refund
-
షారుఖ్ ఖాన్కి రూ.9 కోట్లు వెనక్కి..
బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్కి (Sharukh Khan) మహారాష్ట్ర ప్రభుత్వం వెనక్కి ఇస్తోంది. సముద్రానికి ఎదురుగా ఉన్న తన బంగ్లా 'మన్నత్' (Mannat) లీజును యాజమాన్యంగా మార్చుకునేందుకు అధికంగా చెల్లించిన రూ.9 కోట్లను మహారాష్ట్ర ప్రభుత్వం తిరిగి ఇవ్వనుంది.2019లో షారుఖ్ ఖాన్, ఆయన భార్య గౌరీ ఖాన్ బాంద్రాలోని పురాతన ఆస్తిని 'క్లాస్ 1 పూర్తి యాజమాన్యం'గా మార్చారని, దాని కోసం కొంత ప్రీమియం ప్రభుత్వానికి చెల్లించారని రెసిడెంట్ సబర్బన్ కలెక్టర్ సతీష్ బాగల్ తెలిపారు. ప్రీమియం లెక్కింపులో ట్యాబులేషన్ లోపాన్ని గుర్తించిన తర్వాత, షారుఖ్ ఖాన్ దంపతులు ఇటీవల మంజూరైన రీఫండ్ కోసం రెవెన్యూ అథారిటీకి దరఖాస్తు చేసుకున్నారని ఆయన వివరించారు.మన్నత్ భవనం లీజ్ కన్వర్షన్ కోసం షారుఖ్ ఖాన్ దంపతులు మహారాష్ట్ర ప్రభుత్వానికి రూ. 25 కోట్లకు పైగా ప్రీమియం చెల్లించినట్లు మీడియా కథనాలు వచ్చాయి. అయితే ఇది ఎంత వరకూ వాస్తవం అన్నది అధికారులు ధ్రువీకరించలేదు.ఇంద్ర భవనమే!బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నివసించే రూ. 200 కోట్ల విలువైన బంగ్లా మన్నత్ ఇంద్ర భవనాన్ని తలపిస్తుంది. ఈ భవనాన్ని చూసేందుకు అభిమానులు తండోపతండాలుగా వస్తుంటారు. ఈ ఇంటి ఇంటీరియర్ డిజైనింగ్ అంతా గౌరీ ఖాన్ (Gouri Khan) స్వయంగా చేయించారు.ఈ బంగ్లాను షారుఖ్ ఖాన్ 2001లో కొనుగోలు చేశారు. ఆ తర్వాత దానికి మన్నత్ అని పేరు పెట్టారు. గౌరీ ఖాన్ తన భర్త షారుఖ్ కోసం ఇంట్లో ప్రత్యేకంగా ఓ కార్నర్ ని తయారు చేయించారు. అక్కడ షారుఖ్ ఖాన్ కి వచ్చిన అవార్డులన్నింటినీ ప్రత్యేకంగా అలంకరించారు. మన్నత్ చాలా విశాలంగా ఉంటుంది. ఇంట్లో భారీ లగ్జరీ హోమ్ థియేటర్ ఉంది. ఆరు అంతస్తుల ఈ ఇంట్లో లిఫ్ట్ వ్యవస్థ కూడా ఉంది. అంతేకాదు, ఇంటి మెట్లను చెక్కతో తయారు చేయగా, ఇంటి అలంకరణ కోసం చెక్కతో పాటు వివిధ దేశాల నుంచి ప్రత్యేకమైన ఇంటీరియర్ ని ఉపయోగించారు.మన్నత్ గురించి మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ బంగ్లాను మొదట సల్మాన్ ఖాన్ కొనాలనుకున్నారట. కానీ సల్మాన్ తండ్రి సలీం ఇంత పెద్ద బంగ్లా మనకు అవసరం లేదని చెప్పడంతో ఆయన ఆ ఆలోచనను విరమించుకున్నారు. -
ఐస్క్రీమ్ బాలేదు.. రూ.1200 నాకిచ్చేయండి: స్విగ్గీపై ఎంపీ ఫైర్
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ 'మహువా మొయిత్రా' (Mahua Moitra).. ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ స్విగ్గీ (Swiggy)లో ఐస్క్రీమ్ ఆర్డర్ చేసుకున్నారు. అయితే తనకు డెలివరీ చేసిన ఐస్క్రీమ్ పాడైపోయిందని.. తన ఎక్స్ (Twitter) ఖాతాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింలో వైరల్ అవుతోంది.ఎంపీ మహువా మొయిత్రా.. గత రాత్రి స్విగ్గీని సోషల్ మీడియా పోస్ట్లో ట్యాగ్ చేసి ఆమె ఆర్డర్ చేసిన ఖరీదైన ఐస్క్రీమ్ల డెలివరీ సమస్యలను ఫ్లాగ్ చేశారు. 50 ఏళ్ల మొయిత్రా తనకు అందిన ఐస్క్రీమ్లు పోయిందని, అది తినడానికి కూడా ఏ మాత్రం బాగాలేదని పేర్కొన్నారు.నేను ఖరీదైన మైనస్ థర్టీ మినీ స్టిక్స్ ఐస్క్రీమ్ ఆర్డర్ చేసాను. కానీ అది పాడైపోయింది. త్వరలో రీఫండ్ లేదా రీప్లేస్మెంట్ చేయాలనీ ఆశిస్తున్నాను, అని స్విగ్గీని ట్యాగ్ చేస్తూ.. మహువా మొయిత్రా జనవరి 16న రాత్రి 10.15 గంటలకు ట్వీట్ చేశారు. ఈ ఫిర్యాదుపై స్విగ్గీ నిమిషాల వ్యవధిలో స్పందించి.. ఆమె ఆర్డర్ నెంబర్ను అడిగింది. మొయిత్రా అవసరమైన వివరాలను షేర్ చేశారు. ఎంపీ ఆర్డర్ చేసిన ఐస్క్రీమ్ విలువ రూ. 1200.Sorry @Swiggy -you’ve got to up your game. Unacceptable that I ordered expensive Minus Thirty mini sticks ice cream & it arrives spoilt and inedible. Expecting a refund or replacement asap .— Mahua Moitra (@MahuaMoitra) January 16, 2025ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొందరు మొయిత్రాను విమర్శిస్తూ కామెంట్స్ చేశారు. నేను ఎంపీని అయినంత మాత్రమే ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేయకూడదా అని సమాధానమిస్తూ.. దయచేసి ప్రజా ప్రతినిధులు సాధారణ వ్యక్తులు కాదు, అనే ఆలోచన నుంచి బయటపడండి, అని పేర్కొన్నారు.నెటిజన్ల స్పందనకొన్ని నిమిషాల్లోనే కరిగిపోయే ఫుడ్ ఎప్పుడూ ఆర్డర్ చేయకూడదు, మీకు సమీపంలో ఎక్కడైనా స్టోర్ ఉంటే.. అక్కడే కొనుగోలు చేసుకోవడం మంచిదని ఒకరు పేర్కొన్నారు. ఇలాంటి ఘటన తనకు కూడా ఎదురైందని.. అయితే భారీ ట్రాఫిక్ సమస్యల కారణంగా ఐస్క్రీమ్ కొంత పాడైందని అర్థం చేసుకున్నట్లు చెప్పారు.ఇదీ చదవండి: క్షమించండి.. మళ్ళీ ఇలా జరగదు: జొమాటో సీఈఓ -
నిబంధనలు పాటిస్తే బ్యాంకులదే బాధ్యత
అనధికార లావాదేవీలను గుర్తించడానికి, వాటిని నిరోధించడానికి బ్యాంకులు సాంకేతిక సామర్థ్యాలను ఉపయోగించాలని గువాహటి హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు(Supreme Court) ఇటీవల సమర్థించింది. థర్డ్ పార్టీ యాప్స్, టూల్స్ ఉల్లంఘనల వల్ల తలెత్తే అనధికార లావాదేవీలను బ్యాంకులే కట్టడి చేయాలని తేల్చి చెప్పింది. ఈ విషయంలో నిబంధనల ప్రకారం నడుచుకున్న వినియోగదారులపై ఎలాంటి భారం మోపకూడదని, పూర్తి బాధ్యత బ్యాంకులదేనని ఆర్బీఐ మార్గదర్శకాలను ఉటంకించింది. తన ఖాతాలో మోసపూరిత లావాదేవీలు జరిగినట్లు నివేదించిన భౌమిక్ అనే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వినియోగదారుడికి రూ.94,204.80 తిరిగి చెల్లించాలని భారత సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు ఇచ్చింది.అసలేం జరిగిందంటే..పల్లబ్ భౌమిక్ అనే ఎస్బీఐ కస్టమర్ ఆన్లైన్లో ఓ వస్తువు కొనుగోలు చేశాడు. అది డెలివరీ అయ్యాక తనకు కొన్ని కారణాల వల్ల ప్రోడక్ట్ రిటర్న్ పెట్టాడు. రిటర్న్ ప్రాసెస్ పూర్తవ్వడానికి, తన పేమెంట్ రిటర్న్ చేయడానికి కొన్ని వివరాలు చెప్పాలంటూ కస్టమర్ సర్వీస్గా నటిస్తూ భౌమిక్కు ఒక వ్యక్తి నుంచి కాల్ వచ్చింది. అతను అనధికార లావాదేవీలను సులభతరం చేసే మొబైల్ యాప్(Mobile App)ను డౌన్లోడ్ చేయమని ఆదేశించాడు. కానీ తాను ఎలాంటి నగదును తిరిగి పొందలేదని భౌమిక్ చెప్పాడు. దీనికి సంబంధించి 24 గంటల్లోనే బ్యాంకుకు సమాచారం అందించాడు. కానీ బ్యాంకు రీఫండ్ ఇవ్వలేదు. దాంతో భౌమిక్ కోర్డును ఆశ్రయించాడు. ఆ క్రమంలో భౌమిక్ ఓటీపీలు, ఎంపీఐఎన్లు వంటి సున్నితమైన సమాచారాన్ని సైబర్ మోసగాళ్లతో షేర్ చేసుకున్నాడని ఎస్బీఐ మొదట్లో వాధించింది. అయితే, తాను ఎలాంటి సమాచారాన్ని పంచుకోలేదని, రిటైలర్ వెబ్సైట్లో డేటా ఉల్లంఘన కారణంగానే ఈ మోసం జరిగిందని భౌమిక్ పేర్కొన్నాడు.ఇదీ చదవండి: ఆహార వృథాను తగ్గిస్తూ.. ఆకలి తీరుస్తూ..థర్డ్ పార్టీ యాప్లు, ఆన్లైన్ టూల్స్(Online Tools) ఉల్లంఘనల వల్ల జరిగే అనధికార లావాదేవీలకు వినియోగదారులను బాధ్యులను చూయకూడదని ఆర్బీఐ మార్గదర్శకాలను ఉటంకిస్తూ గౌహతి హైకోర్టు సింగిల్ బెంచ్, డివిజన్ బెంచ్ భౌమిక్కు అనుకూలంగా తీర్పు ఇచ్చాయి. దీన్ని సవాలు చేస్తూ ఎస్బీఐ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు తీర్పును సమర్థించింది. వినియోగదారుడికి రూ.94,204.80 తిరిగి చెల్లించాలని ఇటీవల తీర్పు ఇచ్చింది. -
యూనివర్సిటీలపై యూజీసీ కొరడా!
సాక్షి, అమరావతి: దేశంలో ప్రైవేట్ యూనివర్సిటీలు, విద్యా సంస్థలు తమ ఇష్టానుసారంగా అదనపు ఫీజులు వసూలు చేస్తుండటంతో.. ఎంతో మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితిని గుర్తించిన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ).. ఫీజు రిడ్రెసల్ ద్వారా విద్యార్థుల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తోంది. అంతటితో వదిలేయకుండా వేగంగా ఆ ఫిర్యాదులను పరిష్కరిస్తూ యూనివర్సిటీల నుంచి విద్యార్థులకు అదనపు ఫీజులను రీఫండ్ చేయిస్తోంది. గత ఐదు విద్యా సంవత్సరాల్లో 4,257 ఫిర్యాదులు నమోదవ్వగా.. యూజీసీ ఆయా వర్సిటీల నుంచి రూ.25.51 కోట్ల సొమ్మును విద్యార్థులకు వాపస్ చేయించింది. 97% సక్సెస్ రేట్..యూజీసీ ఫీజు రిడ్రెసల్ సెల్.. ఈ–సమాధాన్ ప్లాట్ఫాం కింద పనిచేస్తుంది. ఇది విద్యార్థులకు ఆర్థిక భారం నుంచి విముక్తి కల్పించడంతో పాటు విద్యా వ్యవస్థపై విశ్వాసం పెంచడమే లక్ష్యంగా పనిచేస్తోంది. 2021–22లో 915, 2022–23లో 927, 2023–24లో 2,251 ఫిర్యాదులు వచ్చాయని యూజీసీ వర్గాలు తెలిపాయి. ఉత్తరప్రదేశ్లోని ప్రైవేట్ యూనివర్సిటీల పైనే విద్యార్థుల నుంచి అత్యధిక ఫిర్యాదులు వచ్చాయని వెల్లడించాయి.ఆ తర్వాతి స్థానాల్లో ఢిల్లీ, రాజస్థాన్ నిలిచాయని పేర్కొన్నాయి. తమకు వచి్చన ఫిర్యాదుల్లో 97 శాతానికి పైగా పరిష్కరించినట్లు యూజీసీ చైర్మన్ జగదీశ్కుమార్ చెప్పారు. మొత్తం రూ.26.30 కోట్ల విలువైన ఫిర్యాదులకు గానూ రూ.25.51 కోట్లను విద్యార్థులకు వాపస్ చేయించినట్లు వెల్లడించారు. ఇందులో 1,386 మంది విద్యారి్థనులకు రూ.8.71 కోట్ల ఫీజు రీఫండ్ చేసినట్లు తెలిపారు. -
ట్రైన్ ఆలస్యమైతే.. అవన్నీ ఫ్రీ: రీఫండ్ ఆప్షన్ కూడా..
అసలే చలికాలం (శీతాకాలం).. దట్టమైన మంచు వల్ల ట్రైన్ల రాకపోకలు ఆలస్యమవుతాయి. ఇది ప్రయాణికులకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది. మంచు కారణంగా దృశ్యమానత తగ్గుతుంది. కాబట్టి ట్రైన్లు ఆలస్యంగా స్టేషన్లకు చేరుకుంటాయి. అలాంటి సమయంలో ప్రయాణికులు వేచి ఉండాల్సి ఉంటుంది. దీనికి కొంత ఉపశమనం కల్పిస్తూ భారతీయ రైల్వే ఓ స్పెషల్ సర్వీ అందించనున్నట్లు ప్రకటించింది.ట్రైన్ కోసం వేచి చూసే ప్రయాణికులు.. తాము వెళ్ళవలసిన ట్రైన్ రెండు గంటలు లేదా అంతకంటే ఎక్కువ ఆలస్యంగా వస్తే.. వారికి ఐఆర్సీటీసీ ఉచితంగా ఫుడ్ అందించనుంది. ఈ సర్వీస్ రాజధాని, శతాబ్ది, దురంతో ఎక్స్ప్రెస్ వంటి ప్రీమియం రైళ్లలో ప్రయాణించే ప్రయాణీకుల మాత్రమే అందుబాటులో ఉంటుంది.ఫ్రీ మీల్స్ ఎంపికలు➤టీ/కాఫీ సర్వీస్: ప్రయాణీకులకు బిస్కెట్లు, టీ/కాఫీ కిట్తో.. టీ లేదా కాఫీ అందిస్తారు. ఇందులో షుగర్ లేదా షుగర్ లెస్ సాచెట్లు, మిల్క్ క్రీమర్లు ఉంటాయి.➤అల్పాహారం లేదా సాయంత్రం టీ: నాలుగు ముక్కలతో కూడిన బ్రెడ్ (తెలుపు లేదా గోధుమరంగు), వెన్న, ఫ్రూట్ డ్రింక్ (200మి.లీ), టీ లేదా కాఫీ.➤లంచ్ లేదా డిన్నర్: రైస్, పప్పు, రాజ్మా లేదా చోలేతో పాటు ఊరగాయ సాచెట్లు ఉంటాయి. ఇది వద్దనుకుంటే.. ప్రయాణీకులు మిక్డ్స్ వెజిటేబుల్స్, ఊరగాయ సాచెట్లు, ఉప్పు & మిరియాలు సాచెట్లతోపాటు ఏడు పూరీ ఎంచుకోవచ్చు.ట్రైన్ రెండు గంటలు లేదా అంతకంటే ఎక్కువ ఆలస్యం అయితే ప్యాసింజర్.. తన టికెట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. టికెట్ డబ్బు రీఫండ్ అవుతుంది. రైల్వే కౌంటర్లో టిక్కెట్లు బుక్ చేసుకున్న వారు నగదు రూపంలో డబ్బును మళ్ళీ పొందటానికి వ్యక్తిగతంగానే వాటిని రద్దు చేయాలి.ఫ్రీ ఫుడ్, రీఫండ్ వంటివి కాకుండా.. ఆలస్యం సమయంలో ప్రయాణీకుల సౌకర్యాన్ని నిర్ధారించడానికి భారతీయ రైల్వే ఇతర సౌకర్యాలను అందిస్తుంది. వెయిటింగ్ రూమ్లలో ఉండటానికి అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రయాణికుల భద్రత కోసం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) అదనపు సిబ్బందిని కూడా మోహరిస్తుంది. -
సైబర్ మోసగాళ్ల బారిన పడ్డారా.. మీ డబ్బు తిరిగొచ్చే చాన్స్!
సైబర్ మోసగాళ్ల బారిన పడి తమ డబ్బును పోగొట్టుకున్న వారు తిరిగి పొందేందుకు అవకాశం ఉంది. అయితే ఇందుకు వారు చేయాల్సిందల్లా సకాలంలో పోలీసులకు ఫిర్యాదు చేయడం. ‘గోల్డెన్ అవర్’లో ఫిర్యాదు చేస్తే రికవరికీ అవకాశం ఉంటుందని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు.సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరాల్లో బాధితులు మోసపోవడం ఎంత తేలికో... నేరగాళ్లను పట్టుకోవడం అంత కష్టం. నగదు రికవరీ అనేది దాదాపు అసాధ్యమనే చెప్పవచ్చు. ‘గోల్డెన్ అవర్’లో ఫిర్యాదు చేసిన బాధితులకు మాత్రం చాలా వరకు న్యాయం జరుగుతోంది. క్రిమినల్స్కు చెందిన బ్యాంకు ఖాతాల్లో ఫ్రీజ్ చేసిన వీరి నగదును రిటర్న్ చేయడానికి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కీలక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది ఇప్పటి వరకు దాదాపు రూ.40 కోట్లు బాధితులకు తిరిగి ఇప్పించగలిగారు. ఆ సమయమే గోల్డెన్ అవర్.. బాధితులు ‘గోల్డెన్ అవర్’లో అప్రమత్తం కావడంతో పాటు తక్షణం ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. నేరం బారిన పడిన తర్వాత తొలి గంటనే గోల్డెన్ అవర్గా పరిగణిస్తారు. ఆ తర్వాత ఎంత ఆలస్యమైతే నగదు వెనక్కు వచ్చే అవకాశాలు అంత తగ్గిపోతుంటాయి. ఆర్థిక అంశాలతో ముడిపడి ఉన్న సైబర్ నేరాల్లో బాధితులు తొలుత సైబర్ క్రైమ్ ఠాణాకు రావడంపై దృష్టి పెట్టకుండా తక్షణం 1930 నంబర్కు కాల్ చేసి లేదా (cybercrime.gov.in)కు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.రెండు రకాలుగా నగదు ఫ్రీజ్.. ఉత్తదారిలోని వివిధ ప్రాంతాలు కేంద్రంగా దేశ వ్యాప్తంగా సైబర్ నేరాలకు పాల్పడే నిందితులు బాధితుల నుంచి నగదు డిపాజిట్/ట్రాన్స్ఫర్ చేయించడానికి సొంత బ్యాంకు ఖాతాలను వాడరు. పోలీసులకు ఎలాంటి ఆధారాలు చిక్కకూడదనే ఉద్దేశంలో మనీమ్యూల్స్గా పిలిచే దళారులకు చెందిన వాటితో పాటు బోగస్ వివరాలతో తెరిచిన బ్యాంకు ఖాతాలకు దీనికోసం వినియోగిస్తుంటారు.చదవండి: సైబర్ స్కామర్స్తో జాగ్రత్త.. మోసపోకుండా ఉండాలంటే ఇలా చేయండి..ఓ నేరం కోసం ఒకే ఖాతాను కాకుండా వరుస పెట్టి బదిలీ చేసుకుపోవడానికి కొన్నింటిని వాడుతుంటారు. మోసపోయిన బాధితులు నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో ఫిర్యాదు చేసినప్పుడు ఆ అధికారులు ప్రాథమిక ఖాతాల్లోని నగదు ఫ్రీజ్ చేస్తారు. దీన్ని ఆన్లైన్ ఫ్రీజింగ్ అంటారు. సైబర్ క్రైమ్ పోలీసుల దర్యాప్తులో అప్పటికే కొంత నగదు మరో ఖాతాలోకి వెళ్లినట్లు తేలితే ఆయా బ్యాంకుల సహకారంతో దాన్నీ ఫ్రీజ్ చేస్తారు. దీన్ని ఆఫ్లైన్ ఫ్రీజింగ్గా వ్యవహరిస్తుంటారు. ఒక్కో టీమ్లో ఒక్కో కానిస్టేబుల్.. ఫిర్యాదు చేసినప్పుడు నగదు ఫ్రీజ్ అవుతోందనే విషయం చాలా మంది బాధితులకు తెలియట్లేదు. దీనికి సంబంధించి వస్తున్న ఎస్సెమ్మెస్లను వాళ్లు పట్టించుకోవట్లేదు. కొంత కాలానికి తెలిసినప్పటికీ కోర్టుకు వెళ్లి, అనుమతి పొందటం వీరికి పెద్ద ప్రహసనంగా మారుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న నగర సైబర్ క్రైమ్ పోలీసులు ప్రతి టీమ్కు ఓ కానిస్టేబుల్ను నియమించారు. సైబర్ నేరాల్లో ఫ్రీజ్ అయిన నగదు వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకునే ఈ అధికారి బాధితులకు ఫోన్ చేసి విషయం చెప్పడంతో పాటు వచ్చి నగదు తీసుకోవడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని కోరతాడు. అలా ఠాణాకు వచ్చిన బాధితులను కోర్టుకు తీసుకువెళ్లి పిటిషన్ వేయడంతో పాటు నగదు విడుదలకు సంబంధించిన బ్యాంకు అధికారులకు ఆదేశాలు ఇచ్చేలా కానిస్టేబుల్ చేస్తున్నారు. గత ఏడాది మొత్తమ్మీద రిఫండ్ అయిన మొత్తం రూ.20.86 కోట్లుగా ఉండగా.. పోలీసుల చర్యల కారణంగా ఈ ఏడాది సెప్టెంబర్ నాటికే ఇది రూ.32.49 కోట్లకు చేరింది. ఈ నెల్లో రిఫండ్తో కలిపితే ఇది దాదాపు రూ.40 కోట్ల వరకు ఉంది. -
ఓలా ఇకపై అలా అంటే కుదరదు..? రిఫండ్ ఇవ్వాల్సిందే..!
-
ఓలా.. అలా కుదరదు.. రిఫండ్ ఇవ్వాల్సిందే!
న్యూఢిల్లీ: వినియోగదారులకు అనుకూల విధానాలను అమలు చేయాలంటూ ట్యాక్సీ సేవల సంస్థ ఓలాను కేంద్రీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణ ప్రాధికార సంస్థ (సీసీపీఏ) ఆదేశించింది. కస్టమర్లకు రిఫండ్ ఆప్షన్లు, రైడ్లకు సంబంధించి రసీదులు కూడా ఇవ్వాలని సూచించింది.ప్రస్తుత విధానంలో బ్యాంకు ఖాతాలోకి రిఫండ్ పొందే అవకాశాన్ని కస్టమర్లకు ఇవ్వకుండా, భవిష్యత్ రైడ్లకు ఉపయోగించుకునేలా కూపన్ కోడ్లనే ఓలా జారీ చేస్తోందని సీసీపీఏ పేర్కొంది. ఫలితంగా కస్టమర్లు దాన్ని ఉపయోగించుకునేందుకు తప్పనిసరిగా మరోమారు ఓలానే ఎంచుకోవాల్సి వస్తోŠందని తెలిపింది. ఈ నేపథ్యంలోనే రిఫండ్ ఆప్షన్లు ఇవ్వాలని సీసీపీఏ సూచించింది. అలాగే, అన్ని రైడ్లకు సంబంధించి బిల్లులు, ఇన్వాయిస్లు జారీ చేయాల్సిందేనని స్పష్టం చేసింది.ఇదీ చదవండి: దూసుకెళ్లే టాప్10 ఎలక్ట్రిక్ బైక్లుఅలా చేయకపోతే అనుచిత వ్యాపార విధానాలు పాటిస్తున్నట్లుగా పరిగణించాల్సి వస్తుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఓలా తన వెబ్సైట్లో గ్రీవెన్స్, నోడల్ ఆఫీసర్ల కాంటాక్ట్ వివరాలను, క్యాన్సిలేషన్ నిబంధనలను, బుకింగ్.. క్యాన్సిలేషన్ ఫీజులు మొదలైన వాటిని పొందుపర్చింది. -
సహారా డిపాజిటర్లకు గుడ్న్యూస్.. రిఫండ్ పరిమితి పెంపు
న్యూఢిల్లీ: సహారా గ్రూప్ కోఆపరేటివ్ సొసైటీల చిన్న డిపాజిటర్ల రిఫండ్ మొత్తాలపై గతంలో ఉన్న రూ.10,000 పరిమితిని ప్రభుత్వం రూ.50,000కు పెంచింది. సహకార మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు ఈ విషయాన్ని తెలిపారు.సహారా గ్రూప్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీలకు చెందిన 4.29 లక్షల మందికి పైగా డిపాజిటర్లకు ప్రభుత్వం ఇప్పటివరకు సీఆర్సీఎస్ (సహకార సంఘాల సెంట్రల్ రిజిస్ట్రార్)–సహారా రిఫండ్ పోర్టల్ ద్వారా రూ.370 కోట్లను విడుదల చేసింది. రిఫండ్ మొత్తం పరిమితిని రూ. 50,000కి పెంచడంతో, రాబోయే 10 రోజుల్లో సుమారు రూ. 1,000 కోట్ల చెల్లింపులు జరుగుతాయని అధికారి వెల్లడించారు.సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా చర్యలు సహారా గ్రూప్ నాలుగు మల్టీ–స్టేట్ కోఆపరేటివ్ సొసైటీల వాస్తవ డిపాజిటర్లు క్లెయిమ్ల సమర్పణకు, డిపాజిట్ల వాపసుకు సుప్రీంకోర్డు ఆదేశాలను అనుసరించి సీఆర్సీఎస్–సహారా రిఫండ్ పోర్టల్ గత ఏడాది జూలై 18న ఏర్పాటయిన సంగతి తెలిసిందే.వీటిలో స్టార్స్ మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ (హైదరాబాద్)సహా సహారా క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ (లక్నో) సహారైన్ యూనివర్సల్ మల్టీపర్పస్ సొసైటీ లిమిటెడ్ (భోపాల్), హుమారా ఇండియా క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ (కోల్కతా) ఉన్నాయి.2023 మార్చి 29 నాడు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా 2023 మే 19న సెబీ–సహారా రీఫండ్ ఖాతా నుండి సెంట్రల్ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్కి రూ. 5,000 కోట్ల బదిలీ అయ్యాయి. డిజిటల్ రూపంలో డబ్బు పంపిణీని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. -
టికెట్ రద్దయితే.. రైల్వేకు పండగే!
సాక్షి, విశాఖపట్నం: దూర ప్రయాణాలకు వెళ్లాలంటే అందరికీ గుర్తొచ్చేది రైలే. మూడు నెలల ముందే టికెట్ తీసుకుంటే గానీ బెర్త్ దొరకని పరిస్థితి. ఒక్కోసారి టికెట్ కన్ఫర్మ్ కాదు. చివరి నిమిషంలోనైనా బెర్త్ దొరకదా.. కనీసం ఆర్ఏసీ అయినా అవ్వదా అనే ఆశతో ప్రయాణి కులు ఉంటారు. చివరి వరకు టికెట్ కన్ఫర్మ్ కాకపోతే క్యాన్సిల్ చేస్తుంటాం. కొన్నిసార్లు.. అత్యవసరంగా టికెట్ రద్దు చేసుకుంటుంటాం. రద్దు చేసుకున్న ప్పుడు కొంతమేర డబ్బులకు కోత విధించి.. రైల్వే శాఖ రీఫండ్ చేస్తుంటుంది. క్యాన్సిలేషన్ రుసుం కింద కోత విధించిన సొమ్ము రైల్వే ఖాతాలోకి జమ అవుతుంది. ఏటా సగటున రూ.2 వేల కోట్లు: వెయిటింగ్ లిస్ట్లో రూ.240 టికెట్ బుక్ చేసుకుని క్యాన్సిల్ చేసుకుంటే.. కేవలం రూ.180 మాత్రమే రీఫండ్ వస్తుంది. అంటే.. రైల్వే సేవలేవీ వినియోగించుకోకుండానే ఆ శాఖకు సర్వీస్ చార్జ్ని ప్రయాణికులు చెల్లిస్తున్నట్టే. ఇలా టికెట్ క్యాన్సిలేషన్ ద్వారా రూ.కోట్లలో ఆదాయాన్ని ఆర్జిస్తోంది రైల్వే మంత్రిత్వ శాఖ. 2022–23 సంవత్సరంలో టికెట్ క్యాన్సిలేషన్, క్లర్కేజ్ చార్జీల ద్వారా రూ.2,109.74 కోట్ల ఆదాయం వచ్చిందని రైల్వే బోర్డు వెల్లడించింది. అదేవిధంగా 2023 ఏప్రిల్ 2023 డిసెంబర్ వరకూ రూ.1,762.62 కోట్లు జమ అయింది. అంటే గతేడాదితో పోలిస్తే.. 2023–24లోనూ పూర్తి లెక్కలు తేలాక రూ.2,200 కోట్లు దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన టికెట్ క్యాన్సిలేషన్స్ ద్వారా రైల్వే శాఖకు ఏటా సగటున రూ.2 వేల కోట్ల వరకూ ఆదాయం లభిస్తోంది. రూ.60 నుంచి రూ.240 వరకూ కట్ ప్రయాణ తరగతి ఆధారంగా టికెట్ రద్దు రుసుంలు మారుతూ ఉంటాయి. రెండో తరగతి టికెట్ క్యాన్సిలేషన్కు రూ.60 నుంచి మొదలై.. ఏసీ ఫస్ట్ క్లాస్ లేదా ఎగ్జిక్యూటివ్ క్లాస్కు రూ.240 వరకు చార్జీలు ఉంటాయి. సెకండ్ ఏసీకి అయితే రూ.200, థర్డ్ ఏసీ, ఏసీ చైర్ కార్ అయితే రూ.180 వసూలు చేస్తారు. స్లీపర్ క్లాస్కు రూ.120 వరకూ రుసుం కింద రైల్వే శాఖ కట్ చేసుకుంటుంది. ట్రైన్ బయలుదేరడానికి నాలుగు గంటలలోపు టికెట్లను రద్దు చేస్తే క్యాన్సిలేషన్ చార్జి 50 శాతం ఉంటుంది. ఒక వేళ ట్రైన్ బయలుదేరడానికి 72 గంటలలోపు, అంటే మూడు రోజుల ముందే టికెట్లను రద్దు చేస్తే క్యాన్సిలేషన్ చార్జీలు ఉండవు. వారికి పూర్తి రీఫండ్ లభిస్తుంది. -
పీఏసీఎల్ బాధితులకు శుభవార్త.. ప్రారంభమైన రిఫండ్
న్యూఢిల్లీ: చట్టవిరుద్ధ పథకాల ద్వారా నిధులు సమీకరించిన పీఏసీఎల్ ( PACL )లో ఇన్వెస్ట్ చేసి నష్టపోయిన బాధితులకు చెల్లింపులు చేపట్టినట్లు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా పేర్కొంది. రూ. 19,000 వరకూ క్లెయిముల చెల్లింపుల కోసం దాదాపు రూ. 1,022 కోట్లు వెచ్చించినట్లు తెలియజేసింది. ఇందుకు అర్హమైన 20,84,635 దరఖాస్తుల(ఇన్వెస్టర్లు)కు చెల్లింపులను పూర్తి చేసినట్లు వెల్లడించింది. గతంలో వ్యవసాయం, రియల్టీ బిజినెస్ల పేరుతో పీఏసీఎల్ అక్రమ పథకాల ద్వారా రూ. 60,000 కోట్లకుపైగా సమీకరించినట్లు సెబీ తెలియజేసింది. రిటైర్డ్ జస్టిస్ ఆర్ఎం లోధా అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ దశలవారీగా రిఫండ్స్ను ప్రారంభించినట్లు వివరించింది. పెట్టుబడులు చేపట్టిన ఇన్వెస్టర్లకు తిరిగి చెల్లించడంలో విఫలంకావడంతో 2015 డిసెంబర్లో పీఏసీఎల్తోపాటు.. 9మంది ప్రమోటర్లు, డైరెక్టర్లకు చెందిన అన్ని ఆస్తులనూ అటాచ్ చేయవలసిందిగా సెబీ ఆదేశించింది. నిజానికి 2014 ఆగస్ట్ 22న ఇన్వెస్టర్లకు సొమ్మును రీఫండ్ చేయవలసిందిగా పీఏసీఎల్సహా సంస్థ ప్రమోటర్లు, డైరెక్టర్లను సెబీ ఆదేశించింది. ఇందుకు మూడు నెలల గడువును సైతం ప్రకటించింది. -
వచ్చేవారంలోగా రిఫండ్స్ జరగాలి
న్యూఢిల్లీ: కోవిడ్ లాక్డౌన్ సమయంలో బుక్ చేసుకున్న విమాన టిక్కెట్లు, సర్వీసుల రద్దుకు సంబంధించిన రిఫండ్లను వచ్చే వారంలోగా (నవంబర్ 3 వారం లోపు) రిఫండ్ చేయాలని ఆన్లైన్ ట్రావెల్ పోర్టల్లకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో 2020 మార్చి 25 నుండి వివిధ దశాల్లో దేశంలో లాక్డౌన్ అమలయిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో పలు విమాన సేవలను కూడా నిలిపివేయడం జరిగింది. అయితే అప్పటి ముందస్తు బుకింగ్ల విషయంలో కొందరికి రిఫండ్స్ జరగలేదు. కొన్ని సాంకేతిక, ఆర్థిక అంశాలు దీనికి కారణంగా ఉన్నాయి. ఈ అంశంపై ఆన్లైన్ ట్రావెల్ అగ్రిగేటర్లతో వినియోగ వ్యవహారాల మంత్రిత్వశాఖ కీలక సమావేశం జరిగింది. వినియోగ వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో నవంబర్ మూడవవారంలోపు రిఫండ్స్ జరగాలని అగ్రిగేటర్లకు స్పష్టం చేసినట్లు ఒక అధికారిక ప్రకటన వెలువరించింది. ప్రకటన ప్రకారం వినియోగదారుల ఫిర్యాదులను సమయానుకూలంగా పరిష్కరించేందుకు అంబుడ్స్మన్ను ఏర్పాటు చేయడం గురించి కూడా ఈ సమావేశంలో చర్చించారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ–వినియోగదారుల వ్యవహారాల శాఖ సంయుక్తంగా దీనిని ఏర్పాటు చేసే విషయంలో విధివిధానాలు ఖరారుకు చేయాలని సమావేశం భావించింది. వినియోగదారుల ఫిర్యాదుల సమర్థవంతమైన పరిష్కారం కోసం ఎయిర్ సేవా పోర్టల్తో జాతీయ వినియోగదారుల హెల్ప్లైన్ను ఏకీకృతం చేయడం చర్చల్లో చోటుచేసుకున్న మరొక ప్రతిపాదన. -
తత్కాల్ టికెట్ల రద్దుపై పూర్తి రిఫండ్.. రైలు ప్రయాణికులకు శుభవార్త!
న్యూఢిల్లీ: ప్రముఖ చెల్లింపులు సేవల సంస్థ పేటీఎం.. తన ప్లాట్ఫామ్ ‘పేటీఎం యాప్’ ద్వారా రైలు టికెట్ల బుకింగ్పై ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది. కేవలం రూ.15 ప్రీమియం చెల్లించి రైలు టికెట్ల రద్దుపై పూర్తి రిఫండ్ను పొందొచ్చని తెలిపింది. న్యూమనీ సేవింగ్ పేరుతో ప్రవేశపెట్టిన ఈ సదుపాయం యూజర్లకు మరింత సౌకర్యవంతమైన అనుభవాన్ని ఇస్తుందని పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ తెలిపింది. తత్కాల్ సహా సహా అన్ని రకాల రైలు టికెట్ల రద్దుపై అప్పటికప్పుడే సోర్స్ అకౌంట్ (చెల్లింపులు చేసిన బ్యాంక్ ఖాతా లేదా కార్డ్)కు రిఫండ్ పొందొచ్చని ప్రకటించింది. రిఫండ్ కోసం రోజులకొద్దీ వేచి చూడాల్సిన అవసరం లేదని పేర్కొంది. రైలు ప్రారంభానికి ఆరు గంటల ముందు లేదంటే చార్ట్ రూపొందించడానికి (వీటిలో ఏది ముందు అయితే అదే వర్తిస్తుంది) ముందుగా యూజర్లు రైలు టికెట్లు బుక్ చేసుకోవచ్చని వివరించింది. ‘‘మొబైల్ చెల్లింపులు, క్యూఆర్ టెక్నాలజీలో ప్రముఖ సంస్థగా ఉన్న పేటీఎం, ట్రావెల్ బుకింగ్లకు సంబంధించి మెరుగైన అనుభవాన్ని ఇచ్చేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఉన్న ఫళంగా రైలు టికెట్లు రద్దు చేసుకునే వారికి ఈ కొత్త సుదపాయం ఉపశమనాన్ని ఇస్తుంది’’అని పేటీఎం అధికార ప్రతినిధి తెలిపారు. రైలు టికెట్లు బుకింగ్కు యూపీఐ ద్వారా చెల్లింపులు చేస్తే గేట్వే ఫీజు వసూలు చేయడం లేదని పేటీఎం తెలిపింది. -
కస్టమర్ దెబ్బకు ఖంగుతిన్న డీలర్షిప్ - రూ.61 లక్షలు రీఫండ్!
కారు కొనుగోలు చేయడం అనేది చాలామంది కల. ఈ కలను నిజం చేసుకోవడానికి కొంతమంది ఎన్నోన్నో కష్టాలు పడి చివరకు అనుకున్నది సాధిస్తారు. అయితే కొన్ని సార్లు డీలర్షిప్ యాజమాన్యం చేసే మోసాల వల్ల కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి సంఘటనలు గతంలో కోకొల్లలు. మళ్ళీ ఇలాంటి సంఘటనే తాజాగా మరోసారి వెలుగులోకి వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. చండీగఢ్ ప్రాంతానికి చెందిన ఇందర్జిత్ కౌర్ అనే కస్టమర్ జీప్ కంపెనీకి చెందిన 'గ్రాండ్ చెరోకీ' కారుని 2018లో రూ. 61.61 లక్షలకు కొనుగోలు చేసాడు. నిజానికి ఈ SUV ఎక్స్-షోరూమ్ ధర దేశీయ మార్కెట్లో రూ. 80 లక్షల కంటే ఎక్కువ. అయితే ఇది 2016లో తయారైందన్న కారణంతో స్థానిక KAS కార్స్ డీలర్షిప్ రూ. 17 లక్షలు తగ్గించింది. కారు కొనుగోలు చేసిన తరువాత నుంచి అందులో సమస్యలు మొదలయ్యాయి. రోడ్డు మధ్యలో ఆగిపోవడం వంటి సమస్యలతో పాటు ఇతర సమస్యలు కూడా తలెత్తాయి. దీంతో కస్టమర్ డీలర్షిప్ను ఆశ్రయించాడు. వెళ్లిన ప్రతి సారి అప్పటికి ఏదో ఒక రిపేర్ చేసి బాగు చేసివారు. కానీ మళ్ళీ మళ్ళీ సమస్యలే తలెత్తుండటంతో కోర్టుని ఆశ్రయించాడు. ఇదీ చదవండి: నెలకు రూ. 83వేలకు పైనే ఇస్తారు.. ఈ అర్హతలుంటే చాలు! కోర్టు విచారం చేపట్టి కస్టమర్ ఇబ్బందికి కారణమైన డీలర్షిప్కి కేవలం 45 రోజుల గడువులో రూ. 61.61 లక్షలు అతని చెల్లించాలని ఆదేశించింది. ఇలాంటి సంఘటన వెలుగులోకి రావడం ఇదే మొదటి సారి కాదు. గతంలో కూడా చాలా కంపెనీలు కస్టమర్లకు లోపభూయిష్టమైన కార్లను విక్రయించడం వల్ల భారీ జరిమానాలు చెల్లించాల్సి వచ్చింది. -
రిఫండ్ త్వరగా పొందాలంటే? వెరిఫై చేశారా..
డిపార్ట్మెంటు వారు జ్ఞాపకం చేస్తున్నారా లేదా భయపెడుతున్నారా? కాదు కాదు ఎందరో మరిచిపోయేవారిని దృష్టిలో ఉంచుకుని అందరికీ ఒక సందేశం.. రిమైండర్ పంపుతున్నారు. దాని సారాంశం ఏమిటంటే రిటర్ను దాఖలు చేసి ఊరుకోవద్దు. మరచిపోవద్దు. ఈ–ఫైలింగ్ ప్రాసెస్ని పూర్తి చేయండి. మీరు ఐటీఆర్ని 30 రోజుల్లోపల వెరిఫై చేయండి. గతంలో ఈ గడువు 120 రోజులు ఉండేది. అంటే నాలుగు నెలలు. కొత్త నిబంధనల ప్రకారం ఈ గడువుని 30 రోజులకు కుదించారు. గడువు తేదీలోగా వెరిఫై చేయకపోతే మీరు సకాలంలో రిటర్ను వేసినట్లు కాదు. మీరు దాఖలు చేసిన రిటర్ను ఇన్వాలిడ్ అయిపోతుంది. రద్దయిపోతుంది. వేసినట్లు కాదు. ఆలస్యమయింది కాబట్టి లేటు ఫీజు పడుతుంది. ఇది రూ. 5,00,000లోపు ఆదాయం ఉంటే రూ. 1,000 & రూ. 5,00,000 దాటితే రూ. 5,000 ఉంటుంది. ఈ–వెరిఫై చేయడం చాలా సులభం. త్వరగా కూడా పూర్తవుతుంది. ఈ–వెరిఫై వద్దనుకుంటే ఫారం– Vని 30 రోజుల్లోపల అందేలా స్పీడ్పోస్ట్లో పంపండి. పోర్టల్ ద్వారా చేయండి. ఆధార్ కార్డు ద్వారా ఓటీపీ వస్తుంది. లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయొచ్చు. బ్యాంకు అకౌంట్ ద్వారా లేదా డీమ్యాట్ అకౌంటు, బ్యాంకు ఏటీఎం ద్వారానైనా చేయొచ్చు. డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్ ద్వారా చేస్తే కొంచెం ఖర్చవుతుంది. ఈ–ఫైలింగ్కి సంబంధించిన ప్రశ్నల్లో, తరచుగా మీకు సందేహాలొచ్చే వివిధ అంశాలు, పరిస్థితులు అన్నింటినీ పొందుపర్చారు. లేటయితే కూడా వెరిఫై చేయొచ్చు. కానీ, తగిన కారణం ఉండాలి. ఒప్పుకుంటే లేటుగా వేయవచ్చు. మీ తరఫున మీ ఆథరైజ్డ్ వ్యక్తి వేయొచ్చు. మొబైల్ నంబర్ను వెంటనే ఆధార్తో అప్డేట్ చేయడం తప్పనిసరి. మరిచిపోకండి. మీరు స్పీడ్పోస్ట్లో పంపించిన డాక్యుమెంట్ల వివరాలు భద్రపర్చుకోండి. రుజువులు అవసరమైనప్పుడు వాడుకోవచ్చు. ఒక్కొక్కప్పుడు అందలేదని డిపార్టుమెంటు వారు అంటే ఇవి రుజువులుగా పనికొస్తాయి. రిఫండ్ క్లెయిమ్ చేసిన వారయితే, వెరిఫై చేసిన తర్వాతే రిఫండును ఆశించాలి. జులై మొదటి వారంలో కొంత మందికి 48 గంటల్లో రిఫండు వచ్చింది. ఇప్పుడు రెండు వారాలు దాటిన తర్వాత రిఫండు ఇస్తున్నారు. గతంలో నెలరోజులు దాటేది. ఇప్పుడు ఇంకా త్వరితగతిన ఇద్దామని గట్టి ప్రయత్నం చేస్తూ, సమాయత్తం అవుతున్నారు.. డిపార్ట్మెంట్ వారు. పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.com కు ఈ–మెయిల్కు పంపించగలరు. -
సహారా డబ్బులు వెనక్కి ఇస్తున్నారు..వెంటనే ఇలా క్లయిమ్ చేసుకోండి
న్యూఢిల్లీ: సహారా గ్రూప్ నాలుగు కోపరేటివ్ల పరిధిలో నాలుగు కోట్ల డిపాజిటర్లకు డబ్బులు చెల్లించడం మొదలైంది. మొదటి విడత కింద ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున 112 మంది చిన్న ఇన్వెస్టర్లకు చెల్లింపులను కేంద్ర హోంశాఖ, సహకార శాఖల మంత్రి అమిత్షా శుక్రవారం ప్రారంభించారు. సీఆర్సీఎస్ సహారా రిఫండ్ పోర్టల్పై ఇప్పటి వరకు 18 లక్షల మంది డిపాజిటర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నట్టు షా చెప్పారు. సహారా డిపాజిటర్ల చెల్లింపులకు వీలుగా సీఆర్సీఎస్–సహారా పోర్టల్ను కేంద్ర సహకార శాఖ జూలై 18న ప్రారంభించడం గమనార్హం. నమోదు చేసుకున్న ఇన్వెస్టర్లు అందరికీ తొలి విడతలో రూ.10వేల చొప్పున చెల్లించనున్నారు. ఆడిట్ పూర్తయిన తర్వాత రెండో విడత నిధులను బదిలీ చేస్తామని అమిత్షా తెలిపారు. ‘‘రానున్న రోజుల్లో డిపాజిటర్లు అందరూ తమ నిధులను పొందుతారని మీకు భరోసా ఇస్తున్నా’’అని ప్రకటించారు. సహార వంటి ఘటనలు జరిగినప్పుడల్లా సహకార సంస్థల పట్ల నమ్మకం కుదేలవుతున్నట్టు పేర్కొన్నారు. ఇన్వెస్టర్ల డబ్బులు సురక్షితంగా ఉన్నాయని, వాటిని తిరిగి వారికి అందిస్తామని భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. సహారా డిపాజిటర్లు గత 12–15 ఏళ్ల నుంచి తమ డబ్బులు పొందలేకపోయారని, ఇందుకు సహారా యాజమాన్యం విఫలం కావడం, కోర్టుల్లో వ్యాజ్యాలతో జాప్యం జరిగినట్టు చెప్పారు. సెబీ–సహారా ఫండ్ నుంచి రూ.5,000 కోట్లను సహకార శాఖ పొందడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినట్టు అమిత్షా వివరించారు. సీబీఐ, ఆదాయపన్ను శాఖ తదితర కేంద్ర ప్రభుత్వం సంస్థలను ఒకేతాటిపైకి తీసుకొచ్చి.. నిధులపై ముందుగా చిన్న ఇన్వెస్టర్లకు తొలుత హక్కు ఉండాలంటూ సుప్రీంకోర్టును కోరినట్టు గుర్తు చేశారు. సహారా గ్రూపు నాలుగు కోపరేటివ్ల పరిధిలోని 10 కోట్ల మంది ఇన్వెస్టర్లకు వచ్చే తొమ్మిది నెలల్లో వారి డబ్బులు తిరిగి పొందేలా చర్యలు తీసుకుంటామని ఈ ఏడాది మార్చి 29న కేంద్రం ప్రకటించడం గమనార్హం. ఇక సహారా డబ్బుల్ని ఎలా క్లయిమ్ చేసుకోవాలంటే? ♦ ముందుగా mocrefund.crcs.gov.in. పోర్టల్కి వెళ్లాలి ♦ ఆధార్ కార్డ్ నెంబర్ సాయంతో డిపాజిటర్ లాగిన్ అవ్వాలి ♦ అనంతరం మీ వద్ద ఉన్న సహారా బాండ్ పేపర్లని, ఇతర పత్రాలని అప్లోడ్ చేయాలి. ♦ అప్లోడ్ చేసిన పత్రాలని 30 రోజుల్లోగా ధృవీకరిస్తారు. ♦ అనంతరం 15 రోజుల్లో అధికారులు దీనిపై చర్యలు తీసుకుంటారు ♦ తర్వాత ఎస్ఎంఎస్ ద్వారా వెరిఫికేషన్ పూర్తయినట్లు ఇన్వెస్టర్లకు సమాచారం అందిస్తారు. ♦ ఎస్ఎంఎస్ వచ్చిందంటే మీ ఆన్లైన్ క్లెయిమ్ ఆమోదం పొందినదని అర్థం. ♦ తర్వాత పెట్టుబడి మొత్తం ఖాతాకు బదిలీ అవుతుంది. ♦ క్లెయిమ్ని ధృవీకరించిన తేదీ నుంచి 45 రోజుల తర్వాత మొత్తం బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. -
రూ. 13,000 టికెట్టుకి రూ. 20 రీఫండ్ - ఐఏఎస్ ఆఫీసర్ షాక్!
ఆధునిక కాలంలో విమాన ప్రయాణాలు సర్వ సాధారణం అయిపోతున్నాయి. కావున చాలామంది ఫ్లైట్ జర్నీ చేసేస్తున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో అనుకోకుండా బుక్ చేసుకున్న టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే కొంత అమౌంట్ (రీఫండ్) తిరిగి వస్తుంది. అయితే ఇటీవల ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ చేసుకున్న ఒక ఐఏఎస్ అధికారికి చేదు అనుభవం ఎదురైంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, రాహుల్ కుమార్ అనే ఐఏఎస్ అధికారి తన ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ చేసుకున్నాడు. ఆ టికెట్ ధర రూ. 13,820 కాగా, క్యాన్సిల్ చేసుకున్న తరువాత అతనికి రీఫండ్ అయిన మొత్తం కేవలం రూ. 20 మాత్రమే. దీనిని అతని ట్విటర్ ఖాతా ద్వారా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది ఇప్పుడు తెగ వైరల్ అయిపోతోంది. నిజానికి అతని టికెట్ ధర నుంచి ఎయిర్లైన్ క్యాన్సిలేషన్ ఫీజు కింద రూ. 11,800, జీఐ క్యాన్సిలేషన్ ఫీజు కింద రూ. 1200, జీఐ కన్వీనియన్స్ ఫీజు కింద రూ. 800 కట్ చేసి చివరకు రూ. 20 రీఫండ్ చేసారు. ఇది చూడగానే ఐఏఎస్ అధికారి కూడా హవాక్కయిపోయాడు. తిరిగి డబ్బు వెనక్కి రావాలంటే ఏదైనా సలహా ఇవ్వండి అంటూ ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. దీనిపైన నెటిజన్లు వారికి నచ్చిన రీతిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. (ఇదీ చదవండి: ఏఐతో కొత్త రకం మోసం - తెలిసిన ముఖమే అనుకున్నారో..) Pls suggest some good investment plans for my refund. pic.twitter.com/lcUEMVQBnq — Rahul Kumar (@Rahulkumar_IAS) July 10, 2023 -
క్షమాపణలు చెప్పిన ఎయిరిండియా
ఢిల్లీ: సాంకేతిక సమస్యతో రష్యాకు విమానం దారి మళ్లింపు, అక్కడ మారుమూల ప్రాంతంలో అరకోర సౌకర్యాల నడుమ పడిగాపులు పడిన వ్యవహారంపై ఎయిరిండియా స్పందించింది. ప్రయాణికులందరికీ క్షమాపణలు తెలియజేస్తూ.. వాళ్ల టికెట్ డబ్బులను తిరిగి ఇవ్వడంతో పాటు బోనస్గా ట్రావెల్ వౌచర్లను ఇస్తామని ప్రకటించింది. మంగళవారం న్యూఢిల్లీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు వెళ్తున్న క్రమంలో ఎయిరిండియాకు చెందిన బోయింగ్ 777 ఎయిర్క్రాఫ్ట్లోని ఇంజిన్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో 216 మంది ప్యాసింజర్లు, 16 మంది సిబ్బందితో కూడిన విమానాన్ని రష్యా మగడాన్ ఎయిర్పోర్ట్కు తరలించారు. మాస్కో నుంచి 10వేల కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ప్రాంతం. మారుమూల పట్టణం కావడంతో అరకోర సౌకర్యాలతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే దాదాపు 36 గంటల తర్వాత.. ప్రత్యామ్నాయ విమానం అక్కడికి చేరుకుని ఈ ఉదయం శాన్ ఫ్రాన్సిస్కోకు ప్రయాణికులను చేర్చింది. ఈ పరిణామంపై క్షమాపణలు చెబుతూ ఎయిర్ ఇండియా చీఫ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ & గ్రౌండ్ హ్యాండిలింగ్ ఆఫీసర్ రాజేష్ డోగ్రా ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి, అంతరాయానికి క్షమాపణలు చెబుతున్నామని, టికెట్ ఎమౌంట్ను రిఫండ్ చేయడంతో పాటు ట్రావెల్ వౌచర్లను స్వీకరించాలంటూ మనస్ఫూర్తిగా క్షమాపలంటూ ప్రకటనలో పేర్కొన్నారాయన. ఇక ఈ పరిణామంపై పౌర విమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA) ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. -
ఐటీ నుంచి రూ.41 వేల రీఫండ్!
ఆర్థిక సంవత్సరం ముగుస్తోంది. మార్చి 31 సమీపిస్తుండటంతో పన్ను చెల్లింపుదారులు హడావుడి పడుతున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రణాళికలను ఇప్పటికే ప్రారంభించారు. అయితే ఆదాయపు పన్ను శాఖ నుంచి రూ. 41,104 రీఫండ్ చేస్తున్నట్లు కొందరికి ఈ మెయిల్స్ వచ్చాయి. ఈ రీఫండ్ పొందడానికి వ్యక్తిగత వివరాలను సమర్పించాలని ఆ మెయిల్ ద్వారా కోరారు. ఇదీ చదవండి: Hindenburg Research: త్వరలో హిండెన్బర్గ్ మరో బాంబ్.. ఈసారి ఎవరి వంతో..! ‘ఆదాయపు పన్ను శాఖ అధికారికంగా ఖాతా-ఆడిట్ను పూర్తి చేసింది. మీకు రూ. 41,101.22 రీఫండ్కు అర్హత ఉంది.. కానీ మీ వివరాలు కొన్ని తప్పుగా ఉన్నాయి. పరిశీలించి సరిచేసుకోండి’ అంటూ ఓ లింక్ ట్యాబ్ను అందులో ఇచ్చారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ టాక్స్, సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్, ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్, బెంగళూరు నుంచి ఆ ఈమెయిల్ను పంపుతున్నట్లు పేర్కొన్నారు. అది పూర్తిగా ఫేక్.. ఆదాయపు పన్ను శాఖ పేరుతో వచ్చిన ఆ ఈమెయిల్ పూర్తిగా ఫేక్ అని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ( పీఐబీ) నిర్ధారించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) నేతృత్వంలోని ఆదాయపు పన్ను శాఖ నుంచి అటువంటి ఈమెయిల్లను పంపలేదని తేల్చింది. An E-mail claims that the recipient is entitled to a refund of ₹41, 104, and is seeking his/her personal details in the name of @IncomeTaxIndia#PIBFactCheck ✔️This claim is fake ✔️Report such suspicious emails at 'webmanager@incometax.gov.in' pic.twitter.com/bWgJT7iNbo — PIB Fact Check (@PIBFactCheck) March 20, 2023 ఆదాయపు పన్నుకు సంబంధించిన ఇలాంటి అనుమానాస్పద ఈమెయిల్స్ వచ్చినప్పుడు webmanager@incometax.gov.in లో తెలియజేయవచ్చు. ఐటీ శాఖ ఇలా ఈమెయిల్ ద్వారా వ్యక్తిగత సమాచారం అడగదు. అలాగే క్రెడిట్ కార్డ్లు, బ్యాంకులు లేదా ఇతర ఆర్థిక ఖాతాల కోసం పిన్ నంబర్లు, పాస్వర్డ్లు వంటివి కోరుతూ మెయిల్ పంపదు. ఇలాంటి ఈమెయిల్ వచ్చినప్పుడు ఏమి చేయాలి? వాటికి స్పందించవద్దు. అటాచ్మెంట్లు మీ కంప్యూటర్కు హాని కలిగించే హానికరమైన కోడ్ని కలిగి ఉండవచ్చు కాబట్టి వాటిని తెరవవద్దు. ఎలాంటి లింక్లపైనా క్లిక్ చేయవద్దు. ఒక వేళ మీరు లింక్లపై అనుకోకుండా క్లిక్ చేసినట్లయితే బ్యాంక్ ఖాతా, క్రెడిట్ కార్డ్కు సంబంధించిన వివరాలను షేర్ చేయవద్దు. ఇదీ చదవండి: ఈ కంపెనీ ఉద్యోగులు ఎంత అదృష్టవంతులో..! ఐదేళ్ల జీతం బోనస్ -
అన్రిజిస్టర్డ్ వ్యక్తులకూ ఇక జీఎస్టీ రిఫండ్స్!
న్యూఢిల్లీ: రద్దయిన కాంట్రాక్టులు లేదా బీమా పాలసీలకు సంబంధించి నమోదుకాని (అన్రిజిస్టర్డ్) వ్యక్తులు కూడా ఇకపై వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వాపసులను క్లెయిమ్ చేసుకోవచ్చని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే ఇందుకు తన పర్మినెంట్ అకౌంట్ నెంబర్ (పాన్)తో జీఎస్టీ పోర్టల్లో తాత్కాలిక రిజిస్ట్రేషన్ను పొందాల్సి ఉంటుందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్ (సీబీఐసీ) ఒక ప్రకటనలో సూచించింది. బ్యాంక్ అకౌంట్ నెంబర్తోపాటు, రిఫండ్కు సంబంధించిన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాల్సి ఉంటుందని తెలిపింది. కాంట్రాక్ట్ రద్దయిన సందర్భంలో తాము అప్పటికే భరించిన పన్ను మొత్తాన్ని వాపసు కోసం క్లెయిమ్ చేయడానికి ఒక సదుపాయాన్ని (ఫెసిలిటీ) కల్పించాలని రిజిస్టర్ కాని కొనుగోలుదారులు చేసిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయాన్ని వెలువరిస్తున్నట్లు తెలిపింది. రెండేళ్ల కాల వ్యవధి... తాజా నిర్ణయంతో ఫ్లాట్, భవనం నిర్మాణం లేదా దీర్ఘకాలిక బీమా పాలసీ రద్దుకు సంబంధించి అప్పటికే చెల్లించిన జీఎస్టీని ఇకపై అన్ రిజిస్టర్డ్ వ్యక్తులూ తిరిగి పొందే (రిఫండ్) వెసలుబాటు కలిగింది. నమోదవ్వని పన్ను చెల్లింపుదారు సంబంధిత తేదీ నుండి రెండు సంవత్సరాలలోపు వాపసుల కోసం ఫైల్ చేయవచ్చని సీబీఐసీ వివరించింది. వస్తువులు, సేవలను స్వీకరించిన తేదీ లేదా ఒప్పందం రద్దయిన తేదీ నుంచి ఇది ఈ రెండేళ్ల కాల వ్యవధి వర్తిస్తుందని వివరించింది. డిసెంబర్ 17న జరిగిన జీఎస్టీ అత్యున్నత స్థాయి 48వ సమావేశం నిర్ణయాలకు అనుగుణంగా తాజాగా సీబీఐసీ ఈ నిర్ణయాన్ని వెలువరించింది. ‘‘రిజిస్టర్ చేయని కొనుగోలుదారులు సరఫరా జరగని చోట జీఎస్టీ వాపసు పొందడానికి తాజా నిర్ణయం అనుమతిస్తుంది. వారిపై ఇప్పటి వరకూ ఉన్న అనవసరమైన వ్యయ భారాన్ని నివారించడంలో సహాయపడుతుంది’’ అని అని భారత్లో కేపీఎంసీ ప్రతినిధి (పరోక్ష పన్ను) అభిషేక్ జైన్ వ్యాఖ్యానించారు. -
ఒక్క డాలర్ కోసం జైలు పాలయ్యాడు.. అదీ భార్య వల్ల!
వాషింగ్టన్: భార్య చెప్పిన విషయం విని కోపంతో ఊగిపోయిన ఓ భర్త ఒక్క డాలర్ కోసం దొంగతనం చేశాడు. తీరా అరెస్టై జైలుకెళ్లాడు. ఈ సంఘటన అమెరికాలోని ఒక్లాహోమా నగరంలో జరిగింది. స్టార్బక్స్ అనే కాఫీ స్టోర్ తన భార్యకు రీఫండ్ చేయాల్సిన 1.25 డాలర్లు తిరిగి ఇవ్వలేదనే కోపంతో స్టోర్లో చోరీకి పాల్పడ్డాడు. దీంతో పోలీసులు అతడ్ని అరెస్ట్ చేయాల్సి వచ్చింది. అయితే, ఇక్కడే ట్విస్ట్ ఉంది. చోరీ చేసిన వస్తువు విలువ 1.32 డాలర్లు మాత్రమే. ఆ స్టోరీ ఏంటో మనమూ తెలుసుకుందాం.. రిచర్డ్ ఎంగెల్(61) అనే వ్యక్తి తన భార్యతో కలిసి గత ఆదివారం సాయంత్రం ఎడ్మోండ్లోని ఈస్ట్ మెమోరియల్ రోడ్లో ఉన్న స్టార్బక్స్ కాఫీ స్టోర్కు వెళ్లాడు. ఆ మరుసటి రోజు ఆయన భార్య తిరిగి కాఫీ షాప్కి వెళ్లి తనకు రీఫండ్ చేయాల్సిన 1.25 డాలర్లు తిరిగి ఇవ్వాలని కోరింది. అయితే, కాఫీ కొనుగోలు చేసినట్లు రిసిప్ట్ లాంటి ఆధారం లేకుండా రీఫండ్ ఇవ్వడం కుదరదని స్టోర్ సిబ్బంది తెలిపారు. దీంతో ఇంటికి వెళ్లి తన భర్తను తీసుకొచ్చింది ఆమె. ఈ క్రమంలో క్యాషియర్తో గొడవ పడ్డాడు ఎంగెల్. తన భార్యకు రావాల్సిన రీఫండ్ను ఇవ్వాల్సిందేనని వాధించాడు. క్యాషియర్ అందుకు ఒప్పుకోకపోవడంతో కౌంటర్పై ఉన్న టిప్ జార్ను పట్టుకుని అక్కడి నుంచి పరుగులు పెట్టాడు ఎంగెల్. అయితే, ఆ టిప్ జార్లో కేవలం 1.32 డాలర్లు మాత్రమే ఉండటం గమనార్హం. ఎంగెల్ను అనుసరించిన స్టోర్ సిబ్బంది అతడి కారును ఫోటోలు తీసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కారు నంబర్ ప్లేట్ ఆధారంగా ఎంగెల్ ఇంటికి వెళ్లి చోరీ, దాడి వంటి నేరాల కింద అరెస్ట్ చేశారు పోలీసులు. ఇదీ చదవండి: దురదృష్టవశాత్తు ఆ ఫ్లైట్లో టికెట్ బుక్ చేసుకున్నా..! -
పొరపాటున అడిషనల్ బోనస్: ఉద్యోగుల కుటుంబాల్లో చిచ్చు
న్యూఢిల్లీ: జపాన్ కార్ మేకర్ హోండా తప్పులో కాలేసింది. ఓహియో-ఆధారిత మేరీస్విల్లే ఫ్యాక్టరీలోని ఉద్యోగులకు చెల్లించాల్సిన బోనస్లో అనుకోకుండా అదనపు మొత్తంలో చెల్లించింది. ఆలస్యంగా పొరపాటు గ్రహించిన సంస్థ అదనంగా చెల్లించిన సొమ్మను ఇచ్చేయాలంటూ తన ఉద్యోగులకు మెమోలు జారీ చేసింది. తాజా పరిణామంతో అవాక్కయిన ఉద్యోగులు చేతికొచ్చిన సొమ్ములు ఎలా ఇవ్వాలో తెలియక తికమకలో పడిపోయారు. మరోవైపు ఉద్యోగులు డబ్బులువాపస్ ఇస్తారా లేదా, లేదంటే భవిష్యత్తు బోనస్లో కట్ చేసుకోవాలో తేల్చుకోలేక హోండా అధికారులు తలలు పట్టుకున్నారు. (SpiceJet Salary Hikes: సంచలనం,పైలట్లకు 20 శాతం జీతం పెంపు!) సెప్టెంబరు 22 వరకు వారు చెల్లించాల్సిన మొత్తాన్ని భవిష్యత్ చెల్లింపుల నుండి తీసుకోవాలా, భవిష్యత్ బోనస్లో మినహాయించుకోవాలా లేదా ముందుగా చెల్లిస్తారా మీరే తేల్చుకోమని ఉద్యోగులను కోరింది. ఈ విషయాన్ని హోండా ప్రతినిధి కూడా ధృవీకరించింది. అయితే సున్నితమైన ఈ విషయాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని భావిస్తున్నట్టు ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఉద్యోగులు డబ్బును తిరిగి చెల్లించకపోతే హోండా చట్టపరమైన మార్గంలో వెళ్లవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఉద్యోగుల కుటుంబాల్లో ఆగ్రహాలు దీనిపై ఉద్యోగుల కుటుంబాల్లో అగ్రహాలువ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితిని అందరూ మేనేజ్ చేయలేరంటూ ఒక హోండా ఉద్యోగి భార్య వాపోయారు. తన భర్తకు వచ్చిన బోనస్లో 8 శాతం తిరిగి ఇవ్వాలంటే.. వందల డాలర్లు ఆమెపేర్కొన్నారు. అది మాకు కారు చెల్లింపు. అది మా తనఖాలో సగం, రెండు, మూడు వారాల విలువైన కిరాణా.. ఈ డబ్బు చాలా విలువైంది..చెల్లించాలంటే కష్టం మరొకరు వ్యాఖ్యానించారు. -
35 రూపాయల కోసం ఐదేళ్ల పోరాటం
కోటా: రాజస్తాన్కు చెందిన సుజీత్ స్వామి అనే ఇంజనీర్ రైల్వే నుంచి తనకు రావాల్సిన 35 రూపాయలను ఐదేళ్ల పాటు పోరాడి మరీ సాధించుకున్నాడు! ఆ క్రమంలో దేశవ్యాప్తంగా మరో 3 లక్షల మందికీ లబ్ధి చేకూర్చాడు. 2017 జూలై 2న కోటా నుంచి ఢిల్లీ వెళ్లేందుకు ఆ ఏడాది ఏప్రిల్లో స్వామి టికెట్ బుక్ చేసుకున్నాడు. తర్వాత దాన్ని రద్దు చేసుకున్నాడు. క్యాన్సలేషన్లో భాగంగా 35 రూపాయల సర్వీస్ చార్జిని కూడా టికెట్ డబ్బుల్లోంచి రైల్వే శాఖ మినహాయించుకుంది. అదేమంటే జూలై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చిందన్న బదులు వచ్చింది. జూలై 1కి ముందే రద్దు చేసుకున్న టికెట్పై సర్వీస్ చార్జి ఎలా వసూలు చేస్తారంటూ ఆయన న్యాయ పోరాటానికి దిగాడు. ఆర్టీఐ కింద ఏకంగా 50 దరఖాస్తులు పెట్టడంతో పాటు నాలుగు ప్రభుత్వ శాఖలకు లేఖలపై లేఖలు రాశాడు. వరుస ట్వీట్లు చేశాడు. ప్రధానితో పాటు కేంద్ర మంత్రులను, జీఎస్టీ కౌన్సిల్ను టాగ్ చేశాడు. ఎట్టకేలకు సర్వీస్ చార్జీ మొత్తాన్ని వెనక్కిస్తామంటూ రైల్వే శాఖ 2019లో దిగొచ్చింది. కానీ రౌండాఫ్ పేరుతో 33 రూపాయలే రీఫండ్ చేసింది. దాంతో మిగతా 2 రూపాయల కోసం కూడా పట్టుబట్టిన స్వామి, మూడేళ్ల పోరాటంతో వాటినీ సాధించాడు! 2017 జూన్ 2కు ముందు టికెట్లు రద్దు చేసుకున్న 2.98 లక్షల మందికీ రూ.35 సర్వీస్ చార్జి రిఫండ్ చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. -
‘కరోనా’ కక్కుర్తిని కక్కించారు!
కోవిడ్ సందర్భంగా ప్రైవేటు ఆసుపత్రులు వసూలు చేసిన అధిక ఫీజులను వెనక్కి ఇవ్వాల్సి వచ్చింది. నగర వైద్య చరిత్రలోనే మున్నెన్నడూ లేని విధంగా అత్యధిక సంఖ్యలో ఆస్పుత్రుల మీద వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన అనంతరం వైద్యారోగ్య శాఖ వినతి మేరకు సిటీ ఆసుపత్రులు రోగుల నుంచి వసూలు చేసిన అధిక ఫీజులను వెనక్కి ఇచ్చేశాయి. నగరానికి చెందిన ఓ ఆర్టీఐ కార్యకర్తకు అందించిన సమాచారంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. సాక్షి, హైదరాబాద్: కోవిడ్ చికిత్స ఛార్జీలపై 2020 జూన్ 15న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణీత రేట్లను జారీ చేసింది చికిత్స పరీక్షల కోసం ప్రైవేట్ ఆసుపత్రులు/లేబొరేటరీలు వసూలు చేసే బిల్లులపై పరిమితిని విధించింది. అయితే వాటిని ప్రైవేటు ఆసుపత్రులు ఉల్లంఘించాయి. దారి చూపిన హెల్ప్లైన్ రొటీన్ వార్డు అండ్ ఐసోలేషన్లో చేరేందుకు రోజుకు రూ.4వేలు, వెంటిలేటర్ లేకుండా ఐసియూ ఐసోలేషన్కు రోజుకు రూ.7,500, వెంటిలేటర్తో ఐసియూ ఐసోలేషన్కు రోజుకు రూ.9 వేలుగా నిర్ణయించింది. అయితే ఆసుపత్రులు మాత్రం రకరకాల పేర్లు పెట్టి అధిక ఛార్జీలు వేసి బిల్లులు పెంచి సొమ్ము చేసుకుంటున్నారని రోగుల నుంచి పెద్ద యెత్తున ఆరోపణలొచ్చాయి. గత సంవత్సరం, కోవిడ్–19 రోగులను పదే పదే ఉల్లంఘించినందుకు కనీసం 30 ఆసుపత్రులను కోవిడ్ చికిత్సల నుంచి నిషేధించింది. అంతేకాకుండా ఒక హెల్ప్లైను ఏర్పాటు చేసి, ఆసుపత్రులు ఎక్కువ వసూలు చేస్తున్నాయని భావిస్తే ఫిర్యాదు చేయాలని కోరింది. వెల్లువెత్తిన ఫిర్యాదులు.. కరోనా చికిత్స కోసం ఆసుపత్రులు వివిధ అదనపు బిల్లులను వసూలు చేస్తున్నాయని రోగులు, బంధువుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. గత నెల ఆఖరు వరకు ప్రభుత్వం నిర్ణయించిన చికిత్స ఛార్జీలను ధిక్కరించినందుకు 268 ప్రైవేట్ ఆసుపత్రులపై 843 ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో 87 ఫిర్యాదులకు రీఫండ్లు అందించాల్సి వచ్చింది. నిబంధనలు ఉల్లంఘించి వసూలు చేసిన బిల్లులను వాపసు చేసే విషయంపై ప్రైవేట్ ఆసుపత్రులతో చర్చలు జరిపేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. దీని ద్వారా నగరంలోని 87 ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి రూ. 1.61 కోట్లకు పైగా సొమ్మును రోగులకు వెనక్కి ఇచ్చారు. అత్యధిక రిఫండ్ ఓమ్ని ఆసుపత్రిదే... కూకట్పల్లిలోని ఓమ్ని ఆసుపత్రి అత్యధికంగా రూ.27,41,948 రీఫండ్ చెల్లించింది. ఉప్పల్లోని టీఎక్స్ హాస్పిటల్ రూ.10,85,000, కొండాపూర్లోని మెడికవర్ హాస్పిటల్ రూ.10,82,205 రీఫండ్ చేశాయి. బంజారాహిల్స్లోని సెంచురీ హాస్పిటల్స్ (రూ.10 లక్షలు), ఎల్బీ నగర్లోని అంకురా హాస్పిటల్ (రూ.6.1 లక్షలు), ఎల్బి నగర్లోని దియా హాస్పిటల్ (రూ. 6 లక్షలు), హైదరాబాద్ నర్సింగ్ హోమ్ (రూ.5 లక్షలు), సెక్రటేరియట్లోని మెడికవర్ హాస్పిటల్ (రూ.5.7 లక్షలు), కూకట్పల్లిలోని ప్రతిమ హాస్పిటల్ (రూ.8.2 లక్షలు) గచ్చిబౌలిలోని సన్షైన్ హాస్పిటల్ (రూ.5 లక్షలు) రోగులకు రీఫండ్ చేసిన ఆసుపత్రుల్లో ఉన్నాయి. (చదవండి: ‘న్యాక్’కు దూరంగా కాలేజీలు!) -
రూ.1.83 లక్షల కోట్ల పన్ను రిఫండ్లు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మార్చి 7 వరకు 2.14 కోట్ల పన్ను చెల్లింపుదారులకు రూ.1.86 లక్షల కోట్ల పన్ను రిఫండ్లు (తిరిగి చెల్లింపులు) పూర్తి చేసినట్టు ఆదాయపన్ను శాఖకు చెందిన ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) తెలిపింది. ఇందులో రూ.67,442 కోట్లు వ్యక్తిగత ఆదాయపన్ను చెల్లింపుదారులకు సంబంధించి రిఫండ్లు కాగా, మిగిలిన మొత్తం కార్పొరేట్ పన్ను రిఫండ్గా పేర్కొంది. ఆదాయపన్ను శాఖకు సంబంధించి విధాన నిర్ణయాలను సీబీడీటీయే చూస్తుంటుంది. -
కెయిర్న్తో ‘రెట్రాస్పెక్టివ్’ వివాద పరిష్కారం
న్యూఢిల్లీ: రెట్రాస్పెక్టివ్ పన్ను వివాద పరిష్కారానికి సంబంధించి కేంద్రం బ్రిటన్కు చెందిన కెయిర్న్ ఎనర్జీకి రూ.7,900 కోట్లు రిఫండ్చేసింది. కెయిర్న్ (ప్రస్తుతం క్యాప్రికార్న్ ఎనర్జీగా పేరు మారింది) ఈ మేరకు ఒక ప్రకటన చేస్తూ, ‘‘పన్ను రిఫండ్గా 1.06 బిలియన్ డాలర్లను స్వీకరించడం జరిగింది’’ అని పేర్కొంది. దీనితో భారత్తో పెట్టుబడులకు సంబంధించి గడిచిన ఏడేళ్ల నుంచి తీవ్ర వివాదాస్పంగా ఉన్న రెట్రాస్పెక్టివ్ వివాదంలో కీలక సానుకూల పరిణామం చోటుచేసుకున్నట్లయ్యింది. వివారాలు ఇవీ... 50యేళ్ల క్రితం జరిగిన వ్యాపార ఒప్పందాలపై కూడా పన్నులు విధించేందుకు వీలు కల్పిస్తూ 2012లో చేసిన రెట్రాస్పెక్టివ్ ట్యాక్స్ చట్టం అంతర్జాతీయ స్థాయిలో వివాదాస్పదంగా మారింది. పలు అంతర్జాతీయ న్యాయస్థానాల్లో దీనిపై పలు సంస్థలు దావాలు దాఖలు చేసి, వాటికి అనుగుణంగా తీర్పులను పొందాయి. కెయిర్న్ విషయానికి వస్తే, 2006–07లో భారత విభాగాన్ని లిస్టింగ్ చేసే ముందు వ్యాపార పునర్వ్యవస్థీకరణ ద్వారా కెయిర్న్ గణనీయంగా క్యాపిటల్ గెయిన్స్ పొందిందన్నది ఆదాయ పన్ను శాఖ ఆరోపణ. లావాదేవీలు జరిగి చాలాకాలం గడిచినప్పటికీ వాటికి కూడా పన్నులను వర్తింపచేసే విధంగా (రెట్రాస్పెక్టివ్) 2012లో ప్రవేశపెట్టిన చట్టాన్ని ప్రయోగించి రూ. 10,247 కోట్ల మేర పన్నులు కట్టాలంటూ కెయిర్న్కు నోటీసులు పంపించింది. వాటిని రాబట్టుకునేందుకు కెయిర్న్ షేర్లు మొదలైన వాటిని జప్తు చేసుకుంది. వీటి విలువ దాదాపు రూ. 7,900 కోట్లు. దీనిపై కెయిర్న్.. ఆర్పిట్రేషన్ ట్రిబ్యునళ్లను ఆశ్రయించగా కంపెనీకి అనుకూలంగా తీర్పులు వచ్చాయి. కానీ, భారత ప్రభుత్వం వాటిని తిరస్కరించడంతో .. తనకు రావాల్సిన మొత్తాన్ని రాబట్టుకునేందుకు విదేశాల్లో భారత ప్రభుత్వానికి ఉన్న ఆస్తులపై కెయిర్న్ దృష్టి సారించింది. వాటిని జప్తు చేసి, తనకు పరిహారం ఇప్పించాలంటూ వివిధ దేశాల్లో న్యాయస్థానాలను ఆశ్రయించింది. కొన్ని చోట్ల కంపెనీకి అనుకూల ఆదేశాలు కూడా వచ్చాయి. వరుసలో మరో 16 కంపెనీలు! అంతర్జాతీయంగా వివాదాస్పదం కావడంతో కేంద్రం గత ఏడాది రెట్రాస్పెక్టివ్ ట్యాక్స్ చట్టాన్ని పక్కన పెట్టింది. ప్రభుత్వంపై పెట్టిన కేసులను ఉపసంహరించుకుంటే సామరస్యంగా ఈ వివాదాల పరిష్కారానికి కేంద్రం ముందుకు వచ్చింది. ఈ దిశలో వివాదాస్పద చట్ట నిబంధనల కింద వసూలు చేసిన మొత్తాలను తిరిగి రిఫండ్ చేస్తామని ప్రకటించింది. దాదాపు రూ.1.10 లక్షల కోట్ల పన్ను డిమాండ్లు అందుకున్న దాదాపు 17 కంపెనీల్లో 14 కంపెనీలు వీటి పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించినట్లు అత్యున్నత స్థాయి వర్గాలు పేర్కొన్నాయి. ఇందులో బ్రిటన్ ఇంధన దిగ్గజం కెయిర్న్ ఎనర్జీ ఒకటి. కేంద్రంతో కుదుర్చుకున్న సెటిల్మెట్ ఒప్పందం ప్రకారం.. అమెరికా, ఫ్రాన్స్, సింగపూర్ తదితర దేశాల న్యాయస్థానాల్లో భారత్పై వేసిన దావాలన్నింటిని కెయిర్న్ ఉపసంహరించుకుంది. ఇందుకు సంబంధించి కేసులను ఉపసంహరించుకున్న వివరాలతో కేంద్రానికి ఫారం 3ని సమర్పించింది. ఆ తర్వాత ట్యాక్స్ల రిఫండ్ కోసం ప్రభుత్వం ఫారం 4 జారీ చేసింది. దీంతో రూ. 7,900 కోట్ల పన్ను మొత్తాన్ని ప్రభుత్వం నుంచి రిఫండ్ పొందేందుకు కెయిర్న్కు మార్గం సుగమం అయ్యింది. కెయిర్న్తోపాటు కేంద్రంతో దాదాపు రూ.20,495 కోట్ల విలువైన రెట్రాస్పెక్టివ్ పన్ను వివాద పరిష్కారం దిశగా బిలియనీర్ అనిల్ అగర్వాల్ మైనింగ్ గ్రూప్ వేదాంతా ముందడుగులు వేస్తోంది. -
యూపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. ‘ఆ డబ్బు వాపస్ చేయండి’
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ) వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల విషయంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. 2019 డిసెంబర్లో ఈ ఆందోళనల్లో పాల్గొన్నవారి నుంచి వసూలు చేసిన సొమ్మును వెనక్కి ఇచ్చేయాలని జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు నష్టం చేకూర్చారన్న ఆరోపణలతో ఆందోళనకారుల నుంచి జరిమానాల రూపంలో రూ.కోట్లలో సొమ్ము వసూలు చేశారని, ఆ డబ్బు రీఫండ్ చేయాలని ధర్మాసనం పేర్కొంది. ఆందోళనకారుల ఆస్తులను అటాచ్ చేశారని, వాటిని పునరుద్ధరించాలని స్పష్టం చేసింది. సీఏఏ వ్యతిరేక ఆందోళనకారులకు జారీ చేసిన 274 రికవరీ నోటీసులను వెనక్కి తీసుకున్నామని యూపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. సీఏఏ వ్యతిరేక కార్యక్రమాల్లో పొల్గొన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై 2020 ఆగస్టు 31న నోటిఫై చేసిన ‘ఉత్తరప్రదేశ్ రివకరీ ఆఫ్ డ్యామేజెస్ టు పబ్లిక్, ప్రైవేట్ ప్రాపర్టీ యాక్ట్’ కింద రాష్ట్ర ప్రభుత్వం తదుపరి చర్యలు ప్రారంభించవచ్చని ప్రభుత్వానికి ధర్మాసనం సూచించింది. యూపీ ప్రభుత్వం జారీ చేసిన రికవరీ నోటీసులను కొట్టివేయాలని కోరుతూ పర్వేజ్ అరీఫ్ టిటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆరేళ్ల క్రితం మరణించిన వృద్ధుల పేరిట కూడా ఇలాంటి నోటీసులు ఇచ్చారని ఆక్షేపించారు. ఈ పిటిషన్పై ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. నోటీసులపై వివరణ ఇవ్వాలని ఈ నెల 11న యూపీ సర్కారును ఆదేశించింది. -
ఐస్క్రీమ్ చల్లగా ఉందేంటి, నా డబ్బులు తిరిగి ఇచ్చేయండి.. కస్టమర్ ఫిర్యాదు
గతంలో పుడ్ తినాలంటే హోటల్కి వెళ్లి తినేవాళ్లం. కానీ స్విగ్గి, జొమాటో లాంటి ఆన్లైన్ యాప్లు వాడకంలోకి వచ్చాక కూర్చున్న చోటు నుంచే నచ్చిన పుడ్ని తెప్పించుకు తింటున్నాం. కస్టమర్ల సౌకర్యం కోసం ఆన్లైన్ పుడ్ డెలివరీ యాప్లు కొన్ని రూల్స్ని పాటిస్తుంటాయి. అయితే కొందరు కస్టమర్లు మాత్రం వీటిని అలుసుగా తీసుకుని డబ్బులు ఇవ్వకుండా కుంటి సాకులు చెబుతూ తప్పించుకుంటున్నారు. ఇటువంటి ఘటనలే యూకేలోని ఓ హోటల్లో చోటు చేసుకున్నాయి. వివరాల్లోకి వెళితే.. యూకేలోని ఓల్డ్హామ్లో హాసన్ హాబిబ్ అనే వ్యక్తికి జస్ట్ ఈట్ అనే రెస్టారెంట్ ఉంది. అన్ని హోటల్లో లానే అందులో టేక్ అవే సౌకర్యం ఉంది. ఆ ప్రాంతంలో పుడ్ సరిగా లేకుంటే మనీ రీఫండ్ లాంటి స్వీమ్లు కొన్ని కస్టమర్లకు ఉపయోగకరంగా ఉంటాయి. అయితే కొందరు దాన్నే అదునుగా తీసుకుని ఫుడ్ ఆర్డర్ చేస్తూ డెలివరీ అయ్యాక ఏదో ఒక సాకులు చెప్పి.. డబ్బులు రిఫండ్ చేయాలంటూ రెస్టారెంట్పై ఫిర్యాదులు చేస్తున్నారట. ఇటీవల ఓ కస్టమర్.. ఐస్క్రీమ్ ఆర్డర్ చేసి డెలివరీ కాగానే ఐస్క్రీమ్ చల్లగా ఉంది నాకేమి నచ్చలేదు మనీ రిఫండ్ చేయాలని రిక్వెస్ట్ పెట్టాడట. ఇదొక్కటే కాదు ఇలాంటి సిల్లీ కారణాలతో మనీ రిఫండ్ చేయాలని ఫిర్యాదులు రోజు వస్తూనే ఉండడంతో ఆ రెస్టారెంట్ ఓనర్ ఆన్లైన్ ఆర్డర్స్, టేక్ అవేని ఆపేశాడట. చివరకి ఆ రెస్టారెంట్ యజమాని తన కస్టమర్లు ఎవరైనా ఫుడ్పై ఫిర్యాదు చేయాలనుకుంటే.. దానికి కొంత చార్జ్ వసూలు చేయడం మొదలు పెట్టాడు. కనీసం 30 రోజుల గడువు తీసుకొని ఆలోపు కస్టమర్ల ఫిర్యాదులో పేర్కొన్న విధంగా సమస్య ఉంటే.. రిఫండ్ ఇవ్వడం ప్రారంభించారు. చదవండి: వర్క్ ఫ్రం హోం చేసినా బీమా చెల్లించాల్సిందే! -
ఖాతాదారులకు రూ. 164 కోట్లు బాకీ పడ్డ ఎస్బీఐ...!
SBI Yet To Refund Rs 164 Cr Undue Fee Charged From Jan Dhan Holders: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ ఖాతాదారులకు భారీ మొత్తంలో బాకీ పడినట్లు తెలుస్తోంది. ప్రధాన మంత్రి జన్ధన్ యోజన ఖాతాదారుల నుంచి వసూలు చేసిన రూ. 164 కోట్లను ఎస్బీఐ ఇంకా రిఫండ్ చేయలేదు. ఏప్రిల్ 2017 నుంచి డిసెంబర్ 2019 మధ్య కాలంలో జన్ధన్ ఖాతాల డిజిటల్ చెల్లింపుల కోసం ఛార్జీలను ఎస్బీఐ వసూలు చేసింది. ఈ విషయంపై ఐఐటీ ముంబై సమగ్ర నివేదికను రూపొందించింది. చదవండి: ఓలాకు తప్పని పాట్లు..! వారికి మాత్రం తీవ్ర నిరాశే..! ఈ నివేదిక ప్రకారం... సదరు అమౌంట్ను తిరిగి ఆయా ఖాతాదారులకు చెల్లించాలని ప్రభుత్వం ఎస్బీఐకు సూచనలు చేసింది. దీంతో జన్ధన్ ఖాతాదారులకు సుమారు రూ. 90 కోట్లను మాత్రమే తిరిగి ఇవ్వగా...ఇంకా రూ.164 కోట్లను ఎస్బీఐ చెల్లించాల్సి ఉంది. ఏప్రిల్ 2017 నుంచి సెప్టెంబర్ 2020 జన్ ధన్ పథకం కింద తెరిచిన ఖాతాలనుంచి ఒక్కో లావాదేవీకి రూ.17.70 చొప్పున బ్యాంకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై ఎస్బీఐను వివరణ కోరగా...ఇంకా స్పందించకపోవడం గమనర్హం. సదరు అమౌంట్ వెంటనే రీఫండ్చేయాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరక్ట్ టాక్సెస్ ఉత్తర్వులను జారీ చేసింది. చదవండి: మ్యూచువల్ ఫండ్స్లలో పెట్టుబడుల వర్షం! -
‘ఫిట్జీ’ ఆ విద్యార్థికి రూ.4 లక్షలు చెల్లించండి
సాక్షి, హైదరాబాద్: బోధన నచ్చలేదని చెల్లించిన ఫీజు తిరిగి ఇవ్వాలని విద్యార్థి చేసిన వినతిని ఫిట్జీ పినాకిల్ సంస్థ తిరస్కరించడంతో వినియోగదారుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కోచింగ్ మానేసిన విద్యార్థికి ఫీజు తిరిగి ఇచ్చేయాలని సంబంధిత సంస్థకు హైదరాబాద్ జిల్లా రెండో వినియోగదారుల కమిషన్ ఆదేశించింది. ఈ సందర్భంగా కోర్సు మొత్తం ఫీజు మొదటే తీసుకోవడాన్ని కమిషన్ తప్పుపట్టింది. ఫిట్జీలో కోర్సులో చేరి తర్వాత మానేసిన విద్యార్థి తన ఫీజు తిరిగి ఇవ్వాలని కోరగా నిరాకరించింది. దీనిపై ఆ విద్యార్థి వినియోగదారుల కమిషన్లో ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదుపై విచారణ చేపట్టిన కమిషన్ ఫిట్జీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై వాదోపవాదనలు విని పైతీర్పు ఇచ్చింది. అయితే విచారణలో ‘చేరే సమయంలో విద్యార్థికి తిరిగి ఫీజు చెల్లించబోమని విషయాన్ని ముందే చెప్పాం’ అని ఫిట్జీ వాదించింది. ఈ ఒప్పందంపై ఆ విద్యార్థి సంతకం చేశారని కూడా గుర్తు చేయగా ఆ వాదనను కమిషన్ తోసిపుచ్చింది. ఫీజు వివాదం వినియోగదారుల కమిషన్ పరిధిలోకి రాదని ఫిట్జీ విద్యా సంస్థ పేర్కొనగా కమిషన్ తిరస్కరించింది. విద్యా సంస్థ ముసుగులో కోచింగ్ కేంద్రం నిర్వహిస్తున్నారని కమిషన్ పేర్కొంది. విద్యార్థికి రూ.4.35 లక్షల ఫీజు, రూ.50 వేల పరిహారం చెల్లించాలని ఫిట్జీకి కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఇది 45 రోజుల్లో చెల్లించకపోతే 9 శాతం వార్షిక వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని వినియోగదారుల కమిషన్ హెచ్చరించింది. -
వాహన రుణగ్రహీతలకు ‘జీపీఎస్’ కమీషన్ వెనక్కి
ముంబై: హెచ్డీఎఫ్సీ బ్యాంకు వద్ద వాహనరుణాలు తీసుకుని, జీపీఎస్ పరికరాలను సైతం కొనుగోలు చేసిన కస్టమర్లకు ‘కమీషన్ల’ను త్వరలో తిరిగి చెల్లించనున్నట్టు ప్రకటించింది. 2013–14 నుంచి 2019–20 ఆర్థిక సంవత్సరం మధ్య వాహన రుణాలు తీసుకున్న కస్టమర్లతో హెచ్డీఎఫ్సీ బ్యాంకు జీపీఎస్ పరికరాలను కూడా కొనుగోలు చేయించింది. ఆయా పరికరాల విక్రయం రూపంలో కమీషన్లను సంపాదించుకుంది. వాహన రుణాల్లో అవకతవకలు జరిగినట్టు గతేడాది బ్యాంకు చీఫ్గా ఉన్న ఆదిత్యపురి సైతం అంగీకరించారు. దీనిపై ఆర్బీఐ రూ.10 కోట్ల జరిమానా కూడా విధించింది. ఈ నేపథ్యంలో హెచ్డీఎఫ్సీ బ్యాంకు తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. 2013–14 నుంచి 2019–20 మధ్య వాహన రుణాలు తీసుకుని, జీపీఎస్ పరికరాలనూ కొనుగోలు చేసిన వారికి కమీషన్లను తిరిగి చెల్లించనున్నట్టు ప్రకటించింది. బ్యాంకు వద్ద నమోదై ఉన్న కస్టమర్ల ఖాతాలకు వచ్చే 30 రోజుల్లో ఈ మొత్తాన్ని జమ చేయనున్నట్టు తెలిపింది. దీనిపై కస్టమర్లు బ్యాంకు శాఖలను సంప్రదించొచ్చని సూచించింది. వాహన రుణ దరఖాస్తును ఆమోదించే సమయంలో కస్టమర్తో రూ.18,000 విలువ చేసే జీపీఎస్ పరికరాన్ని హెచ్డీఎఫ్సీ బ్యాంకు కొనుగోలు చేయించిందన్నది ఆరోపణ. నిబంధనల ప్రకారం బ్యాంకు లు ఇతర ఉత్పత్తులను విక్రయించరాదు. సేవల ప్రారంభానికి ప్రయత్నిస్తున్నాం అదే పనిగా డిజిటల్ సేవల్లో అంతరాయాలు ఏర్పడుతుండడంతో.. నూతన క్రెడిట్ కార్డులు మంజూరు చేయకుండా ఆర్బీఐ విధించిన నిషేధం నుంచి బయటపడేందుకు తమవంతు కృషి చేస్తున్నట్టు హెచ్డీఎఫ్సీ బ్యాంకు చీఫ్ ఇన్ఫర్మేషన్ అధికారి రమేష్ లక్ష్మీనారాయణ తెలిపారు. నూతన టెక్నాలజీని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. సేవల్లో అంతరాయాలు ప్రస్తుత పాత వ్యవస్థ కారణంగానే చోటుచేసుకుంటున్నట్టు పేర్కొన్నారు. వీటిని సాధ్యమైనంత వేగంగా పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. తరచూ సాంకేతిక అవాంతరాలు ఏర్పడుతుండడంతో కొత్తగా క్రెడిట్ కార్డులు, నూతన డిజిటల్ సేవలు ప్రారంభించకుండా 2020 డిసెంబర్లో ఆర్బీఐ నిషేధం విధించడం గమనార్హం. -
ట్యాక్స్ రిఫండ్ ఇంకా రాలేదా..?
ఒక అసెస్సీ తన నికర ఆదాయం మీద చెల్లించాల్సిన పన్ను కన్నా ఎక్కువ పన్ను చెల్లించినట్లయితే అలా ఎక్కువగా చెల్లించిన మొత్తాన్ని రిఫండుగా వెనక్కి ఇస్తారు. అంతే కాదు. రిఫండుతో పాటు వడ్డీ కూడా ఇస్తారు. అసెస్సీలే కాదు.. అసెస్సీ పరిశీలకులు, సంరక్షకులు, ప్రతినిధి కూడా రిఫండును క్లెయిమ్ చేయొచ్చు. సాధారణంగా దాఖలు చేసిన రిటర్నుని అధికారులు అసెస్.. అంటే మదింపు చేస్తారు. అలా పూర్తి చేసిన తర్వాత రిఫండు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడితే రిఫండ్ ఇస్తారు. కొన్ని సందర్భాల్లో అప్పీలులో పన్ను భారం తగ్గవచ్చు. అప్పుడు కూడా రిఫండు ఇస్తారు. ఇలా సకాలంలో ఇవ్వకపోయిన పక్షంలో రిఫండుతో పాటు వడ్డీ కూడా చెల్లిస్తారు. టీడీఎస్, అడ్వాన్స్ ట్యాక్స్, సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ .. ఈ మూడింటిని కలిపితే మీరు చెల్లించిన మొత్తం పన్ను అవుతుంది. మదింపు చేసిన తర్వాత చెల్లించాల్సిన పన్ను భారం కన్నా మీరు కట్టిన పన్ను మొత్తం ఎక్కువగా ఉంటే రిఫండు ఇస్తారు. బేసిక్ లిమిట్ కంటే స్థూల నికర ఆదాయం తక్కువ ఉంటే ఆదాయపు పన్ను రిటర్ను దాఖలు చేయనవసరం లేదు. కానీ చెల్లించిన పన్ను మొత్తం ఉంటే రిఫండు కోసం రిటర్ను దాఖలు చేయాలి. రిఫండు అనేది ఆటోమేటిక్గా రాదు. రిటర్ను దాఖలు చేయాలి. అన్ని రకాలుగా మీ క్లెయిమ్ కరెక్టుగా ఉంటే రిఫండు త్వరగానే వచ్చేస్తుంది. 2021 మార్చి 31 నాటికి 2,38,000 మందికి రూ. 2.62 లక్షల కోట్ల రిఫండులు ఇచ్చారు. ఈ ఏడాది ఏప్రిల్ 21 నుంచి మే 10 మధ్య కాలంలో 13 లక్షల మందికి రూ. 17,061 కోట్లు రీఫండులు జారీ చేశారు. అయితే, ఈ కింది పరిస్థితుల్లో రిఫండు రాకపోవచ్చు. మదింపు ఇంకా జరగకపోతే రిటర్ను వెరిఫై కాకపోతే .. అంటే 120 రోజుల్లోపల పంపాల్సిన ఫారం V పంపకపోతే మీ బ్యాంకు ఖాతా వివరాలు సరిగ్గా ఇవ్వకపోయినా లేక వివరాలు సరిపోలకపోయినా మీరు ఎప్పటికప్పుడు వెబ్సైట్లో లాగిన్ అయి మీ ఆదాయపు పన్ను స్టేటస్ చెక్ చేసుకోవాలి. రిటర్ను వేసేటప్పుడు వాడుకలో ఉన్న మీ వ్యక్తిగత మెయిల్ వివరాలే ఇవ్వండి. అంతా ఆన్లైన్ యుగం. గతంలో లాగా పోస్ట్మ్యాన్ తలుపు తట్టి తాఖీదు ఇవ్వరు. ఒకవేళ నోటీసులేమైనా వస్తే ఆన్లైన్ మాధ్యమంలో సకాలంలో జవాబు పంపించండి. మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ గుర్తు పెట్టుకోండి. ఎవరితోనూ షేర్ చేయొద్దు. ఒక సంవత్సరకాలంగా రిఫండు రావాల్సి ఉండి.. ఇతరత్రా మరో సంవత్సరానికి చెల్లించాల్సిన పన్ను భారం ఉంటే దానికి అడ్జస్టు చేస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో నోటీసులు ఇస్తారు. సక్రమంగా, సకాలంలో స్పందించండి. ఆదాయపు పన్ను శాఖ రిఫండు విషయంలో మెరుగైన సరీ్వసులు అందిస్తోంది. ట్యాక్సేషన్ నిపుణులు: కె.సీహెచ్. ఎ.వి.ఎస్.ఎన్ మూరి కె.వి.ఎన్ లావణ్య -
ప్రయాణికులకు రీఫండ్ వోచర్లు..?
న్యూఢిల్లీ: లాక్డౌన్ సమయంలో ప్రయాణాలకు ముందుగా రిజర్వేషన్లు చేసుకున్న ప్రయాణికులకు రిఫండ్స్ ఎలా జరగాలన్న అంశంపై తీర్పును సుప్రీంకోర్టు శుక్రవారం రిజర్వ్ చేసుకుంది. బదలాయింపులకు వీలయిన రిఫండ్ వోచర్లు జారీ ద్వారా సమస్యకు సానుకూల పరిష్కారం చూపవచ్చన్న కేంద్రం ప్రతిపాదనను పరిశీలిస్తామని న్యాయమూర్తులు అశోక్ భూషన్, ఆర్ సుభాషన్ రెడ్డి, ఎంఆర్ షాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం తెలిపింది. కేంద్ర ప్రతిపాదనలోని కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... లాక్డౌన్ సమయంలో రద్దయిన సర్వీసులకు సంబంధించి ప్రయాణి కులకు డబ్బు వాపసు చేస్తే, ఇప్పటికే తీవ్ర కష్టాల్లో ఉన్న విమానయాన సంస్థలపై ఆర్థికంగా మరింత ప్రతికూల ప్రభావం పడుతుంది. అయితే ఈ సమస్య పరిష్కారానికి ‘బదలాయింపునకు వీలయిన రిఫండ్ వోచర్లను’ ప్రయాణి కులకు జారీ చేస్తే అటు ప్రయాణికులు, ఇటు విమానయాన సంస్థల ప్రయోజనాలకు విఘాతం కలుగదు. వోచర్స్ను ప్రయాణికులు టికెట్లు బుక్ చేసిన తమ ఏజెంట్లకు సమర్పించి, డబ్బు వాపసు తీసుకోవచ్చు. లేదా తదుపరి తమ ప్రయాణాల టికెట్ బుకింగ్లకు వినియోగించుకోవచ్చు. డబ్బు వాపసు ఇచ్చిన పక్షంలో ఆయా వోచర్లను వేరొకరి ప్రయాణాలకు వినియోగించే సౌలభ్యతను ఏజెంట్లకు కల్పించడం జరుగుతుంది. ఎన్జీఓలు, ప్యాసింజర్ల అసోసియేషన్స్సహా పలువురు దాఖలు చేసిన పిటిషన్లపై కోర్టు రెండు వర్గాల వాదనలు విన్న సంగతి తెలిసిందే. కేంద్రం, డీజీసీఏ (డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) తరఫున తుషార్ మెహతా చేసిన ‘బదలాయింపులకు వీలయిన రిఫండ్స్ వోచర్ల’ ప్రతిపాదనకు ట్రావెల్ ఏజెంట్ల సంస్థ తరఫున వాదలను వినిపించిన సీనియర్ అడ్వకేట్ పల్లవ్ సిసోడియా సానుకూల స్పందన వ్యక్తం చేయడం శుక్రవారంనాటి మరో కీలకాంశం. ఇండిగో ఎయిర్లైన్ తరఫున సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గీ కూడా సంబంధిత ప్రతిపాదనకు అంగీకారం తెలిపారు. విదేశీ విమాన సర్వీసులకు వర్తించదు! కాగా వాదనల సమయంలో ‘ప్రవాసీ లీగల్ సెల్’ ఎన్జీఏ సంస్థ తరఫు సీనియర్ న్యాయవాది సంజయ్ హెగ్గే విదేశాల నుంచి టికెట్ బుక్ చేసుకున్న వారికి రిఫండ్ పరిస్థితిని ప్రస్తావించారు. దీనికి అత్యున్నత న్యాయస్థానం స్పందిస్తూ, విదేశీ విమాన సర్వీసుల అంశంలోకి వెళ్లలేమని పేర్కొంది. సంబంధిత టికెట్లకు రిఫండ్ను భారత్ ప్రభుత్వం ఆదేశించలేదని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా పేర్కొంది. -
యూపీఐ చార్జీలను రిఫండ్ చేయండి
న్యూఢిల్లీ: ఈ ఏడాది జనవరి 1 నుంచి రూపే కార్డులు, భీమ్–యూపీఐ విధానాల్లో చేసిన చెల్లింపులపై విధించిన చార్జీలను కస్టమర్లకు వాపసు చేయాలని బ్యాంకులకు ఆదాయ పన్ను శాఖ సూచించింది. భవిష్యత్లోనూ ఈ రెండు విధానాల్లో జరిపే లావాదేవీలపై ఎలాంటి చార్జీలు విధించవద్దని పేర్కొంది. కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఈ మేరకు ఒక సర్క్యులర్ జారీ చేసింది. 2020 జనవరి 1 తర్వాత నుంచి నిర్దేశిత ఎలక్ట్రానిక్ చెల్లింపులపై ఎండీఆర్ (మర్చంట్ డిస్కౌంట్ రేటు) సహా ఇతరత్రా ఎలాంటి చార్జీలు వర్తించబోవని గతేడాది డిసెంబర్లోనే స్పష్టం చేసిన సంగతి ఈ సందర్భంగా ప్రస్తావించింది. దీనిపై ఆదేశాలు స్పష్టంగా ఉన్నప్పటికీ యూపీఐ లావాదేవీలపై కొన్ని బ్యాంకులు చార్జీలు విధిస్తున్న సంగతి తమ దృష్టికి వచ్చిందని సీబీడీటీ తెలిపింది. ఇది నిబంధనల ఉల్లంఘన కిందికి వస్తుందని, చర్యలు ఎదుర్కొనాల్సి వస్తుందని పేర్కొంది. మరోవైపు, ఈ రిఫండ్ల వ్యవహారం బ్యాంకులపై అదనపు భారం మోపుతుందని నాంగియా ఆండర్సెన్ పార్ట్నర్ సందీప్ ఝున్ఝున్వాలా పేర్కొన్నారు. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించే ఉద్దేశంతో 2019 ఆర్థిక చట్టంలో కేంద్రం ప్రత్యేక నిబంధన చేర్చింది. దీని ప్రకారం రూ. 50 కోట్ల టర్నోవరు దాటిన వ్యాపార సంస్థలు తప్పనిసరిగా ఎలక్ట్రానిక్ విధానంలో చెల్లింపులు జరిపేందుకు కస్టమర్లకు వెసులుబాటునివ్వాలి. -
ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త
సాక్షి, విజయవాడ: లాక్డౌన్ కాలంలో రిజర్వేషన్ చేసుకొని గడువులోగా టికెట్ రద్దు చేసుకోలేని వారికి ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. వారికి మరోమారు అవకాశం ఇస్తున్నట్లు పేర్కొంది. ఇందుకోసం ప్రయాణికుల సౌకర్యార్థం టికెట్ కాన్సిలేషన్ పాలసీని సవరించింది. టికెట్లకు నగదు తిరిగి ఇచ్చేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. మార్చి 20 నుంచి ఏప్రిల్ 19 మధ్య రిజర్వేషన్ చేసుకున్న వారికి సైతం అవకాశం కల్పిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్కు సంబంధించి ఓ నిర్ణీత కాల పరిమితి వరకు టికెట్ క్యాన్సిల్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అయితే లాక్డౌన్ కారణంగా చాలామంది తమ టికెట్లను నిర్ణీత కాలపరిమితి లోపు రద్దు చేసుకోలేకపోయారు. దీంతో వారికోసం ఆర్టీసీ ప్రత్యేకంగా నిబంధనల్ని సవరించింది. దీని ప్రకారం ఈనెల 29 లోపు ప్రయాణికులు వారి టికెట్లను రద్దు చేసుకోవచ్చంటూ తెలిపింది. దగ్గర్లోని బస్టాండు లేదా ఎటీబీ కౌంటర్లో టికెట్ చూపించి క్యాన్సిల్ చేసుకోవచ్చని ఆర్టీసీ పేర్కొంది. ప్రయాణికులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపింది. -
విమాన టికెట్ డబ్బు వెనక్కి ఇవ్వరా..?
న్యూఢిల్లీ: లాక్డౌన్ కారణంగా రద్దయిన విమానాలకు సంబంధించి టికెట్ డబ్బులను పూర్తిగా వాపసు ఇవ్వకపోవడంపై అత్యున్నత న్యాయస్థానం– సుప్రీంకోర్టు దృష్టి సారించింది. పూర్తి సొమ్ము వెనక్కు ఇచ్చేలా విమానయాన సంస్థలకు ఆదేశాలకు ఇవ్వాలని దాఖలైన ఒక పిటిషన్పై పౌర విమానయాన మంత్రిత్వశాఖ, డీజీసీఏ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్)లకు నోటీసులు జారీ చేసింది. ‘ప్రయాణికుల ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా’ రద్దయిన ప్రయాణ టిక్కెట్ డబ్బును తరువాత వినియోగించడానికి ఉద్దేశించిన ‘క్రెడిట్ షెల్’ యంత్రాంగంలోకి మళ్లించడం ‘చట్ట విరుద్ధమని’ పిటిషన్ సుప్రీంకు విన్నవించింది. ఎయిర్ ప్యాసింజర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణకు స్వీకరించి నోటీసులకు ఆదేశాలిచ్చింది. కోవిడ్–19 నేపథ్యంలో రద్దయిన విమాన టికెట్ల డబ్బును వెనక్కు ఇచ్చే విషయంలో సంయుక్తంగా కొన్ని విధివిధానాలను రూపొందించుకోవాలని పౌర విమానయాన శాఖ, ఎయిర్లైన్స్కు జూన్ మొదట్లో సుప్రీం సూచనలు ఇచ్చింది. -
ఆగస్టు వరకు రైలు ప్రయాణాలు లేనట్టేనా?
న్యూఢిల్లీ: కరోనా దెబ్బకు రవాణా రంగం దారుణంగా దెబ్బతిన్నది. దాదాపు రెండు నెలల తర్వాత బస్సులు రోడ్డెక్కాయి. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో ఇప్పటికి కూడా హైదరాబాద్లో సిటీ బస్సులు తిరగడం లేదు. కఠిన నియమ నిబంధనల మధ్య దేశీయ విమాన సేవలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికి కూడా కేంద్రం రైల్వే సర్వీసులకు అనుమతివ్వడం లేదు. ఈ క్రమంలో ఆగస్టు మధ్య వరకు కూడా రైల్వే సేవలను పునరుద్ధరించబోవడం లేదనేది తాజా సమాచారం. ఈ క్రమంలో రైల్వే మంత్రిత్వ శాఖ.. అన్ని రకాల అడ్వాన్స్ టికెట్ బుకింగ్లకు సంబంధించి పూర్తి సొమ్మును ప్రయాణికులకు రీఫండ్ చేయాల్సిందిగా అన్ని జోన్లకు సూచించినట్లు సమాచారం. (రైల్వే ఇక మేడిన్ ఇండియా) ఏప్రిల్ 14న లేదా అంతకు ముందు వరకు బుక్ చేసుకున్న అన్ని టిక్కెట్లను రద్దు చేయాలని.. ప్రయాణికులకు పూర్తి సొమ్మును వాపసు చేయాల్సిందిగా రైల్వే మంత్రిత్వ శాఖ సోమవారం అన్ని జోన్లకు ఒక సర్క్యులర్ జారీ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం రైల్వే శాఖ రోజు 230 మెయిల్స్, ఎక్స్ప్రెస్ రైళ్లను నడుపుతోంది. అయితే కరోనా నేపథ్యంలో సామాజిక దూరాన్ని దృష్టిలో పెట్టుకుని.. ఎక్కువ రైళ్లను నడపాలని రైల్వే శాఖ భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆగస్టు మధ్య వరకు రైలు ప్రయాణాలను వాయిదా వేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే జూన్ 30 వరకు అన్ని సాధారణ రైళ్ల నిర్వహణను రైల్వే శాఖ రద్దు చేసిన సంగతి తెలిసిందే. (‘జపాన్ అని చెప్పి.. చైనాకు లాక్కెళ్తారా’) -
కరోనా: ఐటీ శాఖ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: ఆదాయపన్ను శాఖ నుంచి చెల్లింపుదారులకు రావాల్సిన మొత్తాలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయనుంది. రూ. 5 లక్షల లోపు రిఫండ్లను తక్షణమే చెల్లించనున్నట్టు ఆదాయపన్ను శాఖ ప్రకటించింది. దీని వల్ల 14 లక్షల మంది పన్ను చెల్లింపుదారులకు ప్రయోజం కలుగుతుందని వెల్లడించింది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఏర్పడిన విపత్కర పరిస్థితుల్లో వ్యాపార సంస్థలు, చెల్లింపుదారులకు వెంటనే ఉపశమనం కలిగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని ఐటీ విభాగం తెలిపింది. పెండింగ్లో ఉన జీఎస్టీ, కస్టమ్స్ రిఫండ్లు రూ.18,000 కోట్లను కూడా విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. దీని ద్వారా ఎంఎస్ఎంఈలు సహ లక్ష సంస్థలకు ప్రయోజనం కలుగుతుందని పేర్కొంది. కాగా, 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ గడువును జూన్ 30 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. ‘కరోనా’ ఉపకరణాలపై పన్నుల ఎత్తివేత వెంటిలేటర్లు, ఫేస్ మాస్క్లు, సర్జికల్ మాస్క్లు, పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్స్(పీపీఈ), కోవిడ్-19 కిట్స్ మొదలైన వాటి దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీ, హెల్త్ సెస్లను ఎత్తివేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఉపకరణాల తయారీలో వినియోగించే వస్తువుల దిగుమతి కూడా కస్టమ్స్ డ్యూటీ, హెల్త్ సెస్ సెప్టెంబర్ వరకు ఉందడబోవని తెలిపింది. కాగా, న్యూస్ప్రింట్పై విధిస్తున్న 5 శాతం కస్టమ్స్ సుంకాన్ని తొలగించాలని, న్యూస్పేపర్ సంస్థలకు రెండేళ్ల పాటు ట్యాక్స్ హాలిడే ఇవ్వాలని ఇండియన్ న్యూస్పేపర్ సొసైటీ (ఐఎన్ఎస్) కోరింది. అలాగే, బీవోసీ ప్రకటన రేటును 50 శాతం, ప్రింట్ మీడియాకు బడ్జెట్ను 100 శాతం పెంచాలని విజ్ఞప్తి చేసింది. చదవండి: మాంద్యం గుప్పిట్లోకి ప్రపంచం! -
కరోనా: రైళ్లు రద్దు.. డబ్బు వాపస్!
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్-19 (కరోనా వైరస్) సోకినవారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రజలు ప్రయాణాలు చేస్తూ గుంపులు గుంపులుగా తిరగకుండా, సామాజిక దూరం పాటించే విధంగా భారత రైల్వేశాఖ పలు రైళ్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే మార్చి 21 నుంచి ఏప్రిల్ 15 మధ్య రద్దు చేసిన రైళ్లలో ప్రయాణికులు బుక్ చేసుకున్న రైలు టికెట్ల డబ్బును 100 శాతం ప్రయాణికులకు రీఫండ్ చేయనున్నట్లు ఇండియన్ రైల్వే ప్రకటించింది. ఇక భారత రైల్వే పీఆర్ఎస్ (ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్) కౌంటర్ ఇచ్చే టికెట్ల నిబంధనలను సడలించింది. ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకున్న వారికి ఆయా వ్యాలెట్లు, అకౌంట్లలో డబ్బు రీఫండ్ అవుతుందని ఇండియన్ రైల్వే తెలిపింది. (కార్మికుల కడుపుకొడుతున్న కరోనా) ఈ- టికెట్ కోసం అన్ని నియమాలు ఒకే విధంగా ఉంటాయని, ప్రయాణికులు టికెట్ వాపసు కోసం స్టేషన్కు రావాల్సిన అవసరం లేదని తెలిపింది. కాగా దేశవ్యాప్తంగా ఆదివారం ఎక్కడి రైళ్లు అక్కడే నిలిచిపోనున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘జనతా కర్ఫ్యూ’ పాటించాలంటూ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆదివారం ఉదయం 7 నుంచి రాత్రి 9 వరకు పలు రైళ్లు నిలిచిపోనున్నాయి. ఇక ముంబై, ఢిల్లీ, కోల్కతా, చెన్నై, సికింద్రాబాద్ పరిధిలోని సబ్ అర్బన్ సర్వీసులు (లోకల్ ట్రైన్స్) సంఖ్యను కూడా తగ్గించనున్నారు. చాలా తక్కువ సంఖ్యలో రైళ్లను నడపనున్నారు. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ఇప్పటివరకు రద్దు చేసిన మొత్తం రైళ్ల సంఖ్య 245కి చేరింది. (యూపీ సీఎం కీలక నిర్ణయం, 35లక్షల మందికి లబ్ధి) చదవండి: భారత్లో 271కి చేరిన కరోనా బాధితుల సంఖ్య -
అనిల్ అంబానీకి భారీ ఊరట
సాక్షి,న్యూఢిల్లీ : రిలయన్స్ కమ్యూనికేషన్(ఆర్కామ్) వివాదంలో కేంద్రానికి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఆర్కామ్కు రూ.104 కోట్లు చెల్లించాల్సిందేనని సుప్రీం తేల్చి చెప్పింది. టెలికాం డిస్ప్యూట్స్ సెటిల్మెంట్ అప్పిలేట్ ట్రైబ్యునల్(టీడీఎస్ఏటీ) తీర్పుని సవాల్ చేస్తూ కేంద్రం దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు మంగళవారం తిరస్కరించింది. కేంద్రం అప్పీల్లో ఎలాంటి యోగ్యత కనిపించడం లేదని జస్టిస్ ఆర్ ఎఫ్ నారీమన్, జస్టిస్ రవీంద్ర భట్తో కూడిన ధర్మాసనం పేర్కొంది. అత్యున్నత న్యాయస్థానం కేంద్రం అభ్యర్థనను తిరస్కరించిన నేపథ్యంలో ప్రభుత్వం రూ .104 కోట్లను ఆర్కామ్కు తిరిగి చెల్లించాల్సి వుంది. బకాయిలకు సంబంధించి ఆర్కామ్, టెలికాం విభాగం మధ్య ఉన్నఅనేక వివాదాల్లో ఇదొకటి కావడం గమనార్హం. కాగా స్పెక్ట్రం కోసం బ్యాంక్ గ్యారెంటీ బ్యాలెన్స్గా అనిల్ అంబానీ నేతృత్వంలోని ఆర్కామ్ చెల్లించిన రూ.908 కోట్ల పూచీకత్తులో.. రూ.774కోట్ల ఛార్జీల మొత్తం పోనూ మిగిలిన సొమ్మును తిరిగి చెల్లించేలా కేంద్రాన్ని ఆదేశించాలని ఆర్కామ్ డిసెంబర్ 2018లో టీడీఎస్ఏటీని ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన ట్రైబ్యునల్ ఇంకా దాదాపు రూ.104కోట్లు చెల్లించాలని ఆదేశించింది. ఇప్పటికే రూ.30.33 కోట్లు ఆర్కామ్కు చెల్లించింది. ఈ ఆదేశాన్ని ప్రభుత్వం సవాలు చేసింది. కాగా భారీ వ్యాపార నష్టాలు, పెరుగుతున్న అప్పుల కారణంగా ఆర్కామ్ 3 సంవత్సరాల క్రితం కార్యకలాపాలను మూసివేసింది. 2019 లో దివాలా తీసిన సంగతి తెలిసిందే. -
రైలు ప్రయాణీకులకు గుడ్న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ : రేల్వేవినియోగదారుల కోసం ఇటీవల అనేక సౌలభ్యాలను అందుబాటులోకి తీసుకొస్తున్న ఇండియన్ రైల్వే తాజాగా మరో తీపి కబురు అందించింది. తన టికెట్ బుకింగ్ ప్లాట్ఫాం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఆర్సీటీసీ)అధీకృత టికెటింగ్ ఏజెంట్ల ద్వారా బుక్ చేసుకున్న టిక్కెట్లను క్యాన్సిల్ చేసుకునే విషయంలో సరికొత్త విధానాన్ని పరిచయం చేసింది. అంటే ఇకపై రైలు టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే ఓటీపీ ఆధారంగా వెంటనే,సంబంధిత నగదును ఖాతాదారుని అకౌంట్లో జమ చేయనుంది. ఐఆర్సీటీసీ కొత్త ఓటీపీ ఆధారిత రిఫండ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చిందని రైల్వే శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇ-టిక్కెట్ల విషయంలో పారదర్శకత , యూజర్ ఫ్రెండ్లీ వ్యవస్థను తీసుకురావడం లక్ష్యంగా ఈ విధానాన్ని తీసుకొచ్చినట్టు తెలిపింది. టికెట్ క్యాన్సిల్ చేసుకోవాలనుకున్నా లేదా వెయిటింగ్ లిస్ట్ టికెట్ వద్దనుకున్నా ఈ విధానంలో ప్రయాణికుల రిజిస్టర్ మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. ఎస్ఎంఎస్ రూపంలో ఈ ఓటీపీ వస్తుంది. దీంతో పాటు రిఫండ్ అమౌంట్ వివరాలు కూడా వస్తాయి. అది ఏజెంట్లకు చూపిస్తే వెంటనే డబ్బు వాపస్ ఇచ్చేస్తారు. అయితే ఈ సిస్టమ్ ఐఆర్సీటీసీ అధికారిక ఏజెంట్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. వీరి ద్వారా బుక్ చేసుకున్న టికెట్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది. టికెట్ డబ్బులు రిటన్ పొందాలంటే.. ఇ-టికెట్లకు మాత్రమే ఓటీపీ రిఫండ్ రూల్స్ వర్తిస్తాయనే విషయాన్ని గమనార్హం. సరైన మొబైల్ నంబర్ను ఐఆర్సీటీసీ అధీకృత ఏజెంట్కు వినియోగదారుడు అందించాలి. బుకింగ్ సమయంలో ఏజెంట్లు సంబంధిత నంబరును సరిగ్గా రికార్డ్ చేశారో లేదు చెక్ చేసుకోవాలి. ఈ కొత్త ఓటీపీ విధానం వల్ల పారదర్శకత పెరుగుతుందని, ఎంత రిఫండ్ వస్తుందో వెంటనే తెలిసి పోతుందని రైల్వే శాఖ వెల్లడించింది. -
రూ.100 కోసం.. రూ.77 వేలు
సాక్షి, పట్నా: బిహార్ రాజధాని పట్నాలో ఈ విచిత్రమైన సంఘటన జరిగింది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. రెప్పపాటులో సొమ్మును పోగొట్టుకోవడం ఖాయం. గుర్తు తెలియని వ్యక్తులు పంపించే అనుమానాస్పద లింక్లపై క్లిక్ చేసి బ్యాంక్ లావాదేవీలు చేస్తే...సైబర్ నేరగాళ్ల బారిన పడక తప్పదు. పట్నాలోని ఒక ఇంజనీర్కు ఇలాంటి చేదు అనుభవమే ఎదునైంది. వంద రూపాయల రిఫండ్ కోసం ప్రయత్నించిన వ్యక్తి ఖాతానే ఖాళీ చేసిన వైనం ఒకటి చోటు చేసుకుంది. దీంతో కోల్పోయిన తన సొమ్ముకోసం బ్యాంకులు, పోలీసుల చుట్టూ తిరుగుతున్నాడు బాధితుడు వివరాలు ఇలా వున్నాయి...సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయిన విష్ణు ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో ద్వారా ఫుడ ఆర్డర్ చేశాడు. డెలివరీ బాయ్ తీసుకొచ్చిన ఆహార నాణ్యతపై సంతృప్తి చెందక దాన్ని తిరిగి పంపించేశాడు. ఇందుకు డబ్బులు వాపస్ ఇవ్వాలని కోరగా..జొమాటో కస్టమర్ కేర్ను సంప్రదించమని. అందులోని మొదటి నంబరుకు ఫోన్ చేయమని డెలివరీ బాయ్ సలహా ఇచ్చాడు. దీంతో విష్ణు గూగుల్ సెర్చ్లోని "జొమాటో కస్టమర్ కేర్" అని వున్న నంబరుకు ఫోన్ చేశాడు. వెంటనే జోమాటో కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ నంటూ ఒక వ్యక్తం కాల్ చేశాడు. రూ.100 రిఫండ్ చేయాలంటే 10 అదనంగా డిపాజిట్ చేయాల్సి వుంటుందంటూ ఒక లింక్ను పంపాడు. ఏ మాత్రం ఆలోచించని ఇంజనీర్ వెంటనే లింక్పై క్లిక్ చేసి రూ.10 డిపాజిట్ చేశాడు. అంతే ఈ లావాదేవీ జరిగిన కొద్ది నిమిషాల్లోనే విష్ణు బ్యాంక్ ఖాతాలోంచి సొమ్ము మొత్తం గల్లంతైంది. చూస్తూండగానే బహుళ లావాదేవీల ద్వారా 77 వేల రూపాయల మొత్తాన్ని అవతలి వ్యక్తి మాయంచేస్తోంటే.. విష్ణు అచేతనంగా మిగిలిపోయాడు. ఈ సంఘటన సెప్టెంబర్ 10 జరిగింది. దీంతో లబోదిబోమంటూ విష్ణు తన సొమ్మును వెనక్కి తెచ్చుకునే పనిలో పడ్డాడు. -
ఆ కస్టమర్కు రూ.4 కోట్లు చెల్లించండి
న్యూఢిల్లీ: తన కస్టమర్కు చెల్లించాల్సిన రూ.4 కోట్లను వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని జాతీయ వినియోగదారుల వివాదాల పరిహారాల కమిషన్ (ఎన్సీడీఆర్సీ) ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని ఆదేశించింది. అలోక్ కుమార్కు రూ.4.12 కోట్లు చెల్లించాల్సిందిగా హరియాణాకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారిని ఆదేశించింది. ప్రస్తుతం జపాన్లోని టోక్యోలో ఉంటున్న అలోక్.. భారత్కు తిరిగొచ్చాక ఉండటానికి ఓ ఇంటిని కొనుగోలు చేయాలని భావించారు. దీంతో గోల్డెన్ పీకాక్ రెసిడెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ డెవలపర్స్కు ఓ అపార్ట్మెంట్ కొనుగోలు కోసం బ్యాంకు లోను తీసుకున్నారు. ఈమేరకు 2015 సెప్టెంబర్ కల్లా దానికి సంబంధించిన మొత్తాన్ని చెల్లించారు. అయితే తాను ఇండియాకి వచ్చి చూడగా తన ఇంటి నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. 2015లోనే దానికి సంబంధించిన పనులు ఆగిపోయాయని గుర్తించిన అలోక్ ఎన్సీడీఆర్సీని ఆశ్రయించారు. -
ఒక స్మార్ట్ఫోన్ రీఫండ్ అడిగితే..10 ఫోన్లు
గూగుల్ పిక్సెల్ స్మార్ట్ఫోన్ కొనుగోలు చేసిన ఒక వినియోగదారుడికి అరుదైన అనుభవం ఎదురైంది. రెడిట్ ప్రచురించిన కథనం ప్రకారం చీటో అనే వినియోగదారుడు గూగుల్ పిక్సెల్ 3 స్మార్ట్ఫోన్ను కొనుగోలు చేశాడు. అయితే అది సరిగ్గా పనిచేయకపోవడంతో, దాని డబ్బులు వాపసు ఇవ్వాలని కోరుతూ ( రూ.56,898) గూగుల్ కంపెనీని కోరాడు. అయితే దీనికి బదులుగా కేవలం రూ.5500 మాత్రమే రీఫండ్ చేసింది. ఇక్కడ ఇంకోట్విస్ట్ ఏంటంటే చీటో కి జాక్ పాట్ లాంటి ఆఫర్ వచ్చింది. నగదు రీఫండ్కు బదులుగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10 పిక్సెల్ 3 స్మార్ట్ఫోన్ల పార్సిల్ పలకరించింది. దాదాపు 6 లక్షల రూపాయల విలువ చేసే పిక్సెల్ స్మార్ట్ఫోన్లు చూసి చీటో ఖంగుతిన్నాడు. అయితే తన సొమ్ము మొత్తం రీఫండ్ వచ్చే వరకు... ఈ స్మార్ట్ఫోన్లను కంపెనీకి వెనక్కి ఇచ్చేది లేదని ప్రకటించాడు. అయితే తాజా సమాచారం ప్రకారం గూగుల్ మొత్తం సొమ్మును చీటోకి రీఫండ్ చేసిందట. దీంతో చీటో మొత్తం 10 ఫోన్లను కంపెనీకి రీసెండ్ చేసే ప్రయత్నంలో ఉన్నాడు. కొసమెరుపు ఏంటంటే చీటో మరో పిక్సెల్ స్మార్ట్ఫోన్ను ఆర్డర్ చేయడంతో పదిఫోన్లు ఆర్డర్ చేసినట్టుగా భావించిందట కంపెనీ. అయితే పొరపాటుగా పంపించిన 10 ఫోన్లను రీఫండ్ చేయమని కంపెనీ అడిగే పరిస్థితిలో లేనప్పటికీ.. నిజాయితీగా తనకు వచ్చిన పార్సిల్ను తిరిగి వెనక్కి ఇచ్చేందుకు సిద్దపడ్డాడు చీటో. -
వాటికి జీఎస్టీ రీఫండ్
సాక్షి,న్యూఢిల్లీ : జీఎస్టీ వసూళ్లపై దేవాలయాలు , ధార్మిక, మత సంస్థలకు కేంద్రం భారీ ఊరట కల్పించింది. ఆయా సంస్థల నుంచి వసూలు జీఎస్టీ పన్నులను తిరిగి వాటికి రీఫండ్ చేయనుంది. ఉచితంగా భోజనం అందించే ఆలయాలు, ధార్మిక సంస్థలకు ఈ చెల్లింపులను చేయనుంది. ఈ మేరకు సేవ భోజ్ యోజన పథకాన్ని రాష్ట్రపతి ఆమోదించారు. ఇందుకు వచ్చే రెండేళ్లలో రూ.350కోట్లను కేటాయించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా చర్య మూలంగా తిరుమల తిరుపతి దేవస్థానం, స్వర్ణ దేవాలయ బోర్డులు గరిష్టంగా లబ్ది పొందనున్నాయి. ప్రజలకు ఉచిత భోజనం (లాంగర్) అందించే దాతృత్వ మత సంస్థల నుంచి ముడి ఆహార వస్తువుల కొనుగోలుపై వసూలు చేసిన సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (సీజీఎస్టీ) ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (ఐజిఎస్టీ) వాటాను తిరిగి చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ, శిరోమణి అకాలీ దళ్ల ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కేంద్రం ఎట్టకేలకు ఈ నిర్ణయం తీసుకుంది. జులై 1, 2017నుంచి జనవరి 31, 2018 వరకు ఈ మినహాయింపును వర్తింప చేయనున్నారు. -
ఐ ఫోన్ కస్టమర్కి భారీ ఊరట
ఆపిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కు గుజరాత్లోని అహ్మదాబాద్ కోర్టు షాక్ ఇచ్చింది. ఖరీదైన ఐ ఫోన్ను కొనుగోలు చేస అష్టకష్టాలుపడిన ఓ కస్టమర్కి భారీ ఊరటనిస్తూ తీర్పు చెప్పింది. వినియోగదారుడి కోరికపై ఐ ఫోన్ రిఫండ్ చేయాలని, లేదా అదనపు ధర చెల్లింపు తర్వాత హై ఎండ్ మోడల్ ఐ ఫోన్ ను ఇవ్వాలని తీర్పు చెప్పింది. లేదంటే రూ.54వేలు చెల్లించాలని ఆదేశించింది. అంతేకాదు సదరు కస్టమర్ పడిన మానసిక వేదనకు, న్యాయ ఖర్చులకుగాను రూ.4,000 పరిహారం చెల్లించాలని స్పష్టం చేసింది. వివరాల్లోకి వెళితే... సౌరాష్ట్ర ధరోజీ టౌన్కి చెందిన ఇక్బాల్ దంధల్ అనే విద్యార్థి 2015లో రూ.54వేలు వెచ్చించి ఓ ఐఫోన్ను కొన్నాడు. దీంతోపాటు ఫోన్కు అదనపు సొమ్ము చెల్లించి డిసెంబర్ 2017 వరకు ఎక్స్టెండెడ్ వారంటీ పొందాడు. అయితే ఇక్బాల్ కొన్న ఐఫోన్ కొద్ది నెలలకే పాడై పోయింది. ఈ విషయాన్ని లోకల్ యాపిల్ డీలర్ దృష్టికి తీసుకెళ్లి, ఆ ఫోన్ను మార్చి అదే మోడల్కు చెందిన కొత్త ఐఫోన్ను తీసుకున్నాడు. అయితే రెండోసారి కూడా సేమ్ సీన రిపీట్. మూడో సారి కూడా ఇక్బాల్కు ఈ కష్టాలు తప్పలేదు. దీంతో ఈ బాధలు తన వల్ల కాదని .. తనకు లేటెస్ట్ మోడల్ ఐ ఫోన్ కావాలని...దీనికి అదనంగా డబ్బులు కూడా చెల్లిస్తానని కోరాడు. కానీ ఇందుకు డీలర్ స్పందించకపోవడంతో విసిగిపోయిన ఇక్బాల్ యాపిల్ ఇండియా కంపెనీతోపాటు ఆ డీలర్పై రాజ్కోట్ కన్జ్యూమర్ కోర్టును ఆశ్రయించాడు. కేసు విచారణ కొనసాగించిన న్యాయస్థానం ఇక్బాల్కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. -
‘కంపెనీ సెక్రెటరీ’ కోర్సులకు క్యాష్బ్యాక్
కోల్కతా: కంపెనీ సెక్రెటరీ ఫౌండేషన్, ఎగ్జిక్యూటివ్ కోర్సుల్లో చేరే నిరుపేద, ప్రతిభావంతులైన విద్యార్థులకు 100 శాతం ఫీజు రిఫండ్ చేస్తామని ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రెటరీస్ ఆఫ్ ఇండియా(ఐసీఎస్ఐ) ప్రకటించింది. తమ సంస్థ స్థాపించి 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా నిరుపేద, మెరిట్ విద్యార్థులను ప్రోత్సహించడానికి ఈ పథకం ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించింది. ఈ డిసెంబర్ నెలలో చేరే విద్యార్థులకే ఈ పథకం వర్తిస్తుందని పేర్కొంది. ఫౌండేషన్ కోర్సుకు సంబంధించి 10+2లో కనీసం 70 శాతం మార్కులు, ఎగ్జిక్యూటివ్ కోర్సుకు సంబంధించి డిగ్రీలో 60 శాతం మార్కులు సాధించిన వారికి రిఫండ్ వస్తుందని వెల్లడించింది. -
గృహ కొనుగోలుదారులకు గుడ్న్యూస్
మీరు గృహ కొనుగోలుదారులా? మీ గృహం కోసం బిల్డర్ కు లేదా ఫ్లాట్ ఓనర్ కు ఒప్పందం మేరకు డబ్బు చెల్లించినప్పటికీ మీకు ఫ్లాట్ స్వాధీనం చేయడం లేదా? ఒప్పందం ప్రకారం అలా ఫ్లాట్ స్వాధీన పరచని పక్షంలో ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నారా? ఒకవేళ బిల్డర్ లేదా నిర్మాణ సంస్థ దివాలా తీసినట్టు ప్రకటిస్తే, లేదా నిధులు లేవన్న కారణంగా నిర్మాణాలను వాయిదా వేస్తూ వెళుతున్నప్పుడు ఏం చేయాలి? అలాంటి వారికి ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పింది. ఇలాంటి సమస్యలు తలెత్తినప్పుడు కేవలం బ్యాంకులు, ఇతర ఫైనాన్షియల్ సంస్థలు మాత్రమే అస్త్రాలుగా వాడుతున్న ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ కోడ్ (ఐబీసీ) ఇకనుంచి వినియోగదారులు కూడా ఉపయోగించేలా చట్టంలో సంబంధిత నిబంధనల్లో మార్పులు చేశారు. అంటే ఒప్పందం మేరకు ఫ్లాట్ స్వాధీనపరచనప్పుడు ఈ చట్టం ప్రకారం వినియోగదారులు బిల్డర్ నుంచి క్లెయిమ్ పొందవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. తాజా నిబంధనల మేరకు బిల్డర్ లేదా కంపెనీ ఏదేనీ కారణం చూపిస్తూ ఫ్లాట్ ను స్వాధీనం చేయనప్పుడు తాజా చట్టం మేరకు క్లెయిమ్ కోరవచ్చు. ప్రస్తుతం ఇలాంటి సమస్యలు ఢిల్లీలో ఎక్కువగా ఉన్నాయి. ఫండ్స్ లేవని సాకుచూపుతూ చాలామంది డెవలపర్లు, గృహ కొనుగోలుదారులకు డెలివరీలు ఇవ్వకుండా నాన్చుతున్నాయి. దీంతో కొనుగోలుదారులు గడువు మించి మరింత కాలం వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంటోంది. ఇటు రీఫండ్ కోసం కూడా కొనుగోలుదారులు వేచిచూడాల్సి వస్తోంది. చట్టంలో చేర్చిన కొత్త నిబంధనల మేరకు క్లెయిమ్ కోసం ప్రత్యేకంగా ఒక దరఖాస్తును సమర్పించాలి. కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రెజుల్యూషన్ ప్రాసెస్ కింద ఈ దరఖాస్తును అందించాలి. అలా సమర్పించిన దరఖాస్తును నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ), దివాలా చట్టం కింద కేసును అంగీకరిస్తే, మిగతా ప్రక్రియ ముందుకు సాగడానికి తాత్కాలిక పరిష్కార ప్రొఫెషనల్ను నియమిస్తారు. ఇలా దివాలా చట్టం కింద దివాలా కార్పొరేట్ సంస్థ నుంచి గృహ వినియోగదారులు తమ రీఫండ్ను పొందవచ్చు. -
జియో ఫోన్పై మరో అంచనా చక్కర్లు
ముంబై: రిలయన్స్ జియో మోస్ట్ ఎవైటెడ్ 4జీ ఫీచర్కు సంబంధించి ఓ ఇంటరెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. సె సెప్టెంబర్ నుంచి జియో వినియోగదారుల చేతుల్లో మెరవనున్న జియో 4 ఫీచర్ ఫోన్ సెక్యూరిటీ డిపాజిట్లో నిర్దేశిత కాలం కంటే ముందుగానే పాక్షికంగా చెల్లించనుందట జియో. ఈ పథకం నియమ నిబంధనలను త్వరలోనే ప్రకటించనున్నట్టు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. ది ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం జియో 4 జీ పీచర్ ఫోన్ కొనుగోలు సందర్భంగా కస్టమర్లు చెల్లించే సెక్యూరిటీ డిపాజిట్ మూడు సంవత్సరాల కంటే ముందే చెల్లించేందుకు రిలయన్స్ జియో యోచిస్తోంది. దీనిపై త్వరలోనే అధికారికంగా ప్రకటన చేయనుంది. కాగా ఇండియాస్ స్మార్ట్ఫోన్గా పిలుస్తున్న, పూర్తిగా ఉచితమైన దీనికోసం వినియోగదారులు సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ. 1500 చెల్లించాల్సి ఉంటుంది. మూడు సంవత్సరాల తరువాత ఈ నగదును కస్టమర్లకు పూర్తిగా వెనక్కి చెల్లించనున్నట్టు జియో ఫోన్ ఆవిష్కరణ సందర్భంగా రిలయన్స్ అధిపతి ముకేశ్ అంబానీ ప్రకటించారు. ఈ డివైస్ ప్రీ-బుకింగ్లు ఆగస్టు 24 న ప్రారంభమవుతాయి. మరోవైపు బహుళ-సిమ్ ఫోన్ల ప్రాబల్యం ఉన్న భారతదేశంలో ఈ ఫోన్ల అమ్మకాల్లో జియో అంచనాలను అందుకోవడం అంత ఈజీకాదని జేపీ మోర్గాన్ అభిప్రాయపడింది. మల్టీ సిమ్, ప్రీ పెయిడ్ సిమ్ల వృద్ధి నెలవారీగా 5శాతంగా ఉందని వాదిస్తోంది. -
'ఎయిర్టికెట్లకు రీఫండ్ ఇస్తాం'
ట్రంప్ ప్రభుత్వం నిషేధించిన ఏడు ముస్లిం దేశాల నుంచి బుక్ చేసుకున్న ఎయిర్టికెట్లకు రీ ఫండ్ ఇస్తున్నట్లు యూ.ఎస్ ఎయిర్లైన్స్ ప్రకటించింది. నిషేధం విధించిన ఇరాన్, ఇరాక్, లిబ్యా, సోమాలియా, సూడాన్, సిరియా, యెమెన్ దేశాల్లోని గ్రీన్ కార్డు హోల్డర్లను మినహా ఎవరినీ అనుమతించబోమని అమెరికాకు చెందిన యూనైటైడ్ ఎయిర్లైన్స్, డెల్టా ఎయిర్లైన్స్ లు పేర్కొన్నాయి. 90 రోజుల పాటు ఏడు ముస్లిం దేశాలపై గత శుక్రవారం ట్రంప్ నిషేధం విధించిన విషయం తెలిసిందే. ప్రపంచంలోని అతిపెద్ద ఎయిర్లైన్స్ సంస్ధ అయిన అమెరికన్ ఎయిర్లైన్స్ తమ కస్టమర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకుంటామని చెప్పింది. టికెట్లను రీ బుక్ చేసుకునే సదుపాయం లేదా డబ్బును వెనక్కు ఇచ్చేందుకు సిద్ధమని తెలిపింది. యూనైటెడ్ ఎయిర్లైన్స్(యూఏఎల్) సీఈవో ఆస్కార్ మునోజ్ మాట్లాడుతూ నిషేధం తర్వాత బుక్ చేసుకున్న టికెట్లకు రీ ఫండ్ ఇస్తామని చెప్పారు. బ్రిటీష్ ఎయిర్వేస్, ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ లు కూడా అమెరికన్ ఎయిర్లైన్స్ బాటలో నడవనున్నట్లు చెప్పాయి. అయితే, ఎయిర్ఫ్రాన్స్ మాత్రం పెనాల్టీలను దృష్టిలో ఉంచుకని రీ ఫండ్ ఇస్తామని చెప్పింది. జర్మనీకి చెందిన ఎయిర్లైన్ దిగ్గజం లుఫ్తాన్సా కస్టమర్లకు రీ బుకింగ్ చేసుకునే సదుపాయన్ని కల్పిస్తున్నట్లు తెలిపింది. -
చేతులెత్తేసిన యూనిటెక్..ఢమాలన్న షేరు
న్యూఢిల్లీ: పీకల్లోతు కష్టాల్లో ఇరుక్కున్న రియల్ ఎస్టేట్ సంస్థ యూనిటెక్ లిమిటెడ్ మరిన్ని కష్టాల్లో కూరుకుపోయింది. ఇటీవలి సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇబ్బందుల్లో పడిన సంస్థ చెల్లింపుల విషయంలో చివరికి చేతులెత్తేసింది. నోయిడా, గుర్గావ్ దాని రెండు ప్రాజెక్టుల ఆలస్యం కారణంగా.. ఇళ్లు కొనుగోలు చేసిన వారికి డబ్బు తిరిగి చెల్లించలేమని సుప్రీం ముందు మంగళవారం తన నిస్సహాయతను వ్యక్తం చేసింది. దీంతో మార్కెట్ లో యూనిటెక్ షేరు అమ్మకాల హోరు కొనసాగింది. దాదాపు షేర్ 20 శాతం పతనమై 4.92 స్థాయికి దిగజారింది. ''మా దగ్గర డబ్బుల్లేవు.. డబ్బులుండి వుంటే.. నిర్మాణాలు పూర్తి చేసి వారికి స్వాధీనం చేసి వుండేవారమని'' యూనిటెక్ సీనియ న్యాయవాది ఏ ఎంసింఘ్వీ, జస్టిస్ దీపక్ మిశ్రాల, యూయూ లలిత్ లతో కూడిన ధర్మాసనం ముందు చెప్పారు. ఇళ్ల కొనుగోలుదారుల సొమ్మును వెనక్కి(రిఫండ్) ఇచ్చే పరిస్థితుల్లో తాము లేమంటూ సుప్రీం కోర్టుకు యూనిటెక్ నివేదించింది. దీంతో సొమ్ము వెనక్కి ఆశిస్తున్న వినియోగదారుల జాబితాను సిద్ధం చేయమని ఆదేశిస్తూ కోర్టు తదుపరి విచారణను ఈ నెల 17కి వాయిదా వేసినట్లు సమాచారం. నోయిడా, గుర్గావ్ యూనిటెక్ ప్రాజెక్ట్లను రెండు డజన్లకు పైగా ఇళ్లు కొనుగోలుదారులు తమకు ఫ్లాట్ల స్వాధీనం చేయడంలో విఫలమైన యూనిటెక్ తమకు డబ్బు తిరిగి చెల్లించాలని కోరుతూ నేషనల్ కన్స్యూమర్ రెడ్రెస్సల్ కమిషన్ (ఎన్సీడీఆర్సీ) ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో వారికి వడ్డీతో సహా చెల్లించాల్సిందిగా సుప్రీం ఇటీవల ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ఈ వివాదం ఇలా ఉండగా బీఎస్ఈ ఈ విషయంపై యూనిటెక్ నుంచి వివరణ కోరింది. -
ఐటీ రీఫండ్ వ్యవధి 15 రోజులకు కుదింపు
న్యూఢిల్లీ: ఆదాయ పన్ను రీఫండ్లకు సంబంధించిన ఫిర్యాదులు పెరిగిపోతున్న నేపథ్యంలో సమస్య పరిష్కారానికి కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరంలో రీఫండ్ కేసుల ప్రాసెసింగ్ను నిర్దేశిత 30 రోజుల్లో గాకుండా 15 రోజుల్లోనే పూర్తి చేయాలని ఆదాయ పన్ను విభాగానికి సూచించింది. -
డబ్బే సర్వస్వం కాదు..
♦ ఒత్తిడిని అధిగమించే శక్తిని దేవుడిచ్చాడు ♦ సహారా గ్రూప్ చీఫ్ సుబ్రతా రాయ్ ♦ ‘థాట్స్ ఫ్రం తీహార్’ పేరుతో పుస్తకం విడుదల న్యూఢిల్లీ: వేల కోట్ల ఇన్వెస్టర్ల సొమ్ము రీఫండ్ వివాదంలో దాదాపు రెండేళ్లుగా తీహార్ జైల్లో మగ్గుతున్న సహారా గ్రూప్ చీఫ్ సుబ్రతా రాయ్ తాజాగా రచనా వ్యాసంగం చేపట్టారు. సహారా గ్రూప్ 39వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రాయ్ రాసిన ‘థాట్స్ ఫ్రమ్ తీహార్’ పుస్తకాన్ని సోమవారం విడుదల చేశారు. ‘లైఫ్ మంత్రాస్’ శీర్షికన వెలువడనున్న మూడు పుస్తకాల శ్రేణిలో ఇది మొదటిది. జైలు జీవితంలో తన ఆలోచనలను ఇందులో పొందుపర్చిన రాయ్.. ఇది తన ఆత్మకథ మాత్రం కాదని స్పష్టం చేశారు. కేవలం ప్రాథమిక సౌకర్యాలతో జైలు గదిలో గడపాల్సి రావడం తనకు షాక్కు గురిచేసిందని రాయ్ తెలిపారు. జైలు జీవితం చాలా ఒంటరిగాను, దుర్భరంగానూ ఉంటుందని, కానీ అదృష్టవశాత్తు ఎల్లవేళలా ఒత్తిడిని అధిగమించగలిగే శక్తిని భగవంతుడు తనకు ఇచ్చాడని ఆయన వివరించారు. ‘నేనేం చేశానని నాకీ శిక్ష .. అని అనిపించేది. ఇలాంటి ఆలోచనలు అనేకానేకం మెదడును తొలిచేసేవి. ఎవరినైనా.. బాహ్యప్రపంచంతో ఎటువంటి సంబంధమూ లేకుండా ఒంటరిగా బంధించేసినప్పుడు జుత్తు పీక్కోవాలనిపిస్తుంది.. ఒకోసారి పిచ్చెత్తిపోతుంది’ అంటూ రాయ్ పుస్తకంలో పేర్కొన్నారు. పుస్తకావిష్కరణ కోసం దేశవిదేశాల్లో దాదాపు 5,120 చోట్ల ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. డబ్బున్నా, షరతులు విధిస్తే... ‘బోలెడంత డబ్బుంటే సుఖంగా బతికేయొచ్చనుకుంటారు అందరూ. కానీ కోరుకున్నంత సంపద ఉన్నా .. మహలు నుంచి బైటి కెళ్లొద్దు.. ఎవరితో మాట్లాడొద్దు, బాహ్యప్రపంచంతో సంబంధం పెట్టుకోవద్దు.. కనీసం టీవీ, రేడియో లాంటివి కూడా ఉండవు అంటూ షరతులు విధిస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఇరవై .. లేదా ముప్పై లేదా నలభై రోజుల తర్వాతో.. బైటికెళ్లేందుకు తలుపులు తీస్తే ఏం చేయాలో అర్థం కాక ఆ వ్యక్తి జుత్తు పీక్కుంటూ ఉంటాడు లేదా పిచ్చెత్తి పోయి ఉంటాడు. దీన్ని నమ్మని వారెవరైనా నన్ను కలిస్తే ప్రాక్టికల్గా నిరూపిస్తాను’ అని రాయ్ వివరించారు. తన భావోద్వేగాలను ఎవరితోనూ పంచుకునే అవకాశాలు లేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి తలెత్తుతుందని పేర్కొన్నారు. అప్పట్లోనే హాయిగా ఉండేది... సహారా గ్రూప్ 1978లో కేవలం రూ. 2,000తో మొదలైందని, ఇప్పటికన్నా అప్పట్లో ఎంతో సంతోషంగా ఉండేదని రాయ్ రాసుకొచ్చారు. పుస్తకం ప్రకారం ప్రస్తుతం గ్రూప్ విలువ దాదాపు రూ. 1,80,000 కోట్లు. అత్యాశకు పోయేవారు సంతోషంగా ఉండలేరని, ఎలాంటి పరిస్థితి ఎదురైనా.. ప్రతీ క్షణం సంతోషంగా, సంతృప్తిగా ఉండాలన్నది తన తండ్రి నుంచి నేర్చుకున్నానని ఆయన వివరించారు. డబ్బే పరమావధిగా పనిచేసే ఏ సంస్థా పురోగమించలేదని, ఆర్థిక క్రమశిక్షణ లేకుండా అధోగతి పాలైనవి చాలా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. -
నేటి నుంచి రద్దు చార్జీలు డబుల్
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: టికెట్ రద్దు చేసుకొనే ప్రయాణికులపై రైల్వేశాఖ భారాన్ని పెంచింది. ఇప్పటి వరకు ఉన్న చార్జీలను రెట్టింపు చేసింది. పెంచిన టికెట్ రద్దు(రీఫండింగ్)చార్జీలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. వెయిటింగ్ లిస్టు ప్రయాణికులు, ఆర్ఏసీ ప్రయాణికులు ఇప్పటి వరకు బుకింగ్ కౌంటర్లలో టికెట్ రద్దు కోసం చెల్లిస్తున్న రూ.30ల రుసుము ఇక నుంచి రూ.60కి పెరగనుంది. అలాగే వివిధ తరగతుల కోసం బుక్ చేసుకున్న నిర్ధారిత(కన్ఫర్మ్డ్) టికెట్ రీఫండింగ్ చార్జీలు కూడా రెట్టింపు కానున్నాయి. ప్రస్తుతం నిర్ధారిత టికెట్లపైన ట్రైన్ బయలుదేరడానికి 6 గంటల ముందు, బయలుదేరిన తరువాత 2 గంటలలోపు టికెట్ రద్దు చేసుకొంటే 50 శాతం డబ్బులు తిరిగి చెల్లించే సదుపాయం ఉండేది. ఇక నుంచి బండి బయలుదేరడానికి 12 గంటల నుంచి 4 గంటల ముందు టికెట్లు రద్దు చేసుకున్న ప్రయాణికులకు మాత్రమే ఈ 50 శాతం సొమ్ము తిరిగి చెల్లిస్తారు. అంటే ట్రైన్ బయలుదేరిన తరువాత కూడా టికెట్ రద్దు చేసుకొనే సదుపాయం ఇక ఉండబోదు. రైలు బయలుదేరడానికి 4 గంటలు ముందే టికెట్లు రద్దు చేసుకోవాలన్న నిబంధన వల్ల మిగిలిన బెర్తులను వెయిటింగ్ లిస్టు ప్రయాణికులకు కేటాయించేందుకు అవకాశం ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. 48 గంటల ముందు రద్దు చేసుకునేవారికి రీఫండింగ్ చార్జీల్లో మార్పులు ఇలా ఉంటాయి. ఇప్పటి వరకు నిర్ధారిత ఫస్ట్ ఏసీ టికెట్ రీఫండింగ్ చార్జీ రూ.120 ఉండగా, ఇక నుంచి రూ.240కి పెరగనుంది. సెకెండ్ ఏసీ చార్జీ.. రూ.100 నుంచి రూ.200లకు, థర్డ్ఏసీ చార్జీ.. రూ.90 నుంచి రూ.180 కి పెరుగుతుంది. హా స్లీపర్ క్లాస్.. రూ.60 నుంచి రూ.120కి, సెకెండ్ క్లాస్.. రూ.30 నుంచి రూ.60 కి పెరుగుతాయి. ఒకే టికెట్పైన ఎక్కువ మంది ప్రయాణికులు బుక్ చేసుకున్నప్పుడు కొందరికి బెర్తులు లభించి, మరి కొందరు వెయిటింగ్ లిస్టులో ఉండే పాక్షిక నిర్ధారిత టికెట్లను రద్దు చేసుకొనేందుకు ప్రస్తుతం ట్రైన్ బయలుదేరిన తరువాత 2 గంటల వరకు గడువు ఉండేది. ఇక నుంచి ట్రైన్ బయలుదేరిన 30 నిమిషాల్లోపు మాత్రమే పాక్షిక నిర్ధారిత టికెట్లు రద్దు చేసుకొనేందుకు అవకాశం ఉంటుంది. ఈ-టిక్కెట్ల రద్దు కోసం ఇప్పటి వరకు ట్రావెల్ డిపాజిట్ రిసీట్(టీడీఆర్)లను అందజేయవలసి ఉండేది. ఇక నుంచి టీడీఆర్ అవసరం లేకుండా.. ఆటోమేటిక్గా రద్దవుతాయి. -
తత్కాల్ రైల్వే ప్రయాణికులకు తీపికబురు...
న్యూఢిల్లీ: భారతీయ రైల్వే ప్రయాణికులకు శుభవార్త. తత్కాల్ రైల్వే టికెట్లు బుక్ చేసుకునే వారికి నిజంగా ఇది తీపి కబురే. అవును....ఇపుడు తత్కాల్ టికెట్ రద్దు చేసుకుంటే పూర్తి సొమ్ము నష్టపోతామనే భయం లేదు. దాదాపు సగం సొమ్ము తిరిగి మన ఖాతాలో చేరుతుంది. ఇప్పటి వరకు తత్కాల్ సేవ ద్వారా బుక్ చేసుకున్న రైల్వే టికెట్ను క్యాన్సిల్ చేసుకునే ప్రయాణికులకు ఒక్కపైసా కూడా వెనక్కి వచ్చేది కాదు. కానీ ఇక ముందు తత్కాల్ టికెట్ కాన్సిల్ చేసుకుంటే దాదాపు 50 శాతం డబ్బులు తిరిగి రానున్నాయి. ఈ మేరకు భారతీయ రైల్వేస్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అలాగే తత్కాల్ టికెట్లు బుకింగ్ వేళల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. మారిన కొత్త షెడ్యూల్ ప్రకారం ఏసీ క్లాస్ టికెట్లను ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు , నాన్ ఏసీ టికెట్లను ఉదయం 11 -12 గంటల మధ్య బుక్ చేసుకునే అవకాశాన్ని రైల్వే శాఖ కల్పిస్తోంది. దీంతో పాటు బాగా రద్దీ ఉండే కొన్ని రూట్లలో ప్రత్యేక తత్కాల్ రైళ్లను కూడా ప్రవేశపెట్టే ఆలోచనలో రైల్వే శాఖ ఉన్నట్టు సమాచారం. మరోవైపు తత్కాల్ స్పెషల్ రైలు టికెట్ల అడ్వాన్స్ బుకింగ్ సౌకర్యాన్ని 10 రోజుల నుంచి రెండు నెలల లోపు(60 రోజులు) బుక్ చేసుకునే వీలుగా నిబంధనలు సవరించినట్టు సమాచారం. -
ఐటీ రిటర్న్కు ఆన్లైనే మేలు!
- 1-3 నెలల్లోనే రీఫండ్ చేతికి - అదే ఆఫ్లైన్లో అయితే 5-10 నెలల సమయం రిఫండ్ అంటే... వెనక్కివ్వటం. ఆదాయపు పన్ను విషయంలో అయితే... చెల్లిం చాల్సిన పన్నుకన్నా ఎక్కువ చెల్లించినపుడు దాన్ని వెనక్కి తీసుకునేందుకు రిఫండ్ క్లెయిమ్ చేయొచ్చు. ఆన్లైన్లో, మాన్యువల్గా రెండు రకాలుగానూ పన్ను రిటర్న్లు దాఖలు చేసే అవకాశం ఉన్నా... ఆన్లైన్ ద్వారా దాఖలు చేసిన రిటర్న్ను పన్ను అధికారులు భౌతికంగా తనిఖీ చేయరు కనక 1-3 నెలల్లోపు రిఫండ్ మొత్తం చేతికొస్తుంది. మాన్యువల్గా దాఖలు చేసిన రిటర్న్ల విషయంలో దీనికి 5-10 నెలలు పడుతుంది. రిఫండ్ను వేగంగా తెచ్చుకోవటమెలా? రిటర్న్ వేసేవారు తొలుత ఐటీ విభాగ డాటాబేస్లో తాము చెల్లించిన పన్ను వివరాలు సరిచూసుకోవాలి. వ్యక్తిగతంగా లాగిన్ అయి... ఫారమ్ 26 ఎఎస్ను చూస్తే మనం చెల్లించిన పన్ను వివరాలు తెలుస్తాయి. సరైన చిరునామాతో పాటు ఫోన్ నంబరు, ఈ-మెయిల్, బ్యాంకు ఖాతా వివరాలు కరెక్టుగా ఇవ్వాలి. ఇక ఐటీఆర్-5 ఫారాన్ని బెంగళూరులోని సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్కు పంపటం తప్పనిసరి. అక్కడి నుంచి క్లియర్ అయ్యాకే రిఫండ్ వస్తుంది కనక. ఒకవేళ రిఫండ్ నేరుగా బ్యాంకు ఖాతాకే జమ కావాలనుకుంటే ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ పద్ధతి (ఈసీఎస్) ఎంచుకోవాలి. వేగవంతమైన రిఫండ్కు అదే కరెక్టు. ఒకవేళ చెక్కు ద్వారా పొందాలనుకుంటే మారే చిరునామా కాకుండా శాశ్వత చిరునామా ఇవ్వటం మంచిది. అయితే రిఫండ్ మొత్తం రూ. 50 వేలు దాటితే ఈసీఎస్ పద్ధతి పనికిరాదు. చెక్కు ద్వారానే అందుతుంది. అసలు సమస్య ఇక్కడే.. అసలు ఆదాయానికి, ఆదాయపు పన్ను చెల్లించడానికి లెక్కించిన ఆదాయానికి మధ్య తేడాలుండటం వల్లే చాలా రిఫండ్లు ఆలస్యమవుతుంటాయి. దీంతో ఈ విషయం ఐటీ విభాగం సెక్షన్ 143(1) కింద తెలియజేస్తుంది. ఐటీ రిటర్న్ దాఖలు చేయడానికి సరైన సాఫ్ట్వేర్ను ఎంచుకోవటం ద్వారా ఈ రిస్క్ను తగ్గించుకోవచ్చు. అవసరమైన వారు నిపుణుల సాయం కూడా తీసుకోవచ్చు. కొన్ని ఆన్లైన్ సంస్థలూ ఈ సౌకర్యం కల్పిస్తున్నాయి. అవి వేగంగా రిఫండ్ రావటానిక్కూడా సహకరిస్తాయి.