడ్డి, కార్యదర్శి కర్రి అశోక్రెడ్డి, నాటక కళాపరిషత్ డైరెక్టర్ కుడుపూడి శ్రీనివాస్, డైరెక్టర్లు కర్రి సుబ్బారెడ్డి, చిర్ల కనికిరెడ్డి, నల్లమిల్లి వీర్రాఘవరెడ్డి, కొవ్వూరి నరేష్కుమార్రెడ్డి, కళాపరిషత్ నిర్వాహకుడు పలివెల త్రిమూర్తులు తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
తూ.గో జిల్లాలో స్వైన్ ఫ్లూ కలకలం
తూర్పుగోదావరి: జిల్లాలోని రావులపాలెంలో స్వైన్ ఫ్లూ కలకలం రేగింది. గ్రామానికి చెందిన ఇద్దరు బాలికలకు ఈ వ్యాధి సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. జిల్లాలోనే మొట్టమొదటిగా రావులపాలెం ఈ వ్యాధి వెలుగు చూడటంతో వైద్యులు అప్రమత్తమయ్యారు. గ్రామానికి చెందిన సత్తి వెంకటరెడ్డి భార్య నళిని ఇటీవల తీవ్ర అనారోగ్యంతో మృతి చెందింది. ఈమెకు తీవ్ర జ్వరం రావడంతో రాజమండ్రి ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. నిమోనియా వ్యాధితో ఈమె మృతి చెందినట్టు వైద్యులు స్పష్టం చేశారు. అయితే, ఆమె ఇద్దరు కుమార్తెలు దీప్తి, శ్రీజలు కూడా నాలుగు రోజుల క్రితం జ్వరం బారిన పడటంతో వారిని కూడా రాజమండ్రిలోని ప్రైవేట్ ఆస్పత్రికి చేర్పించారు. వీరిలో దీప్తికి సాధారణ జ్వరం కాగా శ్రీజకు మాత్రం స్వైన్ ఫ్లూ సోకినట్టు వైద్య పరీక్షల్లో నిర్ధారించారు. వీరి సమీప బంధువు కర్రి వీరారెడ్డి నాలుగేళ్ల కుమార్తె హర్షిత కూడా జ్వరం బారిన పడటంతో కాకినాడలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా ఈమెకు కూడా స్వైన్ ఫ్లూ సోకినట్టు నిర్ధారించి చికిత్స అందజేస్తున్నారు. జిల్లాలో మొదటి సారిగా స్వైన్ ఫ్లూ కేసులు నమోదు కావడంతో డీఎంఆండ్హెచ్ఓ కె. చంద్రయ్య హుటాహుటిన రావులపాలెం చేరుకున్నారు. స్థానిక ఊబలంక పీహెచ్సీ వైద్య సిబ్బందితో కలసి బాధితులు ఇళ్ళ వద్ద పరిస్థితిని సమీక్షించారు. గాలి ద్వారా వ్యాపించే ఈ వ్యాధి మరింత మందికి సోకే అవకాశం ఉన్నందున అంతా జాగ్రత్తలు పాటించాలని ఆయా కుటుంబాల వారికి సూచించారు. గ్రామంలో ఏడు వైద్య బృందాలను ఏర్పాటు చేసి సర్వే చేయించారు. ఎవరికైనా ఈ వ్యాధి సోకినట్లు లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. -
స్వైన్విహారం..
- ఐదేళ్ల తరువాత జిల్లాలో మరోసారి - రావులపాలేనికి చెందిన ఇద్దరి బాలికలకు వ్యాధి నిర్ధారణ - కాకినాడ జీజీహెచ్లో ప్రత్యేక వార్డు - అప్రమత్తమైన యంత్రాంగం సాక్షి ప్రతినిధి, కాకినాడ/రావులపాలెం : సుమారు ఐదేళ్ల క్రితం జిల్లాను వణికించిన స్వైన్ఫ్లూ మరోసారి బయటపడింది. రావులపాలెంలో ఇద్దరు బాలికలకు ఈ వ్యాధి సోకినట్టు నిర్ధారణకావడం జిల్లావాసులను హడలెత్తిస్తోంది. తొలిసారిగా 2012లో స్వైన్ఫ్లూ కేసులు జిల్లాలో నమోదు కావడంలో అప్పట్లో పెద్ద సంచలనమైంది. ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం చినబోడ్డువెంకటాయపాలెం, పెదబొడ్డు వెంకటాయపాలెం పరిసర ప్రాంతాల్లో అప్పట్లో ఆరు స్వైన్ఫ్లూ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మత్స్యకారులు అధికంగా నివసించే ఆ గ్రామాల్లో పారిశుద్ధ్యం లోపించడంతో స్వైన్ఫ్లూ రావడానికి కారణమైందని అప్పట్లో వైద్యులు నిర్ధారించారు. తాజాగా రావులపాలెంలో రెండు స్వైన్ ఫ్లూ కేసులు వెలుగు చూడడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జర్వం, జలుబు లక్షణాలతో రాజమహేంద్రవరం, కాకినాడ ఆస్పత్రుల్లో చికిత్స పొందున్న రావులపాలేనికి చెందిన ఇద్దరు బాలికలకు స్వైన్ఫ్లూ సోకినట్టు నిర్ధారించడంతో ఆ పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రావులపాలెంలో ఇటీవల నిమోనియా వ్యాధితో సత్తి నళిని(47) మృతి చెందింది. ఆమెకు దీప్తి, శ్రీజ ఇద్దరు కుమార్తెలు. వారిద్దరూ జ్వరం, జలుబుతో బాధపడుతుండగా నాలుగు రోజుల క్రితం రాజమహేంద్రవరం ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. ఆ ఇద్దరిలో శ్రీజకు హెచ్1ఎన్1 పాజిటివ్ ఉండటంతో స్వైన్ఫ్లూ వ్యాధి సోకినట్టు నిర్ధారణకు వచ్చి అందుకు అనుగుణంగా చికిత్స చేస్తున్నారు. మెడిసిన్ చదువుతున్న దీప్తికి సాధారణ జ్వరమే అని నిర్ధారణ కావడంతో ఆ కుటుంబం కాస్త ఊరట చెందింది. అంతలోనే వారి సమీప బంధువైన నాలుగేళ్ల కర్రి హర్షిత అనారోగ్యానికి గురవ్వడంతో ఆందోళనలో పడ్డారు. స్వైన్ఫ్లూ భయం వెంటాడుతుండగా ఆ బాలికకు కాకినాడ మెయిన్రోడ్డులోని ఒక ప్రైవేటుæ ఆస్పత్రిలో చేర్పించగా స్వైన్ఫ్లూ ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. ఆ విషయం బయటకు రావడంతో వారి బంధువుల్లో ఆందోళన నెలకొంది. విషయం తెలుసుకున్న జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి కె. చంద్రయ్య, ఊబలంక పీహెచ్సీ వైద్యులు ఎం.శైలజారాణి, జి.దుర్గాప్రసాద్ కుటుంబ సభ్యులతో మాట్లాడి పిల్లల ఆరోగ్య పరిస్థితులు ఆరా తీశారు. శ్రీజ తండ్రి వెంకటరెడ్డి, సోదరి దీప్తితో బాలికల అనారోగ్య లక్షణాలు తెలుసుకున్నారు. పశ్చిమగోదావరి నుంచి తూర్పుకు.. వీరిద్దరి కంటే ముందు పశ్చిమగోదావరి జిల్లా నరసాపురానికి చెందిన కొండేటి బాలాజీ స్వైన్ఫ్లూతో రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని డీఎంఅండ్హెచ్ఎం చంద్రయ్య ఊబలంకలో ధ్రువీకరించారు. శ్రీజ తండ్రి వెంకటరెడ్డి వ్యాపార రీత్యా పాలుకొల్లు, నరసాపురం ప్రాంతాలకు వెళ్లి రావడం, నరసాపురానికి చెందిన బాలాజీ స్వైన్ఫ్లూతో రాజమహేంద్రవరం రావడం ఆ క్రమంలోనే అక్కడి నుంచి స్వైన్ఫ్లూ మన జిల్లాకు వచ్చి ఉంటుందనే అనుమానాన్ని డీఎంహెచ్ఓ వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే శీతాకాలంలో కనిపించే స్వైన్ఫ్లూ వేసవిలో నమోదు కావడం వైద్యాధికారులకు అంతుబట్టడం లేదు. కాకినాడ జీజీహెచ్లో ప్రత్యేక వార్డు స్వైన్ ప్లూ వ్యాధిగ్రస్తుల కోసం కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో ప్రత్యేకంగా ఒక వార్డును ఏర్పాటు చేశాం. ఈఎన్డీ ఆప్తమాలజీ వార్డు పైఅంతస్తులో పది బెడ్లతో ఈ వార్డును అందుబాటులో ఉంచాం. వైద్య సేవలందించేందుకు మూడు షిప్ట్ల్లో వైద్య సిబ్బందిని నిరంతరం అందుబాటులో ఉంచాం. హెడ్ నర్స్ ఆధ్వర్యంలో స్టాఫ్నర్స్, ఎఫ్ఎన్వోలతో సిబ్బందిని సమాయత్తం చేశాం. వెంటిలేటర్ను ఏర్పాటు చేశాం. మరో ప్రత్యేక వార్డును సిద్ధం చేస్తున్నాం. - డాక్టర్ రాఘవేంద్రరావు, సూపరింటెండెంట్, కాకినాడ జీజీహెచ్ వ్యాధి లక్షణాలు స్వైన్ ప్లూ హెచ్1ఎన్1 ఇన్ప్లూఎంజ వైరస్ కారణంగా ఈ వ్యాధి సోకుతుంది. సాధారణ జలుబుగా ప్రారంభమై ఆరు రోజులుగా జ్వరం, ఒళ్లు నొప్పులు, గొంతు నొప్పి, దగ్గు, తలనొప్పి, వాంతులు, విరేచనాలతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే స్వైన్ప్లూగా గుర్తిస్తారు. -
ప్రతి సినిమా వైవిధ్యభరితమే..
సినీ దర్శకుడు చంద్రమహేష్ రావులపాలెం(కొత్తపేట) : ప్రేయసి రావే సినిమాతో దర్శకుడిగా తెలుగు సినీ పరిశ్రమలో ప్రవేశించిన చంద్రమహేష్ ఇంత వరకూ తాను చేసిన ప్రతి సినిమా వైవిధ్యభరితమైనవేనని అంటున్నారు. తన స్నేహితులు పడాల రామిరెడ్డి, సబెళ్ల సత్యనారాయణరెడ్డి(సన్ని)లను కలిసేందుకు సోమవారం నిర్మాత సామా సురేంద్రరెడ్డితో కలసి రావులపాలెం వచ్చిన ఆయన కాసేపు ‘సాక్షి’తో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే.. మాది కాకినాడ. సినిమాలపై ఇష్టంతో సురేష్ ప్రొడక్షన్స్లో చేరాను. కె.మురళీమోహనరావు, సురేష్కృష్ణ, జయంతి సీ పరాన్జీ, సురేష్ వర్మ, బోయిన సుబ్బారావు, జంధ్యాల వంటి దర్శకుల వద్ద అసిస్టెంటుగా పనిచేశా. 1999లో ప్రేయసి రావే చిత్రంతో దర్శకుడిగా మారా. ఆ చిత్రం మంచి విజయం సాధించడంతోపాటు ఉత్తమ కొత్త దర్శకుడిగా నంది అవార్డు లభించడంతోపాటు చిరంజీవి, కె.విశ్వనాథ్ వంటి పెద్దల ప్రసంశలు లభించాయి. అలాగే అయోధ్య రామయ్య, చెప్పాలని ఉంది, జోరుగా హుషారుగా, ఒక్కడే, హనుమంతు, ఆలస్యం అమృతం విషం, లవ్ ఇన్ హైదరాబాద్ చిత్రాలకు దర్శకత్వం వహించా. ఇప్పటి దాకా తెలుగులో తొమ్మిది సినిమాలు చేశా. హనుమంతు సినిమాకు ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు అందుకున్నా. రెడ్ అలర్ట్ అనే సినిమాను తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం భాషల్లో ఒకే సారి విడుదల చేయాలని నిర్మించాం. అయితే తెలుగు, కన్నడలో రెడ్ అలర్ట్, మళయాళంలో హై అలర్ట్, తమిళంలో చెన్నై నగరంగా విడుదల చేయాలని అనుకున్నా, నిర్మాత మృతితో ఒకే సారి చేయలేకపోయాం. తమిళంలో ఇంకా విడుదల కావాల్సి ఉంది. ఈ చిత్రానికి ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో స్థానం లభించింది. ఒక ప్రేమకథను సిద్ధం చేసి ఒక యువ హీరోకి చెప్పాను. ఆయనకు నచ్చడంతో త్వరలో ఈ సినిమా తెలుగులో చేయనున్నాం.’’ -
రోడ్డెక్కిన యుద్ధ విమానం
వినువీధిలో దూసుకుపోతూ, శత్రులక్ష్యాలపై దాడి చేసే యుద్ధ విమానం జాతీయ రహదారిపై ప్రయాణిస్తూ కనిపించింది. ప్రయాణించడం అంటే తనంతట తాను వెళ్లడం కాదు.. తానే మరో వాహనాన్ని ఆశ్రయించి గమ్యానికి వెళ్లడం. ఆదివారం గోవా నుంచి విశాఖపట్నానికి ట్రాలీపై తరలిస్తున్న యుద్ధ విమానం రావులపాలెం మండలం ఈతకోట వద్ద ‘సాక్షి’కి కనిపించింది. ముందు భాగంలో రాకెట్ తరహాలో ఉన్న ఈ యుద్ధ విమానాన్ని స్థానికులు ఆసక్తిగా తిలకించారు. ట్రాలీ డ్రైవర్ని అడిగితే ‘ఆర్మీ వినియోగించే విమానం’ అని మాత్రమే చెప్పాడు. – -రావులపాలెం (కొత్తపేట) -
మనస్తాపంతో విద్యార్థి ఆత్మహత్య
రావులపాలెం (కొత్తపేట) : తండ్రి మద్యానికి బానిసై కుటుంబాన్ని పట్టించుకోకపోవడంతో మనస్తాపానికి గురైన ఒక విద్యార్థి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆత్రేయపురం మండలం ర్యాలికి చెందిన పితాని సత్యనారాయణ, తలుపులమ్మ కుటుంబం మండలంలోని ఊబలంకలో కొన్నాళ్లుగా ఉంటున్నారు. వారి కుమారుడు పితాని వెంకటసాయి(17) కొత్తపేట మండలం వాడపాలెం నవనిధి ఐటీఐ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. తండ్రి సత్యనారాయణ సుమారు ఆరేళ్లు దుబాయిలో ఉండి ఇటీవల తిరిగి వచ్చాడు. మద్యానికి బానిపై అప్పులపాలవడంతో కుటుంబం ఇబ్బంది పడుతోంది. దీంతో సాయి కళాశాలకు వెళ్లకపోవడంతో తల్లి తలుపులమ్మ మందలించింది. దీంతో మనస్తాపానికి గురై గురువారం ఉదయం రావులపాలెం గౌతమి కొత్త బ్రిడ్జి రింగ్బండ్ వద్దకు వెళ్లి పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అదనపు ఎస్సై పి.శోభ¯ŒSకుమార్ ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహం వద్ద సూసైడ్ నోట్, పురుగులమందు డబ్బాను స్వాధీనం చేసుకున్నారు. తన చావుకు ఎవ్వరూ కారణం కాదని తన చావుతో అయినా తండ్రి మారి కుటుంబాన్ని సరిగా చూసుకోవాలని ఆ నోట్లో రాశాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కొత్తపేట ప్రభుత్వాస్పతికి తరలించి ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. -
హోరాహోరీగా ‘సీఆర్సీ’ కబడ్డీ పోటీలు
రావులపాలెం (కొత్తపేట) : స్థానిక ప్రభుత్వ ఉభయ కళాశాలల మైదానంలో ఆదివారం మకర సంక్రాంతిని పురస్కరించుకుని సీఆర్సీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో హోరాహోరీగా సాగాయి. పురుషుల, మహిళల విభాగంలో మూడో రోజు పోటీలు సెమీ ఫైనల్కు చేరుకున్నాయి. పురుషుల విభాగంలో ఎనిమిది జిల్లాల జట్లు, మహిళల విభాగంలో ఆరు జిల్లాల జట్లు పాల్గొన్నాయి. ఆదివారం ఈ పోటీలను రావులపాలెం పరిసర ప్రాంతాలకు చెందిన అధిక సంఖ్యలో ప్రజలు తిలకించారు. ఎంపీపీ కోట చెల్లయ్య, సీఆర్సీ రూపశిల్పి గొలుగూరి వెంకటరెడ్డి మూడో రోజు పోటీలను ప్రారంభించారు. సీఆర్సీ అధ్యక్ష, కార్యదర్శులు మల్లిడి కనికిరెడ్డి, కర్రి అశోక్రెడ్డి, స్పోర్ట్స్ డైరెక్టర్ నల్లమిల్లి వీర్రాఘవరెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆదివారం అర్ధరాత్రి వరకూ ఈ పోటీలు నిర్వహించారు. -
రాష్ట్రస్థాయిలో పేరొందిన సీఆర్సీ క్రీడా పోటీలు
ప్రజాప్రతినిధుల కితాబు కబడ్డీ పోటీలు ప్రారంభం రావులపాలెం(కొత్తపేట): సంక్రాంతి సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ రావులపాలెంలో ఏటా సీఆర్సీ నిర్వహిస్తున్న క్రీడా పోటీలు రాష్ట్ర స్థాయిలో ఖ్యాతి పొందాయని కొత్తపేట, రాజోలు ఎమ్మెల్యేలు చిర్ల జగ్గిరెడ్డి, గొల్లపల్లి సూర్యారావు, ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం అన్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో సీఆర్సీ సంక్రాంతి సంబరాలు–2017 పేరుతో రాష్ట్ర స్థాయి పురుషులు, మహిళల కబడ్డీ పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. పోటీలను ఎమ్మెల్యేలు జగ్గిరెడ్డి, సూర్యారావు, ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం ప్రారంభించారు. డాక్టర్ చిర్ల సోమసుందరరెడ్డి ఓపె¯ŒS ఆడిటోరియంలో జరిగిన ప్రారంభ సభకు అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే జగ్గిరెడ్డి మాట్లాడుతూ సంక్రాంతికే కాక ఎన్నో క్రీడా పోటీలు నిర్వహిస్తూ క్రీడాభివృద్ధికి సీఆర్సీ అందిస్తున్న చేయూత ప్రశంసనీయం అన్నారు. ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ క్రీడలతో మంచి గుర్తింపు లభిస్తుందన్నారు. ఎమ్మెల్యే సూర్యారావు మాట్లాడుతూ సంక్రాంతి క్రీడల్లో కోనసీమకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. కబడ్డీ కోర్టులను ఎమ్మెల్యేలు జగ్గిరెడ్డి, సూర్యారావు, ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యంలు ప్రారంభించారు. పురుషుల విభాగంలో చిత్తూరు, ప్రకాశం జట్ల మధ్య, మహిళల విభాగంలో తూర్పుగోదావరి, గుంటూరు జట్ల మధ్య మ్యాచులతో పోటీలు ప్రారంభమయ్యాయి. పోటీలు తిలకించేందుకు రావులపాలెం పరిసర ప్రాంతాల నుంచి వందలాది మంది తరలివచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ కోట చెల్లయ్య, జెడ్పీటీసీ సాకా ప్రసన్నకుమార్, ఏఎంసీ చైర్మ¯ŒS బండారు వెంకటసత్తిబాబు, వైస్ ఎంపీపీ దండు వెంకట సుబ్రహ్మణ్యవర్మ, ఎంపీటీసీలు కొండేపూడి రామకృష్ణ, కుడుపూడి శ్రీనివాస్, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కర్రి నా గిరెడ్డి, సీఆర్సీ రూపశిల్పి డాక్టర్ గొలుగూరి వెంకటరెడ్డి, అధ్యక్ష కార్యదర్శులు మల్లిడి కనికిరెడ్డి, కర్రి ఆశోక్రెడ్డి, సత్తి రామకృష్ణారెడ్డి, చెక్కల సూరి బా బు, నల్లమిల్లి సూర్యనారాయణరెడ్డి, నల్లమిల్లి వీ రరాఘవరెడ్డి, కర్రి సుబ్బారెడ్డి, కొవ్వూ రి నరేష్కుమార్, సెక్రటరీ వి.వీరలంకయ్య పాల్గొన్నారు. -
కారులో గంజాయి స్వాధీనం
బైక్ను ఢీకొనడంతో వెలుగుచూసిన వైనం l రూ.15 లక్షల విలువైన 200 కిలోల సరుకు స్వాధీనం రావులపాలెం : జాతీయ రహదారిపై రావులపాలెం మండలం ఈతకోట వద్ద జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి భారీ స్థాయిలో గంజాయి పట్టుబడింది. గంజాయిని తరలిస్తున్న కారు.. ఓ మోటార్ బైక్ను ఢీకొనడంతో ఈ వ్యవహారం వెలుగుచూసింది. సుమారు రూ.15 లక్షల విలువైన 200 కిలోల గంజాయిని పోలీసులు గుర్తించారు. సోమవారం రావులపాలెం పోలీసు స్టేష¯ŒSలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ పీవీ రమణ, ఎస్సై పీవీ త్రినాథ్ ఈ వివరాలను వెల్లడించారు. జిల్లాలోని ఏజెన్సీ ఏరియా నుంచి గంజాయి ప్యాకెట్లతో కారు రాజమహేంద్రవరం వైపు నుంచి పశ్చిమ గోదావరి జిల్లా వైపు జాతీయ రహదారి మీదుగా ప్రయాణిస్తోంది. ఈతకోట సెంటర్ వద్ద ఆదివారం అర్ధరాత్రి ఓ బైక్ను ఢీకొనగా, అదే గ్రామానికి చెందిన వెలిగట్ల రామకృష్ణ గాయపడ్డాడు. కారు ముందు చక్రం ఊడిపోవడంతో, అందులో ఉన్న ఇద్దరు వ్యక్తులు చక్రం బిగించుకునే పనిలో పడ్డారు. అక్కడ గుమిగూడిన స్థానికులను చూసి వారు అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న రావులపాలెం ఎస్సై త్రినాథ్ అక్కడికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని రాజమహేంద్రవరంలోని ఆస్పత్రికి తరలించారు. కారును పరిశీలించగా, డిక్కీలో గంజాయి ప్యాకెట్లు కనిపించాయి. కారును పోలీసు స్టేష¯ŒSకు తరలించారు. సోమవారం ఉదయం తహసీల్దార్ సీహెచ్ ఉదయభాస్కర్ సమక్షంలో కారు డిక్కీ, వెనుక సీటులో ఉన్న గంజాయి ప్యాకెట్లను వెలికితీశారు. రెండు కిలోల వంతున మొత్తం 104 బ్యాగులున్నట్టు గుర్తించారు. దీని విలువ రూ.15 లక్షలుంటుందని అంచనా వేశారు. గంజాయితో పాటు రూ.70 వేల నగదు, కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అన్నవరం గుడికి వెళ్లినట్టు రసీదు, మెడికల్ బిల్లు ఉన్నాయి. కారులో ఏపీ రిజిస్ట్రేష¯ŒS, తమిళనాడు రిజిస్ట్రేష¯ŒSతో రెండు వైపులా ముద్రించిన నంబరు ప్లేటు దొరికింది. కారు రికార్డు ఆధారంగా నిందితులను పట్టుకుంటామని సీఐ తెలిపారు. గంజాయిని పట్టుకున్న ఎస్సై త్రినాథ్, ఏఎస్సై ఆర్వీ రెడ్డి, కానిస్టేబుళ్లు శ్రీనివాస్, సతీష్, ఇతర సిబ్బందిని అభినందించారు. -
చరిత్రకు ఆనవాళ్లు నాణేలు
291 దేశాల నాణేలు, కరెన్సీనోట్లు, స్టాంపుల ప్రదర్శన ఆసక్తిగా తిలకించిన విద్యార్థులు రావులపాలెం : చరిత్రకు అద్దం పట్టే వివిధ దేశాల నాణేలు, కరెన్సీ నోట్లు, స్టాంపుల ప్రదర్శన విద్యార్థులను విశేషంగా ఆకట్టుకుంది. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలతో అమలాపురానికి చెందిన పి.కృష్ణకామేశ్వర్ శుక్రవారం ఈ ప్రదర్శన ఏర్పాటు చేశారు. మన దేశంతో పాటు 291 దేశాలకు చెందిన నాణేలు, నోట్లు అందర్నీ అబ్బురపరచాయి. మంగోలియా దేశం తాజ్మహల్ చిత్రంతో విడుదల చేసి నాణెం, సోమాలియా దేశం గిటార్లు, త్రిజ్యామితీయ ఆకృతులతో, నియో దేశపు స్పైడర్మ¯ŒS చిత్రపు నాణెం, ప్రపంచంలో తొలి సారిగా ట్రా¯Œ్సనిస్ట్రియా దేశం విడుదల చేసి ప్లాస్టిక్ నాణేలు, బెని¯ŒS దేశం విడుదల చేసిన పరిమళపు నాణెం, వియాత్నాంకు చెందిన రూ.50 వేలు, రూ.లక్ష నోటు, 45 దేశాలకు చెందిన ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు, కెనడా, ఇండియా, ఐక్యరాజ్య సమితి తపాల విభాగాలు విడుదల చేసిన స్టాపులు, ఇటీవల ఐక్యరాజ్య సమితి ఎంఎస్ సుబ్బులక్ష్మి చిత్రంతో విడుదల చేసిన స్మారక స్టాంపు, భారత ప్రభుత్వం విడుదల చేసిన కరెన్సీ నోట్లు, నాణేలు, పలు దేశాలకు చెందిన స్టాంపులు విద్యార్థులను విశేషంగా ఆకట్టుకున్నాయి. విద్యార్థులకు వీటి గురించి కామేశ్వర్ సమగ్రంగా వివరించారు. ప్రదర్శనను రావులపాలెంలోని పలు కళాశాల విద్యార్థులు తిలకించారు. తొలుత ఈ ప్రదర్శనను దివ్యాంగుల సేవా సంస్థ జిల్లా అధ్యక్షుడు పేరి లక్ష్మినరసింహం, ప్రిన్సిపాల్ కె.వి.రమణారావు ప్రారంభించారు. నగదు రహిత లావాదేవీలు, డెబిట్, రూపే కార్డులు వినియోగించడంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. -
నిలువెత్తు గెల!
ఆరడుగుల ఎత్తు, 25 అత్తాలు అబ్బురపరచిన అరటి గెల సాధారణంగా మూడడుగుల ఎదిగే అరటి గెల ఏకంగా ఆరడుగులు పెరిగి అబ్బుర పరుస్తోంది. రావులపాలెం ప్రాంతంలో అరుదుగా కనిపించే కర్ణాటక చెక్కరకేళీగా పిలిచే బూడిద బక్కీస్ రకానికి చెందిన భారీ గెలను స్థానిక అరటి మార్కెట్కు బుధవారం అమ్మకానికి తీసుకువచ్చారు. రావులపాలానికి చెందిన మల్లిడి త్రినాథరెడ్డి తన ఇంటి పెరడులో పెంచిన చెట్టుకు కాసిన గెల పక్వానికి రావడంతో తన సైకిల్పై యార్డుకు తీసుకువచ్చాడు. ఆ గెలను కొనేందుకు వ్యాపారులు పోటీ పడ్డారు. చివరికి కొమరాజులంకకు చెందిన కర్రి శ్రీనివాసరెడ్డి రూ.650కు కొనుగోలు చేశారు. ఈ గెలలో మొత్తం 25 అత్తాలు ఉండగా, ఒక్కో అత్తంలో సుమారు 20 నుంచి 25 కాయలు ఉన్నాయి. మొత్తంగా సుమారు 600 కాయలు ఉంటాయని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ గెలను అంతా ఆసక్తిగా తిలకించారు. - రావులపాలెం -
అన్నన్నా.. బనానా!
బాగా తగ్గిన అరటి ఎగుమతులు, ధరలు రావులపాలెం : పెద్దనోట్ల రద్దు ప్రభావం రావులపాలెం అరటి మార్కెట్ యార్డులో ఎగుమతులపై పడింది. చలామణికి అవసరమైన చిల్లర నోట్ల అందుబాటులో లేకపోడంతో వ్యాపారులు పాతనోట్లతోనే కొనుగోళ్లు సాగిస్తుండటంతో సుమారు 25 శాతం ఎగుమతులు తగ్గాయి. సాధారణంగా ప్రతిరోజూ సుమారు 25 లారీల వివిధ రకాల అరటి గెలలను ఇక్కడి నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు చేశారు. తద్వారా రూ.20 నుంచి రూ.25 లక్షల వ్యాపారం జరిగేది. అయితే ప్రస్తుతం 15 నుంచి 18 లారీల సరుకు ఎగుమతవుతోంది. తద్వారా రూ.10 నుంచి రూ.15 లక్షల వ్యాపారం జరుగుతున్నట్టు మార్కెట్ వర్గాల అంచనా. ధరలు కూడా గతంతో పోలిస్తే తగ్గుముఖం పట్టాయి. వరిచేలల్లో కోతలు ప్రారంభం కావడంతో రైతులు అరటి గెలల కోతలపై దృష్టి పెట్టకపోవడంతో మార్కెట్కు వచ్చే గెలల సంఖ్య కొంత మేర తగ్గింది. అలాగే అరటి చేలల్లో కూడా 75 శాతం కోతలు పూర్తి కావడంతో దిగుబడి తగ్గింది. వీటితోపాటు తాజాగా రూ.500, వెయ్యి నోట్ల రద్దు చేయడం కూడా ధరలు, ఎగుమతులపై ప్రభావం చూపింది. ఒక లోడు(అరుగెలలు) అమ్మితే వచ్చే మొత్తంలో రైతుకు అధిక శాతం పాత వెయ్యి, రూ. 500 నోట్లను కొంత చిల్లర నోట్లను వ్యాపారులు ఇస్తున్నారు. పాతనోట్లను తీసుకోవడం ఇబ్బందైనా తప్పని పరిస్థితుల్లో రైతులు తీసుకుని బ్యాంకుల్లో మార్చుకొంటున్నారు. అయితే ప్యాకింగ్, లోడింగ్ కూలీలకు కూలిగా కూడా రూ.500 నోట్లను ఇస్తుండడంతో వాటిని మార్చుకోవడానికి రూ.50 వరకూ తాము కోల్పోవాల్సి వస్తోందని వారు అంటున్నారు. రూ. 50 కోల్పోతున్నాం కూలీగా ఇస్తున్న నోట్లలో రూ.500 నోటు మార్చుకోవాలంటే రూ.50 కోల్పోవాల్సివస్తోంది. వ్యాపారులు కొత్త నోట్లు వచ్చేంత వరకూ పాత నోట్లనే తీసుకోక తప్పదని గెలల కొనుగోళ్లకు రైతులకు అవే ఇస్తున్నామని చెబుతున్నారు. – గంధం నాగేశ్వరరావు, ప్యాకింగ్ కూలీ, కొమరాజులంక. పాత నోట్లతోనే అమ్మకాలు, కొనుగోళ్లు నోట్ల రద్దు తర్వాత సరిపడ కొత్త నోట్ల రాకపోవడంతో మార్కెట్ యార్డులో అధిక శాతం పాతనోట్లతోనే అమ్మకాలు, కొనుగోళ్లు చేస్తున్నారు. వ్యాపారులు ఇచ్చిన పాత నోట్లను బ్యాంకుల్లో మార్చుకొంటున్నాం. పరిచయాలతో పాత నోట్లనే ఇచ్చిపుచ్చుకుంటున్నారు. – నడింపల్లి పెద్దిరాజు, రైతు, వెదిరేశ్వరం ధరలలో వ్యత్యాలు నోట్ల రద్దుకు ముందు ప్రస్తుతం రకం(గెల రూ.ల్లో) కనిష్ట గరిష్ట కనిష్ట గరిష్ట కర్పూర 150 500 100 250 చెక్కరకేళీ(తెలుపు) 125 400 100 350 బుషావళి 100 350 100 250 బొంత(కూరఅరటి) 150 300 100 250 అమృతపాణి 200 600 100 300 చెక్కరకేళీ(ఎరుపు) 150 350 100 300 -
కాపుల యాత్రపై పోలీసుల డేగ కన్ను
12 డ్రోన్లతో చిత్రీకరణ 16న రావులపాలేనికి కాపులు రాకుండా ఎక్కడికక్కడ చెక్పోస్టులు 8 వజ్ర వాహనాలు, వాటర్, గ్యాస్, రబ్బర్ బుల్లెట్లతో సన్నద్ధం 13 జిల్లాల నుంచి ఆరు వేల మంది పోలీసుల మోహరింపు కోనసీమ చరిత్రలో తొలిసారిగా అత్యాధునిక భారీ బందోబస్తు అమలాపురం టౌన్ : కాపు సత్యగ్రహ పాదయాత్రపై పోలీసులు డేగ కన్ను వేస్తున్నారు. కాపుల పాద యాత్రను ఆకాశం నుంచి చిత్రీకరించేందుకు ముఖ్య ప్రదేశాల్లో 12 డ్రోన్లు సిద్ధం చేశారు. వీటిలో రావులపాలెంలో రెండు, అమలాపురంలో రెండు ఉండేలా...మిగిలిన ఎనిమిది కొత్తపేట, రాజోలు, మలికిపురం, తాటిపాక, అయినవిల్లి, అంతర్వేది తదితర ప్రాంతాల్లో ఏర్పాట్లు చేశారు. శాటిలైట్...చిప్ ఆధారంగా పనిచేసే వీటి కోసం అమలాపురం పోలీసులు 12 ఫో¯ŒS నంబర్లతో కొత్త సిమ్లు సిద్ధం చేశారు. ఇప్పటికే రాయలసీమ, కోస్తా, ప్రకాశం, నెల్లూరు. గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి దాదాపు మూడు వేల మందికి పైగా పోలీసులను కోనసీమకు తరలించారు. మంగళవారం ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి మరో మూడు వేల మంది పోలీసులను బరిలోకి దింపుతున్నారు. వీరిలో సీఆర్పీఎఫ్, ఏఎ¯ŒSఎస్ తదితర స్పెషల్ ఫోర్సులు కూడా ఉన్నాయి. డీఐజీ, ఎస్పీతోపాటు నలుగురు ఏఏస్పీలు, 25 మంది డీఎస్పీలు, 150 మంది సీఐలు, 500 మంది ఎస్సైలను పాదయాత్ర బందోబస్తు విధుల్లో భాగస్వామ్యులను చేస్తున్నారు. అత్యాధునిక వాహనాలు సిద్ధం... కాపుల పాద యాత్రను అడ్డుకునే సమయంలో ఆందోళనకారులను ఎదుర్కొనేందుకు పోలీసు శాఖ అత్యాధునిక వాహనాలను రంగంలోకి దింపింది. ఎంత జన సమూహాన్నైనా అదుపు చేసేందుకు ఎనిమిది వజ్ర వాహనాలను రప్పించారు. మల్టీ ప్రొటెక్ష¯ŒSతో ఉండే ఈ వాహనంలో వాటర్ కే¯Œ్స, టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లు వంటివి ఉంటాయి. ముళ్ల కంచెల రోల్స్, రైట్ గేర్ కిట్స్ అంటే బుల్లెట్ ప్రూఫ్, స్టో¯Œ్స ప్రూఫ్ జాకెట్లు కూడా సిద్ధం చేశా>రు. ఎలాంటి వాహనాలనైనా చిటికెలో ఛేజ్ చేసే 4 రాఫిడ్ ఇంటర్వెష¯Œ్స వెహికల్స్ను కూడా అందుబాటులో ఉంచారు. ఆందోళనకారులను అదుపులోకి తీసుకుంటే వారిని తక్షణమే అక్కడి నుంచి తరలించేందుకు కేంపర్స్ వాహనాలు కూడా తీసుకుని వచ్చారు. ఇవన్నీ యాత్రకు ముందు..వెనుక ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేకంగా రావులపాలేనికి రెండు వేల మంది...అమలాపురానికి రెండు వేల మంది...యాత్ర సాగే ముఖ్య ప్రాంతాల్లో రెండు వేల మంది పోలీసులను ప్రస్తుతానికి సర్ధుబాటు చేశారు. ఈ యాత్రకు బందోబస్తుపరంగా ప్రత్యేక అధికారిగా నియమితులైన అడిషనల్ ఎస్పీ ఏఎస్ దామోదర్ నాలుగు రోజులుగా కోనసీమలోనే మకాం చేసి బందోబస్తు ప్యూహాలను రూపాందిస్తున్నారు. పాదయాత్ర ప్రారంభమయ్యే రావులపాలేనికి ఉభయ గోదావరి జిల్లాల నుంచి కాపులు రాకుండా పోలీసు చెక్ పోస్టులలో నిలువరించే ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది. చెక్పోస్టులు ఏర్పాటు.. జొన్నాడ వంతెనలపైనే కాకుండా రావులపాలం వచ్చేందకు అంతర్గత రోడ్లలో పోలీసు చెక్ పోస్ట్లు ఏర్పాటుచేస్తున్నారు. అలాగే దిండి– చించునాడ వంతెన, బోడసకుర్ుర– పాశర్లపూడి వంతెన, యానాం–ఎదుర్లంక వంతెనతోపాటు సఖినేటిపల్లి, కోటిపల్లి ఫెర్?రల వద్ద కూడా చెక్పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు. ముద్రగడ పాదయాత్ర విజయవంతానికి పూజలు కిర్లంపూడి : మాజీ ఎంపీ, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఈ నెల 16న రావులపాలెం నుంచి అంతర్వేది వరకు నిర్వహించనున్న పాదయాత్ర జయప్రదం కావాలని కిర్లంపూడి శివాలయంలో సోమవారం ప్రత్యేక పూజలు చేశారు. సర్పంచ్ పెంటకోట నాగబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారికి అభిషేకాలు జరిపారు. కాళ్ల సత్యనారాయణ, సరకణం భద్రం, కరణం వెంకటేశ్వరరావు, గంధం నల్లయ్య, దొంగబాబు అధిక సంఖ్యలో ముద్రగడ అభిమానులు పాల్గొన్నారు. -
పెద్ద నోట్లు మార్చుకున్న ఆర్టీసీ అధికారి
తూర్పుగోదావరి జిల్లా : రావులపాలెం ఆర్టీసీ బస్టాండులో ఆ సంస్థ ఉన్నతాధి ఒకరు తన వద్ద ఉన్న పెద్ద నోట్లను కండక్టర్ల వద్ద మార్చుకున్న సంఘటన ఆదివారం వెలుగు చూసింది. రూ.500, రూ.వెయ్యి నోట్లను కేంద్రం రద్దు చేయడంతో తన వద్ద ఉన్న వాటిని ఆ అధికారి కండక్టర్లకు ఇచ్చి వారినుంచి రూ.100 ఇతర చిన్న నోట్లు మార్చుకుంటుండగా స్థానికులు మీడియాకు సమాచారం అందించారు. దీంతో ‘సాక్షి’ అక్కడికి చేరుకుని ఫొటోలు తీయడంతో ఆయన ఖంగుతిన్నారు. దీనిపై ఆయన్ను వివరణ కోరగా సొంత అవసరాల కోసం పెద్ద నోట్లు మార్చుకున్నానని, ఇలా రూ.20 వేలు మార్చుకున్నానంటూ ఇదేమీ తప్పు కాదన్నట్లు సమర్థించుకున్నారు. పై అధికారి కావడంతో తప్పు అయినా సహకరించినట్లు కొందరు సిబ్బంది తెలిపారు. -
ఘనంగా ప్రభాస్ జన్మదిన వేడుకలు
రావులపాలెంలో అభిమానుల భారీ బైక్ ర్యాలీ రావులపాలెం: బాహుబలి సినిమాతో సినీ రంగంలో అంతర్జాతీయ గుర్తింపు పొందిన సినీ హీరో ప్రభాస్ జన్మదిన వేడుకలను ఆదివారం వైఎస్సార్ సీపీ జిల్లా ఇండస్ట్రీయల్ విభాగం కన్వీనర్ మంతెన రవిరాజు ఆధ్వర్యంలో రావులపాలెంలో ఆయన అభిమానులు పండుగలా నిర్వహించారు. కొత్తపేట నియోజకవర్గంలోని వివిధ మండలాల నుండి భారీగా రావులపాలెం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానానికి తరలివచ్చి మోటరు బైకులపై చక్కర్లు కొడుతూ తీ¯ŒSమార్ డప్పులు బాణసంచా కాల్పులతో హోరెత్తించారు. అనంతరం వందలాది బైకులపై ప్రభాస్ చిత్రాలు ఉన్న టీ షర్టులు ధరించి జెండాలతో ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీని స్థానిక జాతీయ రహదారిపై రవిరాజు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఈ ర్యాలీ మండలంలోని రావులపాలెం, ఈతకోట, వెదిరేశ్వరం, కొమరాజులంక, ఊబలంకల మీదుగా ఆత్రేయపురం మండలం వైపు సాగింది. ఈ ర్యాలీలో బాహుబలి–2 సినిమాకు సంబంధించి విడుదలైన చిత్రాలతో అభిమానులు సందడి చేశారు. డార్లింగ్ ప్రభాస్ అని ముద్రించిన పతాకాలు ఆకట్టుకున్నాయి. -
రావులపాలెంలో సినీ సందడి
రావులపాలెం : మండల పరిధిలోని వెదిరేశ్వరం శివారు కోసూరు నగర్ పంట చేల మధ్య మంగళవారం ప్రముఖ హీరో హీరోయిన్లు శర్వానంద్, లావణ్య త్రిపాఠీ నటిస్తున్న చిత్రం షూటింగ్ జరిగింది. వరి చేల మధ్య పల్లెటూరి వాతావరణంలో హాస్య సన్నివేశాలు చిత్రీకరించారు. హీరో శర్వానంద్తో పాటు కమెడీయన్లు షకలక శంకర్ తదితరులు ఈ సన్నివేశాల చిత్రీకరణలో పాల్గొన్నారు. సాయంత్రం వరకూ ఈ ఘాటింగ్ జరిగింది. సమీప ప్రాంతాలకు చెందిన అక్కడికి రావడంతో సినీ సందడి నెలకొంది. కాప్స్, ఎంటర్టైన్మెంట్ చిత్రం శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి అత్తారింటికి దారేది, నాన్నకు ప్రేమతో వంటి హిట్ చిత్రాలు నిర్మించిన బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారన్నారు. ఈ చిత్రంలో శర్వానంద్, లావణ్య త్రిపాఠీలు హీరో హీరోయిన్లు కాగా కోట శ్రీనివాసరావు, రవికిషన్, సప్తగిరి, షకలక శంకర్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారన్నారు. ‘‘దర్శకుడిగా నాకు ఇది మొదటి చిత్రం. రచయితగా పలు చిత్రాలకు పని చేస్తున్నాను’ అని దర్శకుడు చింతాడ చంద్రమోహన్ తెలిపారు. ‘‘కోనసీమ అందాలు ఇక్కడి పంట చేలు కొబ్బరి తోటలు, గలగల పారే కాలువలు ఎంతో బాగున్నాయని హీరో శర్వానంద్ అన్నారు. ‘సినిమా ఘాటింగ్లకు తూర్పు గోదావరి జిల్లా నంబర్ వన్ ప్రాంతమని, జబర్దస్త్ షో ద్వారా నాకు మంచి గుర్తింపు వచ్చింది’’ కమెడీయన్ అని షకలక శంకర్ తెలిపారు. -
సాఫ్ట్గా దూసుకెళుతున్నారు!
సాఫ్ట్బాల్లో ప్రతిభ చూపుతున్న తూర్పు కిరణాలు జాతీయ స్థాయికి పలువురి క్రీడాకారులు సాఫ్ట్బాల్లో జిల్లా క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. గడిచిన రెండేళ్ల కాలంలో జిల్లా నుంచి పలువురు క్రీడాకారులు జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కావడమే దీనికి నిదర్శనం. ప్రభుత్వం మరిన్ని సదుపాయాలు కల్పిస్తే తమ సత్తా చాటుతామని వారంటున్నారు. – రావులపాలెం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏటా నిర్వహించే జిల్లాస్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు రావులపాలెం తదితర ప్రాంతాల విద్యార్థులు హాజరై జిల్లా జట్లకు ఎంపికయ్యారు. ఇప్పటికే జాతీయ, రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులు కూడా జిల్లా జట్లలో ఉన్నారు. ఈ విధంగా అండర్–14, అండర్–17 బాలబాలికల విభాగాల్లో 64 మందికి ఈ నెల 15వ తేదీ నుంచి రావులపాలెం జెడ్పీబాలుర హైస్కూల్ మైదానంలో ఎస్జీఎఫ్ జిల్లా జాయింట్ సెక్రటరీ, జాతీయ కోచ్ బండారు ప్రసాద్ పర్యవేక్షణలో శిక్షణ శిబిరం జరుగుతోంది. గతేడాది రాష్ట్ర జట్లకు ఎంపికై జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులు ఈ శిక్షణ శిబిరంలో పాల్గొంటున్నారు. నేషనల్స్ ఆడాను స్కూల్ గేమ్స్లో భాగంగా 2014–15లో అండర్–14 బాలుర విభాగంలో రాష్ట్ర జట్టుకు ఎంపికై మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జరిగిన నేషనల్స్ ఆడాను. అలాగే అనంతపురంలో 2014–15, 2015–16లో జరిగిన స్కూల్ గేమ్స్ రాష్ట్ర స్థాయి సాఫ్ట్బాల్ పోటీల్లో జిల్లా తరఫున ఆడాను. ఈ ఏడాది కూడా జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నా. టీమ్లో క్యాచర్గా వ్యవహరిస్తాను. ప్రభుత్వం ప్రోత్సహిస్తే మరింతగా రాణిస్తాం. – డి.గంగరాజు, పగడాలపేట సొంత ఖర్చులతోనే పోటీలకు.. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనా సొంత ఖర్చులు, దాతల సహకారంతో పోటీలకు వెళ్లాల్సి వస్తుంది. నిరుపేద కుటుంబంలో పుట్టినా ఈ క్రీడపై ఆసక్తితో ముందుకు సాగుతున్నా. గతేడాది దిల్లీలో జరిగిన నేషనల్స్లో రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించాను. సాఫ్ట్బాల్ క్రీడలో రాణిస్తే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉండడంతో ప్రోత్సాహం లేకపోయినా కష్టపడి పోటీలకు హాజరవుతున్నా. – పి.రూతు, దేవరపల్లి సాప్్టబాల్ సామగ్రికి ఖర్చు ఎక్కువ సాఫ్ట్బాల్ క్రీడకు సంబంధించిన సామగ్రి ఖర్చు ఎక్కువ. జట్టుకు కావాల్సిన కిట్టు కొనుగోలు చేయాలంటే రూ.లక్ష వెచ్చించాలి. స్లగ్గర్ ధర రూ.ఐదు వేల నుంచి∙రూ.35 వేల వరకూ ఉంది. జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీలకు కనీసం రూ.15 వేల స్లగ్గర్ అయినా ఉండాలి. అలాగే హె ల్మెట్ ధర రూ.రెండు వేలు, చెస్ట్మాస్క్ ధర రూ.1800, ప్యాడ్లు ధర రూ.2400, బాల్ ధర రూ.500, గ్లౌజ్ రూ.2400 వరకూ ఉంటాయి. ప్రభుత్వం క్రీడా సామగ్రి సమకూరిస్తే క్రీడాకారులకు ప్రయోజనకరంగా ఉంటుంది. – బండారు ప్రసాద్, కోచ్, ఎస్జీఎఫ్ జాయింట్ సెక్రటరీ పిచ్చింగ్, క్యాచింగ్ ముఖ్యం సాఫ్ట్బాల్ క్రీడలో విజయం సాధించాలంటే క్రీడాకారులు పిచ్చింగ్, క్యాచింగ్లలో ప్రావీణ్యం కనబర్చాలి. ఈ రెండు అంశాల్లో ఏ జట్టు ముందు ఉంటే వారిదే విజయం. ఈ అంశాల్లో ముమ్మర సాధన చేస్తున్నాం. గతేడాది దిల్లీలో జరిగిన నేషనల్స్లో అండర్–14 బాలికల విభాగంలో రాష్ట్ర జట్టు తరఫున ఆడాను. మన జట్టు నాలుగో స్థానంలో నిలిచింది. ప్రసుత్తం అనంతపురం జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా జట్టు తరఫున శిక్షణ పొందుతున్నా. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు వెళ్లే క్రీడాకారులకు ఆర్టీసీ, రైల్వే రాయితీలు కల్పిస్తే బాగుంటుంది. – కె.దేవి, జి.వేమవరం సాఫ్ట్బాల్కు ప్రభుత్వం ప్రోత్సాహాన్ని ఇవ్వాలి ప్రభుత్వం సాఫ్ట్బాల్ క్రీడాకారులకు క్రీడా సామగ్రి అందజేయాలి. 2015–16లో దిల్లీలో జరిగిన స్కూల్ గేమ్స్ నేషనల్స్ సాఫ్ట్బాల్ పోటీల్లో రాష్ట్ర జట్టు తరఫున ఆడాను. అండర్–14 బాలుర విభాగంలో పాల్గొన్నా. పాuý శాలల్లో సాఫ్ట్బాల్ క్రీడా సామగ్రిని ప్రభుత్వం అందుబాటులో ఉంచితే శిక్షణకు ఎంతగానో ఉపకరిస్తుంది. – కె.శ్యామ్ప్రసాద్, పగడాలపేట -
గంజాయి స్వాధీనం
రావులపాలెం : మొక్కజొన్న పొత్తుల రవాణా ముసుగులో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకోవడంతోపాటు గంజాయిని, ట్రాన్స్పోర్టుకు ఉపయోగించిన వ్యాన్, కారును రావులపాలెం పోలీసులు పట్టుకున్నారు. ఈ సంఘటనకు సబంధించిన వివరాలను గురువారం రావులపాలెం పోలీస్స్టేçÙన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ పీవీ రమణ వెల్లడించారు. విశాఖ ఏజెన్సీ నుంచి రావులపాలెం మీదుగా ఇతర రాష్ట్రాలకు గంజాయిని అక్రమంగా తలిస్తున్నట్టు రావులపాలెం పోలీసులకు సమాచారం అందటంతో ఎస్సై పీవీ త్రినాథ్ సిబ్బందితో కలసి పట్టుకున్నారు. రావులపాలెం మండలం రావులపాడు మల్లాయిదొడ్డి బుధవారం తెల్లవారు జామున పోలీసులు కాపుగాశారు. ఈ సమయంలో వ్యాన్లో మొక్కజొన్న పొత్తులను పైకి కనిపించే విధంగా ఉంచి అడుగున గంజాయి బ్యాగులు పెట్టి రవాణాకు శ్రీకారం చుట్టారు.ఈ వాహనానికి ముందు కారులో ముందస్తు సమాచారం ఇస్తూ రవాణాకు సహకరిస్తున్న రావులపాలేనికి చెందిన వి.పెదిరాజు, గుడాల సుబ్రహ్మణ్యం, విశాఖ జిల్లా పోతురాజుగుమ్మల గ్రామానికి చెందిన బురిడి బాలరాజులను పోలీసులు అరెస్టు చేశారు. వ్యాన్ను తనిఖీ చేయగా దానిలో 23 బ్యాగుల్లో రూ. 23,52,000 విలువైన 784 కేజీ గంజాయిని పోలీసులు గుర్తించారు. అదుపులోకి తీసుకున్న వారిని విచారించగా తునికి చెందిన కొరుప్రోలు దుర్గాప్రసాద్ ద్వారా ఈ లోడు వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. వ్యాన్లో డ్రైవర్ వి.నూకరాజు పరారవడంతో అతనితోపాటు దుర్గాప్రసాద్ను అరెస్టు చేయాల్సి ఉందని సీఐ రమణ తెలిపారు. గంజాయి తరలింపును చాకచక్యంగా పట్టుకున్న ఎస్సై పీవీ త్రినాథ్, ఏఎస్సై ఆర్వీ రెడ్డి, హెచ్సీ స్వామి, కానిస్టేబుళ్లు సతీష్, మూర్తి తదితరులను సీఐ అభినందించారు. నిందితులను కొత్తపేట కోర్టులో హజరుపరచనున్నట్టు తెలిపారు. -
ఆ ‘రజత’ ప్రస్థానంలో రావులపాలెం ఓ మజిలీ
సీఆర్సీలో పలు టోర్నమెంట్లలో సత్తా చాటిన పీవీ సింధు 2009లో రాష్ట్రస్థాయి సింగిల్స్, డబుల్స్లో గెలిచిన తెలుగు తేజం అనంతరం పలు అంతర్జాతీయ పోటీల్లోనూ విజయాలు రావులపాలెం : రియో ఒలింపిక్స్లో దేశానికి రజత పతకాన్ని సాధించిన తెలుగు తేజం పీవీ సింధు క్రీడా ప్రస్థానంలో కోనసీమ ముఖద్వారం రావులపాలెం ఓ ముఖ్యమైన మజిలీ అని చెప్పవచ్చు. జాతీయస్థాయి ప్రమాణాలతో ఇక్కడి కాస్మోపాలిటన్ రిక్రియేషన్ క్లబ్( సీఆర్సీ)లో ఉన్న ఇండోర్ స్టేడియంలో ఎన్నోఏళ్ళుగా పలు రాష్ట్ర, జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించారు. పలు టోర్నమెంట్లలో సింధు 14–15 ఏళ్ళ ప్రాయంలోనే పాల్గొని విజయదుందు«భి మోగించింది. ముఖ్యంగా 2009 ఆగస్టులో రాష్ట్రస్థాయిలో ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సెలక్షన్స్ కం టోర్నమెంట్లో ఎలాంటి అంచనాలూ లేకుండా బరిలో దిగిన సింధు సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో విజయం సాధించింది. జాతీయస్థాయ పోటీలకు ఎంపికైంది. అప్పటికే పుల్లెల గోపీచంద్ అకాడమీలో శిక్షణ పొందిన ఆమె తన ఆటతీరుతోప్రత్యర్థులను హడలెత్తించింది. ఆ ఏడాది జాతీయస్థాయిలో జరిగిన వివిధ టోర్నమెంట్లలో రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించి జాతీయస్థాయిలోనూ గుర్తింపు పొందింది. తర్వాత పలు అంతర్జాతీయ పోటీల్లో సైతం ఎన్నో విజయాలు అందుకుంది. సింధు సీఆర్సీలో ఆడటం గర్వకారణం రియో ఒలింపిక్స్లో రజత పతకం సా«ధించి దేశానికి ఖ్యాతి తెచ్చిన సిం««దlుసీఆర్సీ ఇండోర్స్టేడియంలో పలు టోర్నమెంట్లు ఆడటం మాకెంతో గర్వకారణం.చిన్న వయసు నుంచి చూపిన ప్రతిభే నేడు ఆమెను ఈ స్థాయిలో నిలబెట్టింది.సింధు వంటి క్రీడాకారిణులు అంతర్జాతీయ స్థాయికి ఎదగడంలో సీఆర్సీలో నిర్వహించిన పోటీలు ఎంతగానో ఉపకరించాయి. – నందం సత్యనారాయణ, సీఆర్సీ అధ్యక్షుడు సింధుకు మరింత ఉజ్వల భవిష్యత్తు ఎంతో కృషితో రియో ఒలింపిక్స్లో రజత పతకం సాధంచిన సింధు దేశానికి ఎంతో గర్వకారణం. ఏపీబీఏ ఉపాధ్యక్షుడిగా పలు టోర్నమెంట్లలో సింధు ఆటను దగ్గరగాచూశాను. ఆమెతో కలసి ఇండియా జట్టు మేనేజర్గా ఇండోనేషియా సూపర్ సిరీస్కు వెళ్లాను. సింధుకు మరింత ఉజ్వల భవిష్యత్ ఉంది. మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను. – తేతలి నారాయణరెడ్డి, ఏపీబీఏ ఉపాధ్యక్షుడు -
రెండు షాపుల్లో భారీ అగ్ని ప్రమాదం
రావులపాలెం : తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం ఊబలంక గ్రామంలో రెండు దుకాణాల్లో శనివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రాత్రి 9 గంటల సమయంలో భారీగా మంటలు ఎగసిపడడంతో స్థానికులు అగ్ని మాపక విభాగానికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చేసరికే షాపులు పూర్తిగా దగ్ధం అయ్యాయి. సుమారు రూ.3 లక్షల మేర ఆస్తినష్టం జరిగి ఉంటుందని సమాచారం. -
ఆర్టీసీ బస్సు, బైక్ ఢీ : ఒకరు మృతి
రావులపాలెం (తూర్పుగోదావరి) : రావులపాలెం మండలం రావులపాడు శివారు మల్లాయిదొడ్డి వద్ద జాతీయరహదారిపై సోమవారం ఆర్టీసీ బస్సు.. బైక్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్పై ప్రయాణిస్తున్న తమలంపూడి సత్యనారాయణ రెడ్డి(55) అనే వ్యక్తి మృతిచెందారు. సత్యనారాయణరెడ్డి స్వగ్రామం ఆలమూరు మండలం జొన్నాడ గ్రామం. ఈయన గతంలో ఆలమూరు మండల ఇటుక బట్టీల అసోసియేషన్ అధ్యక్షునిగా కూడా పనిచేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఫిర్యాదుదారుడే ప్రధాన నిందితుడు..
కాకినాడ(తూర్పుగోదావరి) : రావులపాలెంలోని ఓ ఏటీఎమ్ లో చోరికి పాల్పడిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఈ కేసులో అసలు ట్విస్ట్ ఏమంటే.. ఫిర్యాదుచేసిన వ్యక్తే చోరీకి పాల్పడటం గమనార్హం. పోలీసుల కథనం ప్రకారం.. ప్రదీప్ కుమార్ అనే వ్యక్తి రావులపాలెంలోని ఓ ఏటీఎమ్ కేంద్రంలో చోరీకి పాల్పడ్డాడు. స్థానిక పోలీస్ స్టేషన్లో చోరీ విషయంపై ఫిర్యాదు చేశాడు. అయితే, ఫిర్యాదుదారుడిపై అనుమానం వచ్చిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. చోరీకి పాల్పడ్డట్లు ప్రదీప్ కుమార్ అంగీకరించాడు. ఇందులో ప్రమేయమున్న మరో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.31.73 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
కుటుంబకలహాలతో వ్యక్తి ఆత్మహత్య
రావులపాలెం (తూర్పుగోదావరి) : కుటుంబకలహాలతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం పొడగట్లపల్లిలో ఆదివారం ఉదయం జరిగింది. వివరాల ప్రకారం.. పొడగట్లపల్లి గ్రామానికి చెందిన పెంటయ్య(42) ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కాగా గత కొన్ని రోజులుగా కుటుంబసభ్యులతో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన పెంటయ్య ఆదివారం ఉదయం పురుగుల మందు తాగాడు. ఆ తర్వాత మద్యం సేవించడం కోసం మద్యం దుకాణానికి వెళ్లి అక్కడే పడిపోయాడు. ఇది గమనించిన స్థానికులు 108 సాయంతో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను మృతిచెందాడని వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఆకాశంలో అద్భుతం!
-
ఆకాశంలో అద్భుత దృశ్యం
రావులపాలెం: సమయం.. బుధవారం ఉదయం 11 గంటలు.. ఎండ చుర్రుమంటున్న వేళలో అనుకోకుండా ఆకాశం వైపు చూసిన వారికి కనువిందైన దృశ్యం కనిపించింది. మబ్బుల నడుమ సూర్యుని చుట్టూ ఇంద్రధనుస్సు మాదిరిగా రంగుల వలయం ఏర్పడింది. వలయపు అంచుకు, సూర్యునికి మధ్య పలచటి చీకటి అలముకున్నట్టు నల్లగా ఉంది. తూర్పు గోదావరి జిల్లాలో.. ప్రధానంగా కోనసీమ ప్రాంతంలో ఈ విశేషం చాలాసేపు కనిపించింది. ఈ వలయం రాబోయే ఉత్పాతానికి సంకేతమని కొందరు భావిస్తే.. మరికొందరు కలియుగాంతానికి సూచన అనేంతవరకూ ఊహాగానాలు వ్యాపించాయి. కానీ ఇది తుఫాను రాకకు సంకేతం కావచ్చని రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల ఫిజిక్స్ విభాగం రీసెర్చ్ డెరైక్టర్ డాక్టర్ కె.రామచంద్రరావు తెలిపారు. ఇలాంటి వలయాన్ని శాస్త్త్రవేత్తలు ‘హాలో’ అంటారన్నారు. భూమికి ఏడు వేల మీటర్ల ఎత్తున దుమ్ముధూళితో కూడిన అణువులు దట్టమైన ‘హై సిర్రస్’ మేఘాలుగా మారి, వాటిలో మంచు స్ఫటికాలు ఏర్పడతాయని వివరించారు. సూర్యకాంతి వాటిపై పడి పరావర్తనం, వక్రీభవనం చెంది ఏడు రంగులుగా మారి ఈ వలయాలు ఆవిష్కృతమవుతాయన్నారు. -
బైక్ను ఢీకొన్న లారీ : ఒకరు మృతి
రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలోని పుష్కరఘాట్ వద్ద బుధవారం బైక్ను వెనుక నుంచి వస్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న బొక్కా నాగమణి (35) అక్కడికక్కడే మరణించింది. ఆమె భర్త సుబ్రహ్మణ్యం స్వలంగా గాయపడ్డారు. దాంతో స్థానికులు వెంటనే స్పందించి అతడిని ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అలాగే నాగమణి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని... పోస్ట్మార్టం నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నాగమణి, ఆమె భర్త సుబ్రహ్మణ్యం రావులపాలెంలో పుష్కర స్నానం ఆచరించి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. -
రూ.4800 కోట్లతో బకింగ్హామ్ కెనాల్ అభివృద్ధి
రావులపాలెం : పాత బకింగ్హామ్ కెనాల్ను రూ.4800 కోట్లతో అభివృద్ధి చేయడం ద్వారా జలరవాణాను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రధాని నరేంద్రమోదీ ఆమోద ముద్ర వేశారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తెలిపారు. దీంతోపాటు గోదావరి, కృష్ణ, కావేరి నదులను అనుసంధానం చే యడానికి కూడా ప్రధాని ఆమోదం తెలిపారనన్నారు. జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన శుక్రవారం రావులపాలెంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తమలంపూడి రామకృష్ణారెడ్డి నివాసంలో విలేకర్లతో మాట్లాడారు. ఏటా గోదావరి నదిలో సుమారు 3 వేల టీఎంసీల నీరు వృథాగా సముద్రం పాలవుతోందని, దీనిని దృష్టిలో పెట్టుకుని కేంద్రం పోలవరం ప్రాజెక్టు ద్వారా దేశంలోనే మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో నదుల అనుసంధాన ప్రక్రియను ప్రారంభించనున్నదని తెలిపారు. తద్వారా గోదావరి మిగులు జలాలను సాగునీరు లేని ప్రాంతాలకు తరలించేందుకు వీలవుతుందన్నారు. రాష్ట్రంలో నదుల అనుసంధానికి నాందిగా పుష్కర శోభాయాత్ర నిర్వహించామన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 4,800 మంది ఆయా ప్రాంతాల్లోని జలాలను పాత్రల్లో తీసుకువచ్చి గోదావరిలో కలిపి తిరిగి ఆ పాత్రలతో గోదావరి జలాలను తీసుకువెళ్లి వారి ప్రాంతాల్లోని దేవతామూర్తులకు అభిషేకిస్తారన్నారు. -
పుష్కర స్నానానికి వెళ్లి ఇద్దరి గల్లంతు
రావులపాలెం : తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం మండలం ఓబులంకలో పుష్కర స్నానానికి వెళ్లిన ఇద్దరు గుర్తుతెలియని యువకులు గల్లంతయ్యారు. ఈ ఘటన గురువారం ఓబులంకలోని పుష్కర ఘాట్లో జరిగింది. వారి ఆచూకీ తెలుసుకునేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది. -
పంచారామాలకు ప్రత్యేక బస్సులు
రావులపాలెం: కార్తీక మాసం సందర్భంగా రావులపాలెం డిపో నుంచి పంచారామాలకు ప్రత్యేక బస్సు సర్వీసులు నడపనున్నట్టు ఆర్టీసీ డిపో మేనేజర్ జి.కామరాజు సోమవారం తెలిపారు. ఈ నెల 26, వచ్చే నెల 2, 9,16 తేదీల్లో ఆదివారం రాత్రి ఎనిమిది గంటలకు రావులపాలెం నుంచి ఈ సర్వీసులు బయలుదేరుతాయన్నారు. పంచారామాలైన అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోటలోని ఐదు శైవ కేత్రాలను సోమవారం రోజున దర్శింపజేస్తామన్నారు. వ్యాపారులు, ఉద్యోగులు, విద్యార్థులు గ్రూపులుగా ఏర్పడితే ప్రత్యేక సర్వీసు ఏర్పాటు చేస్తామని చెప్పారు. డీలక్స్లో పెద్దలకు రూ.665, పిల్లలకు రూ.515, ఎక్స్ప్రెస్లో పెద్దలకు రూ.590, పిల్లలకు రూ.515 చార్జీలతో రిజర్వేషన్ చేయించుకోవచ్చునన్నారు. వివరాలకు 08855 255388, 99592 25549 నంబర్లకు సంప్రదించాలన్నారు. -
పదో తరగతి విద్యార్థినిపై సామూహిక లైంగికదాడి
రావులపాలెం : పదో తరగతి విద్యార్థినిపై సామూహిక లైంగికదాడి జరిగిన ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. రావులపాలెం పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రావులపాలెం మండలం లక్ష్మీపోలవరానికి చెందిన ఆ బాలిక అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటూ, పక్క గ్రామమైన పొడగట్లపల్లి హైస్కూల్లో పదో తరగతి చదువుతోంది. ఈనెల ఆరున ఉదయం పాఠశాలకు వెళుతుండగా ఆ గ్రామానికి చెందిన గెద్దాడ శ్రీను అనే యువకుడు, మరో నలుగురు అటకాయించారు. ఆమెను సమీపంలో ఉన్న ఒక ఇంటిలోకి లాక్కుపోయి లైంగికదాడి జరిపారు. బాలిక కేకలు విని కొందరు రావడంతో అయిదుగురూ పరారయ్యారు. విషయం తెలిసిన బాలిక పిన్ని ఆమెను అడిగి వివరాలు తెలుసుకుంది. జరిగిన దారుణాన్ని గ్రామ పెద్దల దృష్టిలో పెట్టారు. అయినా న్యాయం జరగకపోవడంతో సోమవారం బాధిత బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం కొత్తపేట ఆస్పత్రికి తరలించారు. అమలాపురం డీఎస్సీ ఎం.వీరారెడ్డి దర్యాప్తు చేస్తున్నారని ఎస్సై బీఎస్ అప్పారావు తెలిపారు. -
రోజుకో కొత్తకోణం..!
కిడ్నీ రాకెట్పై ముమ్మర దర్యాప్తు కృష్ణప్రసాద్ను ప్రశ్నించిన పోలీసులు! సాక్షి ప్రతినిధి, విజయవాడ : కిడ్నీ రాకెట్పై పోలీసుల దర్యాప్తులో మరో కోణం వెలుగులోకి వచ్చింది. తూర్పుగోదావరి జిల్లా రావులపాలేనికి చెందిన వ్యక్తికి ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు అతడి కోసం ఓ బృందం రావులపాలెం వెళ్లినట్లు సమాచారం. మరో బృందం హైదరాబాద్లోని సత్య కిడ్నీ సెంటర్తో వివరాలు సేకరించేందుకు వెళ్లింది. అసలు కిడ్నీ విక్రయించేందుకు సిద్ధమైన మిరియాల క్రాంతి దుర్గాప్రసాద్ తండ్రి కృష్ణప్రసాద్ విజయవాడ సత్యనారాయణపురంలో ఉంటున్నట్లు గుర్తించిన పోలీసులు సోమవారం అతన్ని ప్రశ్నించగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించినట్లు తెలిసింది. కిడ్నీ విక్రయించడం తెలియకే... క్రాంతి దుర్గాప్రసాద్ కిడ్నీని అమ్ముకునేందుకు సిద్ధపడినట్లు తెలిసింది. ఎలా విక్రయించాలో తెలియక కొంతమందిని సంప్రదించినట్లు సమాచారం. వారి సూచన మేరకు తూర్పుగోదావరి జిల్లా రావులపాలేనికి చెందిన కిడ్నీ రాకెట్ ముఠా సభ్యుడిని కలిసినట్లు తెలిసింది. ఆయన సూచనల మేరకు దొంగ సర్టిఫికెట్లు పుట్టించి హైదరాబాద్లోని సత్య కిడ్నీ సూపర్స్పెషాలిటీ వైద్యశాలను సంప్రదించినట్లు సమాచారం. రావులపాలేనికి చెందిన వ్యక్తి గతంలోనూ కొందరి కిడ్నీలు విక్రయించినట్లు తెలుస్తోంది. ఆ వ్యక్తిని పట్టుకుంటేనే కిడ్నీ రాకెట్ ఎలా సాగుతుందనేది తేలే అవకాశం ఉంది. విజయవాడలోనే క్రాంతి దుర్గాప్రసాద్! క్రాంతి దుర్గాప్రసాద్ ప్రస్తుతం ఎయిర్ కూలర్లకు మరమ్మతులు చేసుకుంటూ విజయవాడలోనే ఉంటున్నాడు. పోలీసులకు అతను దొరికాడా.. అతను ఇచ్చిన సమాచారం మేరకే దర్యాప్తును ముమ్మరం చేశారా.. లేక మరెవరైనా సమాచారం ఇచ్చారా.. అనేది వెల్లడికావాల్సి ఉంది. ఈ కేసు దర్యాప్తు గురించి పోలీసులు మాత్రం నోరుమెదపడం లేదు. -
యువనాయకత్వం కావాలి: రావులపాలెం వాసులు
-
‘ట్రావెల్స్’ బస్సు, లారీ ఢీ
ఈతకోట(రావులపాలెం), న్యూస్లైన్ :జాతీయ రహదారిపై మండలంలోని ఈతకోట సెంటర్ సమీపంలో శనివారం ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, లోడ్ లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే చనిపోగా, బస్సులో ఉన్న ముగ్గురితో పాటు లారీ క్లీనర్కు గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.విజయవాడలోని రామలింగేశ్వర నగర్కు చెందిన పోతన శ్రీనివాసరావు(48) డ్రైవర్ అండ్ ఓనర్గా ఏసయ్య లారీ సర్వీసును నడుపుతున్నాడు. విజయవాడకు చెందిన క్లీనర్ నాగిరి ఏసుతో కలిసి ఈతకోటలోని ఓ రైస్ మిల్లుకు లోడ్తో వచ్చాడు. సరుకును అక్కడ దించి వేసి, అనంతరం తిరిగివెళ్లేందుకు జాతీయ రహదారిపై ఉన్న డివైడర్ దాటేందుకు శ్రీనివాసరావు రాంగ్ రూట్లో ఈతకోట సెంటర్కు రావులపాలెం వైపు వస్తున్నాడు. ఇదే రూట్లో అమలాపురం నుంచి హైదరాబాద్కు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎదురుగా వచ్చింది. ఈతకోట సెంటర్ సమీపంలో రాంగ్ రూట్లో వస్తున్న లారీని గమనించని బస్సు డ్రైవర్.. వేగంగా లారీని ఢీ కొట్టాడు. ప్రమాద సమయంలో లారీలో ఇద్దరు, బస్సులో ముగ్గురు మాత్రమే ఉన్నారు. బస్సులో అంతగా ప్రయాణికులు లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది. లారీని బస్సు వేగంగా ఢీకొనడంతో లారీ క్యాబిన్లో ఇరుక్కున్న శ్రీనివాసరావు తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మరణించాడు. లారీ క్లీనర్ ఏసుకు గాయాలయ్యాయి. ప్రమాద తీవ్రతకు బస్సులోని ఇద్దరు డ్రైవర్లు, క్లీనర్.. ముందు అద్దం పగులగొట్టుకుంటూ రోడ్డుపై పడ్డారు. సమాచారం అందుకున్న 108, హైవే అంబులెన్స్లు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. క్షతగ్రాతులను రాజమండ్రి ఆస్పత్రికి తరలించాయి. రావులపాలెం ఎస్సై ఆర్.గోవిందరాజు ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించారు. క్రేన్ సాయంతో వాహనాలను తొలగించారు. లారీ క్యాబిన్లో చిక్కుకున్న డ్రైవర్ మృతదేహాన్ని బయటకుతీసి, పోస్ట్మార్టం కోసం కొత్తపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బస్సులో ఇద్దరు డ్రైవర్లు, క్లీనర్ ఉన్నారు. రాజోలుకు చెందిన డ్రైవర్ చెల్లుబోయిన శ్రీను బస్సును నడుపుతున్నాడు. ఇతడికి ప్రమాదంలో చెయ్యి, తలకు గాయాలయ్యాయి. మురమళ్లకు చెందిన మరో డ్రైవర్ పి.శ్రీనివాస్(సత్తిబాబు) వెనుక సీటులో నిద్రిస్తున్నాడు. అతడికి కూడా తలు, చెయ్యికి గాయలయ్యాయి, అదే గ్రామానికి చెందిన క్లీనర్ వి.ప్రసాద్ కాలికి గాయమైంది. ప్రమాదం జరిగిన తీరు చూస్తే అతివేగంగా వస్తున్న ట్రావెల్స్ బస్సు డ్రైవర్ అప్రమత్తంగా లేకపోవడం, తొందరపాటుతో లారీ డ్రైవర్ రాంగ్రూట్ లో రావడమే ప్రమాదానికి కారణమని చెబుతున్నారు. -
కాపు రిజర్వేషన్లతోనే కాంగ్రెస్కు మనుగడ
రావులపాలెం, న్యూస్లైన్:కాపు కులస్తులకు చాలాకాలం నుంచి ఉన్న రిజర్వేషన్లను పునరుద్ధరిస్తేనే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మనుగడ ఉంటుందని రాష్ట్ర తెలగ, బలిజ, కాపు(టీబీకే) జాయింట్ యాక్షన్ కమిటీ కోఆర్డినేటర్ దాసరి రాము ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కాపు, తెలగ, బలిజ కులాలను బీసీ జాబితాలో చేర్చాలని కోరారు. హైదరాబాద్పై రాష్ట్రంలో అందరికీ హక్కు కల్పిస్తూ నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆదివారం రావులపాలెం జాతీయ రహదారిని కోనసీమ టీబీకే జేఏసీ ఆధ్వర్యంలో దిగ్బంధం చేశారు. ఈ సందర్భంగా కళావెంకట్రావు సెంటర్లో రాష్ట్ర కాపునాడు నేత, డీసీసీబీ మాజీ డెరైక్టర్ ఆకుల రామకృష్ణ అధ్యక్షతన జరిగిన సభలో రాము మాట్లాడుతూ 2004 కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ ప్రకారం తెలగ, బలిజ, కాపు కులస్తులకు వెంటనే బీసీ రిజర్వేషన్లు వర్తింపజేయాలన్నారు. 1910-1966 మధ్య అమలైన రిజర్వేషన్లను కాంగ్రెస్ ప్రభుత్వాలే రద్దు చేశాయన్నారు. దీంతో కాపు కులస్తుల విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అడుగంటాయన్నారు. ముద్రగడ పద్మనాభం, సలాది స్వామినాయుడు, నల్లా సూర్యచంద్రరావు తదితరుల ఉద్యమాలతో 1994లో కాంగ్రెస్ ప్రభుత్వం జీఓ 30 విడుదల చేసిందన్నారు. ఎవరి పోరాటంతో ఈ జీఓ జారీ అయిందో వారినే ప్రభుత్వం విస్మరించిందని ఆయన మండిపడ్డారు. 2004 ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముస్లింలకు మూడు నెలల్లో 4శాతం రిజర్వేషన్లు కల్పించారని గుర్తు చేశారు. అయితే కాంగ్రెస్ మేనిఫెస్టోలోనే కాపు రిజర్వేషన్ల అంశం కూడా ఉన్నప్పటికీ అమలు చేయకపోవడం కాపులను మోసం చేయడమేన్నారు. ఇప్పటికైనా ఈ రిజర్వేషన్లు పునరుద్ధరించకుంటే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేందుకు కాపులు సిద్ధంగా ఉండాలని పిలుపు నిచ్చారు. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మాట్లాడుతూ అనేక కాపు ఉద్యమాలకు రావులపాలెం వేదికగా నిలిచిందని గుర్తు చేశారు. తమకు న్యాయం చేసే పార్టీలకే కాపులు పట్టం కట్టాలన్నారు. రాజకీయాలను శాసించేలా ఏక తాటిపై ఉద్యమించాలన్నారు. రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు మాట్లాడుతూ కాపు రిజర్వేషన్ల సాధనకు కృషిచేసే పార్టీలను గెలిపించేందుకు కాపులు కట్టుబడి ఉండాలన్నారు. తమకు ప్రత్యేక రిజర్వేషన్లు కోరుతున్నాం తప్ప బీసీ రిజర్వేషన్లలో వాటా పంచమని అడగడంలేదన్నారు. వైఎస్సార్ సీపీ పి.గన్నవరం కోఆర్డినేటర్ మిండగుదిటి మోహన్ మాట్లాడుతూ కాపు రిజర్వేషన్ల సాధనకు నాయకులందరూ పార్టీలకు అతీతంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కోనసీమ టీబీకె కన్వీనర్ కల్వకొలను తాతాజీ, రావులపాలెం కాపు సంఘం అధ్యక్షుడు నందం వీరవెంకటసత్యనారాయణ, మాజీ ఎంపీ ఏజేవీబీ మహేశ్వరరావు ఇంకా బండారు శ్రీను, సాధనాల శ్రీనివాసరావు, ఆకుల భీమేశ్వరరావు, సలాది రామకృష్ణ పాల్గొన్నారు. -
ఆటోను ఢీకొన్న ‘కంటైనర్’
రావులపాడు (రావులపాలెం), న్యూస్లైన్ :పుట్టిన రోజు కోసం కుమారుడికి దుస్తులు కొనేందుకు మార్కెట్కు బయలుదేరిన తల్లి రోడ్డు ప్రమాదంలో మరణించిన విషాద సంఘటన ఇది. బుధవారం రావులపాలెం మండలం రావులపాడులో ఆటోను కంటైనర్ లారీ ఢీకొన్న సంఘటనలో ఇదే గ్రామంలోని మల్లాయిదొడ్డికి చెందిన శీలం లక్ష్మి(30) మరణించింది. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. రావులపాలెం మార్కెట్లో తన బిడ్డకు దుస్తులు కొనేందుకు శీలం లక్ష్మి ఐదేళ్ల కుమారుడు సతీష్తో కలిసి స్థానిక సెంటరులో ఆటో ఎక్కింది. జాతీయ రహదారిపై లక్ష్మీ పోలవరానికి వెళ్లే సెంటరు వద్దకు ఆటో చేరుకునేసరికి వెనుక నుంచి కంటైనర్ లారీ ఢీకొంది. ఆటో నుంచి లక్ష్మి కిందపడడంతో లారీ ఆమెను కొంతదూరం ఈడ్చుకుపోయింది. ఆమె లారీ వెనుకచక్రం కిందపడడంతో తల చర్మం ఊడిపోయి, తీవ్ర గాయాలతో అక్కడికక్కడే చనిపోయింది. ఆమె కుమారుడు సతీష్ సురక్షితంగా ఉన్నా డు. ఇదే ప్రమాదంలో ఆ టోలో ప్రయాణిస్తున్న గో పాలపురం గ్రామానికి చెం దిన పితాని వెంకటలక్ష్మి, మాదే అబద్దం, రావులపాలేనికి చెందిన మల్లిడి లక్ష్మిలకు స్వల్ప గాయాలయ్యాయి. వీరిని హైవే అంబులెన్స్లో కొత్తపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. హైవేపై గుంతలే కారణం ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జాతీయ రహదారిలో అనేకచోట్ల భారీ గుంతలు పడ్డాయి. హైవే అధికారులు పట్టించుకోకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ప్రమాదం జరిగిన చోట జాతీయ రహదారిలో పెద్ద గొయ్యి పడింది. వాహ నాలు అందులో పడకుండా ఉండేందుకు బారికేడ్ను అడ్డంగా ఉంచారు. వేగంగా వచ్చిన కంటైనర్ లారీ ఆ గొయ్యిని తప్పించే క్రమంలో అదుపుతప్పడంతో ముందు వెళ్తున్న ఆటోను ఢీకొందని స్థానికులు తెలిపారు. శోకసంద్రంలో మృతురాలి కుటుంబం మనవడి పుట్టిన రోజున దుస్తులు కొనేందుకు వెళ్లిన కోడలు.. తిరిగిరానికి లోకానికి వెళ్లిపోయిందని మృతురాలి అత్త మంగాయమ్మ, ఇతర కుటుంబ సభ్యులు తీవ్రంగా రోదించారు. వ్యవసాయ కూలీ అయిన తన కుమారుడు పొరుగు ఊరికి పనికి వెళ్లాడని, అతడు వచ్చి అడిగితే తానేమి సమాధానం చెప్పాలంటూ మంగాయమ్మ విలపించడం చూపరులకు కంటతడి పెట్టించింది. అడిషనల్ ఎస్సై ఎంఏ బాబూరావు కేసును దర్యాప్తు చేస్తున్నారు -
రావులపాలెంలో షర్మిల సమైక్య శంఖారావం
-
'దమ్ముంటే చంద్రబాబు ప్రజలకు వివరించాలి'
రావులపాలెం : రాష్ట్రంలో చదువుకున్న ప్రతి విద్యార్థి ఉద్యోగం కోసం హైదరాబాద్ వైపే చూస్తున్నాడని షర్మిల అన్నారు. పదేళ్లలో హైదరాబాద్ లాంటి రాజధాని కట్టుకోవటం సాధ్యమేనా అని ఆమె ప్రశ్నించారు. సమైక్య శంఖారావంలో భాగంగా షర్మిల శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో ప్రసంగించారు. రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థులు ఉన్నత చదువులు చదవడానికి కారణం వైఎస్ రాజశేఖరరెడ్డేనని ఆమె ఈ సందర్బంగా గుర్తు చేశారు. లక్షలు విలువ చేసే వైద్యాన్ని ఉచితంగా అందించిన ఘటన వైఎస్దన్నారు. విభజన పేరుతో అన్నదమ్ముల మధ్య అగ్గి పెట్టి కాంగ్రెస్ చలికాచుకుంటోందని షర్మిల మండిపడ్డారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలనే ఏకైక లక్ష్యంతో కోట్లాది రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ అన్యాయం చేస్తోందని ఆమె ధ్వజమెత్తారు. రాష్ట్రానికి 50 శాతానికి పైగా ఆదాయం హైదరాబాద్ నుంచే వస్తుందని, ఎలాంటి పరిష్కారాలు చూపకుండా రాష్ట్రాన్ని విభజించడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. బ్లాంక్ చెక్ మీద సంతకం పెట్టినట్లు తెలంగాణకు అనుకూలంగా చంద్రబాబు లేఖ ఇచ్చారని షర్మిల అన్నారు. 60 శాతం ప్రజలకు అన్యాయం జరిగినా కాంగ్రెస్ను చంద్రబాబు ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. ప్రజలను మభ్యపెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు. తెలంగాణ అనుకూల లేఖ వెనక్కి తీసుకోకుండా చంద్రబాబు ఢిల్లీకెళ్లి ఏం ప్రయోజనం ఉంటుందన్నారు. చీకట్లో చిదంబరంను కలిసి కాంగ్రెస్తో కుమ్మక్కయ్యేందుకే చంద్రబాబు ఢిల్లీ పర్యటన అని అన్నారు. ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారో దమ్ముంటే చంద్రబాబు ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. 'వైఎస్ఆర్ చంద్రబాబును చూసి భయపడేవారంట..చంద్రబాబును చూసి భయపడటానికి ఏమైనా అంటు వ్యాధులున్నాయా' అని షర్మిల ప్రశ్నించారు. ఓట్లేసి గెలిపించిన ప్రజలకంటే కాంగ్రెస్, టీడీపీ నేతలకు పదవులే ఎక్కువయ్యాయని ఆమె అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం వైఎస్ఆర్ సీపీ తన వంతుగా పోరాడుతోందని, జగనన్న, విజయమ్మ సహా వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలందరూ రాజీనామాలు చేశారని షర్మిల తెలిపారు. -
రావులపాలెంలో షర్మిళ సమైక్య శంఖారావం
-
రావులపాలెంలో సమైక్య శంఖారావాన్ని పూరించునున్న షర్మిల
-
రావులపాలెం జాతీయరహదారి ముట్టడి