Robinhood
-
రాబిన్హుడ్ డేట్ ఫిక్స్
‘భీష్మ’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘రాబిన్హుడ్’. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న చిత్రం ఇది. ఈ సినిమాను మార్చి 28న రిలీజ్ చేయనున్నట్లుగా శనివారం చిత్రయూనిట్ ప్రకటించింది.‘‘ఈ మూవీలో నితిన్ క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉంటుంది. ఈ సినిమా కోసం కేతికా శర్మ చేసిన స్పెషల్ సాంగ్ లిరికల్ వీడియోను అతి త్వరలోనే రిలీజ్ చేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్కుమార్. -
పండుగ రేసు నుంచి తప్పకున్న నితిన్ 'రాబిన్హుడ్'
క్రిస్టమస్ రేసు నుంచి 'రాబిన్ హుడ్' సినిమా తప్పుకుంది. ఈమేరకు చిత్ర యూనిట్ నుంచి అధికారికంగా ప్రకటన కూడా వెలువడింది. 'భీష్మ' వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘రాబిన్ హుడ్’. టైటిల్ ప్రకటించిన సమయం నుంచి ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది.‘రాబిన్హుడ్’ సినిమాను డిసెంబర్ 25న విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించారు. అయితే, తాజాగా ఆ సంస్థ మరో ప్రకటన చేసింది. రాబిన్ హుడ్ చిత్రాన్ని అనుకున్న తేదీలో విడుదల చేయడం లేదంటూ తెలిపింది. కానీ, కొత్త రిలీజ్ డేట్ను త్వరలో ప్రకటిస్తామని పేర్కొంది. మైత్రీ మూవీస్ నుంచి తెరకెక్కిన పుష్ప2 ఇంకా థియేటర్లో రన్ అవుతూనే ఉంది. మరోవైపు మోహన్లాల్ బరోజ్ తెలుగు వర్షన్ను ఇదే సంస్థ డిసెంబర్ 25న విడుదల చేస్తుంది. ఆపై ఈ క్రిస్టమస్ రేసులో సుమారు 10కి పైగా చిత్రాలు రేసులో ఉన్నాయి. దీంతో థియేటర్స్ కొరత ఏర్పడే ఛాన్స్ ఉందని రాబిన్ హుడ్ను వాయిదా వేసినట్లు తెలుస్తోంది.రాబిన్ హుడ్లో నితిన్ సరసన శ్రీలీల హీరోయిన్గా నటిస్తుంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. సంగీతం జీవీ ప్రకాశ్కుమార్ అందిస్తున్నారు. యునిక్ యాక్షన్, కామెడీ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రానుంది. -
రాబిన్ హుడ్ పై పుష్పరాజ్ ఎఫెక్ట్?
-
ఈ క్రెడిట్ కార్డు కోసం 10 లక్షల మంది వెయింటింగ్!
చిన్న స్థాయి ఉద్యోగుల దగ్గర నుంచి లక్షల జీతాలు తీసుకునే ఉద్యోగుల వరకు.. అందరూ క్రెడిట్ కార్డులు ఉపయోగిస్తున్నారు. అయితే వీరందరూ కూడా ప్లాస్టిక్ లేదా స్టెయిన్ లెస్తో తయారైన కార్డులనే వినియోగిస్తుంటారు. కానీ రాబిన్ హుడ్ సంస్థ ఏకంగా గోల్డ్ క్రెడిట్ కార్డులను అందుబాటులోకి తీసుకొచ్చింది.రాబిన్ హుడ్ కంపెనీ తీసుకొచ్చిన గోల్డ్ క్రెడిట్ కార్డులలో ఒకదాన్ని.. సంస్థ ఓపెన్ ఏఐ సీఈఓ 'శామ్ ఆల్ట్మన్'కు పంపించింది. దీని డిజైన్ చూసి ఆల్ట్మన్ ఫిదా అయిపోయారు. ఈ విషయాన్నే తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసారు. ఒకప్పుడు గోల్డ్ కార్డు అంటే.. అది మార్కెట్ స్ట్రాటజీ అనుకున్నా, కానీ ఇప్పుడు నా అభిప్రాయం మార్చుకున్నా అన్నారు.గోల్డ్ క్రెడిట్ కార్డ్ రూపొందించిన కంపెనీ రాబిన్హుడ్.. స్టాక్ ట్రేడింగ్, క్రిప్టోకరెన్సీతో సహా రిటైల్ బ్రోకరేజ్ సేవలను అందించడంలో ప్రసిద్ధి చెందింది. దీనిని 2013లో వ్లాదిమిర్ టెనెవ్, బైజు భట్ స్థాపించారు. ఆ సంస్థ ఇప్పుడు గోల్డ్ క్రెడిట్ కార్డు రూపొందించింది. ఈ కార్డు ద్వారా చేసే అన్ని లావాదేవీలకు 3 శాతం క్యాష్బ్యాక్ లభిస్తుంది. దీనికి ఎలాంటి ఫీజు లేకపోవడం మాత్రమే కాకుండా.. విదేశీ లావాదేవీలకు కూడా ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.నిజానికి రాబిన్హుడ్ కంపెనీ రూపొందించిన ఈ గోల్డ్ కార్డు 17 గ్రాముల బరువు ఉంటుంది. ఇది పూర్తిగా స్టెయిన్లెస్ స్టీల్తో తయారైంది. అయితే దీనిపైన 10 క్యారెట్ల గోల్డ్ కోటింగ్ వేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కార్డు కోసం 10 లక్షల మంది ఎదురు చూస్తున్నట్లు సమాచారం.a few months ago robinhood sent me a gold credit card with extremely high-quality details. i thought it was a ridiculous marketing stunt at the time but now it’s an example i give when talking about great design. pic.twitter.com/v0VWyJK7PT— Sam Altman (@sama) December 10, 2024 -
క్రిస్మస్ కాదు టాలీవుడ్కి మినీ సంక్రాంతి
మరో నాలుగు రోజుల్లో 'పుష్ప 2' రిలీజ్ కానుంది. దీంతో ఈ వారం.. రిలీజైన తర్వాత వారం కూడా చెప్పుకోదగ్గ సినిమాలేం లేవు. కానీ క్రిస్మస్కి మాత్రం టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర కుప్పలతెప్పలుగా మూవీస్ రిలీజ్ కాబోతున్నాయి. స్ట్రెయిట్, డబ్బింగ్ కలిపి ఏకంగా డజను సినిమాలు క్రిస్మస్ వీకెండ్లో రిలీజ్ కాబోతున్నాయి. ఇంతకీ అవేంటి వాటి సంగతేంటి?తెలుగు సినిమాల విషయానికొస్తే డిసెంబరు 20న అల్లరి నరేశ్ 'బచ్చలమల్లి' వస్తుంది. రీసెంట్గా రిలీజైన రా అండ్ రస్టిక్ టీజర్ ఇంట్రెస్టింగ్గా అనిపించింది. నిజ జీవిత కథ ఆధారంగా తీశారు. దీనిపై అల్లరి నరేశ్ అంచనాలు పెట్టుకున్నారు. ప్రియదర్శి 'సారంగపాణి' కూడా ఇదే రోజున రిలీజ్ కానుంది. సున్నితమైన కామెడీ సినిమాలు తీస్తాడనే పేరున్న మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకుడు. ఇది హిట్ అవ్వడం వీళ్ల కెరీర్కి కీలకం.(ఇదీ చదవండి: నాన్న ఇంటికి రావొద్దన్నారు.. చచ్చిపోదామనుకున్నా: రాజేంద్ర ప్రసాద్)20నే 'మ్యాజిక్' అనే తెలుగు సినిమా కూడా రాబోతుంది. 'జెర్సీ' దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దీన్ని తీశారు. అనిరుధ్ మ్యూజిక్. ఇప్పటికైతే ఎలాంటి అంచనాల్లేవు. అదే రోజున విజయ్ సేతుపతి-వెట్రిమారన్ తమిళ డబ్బింగ్ మూవీ 'విడుదల 2' కూడా రానుంది. దీనికి సెపరేట్ ఆడియెన్స్ ఉన్నారు. అలానే కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర 'యూఐ' కూడా ఇదే రోజున థియేటర్లలోకి రానుంది.హాలీవుడ్ నుంచి 'ముఫాసా' అనే కార్టూన్ మూవీ కూడా 20వ తేదీనే థియేటర్లలోకి రానుంది. సిటీల్లో మాత్రం పెద్ద చిత్రాలకు ఇది కాంపిటీషన్ అని చెప్పొచ్చు. మహేశ్ బాబు, షారుక్ ఖాన్ లాంటి స్టార్ హీరోలు.. దీనికి ప్రాంతీయ భాషల్లో డబ్బింగ్ చెప్పారు. ఇది ఏ మేరకు కలిసొస్తుందో చూడాలి.(ఇదీ చదవండి: అఫీషియల్: చరణ్ సినిమాలో 'మీర్జాపుర్' మున్నా భయ్యా)డిసెంబరు 25న అంటే క్రిస్మస్ రోజున రాబోతున్న తెలుగులో సినిమాల్లో కాస్త చెప్పుకోదగింది నితిన్ 'రాబిన్ హుడ్'. శ్రీలీల హీరోయిన్, 'భీష్మ' లాంటి హిట్ తర్వాత నితిన్-వెంకీ చేసిన మూవీ కావడంతో ఓ మాదిరి అంచనాలున్నాయి. ఈ రోజున రిలీజయ్యే వాటిలో ఇదొక్కటే తెలుగు మూవీ. ఇది కాకుండా మ్యాక్స్ (కన్నడ డబ్బింగ్), మార్కో (మలయాళ డబ్బింగ్), బరోజ్ (మలయాళ డబ్బింగ్), బేబీ జాన్ (హిందీ) చిత్రాలు కూడా లైన్లో ఉన్నాయి. డిసెంబరు 27న 'పతంగ్' అనే తెలుగు సినిమా కూడా ఉందండోయ్.ఇలా క్రిస్మస్ వీకెండ్లో ఏకంగా 12 వరకు స్ట్రెయిట్, డబ్బింగ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఓ రకంగా చూసుకుంటే 'పుష్ప 2' తర్వాత, సంక్రాంతికి ముందు ఇన్ని మూవీస్ రావడం సాహసమనే చెప్పాలి. మినీ సంక్రాంతికి అని చెప్పొచ్చేమో!(ఇదీ చదవండి: 3 వారాల్లోనే ఓటీటీలోకి 'మట్కా'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) -
నితిన్ 'రాబిన్హుడ్' మూవీ ప్రెస్ మీట్ (ఫొటోలు)
-
డబ్బు కోసం ఏమైనా చేసే 'రాబిన్ హుడ్' టీజర్ విడుదల
'భీష్మ' వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘రాబిన్ హుడ్’. టైటిల్ ప్రకటించిన సమయం నుంచి ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ మూవీ నుంచి టీజర్ను మేకర్స్ విడుదల చేశారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంగీతం జీవీ ప్రకాశ్కుమార్ అందిస్తున్నారు. యునిక్ యాక్షన్, కామెడీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రం డిసెంబర్ 25న రిలీజ్ కానుంది. -
పండగ వేళ పసందుగా...
కొత్త లుక్స్, విడుదల తేదీల ప్రకటనలతో దీపావళి సందడి తెలుగు పరిశ్రమలో బాగానే కనిపించింది. మాస్ లుక్, క్లాస్ లుక్, భయంకరమైన లుక్, కామెడీ లుక్... ఇలా పండగ వేళ పసందైన వెరైటీ లుక్స్లో కనిపించారు స్టార్స్. ఆ వివరాల్లోకి వెళదాం.⇒ తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లోని స్టార్ హీరోలైన అక్కినేని నాగార్జున, ధనుష్ లీడ్ రోల్స్లో నటిస్తున్న పాన్ ఇండియన్ మల్టిస్టారర్ చిత్రం ‘కుబేర’. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మికా మందన్న హీరోయిన్గా నటిస్తున్నారు. సునీల్ నారంగ్, పుసూ్కర్ రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీపావళి సందర్భంగా ధనుష్, నాగార్జున, రష్మికా మందన్నల పోస్టర్ని విడుదల చేశారు మేకర్స్. టీజర్ని ఈ నెల 15న విడుదల చేయనున్నారు. తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. ⇒ హీరో వెంకటేశ్ వచ్చే సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయనున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే టైటిల్ని ఖరారు చేసి టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేసింది చిత్రబృందం. అనిల్ రావిపూడి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వెంకటేశ్ భార్య పాత్రలో ఐశ్వర్యా రాజేష్, మాజీ ప్రేయసిగా మీనాక్షీ చౌదరి నటిస్తున్నారు. దీపావళిని పురస్కరించుకుని ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేయడంతో పాటు సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. యూనిక్ ట్రయాంగిలర్ క్రైమ్ బ్యాక్డ్రాప్లో ఈ చిత్రం రూపొందుతోంది. ⇒ సంక్రాంతికి ఆట ప్రారంభించనున్నారు రామ్చరణ్. ఆయన హీరోగా నటిస్తున్న పాన్ ఇండియన్ మూవీ ‘గేమ్ ఛేంజర్’. దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్నారు. అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ జీ స్టూడియోస్ బ్యానర్స్పై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 10న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. కాగా ఈ మూవీ టీజర్ని ఈ నెల 9న విడుదల చేస్తున్నట్లు ప్రకటించి, రామ్చరణ్ లుక్ని రిలీజ్ చేశారు. ⇒ అర్జున్ సర్కార్గా చార్జ్ తీసుకున్నారు హీరో నాని. ‘హిట్: ది ఫస్ట్ కేస్’, ‘హిట్: ది సెకండ్ కేస్’ వంటి చిత్రాల తర్వాత ఆ ఫ్రాంచైజీలో రూపొందుతున్న చిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్’. తొలి రెండు చిత్రాలకు దర్శకత్వం వహించిన శైలేష్ కొలను ‘హిట్: ది థర్డ్ కేస్’ని కూడా తెరకెక్కిస్తున్నారు. శ్రీనిధీ శెట్టి హీరోయిన్గా నటిస్తున్నారు. వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ప్రొడక్షన్స్పై ప్రశాంతి తిపిర్నేని ఈ మూవీ నిర్మిస్తున్నారు. దీపావళి సందర్భంగా ఈ మూవీ నుంచి నాని యాక్షన్ ఫ్యాక్డ్ పోస్టర్ రిలీజ్ చేశారు. 2025 మే 1న ఈ సినిమా విడుదల కానుంది. ⇒ నితిన్ టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం ‘రాబిన్హుడ్’. ఇందులో శ్రీలీల హీరోయిన్. వెంకీ కుడుముల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నితిన్ లుక్ విడుదలైంది. త్వరలో టీజర్ రిలీజ్ కానుంది. యునిక్ యాక్షన్, కామెడీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రం డిసెంబర్ 20న రిలీజ్ కానుంది. ⇒ నవీన్ చంద్ర హీరోగా లోకేశ్ అజ్లస్ దర్శకత్వంలో రూపొందిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ ‘లెవెన్’. రేయా హరి కథానాయికగా నటించారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో అజ్మల్ ఖాన్, రేయా హరి ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా ఈ చిత్రంలోని ‘ది డెవిల్ ఈజ్ వెయిటింగ్..’ అంటూ శ్రుతీహాసన్ పాడిన పాట చాలా పాపులర్ అయింది. ‘లెవెన్’ని నవంబర్ 22న విడుదల చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది. ⇒ బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ తాత–మనవళ్లుగా నటిస్తున్న చిత్రం ‘బ్రహ్మా ఆనందం’. నూతన దర్శకుడు ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వంలో రాహుల్ యాదవ్ నక్కా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బ్రహ్మానందంగా రాజా గౌతమ్ పోషిస్తున్న పాత్ర ఫస్ట్ లుక్ని విడుదల చేశారు. ఇందులో ప్రియా వడ్లమాని, ఐశ్వర్యా హోలక్కల్ హీరోయిన్లు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న ఈ చిత్రం రిలీజ్ కానుంది.⇒ నాగ సాధువుగా తమన్నా లీడ్ రోల్లో అశోక్ తేజ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఓదెల 2’. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్పై బహు భాషా చిత్రంగా రూపొందుతోంది. ఈ డివోషన్ యాక్షన్ థ్రిల్లర్లో విలన్ తిరుపతి పాత్రలో వశిష్ఠ ఎన్. సింహ నటిస్తున్నట్లు పేర్కొని, లుక్ని విడుదల చేశారు. ఈ చిత్రంలో హెబ్బా పటేల్ మరో కీలక -
ఆస్ట్రేలియాలో ఆటా పాటా
ఆస్ట్రేలియా వెళ్లింది ‘రాబిన్హుడ్’ టీమ్. ‘భీష్మ’ (2020) వంటి సూపర్హిట్ ఫిల్మ్ తర్వాత హీరో నితిన్–దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్లో రూపొందుతున్న తాజా చిత్రం ‘రాబిన్హుడ్’. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ఆస్ట్రేలియాలో జరుగుతోంది. నితిన్, శ్రీలీల కాంబినేషన్లో ఓ డ్యూయెట్ సాంగ్ను చిత్రీకరిస్తున్నారు మేకర్స్.మెల్బోర్న్లోని అందమైన లొకేషన్స్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ పాటకు కృష్ణకాంత్ లిరిక్స్ రాయగా, శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ సాంగ్తో పాటు కొంత టాకీపార్టు చిత్రీకరణ కూడా ఆస్ట్రేలియాలో జరగనుంది. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్కుమార్ సంగీతం అందిస్తున్నారు. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబరు 20న విడుదల కానుంది. -
టాలీవుడ్ యంగ్ హీరో.. ఎవరో గుర్తుపట్టారా..?
నితిన్ హీరోగా నటిస్తున్న రాబిన్హుడ్ సినిమా షూటింగ్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ద్వారా నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తుంది. తాజాగా ఈ సినిమా సెట్స్ నుంచి నితిన్కు సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతుంది.నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలో నితిన్ వృద్ధుడి గెటప్లో కనిపించి ఫ్యాన్స్కు షాకిచ్చారు. వాస్తవంగా ఎవరూ గుర్తుపట్టలేనంతగా ఆయన గెటప్ ఉంది. ఫేస్ యాప్, ఏఐ టెక్నాలజీ వంటి సాంకేతికతను ఉపయోగించి అలా వీడియోను క్రియేట్ చేశారా..? అనే సందేహాలు వస్తున్నాయి. రాబిన్హుడ్ సినిమాలో నితిన్ ఇలాగే కనిపించనున్నారా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాబిన్హుడ్ సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.Pulling each other's legs is our daily routine on #Robinhood sets..@actor_nithiin anna & @sreeleela14 😂🙈 pic.twitter.com/pTp4yiO32o— Venky Kudumula (@VenkyKudumula) July 11, 2024 -
నా ముందు సైలెంట్గా ఉండాలి!
తెలుగు చిత్ర పరిశ్రమలో బిజీగా దూసుకెళుతున్నారు యంగ్ బ్యూటీ శ్రీలీల. ప్రస్తుతం నితిన్తో ‘రాబిన్హుడ్’, రవితేజ ‘ఆర్టీ 75’ (వర్కింగ్ టైటిల్) వంటి చిత్రాల్లో నటిస్తున్నారు. కాగా శుక్రవారం (మే 14) శ్రీలీల బర్త్డే. ఈ సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ‘రాబిన్హుడ్’లో ఆమె చేస్తున్న లేడీ బాస్ నీరా వాసుదేవ్ ΄పాత్ర లుక్, టీజర్ను రిలీజ్ చేశారు మేకర్స్.‘‘జ్యోతీ... సునామీలో టి సైలెంట్ ఉండాలి... నా ముందు నువ్వు సైలెంట్గా ఉండాలి’ అంటూ శ్రీలీల చెప్పిన డైలాగ్ టీజర్లో ఉంది. ‘ఎక్స్ట్రాఆర్డినరీ మ్యాన్’ (2023) చిత్రం తర్వాత హీరో నితిన్, హీరోయిన్ శ్రీలీల రెండోసారి జోడీగా నటిస్తున్న చిత్రం ‘రాబిన్హుడ్’. వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, ‘వెన్నెల’ కిశోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు.‘యునిక్ యాక్షన్, ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా ‘రాబిన్హుడ్’ రూపొందుతోంది. ఈ చిత్రంలో నితిన్ పాత్రకు శ్రీలీల పాత్ర పూర్తి భిన్నంగా ఉంటుంది. వారి పాత్రలు రాయడంలో వెంకీ కుడుముల స్పెషల్ కేర్ తీసుకున్నారు. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 20న మా సినిమా విడుదల కానుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
రాబిన్హుడ్ డేట్ ఫిక్స్
నితిన్ హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘రాబిన్హుడ్’ విడుదల తేదీ ఖరారు అయింది. డిసెంబర్ 20న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, ‘వెన్నెల’ కిశోర్ కీలక పాత్రలు ΄ోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘‘అన్ని వాణిజ్య అంశాలతో పాటు వినోదంతో రూపొందుతోన్న చిత్రం ‘రాబిన్హుడ్’. ఈ చిత్రంలో నితిన్ మునుపెన్నడూ చూడని సరికొత్త పాత్రలో కనిపిస్తారు. తన గెటప్ నుండి క్యారెక్టరైజేషన్ వరకు పూర్తిగా డిఫరెంట్గా ప్రెజెంట్ చేస్తున్నారు వెంకీ కుడుముల. క్రిస్మస్ సెలవులు, ఆ తర్వాత న్యూ ఇయర్ సెలవులు మా సినిమాకి కలిసి రానున్నాయి’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్కుమార్, కెమెరా: సాయి శ్రీరామ్. -
నితిన్ రాబిన్ హుడ్
‘భీష్మ’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రానికి ‘రాబిన్ హుడ్’ టైటిల్ ఖరారైంది. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటించనున్నారట. శుక్రవారం (జనవరి 26) రిపబ్లిక్ డే సందర్భంగా ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ను విడుదల చేశారు. మేకర్స్. ‘డబ్బు చాలా చెడ్డది... రూపాయి రూపాయి నువ్వు ఏం చేస్తావ్ అంటే... అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెళ్ల మధ్య చిచ్చు పెడతానంటది.. అన్నట్టే చేసింది... దేశమంత కుటుంబం నాది... ఆస్తులున్నోళ్లంతా నా అన్నదమ్ములు... ఆభరణాలేసుకున్నోళ్లంత నా అక్క చెల్లెళ్ళు... అవసరం కొద్ది వాళ్ల జేబుల్లో చేతులు పెడితే... ఫ్యామిలీ మెంబర్ అని కూడా చూడకుండా నా మీద కేసులు పెడుతున్నారు... అయినా నేను హర్ట్ అవ్వలేదు... ఎందుకంటే అయినవాళ్ల దగ్గర తీసుకోవడం నా హక్కు... మై బేసిక్ రైట్. బికాజ్ ఇండియా ఈజ్ మై కంట్రీ. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్’ అంటూ నితిన్ చెప్పే డైలాగ్స్ ఈ వీడియోలో ఉన్నాయి. రాజేంద్ర ప్రసాద్, ‘వెన్నెల’ కిశోర్ తదితరులు కీలక పాత్రల్లో నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్కుమార్. -
రాబిన్హుడ్ టైటిల్ గ్లింప్స్
-
మంచోడే.. కానీ.. దొంగోడు!
హైదరాబాద్: దొంగలందు ఈ దొంగ వేరయా.. అన్నట్టు.. పెద్దలను దోచి పేదలకు పంచిపెడుతుంటాడు. చోరీ చేసిన సొత్తులో కొంత భాగాన్ని తన గ్రామాభివృద్ధికి ఖర్చు చేస్తాడు. కేవలం బంగారం, నగదు మాత్రమే తస్కరిస్తూ వెండి వస్తువుల జోలికి వెళ్లడు. సీసీ కెమెరాలకు చిక్కకుండా పక్కా ప్రణాళికతో ఒక ఇంటిపై నుంచి మరో ఇంటిపైకి దూకుతూ జారుకుంటాడు. జూబ్లీహిల్స్లోనే దొంగతనాలకు పాల్పడతాడు తప్ప నగరంలోని మరో ప్రాంతంపై దృష్టి పెట్టడు. పోలీసులకు ఏమాత్రం క్లూ దొరక్కుండా సెల్ఫోన్ సిమ్ వేసుకోకుండా కేవలం నెట్తో వాట్సాప్ కాల్స్ మాత్రమే వాడుతూ అత్యంత పకడ్బందీగా హైదరాబాద్, ముంబై మధ్య రాకపోకలు సాగిస్తున్నాడు. నాలుగేళ్లుగా బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్ పోలీసులు గాలిస్తున్న ఈ అంతర్రాష్ట్ర దొంగను ఎట్టకేలకు జూబ్లీహిల్స్ క్రైం పోలీసులు అరెస్ట్ చేసి శనివారం రిమాండ్కు తరలించారు. వివరాలు ఇలా ఉన్నాయి. సీసీ కెమెరాకు చిక్కి.. బిహార్కు చెందిన మహ్మర్ ఇర్ఫాన్ అలియాస్ రాబిన్హుడ్ అలియాస్ ఉజ్వల్ (33) ఢిల్లీ, బెంగుళూరు, హైదరాబాద్లలో దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. ఈ నెల 9న జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 10సిలోని ఎంపీ ఎమ్మెల్యే కాలనీలో నివసించే ధృవ అనురాగ్రెడ్డి ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు. బంగారు నగలు తస్కరించి అదే రోజు రాత్రి ఇక్కడి నుంచి ఉడాయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసుకొని రంగంలోకి దిగారు. ఎంపీ ఎమ్మెల్యే కాలనీలో నాలుగైదు రోజులపాటు 75కిపైగా సీసీ కెమెరాలను వడపోసినా ఎక్కడా ఇర్ఫాన్ ఆనవాళ్లు చిక్కలేదు. సీసీ ఫుటేజీలు పరిశీలిస్తూ వెళ్తుండగా వెంకటగిరి సమీపంలో ఓ ఇంటి ముందు ఏర్పాటు చేసిన కెమెరాకు చిక్కాడు. లక్డీకాపూల్లోని హోటల్లో మకాం.. పాత నేరస్తుల ఫొటోలను, సీసీటీఎన్ఎస్ పరిశీలనలో రాబిన్హుడ్ మామూలోడు కాదని, కరడుగట్టిన అంతర్రాష్ట్ర దొంగ అని తేలింది. నగరానికి దొంగతనానికి వచ్చినప్పుడు తప్పనిసరిగా లక్డీకాపూల్లోని ఓ హోటల్లో తనకు అచ్చొచ్చిన గదిలో ఉంటున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారం రోజులపాటు ఆ హోటల్ వద్ద కాపు కాశారు. రాబిన్హుడ్ రాకను గుర్తించిన పోలీసులు అతన్ని అదే హోటల్ గదిలో అదుపులోకి తీసుకొన్నారు. విచారణ చేయగా ఈ నెల 8న దొంగతనానికి ఇక్కడికి వచ్చానని, ఓ ఖరీదైన కారులో జూబ్లీహిల్స్ ప్రాంతంలో తిరుగుతూ తనకు అనుకూలంగా ఏ ఇల్లు దొంగతనానికి సరిపోతుందో రెక్కీ నిర్వహించినట్లుగా చెప్పాడు. ఓ ఇంటిపైనుంచి మరో ఇంటిపైకి దూకుతూ.. ఓ ప్రముఖ నటుడి ఇంటి పరిసర ప్రాంతాల్లో చూడగా అక్కడ ఏ మాత్రం అనుకూలంగా లేకపోవడంతో ఎంపీ ఎమ్మెల్యే కాలనీలో ధృవ అనురాగ్రెడ్డి ఇంటిని లక్ష్యంగా చేసుకొని దొంగతనానికి పాల్పడినట్లు వెల్లడించాడు. అదే రోజు రాత్రి ముంభైలోని తన రెండో భార్య బార్ గర్ల్ గుల్షన్ ఇంటికి వెళ్లానని, మళ్లీ దొంగతనం చేయడానికి రెండు రోజుల క్రితం అదే హోటల్కు వచి్చనట్లు తెలిపాడు. ప్రముఖులు, బడాబాబులు నివసిస్తున్న జూబ్లీహిల్స్లోని దొంగతనాలు చేస్తుంటానని, సీసీ కెమెరాలకు చిక్కకుండా ఒక ఇంటిపై నుంచి మరో ఇంటిపైకి 15 నుంచి 20 ఇళ్ల పైకప్పులు దూకుతూ వెళ్తుంటానని చెప్పాడు. తాను చోరీ చేసిన సొత్తులో 50 శాతం పేదలకు ఆహారం, స్కూల్ ఫీజులు, దుస్తులు, ఆసుపత్రుల ఫీజులు కడుతుంటానని చెప్పాడు. అందుకే తనకు రాబిన్ హుడ్ పేరు వచ్చినట్లు వెల్లడించాడు. ఇప్పటికే ముగ్గురు భార్యలు.. మరో యువతితో ప్రేమాయణం చోరీ సొత్తుతో స్వగ్రామంలో వీధి దీపాలు ఏర్పాటు చేయడంతో ఉజ్వల్ అని పేరు పెట్టారని వెల్లడించారు. తన మొదటి భార్య పర్వీన్ బిహార్లో జెడ్పీ చైర్పర్సన్ అని.. రెండో భార్య ముంబైలో బార్గర్ల్ అని.. మూడో భార్య కోల్కతాలో ఉంటోందన్నాడు. ఇటీవలే పూజ అనే యువతితో ప్రేమలో పడ్డట్లు పోలీసులకు వెల్లడించాడు. నిందితుడిపై హైదరాబాద్లో నాలుగు కేసులు, బెంగళూరులో 7, న్యూఢిల్లీలో 4 కేసులు నమోదై ఉన్నాయి. ఇళ్ల తాళాలు పగులగొట్టి తనతో తీసుకెళ్లే స్రూ్కడ్రైవర్లు, రాడ్లతో అల్మారాలు తెరుస్తుంటాడని వాటిని స్వాదీనం చేసుకున్నట్లు జూబ్లీహిల్స్ డీఐ వీరశేఖర్ తెలిపారు. -
వెండితెరపై ‘టైగర్ నాగేశ్వరరావు’
ఉమ్మడి గుంటూరు జిల్లాలోని స్టువర్టుపురానికి చెందిన ఒకనాటి గజదొంగ టైగర్ నాగేశ్వరరావు. పెద్దలను కొట్టి పేదలకు పంచిన రాబిన్హుడ్గా ఫ్యాన్ పాలోయింగ్ కలిగిన నేరస్తుడు. పోలీసు అధికారులకు ముందుగా చెప్పి జైలు నుంచి తప్పించుకున్న ‘టైగర్’. పట్టుకోలేరంటూ సవాల్ చేసి మరీ నేరాలు చేసిన తెంపరి. పోలీస్ ఎన్కౌంటర్లో హతమయ్యాక వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అభిమాన జనంతో ఆయన అంతిమ యాత్రకు మూడు రోజులు పట్టింది. మృతి చెందిన 43 ఏళ్లకు నాగేశ్వరరావు జీవిత కథ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. గజదొంగ హీరోయిజమే ఈ పాన్ఇండియా సినిమాకు ప్రేరణ. ‘మాస్ మహరాజ్’ రవితేజ ఈ చిత్ర హీరో. గుంటూరు డెస్క్ : విజయవాడ– చైన్నె రైలు మార్గంలో బాపట్ల సమీపంలో ఉంటుంది స్టువర్టుపురం. 1874 సెటిల్మెంట్ చట్టం ప్రకారం ఏర్పడిన గ్రామం. వివిధ ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడేవారిని, ఇతర నేరస్తులను గుర్తించి నిఘా ఉంచేందుకని ఇక్కడ నివాసం కల్పించారు. అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీ హోం సభ్యుడు హెరాల్డ్ స్టువర్ట్ పేరుతో గ్రామానికి నామకరణం చేశారు. నేరాల్లో ఆరితేరిన వారు ముఠాలుగా వివిధ రాష్ట్రాల్లో దోపిడీ, దొంగతనాలకు పాల్పడేవారు. స్టువర్టుపురం దొంగలంటేనే జనంలో ఒకరకమైన భీతి ఉండేది. టైగర్ నాగేశ్వరరావు తెర పైకి వచ్చాక ఆ గ్రామం పేరు మరింతగా కలకలం రేపింది. తోటి దొంగలకు హీరోగా, పేదలకు ఆపద్బాంధవుడిగా, పోలీసులకు కొరకరాని కొయ్యగా తయారయ్యాడు. దొంగతనాలు వారసత్వంగా కలిగిన కుటుంబంలో ఇద్దరు అన్నల తర్వాత గరిక నాగేశ్వరరావు జన్మించాడు. జనన సంవత్సరం 1953–56 మధ్య. సోదరులు ప్రసాద్, ప్రభాకర్. వీరి చిన్నతనంలోనే తల్లి చనిపోయింది. మరికొన్నేళ్లకు తండ్రినీ కోల్పోయారు. తండ్రి బాటలోనే దొంగతనాలు చేస్తున్న ప్రభాకర్ ఆచూకీ కోసం ప్రయత్నించి విఫలమైన పోలీసులు, సోదరుడైన నాగేశ్వరరావును తీసుకెళ్లి, తీవ్రంగా హింసించారు. ఏ నేరం చేయకుండానే పోలీసుల చిత్రహింసలు అనుభవించిన 15 ఏళ్ల నాగేశ్వరరావు తండ్రి, అన్న బాటలోనే నేరస్తుల జత కట్టాడు. 1970లో తమిళనాడు వెళ్లి మారుపేర్లతో నివాసముంటూ దొంగతనాలు ఆరంభించాడు. అన్న ప్రభాకర్ జైలు నుంచి విడుదలై వచ్చాక అతడి ముఠాలో పని చేయసాగాడు. ‘ఆంధ్రా టైగర్రా’... ఒక పర్యాయం తమిళనాడు పోలీసులు అన్నదమ్ములను అరెస్టు చేశారు. తిరువాళ్లూరు జైలులో ఉన్న నాగేశ్వరరావును అప్పటి ఐజీ అరుళ్ విచారించారు. తనను చిత్రహింసలు పెడితే రెండు రోజుల్లో జైలు నుంచి పారిపోతానని నాగేశ్వరరావు ఐజీతో స్పష్టంగా చెప్పాడు. అన్న వద్దని చెప్పినా వినకుండా, సబ్జైలు నుంచి పోలీసులను కొట్టి మరీ పరారయ్యాడు. తనను వెతుక్కుంటూ స్టువర్టుపురం వచ్చిన పోలీసులనూ కొట్టాడు. ‘వచ్చే నెలలో మద్రాస్ సిటీలోనే నేరం చేస్తాను... దమ్ముంటే పట్టుకోమను’ అంటూ వారిని పంపేశాడు. అన్నట్టుగానే మద్రాస్ సిటీలో వరుసగా మూడు నెలలు దొంగతనాలు చేసి పోలీసులను ముప్పుతిప్పలు పెట్టాడు. విసుగెత్తిపోయిన ఐజీ అరుళ్ నిజంగా వాడు ‘ఆంధ్రా టైగర్రా’ అన్నాడు. అప్పట్నుంచి నాగేశ్వరరావు ఇంటి పేరు టైగర్ అయింది. ఏపీ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో 15 ఏళ్లపాటు దొంగతనాలు, దోపిడీలకు పాల్పడిన టైగర్ నాగేశ్వరరావు పోలీసులకు సింహస్వప్నంగా మారాడు. 1974లో జరిగిన బనగానపల్లె బ్యాంకు దోపిడీ అందులో ఒకటి. పోలీస్స్టేషనుకు అత్యంత సమీపంలో ఉండే బ్యాంకును నాగేశ్వరరావు ముఠా కొల్లగొట్టింది. సేఫ్ను పగులగొట్టి వెంట తీసుకెళ్లారు. గ్రామాన్ని చుట్టుముట్టిన పోలీసులకు ప్రభాకరరావు దొరికాడు మినహా నాగేశ్వరరావు ఆచూకీ దొరకలేదు. ఒక బిస్కట్ కంపెనీ అధినేత, అప్పటి హోంశాఖ సహాయమంత్రి వియ్యంకుడి కుటుంబాన్ని దారికాచి దోచారు. పట్టుకునేందుకు పోలీసుల వ్యూహం ... తలనొప్పిగా మారిన నాగేశ్వరరావును ఎలాగైనా మట్టుపెట్టాలని పోలీస్ శాఖలోని కొందరు అధికారులు సిద్ధమయ్యారు. మరొక దొంగ ఇచ్చిన సమాచారంతో నాగేశ్వరరావు తరచూ ఒక మహిళ ఇంటికి వచ్చి వెళుతుంటాడని తెలుసుకున్నారు. డబ్బాశ చూపారు. పాలల్లో మత్తుమందు కలిపి, తమకు సంకేతం ఇవ్వాలని, లేకుంటే తనను చంపేస్తామని బెదిరించారు. భయపడిపోయిన ఆ మహిళ తర్వాత నాలుగు రోజులకు 1980 మార్చి 24న తెల్లవారుజామున ఇంటికి వచ్చిన నాగేశ్వరరావుకు పోలీసులు చెప్పినట్టే మత్తుమందు కలిపిన పాలు తాగించింది. మత్తులో నిద్రపోతున్న అతడిపై పోలీసు అధికారి తుపాకీ కాల్పులు జరిపాడు. ఎన్కౌంటరులో హతమైనట్టు ప్రకటించారు. శవపరీక్ష నిమిత్తం చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ్నుంచి ఆరంభమైన అంతిమయాత్ర స్టువర్టుపురం కాలనీకి చేరేందుకు మూడురోజులు పట్టిందట! మూడు రాష్ట్రాల్నుంచి ఎందరో అభిమానులు ఆ యాత్రలో పాల్గొన్నారు. చదువులు, వైద్యం, పెళ్లిళ్లకు సాయం ... ఇన్ని దొంగతనాలు, దోపిడీలు చేసినా నాగేశ్వరరావు మిగుల్చుకుంది ఏమీ లేదంటారు. పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు చీరాల, చుట్టుపక్కల పల్లెల్లోనే తలదాచుకునే వాడు. ఆశ్రయం ఇచ్చినవారికి, సహాయం కోరిన ఇతరులకు ఆర్థిక సహాయం చేసేవాడు. ముఖ్యంగా పిల్లల చదువులు, వైద్యం, పెళ్లిళ్లకు తప్పకుండా సాయం చేసేవాడు. పొగాకు కంపెనీ యజమాని అరాచకంపై మహిళల్ని పోరుబాటకు సిద్ధం చేయటమే కాదు... అతడికి వత్తాసుగా వచ్చిన ఎస్ఐపైనా మహిళలతో దాడి చేయించాడు. మహిళలంటే గౌరవం... మేం ఒకప్పుడు దొంగతనాలు చేసినా, మహిళలంటే మాకెంతో గౌరవం...ఒంటరిగా ఉన్నా బంగారం, డబ్బు దోచుకునేవాళ్లం మినహా ఎలాంటి అకృత్యాలకు పాల్పడేవాళ్లం కాదు... నేటికాలంలో ఆడవాళ్లపై జరుగుతున్న ఘోరాలు వింటుంటే బాధ కలుగుతోంది. నా సోదరుడు నాగేశ్వరరావు ఆర్థికసాయం కూడా చేసేవాడు. సినిమా తీస్తున్నారు. నన్ను కూడా వివరాలు అడిగారు. – గరిక ప్రభాకరరావు, నాగేశ్వరరావు సోదరుడు సుదీర్ఘ పరిశోధన చేశాం... ‘దొంగాట’ సినిమా చేసేటపుడు ఒక పెద్దాయన ద్వారా టైగర్ నాగేశ్వరరావు గురించి తెలిసింది. దొంగైనా అతడు రాబిన్హుడ్ అని చెప్పటంతో ఆసక్తి కలిగింది. వైవిధ్యమైన సినిమాలు, అందులోనూ ఏదైనా బయోపిక్ కూడా తీయాలనుకున్న నాకు, అతడి జీవితంలోని కమర్షియల్ ఎలిమెంట్ నచ్చింది. అప్పట్నుంచి పరిశోధన మొదలైంది. ఎన్నో ఆసక్తిదాయకమైన అంశాలతో సినిమా తీస్తున్నాం. – వంశీకృష్ణ, సినీదర్శకుడు -
ఉద్యోగులకు భారీ షాక్, వందల మంది తొలగింపు!
ఆర్ధిక మాద్యం దెబ్బకు మరో సంస్థ వందలాది ఉద్యోగులపై వేటు వేసింది. సిలికాన్ వ్యాలీకి చెందిన ఆన్ లైన్ ట్రేడింగ్ యాప్ రాబిన్ హుడ్ 23 శాతం ఉద్యోగుల్ని తొలగించింది. ఇప్పుడు 23శాతం మంది ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపగా.. మూడునెలల ముందు 9శాతం వర్క్ ఫోర్స్ను తగ్గించింది ఉక్రెయిన్పై రష్యా యుద్ధం, ఆర్ధిక మాద్యంతో పాటు ఇతర కారణాలతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంస్థలు అప్రమత్తమవుతున్నాయి. ఖర్చులు తగ్గించుకునేందుకు ఉద్యోగుల్ని తొలగించడం, నియామకాల్ని నిలిపివేడయం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఫిన్ టెక్ కంపెనీ రాబిన్ హుడ్ 713 మంది ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపింది. 2,400మంది ఆ సంస్థ నుంచి బయటకు వచ్చినట్లు ట్రెక్ క్రంచ్ నివేదించింది. ఈ సందర్భంగా రాబిన్ హుడ్ సీఈవో అండ్ కో-ఫౌండర్ వ్లాడ్ టెనెవ్ మాట్లాడుతూ..కంపెనీ పునర్నిర్మించాలని భావిస్తున్నాం. అందుకే మా వర్క్ ఫోర్స్ను సుమారు 23 శాతం తగ్గించుకుంటున్నాం. తద్వారా సంస్థ ఆపరేషన్స్, మార్కెటింగ్, ప్రోగ్రామింగ్ వంటి ఇతర కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం చూపనుందని అన్నారు. తొలగించిన వారి స్థానాల్లో కొత్తవారిని నియమించుకుంటాం. వారితో కార్యకలాపాల్ని ముమ్మరం చేస్తాం. ఆ బాధ్యత తనపై ఉంటుందని వ్యాఖ్యానించారు. క్యూ2 ఎఫెక్ట్ ఇటీవల ఫిన్టెక్ సంస్థ రాబిన్ హుడ్ వార్షిక ఫలితాల్ని విడుదల చేసింది. ఈ ఫలితాల్లో నెట్ రెవెన్యూ 318 మిలియన్ డాలర్లు ఉండగా 295 మిలియన్ డాలర్లు నష్టపోయినట్లు తెలిపింది. అదే సమయంలో క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ నియమాల్ని రాబిన్ హుడ్ ఉల్లంఘించిందంటూ న్యూయార్క్ ఫైనాన్షియల్ రెగ్యులరేటర్ 30మిలియన్ల ఫైన్ విధించింది. వెరసీ ఈ ఆర్ధిక సమస్యల నుంచి గట్టెక్కేందుకే సంస్థ సీఈవో వ్లాడ్ టెనెవ్ ఉద్యోగుల్ని తొలగించారంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. -
రాబిన్హుడ్ గర్ల్
గూగుల్ కంటే పదిహేనేళ్లు వెనకొచ్చిన కంపెనీ రాబిన్హుడ్. అయితే గూగుల్లో పన్నెండేళ్లు పని చేసిన అపర్ణ.. గూగుల్ని వదిలి, రాబిన్హుడ్లో చేరారు. స్టాక్ ట్రేడింగ్లను జరుపుతుండే రాబిన్హుడ్ తొలి చీఫ్ ప్రాడక్ట్ ఆఫీసర్గా (సి.పి.వో) గురువారం బాధ్యతలు చేపట్టారు. రాబిన్ హుడ్లో ఇంతవరకు సి.పి.వో పోస్టు లేదు. ఇలాంటి పోస్ట్ ఒకటి ఉండాలని ఉండాలని అనుకున్నాక రాబిన్ హుడ్కు అపర్ణ తప్ప మరొకరు కనిపించలేదు. రాబిన్హుడ్ ఎంపిక చేసుకుంది కనుక ఆమెను రాబిన్హుడ్ గర్ల్ అనొచ్చు. అపర్ణ పూర్తి పేరు అపర్ణ చెన్నాప్రగడ. అయితే ఆమె పూర్తి ప్రొఫైల్ గురించి చెప్పడం, పేరు చెప్పుకున్నంత సులభమైతే కాదు! టెక్ ఇండస్ట్రీలో ఆమెకు ఇరవై ఏళ్ల అనుభవం ఉంది. ప్రాడక్ట్ను డెవలప్ చెయ్యడం, డిజైన్ చెయ్యడం, వ్యూహరచన ఆమె పనులు. గూగుల్లో ప్రాజెక్ట్ మేనేజర్గా వివిధ నాయకత్వ స్థాయిలలో పని చేశారు. అపర్ణ మద్రాస్ ఐ.ఐ.టిలో (1993–97) చదివారు. యూఎస్లోని మాసచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. అంత చదివారంటే అంతకు అంతా నైపుణ్యాలను ఆమె తను పనిచేసిన కంపెనీలకు అందించకుండా ఉంటారా! రాబిన్హుడ్ ఇప్పుడు అపర్ణను సి.పి.వో.గా నియమించుకోడానికి కూడా పూర్తిగా ఆమె ప్రతిభా సామర్థ్యాలే కారణం. శాన్ఫ్రాన్సిస్కోలోని బే ఏరియాలో ఉంటున్న అపర్ణ.. టెక్నాలజీ రంగంలోకి వెళ్లడానికి తల్లే తనకు ప్రేరణ, ప్రోత్సాహం అని అంటున్నారు. -
ఫ్లాప్ డైరెక్టర్లకు చాన్స్ ఇస్తున్నాడట..!
బెంగాళ్ టైగర్ సినిమాతో డిసెంట్ హిట్ సాధించిన మాస్ మహరాజ రవితేజ, ఆ తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. చక్రి అనే కొత్త దర్శకుడితో రాబిన్ హుడ్ సినిమాను ప్రకటించిన రవితేజ, ఇంతవరకు ఆ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లలేదు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభిస్తారన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సినిమా ఇంకా ప్రీ ప్రొడక్షన్ దశలో ఉండగానే మరో రెండు సినిమాలకు ఓకె చెప్పాడు రవితేజ. సర్దార్ గబ్బర్సింగ్ సినిమాతో నిరాశపరిచిన దర్శకుడు బాబీతో సినిమా చేయడానికి అంగీకరించాడు మాస్ మహరాజ. తనకు పవర్ లాంటి హిట్ సినిమా అందించిన బాబీతో మరొక సారి కలిసి పనిచేసేందుకు రెడీ అవుతున్నాడు. అంతేకాదు గతంలో రవితేజ హీరోగా వీర అనే డిజాస్టర్ను తెరకెక్కించిన రమేష్ వర్మకు కూడా రవితేజ మరో చాన్స్ ఇస్తున్నాడట. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమాపై కూడా త్వరలోనే క్లారిటీ రానుంది. -
మాస్ మహరాజ ఎప్పుడు మొదలెడతాడో..?
మాస్ మహరాజ రవితేజ హీరోగా తెరకెక్కిన బెంగాల్ టైగర్ విడుదలై చాలాకాలమే అవుతోంది.ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే రాబిన్ హుడ్ సినిమాను ప్రకటించిన రవితేజ, ఇంతవరకు ఆ సినిమాను స్టార్ట్ చేయలేదు. బెంగాల్ టైగర్ డీసెంట్ కలెక్షన్లతో హిట్ టాక్ తెచ్చుకున్నా.. రవితేజ నెక్ట్స్ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. కొంతకాలంగా భారీ హిట్స్ ఇవ్వటంలో ఫెయిల్ అవుతున్న రవితేజ, తన రేంజ్ మాస్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. అందుకే ఓ పక్కా మాస్ కథతో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. కొత్త దర్శకుడు చక్రి దర్శకత్వంలో రాబిన్ హుడ్ సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించిన రవితేజ, జూలైలోనే ఈ సినిమాను ప్రారంభించాలని భావించాడు. అయితే కథా కథనాల విషయంలో ఇంకా పూర్తి నమ్మకం రాకపోవటంతో ఇప్పటికీ ప్రీ ప్రొడక్షన్ పనుల్లోనే ఉంది ఈ సినిమా. తను చేయబోయే నెక్ట్స్ సినిమా రాబిన్ హుడ్ అంటూ క్లారిటీ ఇచ్చిన రవితేజ, ఆ సినిమాను ఎప్పుడు సెట్స్ మీదకు తీసుకెళ్లేది మాత్రం చెప్పలేకపోతున్నాడు. -
అలాంటి సినిమాలు...హిందీలో చేస్తా!
చంటిగాడు లోకల్... నేను కాలు పెడితే మీ దరిద్రం దూల తీరిపోద్ది... వంటి డైలాగులు థియేటర్లో వినపడితే మాస్ ప్రేక్షకుల సందడికి కొదవ ఉండదు. చప్పట్లు, విజిల్స్ హోరుతో హాలు మార్మోగిపోతుంది. ఆ రేంజ్లో మాస్ని ఆకట్టుకునే ఏ ఆర్టిస్ట్కైనా తిరుగుండదు. అందుకే మాస్లో రవితేజ తిరుగులేదనిపించుకున్నారు. వెరైటీ స్టైల్లో డైలాగులు చెప్పడం, వెరైటీ బాడీ లాంగ్వేజ్తో ఆకట్టుకోవడం రవితేజకు బాగా తెలుసు. ఇంతకీ ఈ హీరోగారు ఇప్పుడేం చేస్తున్నారు? నూతన దర్శకుడు చక్రి దర్శకత్వంలో ‘రాబిన్హుడ్’ అనే సినిమాతో రెడీ అవుతున్నారు. తెలుగులో రకరకాల పాత్రలు చేసి, మెప్పించిన రవితేజకు వేరే భాషలో సినిమా చేసే ఉద్దేశం లేదా? ‘బాహుబలి’ ద్వారా ప్రభాస్, ‘సర్దార్ గబ్బర్సింగ్’తో పవన్ కల్యాణ్ పరిచయమైనట్లు హిందీ తెరకు పరిచయం కావాలని అనుకోవడం లేదా? అసలు హిందీలో స్ట్రయిట్ సినిమాకి అవకాశం వస్తే చేస్తారా? ‘చేస్తా’ అంటున్నారు రవితేజ. అయితే ఇప్పటివరకూ తెలుగులో చేసిన చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉండే పాత్రలైతేనే హిందీ చిత్రాలు చేస్తానని రవితేజ పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ మధ్య విడుదలైన ‘కీ అండ్ కా’, ‘కపూర్ అండ్ సన్స్’ వంటి సినిమాలైతేనే హిందీకి ‘సై’ అంటానని స్పష్టం చేశారు. తెలుగులో చేసినట్లుగానే రెగ్యులర్ యాక్షన్, కామెడీ మూవీస్ చేయాల్సి వస్తే... అదేదో ఇక్కడే చేయొచ్చు కానీ, ఇలాంటి చిత్రాలే చేయడానికి హిందీ రంగానికి వెళ్లాల్సిన అవసరం లేదని కూడా అన్నారు. సో.. హిందీలో వెరైటీ సబ్జెక్ట్తో ఎవరైనా మాస్ మహరాజ్ని సంప్రతిస్తే.. హిందీకి ఎగరేసుకు పోవచ్చన్న మాట! -
టాలీవుడ్ 'రాబిన్హుడ్'
-
టాలీవుడ్ 'రాబిన్హుడ్'
బెంగాల్ టైగర్ సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన రవితేజ వరుస సినిమాలకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం వేణు శ్రీరామ్ అనే కొత్త దర్శకుడితో 'ఎవడో ఒకడు' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఇంకా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ దశలోనే ఉంది. ఎవడో ఒకడు సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను రెడీ చేస్తున్నాడు రవితేజ. తన మార్క్ మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఓ ఇంట్రస్టింగ్ టైటిల్ను ఫిక్స్ చేశాడు. కిక్ 2 సినిమాలో రవితేజ క్యారెక్టర్ పేరు రాబిన్ హుడ్. ఇప్పుడు ఇదే పేరును తన నెక్ట్స్ సినిమాకు టైటిల్గా ఫైనల్ చేశాడు రవితేజ. చక్రి అనే కొత్త దర్శకుడితో ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు రవితేజ. ప్రస్తుతం కథ చర్చలు జరుగుతున్న ఈ సినిమాను ఎవడో ఒకడు పూర్తి కాగానే సెట్స్ మీదకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. బెంగాల్ టైగర్ సినిమాతో కలెక్షన్లపరంగా పరవాలేదనిపించిన మాస్ మహరాజ్, తరువాత చేయబోయే సినిమాలతో అయినా సూపర్ హిట్ కొడతాడేమో చూడాలి. -
రాబిన్ హుడ్ కాదు...రాబింగ్ హుడ్...
-
రాబిన్ హుడ్ కాదు...రాబింగ్ హుడ్...
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం రాబింగ్ హుడ్లా వ్యవహరిస్తోందని ఆళ్లగడ్డ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ వ్యాఖ్యానించారు. ఆమె గురువారం అసెంబ్లీలో డీజిల్, పెట్రోల్పై వ్యాట్ పెంపు గురించి మాట్లాడారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గినప్పటికీ రాష్ట్రప్రభుత్వం వ్యాట్ విధించడం సామాన్యులపై పెనుభారం పడుతోందన్నారు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా వ్యాట్ విధిస్తున్నారని అన్నారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్య ప్రజలు నుంచి రైతులు వరకూ ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ సందర్భంగా రాబిన్ హుడ్ ఉదంతాన్నిను అఖిలప్రియ సభలో ప్రస్తావించారు. రాబిన్ హుడ్ ధనవంతులను దోచుకొని...ఆ సంపదను పేదలకు పంచితే... రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పేదలను దోచుకుని... ఆ సందపను సంపన్నులకు పెడుతోందని అన్నారు. సర్కార్ రాబింగ్ హుడ్ అని అఖిలప్రియ వ్యాఖ్యానించారు. ఓవైపు క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతుంటే...మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరగటం సరికాదన్నారు. రైతులు ట్రాన్స్పోర్టు ఖర్చులను భరించలేకపోతున్నారు. ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన నిధులతో పాటు ప్రత్యేకహోదా కోసం అధికార, ప్రతిపక్షంతో పాటు స్పీకర్ సహా ...కేంద్రంపై ఒత్తిడి తెచ్చి సాధించుకుందామని అఖిలప్రియ కోరారు.