revolver
-
నిద్రలో హఠాత్తుగా లేచి తుపాకీతో కాల్చుకున్నాడు.. కారణం తెలిస్తే షాక్..
వాషింగ్టన్: నిద్రలో కలలు రావడం సాహజం. ఒక్కోసారి అవి కలలా కాకుండా నిజ జీవితంలో జరిగినట్లు అనిపిస్తుంటుంది. ఒక పీడ కలల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అవి వస్తే చాలు దెబ్బకు భయపడి లేచి చూసేసరికి మంచం మీద నుంచి కిందపడిపోయి ఉంటాం. ఇలాంటి వింత అనుభవాలు ఎప్పుడో ఒకప్పుడు మనకి ఎదురై ఉంటాయి. ఇదే తరహాలోనే ఓ వ్యక్తికి విచిత్రమైన కల కని.. నిజం తుపాకితో తననే కాల్చుకున్నాడు. అమెరికాలోని ఇల్లినాయిస్లో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలు ఆ కల ఏంటంటే... నిద్ర మత్తులో అలా జరిగిపోయింది అమెరికా ఇల్లినాయిస్లోని లేక్ బారింగ్టన్లో మార్క్ డికారా నివసిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం అతను నిద్రపోతుండగా ఓ కల వచ్చింది. ఆ కలలోజ... ఎవరో ఓ వ్యక్తి తలుపులు బద్దలుకొట్టుకుని ఇంట్లోకి చొరబడినట్లు అనిపించింది. దీంతో డికారా భయాందోళనకు గురయ్యాడు. దొంగ నుంచి కాపాడుకోవాడానికి కాల్పులు జరిపేందుకు సిద్ధమయ్యాడు. అయితే నిద్ర మత్తులో ఉన్న డికారా తన దగ్గర ఉన్న 357-క్యాలిబర్ రివాల్వర్తో నిజంగానే కాల్చాడు. అయితే అది నేరుగా అతని కాలిలోకే దూసుకెళ్లింది. దెబ్బకు అతని నిద్రంతా ఎగరిపోయింది. బుల్లెట్ కారణంగా తీవ్ర రక్తస్రావం అయ్యింది. గాయం కారణంగా విలవిల్లాడుతూ.. గట్టి అరవడం మొదలుపెట్టాడు. మరో వైపు రివాల్వర్ పేలిన శబ్దం విన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. చివరకు దొంగతనం జరిగినట్లు కల రావడం.. ఆ నిద్ర మబ్బులోనే కాల్పులు జరిపినట్లు నిర్ధారించుకున్నారు. ఆ ప్రాంతంలో తుపాకీ కలిగి ఉండాలంటే ప్రభుత్వం నుంచి ఫైర్ఆర్మ్ ఓనర్స్ ఐడెంటిఫికేషన్ కార్డు తప్పనిసరిగా పొందాల్సి ఉంటుంది. కానీ చాలా రోజుల కిందటే అతని ఐడెంటిఫికేషన్ డికార కార్డు రద్దయ్యింది. అయినా అతను రివాల్వర్ను వాడుతుండడంతో అక్రమంగా ఆయుధాలు కలిగి ఉండటం నేరాల కింద పోలీసులు అతనిపై కేసులు నమోదు చేశారు. చదవండి: ఈ దీవుల్లో హాయిగా ఉండండి.. రూ. 70 లక్షల అందుకోండి! -
తుపాకీతో కాల్చుకుని న్యాయవాది ఆత్మహత్య!
చిక్కడపల్లి (హైదరాబాద్): వైమానిక దళంలో పనిచేసి రిటైరయ్యాక, న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న టి.శివారెడ్డి అనే వ్యక్తి శుక్రవారం తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కొన్నాళ్లుగా ఒంటరిగా ఉంటున్న ఆయన భార్యతో విభేదాల నేపథ్యంలోనే బలవన్మరణానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు, స్థానిక ప్రజలు తెలిపిన వివరాల మేరకు.. కడప జిల్లాకు చెందిన టి.శివారెడ్డి (44) గతంలో వైమానిక దళంలో పనిచేసి, రిటైరయ్యారు. కొంతకాలం నుంచి బాగ్లింగంపల్లిలోని మానస ఎన్క్లేవ్లో ఒంటరిగా నివాసం ఉంటున్నారు. భార్య రమాదేవితో విభేదాల నేపథ్యంలో 2017లోనే విడాకులు తీసుకున్నారు. అయితే ఇటీవల కడపకు వెళ్లిన శివారెడ్డి.. శుక్రవారం ఉదయం 6గంటల సమయంలో బాగ్లింగంపల్లి నివాసానికి వచ్చారు. ఆయన సోదరి మహేశ్వరి ఉదయం తొమ్మిది గంటల నుంచి పలుమార్లు శివారెడ్డికి ఫోన్ చేశారు. ఎంతకూ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చి.. కవాడిగూడకు చెందిన తన స్నేహితురాలు లక్ష్మీభవానికి ఫోన్ చేసి, తన సోదరుడికి ఇంటికి వెళ్లాలని కోరారు. లక్ష్మీభవాని మధ్యాహ్నం రెండు గంటల సమయంలో తన తల్లితో కలసి శివారెడ్డి నివాసం వద్దకు వచ్చారు. తలుపు లోపలికి గడియ పెట్టి ఉండటంతో ఎన్నిసార్లు కాలింగ్ బెల్ కొట్టినా స్పందన రాలేదు. దీంతో వారికి అనుమానం వచ్చి.. వాచ్మన్ సాయంతో తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు. అప్పటికే శివారెడ్డి తుపాకీతో కాల్చుకుని, మంచంపై పడి ఉండటం చూసి పోలీసులకు సమాచారమిచ్చారు. చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ ఎన్.సంజయ్కుమార్, క్లూస్ టీం సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అయితే శివారెడ్డి కొంతకాలం నుంచి అనారోగ్యంతో, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారని బంధువులు చెప్తున్నారు. వీటికితోడు భార్యతో గొడవలతో మనోవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: తెలంగాణకు వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ -
తలకు తుపాకీ గురి పెట్టి మరీ.. బలవంతంగా పెళ్లి చేశారు
పట్నా: ఇంట్లో పండగ చేసుకోబోతున్నారు.. అందుకని బంధువులను ఆహ్వానించడం కోసం పొరుగురికి వెళ్లాడు ఓ యువకుడు. అక్కడ అతడికి అనుకోని వింత అనుభవం ఎదురయ్యింది. బంధువుల ఇంటి నుంచి తిరిగి వస్తుండగా.. కొందరు వ్యక్తులు అతడిని బంధించి.. తలకు తుపాకీ గురి పెట్టి బెదిరించి.. ఏకంగా పెళ్లి చేశారు. పారిపోవడానికి ప్రయత్నిస్తే.. బాధితుడిపై చేయి చేసుకున్నారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరలయ్యింది. ఆ వివరాలు.. (చదవండి: Mystery Case: ఐదేళ్ల క్రితం హత్యచేశారు.. కానీ..) బిహార్ నలంద జిల్లా, ధనుకి గ్రామానికి చెందిన నితీష్ కుమార్ ఛథ్ పండుగకు రమ్మని ఆహ్వానించడం కోసం నవంబర్ 11న వదిన వాళ్ల ఊరికి వెళ్లాడు. వారిని కలిసి.. పండుగకు రావాల్సిందిగా ఆహ్వానించి.. ఇంటికి తిరిగి బయలు దేరాడు. అలా వస్తుండగా.. మార్గమధ్యంలో ఆయుధాలు ధరించి ఉన్న కొందరు వ్యక్తులు నితీష్ను కిడ్నాప్ చేశారు. సరాసరి పెళ్లి మంటపానికి తీసుకెళ్లి.. అతడిని పెళ్లి కుమారుడిగా అలంకరించారు. ఈ క్రమంలో నితీష్ అక్కడ నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించడంతో.. అతడిని కొట్టారు. అంతటితో ఆగక తుపాకీతో నితీష్ తలకు గురిపెట్టి.. బెదిరించి బలవంతంగా పెళ్లి చేశారు. (చదవండి: ‘అత్యాచారం చేసి.. పెళ్లి చేసుకుంటే కేసు కొట్టేయాలా?’) ఎలాగోలా వారి నుంచి తప్పించుకున్న నితీష్.. జరిగిన సంఘటన గురించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. చదవండి: భార్యాభర్తలను ఇంటి బయటకు ఈడ్చకెళ్లి.. కిరాతకంగా హత్య -
అవినీతి తుపా‘కీ’ ఎక్కడ
సాక్షి ప్రతినిధి, తూర్పుగోదావరి: అవినీతి తుపాకీ లెక్క తేల్చేందుకు ప్రత్యేక బృందం ఏర్పాటైంది. పోలీసు వ్యవస్థకే మచ్చ తెచ్చిన బాధ్యులను గుర్తించేందుకు అవినీతి నిరోధక శాఖ రంగంలోకి దిగింది. ఇప్పటికే నిఘా వర్గాలు 15 పేజీల నివేదికను ఉన్నతాధికారులకు అందజేసినట్టు తెలిసింది. పాత్రధారులు ఎవరు, ఏ రీతిన వారు అవకతవకలకు పాల్పడ్డారనే దానిపై ప్రాథమిక సమాచారం నివేదించారు. ఏసీబీ కూడా లోతైన విచారణకు రంగం సిద్ధం చేస్తోంది. ఇందుకు విజయవాడ ఏసీబీ డీజీ రామాంజనేయులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్టు సమాచారం. ఏసీబీ కేంద్ర కార్యాలయం నుంచి ఈ విచారణను పర్యవేక్షించనున్నారు. శరత్బాబు అనే డీఎస్పీ విచారణాధికారిగా నియమితులయ్యారు. ఇద్దరు ఇనస్పెక్టర్లు, నలుగురు సబ్ ఇనస్పెక్టర్లు ఈ బృందంలో ఉంటారు. సీరియస్గా పరిగణన డీజీ స్థాయిలో ఈ వ్యవహారాన్ని ప్రాధాన్య అంశంగా భావించి పారదర్శకంగా విచారణ జరపనున్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులపై చర్యలుండాలనే నిర్ణయానికి ఉన్నతాధికారులు వచ్చారు. వేలం నిర్వహించకుండా కాగితాల్లో జరిపినట్లు చూపించారనే విషయం ఇటీవల ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. వివిధ రకాల 582 తుపాకులకు వేలం పెట్టే ముందు నిబంధనల ప్రకారం ఎక్కడో ఒకచోట బహిరంగంగా ప్రదర్శించాలి. ఈ ప్రక్రియ ఎక్కడా నిర్వహించిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలోనే పలువురి సొంతమైన తుపాకులను తిరిగి స్వాధీనం చేసుకుని ఆర్మ్డ్ రిజర్వులో భద్రపరిచారు. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్బాబు ధ్రువీకరించారు. వేలం నిర్వహించినట్టు చెబుతున్న ప్రక్రియతో పాటు తుపాకీ లైసెన్స్ రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకున్న తమకు తెలియకుండా తుపాకులను వేలం వేసేశారని వచ్చిన ఫిర్యాదులపై కూడా ఏసీబీ దృష్టి కేంద్రీకరించనుంది. మొత్తం 582 తుపాకుల్లో విలువైన వాటిని బినామీ పేర్లతో రూ.20 వేలు, రూ.30 వేలకు సొంతం చేసుకున్న పోలీసు అధికారుల చిట్టాను నిఘా వర్గాలు ఇప్పటికే ఉన్నతాధికారులకు నివేదించినట్టు భోగట్టా. -
World's Smallest Revolver: బొమ్మ రివాల్వర్ అనుకునేరు.. నిజమైనదే!
ఫొటోలో ఒక పెద్దమనిషి అరచేతిలో ఇమిడిపోయిన బుల్లి రివాల్వర్ చూశారు కదూ! ఇది పిల్లలు ఆడుకునే టాయ్ రివాల్వర్ కాదు, ట్రిగ్గర్ నొక్కితే తూటాలను వెదజల్లే సిసలైన రివాల్వర్. దీని పనితనం పిట్ట కొంచెం కూత ఘనం అనే స్థాయిలో ఉంటుంది. చూడటానికి మోర్టార్ తూటా సైజులో ఉండే ఈ రివాల్వర్లో కూడా సాధారణ రివాల్వర్ మాదిరిగానే ఆరు తూటాలు పడతాయి. స్విట్జర్లాండ్కు చెందిన ఆయుధాల తయారీ సంస్థ ఈ మినీ గన్ను రూపొందించి, ఇటీవల గిన్నిస్ రికార్డును సాధించింది. ఈ రివాల్వర్ పొడవు 5.5 సెం.మీ., ఎత్తు 3.5 సెం.మీ. దీని బరువు 19.8 గ్రాములు. దీని ఖరీదు మాత్రం సాధారణ రివాల్వర్ల కంటే చాలా ఎక్కువే. ఎంతంటే, 6,300 స్విస్ ఫ్రాంకులు (రూ.5.14 లక్షలు). దీనిని కొంటే, దీనితో పాటు ఒక లెదర్ కేసు, 24 తూటాలు ఉచితంగా దొరుకుతాయి. అయితే, దీనిని దిగుమతి చేసుకోవడాన్ని అమెరికా, బ్రిటన్ సహా కొన్ని దేశాలు నిషేధించాయి. చదవండి: Viral: సింహాన్ని పరుగులు పెట్టించిన భౌభౌ!! -
రివాల్వర్తో కాల్చుకుని ఎస్సై బలవన్మరణం
సాక్షి, న్యూఢిల్లీ: సర్వీస్ రివాల్వర్తో సబ్ ఇన్స్పెక్టర్ తనను తాను కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. తుపాకీ తూటా తగిలి ఆయన అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. మృతుడు పాండవ్నగర్ పోలీస్స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్. స్టేషన్ ఆవరణలోనే ఆయన అఘాయిత్యానికి పాల్పడడంతో ఢిల్లీ ఉలిక్కిపడింది. అయితే ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. పాండవ్నగర్ పోలీస్స్టేషన్కు 2017లో ఎస్సైగా రాహూల్ సింగ్ (31) బాధ్యతలు చేపడుతున్నారు. నాలుగేళ్లుగా ఒకే స్టేషన్లో విధులు నిర్వర్తిస్తూ శాంతిభద్రతలు పర్యవేక్షిస్తున్నారు. అయితే అకస్మాత్తుగా శుక్రవారం స్టేషన్ ఆవరణలోనే తన సర్వీస్ రివాల్వర్ను తీసుకుని రాహుల్ కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్టేషన్లో రక్తపు మడుగుల్లో ఆయన పడి ఉన్నాడు. సమాచారం తెలుసుకున్న అతడి భార్య స్టేషన్కు వచ్చి కన్నీరుమున్నీరుగా విలపించింది. అయితే తన భర్త ఆత్మహత్యకు కారణం పని ఒత్తిడి అని ఆరోపించింది. స్టేషన్ అధికారి (సీఐ) ఒత్తిడితో తన భర్త ఆందోళనకు గురవుతున్నాడని ఆమె తెలిపింది. చదవండి: కారులోనే ముగ్గురు సజీవదహనం చదవండి: ముగ్గురి ఊపిరి తీసిన మ్యాన్హోల్ -
జూబ్లీహిల్స్: గన్తో ఎంపీ బంధువు హల్చల్
సాక్షి, హైదరాబాద్ : నగర వీధుల్లో గన్తో హల్చల్ చేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం సాయంత్రం జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో తమ దగ్గరున్న గన్తో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన సూరపనేని చైతన్య రామ్, బోడె వెంకట్ అనే ఇద్దరు వ్యక్తులను మాదాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరి నించి తుపాకీతో పాటు స్కార్పియో వాహనాన్ని స్వాధీనం చేసుకుని విచారిస్తున్నారు. (మాజీ క్రికెటర్ హత్య.. కొడుకే హంతకుడు) పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎమ్మెల్యే కాలనీలో మద్యం సేవించిన నిందితులు ఎంపీ స్టిక్కరింగ్ గల స్కార్పియో వాహనంలో కూకట్పల్లికి బయల్దేరారు. మార్గమధ్యలో మస్తాన్ నగర్లో పలు ద్విచక్రవాహనాలను ఢీకొట్టుకుంటూ వెళ్లారు. అడ్డగించిన వారిని తుపాకీతో బెదిరింపులకు దిగారు. పలు చోట్ల స్థానికులతో వాగ్వాదానికి దిగి గన్తో బెదిరించారు. సమాచారం అందుకున్న పోలీసులు జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే నిందితులు ఉపయోగించిన గన్ నకిలీదని, సినిమా షూటింగ్లలో ఉపయోగించేదని పోలీసులు తేల్చారు. అనధికారిక సమాచారం ప్రకారం నిందితుల్లో ఒకరైన చైతన్య రామ్ ఓ ఎంపీ, ఎమ్మెల్యేకు సమీప బంధువని తెలుస్తోంది. అయితే ఆ ఎంపీ, ఎమ్మెల్యే వివరాలు ఇంకా బయటకి రాలేదు. (అమ్మ కన్నా నానమ్మే ఎక్కువైందని..) -
మహిళలకు స్పెషల్ రివాల్వర్: విశేష ఆదరణ
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచంలో ప్రతీ క్షణమూ ఏదో ఒక మూల మహిళలు, బాలికలపై అత్యాచారాల ఆక్రందనలు వినిపిస్తూనే ఉన్నాయి. నెలల పసిపాపనుంచి పండు ముదుసలి వరకూ మృగాళ్ల అకృత్యాలకు బలవుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో మహిళల కోసం పెప్పర్ స్ప్రేలు, పాకెట్ నైఫ్లకు తోడుగా తేలికైన రివాల్వర్ అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా ఏడేళ్ల క్రితం దేశాన్ని కదిలించిన ఢిల్లీ నిర్భయ ఉదంతం తరువాత మళ్లీ అలాంటి దారుణాలు పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో కాన్పూర్లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఇంటర్నేషనల్ పోలీస్ ఎక్స్పోలో ‘నిర్భీక్’ అనే తుపాకిని ప్రదర్శించింది. నిర్భీక్ రివాల్వర్ ప్రధానంగా మహిళల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసి చెప్పినట్టు తెలిపింది. బలమైన, ఆత్మరక్షణ సాధనంగా ఉపయోగపడుతుందని ఫ్యాక్టరీ బోర్డు ప్రతినిధి తెలిపారు. అంతేకాదు చాలా సులువుగా దీన్ని మహిళల తమ పర్సుల్లో తీసుకెళ్లవచ్చని పేర్కొన్నారు. మొదటి ఐదేళ్ళలో ఉత్తరప్రదేశ్, హర్యానాలలో 2,500 రివాల్వర్లను విక్రయించినట్టు వెల్లడించింది. దీని ధర కొంచెం ఖరీదైనప్పటికీ భారీ విక్రయాలను నమోదు చేయడం విశేషం. సాధారణ రివాల్వర్ ధర రూ. ఒక లక్ష రూపాయలతో పోలిస్తే నిర్భీక్ రూ.1.20 లక్షలకు అందుబాటులోకి తెచ్చింది. 2014లో 750 గ్రాములతో లాంచ్ చేసిన దీని బరువులో మరిన్ని మార్పులు చేసి ప్రస్తుతం 500 గ్రాములకు తీసుకొచ్చింది. అయితే తాజాగా జీఎస్టీ పెరగడంతో రూ. 1.40 లక్షల ధరతో నిర్బీక్ను తాజాగా విడుదల చేశారు. నిర్భీక్ 10 మీటర్ల లక్ష్యాన్ని సులభంగా ఛేదించగలదని కంపెనీ చెబుతోంది. టైటానియం అల్లాయ్ మెటల్తో తయారు చేసిన ఈ నిర్భీక్ తుపాకీ తుప్పు పట్టదు, మెయింటెనెన్స్ కూడా చాలా సులభం. -
ఇరువర్గాల మధ్య ఘర్షణ.. రివాల్వర్తో బెదిరింపులు
సాక్షి, హైదరాబాద్ : నగర శివారులో కాల్పుల కలకలం రేగింది. భూతగాద విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరగటంతో ఓ వర్గం వారు రివాల్వర్తో బెదిరిస్తూ గాల్లోకి కాల్పులు జరిపారు. అయితే ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సోమాజిగూడాకు చెందిన మహమ్మద్ అల్తాఫ్ బహుదుర్గూడాలోని దండమెండి బయోటెక్కు చెందిన 110ఎకరాల స్థలం వద్ద సూపర్ వైజర్గా పనిచేస్తున్నాడు. గత మంగళవారం సయ్యద్ రఫీ ఇషాక్.. సమీర్ హసీమ్, నుస్రత్ పటేల్, అసీఫ్ మోఈజ్, జంగయ్య రాజు అనే వ్యక్తులతో కలిసి 110 ఎకరాల భూమిలోకి అక్రమంగా చొరబడటమే కాకుండా రివాల్వర్తో బెదిరిస్తూ గాల్లోకి కాల్పులు జరిపాడు. దీంతో సూపర్ వైజర్ అల్తాఫ్ శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా సయ్యద్ రఫీ ఇషాక్పై గతంలోనూ పలుకేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
బెజవాడలో రివాల్వర్ కలకలం
సాక్షి, విజయవాడ : బెజవాడలో రివాల్వర్ కలకలం రేపింది. సోమవారం రమేష్ అనే వ్యక్తి దగ్గర రివాల్వర్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు రివాల్వర్ను స్వాధీనం చేసుకున్నారు. రమేష్ ఓ కాంట్రాక్టర్ వద్ద గుమాస్తాగా పని చేస్తున్నాడు. అతని వద్దకు రివాల్వర్ ఎలా వచ్చిందన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. -
భూమి నుంచివెళ్లకపోతే కాల్చేస్తా
మహేశ్వరం రంగారెడ్డి : మర్యాదగా భూమి కబ్జా విడిచి వెళ్లకపోతే గన్తో కాల్చేస్తానని రైతులను ఓ వ్యాపారి రివాల్వర్తో బెదిరించాడు. దీంతో రైతులు తిరగబడి ఆ వ్యాపారిని పోలీసులకు అప్పగించారు. బాధిత రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. మహేశ్వరం మండలం మోహబ్బత్నగర్ గ్రామంలో సర్వే నెంబర్ 152, 180, 183, 184లలో సుమారు 57 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని మోహబ్బత్నగర్ గ్రామానికి చెందిన వరాత్యవత్ రాజునాయక్, గోల్కొండ అంజయ్య, లక్ష్మయ్య, శ్రీశైలం సాగు చేసుకుంటున్నారు. ఈ భూమిని 1975లో పట్టాదారు రాంబాయమ్మ, యాదగిరమ్మలు ఇనాంగా రైతులకు ఇచ్చారు. అప్పటి నుంచి ఈ రైతులు సాగు చేసుకుంటున్నారు. అయితే, హైదరాబాద్కు చెందిన వ్యాపారస్తులు అలోబి రామ్కుమార్ తివారీ, అలోబి శంకర్ తివారీ, అలోబి శివకుమార్ తివారీ, సంతోష్ తివారీ, మాజీ పట్వారీ వంగ వెంకట్రెడ్డిలు కలిసి శుక్రవారం ఆ భూమి వద్దకు వెళ్లి ఈ భూమి తమదని, వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోవాలని, లేకపోతే మర్యాద ఉండదని రైతులను హెచ్చరించారు. రైతులు వ్యాపారుల మాటలకు బెదరకపోవడంతో రామ్కుమార్ తీవారీ వద్ద ఉన్న లైసెన్స్ రివాల్వర్ తీసి కాల్చేస్తానని రైతులు శ్రీశైలం, అంజయ్యలను బెదిరించాడు. భయపడిపోయిన ఇతర రైతులు రామ్కుమార్ చేతిపై కొట్టడంతో రివాల్వర్ కింద పడిపోయింది. రైతులు వ్యాపారస్తులను చితకబాది, వారి వాహనాలను ధ్వంసం చేశారు. రివాల్వర్ను రైతులు తీసుకుని మహేశ్వరం పోలీసులకు అప్పగించారు. మహేశ్వరం సీఐ సునీల్కుమార్ సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డి పోలీస్ స్టేషన్కు చేరుకొని ఇరువురిని విచారించారు. అక్కడ రివ్వాలర్తో కాల్పులు జరపలేదని ఏసీపీ తెలిపారు. ఈ భూమిపై కేసు కోర్టులో ఉందని, ఇరువురు వాగ్వాదానికి దిగి ఘర్షణ పడ్డారని, ఇరువురి నుంచి ఫిర్యాదులు తీసుకొని కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. రివాల్వర్ ఎక్కుపెట్టలేదు మోహబ్బత్నగర్ గ్రామంలో సర్వే నెంబర్ 152, 180, 183, 184లలో ఉన్న 57 ఎకరాలు మా పట్టా భూమి. అప్పట్లో రాంబాయమ్మ, యాదగిరమ్మల నుంచి కొనుగోలు చేశాం. కొంత మంది రైతులు అక్రమంగా చొరబడి కబ్జా చేయడానికి యత్నిస్తుండగా వారిని అడ్డుకోబోయాం. మా పట్టా భూమి నుంచి వెంటనే ఖాళీ చేయాలని కోరాం. రైతులు వాగ్వాదానికి దిగి కర్రలతో దాడిచేసి గాయపరిచారు. నా లైసెన్స్ రివాల్వర్ను బ్యాగులో పెట్టుకున్నాను. ఎవరిపైనా కాల్చడానికి యత్నించలేదు. నా డబ్బులు, రివాల్వర్ లాక్కున్నారు. గన్ ఎక్కుపెట్టానని అసత్య ప్రచారం చేస్తున్నారు. మాపై దాడికి పాల్పడిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. – రామ్కుమార్ తివారి పొలం విడిచి వెళ్లిపోవాలని రివాల్వర్తో బెదిరించారు.. తమ భూమి వద్దకు వచ్చి కబ్జా విడిచి వెళ్లిపోవాలని రామ్కుమార్ తివారీ, అతని సోదరులు రివాల్వర్తో బెదిరించారు. తమతో పెట్టుకుంటే ఇబ్బందులకు గురవుతారని హెచ్చరించారు. రామ్కుమార్ వద్ద ఉన్న రివాల్వర్ నాపై ఎక్కుపెట్టాడు. వెంటనే మా కుటుంబ సభ్యులు, ఇతర రైతులు దాడిచేసి రివాల్వర్ను లాక్కొన్నారు. తివారీలపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. మా భూమిలోకి వచ్చి వెళ్లిపొమన్నడానికి వారు ఎవరు. భూమి మాదేనని న్యాయస్థానం మాకు అనుకూలంగా ఇటీవల తీర్పు ఇచ్చింది. – గోల్కొండ శ్రీశైలం, రైతు, మోహబ్బత్నగర్ -
దొరికింది.. ఎత్తుకెళ్లాడు
రాంగోపాల్పేట్: కారులో ఉంచిన లైసెన్స్డ్ రివాల్వర్ను దొంగిలించిన బాలుడిని సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం సికింద్రాబాద్లోని టాస్క్ఫోర్స్ కార్యాలయంలో డీసీపీ రాధాకిషన్రావు వివరాలు వెల్లడించారు. మొఘల్పుర సుల్తాన్షాహికి చెందిన 4 టీవీ రిపోర్టర్ మహ్మద్ నమాన్ ఒమర్ 2016లో లైసెన్సుడ్ రివాల్వర్ తీసుకున్నాడు. గత డిసెంబర్ 24న అతను తన స్నేహితుడితో కలిసి రాజ్భవన్కు వెళ్లి తిరిగి వస్తూ భోజనం చేసేందుకు మాసబ్ట్యాంక్లోని ఓ హోటల్ వద్ద కారు ఆపాడు. అందులో లైసెన్సు డు రివాల్వర్ను ఉంచాడు. మెహిదీపట్నం సంతో ష్నగర్కు చెందిన బాలుడు (16) కారులో విలువైన వస్తువుల కోసం గాలించగా అందులో రివాల్వర్ కనిపించ డంతో ఎత్తుకెళ్లాడు. భోజనం ముగించుకుని వచ్చిన ఒమర్ కొద్ది దూరం వెళ్లిన తర్వాత కారులో రివాల్వర్ కనిపించకపోవడంతో చోరీకి గురయినట్లు గుర్తించాడు. మరుసటి రోజు ఉదయం సైదాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన టాస్క్ఫోర్స్ పోలీసులు కారు నిలిపిన స్థలం వద్ద ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించగా గుర్తుతెలియని బాలుడు దొంగతనం చేసినట్లు గుర్తించారు. సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా మెహిదీపట్నం సెయింట్ ఆన్స్ కాలేజీ ప్రాంతంలోని అతడికి ఇంటికి వెళ్లి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్దనున్న రివాల్వర్తో పాటు 6 రౌండ్స్ స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం బాలుడిని సైదాబాద్ పోలీసులకు అప్పగించారు. అనంతరం జువైనల్ హోంకు తరలించనున్నట్లు పోలీసులు తెలిపారు. సమావేశంలో సైఫాబాద్ డీఐ నరహరి, టాస్క్ఫోర్స్ ఎస్సైలు తిమ్మప్ప, వినోద్, కాంతారెడ్డి పాల్గొన్నారు. లైసెన్స్దారుడిపై కేసు రివాల్వర్ తీసుకున్న ఒమర్పై కూడా కేసు నమోదు చేయనున్నట్లు డీసీపీ తెలిపారు. రివాల్వర్ తీసుకున్న వ్యక్తులు బయటికి వెళితే దానిని తమ కస్టడీలోనే ఉంచుకోవాలని అలా కాకుండా నిర్లక్ష్యంగా కారులో ఉంచి దానికి కనీసం తాళం కూడా వేయకుండా వెళ్లాడన్నారు. ఆర్మ్స్యాక్ట్ ప్రకారం అతనిపై చర్యలు తీసుకుని లైసెన్సును రద్దు చేయనున్నట్లు తెలిపారు. గన్ లైసెన్సు పొందిన వ్యక్తులు పోలీసులు సూచించిన నిబంధనలు తప్పక పాటించాలని ఆయన పేర్కొన్నారు. -
ఒకే తరహాలో ముగ్గురి హత్య..
సాక్షి, బనశంకరి: సాహితీవేత్త ఎంఎం.కలుబురిగి, మానవ హక్కుల పోరాటయోధుడు గోవింద్పన్సారే హత్యకు వినియోగించిన రివాల్వర్నే గౌరీలంకేశ్ హత్యకు వినియోగించినట్లు ల్యాబొరేటరీ పరిశోధనల్లో రుజువైంది. కలుబురిగి, పన్సారే హత్యకు స్వదేశంలో తయారైన 7.65 ఎంఎం.రివాల్వర్ ద్వారా కాల్పులు జరిపి హత్యకు పాల్పడ్డారు. బెంగళూరు రాజరాజేశ్వరినగరలో తన ఇంటి వద్ద గౌరీని కూడా అదే రివాల్వర్కు బలయ్యారు. ముగ్గురు ఒకే తరహాలో హత్యకు గురికావడంతో హంతకులు ఒకే సంస్థకు చెందిన వారు కావొచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సెప్టెంబర్ 5న రాజరాజేశ్వరి నగరలో గౌరి హత్యకు గురయ్యారు. హంతకుల కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. బుల్లెట్లను హైదరాబాద్, బెంగళూరుల్లోని ల్యాబ్కు పంపించారు. నివేదికలో గతంలో సాహితీవేత్త ఎంఎం.కలుబురిగి, గోవింద్పన్సారేపై కాల్పులు జరిపిన రివాల్వర్తోనే గౌరిపై కూడా కాల్పులు జరిపినట్లు పరిశోధనలో తేలింది. -
ఆత్మహత్య కోసం రివాల్వర్ చోరీ
యలహంక (బెంగళూరు): ఓ వైపు వృద్ధాప్యం, మరో వైపు కుంగదీస్తున్న అనారోగ్యం అతన్ని చోరీల బాట పట్టించింది. వైద్య ఖర్చుల కోసం నగదు, ఒకవేళ రోగం నయం కాకపోతే ఆత్మహత్య చేసుకునేందుకు రివాల్వర్ను తస్కరించాడు. అయితే తప్పు తెలుసుకున్న ఆయన పోలీసులకు లొంగిపోయాడు. ఈ ఘటన బెంగళూరులో బుధవారం వెలుగు చూసింది. వివరాలు..కేరళకు చెందిన రాయర్ (63) పొట్టకూటి కోసం బెంగళూరు చేరుకున్నాడు. యలహంకలోని అగ్రగామి ప్రైవేటు స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ ఇంటిలో పనిమనిషిగా చేరాడు. ఇటీవల కడుపు నొప్పిరావడంతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. వైద్యం చేయించుకునేందుకు చేతిలో చిల్లిగవ్వలేని పరిస్థితుల్లో యజమాని ఇంట్లో నాలుగు రోజుల క్రితం రూ.1.5లక్షల నగదు, ఒక రివాల్వర్ తస్కరించాడు. ఈ విషయం యజమానికూడా గుర్తించలేకపోయాడు. అయితే సదరు వృద్ధుడు ఏమనుకున్నాడో ఏమోకాని..బుధవారం యలహంక పోలీసు స్టేషన్కు చేరుకున్నాడు. తాను తన యజమాని ఇంట్లో చోరీ చేశానని చెప్పి రివాల్వర్ పోలీసులకు అప్పగించి లొంగిపోయాడు. రూ.1.50లక్షల నగదు వైద్యం కోసం ఖర్చు అయినట్లు వివరించాడు. రివాల్వర్ ఎందుకు చోరీ చేశావని పోలీసులు ప్రశ్నించగా...అనారోగ్యం నుంచి తాను కోలుకోలేని పక్షంలో ఆత్మహత్య చేసుకునేందుకు అని పేర్కొనడంతో పోలీసులు అవాక్కయ్యారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. -
స్నేహితుల ముందు గొప్పల కోసం..
-
గన్@ బర్త్డే
ఏడాదిలో ఫలక్నుమాలో రెండో ఘటన చాంద్రాయణగుట్ట: ఫలక్నుమా పోలీస్స్టేషన్ పరిధిలో గతేడాది బరాత్లో గుర్రంపై పెళ్లి కొడుకు జరిపిన కాల్పుల ఘటన మరువకముందే మరో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. జన్మదిన వేడుకల్లో ఓ యువకుడు రివాల్వర్తో 12 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. ఫలక్నుమా ఏసీపీ మహ్మద్ తాజుద్దీన్ అహ్మద్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.జహనుమా కాలనీకి చెందిన ప్రోగ్రెస్ పాఠశాల యజమాని మీర్జా మహ్మద్ అలీ బేగ్ కుమారుడు మీర్జా ఇబ్రహీం అలీ బేగ్(22) డిగ్రీ చదువుతున్నాడు. ఈ నెల 5న అతను తన పుట్టిన రోజు వేడుకలను స్నేహితుల సమక్షంలో జరుపుకున్నాడు. ఈ సందర్భంగా స్నేహితుల ముందు గొప్పలు చాటుకోవాలనే ఉద్దేశంతో రివాల్వర్తో గాల్లోకి 12 రౌండ్లు కాల్పులు జరపడమేగాక వాటిని వీడియో తీసి సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశాడు. గత పది రోజులుగా ఈ వీడియో వైరల్గా మారి సోమవారం వెలుగులోకి వచ్చింది. దీంతో ఫలక్నుమా ఇన్స్పెక్టర్ పులి యాదగిరి వీడియోను పరిశీలించి నిందితుడిని గుర్తించి అదనపు డీసీపీ కె.బాబురావు, ఫలక్నుమా ఏసీపీ మహ్మద్ తాజుద్దీన్ అహ్మద్లకు సమాచారం అందించాడు దీంతో వారు పోలీస్ స్టేషన్కు చేరుకుని యువకుడి తండ్రిని పిలిపించి మాట్లాడారు. ఆరŠమ్స్ యాక్ట్ 26,27 సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకుడి కోసం గాలిస్తున్నారు. ఇబ్రహీం తండ్రి మహ్మద్ అలీ బేగ్, సోదరుడు ముస్తఫా అలీ బేగ్ల పేరున లైసెన్స్డ్ రివాల్వర్, ఫిస్టోల్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
యువతి ఆత్మహత్యాయత్నం
కర్నూలు: రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ వద్ద గన్మన్గా పని చేస్తున్న ఐసయ్య కూతురు సుచరిత (26) తండ్రి సర్వీసు రివాల్వర్తో కాల్చుకొని ఆత్మహత్యాయత్నం చేసిం ది. ఐసయ్య మాజీ సైనికుడు. కర్నూ లులోని బాలాజీ నగర్లో నివాసం ఉంటూ టీజీ వెంకటేష్ గన్మన్గా పని చేస్తున్నాడు. ఇతని పెద్ద కూతురు సుచరిత ఎమ్మెసీ బీఈడీ వరకు చదు వుకుంది. ఇటీవల పంచాయతీ కార్య దర్శిపరీక్ష రాసింది. ఇందులో మార్కు లు తక్కువగా వస్తాయని బెంగ పెట్టు కుంది. దీంతో శుక్రవారం మధ్యా హ్నం తండ్రి సర్వీసు రివాల్వర్తో కాల్చుకుంది. తండ్రి ఐసయ్య వెంటనే కూతురును ప్రభుత్వ ఆస్పత్రికి తర లించి, ప్రాథమిక చికిత్స చేయిం చారు. మెరుగైన వైద్యం కోసం గౌరి గోపాల్ ఆస్పత్రికి తరలించగా.. ఆమె తలకు శస్త్ర చికిత్స చేశారు. కొంత కాలంగా తన కూతురు తలనొప్పితో బాధపడుతుండేదని, ఆ బాధ భరించ లేకనే కాల్చుకొని ఉండొచ్చని తండ్రి ఐసయ్య ఫిర్యాదులో పేర్కొన్నారు. -
రివాల్వర్ అప్పగించిన టీడీపీ నేత
-
రివాల్వర్ అప్పగించిన టీడీపీ నేత
గుడివాడ: స్థానిక ఆఫీసర్స్ క్లబ్ సమీపంలో రివాల్వర్తో హల్ చేసిన ఘటనపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో టీడీపీ మాజీ ఎమ్మెల్యే, గుడివాడ నియోజకవర్గ ఇన్చార్జి రావి వెంకటేశ్వరరావు ఎట్టకేలకు తన రివాల్వర్ను పోలీసులకు అప్పగించారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఆయన రివాల్వర్ను సరెండర్ చేశారు. రివాల్వర్ను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపి నివేదిక తెప్పిస్తామని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు రివాల్వర్ లైసెన్స్ రెన్యువల్ కోసం దరఖాస్తు చేసినట్లు రావి వెంకటేశ్వరరావు చెబుతుండగా, రెన్యువల్ అయినట్లుగా డీఎస్పీ కార్యాలయం, వన్ టౌన్ పీఎస్కు సమాచారం అందలేదని తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే నిన్న మధ్యాహ్నం నగరంలోని ఆఫీసర్స్ క్లబ్కు వచ్చిన రావి వెంకటేశ్వరరావు క్లబ్ బయట అటుఇటు తిరుగుతూ.. తన వద్దనున్న రివాల్వర్ను బయటకు తీసి చూపారు. అంతేకాకాకుండా ఆ వెంటనే రెండు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. పేలుడు శబ్దానికి పరిసర ప్రాంతాలవారు ఏం జరుగుతుందోనన్న భయంతో పరుగులు తీశారు. ప్రత్యక్ష సాక్షులు ఈ ఘటనను నిర్ధారించారు. అయితే అధికార పార్టీ నేత కావడంతో.. షరా మామూలుగానే ఈ ఘటనను దాచిపెట్టేందుకు పోలీసులు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. దీనిపై గుడివాడ వన్టౌన్ సీఐ దుర్గారావును ‘సాక్షి’ వివరణ కోరగా తమకు న్యూస్చానళ్లలో చూస్తే తెలిసిందని, ఫిర్యాదులేవీ రాలేదని చెప్పారు. దీనిపై విచారణ జరుపుతామని, రావి వెంకటేశ్వరరావు వద్ద ఉన్న రివాల్వర్ను పరిశీలించి సంఘటన జరిగి ఉంటే కేసు నమోదు చేస్తామని తెలిపారు. ఆయుధాల చట్టం ఏం చెబుతోందంటే... వ్యక్తిగత లైసెన్స్ ఆయుధం ఉన్నవారు ప్రాణరక్షణకు మినహా మిగిలిన సమయాల్లో తన వద్దనున్న రివాల్వర్ను వాడకూడదు. సెక్షన్–6 సీఈ ప్రకారం ఆయుధాన్ని అవసరం లేకుండా వాడితే సంబంధిత వ్యక్తిపై కేసులు నమోదు చేయాలి. -
మాజీ ఎంపీ రివాల్వర్ చోరీ
హైదరాబాద్: కృష్ణా జిల్లా మచిలీపట్నం మాజీ ఎంపీ కేపీ.రెడ్డయ్య యాదవ్ రివాల్వర్ను దుండగులు చోరీ చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని శ్రీనగర్కాలనీ సమీపంలో ఉన్న శాలివాహన నగర్లో నివసించే కేపి.రెడ్డయ్య యాదవ్ గత నెల 5వ తేదీన ఫిలింనగర్లో జరిగిన మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ కుమారుడి పెళ్ళికి వెళ్లారు. ఆ కార్యక్రమానికి హాజరై రాత్రి 10 గంటల సమయంలో ఇంటికి తిరిగి వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యారు. వెంటనే ఆయనను ఆస్పత్రిలో చేర్చారు. అప్పటి నుంచి ఆయన ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ ఈ నెల 2వ తేదీన డిశ్చార్జి అయ్యారు. అదే రోజు రివాల్వర్ కోసం గాలించగా కనిపించలేదు. ప్రమాదం జరిగిన రోజున అక్కడే పడిపోయి ఉంటుందా.? లేదా చోరీకి గురైందా అన్నదానిపై స్పష్టత లేకపోవడంతో తన రివాల్వర్ కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
రియల్ ఎస్టేట్ వ్యాపారిపై కాల్పులు
-
రియల్ ఎస్టేట్ వ్యాపారిపై కాల్పులు
పేట్ బషీరాబాద్ ప్రాంతంలో ఘటన హైదరాబాద్: రియల్ ఎస్టేట్ వ్యాపారిపై బుధవారం రాత్రి 10.45 గంటల సమయంలో ఓ వ్యక్తి రివాల్వర్తో కాల్పులు జరిపాడు. ఈ ఘటన నగరంలో కలకలం సృష్టించింది. పేట్బషీరాబాద్ బాపూనగర్కు చెందిన నాగేందర్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. వాజ్పేరుు నగర్కు చెందిన తేజ గత 3 నెలల నుంచి ఓ స్థల వివాదంలో నాగేందర్ రెడ్డితో వాగ్యుద్ధానికి దిగసాగాడు. ఈ క్రమంలోనే తేజ బుధవారం రాత్రి 10.45 గంటలకు బాపూనగర్లోని నాగేందర్ రెడ్డి ఇంటికి వెళ్లి, రివాల్వర్ను ఆయన తలపై గురిపెట్టి కాల్చే ప్రయత్నం చేశాడు. దీన్ని తప్పించుకునే క్రమంలో నాగేందర్రెడ్డికి వెన్నులో బుల్లెట్ దిగింది. రెండో బుల్లెట్ మిస్ఫైర్ అరుుంది. నాగేందర్రెడ్డి అరవడంతో స్థానికులు తేజను పట్టుకొని పేట్బషీరాబాద్ పోలీసులకు అప్పగించారు. నాగేందర్రెడ్డి అపస్మారక స్థితికి చేరడంతో దగ్గర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడు తేజను అదుపులోకి తీసుకుని కాల్పుల ఘటనకు దారి తీసిన పరిస్థితులపై విచారిస్తున్నారు. -
‘చంద్రబాబు వియ్యంకుడిలా రివాల్వర్ వాడను’
జగ్గంపేట: తనపై, అనుచరులపై పోలీసు వేధింపులు ఎక్కువయ్యాయని మాజీమంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆవేదన వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన నివాసంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ రాజమండ్రిలో సమావేశం పెట్టుకుంటే అడ్డంకులు సృష్టించారన్నారు. సమావేశానికి మండపం ఇచ్చినందుకు తన వియ్యంకుడికి నోటీసులు ఇచ్చారన్నారు. తన వియ్యంకుడిని నిన్న రివాల్వర్ను అప్పగించమని పోలీసులు కోరారని, అయితే ఆయన రివాల్వర్కు, తనకు సంబంధమేమిటని ముద్రగడ ప్రశ్నించారు. ‘రివాల్వర్ వాడింది చంద్రబాబు వియ్యంకుడు, బావమరిది అయిన బాలకృష్ణ. నేనేమీ ఆయనలా రివాల్వర్ వాడను’ అన్నారు. ఆయన భార్య రివాల్వర్ను కూడా బాలకృష్ణ వాడారన్నారు. తాను ఆస్పత్రి అనే జైలులో 14 రోజులు గడిపానని, రాష్ట్రంలో మానవహక్కులు లేవని ముద్రగడ వ్యాఖ్యానించారు. -
వాడే వీడా?
పట్టుకోండి చూద్దాం చరిత్ర అధ్యాపకుడిగా రిటైరయ్యాడు పరంధామయ్య. చరిత్ర అధ్యాపకుడు అయినప్పటికీ మొదటి నుంచి ఆయన ఆసక్తి మొక్కల మీదే. ప్రతి మొక్కలోనూ ఔషధగుణం ఉంటుందని చెప్పే పరంధామయ్య... ఆ గుణాలను పదిమందికీ తెలియజేయడానికి మొక్కలపై రకరకాల పరిశోధనలు చేసేవాడు. తమకు అందుబాటులో ఉన్న మొక్కల ఔషధ విలువను ప్రజలకు చేరువచేస్తే... వైద్యం పేరుతో చేసే లక్షల ఖర్చు తగ్గుతుందని చెప్పేవాడు. ఆయన చెప్పింది కొందరికి ‘చాలా నిజం’ అనిపించేది. కొందరికి మాత్రం చాదస్తం అనిపించేది. రిటైరైన తరువాత బోలెడు తీరిక దొరకడంతో పరంధామయ్య ఊరూరు తిరుగుతూ మొక్కలపై పరిశోధనలు చేసేవాడు. ఈ క్రమంలో ఆయనకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎంతోమంది పరిచయం అయ్యారు. వాళ్లలో కొందరు తరచుగా పరంధామయ్య ఇంటికి వచ్చేవారు. కొన్ని రోజుల పాటు ఉండి తిరిగి వెళ్లేవారు. వనాల్లో తిరిగే అలవాటు ఉన్న పరంధామయ్య దగ్గర ఎప్పుడూ ఒక మినీ టేప్ రికార్డర్ ఉండేది. దీనిలో పక్షుల కూతలు, జంతువుల అరుపులను రికార్డ్ చేయడం ఆయనకు సరదాగా ఉండేది. కొందరు పరంధామయ్య దగ్గర డబ్బు గుంజడానికి మొక్కల మీద ఆసక్తి ఉన్నట్లు నటించేవాళ్లు. వారు ఏ ఉద్దేశంతో ఇంటికి వచ్చినా ఆతిథ్య మర్యాదలు మాత్రం ఘనంగా చేసేవాడు. ‘‘ఈయనకు పెళ్లి కాలేదు. వారసులంటూ ఎవరూ లేరు. ఉన్న ఆస్తిని హాయిగా అనుభవించకుండా ఈ మొక్కల పిచ్చి ఏమిటో!’’ అని పరంధామయ్య గురించి చాటుమాటుగా అనేకునేవారు జనాలు. ‘‘ఎవరెవరో మీ ఇంటికి వస్తున్నారు. అందులో దొంగలు ఎవరో దొరలు ఎవరో తెలియదు. కాస్త జాగ్రత్తగా ఉండండి’’ అని సన్నిహితులెవరైనా సలహా ఇస్తే... ‘‘వాళ్లు పరాయిగ్రహం నుంచి వచ్చారా ఏమిటి?’’ అనేవాడు తప్ప ఎవరినీ అనుమానించేవాడు కాదు పరంధామయ్య. రెండు మూడు వారాల పాటు పరంధామయ్య ఊళ్లో కనిపించలేదు. ‘ఎటు వెళ్లాడు?’ అని ఎవరు అనుకోలేదు. ఎందుకంటే...పరిశోధన పేరుతో పరంధామయ్య ఊళ్లు తిరిగే విషయం అందరికీ తెలుసు కాబట్టి. ఒకరోజు... ‘పరంధామయ్య ఆత్మహత్య చేసుకున్నాడట’ అంటూ జనాలు పరంధామయ్య విశాలమైన ఇంటివైపు పరుగులు తీస్తున్నారు. ఆయన ఆత్మహత్యపై భిన్నమైన కథనాలు వినిపించాయి. ‘పరిశోధనలో పడి ఆయనకు మతి చలించింది. అందుకే ఆత్మహత్య చేసుకొని ఉంటాడు’ అనుకున్నారు ఎక్కువ మంది. పోలీసులు సంఘటనస్థలికి చేరుకున్నారు. కుర్చీలో కూర్చొని నిద్రపోతున్నట్లుగా ఉన్నాడు పరంధామయ్య. కుడివైపు కణతకు బుల్లెట్ గాయం. ఎదురుగా ఉన్న బల్లపై మినీ టేప్ రికార్డర్. ‘నా చావుకు నేనే కారణం’ అనే మాట తరువాత...రివాల్వర్ పేలిన శబ్దం వినిపించింది. ‘‘పరంధామయ్యది ఆత్మహత్య కాదు... హత్య’’ అని తేల్చేశాడు ఇన్స్పెక్టర్ నరసింహ. ఒక నెల క్రితం... పరంధామయ్య ఇంటికి ఒక వ్యక్తి కొత్తగా వచ్చాడు. అతడు చూడడానికి అచ్చం రౌడీలా ఉన్నాడు అని ఊరివాళ్లు చెప్పారు. దీంతో ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి నిజం కక్కించాడు ఇన్స్పెక్టర్ నరసింహ. చంపింది తానే అని ఒప్పుకున్నాడు ఆ రౌడీ. ఇప్పుడు చెప్పండి. టేప్ రికార్డర్లో ‘నా చావుకు నేనే కారణం’ అని పరంధామయ్య గొంతు, ఆ తరువాత రివాల్వర్ పేల్చిన శబ్దం వినిపించినా ‘ఇది ఆత్మహత్య కాదు హత్య’ అని ఇన్స్పెక్టర్ నరసింహ ఎలా కనిపెట్టాడు? రెండు ఆధారాలు: 1.‘నా చావుకు నేనే కారణం’ (రివాల్వర్ శబ్దం కూడా) అని వినిపించిన తరువాత...టేప్ ఆపేశారు. పరంధామయ్య తనను తాను కాల్చుకొని ఉంటే ఇలా చేయడం కుదరదు. 2. ఒక పక్క పడి ఉన్న రివాల్వర్పై ఎవరి వేలి ముద్రలు కనిపించలేదు. పరంధామయ్య ఆత్మహత్య చేసుకొని ఉంటే కచ్చితంగా ఆయన వేలిముద్రలు కనిపించేవి కదా! -
ఎమ్మెల్యే ఆది అనుచరుల వీరంగం
కడప అర్బన్: జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అనుచరులు మంగళవారం రాత్రి కడప నగరంలోని హరిత హోటల్ ఆవరణలో ఓ వ్యక్తిని రివాల్వర్తో బెదిరించి వీరంగం సృష్టించారు. అంతేకాకుండా బాధితుడిని భయబ్రాంతులకు గురిచేసి హత్యాయత్నం కూడా చేశారు. ఈ సంఘటనపై బాధితుడు రేకం నారాయణ మీడియాకు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాను ఓ వ్యక్తికి రూ.14 లక్షలు అప్పుగా ఉన్న విషయం వాస్తవమేనని, తన అవసరానికి తీసుకుని నెలనెలా వడ్డీ చెల్లిస్తున్నానని తెలిపారు. అయినప్పటికీ తనపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశారన్నారు. తాను రామాపురం మండలం కొత్తపల్లెకి చెందిన వాడినని, కొన్నేళ్లుగా కడపలోని చెమ్ముమియాపేటలో ఉంటున్నానని తెలిపారు. మంగళవారం తాను రామాపురంలోని శ్రీమన్నానారాయణ ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో నడపబడుతున్న విద్యాసంస్థల వద్ద ఉంటే కొందరు వచ్చి తనను బలవంతంగా వాహనంలో ఎక్కించుకుని కడపకు తీసుకు వచ్చారని తెలిపారు. దారి పొడవునా ఇష్టమొచ్చినట్లు కొట్టారని, రివాల్వర్ను మెడపై పెట్టి బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. వాహనంలో తనను తీసుకొచ్చిన తర్వాత నగరంలోని హరిత హోటల్లో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వద్దకు తీసుకొచ్చి వదిలేశారని తెలిపారు. హరితలో ఎమ్మెల్యే ఆది అనుచరుల హల్చల్ కడపలోని హరిత హోటల్ ఆవరణంలో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అనుచరులు బహిరంగంగా రేకం నారాయణను ఇష్టమొచ్చినట్లు తిడుతూ కొట్టే ప్రయత్నం చేసినట్లుగా బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా నారాయణను ఎవరో బలవంతంగా వాహనంలో తీసుకెళ్లారని బంధువులు రామాపురం పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో కడపకు తీసుకొచ్చారని తెలుసుకుని సంఘటనా స్థలానికి రామాపురం ఎస్ఐ జీవన్రెడ్డి తన సిబ్బందితో వచ్చారు. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఏం చేస్తారోనని రేకం నారాయణ, అతని బంధువులు భయంభయంగా బిక్కుబిక్కుమంటూ హరిత హోటల్ ఆవరణంలో గడిపారు. దాదాపు గంటపాటు వారి మధ్య తర్జనభర్జనలు జరిగాయి. ఈ సంఘటన గురించి తెలుసుకున్న మీడియా అక్కడికి చేరుకుంది. వారిని చూసిన ఎమ్మెల్యే, అతని అనుచరులు హడావుడిగా హోటల్ లోపలికి వెళ్లిపోయారు. అనంతరం ఎస్ఐ జీవన్రెడ్డి రేకం నారాయణను తన వెంట ఉన్నతాధికారుల వద్దకు తీసుకెళ్లారు. ఈ వ్యవహారమంతా ఎస్పీ బంగ్లా ఎదురుగా ఉన్న హరిత హోటల్ ఆవరణంలోనే జరగడం గమనార్హం. కాగా ఈ ఘటనపై కాల్మనీ కేసు నమోదు చేసి తనకు న్యాయం చేయాలని పోలీసులకు నారాయణ విజ్ఞప్తి చేశారు. -
సర్పంచ్ రివాల్వర్ మిస్ఫైర్
గన్మన్కు తీవ్ర గాయం బండి ఆత్మకూరు: బోధనం గ్రామ సర్పంచ్ మల్లేశ్వర రెడ్డి రివాల్వర్ మిస్ఫైర్ కావడంతో ఆయన వెంట ఉన్న గన్మెన్ సుబ్రమణ్యం కాలుకు తీవ్రగాయమైంది. విషయం తెలుసుకున్న ఎస్ఐ సాయినాథ్ సంఘటన స్థలానికి చేరుకొని సర్పంచ్కు చెందిన రివాల్వర్ను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. 2012 అక్టోబర్ 14వ తేదీ రాత్రి ప్రత్యర్థులు జరిపిన దాడిలో సర్పంచ్ మల్లేశ్వర రెడ్డి తృటిలో తప్పించుకోగా అదే గ్రామానికి చెందిన రామేశ్వర్రెడ్డి, శివరామిరెడ్డి హతమయ్యారు. ఈ కేసులో ఇదే గ్రామానికి చెందిన ఏడుగురిపై కేసు నమోదైంది. ఈ క్రమంలో ప్రధాన సాక్షిగా ఉన్న మల్లేశ్వర రెడ్డికి ప్రత్యర్థుల నుంచి ముప్పు పొంచి ఉండడంతో తనకు రివాల్వర్ కావాలని పోలీసు ఉన్నతాధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఆయనకు ప్రభుత్వం రివాల్వర్కు అనుమతి ఇచ్చింది. అంతేగాక 1ప్లస్1 చొప్పున గన్మెన్లను రక్షణగా కేటాయించింది. గురువారం బోధనం సమీపంలో జరుగుతున్న వంతెన పనులను మల్లేశ్వరరెడ్డి పరిశీలించేందుకు వెళ్లారు. అక్కడ కాసేపు రివాల్వర్ను తనవద్దే ఉంచుకొని కూర్చున్నారు. అకస్మాత్తుగా పైకి లేవడంతో రివాల్వర్ కింద పడి మిస్ ఫైర్ అయింది. పక్కనే ఉన్న గన్మన్ సుబ్రమణ్యం కాలులోకి బుల్లెట్ చొచ్చుకెళ్లింది. తీవ్రంగా గాయపడిన ఆయనను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. -
డాక్టర్ ఆత్మహత్య!
♦ కాల్పుల కేసులో ఊహించని ట్విస్ట్ ♦ తుపాకీతో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్న డాక్టర్ శశికుమార్ సాక్షి, హైదరాబాద్: నిన్న హత్యాయత్నం.. నేడు ఆత్మహత్య.. ‘చంపింది’ నేను కాదంటూ సూసైడ్ నోట్.. తెరపైకి కొత్త క్యారెక్టర్లు! ఒక్కరోజులోనే ఊహించని ట్విస్ట్! హిమాయత్నగర్లో డాక్టర్ కాల్పుల కేసు కీలక మలుపు తిరి గింది. కేసులో ప్రధాన నిందితుడు డాక్టర్ శశికుమార్ మొయినాబాద్లోని ఓ ఫాంహౌస్లో ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం సాయంత్రం తోటి డాక్టర్ ఉదయ్కుమార్ను కాల్చిన రివాల్వర్తోనే కాల్చుకుని చనిపోయాడు. ఉదయ్ను ‘చంపింది’ తాను కాదు.. సాయికుమార్ అని సూసైడ్నోట్లో రాశాడు. మరోవైపు శశికుమార్ భార్య కాంతి తన భర్తను కిరాయి రౌడీలతో హతమార్చారని ఆరోపించా రు. అటు హత్యాయత్నం కేసు, ఇటు ఆత్మహత్య కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం... పదిహేనేళ్ల కిందటే పరిచయం.. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి కొండాపూర్, మాదాపూర్, చైతన్యపురిల్లో స్థిరపడిన డాక్టర్లు ఉదయ్కుమార్, సాయికుమార్, శశికుమార్లకు వారి వృత్తుల నేపథ్యంలో పది హేనేళ్ల క్రితమే పరిచయం ఏర్పడింది. వీరిలో శశికుమార్ జనరల్ సర్జన్. మిగిలిన ఇద్దరూ అనస్థీషియన్లు. ముగ్గురూ కలసి ఓ ఆసుపత్రిని నెలకొల్పేందుకు సిద్ధమయ్యారు. వీరితోపాటు సాయికుమార్, ఉదయ్కుమార్ భార్యలను డెరైక్టర్లుగా నియమించుకుని మాదాపూర్లో ‘లారెల్ హాస్పిటల్’ ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏడాది జనవరి 1న ఓపీ విభాగం ప్రారంభమైంది. మార్చి నాటికి పూర్తి స్థాయిలో వైద్య సేవలందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వివాదం మొదలైందిలా... లారెల్ హాస్పిటల్లో రూ.75లక్షల పెట్టుబడి పెట్టిన శశికుమార్.. మరో రూ.25లక్షలు రూ.2 వడ్డీకి అప్పుగా ఇచ్చారు. ఏడాదిన్నర క్రితం ఆసుపత్రి ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న సం దర్భంలో శశికుమార్కు డెరైక్టర్ హోదాలో నెలకు రూ.2లక్షలు, సర్జరీ విభాగం అధిపతిగా నెలకు రూ.1.5లక్షలు చొప్పున వేతనం ఇచ్చే లా ఒప్పందం కుదుర్చుకున్నారు. అలాగే ఆసుపత్రి నిర్వహణలో కీలక పాత్ర తనకే ఉండాలని శశికుమార్ స్పష్టం చేయడంతో మిగిలిన ఇద్ద రూ అంగీకరించారు. అయితే ఆసుపత్రి పూర్తి స్థాయిలో పనిచేయకపోవడంతో చెల్లింపులు జరగలేదు. ఈ ముగ్గురి పెట్టుబడి ఆసుపత్రి ఏర్పాటుకు సరిపోకపోవడంతో ఉదయ్, సాయికుమార్లు గతేడాది నవంబర్లో అమెరికాలోని రోబోటిక్ సర్జన్ డాక్టర్ ప్రసాద్ను సంప్రదించారు. ఆసుపత్రిలో ఆయనకు 22 శాతం వాటా ఇస్తూ.. పెట్టుబడి కింద దాదాపు రూ.2కోట్ల వరకు తీసుకున్నారు. దీం తో తనకున్న ప్రాధాన్యం తగ్గుతుందని శశికుమార్ భావించాడు. తన డబ్బు తనకివ్వాలని మిగిలిన ఇద్దరిపై ఒత్తిడి తెచ్చాడు. రమ్మంది శశికుమారే కొన్ని నెలలుగా సాగుతున్న ఈ వివాదానికి ఫుల్స్టాప్ పెట్టాలన్న ఉద్దేశంతో సోమవారం మధ్యాహ్నం మిగిలిన ఇద్దరికీ ఫోన్లు చేసిన శశికుమార్ హిమాయత్నగర్ ప్రాంతానికి రమ్మన్నాడు. సాయంత్రం ముగ్గురూ మినర్వా కాఫీ షాప్లో కలుసుకున్నారు. కాసేపటికి వాగ్వాదం చోటుచేసుకుంది. అందరి దృష్టి వీరిపై పడటంతో బయటకు వచ్చి.. ఉదయ్ కారులో స్ట్రీట్ నెం.6లోకి వెళ్లి ఓ అపార్ట్మెంట్ వద్ద ఆగారు. కారులో మరోసారి వాగ్యుద్ధం జరిగింది.దీంతో ‘మిమ్మల్ని చంపేస్తా’ అంటూ శశికుమార్ తన వద్ద ఉన్న లెసైన్డ్స్ రివాల్వర్తో ఉదయ్ కుమార్ను వెనుక నుంచి కాల్చాడు. ‘గ్రేటర్’ ఎన్నికల నేపథ్యంలో నాంపల్లిలోని ‘మారూఫ్ ఆర్మరీ’లో తుపాకీని డిపాజిట్ చేసి, ఆదివారమే తిరిగి తీసుకున్నాడు. కాల్పుల తర్వాత ఏం జరిగింది? కారు డ్రైవింగ్ సీటులో కూర్చున్న ఉదయ్... శశికుమార్ కాల్చిన తూటాతో తీవ్రంగా గాయపడ్డారు. డోర్ తీసుకుని దిగే ప్రయత్నంలో కింద పడిపోయారు. కొద్ది క్షణాలకు తేరుకుని అటుగా వస్తున్న ఓ ఆటోను ఆపి హైదర్గూడలోని అపోలో ఆసుపత్రికి వెళ్లారు. తనపై కాల్పులు జరిగాయని ఉదయ్ చెప్పడంతో ఆసుపత్రి సిబ్బం ది పోలీసులకు సమాచా రం ఇచ్చారు. ఉదయ్పై కాల్పులు జరగ్గానే భయంతో కారు దిగి పారిపోయిన సాయికుమార్ కొద్దిసేపటికి ఆపోలో వద్దకు వచ్చా రు. ఈలోపు అక్కడకు చేరుకున్న నారాయణగూడ పోలీసులు సాయికుమార్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఈయనే ప్రధాన సాక్షి అని అధికారులు తెలిపారు. ఫామ్హౌస్కు వెళ్లిన శశికుమార్ కాల్పులకు పాల్పడిన వెంటనే తన ఫోన్ను స్విచ్ఛాఫ్ చేసిన శశికుమార్ గంటన్నర తర్వాత సోమాజిగూడలోని తన స్నేహితురాలు చంద్రకళ ఇంటికి వెళ్లారు. ఆమె దగ్గర విషయం దాచి, తన మనసు బాగోలేదని, మీ ఫామ్హౌస్కు వెళ్దామని చెప్పాడు. వారింటి నుంచి రెండు మద్యం సీసాలు తీసుకున్నాడు. తర్వాత చంద్రకళ తన కారులోనే శశికుమార్ను తీసుకుని మొయినాబాద్లోని ఫామ్హౌస్కు తీసు కువెళ్లింది. ఆయనను ఫామ్హౌస్లో దింపిన స్నేహితురాలు భోజనం తదితర ఏర్పాట్లు చేయాలంటూ వాచ్మన్ శంకరయ్యకు చెప్పి తిరిగి వచ్చేసింది. ఇంటికి చేరుకున్న తర్వాత రాత్రి 9.30 గంటల్లోపు రెండుసార్లు వాచ్మెన్ నెంబర్కు ఫోన్ చేసి.. శశికుమార్తో మాట్లాడింది. ఫామ్హౌస్లో మద్యం సేవించి, కాస్త ఆహారం తీసుకున్న తర్వాత శశికుమార్ ఓసారి తన ఫోన్ నుంచి భార్యకు ఫోన్ చేసి ‘సారీ’ అని చెప్పి ఫోన్ను స్విచ్ఛాఫ్ చేశాడు. టీవీల్లో చూసి హడావుడిగా... సోమాజిగూడలోని తన ఇంటికి వచ్చిన చంద్రకళ టీవీ ఆన్ చేసుకున్నారు. అప్పుడే ఉదయ్పై కాల్పులు, శశికుమార్ పరారీ, పోలీసుల గాలిం పు తదితర విషయాలు ఆమె దృష్టికి వచ్చాయి. దీంతో తమ ఇంటి సమీపంలో ఉండే ఆర్మీ అధికారి సాయంతో పంజాగుట్ట పోలీసుస్టేషన్కు చేరుకుని జరిగిన విషయం చెప్పారు. పోలీసు లు వెంటనే నారాయణగూడ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇన్స్పెక్టర్ భీమ్రెడ్డి నేతృత్వంలోని బృందం చంద్రకళను వెంట తీసుకుని ఫామ్హౌస్కు చేరుకుంది. అక్కడ కిటికీ నుంచి చూసి శశికుమార్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే మొయినాబాద్ పోలీసులతో పాటు శశికుమార్ సోదరుడికి సమాచారం ఇచ్చారు. తాడు.. కొడవలి.. యాక్సాబ్లేడ్.. ఫామ్హౌస్లోని తాడు, కొడవలి, యాక్సాబ్లేడ్స్ను తీసుకుని మంచం వద్దకు వెళ్లిన శశికుమార్.. వాటితో ఆత్మహత్య చేసుకోవడానికి సాధ్యం కాకపోవడంతో తన రివాల్వర్తోనే కుడి కణతపై కాల్చుకున్నారు. అతి సమీపం నుంచి కాల్చుకోవడంతో తూటా తల ఎడమ వైపు నుంచి బయటకు వచ్చింది. ఘటనాస్థలి నుంచి స్వాధీనం చేసుకున్న రివాల్వర్లో నాలుగు తూటాలు, రెండు ఖాళీ క్యాట్రిడ్జ్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. దీన్ని బట్టి ఓ తూటా ఉదయ్పై కాల్చగా.. మరోటి ఆత్మహత్యకు వాడినట్లు భావిస్తున్నారు. ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టువూర్టం అనంతరం సోదరుడు పీటర్కు శశికుమార్ మృతదేహాన్ని అప్పగించారు. కేసులో ఉదయ్, సాయిలతో పాటు శశికుమార్ స్నేహితురాలి నుంచి వాంగ్మూలాలు నమోదు చేసినట్టు డీసీపీ వీబీ కమలాసన్రెడ్డి తెలిపారు. నమూనాలు సేకరించిన పోలీసులు నారాయణగూడ, మొయినాబాద్ పోలీసులు ఘటనాస్థలిలతో పాటు సాయికుమార్, శశికుమార్ నుంచి గన్ షాట్ రెసిడ్యూ నమూనాలు సేకరించారు. ఫామ్హౌస్ నుంచి రివాల్వర్ను స్వాధీనం చేసుకుని, దానిపై ఉన్న వేలి ముద్రల్ని సరిచూడటానికి ఉదయ్, సాయిలతో పాటు శశికుమార్ మృతదేహం నుంచీ వేలిముద్రలు సేకరించారు. వీటన్నింటినీ రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి పంపనున్నారు. ఉదయ్ తల నుంచి బుల్లెట్ తొలగింపు ఉదయ్కుమార్కు మంగళవారం శస్త్రచికిత్స నిర్వహించిన వైద్యులు ఆయన తల నుంచి బుల్లెట్ను బయటకు తీశారు. ప్రస్తుతం ఆయన్ను ఐసీయూలో ఉంచారు. ప్రాణానికి హాని ఏమీ లేదని వారం రోజుల్లో కోలుకునే అవకాశం ఉందని వైద్యులు వెల్లడించారు. సమాచారం లేకే అఘాయిత్యం సూసైడ్ నోట్ ప్రారంభంలోనే ‘సాయికుమార్ కిల్డ్ ఉదయ్ విత్ మై రివాల్వర్’ అని శశికుమార్ రాశాడు. దీన్నిబట్టి తూటా తగిలిన ఉదయ్ కుమార్ చనిపోయినట్లు శశి భావించి ఉంటాడని పోలీసులు చెప్తున్నారు. ఉదంతం తర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్ చేయడం, చంద్రకళ ఇంట్లో టీవీ చూడకపోవడం, ఫామ్హౌస్లో టీవీ లేకపోవడంతో ఉదయ్ బతికే ఉన్నాడని, చికిత్స పొందుతున్నాడనే విషయాలు శశికుమార్కు తెలియలేదని అంటున్నారు. ఉదయ్కు ప్రాణాపాయం లేదనే సమాచారం తెలిసి ఉంటే ఆత్మహత్య చేసుకుని ఉండకపోవచ్చని ఓ అధికారి అభిప్రాయపడ్డారు. పథకం ప్రకారం హత్య చేశారు: శశికుమార్ భార్య ‘‘నా భర్త ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు. పథకం ప్రకారం హత్య చేసి కట్టుకథ అల్లుతున్నారు..’’ అని శశికుమార్ భార్య కాంతి ఆరోపించారు. మంగళవారం ఆమె చైతన్యపురి ప్రభాత్నగర్లోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ... ‘‘సోమవారం మధ్యాహ్నం సాయికుమార్, ఉదయ్కుమార్ ఫోన్ చేసి నా భర్తను పిలిచారు. వారే కిడ్నాప్ చేసి ఫామ్హౌస్లో కిరాయి రౌడీలతో హతమార్చారు. ఏడాదిన్నర కాలంగా ఆసుపత్రి విషయంలో గొడవలు జరుగుతున్నాయి. నా భర్త రూ.2.5 కోట్లు పెట్టుబడి పెట్టారు. గత కొంత కాలంగా జరుగుతున్న వివాదం వల్ల నా భర్త మనస్తాపంతో ఉన్నారు. మొయినాబాద్లోని ఫామ్హౌస్ ఎవరిదో, అక్కడకు నా భర్తను ఎవరు తీసుకెళ్లారో తెలీదు. నా భర్త మరణంపై సమగ్ర విచారణ చేసి బాధ్యులను శిక్షించాలి’’ అని అన్నారు. శశికుమార్ న్యూమారుతీనగర్ జైన్మందిర్ సమీపంలో ఓ ల్యాప్రోస్కోపిక్ ఆసుపత్రిని కూడా నిర్వహిస్తున్నాడు. ఇటీవలే దిల్సుఖ్నగర్లోని సిగ్మా ఆసుపత్రిని లీజుకు తీసుకున్నాడు. సాయినిఖిత ఆస్పత్రికి డెరైక్టర్గా ఉన్నాడు. చంపింది నేను కాదంటూ లేఖ ఆత్మహత్య చేసుకోవడానికి ముందు శశికుమార్ సూసైడ్ నోట్ రాశాడు. అందులో ‘‘ఉదయ్ని నేను చంపలేదు. నా రివాల్వర్తో సాయికుమార్ చంపాడు. మా మధ్య హాస్పిటల్కు సంబంధించి ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. ఈ విషయంలో గొడవ జరిగింది. అసలు నిందితులు సాయికుమార్, ఓబుల్రెడ్డి, రామణారావు, చెన్నారెడ్డి, కేకేరెడ్డిలు. వారిని శిక్షించాలి. భార్యా పిల్లలకు అన్యాయం చేస్తున్నా. మళ్లీ జన్మంటూ ఉంటే మంచి భర్తగా, మంచి తండ్రిగా పుడతాను’’ అని రాశాడు. తనకు ఎవరు ఎంత మొత్తం ఇవ్వాలో అందులో తెలిపాడు. -
వైద్యుడి ఆత్మహత్యతో కలకలం
♦ మొయినాబాద్ మండలం ♦ నక్కలపల్లి సమీపంలోని నిష్ ఫాంహౌస్లో ఘటన ♦ భయమే ప్రాణం తీసింది! చర్చనీయాంశమైన ఘటన హైదరాబాద్లో వైద్యుల మధ్య జరిగిన కాల్పుల ఘటనలో నిందితుడిగా అనుమానిస్తున్న డాక్టర్ శశికుమార్ (45) తన రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మొయినాబాద్ : ఆర్థిక లావాదేవీల విషయంలో చెలరేగిన వివాదంతో తోటి వైద్యుడిపై కాల్పులు జరిపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో డాక్టర్ కొన్ని గంటల్లోనే పిస్టల్తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడడం చర్చనీయాంశమైంది. మండల పరిధిలోని నక్కలపల్లిలో జరిగిన ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సోమవారం అర్ధరాత్రి పోలీసులు నక్కలపల్లిలోని నిష్ ఫాంహౌస్కు చేరుకోవడంతో గ్రామస్తులు భయభ్రాంతులకు గురయ్యారు. కాల్పుల ఘటనలో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న శశికుమార్ను పట్టుకునేందుకు పోలీసులు ఫాంహౌస్కు చేరుకుని పరిశీలించే సరికే అతను ఆత్మహత్య చేసుకుని విగత జీవిగా పడిఉన్నాడు. ఆత్మహత్య చేసుకోవాలని ముందే అనుకుని... డాక్టర్ శశికుమార్ ఆత్మహత్య చేసుకోవాలనే బలమై న నిర్ణయంతోనే వచ్చినట్లు అర్థమవుతోంది. తన వెంట రివాల్వార్, కొడవలి, ఆక్సాబ్లేడ్, తాడుతో ఏదో ఒక దానితో ఆత్మహత్య చేసుకోవాలనే వాటిని తెచ్చుకున్నట్లు తెలుస్తోంది. మద్యం సేవించిన అనంతరం సూసైట్ నోట్ రాసిపెట్టి రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రెండేళ్ల క్రితం కొనుగోలు... నగరానికి చెందిన చంద్రకళ రెండేళ్ల క్రితం నక్కలపల్లి రెవెన్యూలో రెండెకరాల భూమి కొనుగోలు చేశారు. అందులో పండ్ల మొక్కలు నాటారు. అప్పుడప్పుడు వచ్చినప్పడు ఉండేందుకు కంటైనర్తో రెండు గదులు, రేకుల షెడ్డు నిర్మించారు. ఈ ఫాంహౌస్లో నెల రోజుల క్రితం నుంచి నక్కలపల్లికి చెందిన శంకరయ్య వాచ్మన్గా పనిచేస్తున్నాడు. అయితే చంద్రకళకు శశికుమార్ స్నేహితుడు కావడంతో సోమవారం కాల్పుల ఘటన అనంతరం వారిద్దరూ ఫాంహౌస్కు వచ్చారు. కానీ అప్పటికీ చంద్రకళకు నగరంలో జరిగిన కాల్పుల విషయం తెలియదు. భయంతోనే ఆత్మహత్య! ఆర్థిక లావాదేవీల విషయంలో చెలరేగిన వివాదంలో జరిగిన అనూహ్య పరిణామాల నేపథ్యంలో తోటి వైద్యుడు ఉదయ్కుమార్ చనిపోయాడన్న భయంతో డాక్టర్ శ శికుమార్ ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని తెలిసింది. ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించిన రాజేంద్రనగర్ ఏసీపీ గంగారెడ్డి, మొయినాబాద్ సీఐ శ్రీనివాస్లు సైతం అతని వద్ద రివాల్వర్ లేకుంటే ఆత్మహత్యకు పాల్పడేవాడు కాదని అభిప్రాయపడ్డారు. -
రివాల్వర్తో సంచరిస్తున్న యువకుడు అరెస్ట్
సూర్యాపేట (నల్లగొండ): రివాల్వర్తో సంచరిస్తున్న ఓ యువకుడిని నల్లగొండ జిల్లా సూర్యాపేట పోలీసులు శనివారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... సూర్యాపేటలోని జనగామ క్రాస్రోడ్డులో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అదే సమయంలో ఆ మార్గంలో వచ్చిన ఒక ఆటోను ఆపగా.. అందులో ప్రయాణిస్తున్న విజయ్ అనే యువకుడు వెంటనే పరుగు లంకించుకున్నాడు. పోలీసులు అప్రమత్తమై అతడిని పట్టుకుని సోదా చేయగా రివాల్వర్ బయటపడింది. అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించి విచారించగా..చోరీలకు సాయంగా ఉంటుందని రూ.20వేలు పెట్టి కొనుగోలు చేసినట్టు అతడు బయటపెట్టాడు. నిందితుడు మిర్యాలగూడ మండలం ఆళ్లగడప గ్రామానికి చెందిన వాడని పోలీసులు తెలిపారు. -
అమ్మను తుపాకీతో కాల్చి చంపేశాడు
గుంటూరు : గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో కన్నతల్లినే రివాల్వర్తో కాల్చి చంపాడో ప్రబుద్ధుడు. ఈ సంఘటన జిల్లాలోని కాకుమాను మండలం కొమ్మూరులో బుధవారం ఉదయం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన మస్తాన్వలి (47) ఆర్మీలో పని చేసి రిటైరయ్యాడు. ఇంటికి తిరిగి వచ్చినప్పటి నుంచి మద్యానికి బానిస అయి తరచూ తల్లి ఫజ్లూం(65)తో ఘర్షణకు దిగివాడు. అక్రమంలో ఈ రోజు కూడా తల్లితో ఘర్షణ పడ్డాడు. ఆ క్రమంలో తన లెసైన్స్డ్ రివాల్వర్తో తల్లిని కాల్చి చంపాడు. అనంతరం అతడు పరారైయ్యాడు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని తల్లి మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తుపాకీతో బెదిరించిన ఇద్దరి అరెస్ట్
కర్నూలు : కర్నూలులో ఓ బేకరీ వ్యాపారిని తుపాకీతో బెదిరించిన కేసులో ఇద్దరు వ్యక్తులను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కర్నూలు పట్టణానికి చెందిన బేకరీ వ్యాపారి వెంకటేశ్వరెడ్డికి షేక్ మహమ్మద్ ఇషాక్ పటేల్ బిస్కెట్లను సరఫరా చేస్తుంటాడు. కాగా ఇదే విషయమై వారిద్దరి మధ్య వివాదం జరిగింది. దీంతో ఇషాక్ పటేల్, మహమ్మద్ కరీంతో కలసి వారం క్రితం వెంకటేశ్వరెడ్డిని తుపాకీతో బెదిరించాడు. ఈ కేసులో శుక్రవారం ఇషాక్ పటేల్, కరీంను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి ఓ రివాల్వర్, ఎయిర్గన్లను స్వాధీనం చేసుకున్నారు. -
రివాల్వర్ని మాయం చేసినపోలీసులు
-
ఎస్ఆర్ నగర్లో తుపాకితో బెదిరింపులు
హైదరాబాద్: నగరంలోని ఎస్ఆర్ నగర్ ప్రాంతంలో కలకలం రేగింది. శనివారం రాత్రి ఓ అపార్టుమెంటు వద్ద ఒక వ్యక్తి తుపాకితో రోడ్డుపైకి వచ్చాడు. 'ఇక్కడ ఎందుకు నిల్చున్నారు?' అంటూ పలువురిని తుపాకితో బెదిరించాడు. దీంతో బెబేలెత్తిపోయిన స్థానికులు ఎస్ఆర్ నగర్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది. -
రివాల్వర్ మిస్ ఫైర్
అనంతపురం: అనంతపురం జిల్లా కేంద్రంలో సోమవారం రివాల్వర్ మిస్ ఫైర్ అయింది. విధుల్లో ఉన ఏఎస్ఐ రివాల్వర్ను సరిచేస్తుండగా బుల్లెట్లు దూసుకు వచ్చాయి. దీంతో సంఘటనా ప్రదేశంలో ఉన్న ముగ్గురు కానిస్టేబుల్లు గాయపడ్డారు. వీరిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
రివాల్వర్తో బెదిరించి..
- ఏటీఎంలో యువతి నుంచి న గలు, సెల్ఫోన్, ఏటీఎం కార్డు చోరీ - హైదరాబాద్ యూసుఫ్గూడలో ఘటన హైదరాబాద్: డబ్బులు డ్రా చేసేందుకు ఏటీఎంకు వెళ్లిన యువతిని ఓ అగంతకుడు రివాల్వర్తో బెదిరించి కాల్పులు జరిపాడు. ఆమె వద్ద నుంచి రూ. 65 వేలు విలువచేసే బంగారు నగలు, ఏటీఎం కార్డు,సెల్ఫోన్ను దోచుకుని పారిపోయాడు. హైదరాబాద్లోని ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఈ సంఘటన జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా తాటిపాకకు చెందిన శ్రీలలిత మధురానగర్లోని ఓ హాస్టల్లో ఉంటూ బేగంపేటలోని సాఫ్ట్వేర్ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. కాగా, శ్రీలలిత బుధవారం ఉదయం 7.30 గంటలకు డబ్బులు డ్రా చేసేందుకు యూసుఫ్గూడలోని ఎస్బీఐ బ్యాంకు ఏటీఎంకు వెళ్లింది. ఏటీఎం కార్డు తీస్తుండగా ముఖానికి ముసుగు వేసుకొని వచ్చిన ఓ అగంతకుడు రివాల్వర్ చూపెట్టి ఒంటిపై ఉన్న నగలు తీసి ఇవ్వాలని ఆమెను బెదిరించాడు. అందుకు ఆమె నిరాకరించడంతో రివాల్వర్తో ఏటీఎంలోనే కాల్పులకు తెగబడ్డాడు. తర్వాత ఆమె వద్ద ఉన్న బంగారు ఆభరణాలతో పాటు, సెల్ఫోన్, ఏటీఎం కార్డు , పాస్వర్డ్ నంబరు తీసుకుని పారిపోయాడు. జరిగిన ఘటనపై స్థానికుల సహాయంతో సదరు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా, ఏటీఎం సెంటర్లో కాల్పులు జరిగిన ప్రదేశాన్ని ఇన్స్పెక్టర్ రమణగౌడ్ పరిశీలించారు. ఏటీఎంకు కొద్దిదూరంలో పడి ఉన్న బుల్లెట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రివాల్వర్ పేలిన సమయంలో పెద్ద శబ్దం వచ్చిందని, స్థానికంగా మెట్రోరైల్ పనులు నడుస్తున్నందున పెద్దగా పట్టించుకోలేదని స్థానికులు తెలిపారు. సీసీ కెమెరా ఫుటేజీలో ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు దుండగుడు ముఖానికి గుడ్డ కట్టుకుని ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతడ్ని పట్టుకునేందుకు ప్రత్యేక టీంలు ఏర్పాటు చేశామని తెలిపారు. -
పోలీస్ హెడ్క్వార్టర్స్లో మిస్ఫైర్
సీఐకి తప్పిన ప్రమాదం ఉలిక్కిపడిన పోలీసులు నల్లగొండ క్రైం: నల్లగొండ జిల్లా పోలీసు హెడ్క్వార్టర్స్లో రివాల్వర్ శుభ్రం చేస్తుండగా మిస్ఫైర్ జరిగింది. రోజువారీ కార్యక్రమంలో భాగంగా ఓ డీఎస్పీ రివాల్వర్ను శుభ్రం చేస్తుండగా మిస్ఫైర్ జరిగింది. ఆ సమయంలో స్పెషల్ బ్రాంచ్ సీఐ భాస్కర్ సమీప చెట్టు దగ్గర ఫోన్ మాట్లాడుతుండగా బుల్లెట్ ఆయన కడుపు మీద నుంచి స్వల్పంగా రాసుకుంటూ వెళ్లింది. వెంటనే స్థానిక హెడ్క్వార్టర్స్లోని ఆస్పత్రిలో చికిత్స చేయించారు. మిస్ఫైర్తో పోలీసు అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఉగ్రవాదులు ఏమైనా పోలీసు కార్యాలయంలోకి వచ్చి.. కాల్పులు జరిపారా అన్న అనుమానంతో పోలీసులంతా అప్రమత్తమయ్యారు. -
'ఆ ఘటనతో ఉగ్రవాదులకు సంబంధం లేదు'
నందిగామ(కృష్ణ):నందిగామ ఘటనతో ఉగ్రవాదులకు ఎటువంటి సంబంధం లేదని నందిగామ డీఎస్పీ టీఆర్ మురళీ స్పష్టం చేశారు. నిందితుడు విశాఖపట్నానికి చెందిన కారులో వచ్చాడని.. కారు నెంబర్ ఏపీ 31, క్యూ 3438 అని తెలిపారు.దారి దోపిడీకి పాల్పడే వారే చేశారని భావిస్తున్నామన్నారు. అన్ని చెక్ పోస్ట్ ల వద్ద నిఘా ఏర్పాటు చేసినట్లు ఈ సందర్భంగా డీఎస్పీ తెలియజేశారు. నాలుగు బృందాలు ఏర్పడి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. తొలుత వీరిని సిమీ కార్యకర్తలుగా అనుమానించారు. కృష్ణాజిల్లా నందిగామలో సోమవారం ఓ వ్యక్తి రివాల్వర్తో బెదిరించి కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఓ వ్యాపారిని బెదిరించి అతని వద్ద నుంచి బంగారం దోచుకెళ్లాడు. వివరాల్లోకి వెళితే కారులో విజయవాడ నుంచి హైదరాబాద్ వెళుతున్న సురేష్ కుమార్ అనే వ్యాపారిని సోమవారం ఉదయం ఓ వ్యక్తి గొల్లపూడి వద్ద లిప్ట్ అడిగాడు.కోదాడలో దిగిపోతానని చెప్పటంతో లిప్ట్ ఇచ్చాడు. నందిగామ మండలం హనుమంతపాలెం సమీపంలో ఆ వ్యక్తి తన వద్ద ఉన్న తుపాకీతో వ్యాపారిని బెదిరించి 3 బంగారపు ఉంగరాలు, గొలుసుతో పాటు నగదు దోచుకున్నాడు. ఈ సంఘటనతో భయభ్రాంతులకు గురైన వ్యాపారి నందిగామ డీఎస్పీ మురళికి ఫిర్యాదు చేశాడు. -
నందిగామలో గన్ తో దుండగుడి బీభత్సం
నందిగామ : కృష్ణాజిల్లా నందిగామలో సోమవారం ఓ వ్యక్తి రివాల్వర్తో బెదిరించి కలకలం సృష్టించాడు. ఓ వ్యాపారిని బెదిరించి అతని వద్ద నుంచి బంగారం దోచుకెళ్లాడు. వివరాల్లోకి వెళితే కారులో (AP 31Q 3438) విజయవాడ నుంచి హైదరాబాద్ వెళుతున్న సురేష్ కుమార్ అనే వ్యాపారిని సోమవారం ఉదయం ఓ వ్యక్తి గొల్లపూడి వద్ద లిప్ట్ అడిగాడు. కోదాడలో దిగిపోతానని చెప్పటంతో లిప్ట్ ఇచ్చాడు. నందిగామ మండలం హనుమంతపాలెం సమీపంలో ఆ వ్యక్తి తన వద్ద ఉన్న తుపాకీతో వ్యాపారిని బెదిరించి 3 బంగారపు ఉంగరాలు, గొలుసుతో పాటు నగదు దోచుకున్నాడు. అంతేకాకుండా ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ సెల్ఫోన్లో వ్యాపారి ఫోటో తీసుకున్నట్లు తెలుస్తోంది. అనంతరం పొలాల్లోకి పారిపోయినట్లు సమాచారం. ఈ సంఘటనతో భయభ్రాంతులకు గురైన వ్యాపారి నందిగామ డీఎస్పీ రాదేశ్ మురళికి ఫిర్యాదు చేశాడు. కాగా బెదిరించి, దోపిడీకి పాల్పడిన వ్యక్తి...సిమీ కార్యకర్తగా పోలీసులు అనుమానిస్తున్నారు. తాజా పరిణామాలతో నందిగామ-జగ్గయ్యపేట హైవేపై పోలీసులు ముమ్మరంగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
జెడ్పీ సమావేశంలో రివాల్వర్ కలకలం
కరీంనగర్: కరీంనరగ్ జిల్లా జిల్లా పరిషత్ సమావేశంలో సోమవారం రివాల్వర్ కలకలం సృష్టించింది. రివాల్వర్తో కాంగ్రెస్ సభ్యుడు చల్లానారాయణ రెడ్డి సమావేశానికి హాజరుకాగా టీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. దాంతో సమావేశం నుంచి కాంగ్రెస్ సభ్యుడు నారాయణరెడ్డి అలిగి వెళ్లిపోయారు. -
తనిఖీల్లో నాటు రివాల్వర్ లభ్యం
వైఎస్సార్ జిల్లా : వైఎస్సార్ జిల్లా వేమల మండలం నల్లచెరువు పల్లె వద్ద పోలీసులు మంగళవారం తనిఖీలు చేస్తుండుగా నాటు రివాల్వర్ దొరికింది. పోలీసులు సాధారణ తనిఖీల్లో భాగంగా వాహనాలు చెక్ చేస్తుండగా ఓ ఆటోలో అనంతపురం జిల్లా కదిరికి చెందిన నాగేశ్వర్ వద్ద రివాల్వర్ లభ్యమైంది. వేముల ఎస్ఐ నాగేంద్ర కుమార్ నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. (వేముల) -
ఎస్సై రివాల్వర్ మిస్ ఫైర్.. సర్వర్కు గాయాలు
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా నిర్మల్లో ఎస్ఐ రివాల్వర్ మిస్ ఫైర్ అయిన సంఘటనలో ఓ వ్యక్తి గాయపడ్డాడు. ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఉన్నాయి. కరీంనగర్ జిల్లా రాయికల్ ఎస్సై రాములు నాయక్తో పాటు జిల్లాకు చెందిన ఇద్దరు ఉన్నతాధికారులు నిర్మల్లోని మయూరి హోటల్కు విందుకు వెళ్లారు. రాములు నాయక్ రివాల్వర్ కిందపడటంతో మిస్ ఫైర్ అయ్యింది. ఈ ప్రమాదంలో హోటల్లో పనిచేసే సర్వర్కు గాయాలయ్యాయి. -
దర్జాగా వచ్చాడు...వెళ్లాడు....
-
ఆలయంలోకి తుపాకీతో ప్రవేశించిన చరణ్ రాజ్
చిత్తూరు : చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలలో ఒక్కటైన కాణిపాకం వరసిద్ధి వినాయకుడ్ని ప్రముఖ నటుడు చరణ్ రాజ్ శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన వద్ద తుపాకీ ఉన్నట్లు ఆలయ సిబ్బంది తనిఖీలలో భాగంగా గుర్తించారు. ఆ తుపాకీని ఆలయ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆలయంలోకి తుపాకీతో వెళ్లకూడదన్న విషయం తనకు తెలియదని చరణ్ రాజు ఆలయ అధికారులకు తెలిపారు. ఈ విషయంలో తనను భక్తులు, ఆలయ అధికారులు క్షమించాలని చరణ్ రాజు కోరారు. దాంతో ఆలయ అధికారులు చరణ్ రాజ్కు తుపాకీ ఇచ్చేశారు. -
పోలీసులమంటూ అర్ధరాత్రి హల్చల్
- మహిళా సర్పంచ్ను రివాల్వర్తో బెదిరించిన దుండగులు - ద్విచక్రవాహనం, సెల్ ఫోన్తో పరారీ - అధికార పార్టీ నాయకులపైనే అనుమానం! చాగలమర్రి: పోలీసులమని చెప్పి ఎనిమిది మంది గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి హల్చల్ చేశారు. ముత్యాలపాడు గ్రామ సర్పంచ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు స్వప్న ఇంట్లోకి మంగళవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి దౌర్జన్యానికి పాల్పడ్డారు. మహిళ అని చూడకుండా రివాల్వర్ చూపించి బెదిరించడంతో కుటుంబ సభ్యులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ సంఘటనపై సర్పంచ్ స్వప్న బుధవారం చాగలమర్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలు, పోలీసుల కథనం మేరకు.. స్వప్న కుటుంబ సభ్యులతో ఇంట్లో నిద్రిస్తుండగా ఎనిమిది మంది గుర్తు తెలియని వ్యక్తులు పోలీసుల మంటు వచ్చి లేపారు. మీ మరిది బాబావలి ఎక్కడా అంటూ ఆమెను అడగడంతో.. మీరు ఎవరు, ఈ సమయంలో ఎందుకు వచ్చారని సర్పంచ్ ప్రశ్నించారు. మేము పోలీసులమని, బాబావలిని సీఐ తీసుకురమ్మన్నాడని చెప్పారు. అతను ఎక్కడున్నాడో చెప్పకపోతే మిమ్మళ్లి ఈడ్చుకెళ్తామని బెదించారు. ఇంట్లో ఉన్న సామాన్లను చెల్లాచెదురు చేసి సెల్ఫోన్, బయట నిలిపిన ద్విచక్ర వాహానాన్ని తీసుకొని వెళ్లారు. ఈ మేరకు సర్పంచ్ స్వప్న, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్సర్బాష, జగదీశ్వరరెడ్డి, పుల్లయ్య, ముల్లా ఖాదర్బాష, స్వామిరెడ్డి ఎస్ఐ హరిప్రసాద్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్బంగా సర్పంచ్ విలేకరులతో మాట్లాడుతూ తన భర్త మస్తాన్వలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి 1వ ఎంపీటీసీ స్థానానికి ఎంపీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడంతో మరుసటి రోజు నుంచి టీడీపీ నాయకులు వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. అక్రమ కేసులలో ఇరికించడమే కాకుండా ఒక కేసులో బెయిల్ వస్తే మరో కేసు బనాయిస్తు మూడు నెలలుగా తన భర్తను జైల్లో ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు. మస్తాన్ వలి జైల్లో ఉండే కూడా ఎంపీటీసీగా గెలుపొందారని చెప్పారు. తన అనుచర ఎంపీటీసీలతో అధికార పార్టీలోకి రావాలని తన భర్తపై టీడీపీ నాయకులు ఒత్తిడి తెస్తూ, ఇబ్బందులు పెడుతున్నారని ఆమె వాపోయారు. ఇందులో భాగంగానే అర్ధరాత్రి మా ఇంటిపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ప్రాణం పోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, భూమా నాగిరెడ్డి నాయకత్వాన్ని వదలి వెళ్లే ప్రసక్తే లేదని స్వప్న స్పష్టం చేశారు. -
జగ్దల్పూర్ ఎస్పీ ఆత్మహత్య
చింతూరు, న్యూస్లైన్: ఛత్తీస్గఢ్లోని జగ్దల్పూర్ సిటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(ఎస్పీ) దేవ్నారాయణ్ పటేల్ (40) మంగళవారం తన సర్వీసు రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీనికి ముందు భార్య, ఇద్దరు పిల్లలపై కూడా ఆయన కాల్పులు జరిపారు. ఈ ఘటనలో భార్య, భర్త మృతిచెందగా ఇద్దరు పిల్లల పరిస్థితి విషమంగా ఉందని ఉన్నతాధికారులు వెల్లడించారు. తనను సస్పెండ్ చేశారనే మానసిక వేదనతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు ఎస్పీ సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. వివరాలు.. ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా రెండు రోజుల కిందట ఎస్సీ దేవ్నారాయణ్, అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి టోపోల మధ్య వివాదం చెలరేగింది. ఈ క్రమంలో జడ్జి టోపోపై ఎస్పీ చేయి చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనపై అధికారులు విచారణ జరిపి సోమవారం ఎస్పీపై సస్పెన్షన్ వేటు వేశారు. తనపై సస్పెన్షన్ వేటు పడడాన్ని జీర్ణించుకోలేని దేవ్నారాయణ్ సర్వీసు రివాల్వర్తో భార్య ప్రతిమా పటేల్, కూతురు పూనమ్(11), కుమారుడు ఆయుష్(6)లను కాల్చి అనంతరం తనను తాను కాల్చుకున్నాడు. ఈ ఘటనలో ఎస్పీతో పాటు భార్య ప్రతిమ అక్కడికక్కడే మృతిచెందారు. పిల్లల పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా చికిత్స నిమిత్తం రాయ్పూర్ తరలించారు. ఆత్మహత్యకు పాల్పడిన ఎస్పీ దేవ్నారాయణ్ ఇంట్లో పోలీసులు మంగళవారం ఓ సూసైడ్నోట్ను స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఈ ఉదంతంపై ప్రభుత్వం మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించింది. -
'కుటుంబంపై కాల్పులు జరిపి...తానూ ఆత్మహత్య'
-
'కుటుంబంపై కాల్పులు జరిపి...తానూ ఆత్మహత్య'
ఛత్తీస్గఢ్ : కుటుంబసభ్యులపై కాల్పులు జరిపి అనంతరం ఓ పోలీసు ఉన్నత అధికారి తానూ ఆత్మహత్య చేసుకున్న ఘటన ఈరోజు తెల్లవారుజామున ఛత్తీస్గఢ్లో చోటు చేసుకుంది. సస్పెండ్ అయిన జగదల్పూర్ ఎస్పీ దేవ్ నారాయణ్ పాటిల్ కుటుంబ సభ్యులపై కాల్పులు జరిపి ఆ తర్వాత తుపాకీతో కాల్చుకున్నాడు. ఈ సంఘటనలో ఎస్పీ, ఆయన భార్య ప్రతిమా మృతి చెందగా, ఇద్దరు పిల్లలు ఆర్యన్ (6), పూజ (11) ప్రాణాలతో బయటపడ్డారు. అయితే వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆ చిన్నారులు రాయ్పూర్లోని రామకృష్ణ కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నిన్న విధులు నుంచి సస్పెండ్ కావటంతో మనస్తాపం చెందిన దేవ్ నారాయణ ఈ దుర్ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే ఘటనా స్థలంలో ఎలాంటి లేఖ లభించలేదని బస్తర్ రేంజ్ ఐజీ అరుణ్ దేవ్ గౌతమ్ తెలిపారు. ఈ సంఘటనపై విచారణ జరుతామని ఆయన పేర్కొన్నారు.