sanitary napkins
-
శానిటరీ ప్యాడ్ అడిగితే.. ఇంత దారుణమా! నెటిజన్ల ఆగ్రహం
పీరియడ్స్ లేదా ఋతుచక్రం అనేది మహిళలకు, ముఖ్యంగా చదువుకునే వయసులో ఆడపిల్లలకు ఎంత బాధాకరమో చాలా కొద్దిమందికే తెలుసు. ఆ నాలుగు రోజులు అనుభవించే శారీరక బాధలు కంటే.. సామాజికంగా అనుభించే క్షోభే దుర్భరమైంది. ఉత్తర ప్రదేశ్లో జరిగిన దారుణం ఈ విషయాన్నే మరోసారి గుర్తు చేసింది. 11 ఏళ్ల బాలికపట్ల అమానవీయంగా వ్యవహరించిన ఘటన విమర్శలకు దారితీసింది.ఉత్తరప్రదేశ్లోని బాలికల పాఠశాలలో 11వ తరగతి చదువుతున్న విద్యార్థి ఎంతో ఉత్కంఠతో పరీక్ష రాయడానికి వచ్చింది. సరిగ్గా ఈ సమయంలోనే ఆమెకు పీరియడ్స్ స్టార్ట్ అయింది. (చాలా మంది అమ్మాయిలకు ఇలాంటి సమస్య ఎదురౌతుంది. పరీక్ల ఒత్తిడి వల్ల రావాల్సిన సమయం కంటే ముందే మెన్సస్ సైకిల్ మొదలువుతుంది. ఈ సమయంలో వారు పడే కష్టాలువేదన వర్ణనాతీతం) టైం కంటే ముందే రావడంతో ప్రిపేర్డ్గాలేని బాలిక శానిటరీ ప్యాడ్కోసం ప్రిన్సిపాల్ను అడిగింది. సానుభూతి చూపించి సహాయం చేయడానికి బదులుగా ఆమేదో పెద్ద నేరంచేసినట్టు వ్యవహరించారు. దాదాపు గంటపాటు క్లాస్ రూం వెలుపల నిలబెట్టేశారు. శనివారం చోటు చేసుకున్న ఈ అమానుష ఘటనపై నెట్టింట తీవ్ర ఆగ్రహం వ్యక్తమౌతోంది.ఒక పక్క పీరియడ్స్..కాళ్లు, నడుము నొప్పితోపాటు రక్త స్రావం పెరుగుతూ ఉంటుంది. ఈ బాధలకంటే. దుస్తులకు ఎక్కడ రక్తపు మరకలు అంటు కుంటాయో అన్న బెంగ, భయం. ఇవన్నీ ఇలా ఉంటే.. గంటసేపు బయటనిలబెట్టడంతో అవమాన భారంతో ఆ బాలిక ఎంత వేదన పడి ఉంటుందో అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.మరోవైపు బాలిక తండ్రి ఫిర్యాదుతో సంఘటనపై అధికారిక విచారణ జరుగుతోంది.జిల్లా మేజిస్ట్రేట్, డిస్ట్రిక్ట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ (DIOS), రాష్ట్ర మహిళా కమిషన్ , మహిళా సంక్షేమ శాఖకు అధికారికంగా ఆయన ఫిర్యాదు చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. విచారణ జరుగుతోందని జిల్లా ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ దేవ్కీ నందన్ ధృవీకరించారు. విచారణ అనంతరం, వాస్తవాల ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. చదవండి: చదివింది 10వ తరగతే..ముగ్గురు పిల్లలు : అట్టడుగు స్థాయినుంచి వ్యాపారవేత్తగాచాలా కాస్ట్లీ గురూ! ఉప్పు పేరు చెబితేనే గూబ గుయ్య్..! -
శానిటరీ నాప్కిన్ల పంపిణీలో ఏపీ అగ్రగామి
సాక్షి, అమరావతి: ఆడబిడ్డల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ వారిపట్ల సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కనబరుస్తున్న ప్రత్యేక శ్రద్ధ ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. మెన్స్ట్రువల్ హైజీన్ (నెలసరి పరిశుభ్రత) కార్యక్రమం అమలులో ఏపీ దేశంలోనే అగ్రగామిగా ఉంటోంది. ఈ అంశాన్ని ఇటీవల కేంద్ర ఆరోగ్య శాఖ లోక్సభలో వెల్లడించింది. నెలసరి సమయంలో స్కూళ్లు, కాలేజీల్లో చదివే విద్యార్థినులు పడే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ‘స్వేచ్ఛ’ కార్యక్రమం ద్వారా శానిటరీ నాప్కిన్లను ఉచితంగా పంపిణీ చేస్తోంది. ఇలా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబరు మధ్య 72.59 లక్షల నాప్కిన్లను పంపిణీ చేసి పశ్చిమ బెంగాల్ మొదటి స్థానంలో ఉండగా.. 59,63,209 శానిటరీ నాప్కిన్ల పంపిణీతో ఏపీ రెండో స్థానంలో ఉంది. అనంతరం.. 45.86 లక్షలతో తమిళనాడు మూడో స్థానంలో నిలిచింది. ఇక కేరళలో 80,166, కర్ణాటకలో కేవలం 5,613, తెలంగాణలో 3,920 మాత్రమే పంపిణీ చేశారు. కేటాయించిన నిధుల ఖర్చులో నెంబర్ వన్.. ఇక నెలసరి పరిశుభ్రత కార్యక్రమాలు అమలుచేయడం ద్వారా భవిష్యత్తులో బాలికలు అనారోగ్య సమస్యల బారినపడకుండా నియంత్రించేందుకు కేటాయించిన నిధులను ఖర్చుచేయడంలో ఏపీ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉంది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.200 కోట్ల మేర నిధులు కేటాయించడమే కాకుండా దేశంలోనే అత్యధికంగా వంద శాతం నిధులను ఖర్చుచేసింది. పశ్చిమ బెంగాల్లో రూ.389 కోట్లు కేటాయించగా కేవలం రూ.9.32 కోట్లు, తెలంగాణాలో రూ.303 కోట్లు కేటాయించినప్పటికీ రూ.4 లక్షలు మాత్రమే ఖర్చుచేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రతీనెలా 10 లక్షల మంది బాలికలకు.. నెలసరి ఇబ్బందులతో బాలికలు విద్యకు దూరమవుతున్న పరిస్థితులను సీఎం జగన్ ప్రభుత్వం గుర్తించింది. దేశంలో దాదాపు 23 శాతం బాలికల చదువులు ఆగిపోవడానికి ప్రధాన కారణం నెలసరి సమయంలో ఎదురవుతున్న ఇబ్బందులేనని యునైటెడ్ నేషన్స్ వాటర్ సఫ్లై అండ్ శానిటేషన్ కొలాబరేటివ్ కౌన్సిల్ నివేదికల్లో వెల్లడించారు. ఈ తరహా డ్రాపౌట్స్ను తగ్గించడంతో పాటు, బాలికలకు మెరుగైన ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా స్వేచ్ఛ కార్యక్రమాన్ని 2021లో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ కార్యక్రమం కింద ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో ఏడు నుంచి ఇంటర్మిడియట్ చదువుతున్న 10 లక్షల మంది బాలికలకు ప్రతినెలా ఒకొక్కరికి 10 చొప్పున నాణ్యమైన, బ్రాండెడ్ శానిటరీ నాప్కిన్లను ఉచితంగా అందిస్తున్నారు. ఇందుకోసం ఏటా ప్రభుత్వం రూ.30 కోట్ల మేర ఖర్చుచేస్తోంది. ప్రత్యేకంగా స్నేహపూర్వక కౌమార దశ క్లినిక్లు.. ఇక కౌమార దశలో బాలబాలికలకు ఎదురయ్యే ఆరోగ్య సమస్యల నివృత్తికి, వారికి వైద్యసేవలు అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రత్యేకంగా స్నేహపూర్వక కౌమార క్లినిక్లు నిర్వహిస్తున్నారు. క్లినిక్లలో సేవలు అందించే వైద్యులు.. కౌమార దశ పిల్లలపట్ల ఏ విధంగా వ్యవహరించాలి.. తదితర అంశాలపై సిబ్బందికి ప్రత్యేక శిక్షణనిచ్చారు. అంతేకాక.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఫ్యామిలీ డాక్టర్ విధానంలో గ్రామాలకు వెళ్లిన డాక్టర్లు మధ్యాహ్నం నుంచి పాఠశాలలు సందర్శించి అక్కడి బాలికల ఆరోగ్యంపై వాకబు చేస్తున్నారు. ఎదుగుతున్న సమయంలో శరీరంలో వచ్చే మార్పుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మహిళా ఉపాధ్యాయులు, మహిళా అధ్యాపకులు, గ్రామ సచివాలయాల్లోని ఏఎన్ఎంలు ద్వారా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. అపరిశుభ్ర పద్ధతులతో సమస్యలు.. ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థినుల్లో చాలావరకు మధ్యతరగతి, పేద కుటుంబాల వారుంటారు. వీరికి శానిటరీ నాప్కిన్లు కొనే ఆర్థిక స్థోమత ఉండదు. దీంతో.. ► నెలసరి సమయంలో వస్త్రాన్ని వాడే విధానాన్ని అపరిశుభ్ర పద్ధతిగా వైద్యులు చెబుతారు. ఇలా వాడటంతో రీప్రొడక్టివ్ ట్రాక్ట్ ఇన్ఫెక్ఫన్లు (జననాంగం సంబంధిత ఇన్ఫెక్షన్లు–ఆర్టీఐ) వస్తాయి. ► అలాగే.. సాధారణంగా జననాంగంలో రక్షణకు అవసరమైన హైడ్రోజన్ పెరాక్సైడ్ను స్రవించే లాక్టోబాసిల్లై అనే మంచి బ్యాక్టీరియాతో పాటు కొద్ది మోతాదులో వేరే బ్యాక్టీరియా కూడా ఉంటుంది. వస్త్రం వంటి అపరిశుభ్రమైన పద్ధతులతో జననాంగం సంబంధిత ఇన్ఫెక్షన్ల ముప్పు ఏర్పడిన తర్వాత కాలంలో సంతానలేమి, శృంగారంతో ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ వ్యాధులొస్తాయి. ► అంతేకాదు.. హానికరమైన బ్యాక్టీరియాతో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వస్తుంది. భవిష్యత్లో సంతానలేమి సమస్యలూ తలెత్తుతాయి. -
ఇది మూణ్ణాళ్ళ కథ కాదు!
ప్రజల ఆరోగ్యం విషయంలోనూ పాలకులకు న్యాయస్థానాలు గడువు విధించాల్సి రావడం విచిత్రమే. అయితే, ఇప్పటికే అదే పనిలో ప్రభుత్వముంటే, త్వరితగతిన పనులు జరగడానికి ఈ గడువు విధింపు తోడ్పడుతుందనడంలో సందేహం లేదు. శానిటరీ న్యాప్కిన్ల పంపిణీపై దృష్టి పెడుతూ, జాతీయ స్థాయిలో ‘వాంఛనీయ’ ఋతుస్రావ కాల ఆరోగ్య విధానాన్ని 4 వారాల్లో ఖరారు చేయాలంటూ సుప్రీమ్ కోర్ట్ గత సోమవారం అన్నమాట అలాంటిదే. ప్రభుత్వ ఎయిడెడ్, రెసిడెన్షియల్ పాఠశాలల్లో సగటున ఎంతమంది ఆడపిల్లలకు ఎన్ని మరుగుదొడ్లు ఉండాలన్న దానిపైనా జాతీయ స్థాయిలో ఒక మోడల్ను నిర్ణయించాల్సిందిగా కోర్ట్ ఆదేశించింది.దాదాపు 37.5 కోట్ల మంది ఋతుస్రావ వయసువారున్న దేశంలో... 2011 నుంచి పెండింగ్లో ఉన్న కేసులో... దేశ ప్రధాన న్యాయమూర్తి సారథ్యంలోని ధర్మాసనం ఇచ్చిన ఈ ఆదేశం మహిళా లోకానికి కొంత ఊరట. ఋతుస్రావ ఆరోగ్య ప్రాధాన్యాన్ని కోర్ట్ గుర్తించడం, ప్రస్తావించడం ఇదేమీ మొదటిసారి కాదు. గతంలో అనేకసార్లు ఆ పని చేసింది. పట్టని ప్రభుత్వాలకు అక్షింతలు వేసింది. ఏడు నెలల క్రితం ఏప్రిల్లో కూడా ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యంలో స్పందిస్తూ, ఋతుకాలపు ఆరోగ్యంపై ఏకరూప జాతీయ విధాన రూపకల్పనకు కేంద్రాన్ని సుప్రీమ్ ఆదేశించింది. తాజాగా, కోర్ట్లో ప్రభుత్వ వకీలు పేర్కొన్నట్టు జాతీయ విధానం ముసాయిదాను కేంద్రం ఇటీవలే ఆన్లైన్లో పెట్టింది. సామాన్య ప్రజల మొదలు నిపుణుల దాకా అందరి అభిప్రాయాలు కోరింది. తద్వారా ఋతుస్రావం పట్ల తరతరాలుగా మన దేశంలో నెలకొన్న అనేక అపోహలనూ, సవాళ్ళనూ నిర్వీర్యం చేయాలన్నది ప్రయత్నం. అర్ధంతరంగా బడి చదువు మానేయడం సహా అనేక సమస్యలకు కారణమవుతున్న ఈ ఆరోగ్య అంశం పట్ల దృష్టి పెట్టడానికి స్వతంత్ర దేశంలో ఏడున్నర దశాబ్దాలు పట్టింది. అలాగని అసలేమీ జరగలేదనలేం. కొన్నేళ్ళుగా ప్రపంచవ్యాప్తంగా ఋతుస్రావ కాల ఆరోగ్యం, పరిశుభ్రత (ఎంహెచ్హెచ్) పట్ల దృష్టి పెరుగుతోంది. భారత్లో సైతం ప్రజారోగ్య చర్చల్లో ఈ అంశాన్ని భాగం చేశారు. ‘జాతీయ ఆరోగ్య మిషన్ 2011’లో గ్రామీణ ప్రాంతాల్లోని కౌమార బాలికల్లో ఋతుస్రావ కాలపు ఆరోగ్య పథకాన్ని తీసుకొచ్చారు. స్వచ్ఛ భారత్ మిషన్లో దీన్ని చేర్చారు. కేంద్ర తాగునీటి, పారిశుద్ధ్య శాఖ సైతం 2015లోనే పాఠశాలలకు మార్గ దర్శకాలు జారీచేసింది. దాని ఫలితాలు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేల్లో కొంత కనిపించాయి. పీరియడ్స్ వేళ ఆరోగ్యకర మైన పద్ధతులను పాటించడమనేది మునుపటి సర్వేతో పోలిస్తే, అయిదో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో 15 నుంచి 24 ఏళ్ళ వయసు యువతుల్లో 20 శాతం పెరిగింది. ఇది కొంత సంతోషకరం. పైగా, ఐరాస పేర్కొన్న సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో ఎంహెచ్హెచ్ కూడా ఒకటనేది గమనార్హం. నిజానికి, ఆంధ్రప్రదేశ్లో ‘స్వేచ్ఛ’, కేరళలో ‘షీ ప్యాడ్’, రాజస్థాన్లో ‘ఉడాన్’ ఇలా రకరకాల పేర్లతో వివిధ రాష్ట్రాలు కౌమార బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్కిన్లను పంపిణీ చేస్తున్నాయి. దీర్ఘకాలిక వినియోగ నిమిత్తం కేరళ, కర్ణాటకలు న్యాప్కిన్లకు బదులు ఋతుస్రావ కప్స్ అందిస్తున్నాయి. అయితే, సమాజంలోని దురభిప్రాయాలను పొగొట్టడమనే సవాలు మిగిలే ఉంది. పన్నెండేళ్ళ సోదరి దుస్తుల మీద ఉన్న తొలి ఋతుస్రావ రక్తపు మరకలను చూసిన ఓ అన్నయ్య ఆమెను అనుమానించి, కొట్టి చంపిన ఘటన ఆ మధ్య మహారాష్ట్రలో జరిగింది. ఆడవారికే కాక, మగవారికి సైతం పీరియడ్స్ పట్ల అవగాహన పెంచాలంటున్నది అందుకే. ‘ఆ 3 రోజులు’ ఆడవారిని ప్రాథమిక వసతులైనా లేని గుడిసెల్లో విడిగా ఉంచే మహారాష్ట్ర తరహా అమానుష పద్ధతుల్ని మాన్పించడం లక్ష్యం కావాలి. ఋతుక్రమం అపవిత్రత కాదనీ, శారీరక జీవప్రక్రియనీ గుర్తెరిగేలా చేయాలి. తగిన ఎంహెచ్హెచ్ వసతులు లేకపోవడంతో ఏటా మన దేశంలో 2.3 కోట్ల మందికి పైగా బాలికలు అర్ధంతరంగా బడి చదువులు మానేస్తున్నట్టు సర్వేల మాట. సరిగ్గా చదువుకోని వారు ఋతుస్రావ ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపలేకపోతున్నారన్నది దాని పర్యవసానం. అంటే, ఇది ఒక విషవలయం. దీన్ని ఛేదించాలి. బడిలో వసతులు పెంచడంతో పాటు జాతీయ విధానం ద్వారా ఆరోగ్యంలో, సామాజిక అనాచారాలను మాన్పించడంలో టీచర్లు కీలక పాత్ర పోషించేలా తగిన శిక్షణనివ్వాలి. విధానాల నిర్ణయం, కార్యక్రమాల రూపకల్పనలో తరచూ ఓ పొరపాటు చేస్తుంటారు. యువతుల మీదే దృష్టి పెట్టి, ఋతుక్రమం ఆగిపోయిన లక్షలాది మహిళల ఆరోగ్యాన్ని విస్మరిస్తుంటారు. అది మారాలి. మెనోపాజ్ అనంతర ఆరోగ్యం, అపోహల నివృత్తిపైనా చైతన్యం తేవాలి. ఆరోగ్య కార్యకర్తలకు అందుకు తగ్గ శిక్షణనివ్వాలి. ప్యాడ్ల పంపిణీతో బాధ్యత ముగిసిందను కోకుండా సంక్లిష్ట సామాజిక అంశాలపై జనచైతన్యం ప్రధానాంశం కావాలి. ఇన్నేళ్ళకు ఒక జాతీయ విధానం తేవడం విప్లవాత్మకమే కానీ దానితో పని సగమే అయినట్టు! గ్రామప్రాంతాల్లోనూ అందరికీ అందుబాటు ధరలో న్యాప్కిన్లుండాలి. శుభ్రమైన మరుగుదొడ్లు, నీటి వసతి బడిలో భాగం కావాలి. ఆరోగ్యం, ఆచారం లాంటి అంశాల్లో తరతరాలుగా సమాజంలో నెలకొన్న అభిప్రాయాలను పోగొట్టడం సులభం కాకపోవచ్చు. కానీ, అందుకు ప్రయత్నించకపోతే నేరం, ఘోరం. ఋతుస్రావ ఆరోగ్యంపై చైతన్యం తేవడంలో భారత్ మరింత ముందడుగు వేసేందుకు సత్వర జాతీయ విధానం తోడ్పడితే మేలు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు సైతం ఏళ్ళు పూళ్ళు తీసుకొని, మరో అయిదేళ్ళ తర్వాత అమలు అంటున్న పాలక వర్గాలు ఆకాశంలో సగమనే ఆడవారి తాలూకు శారీరక, మానసిక ఆరోగ్యం గురించి వెంటనే పట్టించుకుంటే అదే పదివేలు. -
బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ
సాక్షి, అమరావతి/చిలకలూరిపేట: బాలికల ఆరోగ్యంపై తమ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో ముందుకు సాగుతోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. ప్రపంచ బాలికల దినోత్సవం సందర్భంగా ప్రముఖ అంతర్జాతీయ సంస్థ కింబెర్లీ– క్లార్క్ ఆధ్వర్యంలో కిశోర బాలికలకు మంగళవారం ఉచితంగా శానిటరీ నాప్కిన్స్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వైద్య, ఆరోగ్య శాఖ విజ్ఞప్తి మేరకు ఈ సంస్థ 2.33 లక్షల శానిటరీ నాప్కిన్లు, 297 కేసుల డైపర్స్ను తొలి విడతలో పేద విద్యార్థులు, చిన్నారులకు అందజేసేందుకు ముందుకొచ్చింది. కార్య్రకమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న ఏడో తరగతి నుంచి 12వ తరగతి లోపు ఆడపిల్లలకు స్వేచ్ఛ కార్యక్రమం కింద ప్రభుత్వం నెల నెలా 12 లక్షల శానిటరీ నాప్కిన్లను ఉచితంగా పంపిణీ చేస్తోందన్నారు. హెల్త్ రికార్డులన్నీ కంప్యూటర్లో నిక్షిప్తం రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలను కంప్యూటర్లలో నిక్షిప్తం చేస్తున్నామని మంత్రి రజిని చెప్పారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో బుధవారం జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరంలో ఆమె పాల్గొన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష పథకంలో భాగంగా వైద్యం పొందుతున్న అందరి ఆరోగ్య వివరాలను డిజిటలైజ్ చేస్తున్నట్లు తెలిపారు. 1.6 కోట్ల కుటుంబాలకు ఈ కార్యక్రమం ద్వారా వైద్య సేవలు అందించగలుగుతున్నామన్నారు. క్యాంపులకు హాజరైన వారిలో ఎవరికైనా మెరుగైన వైద్యం అవసరమైతే అలాంటి వారిని పెద్దాస్పత్రులకు సిఫారసు చేస్తున్నామని చెప్పారు. వ్యాధి నయం అయ్యేంతవరకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు చేపడుతోందన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయని, కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుండడాన్ని జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు అర్థంపర్థం లేని విమర్శలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీకి ప్రతి అంశంలోనూ బురదజల్లడమే పనిగా మారిందని మండిపడ్డారు. -
10 లక్షల మంది బాలికలకు ‘స్వేచ్ఛ’
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో చదువుతున్న బాలికలకు ‘స్వేచ్ఛ’ పథకం కింద శానిటరీ న్యాప్కిన్స్ పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నాలుగు నెలల కాలానికి గాను మొదటి విడతగా జూన్లో ప్యాడ్స్ అందించగా, రెండో విడత పంపిణీని అక్టోబర్ నెలలో ప్రారంభించనున్నారు. బాలికల స్కూల్ డ్రాప్ అవుట్కు కారణమవుతున్న రుతుక్రమ సమయంలో ఇబ్బందులను పరిష్కరించేందుకు 2020–21 విద్యా సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ‘స్వేచ్ఛ’ పథకాన్ని ప్రారంభించింది. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ఏడు నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న కిశోర బాలికలకు నెలకు 10 చొప్పున ఏడాదికి 120 శానిటరీ ప్యాడ్స్ను పంపిణీ చేస్తోంది. కౌమారదశలో ఉన్న బాలికలు రుతుస్రావం సమయంలో పాఠశాల, కాలేజీ మానేస్తున్నారు. దీంతో డ్రాప్ అవుట్స్ పెరుగుతున్నాయి. ఈ పరిస్థితిని నివారించడంతో పాటు రుతుక్రమం సమయంలో బాలికల వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ నాణ్యమైన(బ్రాండెడ్) శానిటరీ ప్యాడ్స్ను ప్రభుత్వమే రాష్ట్రంలో ప్రభుత్వ యాజమాన్యంలో నడుస్తున్న 10,144 పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లోని విద్యార్థినులకు అందిస్తోంది. గతంలో మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమం చేపట్టగా, ఈ ఏడాది నుంచి పాఠశాల విద్యాశాఖలోని మధ్యాహ్న భోజన విభాగానికి అప్పగించారు. వచ్చే నెలలో 4 కోట్ల ప్యాడ్స్ పంపిణీకి ఏర్పాట్లు దేశంలో 23 శాతం మంది విద్యార్థినులు బహిష్టు సమయంలో పాఠశాలలు, కళాశాలలకు దూరంగా ఉంటున్నారని అనేక నివేదికలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలో ఈ పరిస్థితిని నివారించేందుకు ప్రభుత్వం ‘స్వేచ్ఛ’ పథకాన్ని ప్రారంభించింది. రాష్ట్రంలోని 10,144 స్కూళ్లు, కాలేజీల్లో 7 నుంచి 12వ తరగతి చదువుతున్న 10 లక్షల మంది విద్యార్థినులకు ఒకొక్కరికి నెలకు 10 ప్యాడ్స్ చొప్పున ఏడాదికి 12 కోట్ల ప్యాడ్స్ను పంపిణీ చేస్తోంది. ఇందుకోసం ప్రభుత్వం ఈ ఏడాది రూ.35 కోట్ల నిధులను వెచ్చింది. ప్రతి నాలుగు నెలలకు ఒక పర్యాయం పంపిణీ కార్యక్రమం చేపడుతోంది. ఈ విద్యా సంవత్సరంలో సెపె్టంబర్ వరకు అవసరమైన ప్యాడ్స్ను జూన్ నెలలో అందించగా, రెండో విడత పంపిణీని అక్టోబర్లో ప్రారంభించనున్నారు. దీంతో రుతుక్రమంలో ఎదురయ్యే సమస్యలు, నివారణ చర్యలపై విద్యార్థినుల్లో అవగాహన కల్పించేందుకు ప్రతి పాఠశాలలోను నెలకు ఒకసారి మహిళా ఉపాధ్యాయులు, మహిళా పోలీసుల ద్వారా సదస్సులు నిర్వహిస్తున్నారు. వినియోగించిన ప్యాడ్స్ను పర్యావరణ హితంగా నాశనం చేసేందుకు ప్రత్యేక డస్ట్బిన్లు, యంత్రాలను కూడా అందుబాటులోకి తెచ్చారు. -
యూపీ స్కూల్ టీచర్
లక్నో: నిరుపేద యువతులు, మహిళల్లో రుతుస్రావంలో పరిశుభ్రతపై అవగాహన పెంచడానికి ఉత్తరప్రదేశ్లో ఒక స్కూలు టీచర్ వినూత్న ప్రయత్నం చేస్తున్నారు. తన సొంత డబ్బులతో ‘‘ప్యాడ్ బ్యాంక్’’ను ఏర్పాటు చేసి గ్రామంలో అమ్మాయిలకు శానిటరీ ప్యాడ్స్ వాడకాన్ని ప్రోత్సహిస్తున్నారు. బరేలి జిల్లా బొరియా బ్యాంకులో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పని చేస్తున్న రాఖీ గంగ్వార్ తమ ఊళ్లో యుక్త వయసుకి వచి్చన అమ్మాయిలు, మహిళలు రుతుస్రావం సమయంలో ఇంకా పాతకాలం పద్ధతుల్లో బట్టలనే వాడడం పట్ల ఆవేదనతో ఉండేవారు. వారిలో శానిటరీ ప్యాడ్స్పై అవగాహన పెంచడానికి స్కూల్లోనే ప్యాడ్ బ్యాంక్ను ఏర్పాటు చేశారు. తన సొంత డబ్బుతో ప్యాడ్స్ కొని ఆ బ్యాంకులో ఉంచుతున్నారు. అవి వాడడానికి ముందుకొచి్చన వారికి ఉచితంగా ఇస్తూ ఎలా వాడాలో నేరి్పస్తూ వారిలో అవగాహన పెంచుతున్నారు. మే 15న మదర్స్ డే సందర్భంగా ఈ బ్యాంక్ ప్రారంభించారు. మొదట్లో శానిటరీ ప్యాడ్స్ వాడడానికి ఎవరూ ముందుకు రాలేదు. కానీ ఆ సమయంలో పరిశుభ్రత గురించి వివరంగా చెప్పాక ఒక్కొక్కరు వచ్చి ప్యాడ్స్ తీసుకోవడం మొదలు పెట్టారు. అలా ప్రస్తుతం ప్రతీ నెలా 150 వరకు మహిళలు ప్యాడ్ బ్యాంక్కి వస్తున్నారని రాఖీ గంగ్వార్ వివరించారు. -
Smriti Irani: ఆ అయిదు రోజులు... అయితే ఏంటీ!
మెనుస్ట్రుయేషన్కు సంబంధించిన విషయాలు బహిరంగంగా మాట్లాడడానికి సంకోచించే రోజుల్లో, శానిటరీ యాడ్స్లో నటించడానికి నటీమణులు ససేమిరా అనే రోజుల్లో కెరీర్ తొలి అడుగుల్లో శానిటరీ ప్యాడ్ యాడ్ లో నటించింది స్మృతి ఇరానీ. అది తన తొలి యాడ్. ‘అది ఫ్యాన్సీ యాడ్ కాదు. వదిలేయ్’ ‘ఈ యాడ్ చేస్తే తక్కువ చేసి చూస్తారు. నటిగా అవకాశాలు రావు’ అని అందరూ భయపెట్టారు. కానీ వాటిని పట్టించుకోకుండా ఆ యాడ్లో నటించింది స్మృతి. 25 సంవత్సరాల క్రితం నాటి ఆ వీడియోను స్మృతి ఇరానీ(ప్రస్తుతం కేంద్రమంత్రి) ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తే వైరల్ అయింది. ఆ వీడియోలో... పీరియెడ్స్, వాటిపై ఉండే అపోహలు... మొదలైన వాటి గురించి స్మృతి ఇరానీ మాట్లాడింది. ‘ఆ అయిదు రోజులు. అయితే ఏంటీ? పీరియెడ్స్ అంటే వ్యాధి కాదు. ప్రతి మహిళకు ఉండే సహజ లక్షణం. నేను, మా అమ్మ, మీరు... లక్షలాదిమంది భారతీయ మహిళల కోసం శానిటరీ ప్యాడ్లు ఉన్నాయి...’ అంటూ సాగే స్మృతి మాటలకు ఆ రోజుల్లో ఎలాంటి స్పందన వచ్చిందో తెలియదుగానీ ఇప్పుడు మాత్రం వైరల్ అవుతోంది. ‘ఇది తప్పనిసరిగా గుర్తుచేసుకోదగిన జ్ఞాపకం’ అని తన వీడియో గురించి కాప్షన్ రాసింది స్మృతి ఇరానీ. ‘ఈరోజుల్లో శానిటరీ ప్యాడ్ యాడ్లు చేయడానికి నటీమణులు సంకోచించడం లేదు. కాని ఆరోజుల పరిస్థితి వేరు. ఆ రోజులు నాకు ఇంకా బాగా గుర్తు ఉన్నాయి. పీరియెడ్స్ గురించి మాట్లాడడానికి ఇబ్బంది పడే రోజుల్లో ధైర్యంగా స్మృతి ఆ యాడ్ చేయడం అభినందనీయం’ అంటూ ఒక యూజర్ కామెంట్ సెక్షన్లో స్పందించారు. -
దేశంలోనే ఏపీ అగ్రగామి.. చిట్టి తల్లులకు ‘స్వేచ్ఛ’
సాక్షి, అమరావతి: రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మహిళలకు పెద్దపీట వేస్తూ మహిళా సాధికారతలో ఆంధ్రప్రదేశ్ మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. రేపటి పౌరులైన కిశోర బాలికల ఆరోగ్యంపైనా ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. సమర్థవంతంగా మెన్స్ట్రువల్ హైజీన్ (బహిష్టు సమయంలో పరిశుభ్రత) కార్యక్రమాల అమలులో కూడా మన రాష్ట్రం రెండో స్థానంలో ఉంటోంది. ఈ అంశాన్ని ఇటీవల కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. నెలసరి సమయంలో స్కూళ్లు, కళాశాలల్లో చదివే విద్యార్థినులు పడే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ‘స్వేచ్ఛ’ కార్యక్రమం ద్వారా శానిటరీ నాప్కిన్లను రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తోంది. ఇలా 2021–22లో 1.48 కోట్ల శానిటరీ నాప్కిన్ల పంపిణీతో తమిళనాడు దేశంలో మొదటి స్థానంలో ఉండగా, 1.16 కోట్లతో ఏపీ రెండో స్థానంలో ఉంది. ప్రతీనెలా 10 లక్షల మంది బాలికలకు.. రుతుక్రమం ఇబ్బందులతో బాలికలు స్కూలుకు దూరమవుతున్న పరిస్థితులను సీఎం జగన్ ప్రభుత్వం గుర్తించింది. డ్రాపౌట్స్ను తగ్గించడంతో పాటు, బాలికలకు మెరుగైన ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా స్వేచ్ఛ కార్యక్రమాన్ని 2021లో ప్రభుత్వం ప్రారంభించింది. ఈ కార్యక్రమం కింద ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో ఏడు నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్న 10,01,860 మంది బాలికలకు ప్రతినెలా 10 నాణ్యమైన, బ్రాండెడ్ శానిటరీ నాప్కిన్లను ఉచితంగా అందిస్తున్నారు. ఇందుకోసం ఏటా ప్రభుత్వం రూ.30 కోట్ల మేర ఖర్చుచేస్తోంది. అంతేకాక.. ఎదుగుతున్న సమయంలో శరీరంలో వచ్చే మార్పుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మహిళా ఉపాధ్యాయులు, ఏఎన్ఎంలు, ఫ్యామిలీ డాక్టర్ల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. ప్రత్యేకంగా అడోలసెంట్ ఫ్రెండ్లీ క్లినిక్లు.. ఇక కౌమార దశలో ఎదురయ్యే ఆరోగ్య సమస్యల నివృత్తికి,వైద్యసేవలు అందించేందుకు అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో అడోలసెంట్ ఫ్రెండ్లీ క్లినిక్లు నిర్వహిస్తున్నారు. అపరిశుభ్ర పద్ధతులతో సమస్యలివే.. ♦ నెలసరిలో వస్త్రాన్ని వాడే విధానాన్ని అపరిశుభ్ర పద్ధతిగా వైద్యులు చెబుతారు. ఇలా వాడటంతో జననాంగం సంబంధిత ఇన్ఫెక్షన్లు వస్తాయి. ♦ జననాంగంలో రక్షణకు అవసరమైన హైడ్రోజన్ పెరాక్సైడ్ను స్రవించే లాక్టోబాసిల్లై అనే మంచి బ్యాక్టీరియాతో పాటు కొద్దిమోతాదులో వేరే బ్యాక్టీరియా కూడా ఉంటుంది. వస్త్రం వంటి అపరిశుభ్ర పద్ధతులతో జననాంగం సంబంధిత ఇన్ఫెక్షన్ల ముప్పు ఏర్పడ్డాక సంతానలేమి, శృంగారంతో ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే పెలి్వక్ ఇన్ఫ్లమేటరీ వ్యాధులొస్తాయి. హానికరమైన బ్యాక్టీరియాతో యూరినరీ ఇన్ఫెక్షన్ కూడా వస్తుంది. సంతానలేమి సమస్యలు తలెత్తుతాయి. చాలా మార్పు కనిపిస్తోంది ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థినుల్లో చాలామంది పేద కుటుంబాలకు చెందినవారే. వీరు నెలసరిలో పాఠశాలకు గైర్హాజరయ్యే వారు. ప్రస్తుతం ప్రభుత్వమే ఉచితంగా శానిటరీ నాప్కిన్లు ఇస్తోంది. పాఠశాలల్లో బాత్రూమ్లు, ఇతర వసతులు మెరుగుపడ్డాయి. దీంతో గతంతో పోలిస్తే గైర్హాజరు తక్కువగా ఉంటోంది. – కేవీ పద్మావతి, ఉపాధ్యాయురాలు, అడవివరం, జెడ్పీ ఉన్నత పాఠశాల, విశాఖపట్నం ప్రతి స్కూల్లో అంబాసిడర్లుగా ఇద్దరు టీచర్లు మెన్స్ట్రువల్ హైజీన్ కార్యక్రమాలను విద్యా సంస్థల్లో నిర్వహించడానికి ప్రతి విద్యాసంస్థలో ఇద్దరు టీచర్లను హెల్త్, వెల్నెస్ అంబాసిడర్లుగా గుర్తించారు. వీరితోపాటు మెడికల్ ఆఫీసర్లకు ఎయిమ్స్ వైద్యుల ద్వారా మెన్స్ట్రువల్ హైజీన్పై శిక్షణ ఇప్పించాం. వీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బాలికలకు అవగాహన కల్పిస్తున్నారు. – డాక్టర్ కేవీఎన్ఎస్ అనిల్కుమార్, అడిషనల్ డైరెక్టర్ వైద్య శాఖ -
శానిటరీ ప్యాడ్స్ ప్రశ్నవివాదం.. ఫ్రీగా ఇస్తానని ముందుకు వచ్చిన సంస్థ
పాట్నా: బిహార్లోని 20 ఏళ్ల విద్యార్థిని రియా కూమారి ఐఏఎస్ అధికారిణి హర్జోత్ కౌర్ భమ్రాని శానిటర్ప్యాడ్స్ గురించి ప్రశ్నించిన సంగతి తెలిసింది. ఐతే ఆమె ఇచ్చిన వివరణ వివాదాస్పదమవ్వడంతో ఆమె పలు విమర్శలను ఎదుర్కొన్నారు కూడా. ఐతే ఆ విద్యార్థిని ధైర్యాన్ని మెచ్చుకుంటూ ఏడాది పాటు శానిటరీ ప్యాడ్లను అందించడానికి ముందుకు వచ్చింది ఢిల్లీకి చెందిన శానిటరీ తయారీ సంస్థ పాన్ హెల్త్కేర్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ మేరకు ఆ తయారీ సంస్థ సీఈవో చిరాగ్ మాట్లాడుతూ..ఈ విషయాల గురించి మాట్లాడేందుకు ఎవరూ ముందుకు రారు. పైగా అది మాట్లాడకూడని నిషిద్ధ అంశంగా చూస్తారు. అమ్మాయిలంతా ఆమెలా ధైర్యంగా ముందుకు వచ్చి బహిరంగా మాట్లాడాలి. నిజంగా రియా ధ్యైర్యానికి హ్యాట్సాప్. అని ఆమెని ప్రశంసించారు చిరాగ్. అంతేగాదు ఆమె గ్రాడ్యుయేషన్ చదువుకు అయ్యే ఖర్చును కూడా తామే భరిస్తామని చెప్పారు. ఐతే రియా మాత్రం... తన ప్రశ్న తప్పు కాదు కానీ మేడమ్ (ఐఏఎస్ ఆఫీసర్ హర్జోత్ కౌర్ భుమ్రా) మరోలా తీసుకున్నారని చెప్పింది. అంతేగాదు ఆమె ప్రతిదానికి ప్రభుత్వంపై ఆధారపడకుండా స్వయం ఆధారితంగా ఉండాలని చెప్పే ప్రయత్నంలో భాగంగా బహుశా ఆమె అలా అన్నారేమో కాబోలు అని చెబుతోంది. ఇదిలా ఉండగా బిహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ....బిహార్ ప్రభుత్వం 'కన్యా ఉత్థాన్' కార్యక్రమం కింద ప్రతి అమ్మాయికి రూ.300/లు అందజేస్తుంది. అంటే ప్రతి అమ్మాయికి ప్రభుత్వం ప్రతి నెల రూ. 25లు చెల్లిస్తున్నట్లని, కానీ ఈ అమ్మాయి మాత్రం శానిటర్ ప్యాడ్స్ కోసం డిమాండ్ చేస్తోందన్నారు. బహుశా ఈ విషయం ఆ అమ్మాయికి, ఆ ఐఏఎస్ అధికారికి తెలియకపోయి ఉండొచ్చు అన్నారు. ఆ విద్యార్థిని సాశక్త్ బేటీ.. సమృద్ధి బీహార్ పేరుతో జరిగిన వర్క్షాప్లో ఐఎఏస్ అధికారిని హర్జోత్ కౌర్ భమ్రాని ఈ విషయమై ఆమె ప్రశ్నించింది. ప్రభుత్వం యూనిఫాంలు వంటివి ప్రతీది ఉచితంగా ఇస్తోంది కదా అలానే రూ. 20-30లు ఉండే ఈ శానిటరీ ప్యాడ్స్ని ఉచితంగా ఇవ్వలేదా? అని ప్రశ్నించింది. ఐతే కలెక్టర్ కాస్త కటువుగా ఆ విద్యార్థి ప్రశ్నకు బదులివ్వడంతో ఇంత పెద్ద చర్చకు దారితీసింది. (చదవండి: ‘కండోమ్’ వ్యాఖ్యలతో చిక్కుల్లో ఐఏఎస్.. చర్యలకు సీఎం ఆదేశం!) -
‘కండోమ్’ వ్యాఖ్యలపై సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశం!
పాట్నా: శానిటరీ పాడ్లపై ఓ విద్యార్థి ప్రశ్నకు వెటకారంగా ‘కండోమ్’లు పంచమని అడుగుతారేమో అంటూ వ్యాఖ్యలు చేసిన ఐఏఎస్ అధికారిని హర్జోత్ కౌర్ భమ్రా చిక్కుల్లో పడ్డారు. పాఠశాల బాలికలతో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేయటంపై దూమారం చెలరేగటంతో ఇప్పటికే వివరణ ఇవ్వాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్లు తెలుస్తోంది. మరోవైపు.. ఐఏఎస్ అధికారిని హర్జోత్ కౌర్పై చర్యలు తీసుకుంటామని సూత్రప్రాయంగా తెలిపారు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్. ఆమె వ్యాఖ్యలతో రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతినే అవకాశాలు ఉన్నాయనే కారణంతో సీఎం సీరియస్గా ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. సెప్టెంబర్ 27న జరిగిన కార్యక్రమంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఐఏఎస్ అధికారిని హర్జోత్ కౌర్ భమ్రా వివరణ ఇవ్వాలని ఇప్పటికే జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ) నోటీసులు జారీ చేసింది. దీనిపై సీఎం నితీశ్ కుమార్ను విలేకరులు ప్రశ్నించగా.. ‘ఈ విషయం వార్తా పత్రికల ద్వారా తెలిసింది. ఈ వివాదంపై దర్యాప్తు చేపట్టేందుకు ఆదేశాలు జారీ అయ్యాయి. రాష్ట్ర మహిళలకు అన్ని విధాల సహాయం చేసేందుకు మేము కట్టుబడి ఉన్నాం. ఆ స్ఫూర్తికి విరుద్ధంగా ఐఏఎస్ అధికారిని ప్రవర్తన ఉన్నట్లు తేలితే చర్యలు తీసుకుంటాం.’ అని తెలిపారు. ఐఏఎస్ అధికారిని హర్జోత్ కౌర్ భమ్రా అదనపు చీఫ్ సెక్రెటరీ ర్యాక్ ఆఫీసర్, బిహార్ మహిళా, శిశు సంక్షేమ కమిషన్ హెడ్గా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ‘సాశక్త్ భేటీ.. సమృద్ధ బిహార్’ పేరుతో యూనిసెఫ్ భాగస్వామ్యంతో సెప్టెంబర్ 27న పాట్నాలో రాష్ట్రస్థాయి వర్క్షాప్ నిర్వహించారు. ఈ క్రమంలో ఓ విద్యార్థిని లేచి ప్రభుత్వం ఉచితంగా సైకిళ్లు, యూనిఫాం ఇస్తున్నప్పుడు శానిటరీ పాడ్లు ఇవ్వొచ్చు కదా అని ప్రశ్నించింది. దీనికి ఐఏఎస్ అధికారిని వెటకారంగా సమాధానం ఇచ్చారు. ‘‘రేపు ప్రభుత్వం ఉచితంగా జీన్ ప్యాంట్స్ పంచాలని మీరు అడుగుతారు. ఆ తర్వాత అందమైన షూస్ కావాలని అడుగుతారు. అంతెందుకు ఫ్యామిలీ ఫ్లానింగ్ పద్దతుల్లో ఒకటైన కండోమ్లు పంచమని కూడా అడుగుతారు’’ అంటూ ఆమె పేర్కొన్నారు. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారగా.. సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. 🔊Girl - Can the govt give sanitary pads at ₹ 20-30? IAS Harjot Kaur Bharma - You will eventually expect the govt to give you family planning methods, condoms, too. 🔊Girl - Govt comes to us for votes. IAS Kaur - This is height of stupidity. Don't vote, then. Become Pakistan pic.twitter.com/V4NKdekLuc — Samarg (@aaummh) September 28, 2022 ఇదీ చదవండి: వీడియో: శానిటరీ పాడ్స్పై ప్రశ్న.. ఐఏఎస్ అధికారిణి వివరణతో షాక్ తిన్న విద్యార్థినులు -
ఇచ్చుకుంటూ పోతే.. రేపు ఫ్రీగా కండోమ్లు పంచాలంటారు!
వైరల్: ఆమె ఒక ఐఏఎస్ అధికారిణి. అదీ మహిళాశిశు సంక్షేమ శాఖకు సంబంధించిన విభాగంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తోంది. స్కూల్ స్టూడెంట్స్ అందునా అమ్మాయిలు చేసిన విజ్ఞప్తికి ఆమె స్పందించిన తీరుపై మండిపడుతున్నారంతా. ఊరకుంటే.. కండోమ్లు కూడా ఫ్రీగా పంచాలని అడుగుతారంటూ విద్యార్థులను ఉద్దేశించి వెటకారంగా ఆమె చేసిన వ్యాఖ్యలు కంపరం పుట్టిస్తున్నాయి. బీహార్ వుమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ హర్జోత్ కౌర్ భామ్రా ఇప్పుడు విమర్శలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ఎన్నో ఉచితాలను అందజేస్తోంది. అలాంటిది 20-30రూ. ఉండే శానిటరీ పాడ్స్ ఉచితంగా ఇవ్వలేదా? అని ఓ అమ్మాయి ప్రశ్నించింది. దీనికి ఆ ఐఏఎస్ అధికారిని ఇచ్చిన వివరణలు, ఆ అమ్మాయితో పెట్టుకున్న వాగ్వాదం.. ఆమెను చిక్కుల్లో పడేసింది. సాశక్త్ భేటీ.. సమృద్ధి బీహార్ పేరుతో యునిసెఫ్ మరికొన్ని సంస్థల భాగస్వామ్యంతో మంగళవారం సాయంత్రం పాట్నాలో ఒక కార్యక్రమం నిర్వహించింది. దీనికి డబ్ల్యూసీడీసీ ఎండీ హర్జోత్ కౌర్ హాజరయ్యారు. అయితే.. కార్యక్రమానికి హాజరైన ఓ విద్యార్థిని అడిగిన ప్రశ్నతో మొదలైన వ్యవహారం.. వాడీవేడిగా సాగింది. ఉచిత ప్రకటనలు చేసే ప్రభుత్వం.. రూ.20-30 ఖర్చు చేసి ఉచితంగా శానిటరీ పాడ్లు అందించలేదా? అని స్టూడెంట్ ప్రశ్నించింది. దానికి హర్జోత్ బదులిస్తూ.. ‘‘రేపు ప్రభుత్వం ఉచితంగా జీన్ ప్యాంట్స్ పంచాలని మీరు అడుగుతారు. ఆ తర్వాత అందమైన షూస్ కావాలని అడుగుతారు. అంతెందుకు ఫ్యామిలీ ఫ్లానింగ్ పద్దతుల్లో ఒకటైన కండోమ్లు పంచమని కూడా అడుగుతారు’’ అంటూ ఆమె పేర్కొన్నారు. 🔊Girl - Can the govt give sanitary pads at ₹ 20-30? IAS Harjot Kaur Bharma - You will eventually expect the govt to give you family planning methods, condoms, too. 🔊Girl - Govt comes to us for votes. IAS Kaur - This is height of stupidity. Don't vote, then. Become Pakistan pic.twitter.com/V4NKdekLuc — Samarg (@aaummh) September 28, 2022 ఆ వెంటనే.. ఓట్లేసి ప్రభుత్వాలను ఎన్నుకుంటున్నాం కదా అంది ఆ విద్యార్థిని. దానికి హర్జోత్ కాస్త కటువుగానే బదులిచ్చింది. ‘‘ఇది మూర్ఖత్వానికి పరాకాష్ట. అలా అనిపిస్తే ఓటేయకు. అప్పుడు మన దేశం పాకిస్తాన్ అవుతుంది. డబ్బు, సేవల కోసమే ఓటేస్తావా? అని ఆ విద్యార్థిని నిలదీసిందామె. దీంతో ఆ విద్యార్థిని ‘నేను భారతీయురాలిని. నేనెందుకు అలా చేస్తా’ అంటూ గట్టి సమాధానం ఇచ్చింది. ఆ వెంటనే.. అసలు ప్రభుత్వం నుంచి ప్రతీది ఎందుకు ఆశిస్తారని?.. ఆ ఆలోచనే తప్పని, సొంతంగా చేసుకునేందుకు ప్రయత్నించాలంటూ ఉచిత సలహా ఇచ్చింది హర్జోత్. అయితే ఈ వాడివేడి చర్చ ఇక్కడితోనే ఆగిపోలేదు. ఇంతలో మరో విద్యార్థిని పైకి లేచి.. ఆస్పత్రిలో టాయిలెట్ బాగోలేదని, తరచూ బాలురు కూడా వస్తున్నారంటూ ఫిర్యాదు చేసింది. దీనికి హర్జోత్ కౌర్ భామ్రా స్పందిస్తూ.. ఇంట్లో నీకు వేర్వేరుగా టాయిలెట్స్ ఉంటాయా?.. వేర్వేరు ప్రాంతాలకు వెళ్లినప్పుడు.. ఇలా అడగడం ఎంత వరకు సమంజసం అంటూ ఎదురు ప్రశ్నించడంతో కంగు తినడం విద్యార్థిని వంతు అయ్యింది. ప్రస్తుతం ఆ ఐఏఎస్ అధికారిణి-విద్యార్థినులకు మధ్య జరిగిన చర్చ వైరల్ అవుతోంది. -
శానిటరీ నాప్కిన్స్.. సగం మందికే తెలుసు
న్యూఢిల్లీ: ఆధునిక కాలంలోనూ దేశంలో చాలామంది మహిళలకు శానిటరీ నాప్కిన్స్/ప్యాడ్స్ గురించి తెలియదని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో తేలింది. 15–24 ఏళ్ల మహిళల్లో 50 శాతం మంది ఇప్పటికీ నాప్కిన్స్ బదులు గుడ్డలు వాడుతున్నట్లు తేలింది. అవగాహన లేమి, రుతుస్రావంపై మూఢ నమ్మకాలే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. శుభ్రంగా లేని గుడ్డలు ఉపయోగిస్తుండడం వల్ల మహిళలు రకరకాల ఇన్ఫెక్షన్లకు గురవుతున్నట్లు గుర్తించారు. ఎన్ఎఫ్హెచ్ఎస్–5 సర్వే ఫలితాలను ఇటీవలే విడుదల చేశారు. 2019–21 వరకు దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 707 జిల్లాల్లో ఈ సర్వే నిర్వహించారు. 15–24 ఏళ్ల వయసున్న మహిళలను ప్రశ్నించారు. రుతుస్రావ సమయంలో మామూలు గుడ్డలే వాడుతున్నట్లు 50 శాతం మంది బదులిచ్చారు. స్థానికంగా తయారు చేసిన నాప్కిన్లు వాడుతున్నట్లు 15 శాతం మంది చెప్పారు. అపరిశుభ్ర పద్ధతులు మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్కు దారితీసే ప్రమాదం ఉందని గురుగ్రామ్లో సీకే బిర్లా హాస్పిటల్ వైద్యురాలు డాక్టర్ ఆస్తా దయాల్ చెప్పారు. గర్భం దాల్చడంలో ఇబ్బందులు, గర్భిణుల్లోనూ అనారోగ్య సమస్యలు సృష్టించే అవకాశం ఉందన్నారు. బిహార్లో అత్యల్పం నగరాలు, పట్టణాల్లో 90 శాతం మంది మహిళలు శానిటరీ నాప్కిన్లు ఉపయోగిస్తుండగా, గ్రామీణ ప్రాంతాల్లో వీరి సంఖ్య 73 శాతంగా ఉంది. రాష్ట్రాల వారీగా చూస్తే అత్యల్పంగా బిహార్లో 59 శాతం మంది, మధ్యప్రదేశ్లో 61 శాతం, మేఘాలయాలో 65 శాతం మంది నాప్కిన్లు వాడుతున్నారు. ఈ పరిస్థితిలో మార్పు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన(పీఎంబీజేపీ)ని ప్రారంభించింది. ఈ పథకం దేశవ్యాప్తంగా మహిళలకు కేవలం ఒక్క రూపాయికే శానిటరీ ప్యాడ్ అందిస్తున్నట్లు సెంటర్ ఫర్ సోషల్ రీసెర్చ్ డైరెక్టర్, సామాజిక ఉద్యమకారిణి రంజనా కుమారి తెలిపారు. శానిటరీ ప్యాడ్ వినియోగించే విషయంలో సిగ్గు పడాల్సిన అవసరం ఎంతమాత్రం లేదన్నారు. -
Jeevan Jyot Kaur: ప్యాడ్ ఉమన్.. వాడిన బట్టనే వాడితే అనారోగ్యం.. అందుకే
పదిమంది తప్పుడు మార్గంలో నడుస్తున్నారని, మనం కూడా వారితో కలిసి నడిస్తేనే మనుగడ ఉంటుందనుకోవడం పొరపాటు. ఎవరి మద్దతూ లభించకపోయినా చేసేది మంచి పని అయితే ఒంటరిగా తల వంచుకుని ముందుకు సాగితే ఆ పనికి ఏదో ఒక రోజు గుర్తింపు, గౌరవ మర్యాదలు తప్పకుండా దక్కుతాయని నిరూపించింది ఆమ్ఆద్మీ పార్టీ నేత జీవన్జ్యోత్ కౌర్. యాభై ఏళ్ల జీవన్జ్యోత్ కౌర్ పంజాబ్లోని హోషియార్పూర్లో పుట్టింది. చిన్నప్పటినుంచి చాలా చురుకుగా ఉండే అమ్మాయి. అన్ని విషయాల్లో ఆల్రౌండర్గా ఉండడమేగాక, మంచి వక్తగా పేరు తెచ్చుకుంది. చౌదరి చరణ్ సింగ్ యూనివర్శిటీ లో ఎల్ఎల్బీ పూర్తి చేసిన తరువాత తల్లిదండ్రులు నడుపుతోన్న ‘శ్రీ హేమ్కుంత్ ఎడ్యుకేషన్ సొసైటీ(ఎస్హెచ్ఈఎస్)లో పనిచేయాలని నిర్ణయించుకుంది. విద్య, ఆరోగ్య, మహిళల సంక్షేమాభివృద్ధికి పాటుపడే ఎన్జీవో ఇది. దీనిలో అనేక పనుల్లో పాలుపంచుకుంటోంది. ఇలా ఉండగా... పంజాబ్ స్కూళ్లలోని చాలామంది అమ్మాయిలు శానిటరీ న్యాప్కిన్స్ కొనుక్కోలేని పరిస్థితి. దీంతో వాడిన బట్టనే వాడుతూ అనారోగ్యాల బారిన పడుతున్నట్లు సర్వే ద్వారా తెలుసుకుంది జీవన్. అప్పటినుంచి స్కూళ్లకు వెళ్లి ఉచితంగా బాలికలకు ప్యాడ్స్ను అందించేది. తరవాత జైళ్లు, ఓల్డేజ్ హోమ్లలో పనిచేసే వారి పంపిణీ చేసేది. ఇలా ప్యాడ్స్ పంచుతూ పంజాబీ ప్యాడ్ ఉమెన్గా పాపులర్ అయింది. ఇకో షీ రివల్యూషన్ పాండిచ్చేరీకి చెందిన ఇకోఫెమ్మే,, ఇంకా స్విట్జర్లాండ్ కంపెనీలతో కలసి సేంద్రియ పద్ధతిలో తయారు చేసిన రీ యూజబుల్, యాంటీ బ్యాక్టీరియల్ ప్యాడ్లను జీవన్ పంపిణీ చేస్తూనే, ఇకో షీ రివల్యూషన్ పేరు మీద రెండు గంటలపాటు రుతుక్రమం మీద అవగాహన కార్యక్రమాలను నిర్వహించేది. ఐదువందల స్కూళ్లలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు హర్యాణ, బిహార్లలో కూడా నిర్వహిస్తోంది.ఎస్హెచ్ఈ ఎన్జీవోకు జీవన్ చైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తూనే ఇకో షీ రివల్యూషన్తోపాటు, ‘ఆబాద్’ బదల్వ్, ఏక్ నయీ సోచ్, ఎస్హెచ్పీ స్కూల్ వంటి ప్రాజెక్టులను నిర్వహిస్తూ బాలికలు, మహిళల అభ్యున్నతికి కృషిచేస్తోంది. సీనియర్లను ఓడించి.. సామాజిక సేవాకార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే జీవన్కు రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన అస్సలు లేదు. రాజకీయాల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదనుకుంది తను. కానీ జీవన్ తల్లి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వీరాభిమాని కావడంతో ఆప్లో చేరమని ఒత్తిడి తెచ్చింది. దీంతో 2015లో జీవన్ ఆప్లో చేరింది. పార్టీలో చేరినప్పటినుంచి కష్టపడి అంకితభావంతో పనిచేసే వ్యక్తిగా గుర్తింపు పొందింది. ఆప్లో అధికార ప్రతినిధిగా రాజకీయాల్లో అడుగుపెట్టిన జీవన్ తన పనితీరుతో పంజాబీ ఉమెన్ వింగ్కు కో–ప్రెసిడెంట్గానూ, తరువాత అమృత్సర్ ఆప్ ప్రెసిడెంట్గానూ ఎంపికైంది. 2019 నుంచి మరింత చురుకుగా పనిచేస్తూ పార్టీ ప్రచార కోఆర్డినేటర్గా మారింది. తరువాత ఆప్ జాతీయ అధికార ప్రతినిధిగా మారింది. అంకిత భావంతో పనిచేస్తూ ఇటీవల జరిగిన పంజాబ్ ఎన్నికల్లో తొలిసారి పోటీచేసింది. ఈ ఎన్నికల్లో ఎంతో సీనియర్ నాయకులైన నవజ్యోత్ సింగ్ సిద్ధు, అకాలీ దల్ నాయకుడు విక్రమ్ సింగ్ మజితాయ్లను ఓడించి చరిత్రాత్మక విజయం సాధించింది. మనమే పూలబాటగా మార్చుకోవాలి ‘‘ఎమ్ఎల్ఏగా గెలిచినప్పటికీ మహిళా సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తాను. 117 పంజాబ్ అసెంబ్లీలో స్థానాల్లో కేవలం 13 మంది మాత్రమే మహిళలు ఉన్నారు. సెల్ఫ్హెల్ప్ గ్రూపుల ద్వారా మహిళలను ప్రగతి పథంలో నడిపించడమేగాక, మరింతమందిని రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించే స్థాయికి తీసుకురావడానికి కృషిచేస్తాను. ఏదీ కష్టమైన పనికాదు. యువకులు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే. యువత రాజకీయాల్లోకి రావాలి. మాదక ద్రవ్యాలకు బానిసలవ్వడం, నిరుద్యోగ సమస్యలు ఎప్పుడూ ఉండేవే. ఎవరికి పూలబాటలు పరిచి ఉండవు, ఒక్కో ముల్లును తీసేసి మీ బాటను మీరే పూలబాటలా మార్చుకోవాలి’’ అని యువతకు బోధిస్తున్నారు కౌర్. -
‘తమ్ముడితో కలిసి ఈ పని చేశా’.. క్షణాల్లో బూడిద చేస్తుంది సోలార్ లజ్జా!
"Solar Lajja" Machine: Learn How to Burn Sanitary Pads and PPE Kits and How to Dispose Diapers.. ‘‘శానిటరీ ప్యాడ్స్ వల్ల ఒక రకంగా మంచి జరిగితే మరోరకంగా పర్యావరణానికి తీవ్రహాని కలుగుతోంది. ఈ ముప్పును నివారించేందుకు విద్యుచ్ఛక్తితో పని చేసే మెషీన్ల ద్వారా వాటిని కాల్చివేయడం జరుగుతోంది. అయితే అలా చేయాలన్నా, ఇప్పటికీ విద్యుత్ సౌకర్యం లేని గ్రామాలున్నాయి. ఒకవేళ సౌకర్యం ఉన్నా, ఎప్పుడు కరెంట్ ఉంటుందో, ఎప్పుడు వసు ్తందో తెలియని పరిస్థితి. అందుకు ప్రత్యామ్నాయంగా సోలార్తో పని చేసే మెషిన్ను తయారు చేయాలని తమ్ముడు, నేను అనుకున్నాము. అనుకున్నట్లుగానే సోలార్ లజ్జాను రూపొందించాం. ఇతర మెషిన్లతో పోలిస్తే ఇది 25 శాతం తక్కువ శక్తితో పనిచేస్తుంది. దీనివల్ల పర్యావరణానికి ఎటువంటి హానీ జరగకపోగా దీని ద్వారా వెలువడే బూడిదను మొక్కలకు ఎరువుగా వేయవచ్చు’’ అని చెబుతోంది ముంబైకి చెందిన మధురిత గుప్తా. ప్రకృతికి మంచిచేసే మెషిన్ను అందుబాటులోకి తీసుకొచ్చినందుకు మధురిత, రూపన్లకు అనేక అవార్డులు వచ్చాయి. వీటిలో టాప్టెన్ హెల్త్కేర్ ఇన్నోవేషన్లో ‘ఇన్స్పెన్య్రూరు 3.0’, యూనైటెడ్ నేషన్స్ అందించే టాప్టెన్ ఇన్నోవేషన్స్ ఉమెన్ అవార్డులు ఉన్నాయి. అంతేగాక మహారాష్ట్ర స్టేట్ ఇన్నోవేషన్ సొసైటీ అందించే టాప్ టెన్ ఇన్నోవేషన్స్లో కూడా సోలార్ లజ్జా చోటుదక్కించుకుంది. వెటర్నరీ డాక్టర్ అయిన మధురిత గుప్తాకు అసలు ఈ ఆలోచన ఎలా వచ్చిందో తెలుసుకుందాం. ఒకపక్క తన విధులను నిర్వహిస్తూనే ముంబై కేంద్రంగా పనిచేస్తోన్న ‘మేవాట్స్ వైల్డ్లైఫ్ ట్రస్ట్’లో వ్యవస్థాపక సభ్యురాలిగా పనిచేస్తున్న మధురిత గుప్తా పదేళ్లకు పైగా జూలలో పనిచేస్తూ జాతీయ పార్కుల పరిసర ప్రాంతాల్లోని గ్రామాలను సందర్శించేది. అడవులకు దగ్గర్లోని గ్రామాల్లో పర్యటించినప్పుడు నెలసరి సమయంలో గిరిజన మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను మధురిత నిశితంగా గమనించేది. అవగాహన లేమితో కొందరు, ఆర్థిక ఇబ్బందులతో మరికొందరు గోనెపట్టాను ప్యాడ్గా వాడడం చూసింది. ఎంతో పరిశుభ్రంగా ఉండాల్సిన ఆ రోజుల్లో వాళ్లు అనుసరిస్తున్న పద్ధతులు సరిగా లేవని భావించి వెంటనే ఆ మహిళలకు.. నెలసరి సమయంలో వాడుకోవడానికి శానిటరీ ప్యాడ్స్ను పంపిణీ చేసింది. ప్యాడ్స్ ఇచ్చి మహిళల సమస్యకు పరిష్కారం చూపినప్పటికి, వాడేసిన ప్యాడ్స్ను ఆరుబయట పడేయడంతో.. రక్తం వాసనకు క్రూరమృగాలు అక్కడ చేరి, ప్యాడ్లను ఆరగించేవి. ఇది ఇటు గిరిజన మహిళలకు, అటు జంతువులకు కూడా మంచిది కాదు. ప్రాణాలకూ ముప్పే. ఈ సమస్యకు ఏదైనా పరిష్కారం చూపించాలనుకుని ‘సోలార్ లజ్జా’ను తీసుకొచ్చింది మధురిత. సోలార్ లజ్జా.. అలా కనుగొన్నాం ‘‘శానిటరీ ప్యాడ్స్ అంత త్వరగా భూమిలో కలవకపోవడం వల్ల అటు పర్యావరణానికి, ఇటు జంతువులకూ కూడా హాని జరుగుతుంది. దీనికి ఏదైనా పరిష్కారం వెదకాలి’’ అని మధురిత తన ఐఐటీ ఇంజినీర్ తమ్ముడు రూపన్తో చెప్పింది. ఇద్దరూ కలిసి దాదాపు ఏడాదిపాటు ప్రయోగాలు, పరిశోధనలు చేసి 2019లో ‘‘సోలార్ లజ్జా’’ మెషిన్ను అర్ణవ్ గ్రీన్ టెక్ స్టార్టప్ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇది పూర్తిగా ఎకో ఫ్రెండ్లీ మెషిన్. సోలార్ శక్తితో నడుస్తుంది. ఒకసారి మెషిన్ను అమర్చితే దాని నిర్వహణకు ఎటువంటి ఖర్చు ఉండదు. మిషన్పై ఉన్న సోలర్ ప్యానల్స్ సూర్యరశ్మి ద్వారా ఎప్పటికప్పుడు మెషిన్ను రీచార్జ్ చేస్తాయి. శానిటరీ ప్యాడ్స్కే కాకుండా, పీపీఈ కిట్లు, ట్యాంపాన్స్, డయపర్లు, ఒకసారి వాడిపడేసే మాస్కులను సైతం ఈ మెషిన్ బూడిద చేస్తుంది. పర్యావరణ హితం... మహిళలకు ఉపాధి ‘‘మేము కనిపెట్టిన ఈ మెషిన్ రోజుకి రెండువందల ప్యాడ్లను బూడిద చేస్తుంది. ఈ బూడిదను పొలాల్లో ఎరువుగా వాడుకోవచ్చు. ప్రస్తుతం వీటిని ప్రైవేటు కంపెనీ, స్కూళ్లు కాలేజీల్లో అమర్చాము. ప్యాడ్స్ను పంపిణీ చేయడమేగాక, వాటిని మెషిన్లో ఎలా పడేయాలో కూడా నేర్పిస్తున్నాము. దీనిపై క్రమంగా అవగాహన పెరుగుతోంది. 2019లో ప్రారంభించిన సోలార్ లజ్జా మెషిన్లను పదకొండు రాష్ట్రాల్లోని ప్రముఖ నగరాల్లో అమర్చాము. మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ, ఉత్తరాఖండ్, హర్యాణ, సిక్కింలలో ఈ మెషిన్లను అమర్చాము. జర్మనీ, స్వీడన్, స్పెయిన్ నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయి. ప్రస్తుతం ఎక్కువగా స్కూళ్లు, కాలేజీలు, ఆసుపత్రులు, ప్రైవేటు లేదా పబ్లిక్ స్థలాలకోసం ఆర్డర్లు వస్తున్నాయి. సోలార్ లజ్జా ద్వారా కొంతమంది మహిళలకు ఉపాధి కూడా కలుగుతోంది. భవిష్యత్లో వీటి ఉత్పత్తిని పెంచుతాము’’ అని మధురిత వివరించింది. -
చిట్టితల్లుల సాధికారతకు ‘స్వేచ్ఛ’
మహిళల నిజమైన సాధికారత గురించి ఆలోచిస్తూ, ఈ దిశగా దేశంలోనే ఏ రాష్ట్రం చేయని సాహసోపేతమైన, ఆదర్శవంతమైన నిర్ణయాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. తాజాగా కిశోరబాలి కల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వారు ఒక్కరోజు కూడా పాఠశాలకు దూరంకారాదనే సమున్నత ఆశయంతో ‘స్వేచ్ఛ’ పథకాన్ని ప్రారంభించింది. యుక్తవయసు వచ్చిన బాలికలకు రుతుక్రమం సమయంలో కొన్ని సమస్యలు రావడం, వీటి కారణంగా వీరు పాఠశాలకు వెళ్లలేకపోవడం దశాబ్ధాలుగా జరుగుతోంది. దీని కారణంగా వీరు తరగతులకు సరిగా హాజరు కాలేకపోవడం, విద్యలో కొంత వెనకబడటం సర్వసాధారణంగా మారింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో కిశోరబాలికల ఆరోగ్యం, పరిశుభ్రతను దృష్టిలో ఉంచుకుని రూ. 32 కోట్లతో ఈ పథకాన్ని ప్రారంభించి, అమలు చేస్తున్నారు. రుతుక్రమం ఇబ్బందులతో ఏ ఒక్కరూ పాఠశాలకు దూరం కారాదనే సదుద్దేశంతో ప్రతి నెల 10 నాణ్యమైన శానిటరీ నాప్కిన్స్ను అందించే ప్రక్రియను చేపట్టారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యారంగాన్ని ఖర్చుగా చూడకుండా భవిష్యత్ తరాలపై పెట్టుబడిగా భావిస్తూ ప్రోత్సహిస్తున్నారు. జగనన్న విద్యా కానుకగా 9 వస్తువులు, పుస్తకాలు అందిస్తూ చిన్నారుల పాఠశాల విద్య బాధ్యతను ప్రభుత్వం తన భుజాలపై వేసుకుంది. దీనిలో భాగంగా అమలు చేసిన ‘నాడు–నేడు’లో జరిగిన అభివృద్ది ప్రశంసనీయం. దీనిలో భాగంగా ప్రతీ పాఠశాలలో ఏర్పాటు చేసిన నిరంతర నీటి సరఫరా కలిగిన టాయిలెట్లు బాలికల ఆత్మగౌరవాన్ని కాపాడటంలో దోహదకారిగా నిలుస్తున్నాయి. నేడు ప్రారంభించిన స్వేచ్ఛ పథకం బాలికా విద్యను మరో మెట్టు ఎక్కిస్తుంది. పథకం అమలుకు ప్రత్యేక అధికారిగా అధ్యాపకురాలిని ఏర్పాటు చేయడం వలన బాలికలకు తమ భావాలను, ఇబ్బందులను చెప్పుకునే అవకాశం, వాటికి పరిష్కారాలు పొందడం సాధ్యపడుతుంది. పథకంలో భాగంగా రాష్ట్రంలో 10 లక్షల మంది విద్యార్థినులకు ఉచితంగా నెలకు10 చొప్పున ఏడాదికి 120 బ్రాండెడ్ శానిటరీ నాప్కిన్స్ను ప్రభుత్వమే అందించనుంది. వేసవి సెలవుల్లో సైతం వీరు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండటానికి ముందుగానే విద్యార్థినులకు వీటిని అందించాలనే నిర్ణయం వారిపట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్దికి నిబద్ధతకు ఉదాహరణగా నిలుస్తాయి. గ్రామీణ మహిళలపై సైతం దీనిపై అవగాహన కల్పిస్తూ, వారి ఆరోగ్యాన్ని పరిరక్షించే విధంగా వైఎస్సార్ చేయూత దుకాణాల ద్వారా తక్కువ ధరకే నాప్కిన్స్ అందించడం మరొక మంచి నిర్ణయం. పేద, మధ్యతరగతి కుటుంబాలపై భారం పడకుండా వారి చిన్నారులకు అవసరమైన నాప్కిన్స్ సైతం రాష్ట్ర ప్రభుత్వం అందించాలనే నిర్ణయం భవిష్యత్తులో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా, మార్గదర్శకంగా నిలుస్తుంది. కిశోర బాలికల్లో అవగాహన కల్పించే విధంగా పాఠశాల అధ్యాపకులు, ఏఎన్ఎంలతో కార్యక్రమాలు చేపట్టడం, నాప్కిన్స్ ఉపయోగించే విధంగా ప్రోత్సహించడం, వినియోగించిన నాప్కిన్స్ సురక్షితంగా డిస్పోజ్ చేయడానికి సైతం 6417 ఇన్సినరేటర్లను ఏర్పాటు చేయడం, మున్సిపాలిటీలలో ప్రత్యేకంగా డస్ట్ బిన్లు ఉంచడం పర్యావరణానికి మేలు చేసే ప్రయత్నాలుగా మనం భావించవచ్చును. దేశంలో 23 శాతం మంది చిన్నారులు రుతుసంబంధ సమస్యలతో పాఠశాలకు దూరం అవుతున్నారని యుఎన్ నివేదికలో పేర్కొన్న పరిస్థితులను మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న స్వేచ్ఛ పథకం నిలుస్తుంది. రాష్ట్రంలో నూరుశాతం కిశోర బాలికలు ‘స్వేచ్ఛ’గా తమ పాఠశాల విద్యను పొందే అవకాశాన్ని ఈ పథకం అందిస్తూ వారి కలలను సంపూర్ణంగా సాకారం చేస్తుంది. అదేవిధంగా భవిష్యత్తులో ఉన్నత విద్యలో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషి యోను పెంపుదల చేయాలనే ముఖ్యమంత్రి నిర్ణయా నికి, లక్ష్యానికి ఇటువంటి పథకాలు పునాదిరాళ్లుగా మారతాయి. - డాక్టర్ దిగుమర్తి సాయి బాల పల్లవి అసిస్టెంట్ ప్రొఫెసర్, గాయత్రీ విద్యాపరిషత్ పీజీ కళాశాల, విశాఖపట్నం -
రేవ్ పార్టీ.. ఎవరికీ అనుమానం రాకుండా అందులో డ్రగ్స్
ముంబై: డ్రగ్స్ దందాను అడ్డుకునేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నప్పటికీ, కేటుగాళ్లు సరికొత్త దారులు ఎంచుకుంటూ సరఫరా చేస్తూనే ఉన్నారు. తాజాగా ముంబయి క్రూయిజ్ నౌకలో జరిగిన రేవ్ పార్టీలో ఓ మహిళ ఏకంగా శానిటరీ న్యాప్కిన్లో డ్రగ్స్ తీసుకువెళ్లినట్లు పోలీసుల విచారణలో తేలడంతో షాక్ గరయ్యారు. కాగా ఈ వ్యవహారంలో ఇప్పటివరకు మొత్తం 19మందిని అరెస్టు చేసినట్లు ఎన్సీబీ అధికారులు తెలిపారు. ఈ కేసు విచారణలో భాగంగా అక్టోబర్ 11న విచారణకు హాజరు కావాలంటూ తాజాగా ప్రొడ్యూసర్ ఇంతియాజ్ ఖత్రీకి ఎన్సీబీ అధికారులు నోటీసులు జారీచేశారు. ఇప్పటికే డ్రగ్స్ కేసులో బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. బెయిల్పై బయటకు వచ్చేందుకు ఆర్యన్ ఖాన్ ఇప్పటికే ప్రయత్నించగా న్యాయస్థానం అందుకు నిరాకరించింది. ముంబై మెజిస్ట్రేట్ కోర్టు గురువారం ఆర్యన్ ఖాన్ సహా ఏడుగురిని 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. ఆర్యన్ ఖాన్ తరఫున వాదిస్తున్న న్యాయవాది సతీష్ మనేషిండే కోర్టులో.. ఆర్యన్ ఖాన్ను క్రూయిజ్ పార్టీకి ఆహ్వానించారు. అయితే, అతనికి బోర్డింగ్ పాస్ కూడా లేదు. రెండవది, పోలీసులు అర్యాన్ని అదుపులోకి తీసుకుంది కూడా కేవలం అతని చాట్ ఆధారంగా మాత్రమేనని మరే ఇతర బలమైన అధారాలు లేవని తెలిపారు. చదవండి: భార్యే తెగబడిందా.. ప్రియుడు సహకరించాడా..? -
అమ్మలా ఆలోచించారు
సాక్షి, అమరావతి: పిల్లల ఆరోగ్యం పట్ల ఒక తల్లి ఎంత శ్రద్ధ తీసుకుంటుందో ముఖ్యమంత్రి జగన్ ఓ మేనమామగా అంతకుమించి ఆలోచిస్తున్నారని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. కిశోర బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్కిన్స్ అందచేసే కార్యక్రమాన్ని ప్రారంభించడం సంతోషకరమని, దీనివల్ల పేద కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఇన్ఫెక్షన్ల బారినపడ్డ పిల్లలు తమ సమస్యను ఎవరితోనూ చెప్పుకోలేక మానసిక ఆందోళనకు గురవడం వల్ల చదువులపై ప్రభావం పడుతుందన్నారు. మంగళవారం ‘స్వేచ్ఛ’ కార్యక్రమం ప్రారంభం సందర్భంగా మంత్రి వనిత మాట్లాడారు. రెండు నెలలకు సరిపడా స్కూళ్లకు స్టాక్ ‘గతంలో స్కూళ్లలో టాయిలెట్స్ కూడా ఉండేవి కాదు. ఇప్పుడు నాడు– నేడు ద్వారా రన్నింగ్ వాటర్తో టాయిలెట్స్ సదుపాయం కల్పించడం వల్ల పిల్లలు నిశ్చింతగా పాఠశాలలకు వస్తున్నారు. విద్య, ఆరోగ్య, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ సమన్వయంతో నిర్వహించే స్వేచ్ఛ కార్యక్రమం ద్వారా 10 లక్షల మంది విద్యార్ధులకు న్యాప్కిన్స్ అందచేస్తాం. ప్రతీ స్కూల్లో నోడల్ ఆఫీసర్ దీనిని పర్యవేక్షిస్తారు. దీంతోపాటు వైఎస్సార్ చేయూత స్టోర్స్ ద్వారా కూడా తక్కువ ధరకే బ్రాండెడ్ న్యాప్కిన్స్ అందుబాటులో ఉంచుతున్నాం. ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్, నైన్ కంపెనీల నుంచి కొనుగోలు చేస్తున్నాం. అక్టోబర్, నవంబర్ నెలలకు సరిపడా స్టాక్ ఇప్పటికే స్కూళ్లకు పంపించాం. ముఖ్యమంత్రి జగన్ మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించి వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ ద్వారా ఏడాదికి రూ.1,800 కోట్లు కేటాయిస్తున్నారు. రుచికరమైన మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. దిశ యాప్ తెచ్చి మహిళలకు చక్కటి వరాన్ని ఇచ్చారు. మీరు తీసుకుంటున్న ప్రతీ నిర్ణయం వల్ల ఎంతోమంది పేద కుటుంబాల్లో వారి తల్లిదండ్రులు ఇవ్వలేనివి పిల్లలకు అందుతున్నాయి’ అని మంత్రి వనిత పేర్కొన్నారు. -
‘స్వేచ్ఛ’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్ ( ఫోటోలు )
-
‘స్వేచ్ఛ’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: మహిళలు, కిశోర బాలికల ఆరోగ్యం, పరిశుభ్రతే ధ్యేయంగా రూపొందించిన ‘స్వేచ్ఛ’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. మహిళలు, బాలికలు ఆరోగ్యం, పరిశుభ్రతే ‘స్వేచ్ఛ’ కార్యకమ్ర లక్ష్యమని తెలిపారు. రుతుక్రమ సమస్యలతో చదువులు ఆగిపోతున్నాయని, 7 నుంచి 12వ తరగతి విద్యార్థినులకు ఉచితంగా శానిటరీ న్యాప్కిన్లు అందజేస్తామని తెలిపారు. 10లక్షల మంది కిశోర బాలికలకు ఉచితంగా న్యాపికిన్లు పంపిణీ చేస్తామని సీఎం జగన్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 10, 388 స్కూళ్లు, కాలేజీల్లో శానిటరీ న్యాప్కిన్లు పంపిణీ చేస్తామని తెలిపారు. ప్రతి నెల జేసీ (ఆసరా) ఆధ్వర్యంలో పర్యవేక్షణ జరగాలని పేర్కొన్నారు. మహిళా టీచర్లు, ఏఎన్ఎంలు బాలికలకు అవగాహన కల్పించాలని, ‘స్వేచ్ఛ’ పథకం అమలుపై నోడల్ అధికారిగా మహిళా టీచర్ను నియమించామని తెలిపారు. దిశ యాప్, దిశ చట్టం గురించి వివరించాలని అన్నారు. మహిళా సాధికారతలో ఏపీ మొదటి స్థానంలో ఉందని సీఎం జగన్ తెలిపారు. వైఎస్సార్ చేయూత స్టోర్లలో శానిటరీ న్యాప్కిన్లు విక్రయించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. చరిత్రను మార్చే శక్తి మహిళలకే ఉందని గట్టిగా నమ్మిన ప్రభుత్వం తమదని సీఎం జగన్ తెలిపారు. విద్యార్థినుల ఆరోగ్య సంరక్షణ, పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు చదువులకు దూరం కాకుండా చూడటమే లక్ష్యంగా స్వేచ్ఛ కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందించింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు వైఎస్సార్ చేయూత స్టోర్లలో నాణ్యమైన న్యాప్కిన్స్ తక్కువ ధరకు విక్రయించేలా చర్యలు చేపట్టింది. యూనిసెఫ్, వాష్, పీ అండ్ జీ తదితర సంస్థలతో కలసి అవగాహన తరగతులు నిర్వహించి రుతుక్రమంపై అపోహలు తొలగించనున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది మార్చి 8న స్వేచ్ఛ కార్యక్రమాన్ని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖలను మహిళా, శిశు సంక్షేమశాఖ పరిధిలోకి తెచ్చింది. ప్రతి రెండు నెలలకు ఒకసారి స్కూళ్లు, కాలేజీలలో న్యాప్కిన్స్ పంపిణీకి చర్యలు చేపట్టింది. -
‘స్వేచ్ఛ’గా చదువుదాం
సాక్షి, అమరావతి: మహిళలు, కిశోర బాలికల ఆరోగ్యం, పరిశుభ్రతే ధ్యేయంగా రూపొందించిన ‘స్వేచ్ఛ’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం క్యాంపు కార్యాలయంలో ప్రారంభించనున్నారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్ కళాశాలల్లో 7 నుంచి 12వ తరగతి చదువుతున్న సుమారు 10 లక్షల మంది కిశోర బాలికలకు ఉచితంగా న్యాప్కిన్స్ పంపిణీ చేయనున్నారు. నెలకు పది చొప్పున వీటిని అందచేస్తారు. విద్యార్థినుల ఆరోగ్య సంరక్షణ, పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు చదువులకు దూరం కాకుండా చూడటమే లక్ష్యంగా స్వేచ్ఛ కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందించింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు వైఎస్సార్ చేయూత స్టోర్లలో నాణ్యమైన న్యాప్కిన్స్ తక్కువ ధరకు విక్రయించేలా చర్యలు చేపట్టింది. అపోహలు తొలగిస్తూ.. నాలుగో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (2015–16) ప్రకారం రాష్ట్రంలో శానిటరీ న్యాప్కిన్స్ వినియోగిస్తున్న 15 – 24 వయసు యువతుల శాతం 56 కాగా 2019 – 20 సర్వే నాటికి ఇది 69 శాతానికి పెరిగింది. వాటర్ సప్లయి, శానిటేషన్ కొలాబరేటివ్ కౌన్సిల్ లెక్కల ప్రకారం దేశంలో 23 శాతం మంది బాలికలు చదువులు మధ్యలో నిలిపివేయటానికి ప్రధాన కారణం– శానిటరీ న్యాప్కిన్స్ అందుబాటులో లేకపోవడం, విద్యాసంస్థల్లో కనీస వసతులు కరువవడం, టాయిలెట్లలో రన్నింగ్ వాటర్ లేకపోవడమేనని వెల్లడైంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది మార్చి 8న స్వేచ్ఛ కార్యక్రమాన్ని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖలను మహిళా, శిశు సంక్షేమశాఖ పరిధిలోకి తెచ్చింది. ప్రతి రెండు నెలలకు ఒకసారి స్కూళ్లు, కాలేజీలలో న్యాప్కిన్స్ పంపిణీకి చర్యలు చేపట్టింది. యూనిసెఫ్, వాష్, పీ అండ్ జీ తదితర సంస్థలతో కలసి అవగాహన తరగతులు నిర్వహించి రుతుక్రమంపై అపోహలు తొలగించనున్నారు. చదవండి: సీఎం జగన్కు ప్రజలు అండగా ఉన్నారని నిరూపించాలి -
ఆ సమయంలో... భరోసా ఇస్తోంది!
తాను ఎదుర్కొన్న కష్టాన్ని మరెవరూ పడకూడదని కోరుకునే పెద్దమనసు ఇర్ఫానా జర్గర్ది. అది 2014 శ్రీనగర్లో ఉన్న అత్యంత రద్దీ బజారులో నడుచుకుంటూ వెళ్తోంది ఇర్ఫానా. సడెన్గా ఆమెకు నెలసరి (పీరియడ్స్) బ్లీడింగ్ అవ్వడం మొదౖలñ ంది. ఆ సమయంలో తన దగ్గర శానిటరీ ప్యాడ్లు లేవు. కొనుకుందామనుకున్నా డబ్బులు లేవు. దీంతో దగ్గర్లో ఉన్న పబ్లిక్ టాయిలñ ట్కు వెళ్లింది. అక్కడ కూడా ఆమెకు ఏమీ దొరకలేదు. దీంతో ఇంటికి వెళ్లేంత వరకు తీవ్రంగా ఇబ్బందికి గురైంది. ఆరోజు ఇర్ఫానా పడిన ఇబ్బందిని మరే అమ్మాయి పడకూడదని శ్రీనగర్లోని పబ్లిక్ టాయిలెట్లలో శానిటరీ న్యాప్కిన్స్ను ఉచితంగా అందిస్తోంది ఇర్ఫానా. అమ్మాయిలు, మహిళలు నెలసరి సమయంలో శారీరకంగా, మానసికంగా ఇబ్బందికి గురవుతుంటారు. ఇక నలుగురిలోకి వెళ్లాల్సి వచ్చినప్పుడు దృష్టి అంతా వెనుకాల ఎక్కడ మరకలు అంటుకున్నాయో? అని పదేపదే చూసుకుంటుంటారు. అది ప్రకృతి సిద్ధంగా జరిగే ప్రక్రియే అయినా ఇప్పటికీ అమ్మాయిలు దానికి గురించి మాట్లాడానికి కూడా సిగ్గుపడుతుంటారు. ఈ ధోరణి మార్చాలన్న ఉద్దేశ్యంతోనే ‘ఇవ సేఫ్టీ డోర్’ కిట్ కార్యక్రమాన్ని ఇర్ఫానా చేపట్టింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన శ్రీనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో హెల్పింగ్ అసిస్టెంట్ గా పనిచేస్తోన్న ఇర్ఫానా... నెల జీతంలో ఐదువేల రూపాయలను పొదుపు చేసి , వాటితో శానిటరీ ప్యాడ్స్ కొని నిరుపేదలకు ఉచితంగా అందిస్తోంది. ఇలా ఇప్పటిదాకా 20 వేలకు పైగా శానిటరీ ప్యాడ్స్ ఇచ్చింది. శానిటరీ న్యాప్కిన్స్, ప్యాంటీస్, హ్యాండ్ వాష్, బేబీ డయపర్స్తో కూడిన ‘ఇవ సేఫ్టీ డోర్’ కిట్ను పబ్లిక్ టాయిలెట్లలో ఉంచుతోంది. అత్యవసరంలో ప్యాడ్లు అవసరమైన మహిళలు ఎటువంటి టెన్షన్ పడకుండా వీటిని వాడుకునేలా పబ్లిక్ లేడీస్ టాయిలెట్స్లో అందుబాటులో ఉంచుతోంది. శ్రీనగర్లోని దాదాపు అన్ని పబ్లిక్ టాయిలెట్లలో ఇవ ప్యాడ్స్ కనిపిస్తాయి. వివిధ గ్రామాల నుంచి నగరానికి వచ్చే మíß ళలకు ఇవి ఉపయోగపడుతున్నాయి. సమాజానికి ఏదైనా చేయాలన్న మనస్తత్వం ఇర్ఫానాది. తనకి 21 ఏళ్లు ఉన్నప్పుడు తన తండ్రి హార్ట్ ఎటాక్తో మరణించారు. దీంతో తను చదువుకుంటూనే, కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచేందుకు... మున్సిపల్ కార్పొరేషన్లో ఉద్యోగంలో చేరింది. తన జీతంలో కొంత మిగుల్చుకుని ఉచితంగా ప్యాడ్లు అందించే కార్యక్రమాన్ని చేపట్టింది. కరోనా సమయంలోనూ ఆసుపత్రులలో ప్యాడ్స్ను ఉచితంగా అందించింది. ఈ సమయంలో చాలామంది ఇర్ఫానాకు కాల్స్ చేసి శానిటరీ న్యాప్కిన్స్, కిట్స్ ఇవ్వమని అడిగితే వారికి పంపించేది. నిరుపేదలు, నిరక్షరాస్య మహిళలకు శానిటరీ ప్యాడ్స్ ప్రాముఖ్యత వివరిస్తూ, మెన్స్ట్రువల్ హైజీన్పై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తోంది.ఈ మొత్తానికి ఎవరి సాయం లేకుండా తన సొంత డబ్బులను వాడడం విశేషం. ఇర్ఫానా చేస్తోన్న పని గురించి తెలిసిన వారంతా అభినందిస్తున్నారు. ‘‘నేను ఈ పనిచేయడానికి ప్రేరణ మా నాన్నగారే. షాపుల నుంచి మా నాన్న గారే శానిటరీ ప్యాడ్స్ కొని తెచ్చి నాకు ఇబ్బంది లేకుండా చూసేవారు. అందుకే నాన్న మరణించాక ఆయన గర్వపడేలా ఏదైనా చేయాలనుకున్నాను. ఈ క్రమంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టాను. కొన్నిసార్లు పీరియడ్స్ ఎప్పుడు వస్తాయో తెలియదు. ఇంటికి దూరంగా బయట ఎక్కడో ఉన్నప్పుడు సడెన్గా మొదలవుతుంది. ఆ సమయంలో మన దగ్గర ప్యాడ్ లేకపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆ సమయంలో ఈ ప్యాడ్లు బాగా ఉపయోగపడుతాయి’’ అని ఇర్ఫానా చెప్పింది. -
Menstrual Hygiene Day: ప్యాడ్ ఎక్కడ మార్చుకుందాం?
స్త్రీల బహిష్టు సమస్యలను ప్రపంచం 2013 నుంచి మాట్లాడటం మొదలెడితే భారతదేశం గత నాలుగైదేళ్లుగా మాట్లాడుతోంది. విద్యార్థినులకు ప్యాడ్స్ ఇవ్వడం, పేద వర్గాల మహిళలకు ప్యాడ్స్ అవసరం చెప్పడం ఇప్పుడిప్పుడే జరుగుతోంది. కాని నిజంగా బహిష్టును దాంతో పాటు స్త్రీలను అర్థం చేసుకుని దానితో ముడిపడిన సమస్యలకు పరిష్కారాన్ని, ఆపై స్త్రీకి ఇవ్వాల్సిన గౌరవాన్ని సమాజం ఇస్తోందా? బహిష్టులో ఉన్న స్త్రీ ఇంట్లో ఉంటే సరే, బయటకు వస్తే ప్యాడ్ ఎక్కడ మార్చుకోవాలో తెలియని ఆందోళన లో నేటికీ ఉందంటే బహిష్టు ధర్మం పట్ల ఈ సమాజం ఇంకా స్నేహంగా లేనట్టే లెక్క. మే 28 ‘బహిష్టు పరిశుభ్రతా దినోత్సవం’ సందర్భంగా కొన్ని చర్చలో ఉన్న ఆలోచనలు.... ఒక రచయిత్రి రాసిన తెలుగు కథలో ఒక మహిళా పాత్రధారి విమాన ప్రయాణం చేస్తూ ఉంటుంది. సడన్గా ఆమెకు పిరియెడ్స్ మొదలైపోతాయి. దగ్గర ప్యాడ్స్ ఉండవు. చీరలో ఉంటుంది. ప్రయాణ హడావిడిలో ప్యాంటిస్ కూడా వేసుకుని ఉండదు. ఒక పెద్ద దురవస్థగా ఉంటుందామెకు. విమానంలో మహిళలకు సడన్ గా పిరియడ్స్ వస్తాయేమోనని ప్యాడ్స్ ఉంచరు. ఇప్పటికీ ఎన్ని విమానాలలో ఈ సదుపాయం ఉందో మనకు తెలియదు. కాని తోటి ప్రయాణికులు ఆమెను అభ్యంతరకరంగా చూస్తూ ఉంటే ఎయిర్ హోస్టెస్లు సహకరిస్తే ఆ మహిళా పాత్రధారి ఆ దురవస్థ నుంచి బయటపడుతుంది. ఆ కథలో రచయిత్రి అంటుంది– ‘ఈ పాత్రధారి దురవస్థ సరే, దేశంలో బహిష్టు వస్త్రాన్ని ఉతికి మళ్లీ వాడుకునే కోట్లాది మహిళలు ఆ వస్త్రాలను ఆరేసుకోవాలంటే కొంచెం ఎండ కూడా దొరకదు’ అని. అంటే బహిరంగంగా వాటిని ఆరబెట్టుకోవడానికి ఈ సమాజం అంగీకరించదు అని. చీకటిలో, నీడలో, ఇంట్లో దండేలకు వాటిని ఆరబెట్టి తిరిగి వాడటం వల్ల ఎన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయో వచ్చాయో వైద్యనిపుణులు చెబుతూనే ఉన్నారు. ∙∙ విమానం వంటి ఖరీదైన వ్యవస్థలో, ‘నాగరికులు’ రాకపోకలు జరిపే ప్రయాణ సాధనాలలోనే పరిస్థితి ఇలా ఉంటే ఈ దేశంలో నేటికీ రైళ్లలో, రైల్వే స్టేషన్లలో, బస్టాండ్లలో, బస్సులలో ఎంతమేరకు స్త్రీలకు ప్యాడ్స్ అందుబాటులో ఉన్నాయి? వాటి అవసరాన్ని ఈ సమాజం, వ్యవస్థలు ఏ మేరకు గుర్తించాయి? ఇంకా గుర్తించాల్సి ఉంది? ఫస్ట్ ఎయిడ్ బాక్స్లు ఉన్నట్టు ప్యాడ్ బాక్స్లు ఎందుకు ఉండవు అని ఇంకా అడగాల్సిన పరిస్థితే ఉంది. ∙∙ గత సంవత్సరం కేరళ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ కార్యాలయ్యాల్లో ఫ్రీ ప్యాడ్స్ను ఏర్పాటు చేయడమే కాక, వాడిన ప్యాడ్స్ను బూడిద చేసే ‘ఇన్సినెరేటర్’లు కూడా ఉంచాలని నిర్ణయం తీసుకుంది. పిరియెడ్స్లో ఉన్న మహిళా ఉద్యోగులకు ఆఫీసులో ప్యాడ్స్ మార్చుకునే వీలు ఏదో మేరకు ఉన్నా అంతవరకూ ఉపయోగించిన ప్యాడ్ను ఎక్కడ పడేయాలనే వత్తిడిలో ఉంటారు. అందువల్ల ఒకే ప్యాడ్ను ఎక్కువ సేపు వాడుతూ ఆరోగ్య సమస్యలను తెచ్చుకుంటూ ఉంటారు. వాటిని మార్చుకునే స్థలంతో పాటు వాటిని ఎవరూ చూడకుండా చేసే బూడిద యంత్రాలు అందుబాటులో ఉన్నప్పుడే వారికి మరింత సౌకర్యంగా ఉంటుంది. అయితే మహిళలు ప్రభుత్వ ఆఫీసుల్లో పని చేస్తారా? ప్రయివేటు ఆఫీసుల్లో చేయరా? ఎన్ని ప్రయివేటు కార్యాలయాలు ఇలాంటి ఏర్పాటు చేస్తున్నాయి అనేది పెద్ద ప్రశ్న. మహిళలు తమ బహిష్టు పరిశుభ్రతను పాటించాలంటే సమాజం మొత్తం అడుగడుగునా అందుకు అవసరమైన స్నేహాన్ని, సౌకర్యాన్ని కలిగించాల్సి ఉంటుంది. ∙∙ ‘బాడీ లిటరసీ’ అనే మాటను వాడుతున్నారు మహిళల కోసం పని చేసే కార్యకర్తలు, ఆలోచనాపరులు. అంటే స్త్రీ శరీర ధర్మాలను సమాజం సరిగ్గా అర్థం చేసుకుని ఆ ధర్మాలను గౌరవించే స్థాయిలో విద్యావంతం కావాలి. అప్పుడే ‘బహిష్టు’కు సంబంధించిన కట్టుబాట్లు, ఏహ్యత, వెలి దూరం అవుతాయి. స్త్రీల శరీరం గురించి స్త్రీలకు తెలుసు. స్త్రీలు తమ లోపలి దొంతరల్లో మొదట ఈ శరీర ధర్మాల పట్ల స్వీయగౌరవం పెంచుకోవడం ఎంత అవసరమో ఇంటి పురుషులతో మొదలెట్టి అధికార పదవులలో కూచుని పురుషదృష్టితో పాలసీలు చేసే పాలకుల వరకూ వీటి పట్ల గౌరవం కలిగించడం కూడా అంతే అవసరం. ఇంట్లోని తల్లి, కుమార్తె బహిష్టు గురించి నార్మల్గా మాట్లాడే పరిస్థితితోపాటు తండ్రి, కుమారుడు కూడా అంతే నార్మల్గా మాట్లాడే పరిస్థితి వచ్చినప్పుడు అవసరమైన మార్పు వస్తుంది. ∙∙ బహిష్టు పట్ల ఉండే చూపును, అప్రకటిత నిబంధనలను వ్యతిరేకిస్తూ ‘హ్యాపీ టు బ్లీడ్’తో మొదలెట్టి ఇటీవలి కాలంలో ఎన్నో విజ్ఞాన నిరసనలు స్త్రీలు చేస్తున్నారు. తమ శరీర ధర్మాన్ని తాము ఓన్ చేసుకోవడం అవసరమని, గట్టిగా మాట్లాడటం కూడా అవసరమే అని వారు తెలుసుకుని మాట్లాడుతున్నారు. దాంతోపాటు ‘నల్ల కవర్ను పారేయడం’ గురించి కూడా మాట్లాడుతున్నారు. మెడికల్ షాప్కు వెళ్లి ప్యాడ్స్ అడిగితే వాటిని ఒక నల్ల కవర్లో చుట్టి ఇచ్చే ఆనవాయితీ ఉంది ఈ దేశంలో. ఎందుకు నల్లకవర్? అదేమైనా తప్పు పదార్థమా? మామూలు టానిక్లు ఎంత ఓపెన్ గా కొంటామో అంతే ఓపెన్గా వీటిని కొని, తీసుకెళ్లే పరిస్థితి ఉండాలని స్త్రీలు అంటారు. భార్యకు అవసరమైన ప్యాడ్స్ కోసం భర్త, కుమార్తెకు అవసరమైన ప్యాడ్స్ కోసం తండ్రి మెడికల్ షాపుకు వెళ్లడం ఏ మేరకు ఉంది... వాటిని తెచ్చిపెట్టడం లో ఇబ్బంది/నామోషీ ఎందుకు ఉంది అని ఎవరికి వారు ఆలోచించుకోవాల్సిన రోజు ఈ రోజు. ∙∙ సాధారణంగా స్త్రీలకు పిరియెడ్స్ 28 రోజులకు వస్తాయి. అవి ఐదు రోజులు ఉంటాయి. అందుకే సంవత్సరంలో ఐదో నెల అయిన మేలో, 28వ తేదీని ‘మెన్స్ట్రువల్ హైజీన్ డే’గా పాటిస్తున్నారు. ఈ రోజు స్త్రీలు తమ శరీర ధర్మం పట్ల సమాజంలో రావాల్సిన మార్పు గురించి మాట్లాడతారు. గుర్తు చేస్తారు. సమాజం దీనిగురించి స్పందించాల్సి ఉంటుంది. స్త్రీల గురించి ఎన్నో చేయాలి. అనుక్షణం ఆలోచించాలి. ప్రత్యేకంగా రోజులను ఖరారు చేసి పదే పదే చెప్పేది అందుకే. స్త్రీలు కోరే ‘విద్యావంతమైన’ సమాజం త్వరలోనే వస్తుందని ఆశిద్దాం. – సాక్షి ఫ్యామిలీ -
కొడుక్కి ఎంతైనా ఇస్తా.. కూతురికి ఇవ్వను!
ప్రతీ బిడ్డ తల్లిదండ్రులకు సమానమే. కానీ, ఆడా-మగా తేడాతో ప్రేమను కురిపించే తల్లిదండ్రులు ఈ సమాజంలో ఇప్పటికీ ఉన్నారు. పిల్లల్ని పెంచే పద్ధతిలోనూ లింగ వివక్ష చూపించే తల్లిదండ్రులు ఉన్నారంటే ఆశ్చర్యం కలగకమానదు. అలాంటి ఓ తండ్రిని జనాలు ‘ఛీ’ కొట్టిన ఘటన ఒకటి జరిగింది. ప్రముఖ వెబ్సైట్ రెడ్డిట్లోని ఒక ఫోరమ్లో కొన్నాళ్ల క్రితం ఒక వ్యక్తి ఇలా పోస్ట్ చేశాడు. ‘‘నా వయసు యాభై ఏళ్లు. నా భార్య పదేళ్ల క్రితం చనిపోయింది. నాకు పదిహేడేళ్ల కొడుకు, పదిహేనేళ్ల కూతురు ఉన్నారు. వాళ్లిద్దరి ఖర్చుల కోసం డబ్బులు ఇవ్వాల్సిన బాధ్యత నాది. నా కొడుక్కి కావాల్సినంత డబ్బు ఇస్తాను. కానీ, నా కూతురికి మాత్రం ఇవ్వదల్చుకోలేదు. కారణం, శానిటరీ ప్యాడ్స్, పీరియడ్ ప్రొడక్టుల కోసం ఆమె విపరీతంగా ఖర్చుచేస్తోంది. అందుకే ఆ ఖర్చు కోసం ఆమెనే డబ్బు సంపాదించి నాకివ్వమని చెప్పా. అందుకోసం నాలుగు ఇళ్లలో పని చేయమని సలహా ఇచ్చాను. కానీ నా కూతురికి అది నచ్చలేదు. వెంటనే బ్యాగ్ సర్దేసుకుని నా సోదరి ఇంటికి వెళ్లిపోయింది. తిరిగి ఇంటికి పంపించమని నా సోదరిని అడిగితే.. ఆమె నన్ను బండబూతులు తిట్టింది. ఇందులో ఏమైనా తప్పుందా?’’ అని నెటిజన్స్ను అడిగాడు. అంతే.. ఆ పోస్టుకి ఇప్పుడు వేల మంది రియాక్ట్ అయ్యారు. ఆ తండ్రిని ఇష్టమొచ్చినట్లు తిట్టిపోశారు. సెక్సీయెస్ట్ ఎబ్యూజింగ్ కేస్ కింద ఆ తండ్రిని జైల్లో వేయాలని కొందరు పోలీసులను కోరారు. అలాంటి తండ్రి దగ్గర ఉండే కంటే.. దూరంగా ఎక్కడైనా ప్రశాంతంగా బతకమని ఆ కూతురికి సలహా ఇచ్చారు మరికొందరు. -
‘మాస్కు’ల నిర్వీర్యానికి ఏపీలో 8 వేల ఇన్సినెరేటర్ యంత్రాలు
సాక్షి, అమరావతి: ప్రస్తుత కరోనా కాలంలో గ్రామాలు, పట్టణాలు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు దాదాపు మాస్కులను ఉపయోగిస్తున్నారు. ఒకసారి వాడి పారేసిన మాస్కుల ద్వారా వైరస్ వ్యాప్తికి అవకాశం లేకుండా వాటిని ఎక్కడికక్కడే శాస్త్రీయ విధానంలో తగలబెట్టడానికి ప్రతి గ్రామానికి ఒక అధునాతన యంత్రాన్ని అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా యంత్రాల ద్వారా 500–700 డిగ్రీల ఉష్ణోగ్రతల వద్ద వాడిపారేసిన మాస్క్లను దహనం చేస్తారు. ఈ సందర్భంగా ఎటువంటి పొగ కూడా రాదు. వీటిని ఇన్సినెరేటర్లుగా పిలుస్తారు. మాస్కులతోపాటు సాధారణ రోజుల్లో మహిళలు, ఆడపిల్లలు ఉపయోగించే శానిటరీ నాప్కిన్స్ను ఈ యంత్రాల ద్వారా సురక్షిత మార్గాలలో తగలబెట్టే వీలుంటుందని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అధికారులు వెల్లడించారు. అన్ని రకాల బయో వ్యర్థాలను సైతం ఈ యంత్రాల ద్వారా నిర్వీర్యం చేయొచ్చని అధికారులు వెల్లడించారు. ► పట్టణాలలో ఈ తరహా వ్యర్థాల కోసం ఇప్పటికే ప్రత్యేక వ్యవస్థ అందుబాటులో ఉంది. అన్ని ఆస్పత్రుల నుంచి బయో వేస్ట్ మెటీరియల్ను ఎప్పటికప్పుడు సేకరించి, వాటిని నిర్వీర్యం చేయడానికి వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఒక ఏజెన్సీ పనిచేస్తుంది. ► గ్రామాల్లోనూ ఇలాంటి వ్యవస్థ ఉండాలని పారిశుధ్య కార్యక్రమాల అమలుపై పంచాయతీరాజ్ శాఖ, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అధికారులతో జరిగిన సమీక్షలో సీఎం జగన్ ఆదేశించడంతో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ► మన రాష్ట్రంలో మహిళలకు ఏటా 8 కోట్ల నాప్కిన్స్ ప్యాడ్స్ సరఫరా జరుగుతున్నట్టు అంచనా. అలాగే ఇప్పుడు మాస్కుల వినియోగం పెరిగింది. గ్రామాల్లోని ఆస్పత్రుల్లోనూ బయోవ్యర్థాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వీటన్నిటిని సురక్షిత పద్ధతిలో నిర్వీర్యం చేయడానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ► ఇప్పటికే 8 వేల ఇన్సినెరేటర్లను కొనుగోలు చేశారు. ఏపీలో 13,371 గ్రామ పంచాయతీలకు ఒక్కొక్కటి చొప్పున వీటిని అందుబాటులో ఉంచేందుకుగాను మరో 6 వేల దాకా కొనుగోలుకు చర్యలు చేపడుతున్నారు. త్వరలోనే అన్ని గ్రామాల్లోనూ పూర్తిస్థాయిలో వీటిని వినియోగంలోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు స్వచ్చాంధ్ర కార్పోరేషన్ ఎండీ సంపత్కుమార్ ‘సాక్షి’ ప్రతినిధికి వివరించారు. ► జగనన్న స్వచ్ఛ సంకల్పం, క్లీన్ ఆంధ్రప్రదేశ్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లోనూ ఇంటింటి నుంచి తడి చెత్త, పొడి చెత్త వేర్వేరుగా సేకరించనుంది. ఇందులో వాడిపారేసిన మాస్క్లు, నాప్కిన్ ప్యాడ్స్ వంటి వాటిని వేరుగా వర్గీకరించి, వాటిని ఈ యంత్రాల ద్వారా నిర్వీర్యం చేస్తారు. -
స్కూళ్లు, కాలేజీల్లో శానిటరీ న్యాప్కిన్స్ సరఫరా
సాక్షి, అమరావతి: ఆరోగ్యకరమైన సమాజంలో బాలికలు పెరిగేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం.. ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలు, గురుకుల పాఠశాలల్లో చదువుతున్న వారికి ఉచితంగా శానిటరీ న్యాప్కిన్స్ను పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సోమవారం ప్రారంభించనున్నారు. అన్ని ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో చదువుతున్న 12–18 సంవత్సరాల విద్యార్థినులకు ప్రభుత్వం వీటిని ఇవ్వనుంది. శానిటరీ న్యాప్కిన్స్ కూడా కొనుగోలు చేయలేని తల్లిదండ్రులు ఎంతో మంది ఉన్నట్లు పలు సర్వేల్లో తేలింది. దీని వల్ల బాలికల విద్యకు విఘాతం కలుగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రస్తుతం ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న కౌమార దశ బాలికలు 12.50 లక్షల వరకు ఉన్నట్లు అంచనా. ఒక్కొక్కరికి సంవత్సరానికి 120 ప్యాడ్స్ ప్రకారం 15 కోట్ల ప్యాడ్స్ కావాల్సి ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఇందుకోసం రూ.41.4 కోట్ల నిధులు అవసరం అవుతాయి. తక్కువ ధరతో సరఫరాకు ఆలోచన ► పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని వైఎస్సార్ చేయూత దుకాణాల్లో శానిటరీ న్యాప్కిన్లను మహిళలకు తక్కువ ధరలకు విక్రయించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ► ఇందు కోసం మెప్మా, సెర్ప్లు రాష్ట్ర స్థాయిలో టెండర్ నిర్వహించడానికి సిద్ధమవుతున్నాయి. ఈ శానిటరీ నాప్కిన్లు లబ్ధిదారులకు ఎల్–1 రేటు కంటే 15% మార్జిన్తో అందించవచ్చని అధికారులు చెబుతున్నారు. గ్రామాల్లో చేయూత స్టోర్లు 35,105, పట్టణాల్లో 31,631 ఉన్నాయి. ► రాష్ట్రంలో 18–50 ఏళ్ల వయస్సు ఉన్న మహిళల సంఖ్య సుమారు 1.26 కోట్లు ఉంటుదని అంచనా. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే– 4 (2015–16) ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 15–24 సంవత్సరాల వయస్సు గల మహిళలు 67.5% మంది నెలవారీ పరిశుభ్రమైన పద్ధతిని ఉపయోగిస్తున్నారు. జాతీయ సగటు 57.6%గా ఉంది. ► జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే – వి (2019–20) ప్రకారం ఆంధ్రప్రదేశ్లో15–24 సంవత్సరాల వయస్సు గల మహిళలు 85.1% మంది రక్షణకు పరిశుభ్రమైన పద్ధతిని ఉపయోగిస్తున్నారు. (పట్టణాల్లో 90.6%, గ్రామీణ ప్రాంతాల్లో 82.5%) పరిశుభ్రమైన పద్ధతిలో స్థానికంగా తయారు చేసిన న్యాప్కిన్లు, శానిటరీ న్యాప్కిన్లు, టాంపోన్లు ప్రస్తుతం అందుతున్నాయి. మిగిలిన వారందరూ కూడా ఆరోగ్యకరమైన పద్ధతిని పాటించడం కోసమే ప్రభుత్వం చొరవ తీసుకుంది. -
బాలికల ఆరోగ్యంపై మరింత శ్రద్ధ: సీఎం జగన్
అమ్మ ఒడి పథకం కింద విద్యార్థుల నుంచి ల్యాప్టాప్ల ఆప్షన్ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలి. ల్యాప్టాప్ల సహకారంతో వారికి కోచింగ్ ఇవ్వాలి. ఇందు కోసం ఇంటరాక్టివ్ విధానంలో, టెక్నాలజీని ఉపయోగించుకుంటూ.. ఎంపిక చేసిన నిపుణుల సహకారం తీసుకోవాలి. తద్వారా వీలైనంత ఎక్కువ మంది విద్యార్థినులను పోటీ పరీక్షలకు సన్నద్ధం చేసే కార్యక్రమాన్ని రూపొందించాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ప్రభుత్వ విద్యా సంస్థల్లో 7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న బాలికలకు ఉచితంగా శానిటరీ నేప్కిన్స్ పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. బాలికల ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించాలని చెప్పారు. ఇందులో భాగంగా బ్రాండెడ్ కంపెనీలకు చెందిన శానిటరీ నేప్కిన్స్ను ఉచితంగా పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో బాలికలకు శానిటరీ నేప్కిన్స్ పంపిణీపై విద్య, వైద్య, ఆరోగ్య, మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులతో శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. మార్చి 8 (మహిళా దినోత్సవం)న ఉచిత శానిటరీ నేప్కిన్స్ పంపిణీ పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. ఏప్రిల్ 15 నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి, ఏప్రిల్ ఆఖరుకు ప్రతిష్టాత్మకమైన కంపెనీలతో సెర్ప్, మెప్మా.. ఎంఓయూలు కుదుర్చుకుంటాయని సీఎంకు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, గురుకుల పాఠశాలల విద్యార్థినులకు జూలై 1 నుంచి ప్రతి నెలా ఉచితంగా శానిటరీ నేప్కిన్స్ పంపిణీ చేస్తామని తెలిపారు. నెలకు 10 చొప్పున ఏడాదికి 120 శానిటరీ నేప్కిన్స్ ఇస్తామని, ఇందు కోసం సుమారు రూ.41.4 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేయనుందని వెల్లడించారు. ఆసరా, చేయూత కిరాణా స్టోర్స్లో తక్కువ ధరకే మంచి నాణ్యత కలిగిన, బయోడీగ్రేడబుల్ (త్వరగా భూమిలో కలిసిపోయే) శానిటరీ నేప్కిన్స్ అందుబాటులో ఉంచుతామన్నారు. ఇందు కోసం శానిటరీ నాప్కిన్స్ తయారు చేసే అత్యుత్తమ కంపెనీలతో మెప్మా, సెర్ప్ ఎంఓయూ చేసుకుంటాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. శిక్షణ కోసం ప్రఖ్యాత సంస్థల సహకారం విద్యార్థినులకు పోటీ పరీక్షల కోసం అత్యుత్తమ శిక్షణ ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ఇందు కోసం లాప్టాప్లను వాడుకోవాలని సూచించారు. అమ్మఒడి పథకంలో లాప్టాప్లు కావాలనుకున్న 9వ తరగతి ఆపై తరగతుల విద్యార్థులకు ఇప్పటికే ఆప్షన్ ఇచ్చామని సీఎం పేర్కొన్నారు. శిక్షణ కోసం ప్రఖ్యాత సంస్థలు, కోచింగ్ సెంటర్ల సహకారం తీసుకునే దిశగా ప్రణాళిక రచించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థినులకు లాప్టాప్లను ఇచ్చే సమయానికి, దాన్ని గరిష్టంగా వాడుకుని ఎలా లబ్ధి పొందవచ్చో ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ఈ సమీక్షలో వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఉచిత శానిటరీ నేప్కిన్స్ పంపిణీపై సీఎం జగన్ సమీక్ష
సాక్షి, అమరావతి : ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుకునే బాలికలకు ఉచితంగా శానిటరీ నేప్కిన్స్ పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువకుంటున్న 7 నుంచి 12వ తరగతి వరకు విద్యార్థినిలకు శానిటరీ నేప్కిన్స్ పంపిణీపై క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి విద్య, వైద్య, ఆరోగ్యం, మహిళా, శిశు సంక్షేమశాఖ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న 7 నుంచి 12 తరగతి వరకు విద్యార్థినిలకు బ్రాండెడ్ కంపెనీలకు చెందిన శానిటరీ నేప్కిన్స్ ఉచితంగా పంపిణీ చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. బాలికల ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహించాలని పేర్కొన్నారు. మార్చి 8 (మహిళా దినోత్సవం రోజున) ఉచిత శానిటరీ నేప్కిన్స్ పంపిణీ పథకం ప్రారంభం కానున్నట్లు సీఎం జగన్ తెలిపారు. అయితే ఏప్రిల్ 15 నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తామని సీఎంకు అధికారులు వివరించారు. ఏప్రిల్ నెలాఖరు నాటికి ప్రతిష్టాత్మకమైన కంపెనీలతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ స్కూల్స్, జూనియర్ కళాశాలలు, గురుకుల పాఠశాలల విద్యార్థినిలకు శానిటరీ నేప్కిన్స్ పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. జూలై 1 నుంచి ప్రతినెలా ఉచితంగా శానిటరీ నేప్కిన్స్ పంపిణీ కార్యక్రమం జరుగుతుందన్నారు. కాగా నెలకి 10 చొప్పున ఏడాదికి 120 శానిటరీ నేప్కిన్స్ను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. దీని కోసం సుమారు రూ. 41.4 కోట్లు ఖర్చు చేయనుంది. చదవండి: ఆ హక్కు ఎవరికీ లేదు: సీఎం జగన్ తక్కువ ధరకే శానిటరీ నేప్కిన్స్ గ్రామీణ ప్రాంతాల్లో చేయూత కిరాణా స్టోర్స్ ద్వారాతక్కువ ధరకే శానిటరీ నేప్కిన్స్ అందుబాటులో ఉంటున్నట్లు తెలిపారు. చేయూత స్టోర్స్లో అందుబాటు ధరల్లో బ్రాండెడ్ కంపెనీల శానిటరీ నేప్కిన్స్ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. దీనికోసం శానిటరీ నాప్కిన్స్ తయారీలో అత్యుత్తమ కంపెనీలతో మెప్మా, సెర్ప్ ఎంఓయూ ఏకం కానున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థినిలకు అత్యుత్తమ శిక్షణ విద్యార్థినిలకు పోటీ పరీక్షల కోసం అత్యుత్తమ శిక్షణ అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. దీనికోసం లాప్టాప్లను వాడుకోవాలన్నారు. అమ్మఒడి పథకంలో లాప్టాప్లు కావాలనుకున్న 9 తరగతి ఆపైన విద్యార్థులకు ఇప్పటికే ఆప్షన్ ఇచ్చామని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇస్తున్న కంప్యూటర్స్తో పాటు రెప్యూటెడ్ సంస్ధలు (కోచింగ్ ఇనిస్టిట్యూషన్స్) సహకారం తీసుకునే దిశగా ప్రణాళిక రచించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థుల నుంచి ల్యాప్టాప్ల ఆప్షన్ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. ల్యాప్టాప్ల సహకారంతో కోచింగ్ ఇవ్వాలన్నారు. ఇంటరాక్టివ్ విధానంలో, టెక్నాలజీని ఉపయోగించుకుంటూ.. ఎంపిక చేసిన నిపుణుల సహకారం తీసుకోవాలని పేర్కొన్నారు. దీని ద్వారా వీలైనంత ఎక్కువ మంది విద్యార్థినులను పోటీ పరీక్షలకు సన్నద్ధం చేసే కార్యక్రమాన్ని రూపొందించాలన్నారు. లాప్టాప్లను విద్యార్థినిలకు ఇచ్చే సమయానికి దాన్ని గరిష్టంగా వాడుకుని ఎలా లబ్ధి పొందవచ్చో ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, ఉన్నత విద్యాశాఖ, స్కిల్ డెవలప్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సతీష్ చంద్ర, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి వై శ్రీలక్ష్మి, మహిళా, శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఏ ఆర్ అనురాధ, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, సాంఘిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి కె సునీత, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, ఆర్థికశాఖ కార్యదర్శి కార్తికేయ మిశ్రా, మహిళా, శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ కృతికా శుక్లా, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వి చినవీరభద్రుడు, సమగ్ర శిక్షా అభియాన్ స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ వెట్రి సెల్వి, ఏపీఎస్సీహెచ్ఈ ఛైర్మన్ కె హేమచంద్రారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
మొదటి ప్రపంచ యుద్ధం ఇప్పటికీ ఉంది
మొదటి ప్రపంచ యుద్ధానికి ఇదేమీ ‘టైమ్’ కాదు. టైమ్ అంటే సందర్భం. వరల్డ్ వార్–1 మొదలైంది 1914 జూలై 14. ముగిసింది 1918 నవంబర్ 11న. ప్రారంభానికీ, ముగింపునకు వందేళ్లు ఎప్పుడో దాటిపోయాయి. పోనీ ఈ ప్రథమ ప్రపంచ సంగ్రామానికి కారకుడైన బోస్నియా యువకుడు గవ్రిలో ప్రిన్సిప్ బర్త్, డెత్ల తేదీల కూడా దగ్గర్లో ఏమీ లేవు. మరేమిటి! అకస్మాత్తుగా యుద్ధం–1? ఒక విశేషం అయితే ఉంది. ఎయిడ్స్కు కారణమైన హెచ్.ఐ.వి. వైరస్ అసలు ఎక్కడి నుంచి సంక్రమించిందో కనిపెట్టేందుకు దశాబ్దాలుగా పరిశోధనలు చేస్తున్న ఒక కెనడా ప్రొఫెసర్కు మధ్య ఆఫ్రికాలోని కామెరాన్లో మొదటి ప్రపంచ యుద్ధం మధ్య కాలం నాటి (1916) సైనికుడొకరు ఆకలికి తట్టుకోలేక ఒక చింపాజీని చంపి తినడంతో ఆ చింపాజీ నుంచి ఎయిడ్స్ క్రిమి సంక్రమించిన జాడలు కనిపించాయి. అలా.. చింపాంజీ టు మనిషి.. ఎయిడ్స్ వచ్చి ఉంటుందని ఆ ప్రొఫెసర్ గారొక ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ సంగతిని తాజాగా కెనడా, యూఎస్లలోని మెడికల్ జర్నల్స్ ప్రకటించాయి. ఎయిడ్స్ని అలా ఉంచితే.. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో మానవాళికి ‘సంక్రమించిన’ కొన్ని ఇన్వెన్షన్స్ కూడా ఉన్నాయి. వాటిలో కొన్నివి. చేతి వాచీ మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు మహిళలు మాత్రమే చేతివాచీలు ధరించేవారు. అయితే అవి వారికి ఆభరణాలుగా ఉండేవి. మగవారైతే కాలంతో తమకు పనేముంది అన్నట్లు ఉండేవారు. తెలియందేముంది! తామే కాలాన్ని నడిపిస్తున్నామన్న ఆ ఆధిక్య భావన భూమి పుట్టినప్పటి నుంచి మగజాతికి ఉన్నదే కదా! అయితే ఘరానా ఉండటం కోసం మాత్రం వాచీలను జేబుల్లో పైకి కనిపించేలా పెట్టుకుని తిరిగేవారు. యుద్ధం మొదలయ్యాక పగలూ రేయీ ఏకమై పురుషులు కూడా టైమ్ను చూసుకునేందుకు వీలుగా జేబుల్లోంచి తీసి చేతికి పెట్టుకోవలిసి వచ్చింది. ఆ రిస్ట్ వాచీలకు, పాకెట్ వాచీలకు మధ్యస్థ రూపం మరొకటి వచ్చింది. అవి ‘ట్రెంచ్ వాచీ’లు. వాటినే రిస్ట్లెట్స్ అనేవారు. ఒక గ్రేట్ వార్ వస్తే కానీ రిస్ట్వాచ్లు తగిలించుకోని ‘గ్రేట్’ పీపుల్ ఈ మగవాళ్లు! ఇది ఆవిష్కరణ కానీ, ఒక అలవాటుకు ఆరంభం. జిప్పులు మగవాళ్ల ప్యాంట్లకు, ఆడవాళ్ల గౌన్లకు మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు ‘హుక్లెస్ ఫాస్ట్నర్స్’ మాత్రమే ఉండేవి. ఇప్పుడు మనం చూస్తున్న జిప్పుల్లాంటివి అవి. లాంటివే కానీ, జిప్పులు కావు. గిడియోన్ సండ్బాక్ అనే స్వీడిష్ అమెరికన్ ఇంజినీరు చిక్కుపడని, కక్కేలు ఇరుక్కోని సాఫీగా ఉండే జిప్పులను హుక్కుతో పాటు 1914లో డిజైన్ చేశారు. ఆ యుద్ధ పరిస్థితుల్లో సైనిక వస్త్రాల అవసరాలకు కొత్త డిజైన్లలోని జిప్పులు ఎంతగానో ఉపయోగపడ్డాయి. చివరికి అవే మన్నికైనవిగా స్థిరపడ్డాయి. ఫ్యాషన్లు ఎన్ని మారినా, జిప్ డిజైన్ మాత్రం చెక్కు చెదరకుండా ఉంది. అంతకుమించి జిప్పులను మెరుగు పరచడానికి ఏమీ లేదని, మెరుగు పరిచే అవసరమే లేదని తర్వాత్తర్వాత వచ్చిన ఇంజనీర్లు తేల్చేశారు! స్టెయిన్లెస్ స్టీల్ తుప్పు పట్టని విధంగా క్రోమిమంతో తయారు చేసిన స్వచ్ఛమైన ఉక్కు ‘స్టెయిన్లెస్ స్టీల్’. మొదటి ప్రపంచ యుద్ధకాలానికి ముందు స్టెయిన్లెస్ స్టీల్ లేనేలేదు. యు.ఎ.లోని షెఫీల్డ్ ప్రాంతంలో ఉండే హ్యారీ బ్రియర్లీ యుద్ధ ప్రారంభ కాలమైన 1914 లో ఈ రకం స్టీల్ను కనిపెట్టారు. యుద్ధ విమానాల ఇంజిన్లు, మెస్ కిట్ సిల్వర్వేర్, వైద్య పరికరకాల తయారీకి ఒక మేలు రకమైన లోహం అవసరం అవడంతో, ఆ అవసరం నుంచి స్టెయిన్లెస్ స్టీల్ అవిర్భవించింది. పైలేట్స్ ఇదొక ఫిట్నెస్ టెక్నిక్. జోసెఫ్ పైలేట్స్ అనే జర్మన్ ఫిట్నెస్ మాస్టర్ ఈ టెక్నిక్ను (వ్యాయామ విధానం) మొదటి ప్రపంచ యుద్ధం ముగుస్తుండగా 1918 చివర్లలో వృద్ధి చేశారు. యుద్ధకాలంలో ఆయన ఆసుపత్రులలోని రోగుల నడకకు బలం చేకూర్చే పైలేట్స్ వ్యాయామం కోసం ‘క్యాడిలాక్’ అనే సాధనాన్ని రూపొందించారు. స్వయంగా ఆసుపత్రులకు వెళ్లి ఈ టెక్నిక్తో వ్యాయామ సేవలు కూడా అందిం చారు. శానిటరీ నేప్కిన్స్ 1914లో యూఎస్లోని కింబర్లీ క్లార్క్ అనే సంస్థ కలప గుజ్జుతో ఒక వస్త్రాన్ని తయారు చేసింది. యుద్ధ కాలంలో పత్తి కొరత ఏర్పడి, పత్తి వస్త్రాలకు అవసరం పెరగడంతో ప్రత్యామ్నాయంగా ఆ కంపెనీ గుజ్జు వస్త్రాన్ని కనిపెట్టింది. దానికి సెల్యుకాటన్ అని పేరుపెట్టింది. అమెరికా సైన్యంలోని క్షతగాత్రుల కోసం సర్జికల్ డ్రెస్సింగ్గా ఆ వస్త్రాన్ని సరఫరా చేసింది. రక్తస్రావాన్ని సెల్యుకాటన్ సమర్థం గా నిలువరించడంతో, యుద్ధానంతరం కొటెక్స్ శానిటరీ పాడ్స్ తయారు చేసి మార్కెట్లో విడుదల చేసింది. ఆ ప్రాడక్ట్కు అమితమైన ఆదరణ లభించింది. నేడు వాడుకలో ఉన్న శానిటరీ నేప్కిన్స్ వాటికి ఆధునాతన రూపమే. పోర్టబుల్ ఎక్స్–రేస్ తొలి ‘రేడియోలాజికల్ కారు’ అవిష్కరణ జరిగింది కూడా మొదటి ప్రపంచ యుద్ధ కాలంలోనే. ఈ కారును కనిపెట్టింది పోలెండ్ భౌతిక శాస్త్రవేత్త మేరీ క్యూరీ. ఈ వాహనంలో ఎక్స్ రే మిషన్ ఉండేది. ఫొటోగ్రాఫ్ డార్క్ రూమ్ పరికరాలు ఉండేవి. యుద్ధంలో గాయపడిన సైనికులకు చికిత్స చేయడానికి ఆర్మీ సర్జన్లు నేరుగా యుద్ధ క్షేత్రంలోనికే ఈ రేడియోలాజికల్ కార్లను నడుపుకుంటూ వెళ్లేవారు. -
స్కాట్లాండ్ ఓకే చెప్పింది
ప్రపంచంలోనే తొలిసారి ఇలాంటి ఒక చట్టం తెచ్చిన ఘనతను స్కాట్లాండ్ దక్కించుకుంది. బిల్లు చట్టం కాగానే దేశవ్యాప్తంగా మహిళలకు శానిటరీ ప్యాడ్స్ ఉచితంగా లభిస్తాయి. ఉచిత విద్యకు, ఉచిత ఆరోగ్య భద్రతకు బిల్లు తెచ్చినంత సులభంగా ఉండదు ఉచితంగా శానిటరీ ప్యాడ్స్ను పంపిణీ చేసే బిల్లుకు ఆమోదం లభించడం. ‘అవసరమా?’ అనే ప్రశ్న మొదటే పురుషుల నుంచి వస్తుంది. ఆ తర్వాత ప్రతిపక్షం నుంచి వస్తుంది. తిండికి లేదా? పెడదాం. చదువుకోవాలని ఉందా? చదివిద్దాం. అనారోగ్యం వస్తే వైద్య ఖర్చులకు డబ్బుల్లేవా? ఉచితంగా వైద్యం చేయిద్దాం. కానీ ఇదేంటి! శానిటరీ న్యాప్కిన్లను, టాంపన్లను ప్రభుత్వం ఉచితంగా ఇవ్వడం.. అని రెండేళ్లుగా ‘పీరియడ్ ప్రాడక్ట్స్ (ఫ్రీ ప్రొవిజన్) చట్టం’ బిల్లుకు స్కాట్లాండ్ పార్లమెంటులో విపక్ష సభ్యులు అభ్యంతరం చెబుతూ వస్తున్నారు. అనుకూలంగా ఓటేయకుండా బిల్లును ఆపుతున్నారు. ఎట్టకేలకు.. ఏడాదికి కనీసం 86 కోట్ల రూపాయల ఆర్థిక భారాన్ని ప్రభుత్వంపై మోపే ‘పీరియడ్ పావర్టీ బిల్లు’కు మంగళవారం నాడు ఏకగ్రీవ ఆమోదం లభించింది. దాంతో ప్రపంచంలోనే తొలిసారి ఇలాంటి ఒక చట్టం తెచ్చిన ఘనతను స్కాట్లాండ్ దక్కించుకుంది. అన్ని పేదరికాల మాదిరిగానే ప్యాడ్స్ని కొనలేని పేదరికం కూడా ఉంటుందని అంటూ ఈ బిల్లుకు ఊపిరిపోసి, బిల్లు సాధనకు ఉద్యమరూపం తెచ్చి, సభ ఆమోదం పొందగలిగేవరకు ఆవిశ్రాంతంగా పోరాటం జరిపిన మోనికా లెనన్ (39) ఇప్పుడు ఆ దేశంలోని మహిళల మన్ననలను పొందుతున్నారు. బిల్లు ముసాయిదాలో పలుమార్లు కనిపించే ‘పీరియడ్ పావర్టీ’ అనే మాటను కూడా తనే సృష్టించిన మోనికా 2016 నుంచీ స్కాటిష్ లేబర్ పార్టీ ఎంపీగా ఉన్నారు. ఆమె స్త్రీవాది, శాకాహారి. బిల్లు చట్టం రూపం ధరించగానే దేశవ్యాప్తంగా కమ్యూనిటీ సెంటర్లు, విద్యాసంస్థలు, యూత్ క్లబ్బులు, ఫార్మసీ దుకాణాలన్నింటిలోనూ మహిళలకు శానిటరీ న్యాప్కిన్స్, టాంపన్లు ఉచితంగా అందుబాటులోకి వస్తాయి. ‘‘ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయడాన్ని గర్వంగా భావిస్తున్నాను’’ అని స్కాట్లాండ్ మహిళా ప్రధాని (ఫస్ట్ మినిస్టర్ అంటారు) నికోలా స్టురియన్ ట్వీట్ చేస్తూ, ‘మహిళలకు, బాలికలకు అవసరమైన ఒక ముఖ్యమైన ప్రభుత్వ విధానంగా’ ఈ చట్టాన్ని అభివర్ణించారు. అరకోటికి పైగా జనాభా వున్న స్కాట్లాండ్ యు.కె. కిందికి వస్తుంది. ‘ప్లాన్ ఇంటర్నేషనల్ యుకె’ అనే సంస్థ 2017 లో జరిపిన ఒక సర్వేలో యు.కె.లోని ప్రతి 10 మంది బాలికల్లో ఒకరు ప్యాడ్స్ కొనే స్థితిలో లేనివారే. అంతేకాదు, యు.కె.లో 14–21 ఏళ్ల మధ్య వయసులో ఉన్న బాలికల్లో సగం మంది ఆర్థిక ఇబ్బందుల కారణంగా ప్యాడ్స్ కొనలేకపోతున్నవారే. -
ఒక వ్యక్తి.. వంద బృందాలు
ఆమె లాక్డౌన్ సమయంలో మహిళా పోలీసుల టాయ్లెట్ అవసరాలకు 20 వానిటీ వాన్లను స్వచ్ఛందంగా ఏర్పాటు చేసింది. లాక్డౌన్ బాధిత మహిళల కోసం సహాయానికి ‘దాన ఉత్సవం’ అంటూ పిలుపు ఇచ్చి సహాయం అందేలా చూసింది. ఇప్పుడు ఆమె ‘పాడ్ స్క్వాడ్’ పేరుతో దేశంలోని దిగువ మధ్యతరగతి స్త్రీలకు, బాలికలకు శానిటరీ ప్యాడ్స్ అందేలా మొదలెట్టిన ఉద్యమం అనేక బృందాలుగా ఎదిగి ప్యాడ్స్ పంపకం చేస్తోంది.ఆమె పేరు చిత్రా సుబ్రమణియన్. బాలీవుడ్లో నిర్మాత. సామాజిక కార్యకర్త. మార్చిలో లాక్డౌన్ విధించారు. కోవిడ్ భయోత్పాతం సృష్టిస్తూ ఉంది. అయినా సరే పోలీసులు డ్యూటీలు చేస్తున్నారు. మహిళా పోలీసులకు మినహాయింపు లేదు. ముంబై నగరంలో వందల మంది మహిళా పోలీసులు లాక్డౌన్ అమలు కోసం గస్తీ తిరుగుతున్నారు. వారు కొంత ఫ్రెష్ అవడానికి, టాయిలెట్ అవసరాలు తీర్చుకోవడానికి ఏర్పాటు ఏమిటి అనే అక్కర వచ్చింది చిత్రా సుబ్రమణియన్కు. ఆమె బాలీవుడ్లో నిర్మాత. మధుర్ భండార్కర్ దర్శకత్వం వహించిన ‘కార్పొరేట్’కు, అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన ‘రిటర్న్ ఆఫ్ హనుమాన్’ సినిమాలకు ఒక నిర్మాతగా వ్యవహరించింది. అయితే సినిమా రంగంతో పాటు సామాజిక రంగాలలో కూడా ఆమె పని చేస్తోంది. అందుకని వెంటనే ఆమె ముంబై ప్రొడ్యూసర్స్ గిల్డ్తో మాట్లాడి ప్రొడక్షన్ కోసం పని చేస్తూ లాక్డౌన్ వల్ల ఖాళీగా ఉన్న 20 వానిటీ వ్యాన్లను తన ఖర్చు మీద ముంబై వీధుల్లోకి దింపింది. దీనికి ఆమె చేసిన నామకరణం ‘మిషన్ సురక్ష’. నగరంలోని మూలమూలకు తిరుగుతూ మహిళా డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ్య సిబ్బంది, పోలీసులు వీటిని ఉపయోగించే విధంగా చేయడంతో చిత్రా సుబ్రమణియన్ పేరు విశేషంగా ప్రశంసకు నోచుకుంది. ప్యాడ్ స్క్వాడ్ లాక్డౌన్ సమయంలో ‘అత్యవసర వస్తువుల’ పట్టికలో శానిటరీ ప్యాడ్స్ను ప్రభుత్వం చేర్చకపోవడం వల్ల వాటిని తయారు చేసే చిన్న పెద్ద తరహా పరిశ్రమలు కూడా మూతపడ్డాయి. ప్రభుత్వం మేల్కొని వాటిని చేర్చే లోపల ప్యాడ్స్ ఉత్పత్తికి చెప్పుకోదగ్గ విఘాతమే జరిగింది. ఆ సమయంలో కొనుగోలు శక్తి ఉన్నవారికి ప్యాడ్స్ దొరక్కపోవడాన్ని చిత్ర సుబ్రమణియన్ గమనించింది. వీరి పరిస్థితే ఇలా ఉంటే ఆర్థిక వెనుకబాటుతనం ఉన్న వర్గాల స్త్రీలు, బాలికలు ఏం ఇబ్బందులు పడుతున్నారో అని ఆమెకు అనిపించింది. దాని నుంచి ఆమెకు వచ్చిన ఆలోచనే ‘ప్యాడ్ స్క్వాడ్’ స్థాపన. దేశంలోని అన్ని రాష్ట్రాల ఆర్థిక వెనుకబాటు వర్గాల స్త్రీలకు, యువతులకు, బాలికలకు ప్యాడ్స్ అందాలన్న లక్ష్యంతో జూన్లో ఆమె ప్యాడ్ స్క్వాడ్ను ముంబైలోని తోటి మిత్రులతో స్థాపించింది. దేశంలోని వివిధ రాష్ట్రాలలో మౌలిక స్థాయిలో పని చేస్తున్న ఎన్.జి.ఓలను సంప్రదించి తాము ప్యాడ్స్ పంపుతామని, అవసరమున్న ప్రతి ఒక్కరికీ అందించాలని కోరింది. వారు ఒప్పుకున్నారు. సోషల్ మీడియా ఆయుధంగా చిత్రా సుబ్రమణియన్ సోషల్ మీడియా ఆధారంగా ‘ప్యాడ్ స్క్వాడ్’ గురించి ప్రచారంలోకి తెచ్చింది. మెల్లగా ఒక్కొక్కరు ఆమె తమ వంతు సహాయంగా ముందుకు వచ్చారు. వీరికి ‘ప్యాడ్ స్క్వాడర్స్’ అనే పేరు పెట్టింది. వీరు విరాళాల రూపంలో వివిధ బృందాల నుంచి, వ్యక్తుల నుంచి, దాతల నుంచి ప్యాడ్స్ సేకరించారు. ఇప్పటి వరకూ మొత్తం 5 లక్షల ప్యాడ్స్ను ఇప్పటి వరకూ పంపిణీ చేశారు. ముంబై, పూణె, ఢిల్లీ, జబల్పూర్, హుబ్లీ, సుందర్బన్స్, కోల్కటా ఇత్యాది ప్రాంతాల్లో చిత్రా సుబ్రమణియన్తో చేతులు కలిపిన బృందాలు ఎక్కడికక్కడ ప్యాడ్స్ను పంచాయి. ఇంటింటా ప్యాడ్ పెట్టె స్త్రీల నెలసరి అవసరాలు ఒక నెలతో తీరేవి కాదు. ప్రతి నెలా ప్యాడ్స్ కావాల్సిందే. అలాగే ఎప్పటికప్పుడు రుతుచక్రంలోకి ప్రవేశించే బాలికలు కూడా ఉంటారు. ‘బహిష్టు సమయంలో పాటించాల్సిన శుభ్రత గురించి ప్రచారం చేయడం ఒక పని అయితే శానిటరీ ప్యాడ్స్ వాడాల్సిన అవసరాన్ని తెలియచేయడం వారికి అవి అలవాటు చేయడం మరో పని’ అంటారు చిత్రా సుబ్రమణియన్. అందుకే ఆమె తన ప్యాడ్ స్క్వాడర్స్ను ఒక చిట్కా పాటించమని చెప్పారు. తాము ఉంటున్న అపార్ట్మెంట్లలో కాలనీల్లో అందరికీ తెలిసేలా ఒకచోట ‘ప్యాడ్ పెట్టె’ను పెట్టమని చెప్పారు. పురుషులైనా స్త్రీలైనా తమ వంతుగా తాము విరాళం ఇవ్వదగినన్ని ప్యాడ్స్ కొని ఆ పెట్టెలో వేయాలి. పెట్టె నిండాక వాటిని పంచడానికి తీసుకు వెళతారు. ఈ ఆలోచన వచ్చిన వెంటనే చిత్రకు తోడు నిలిచిన మిత్రులు తమ ఇళ్లల్లో కాలనీల్లో ప్యాడ్ పెట్టెను ఏర్పాటు చేశారు. ఆశ్చర్యం ఏమిటంటే వాటికి అద్భుతమైన స్పందన వచ్చింది. ‘డబ్బులు ఇస్తే దుర్వినియోగం అవుతాయని కొందరికి సందేహం ఉంటుంది. ఇవి ప్యాడ్స్ కాబట్టి అందరూ కొని డబ్బాలో వేశారు’ అని చిత్రా చెప్పారు. ఇది మాత్రమే కాక చిత్రా సుబ్రమణియన్ మహారాష్ట్రలో సాగుతున్న ‘శ్రామిక్ సమ్మాన్’ కార్యక్రమంలో కూడా పాల్గొంటున్నారు. వలస కూలీలకు ఉపాధి చూపే కార్యక్రమం ఇది. అంతే కాక లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి ముంబైలో సాగుతున్న కమ్యూనిటీ కిచెన్స్కు కూడా తన వంతు సహాయం అందిస్తున్నారు. చిత్రా సుబ్రమణియన్ చేస్తున్నది మంచిపని. ఏ మంచిపని అయినా ఒంటరిది కాదు. కదిలి వస్తున్న చేతులతో ఈ పని రోజురోజుకూ విస్తృతం అవుతూనే ఉంది. అవడమూ ఖాయమే. డింపుల్ కౌర్ ప్యాడ్ దీదీ భిలాయ్ మురికివాడల్లోని మహిళలు డింపుల్ కౌర్ను అభిమానంగా ‘ప్యాడ్ దీదీ’ అని పిలవడం వెనుక ఉన్న కారణం లక్షల మందికి ఆమె ఉచితంగా ప్యాడ్లను పంపిణీ చేయడం మాత్రమే కాదు. స్త్రీల ఆరోగ్య సమస్యలపై ఆమె ఆ మహిళలను చైతన్యవంతులను చేయడం కూడా. కుటుంబంలో ఒక అక్క ఉంటే చెల్లెళ్లకు చాలా సమస్యలకు పరిష్కారాలు తెలుస్తాయి. ఛత్తీస్గడ్లోని భిలాయ్లో ఉంటున్న 49 ఏళ్ల డింపుల్ కౌర్ తన కుటుంబంలోని వారు కాని ఎంతోమంది చెల్లెళ్ల సమస్యలను పరిష్కరించాలనుకుంది. వారు అనారోగ్యం బారిన పడకుండా కాపాడాలనుకుంది. పాఠశాలలు, కళాశాలలు, మురికివాడలలో ఉన్న మహిళలను, బాలికలను కలిసి ఇప్పటివరకు 5 లక్షల శానిటరీ ప్యాడ్లను పంపిణీ చేసింది. అంతేకాదు, రుతుక్రమంలో వచ్చే సమస్యలు, సలహాలు సూచనలు ఇస్తోంది. దీంతో ఇక్కడి మహిళలంతా డింపుల్ కౌర్ను అభిమానంగా ‘ప్యాడ్ దీదీ’ అని పిలుస్తున్నారు! డిపుల్ కౌర్ ‘అనుభూతి శ్రీ ఫౌండేషన్’ పేరుతో 2016 లో ఎన్జీవోను ప్రారంభించింది. ఈ ఎన్జీవో ద్వారా చత్తీస్గడ్లోనే కాకుండా మధ్యప్రదేశ్, జార్ఖండ్ మురికివాడల్లోని మహిళలకు ఉచిత శానిటరీ న్యాప్కిలను పంపిణీ చేస్తోంది. ‘జీవితంలో ఇబ్బందులు తలెత్తినప్పుడు, వాటి నుండి బయటకు రావడానికి పరిష్కారాలు మాత్రమే చూడాలి’ అంటుంది కౌర్. నాలుగేళ్లలో డింపుల్ కౌర్ పాఠశాలలు, కళాశాలలు, మురికివాడల్లో 5 లక్షల శానిటరీ ప్యాడ్లను పంపిణీ చేసింది. ఏడు నెలల్లో మూడు ఆపరేషన్లు! రుతుక్రమ సమస్య వల్ల డింపుల్కి ఏడు నెలల్లో మూడు ఆపరేషన్లు జరిగాయి. తన సమస్య గురించి ప్రస్తావించిన డింపుల్ – ‘నేను చాలా కాలం రుతుక్రమ సమస్యతో బాధపడ్డాను. దీని గురించి మా కుటుంబంలో పెద్దలకు అవగాహన లేదు. రుతుక్రమ లోపాల వల్ల కలిగే హాని గురించి తెలియకపోవడం వల్ల నేను చాలా నష్టపోయాను. నేటికీ చాలా మంది విద్యావంతులైన మహిళలకూ రుతుక్రమ లోపాల గురించి సరిగా తెలియదని గమనించాను. మీకు రుతుక్రమంలో సమస్య ఉంటే, సరైన సమయంలో వైద్యుడిని కలిసి వారి సూచనలు తీసుకోండి. నిర్లక్ష్యం చేయకండి’ అని తను వెళ్లిన ప్రతీచోటా చెబుతోంది డింపుల్. నాలుగేళ్లుగా మూడు రాష్ట్రాల్లోని 40 పాఠశాలల్లో ప్యాడ్లను పంపిణీ చేసింది కౌర్. ఆమె ఏర్పాటు చేసిన ఫౌండేషన్ బ్రాంచీలు కుజబల్పూర్, జంషెడ్పూర్లలో ఉన్నాయి. లాక్డౌన్ సమయంలోనూ ఆమె తన మిషన్ను ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగించింది. తన బృందంతో కలిసి వలస కార్మిక మహిళలకు 20,000 ప్యాడ్లను పంపిణీ చేసింది. ఇప్పటికీ చేస్తూనే ఉంది. – సాక్షి ఫ్యామిలీ -
వరదసాయంలో శానిటరీ ప్యాడ్స్ ఎక్కడ?!
ప్రశ్నించడంలోనే ప్రగతి ఉంది. ప్రశ్నిస్తేనే పరిష్కారం ఉందని నమ్ముతుంది మయూరి భట్టాచార్జీ. అస్సాంలోని లక్షాలాది మహిళల తరపున తన గళం విప్పుతోంది. విషయం ఏంటంటే.. అస్సాంలో ప్రతీ యేటా వరద తాకిడి ఉదృతంగా ఉంటుంది. ఎన్నో ప్రాంతాలు జలమయం అవుతూనే ఉంటాయి. లక్షలాది మంది నిరాశ్రయులు అవుతుంటారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అందించే వరద సాయంలో నిత్యావసరాలు ప్రజలకు అందుతుంటాయి. అయితే, ఆ జాబితాలో లక్షలాది మంది మహిళలు ఎదుర్కొనే నెలసరి సమస్యకు శానిటరీ ప్యాడ్స్ ఉండితీరాల్సిందే అని రాష్ట్రప్రభుత్వాన్ని కోరుతోంది మయూరి. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ‘ఛేంజ్’(change.org)వెబ్సైట్ ద్వారా అస్సాం మహిళల తరపున పిటిషన్ దాఖలు చేసింది. దీనికి ఇప్పటి వరకు దాదాపు లక్ష మంది మయూరి భట్టాచార్జీకి సపోర్టర్స్గా చేరారు. మయూరి భట్టాచార్జీ ప్యాడ్స్ లేకపోవడం సమస్య కాదా..! అస్సాంలోని తేజ్పూర్కు చెందిన భట్టాచార్జీ విపత్తు సమయంలో ఆదుకునేవారికి జాబితాలో శానిటరీ ప్యాడ్లను చేర్చాలని విదేశాంగ మంత్రి హేమంత్ బిస్వా శర్మను కోరారు. మహిళలకు సహాయ శిబిరాలలో స్థానం ఇచ్చినప్పుడు, వారికి శానిటరీ ప్యాడ్ల సౌకర్యం ఉండటం లేదు. దీని వల్ల మహిళలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అస్సాం రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ ఆగస్టు 21 న ప్రచురించిన రోజువారీ వరద నివేదిక ప్రకారం, అస్సాంలో వరదలు 30 జిల్లాల్లో 56.9 లక్షలకు పైగా ప్రజలను ప్రభావితం చేశాయి. ఒక్క వస్త్రమూ శుభ్రంగా ఉండదు.. కార్యకర్త మయూరి భట్టాచార్జీ రిలీఫ్ కిట్లలో శానిటరీ ప్యాడ్లను చేర్చాలని ఛేంజ్ ద్వారా పిటిషన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మయూరి మాట్లాడుతూ –‘ప్రతి యేటా అస్సాంలో వరదలతో బాధపడుతున్న లక్షలాది మంది బాలికలు, మహిళల తరపును నేను ప్రాతినిధ్యం వహిస్తున్నాను. ఇక్కడ వరద నీరు వచ్చినప్పుడు, ఇంట్లో ఒక్క వస్త్రం కూడా శుభ్రంగా, పొడిగా ఉండదు. ఈ మహిళలకు సహాయ శిబిరంలో స్థానం ఇచ్చినప్పుడు, వారికి శానిటరీ ప్యాడ్ల సౌకర్యం లేదు. అలాగే టాయిలెట్ల నిర్వహణ సరిగ్గా ఉండదు. ఇలాంటప్పుడు ఎంత వ్యధ.. ఈ సమస్యను అర్ధం చేసుకోరేంటి. ఈ వరదలతో మహిళలు అన్ని సమస్యలతో పాటు, శానిటరీ ప్యాడ్లు లేకపోవడం అనే ప్రధాన సమస్యనూ ఎదుర్కొంటున్నారు. ఇది ఎందుకు సమస్యగా ప్రభుత్వాలకు పట్టడం లేదు. వరదల కారణంగా కాలాలు ఆగవు. శానిటరీ ప్యాడ్లను రిలీఫ్ మెటీరియల్ జాబితాలో చేర్చడానికి మనం ఎన్నాళ్లు ఎదురుచూడాలి?!’ అని ప్రశ్నిస్తోంది మయూరి భట్టాచార్జీ. ఈ విషయమ్మీద నిరంతరం రాష్ట్ర మంత్రికి ఇ–మెయిల్ చేస్తూనే ఉంది. కానీ స్పందన రావడంలేదు. దీంతో మయూరి ఈ పిటిషన్ను ప్రారంభించింది. త్వరలోనే దీనికి రాష్ట్రప్రభుత్వం నుంచి స్పందన వస్తుందని ఆశిస్తున్నారు. విపత్తుల సమయాల్లో మహిళల నెలసరి సమస్యనూ పరిగణనలోకి తీసుకోవాలి అని మయూరి భట్టాచార్జీ చేస్తున్న ప్రయత్నం ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరినీ ఆలోచింపజేస్తుంది. -
ధీమా రెడ్డి
ఇన్నాళ్లకు కూడా బితుకు బితుకే. సిగ్గుతో చితుకు చితుకే. మూడురోజుల నెలసరి తప్పు కాదు. నేరం కాదు. పాపమూ కాదు. అది ప్రకృతి. దేహ ప్రవృత్తి. దానికి శానిటరీ ప్యాడ్ వాడాలని తెలియదు కొందరికి. తెలిసినా ధైర్యంగా కొనే ధీమా ఉండదు అందరికీ. ఊర్లో ఈ పరిస్థితిని భూమా రెడ్డి గమనించాడు. వారికి ధీమా ఇవ్వడానికి సంకల్పించాడు. ఆడపిల్లల పాలిట అతడో ప్యాడ్ మ్యాన్. ‘అంకుల్.. టెన్ రుపీస్ది ఒక డెయిరీ మిల్క్ ఇవ్వరా?’ అంటూ యాభై రూపాయల నోటు ఇచ్చింది ఓ అమ్మాయి. దుకాణందారు ఆ నోటు తీసుకుంటూండగా అందులోంచి కాగితం మడత కింద పడింది. ‘అంకుల్ ఒక విష్పర్ను పేపర్లో చుట్టి క్యారీబ్యాగ్లో పెట్టివ్వరా?’ అని రాసుంది అందులో. విష్పర్ను ప్యాక్ చేసి ఇచ్చాడు షాప్ యజమాని. అతనికిది కొత్తకాదు. చాలా మంది ఆడపిల్లలు అలాగే స్లిప్ మీద రాసిస్తారు. ధైర్యంగా ‘శానిటరీ పాడ్స్’ కావాలని అడగరు. ‘బిస్కెట్లు, పెన్లు, బిందీల్లా ఇదీ అవసరమే కదా! ఎందుకు గట్టిగా అడగరు. ఎందుకంత సిగ్గు? దీన్నెట్లా పోగొట్టాలి?’ అనే ఆలోచనలో పట్టాడు ఆ షాప్ యజమాని. అతని పేరు చిట్యాల భూమారెడ్డి. దుకాణదారు. జగిత్యాల జిల్లా, సారంగపూర్ మండలం, లచ్చక్కపేట అతని సొంతూరు. ఆ ఊర్లో మహిళల నెలసరి అవసరం పట్ల ఉన్న సిగ్గును, మొహమాటాన్ని దూరం చేయాలి అనుకున్నాడు అతను. అంతే కాదు శానిటరీ పాడ్స్ తయారు చేయడానికి కూడా సంకల్పించాడు. అధ్యయనం... ఆచరణ రెండేళ్ల క్రితం ఈ ఆలోచన వచ్చాక శానిటరీ ప్యాడ్స్కు సంబంధించి తన ఊరితోపాటు చుట్టుపక్కల ఊళ్లల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో గమనించాడు. తన ఊళ్లో ఈ ప్యాడ్స్ అడగడానికి మొహమాటపడుతుంటే చుట్టుపక్కల ఊళ్లలో వీటి ఉపయోగం చాలా తక్కువగా ఉందని తెలిసింది అతనికి. నెలసరి సమయంలో శుభ్రత లోపించి అనారోగ్య సమస్యలు తెచ్చుకొని చిన్న వయసులోనే గర్భసంచి తొలగించే శస్త్రచికిత్సకి గురైన కేసులూ ఎక్కువే అని తేలింది. వీటన్నిటికీ పరిష్కారం బయోడీగ్రేడబుల్ శానిటరీ ప్యాడ్స్ వాడకం మీద చైతన్యం తేవడం, అలాంటి ప్యాడ్స్ తయారు చేసి తక్కువ ధరకు పంపిణీ చేయడమే అనుకున్నాడు. వాటిని తయారు చేయడమెలాగో తెలుసుకోవడానికి పరిశోధన మొదలుపెట్టాడు. ఇంటి నుంచి మొదలు భూమారెడ్డి చేస్తున్న ప్రయత్నం గురించి ఒక మిత్రుడికి తెలిసింది. ‘అలాంటి ప్యాడ్స్ తయారు చేసే యూనిట్ మహబూబ్నగర్లో ఉన్నట్టుంది కనుక్కో’ అని సూచించాడు. ఆ మాటతో మహబూబ్ నగర్ వెళ్లాడు. అప్పటి మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ ఓ ఇరవై మంది ఫిజికల్లీ చాలెంజ్డ్ మహిళలకు ఆర్థిక ఆసరా కోసం శానిటరీ ప్యాడ్స్ తయారు చేసే కుటీర పరిశ్రమ పెట్టించారు తన పర్సనల్ ఫండింగ్తో. ఆ మహిళలు తయారైతే చేస్తున్నారు కాని వాళ్లకున్న పరిమితుల దృష్ట్యా మార్కెటింగ్ చేసుకోలేకపోతున్నట్టు అర్థమైంది భూమారెడ్డికి. దాంతో ప్యాడ్ల తయారీ, మార్కెటింగ్కు తనెలాంటి ప్రణాళిక చేసుకోవాలో అవగతమైంది. ప్యాడ్స్ తయారు చేసే మెషీన్, మెటీరియల్ వంటి వివరాలన్నీ తీసుకొని తిరుగు ప్రయాణమయ్యాడు. మెషీన్ కోసం మధ్యప్రదేశ్ వెళ్లాడు. తాము తయారు చేసిన శానిటరీ ప్యాడ్స్తో భీమా రెడ్డి బృందం పరిశుభ్రమైన వాతావరణం మధ్య ఇంట్లోని హాలులోనే మెషిన్ ఫిట్ చేయించాడు. మహబూబ్నగర్ యూనిట్లో తను, కుమార్తె, భార్య శిక్షణ తీసుకుని అలా దాదాపు పదకొండు నెలల శ్రమ తర్వాత 2019, డిసెంబర్లో కుటీరపరిశ్రమ ప్రారంభించాడు. ప్రస్తుతం అతని యూనిట్లో నలుగురు మహిళలకు ఉపాధి కలిగిస్తున్నాడు. భూమారెడ్డి తయారు చేస్తున్నవి పూర్తి పర్యావరణహితమైనవి. ఆరు ప్యాడ్స్ ఉన్న ప్యాక్ 35 రూపాయలకు అందిస్తున్నాడు. ఒకవేళ మహిళలు ఎవరైనా వీటిని మార్కెట్ చేయాలనుకుంటే కూడా 30 రూపాయలకే అందిస్తున్నారు. ‘ఈ ప్యాడ్స్లో అలోవెరా, వుడ్ పల్ప్, నెట్ షీట్ను వాడుతున్నాం. అచ్చం ఈ మెటీరియల్తో ఇలాగే తయారైన బ్రాండెడ్ పాడ్స్ ఆరింటి ప్యాక్ ధర 70 రూపాయలు’ అని చెప్తున్నాడు భూమారెడ్డి. వ్యాపారం కోసం కాదు... ఉపయోగం కోసమే! ‘దీన్నో వ్యాపారంగా చూడట్లేదు మేము. ఆడవాళ్లకు ఉపయోగపడే పనిలా చూస్తున్నాం. అందుకే మా దగ్గరకు ప్యాడ్స్ కోసం వచ్చే అమ్మాయిలు ధైర్యంగా వీటి గురించి అడిగేలా కౌన్సెలింగ్ ఇస్తున్నాం. మగవాళ్లకూ అవగాహన కల్పిస్తున్నాం. గ్రామ పంచాయితీ ఆఫీస్లో అవగాహన కార్యక్రమాలు పెట్టడమే కాదు ఇల్లుల్లూ తిరిగీ ప్యాడ్స్ వాడకం మీద, నెలొచ్చినప్పుడు పాటించే శుభ్రత గురిచీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ప్యాడ్స్ వాడండి అని చెప్తున్నాం కాని మా దగ్గర తయారైన ప్యాడ్సే వాడండి అని చెప్పట్లేదు’ అంటున్నారు భర్త బాధ్యతల్లో సమపాలు తీసుకున్న భూమారెడ్డి భార్య లావణ్య. ‘మహిళ అరోగ్యాన్ని ఓ ఉద్యమంలా చేపట్టాలి. ఈ ఆలోచన ఉన్నవాళ్లందరితో కలిసి పనిచేయడానికి సిద్ధం’ అంటున్నారు ఈ భార్యాభర్త. ఫెయిల్యూర్లోంచి సక్సెస్ భూమారెడ్డి ఓ మధ్యతరగతి రైతు. 2001లో ఎమ్పిటీసీగా, సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోయాడు. తర్వాత దుబాయ్ వెళ్లి అక్కడ కన్స్ట్రక్షన్ లేబర్గా, ఫోర్మన్గా పనిచేసి నాలుగున్నరేళ్లకు మళ్లీ ఇండియా వచ్చాడు. మళ్లీ సర్పంచ్గా పోటీ చేసి గెలిచాడు. కాని రాజకీయాలు తనకు సరిపడవని తెలుసుకొని కేబుల్ టీవీ సెంటర్, కిరాణా అండ్ జనరల్ స్టోర్స్ పెట్టుకున్నాడు. అప్పుడే ఆడపిల్లల ఇబ్బంది చూసి శానిటరీ ప్యాడ్స్ కుటీర పరిశ్రమవైపు మళ్లాడు. మొదటి నుంచీ సామాజిక స్పృహ, బాధ్యత ఎక్కువగానే ఉన్న భూమారెడ్డికి భార్య సహకారమూ తోడవడంతో దాన్నో ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాడు. చిట్యాల భూమారెడ్డి బయో డీగ్రేడబుల్ శానిటరీ ప్యాడ్స్ తయారు చేస్తున్న భీమారెడ్డి, అతని భార్య లావణ్య... – సరస్వతి రమ -
ఒక్క రూపాయికే శానిటరీ న్యాప్కిన్
న్యూఢిల్లీ : మహిళల ఆరోగ్య సంరక్షణలో భాగంగా ఇకపై శానిటరీ న్యాప్కిన్లను రూపాయికే అందజేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర రసాయన, ఎరువుల శాఖా సహాయ మంత్రి మన్కుశ్ ఎల్.మాండవియా సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. గతంలో నాలుగు ప్యాడ్లు ఉన్న ప్యాకెట్ ధర 10 రూపాయలుగా ఉండేది. ఇకపై అది కేవలం రూ.4కే లభించనుంది. ‘ కేంద్రం ఆగస్టు 27 నుంచి పర్యావరణహిత శానిటరీ న్యాప్కిన్లను విడుదల చేస్తోంది. సువిధా బ్రాండ్తో ఉన్న ఈ న్యాప్కిన్లు దేశవ్యాప్తంగా జన్ ఔషధి కేంద్రాలలో లభిస్తాయి’ అని మాండవియా తెలిపారు. వీటి అమ్మకాల ఆధారంగా కేటాయించాల్సిన బడ్జెట్ను నిర్ణయిస్తామన్నారు. గతేడాది మార్చిలో ప్రవేశపెట్టిన సానిటరీ న్యాప్కిన్ల పథకం ద్వారా దాదాపు ఔషధి స్టోర్ల నుంచి దాదాపు 2.2 కోట్ల అమ్మకాలు జరిగాయన్నారు. ప్రస్తుతం ధరలు సగానికి పైగా తగ్గడం ద్వారా అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. నాణ్యతతో కూడిన పర్యావరణహిత న్యాప్కిన్ల ద్వారా మహిళలకు మేలు జరుగుతుందన్నారు. ఇక న్యాప్కిన్ల ధరను 60 శాతానికి తగ్గించడం ద్వారా 2019 లోక్సభ ఎన్నికల్లో మోదీ ప్రభుత్వం మ్యానిఫెస్టోలో ఇచ్చిన పేర్కొన్న హమీని నిలబెట్టుకుట్టుందని పేర్కొన్నారు. -
ఆమె కోసం.. ఆ రోజు కోసం!
ఒక సంఘటన ఆపిల్ హోమ్ వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ నీలిమ ఆ మధ్య విమానంలో వెళ్తుండగా.. అకస్మాత్తుగా రుతుక్రమం వచ్చింది. శానిటరీ ప్యాడ్ కావాలి. విమాన సిబ్బందితో పాటు ప్రయాణికులనూ అడిగారు..అందరి నోట ఒకటే మాట... లేదని. ఆ సమయంలో ఆమె ఎదుర్కొన్న ఇబ్బంది అంతా ఇంతా కాదు. ఒక ఆలోచన.. ఈ ఘటన డాక్టర్ నీలిమలో ఆలోచనను రేకెత్తించింది. ప్రకృతి సిద్ధంగా వచ్చే రుతు క్రమాన్ని బయటకు చెప్పుకోలేని, శానిటరీ ప్యాడ్ గురించి మాట్లాడలేని స్థితిలో చాలా మంది ఉన్నారని గ్రహించారు. ‘పాఠశాలకు వెళ్లే విద్యార్థినులు ఎంతో మంది నెలసరి సమయంలో బడి మానేస్తున్నారు. అలాంటి పరిస్థితి నుంచి బయటకు రావాల్సిన అవసరం ఉంది. ప్రకృతి సిద్ధంగా వచ్చే నెలసరి గురించి మాట్లాడుకునేందుకు సిగ్గుపడాల్సిన పని లేదు’ అని ఆమె భావించారు. పరిష్కారం ఏమిటని ఆలోచించారు.. ఒక పరిష్కారం.. షీ నీడ్.. యస్.. ఇదే సరైనదని నిర్ణయించుకున్నారు డాక్టర్ నీలిమ. నగరానికొచ్చేవారు, పేద విద్యార్థులు, యువతులు, మహిళలు శానిటరీ ప్యాడ్ కోసం ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో జీహెచ్ఎంసీతో కలిసి ‘ షీ నీడ్’ను ప్రారంభించి ఉచితంగా శానిటరీ ప్యాడ్లు అందించాలనుకున్నారు. జస్ట్.. బటన్ నొక్కితే చాలు.. ప్యాడ్ వచ్చేలా ఏర్పాటు చేశారు. ఇందుకోసం ఒక బాక్స్లో కియోస్క్ యంత్రాన్ని ఉంచుతారు. అవసరమైన వారు బటన్ నొక్కితే శానిటరీ ప్యాడ్ వస్తుంది. రోజూ బాక్సులో 50 ప్యాడ్స్ ఉంచు తారు. ప్రస్తుతానికి వెస్ట్జోన్ పరిధిలో పైలట్ ప్రాజెక్టుగా చేపడుతున్నారు. విజయవంతమైతే..ప్రధాన కూడళ్లు, రద్దీ ఉన్న ప్రాంతాల్లో ఏర్పాటు చేయా లని భావిస్తున్నారు. అంతే కాదు.. డాక్టర్ నీలిమ ఏం చెబుతున్నా రంటే.. ‘‘షీ నీడ్ నిర్వహణపై ఆసక్తి గల మహిళలకు అవగాహన కల్పించి.. ఫ్యాన్సీ స్టోర్, కుట్టు మిషన్ పెట్టుకునేందుకు అవకాశం కల్పిస్తాం. కరెంటు ఉచితంగా ఇస్తాం. షీ నీడ్కు వచ్చే వారి వివరాలను రిజిస్టర్లో పొందుపర్చాల్సి ఉంటుంది’ అని ఆమె తెలిపారు. ఈ నెల చివరినాటికి శేరిలింగంపల్లి సర్కిల్లో షీ నీడ్ను ఏర్పాటు చేయనున్నట్లు వెస్ట్ జోనల్ కమిషనర్ హరిచందన దాసరి చెప్పారు. – హైదరాబాద్ -
ఓటేస్తే శానిటరీ నాప్కిన్!
ఓట్లు రాబట్టుకోవడం కోసం అభ్యర్ధులు ఓటర్లకు నగదు, వస్తువులు ఇస్తుంటారు. ఇది అనధికారికంగా, రహస్యంగా జరిగే పని.అయితే,ముంబై శివారులోని మహిళా పోలింగు కేంద్రాల్లో ఓటు వేయడానికి వచ్చే మహిళలకు ‘శానిటరీ నాప్కిన్స్’ ఇవ్వనున్నట్టు ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు. ఏప్రిల్ 29న పోలింగు జరిగే ఈ‘శక్తి మతదాన్ కేంద్ర’(మహిళలకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం)లకు ఓటు వేయడానికి వచ్చే వారందరికీ వీటిని ఇస్తారు. ఓటు వేసేందుకు మహిళలను ప్రోత్సహించడంలో భాగంగా సుహృద్భావ కానుకగా ఈ శానిటరీ నాప్కిన్లను ఇవ్వనున్నట్టు అధికారులు తెలిపారు. మహిళా ఓటర్లకు ఎన్నికల సంఘం శానిటరీ నాప్కిన్లను ఇవ్వడం దేశంలో ఇదే మొదటిసారి. సబర్బన్ ముంబై నియోజకవర్గంలోని 26 అసెంబ్లీ సెగ్మెంట్లలో శక్తి మతదాన్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఇక్కడ ఓటు వేయడానికి వచ్చే ప్రతి ఒక్క మహిళకు బహుమతి ఇస్తామని అధికారులు వివరించారు. అంతే కాకుండా ఈ పోలింగు కేంద్రాల్లో ఓటు వేసే వారికి కూల్డ్రింకులు కూడా సరఫరా చేస్తామని చెప్పారు. మహారాష్ట్రలోని 17 లోక్సభ నియోజకవర్గాలకు ఈ నెల 29న పోలింగు జరుగుతుంది. -
ఉమెన్స్ డే..విస్తారా కీలక నిర్ణయం
సాక్షి, ముంబై: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రముఖ ప్రైవేటు విమానయాన సంస్థ విస్తారా ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. మార్చి 8నుంచి విస్తారా విమానాల్లో ప్రయాణించే మహిళా ప్రయాణీకులకు ఉచిత శానిటరీ నాప్కిన్లు సదుపాయాన్ని కల్పించనున్నారు. విస్తారాకు చెందిన అన్ని దేశీయ విమాన సర్వీసుల్లో ఈ సదుపాయాన్ని కల్పించనున్నట్లు ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8వ తేదీ నుంచి ఈ సదుపాయాన్ని కల్పించనున్నామని విస్తారా కార్పొరేట్ వ్యవహరాల సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దీపా చద్దా వెల్లడించారు. చిన్న చిన్న విషయాలే ఒక్కోసారి పెద్ద తేడాను తీసుకొస్తాయనే తమ కంపెనీ సిద్ధాంతాన్ని దృష్టిలో ఉంచుకుని శానిటరీ నాప్కిన్లు ఉచితంగా అందజేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఐఎస్ఓ 9001:2015 గుర్తింపు సాధించిన అత్యంత నాణ్యమైన శానిటరీ నాప్కిన్లు క్యాబిన్లో సిద్ధంగా ఉంటాయని పేర్కొన్నారు. అలాగే శానిటరీ నాప్కిన్ల లభ్యతపై ‘అవసరం ఉన్న వారు విమాన సిబ్బందిని అడిగి వీటిని ఉచితంగా తీసుకోవచ్చంటూ’విమానాల్లో అనౌన్స్మెంట్కూడా ఉంటుందని సంస్థ వెల్లడించింది. దీంతో ఇలాంటి నిర్ణయం తీసుకున్న తొలి విమానయాన సంస్థగా విస్తారా గుర్తింపు దక్కించుకోనుంది. కాగా మహిళలు, యువతులు పీరియడ్ సమయంలో అనుభవించే సమస్యలు, బాధలపై సమాజంలో ఇపుడిపుడే సానుకూల అవగాహన వస్తూండటం ఆహ్వానించదగ్గ పరిణామం. ఒకపుడు రుతుస్రావం అనేమాటను ఉచ్చరించడానికే మహిళలు సైతం ఇబ్బంది పడేవారు. ప్రస్తుతం దీనిపై బహిరంగంగా చర్చిస్తున్నారు. ఈ క్రమంలో పాతకాలపు భావజాలాన్ని సవాల్ చేస్తూ బాలీవుడ్లో అక్షయ్ కుమార్ హీరోగా ప్యాడ్మాన్ సినిమా రావడం ఒక సంచలనం. అలాగే పీరియడ్ డాక్యుమెంటరీకి ఆస్కార్ అవార్డు రావడం మరో కీలక పరిణామం. Few hours to go! Get ready to celebrate #WomensDay aboard the #VistaraRetrojet tomorrow, with an all women crew and special treats. Visit https://t.co/7VhrzlBW3X to know more. #Retrojet #VistaraWomensDay #VistaraWomensDay pic.twitter.com/vbC6fJVjok — Vistara (@airvistara) March 7, 2019 -
టాయిలెట్లో శానిటరీ ప్యాడ్స్ పడేశారని..
చంఢీగఢ్ : పంజాబ్లో దారుణం చోటుచేసుకుంది. పాఠశాల టాయిలెట్లో శానిటరీ ప్యాడ్స్ పడేశారని బాలికల దుస్తులు విప్పి తనిఖీ చేశారు. పంజాబ్లోని ఫిజికా జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలోని టాయిలెట్లో ఓ శానిటరీ న్యాప్కిన్ కనిపించడంతో దానిని ఎవరు ధరించారో అని చెప్పాలని ఉపాధ్యాయులు విద్యార్థులను బెదిరించారు. బాలికలను వరుసగా నిలబెట్టి తనిఖీలు చేశారు. ఈ విషయాన్ని బాలికలు తమ తల్లిదండ్రులకు తెలియజేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఉపాధ్యాయులు ఇలాంటి విషయాల్లో పిల్లలని ఎడ్యుకేట్ చేయాల్సింది పోయి ఇలా చేయడం ఏంటని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. కాగా ఈ ఘటనపై దుమారం రేగడంతో ప్రభుత్వం స్పందించింది. ఇద్దరు టీచర్లను బదిలీ చేసింది. మరో టీచర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ ఘటనపై సోమవారం నాటికి దర్యాప్తు పూర్తి చేయాల్సిందిగా విద్యాశాఖ కార్యదర్శిని ముఖ్యమంత్రి ఆదేశించారు. -
‘అదే దక్షిణాదైతే నిన్ను ముక్కలుగా నరికేవారు’
రుతుచక్రం.. మెన్సురేషన్, పిరియడ్స్ పేరేదైనా కావచ్చు. కానీ ఇప్పటికి మన దేశంలో ఇది ఒక అంటరాని మాటే. ఆడపిల్లగా పుట్టి మహిళగా ఎదిగే క్రమంలో స్త్రీ శరీరంలో జరిగే అతి సహజమైన మార్పుల్లో ఇది ఒకటి. కానీ ఇప్పటికి మన సమాజంలో నూటికి తొంభై తొమ్మిది మంది బహిరంగంగా ఈ పేరును పలకడానికి కూడా ఇష్టపడరు. మనిషి జీవితంలో ఆకలి, నిద్ర, బాధ, కోపంలాగానే పిరియడ్స్ కూడా ఓ భాగమైనప్పుడు మరేందుకు దాన్ని గురించి మాట్లాడలంటే జంకు. ఇప్పటికి మనదేశంలో పిరియడ్స్ సమయంలో ఆడవారు ఇంట్లో అన్ని గదుల్లో తిరగకూడదు.. మరీ ముఖ్యంగా పూజ గదిలోకి కానీ, ఆలయంలోకి కానీ ప్రవేశించకూడదు. పండగలు వంటి కార్యక్రమాల్లో పాల్గొనకూడదు. అరే.. సృష్టికి మూలం స్త్రీ అయినప్పుడు.. పిరియడ్స్ పేరు చెప్పి ఆ స్త్రీనే దేవునికి దూరంగా ఉంచడం ఎంత వరకూ సమంజసం. ఇదే ఆలోచన వచ్చింది ముంబైకు చెందిన అనికేత్ మిత్రా అనే కళాకారునికి. ఈ విషయం గురించి సమాజంలో చైతన్యం కల్గించడం కోసం కాస్తా విభిన్నమైన ఆర్ట్ వర్క్ని రూపొందించారు. అయితే మంచిని ఆలోచించి చేసిన ఆర్ట్ వర్క్ కాస్తా ఇప్పుడు అతనికి సమస్యలు తెచ్చిపెట్టింది. వివరాలు.. రానున్న నవరాత్రి ఉత్సవాలను దృష్టిలో పెట్టుకుని అనికేత్ అమ్మవారి రూపాన్ని ఎవరి ఊహకు అందనటువంటి విధంగా రూపొందించారు. స్త్రీ సహజమైన రుతుక్రమాన్ని ప్రధాన థీమ్గా తీసుకున్నారు. అందులో భాగంగా శానిటరీ నాప్కిన్ మీద ఎరుపు రంగులో ఉన్న కమలాన్ని చిత్రించారు. ఈ ఎరుపు రంగును పిరియడ్స్ సమయంలో జరిగే బ్లీడింగ్కు ప్రతి రూపంగా ఎంచుకున్నానని చెప్తారు మిత్రా. శానిటరీ నాప్కిన్ వెనక భాగాన దుర్గమాతాను అలంకరించే విధంగా డెకరేట్ చేసి ఫొటో తీసి తన ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. దాంతో ఈ ఆర్ట్ వర్క్ కాస్తా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఆర్ట్ వర్క్ గురించి ప్రజల్లో మిశ్రమ స్పందన వెలువడింది. ‘ఇది కోల్కతా కాబట్టి కేవలం నీ మీద కంప్లైంట్ ఇచ్చి వదిలేస్తున్నాం. అదే దక్షిణ భారతదేశంలో నువ్వు ఇలాంటి వేషాలు వేస్తే ఈ పాటికే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేసేవారు’ అంటూ విమర్శిస్తున్నారు. అంతేకాక ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే నీకే ప్రమాదం అంటూ బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయని తెలిపారు అనికేత్. కానీ మరో వర్గం నెటిజన్లు అనికేత్ సృజనను మెచ్చుకోవడమే కాక ఈ ఫొటోని షేర్ చేస్తున్నారు. పోస్ట్ చేసిన 24 గంటల్లోనే దాదాపు 4 వేల మంది ఈ ఫోటోని షేర్ చేశారు. ఈ విషయం గురించి అనికేత్ మాట్లాడుతూ.. ‘మన దేశంలో స్త్రీలు పిరియడ్స్ సమయంలో తమను తామే అపవిత్రంగా భావించుకుంటారు. అందువల్లే ఎటువంటి పూజా కార్యక్రమాల్లో పాల్గొనరు. ఈ ఆలోచనను తప్పు అని చెప్పి వారిలో చైతన్యం కల్గించడం కోసమే నేను ఇలాంటి ఆర్ట్ వర్క్ని రూపొందించాను. నన్ను విమర్శించేవారిని, బెదిరించేవారిని నేను పట్టించుకోను. ఈ విషయంలో నాకు మద్దతు ఇస్తున్నవారే నాకు ముఖ్యం’ అన్నారు. పిరియడ్స్ కారణంగానే కేరళ శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి 10 - 50 ఏళ్ల మహిళల ప్రవేశంపై నిషేధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నిషేధం చెల్లదంటూ.. శారీరక కారణాలు చెప్పి మహిళలను ఆలయంలోకి ప్రవేశించకుండా చేయడం నేరమని సుప్రీం కోర్టు తాజాగా తీర్పునిచ్చింది. -
జీఎస్టీ రద్దైనా మహిళలకు దక్కని ప్రయోజనం
-
శానిటరీ న్యాప్కిన్లపై పన్ను రద్దు.. మతలబేంటి?
సాక్షి, న్యూఢిల్లీ : మహిళలు వాడే శానిటరీ న్యాప్కిన్లపై ప్రస్తుతం విధిస్తున్న 12 శాతం జీఎస్టీని ఎత్తివేస్తున్నట్లు జీఎస్టీ మండలి శనివారం ప్రకటించిన వెంటనే పలు మహిళా సంఘాలు, సామాజిక కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ నెటిజన్లు ట్వీట్ల మీద ట్వీట్లు చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల శానిటరీ న్యాప్కిన్ల ధర మార్కెట్లో తగ్గుతుందా? లేదా ? అన్నది ప్రస్తుత ప్రశ్న. తగ్గితే ఎంత తగ్గుతుంది ? పెరిగితే ఎంత పెరుగుతుంది? అన్నది కూడా ప్రశ్నే. న్యాప్కిన్లపై వివిధ పన్నులు కలుపుకొని 13 శాతానికిపైగా పన్నులు పడుతుంటే తాము కేవలం 12 శాతం జీఎస్టీని విధించడం ద్వారా వినియోగదారులకు ఉపశమనం కలిగించామంటూ 2017, జూలైలో అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వీడియో సాక్షిగా చేసిన వాదన ఎంత మేరకు కరెక్ట్ ? ఆ 12 శాతం జీఎస్టీని ఎత్తివేయడం వల్ల వినియోగదారుడికి ప్రస్తుతం కలిగే అదనపు ప్రయోజనం ఏమిటీ? జీఎస్టీ ప్రకారం శానిటరీ న్యాప్కిన్ల ఉత్పత్తిదారులు కొనుగోలు చేసే ముడిసరుకుపై పన్ను పడుతుంది. మళ్లీ వారు ఉత్పత్తిచేస్తే వస్తువులను అమ్మినప్పుడు పన్ను పడుతుంది. ఇలా రెండుసార్లు పన్ను పడినప్పుడు మొదటిసారి పడిన పన్నును ‘ఇన్పుట్ టాక్స్ క్రెడిట్’గా పరిగణించి ప్రభుత్వం వెనక్కి ఇస్తుంది. అంటే ఓ న్యాప్కిన్ ముడిసరుకుపై ఐదు రూపాయలు పన్ను పడితే, న్యాప్కిన్ తయారయ్యాక దాని అమ్మకంపై ఆరు రూపాయలు పన్ను విధిస్తే.. మొదట వ్యాపారి చెల్లించిన ఐదు రూపాయల పన్ను మొత్తాన్ని ప్రభుత్వం వెనక్కి ఇచ్చేస్తుంది. ఇక్కడ న్యాప్కిన్ల అమ్మకంపై పడుతున్న 12 శాతం జీఎస్టీని ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వాటి ముడిసరకుపై పన్ను మినహాయింపును ప్రకటించలేదు. అంటే న్యాప్కిన్ల ముడిసరుకుకు వ్యాపారి చెల్లించిన పన్ను ప్రభుత్వం నుంచి వెనక్కి రాదు. పైన పేర్కొన్న ఉదాహరణ ప్రకారం వ్యాపారి ముడిసరుకుపై చెల్లించిన ఐదు రూపాయలు వెనక్కి రావు. అమ్మకం సందర్భంగా విధించే ఆరు రూపాయలు ఇక చెల్లించాల్సిన అవసరం లేదు కనుక వ్యాపారికి ఒక రూపాయి పన్ను ఆదా అవుతుంది. ఆ ఆదా అయిన రూపాయిని వినియోగదారుడికి బదలాయించినప్పుడే అసలు లబ్ధి చేకూరుతుంది. ముడి సరుకుపై పన్ను తక్కువగా ఉండి అమ్మకంపై పన్ను ఎక్కువ ఉన్న సందర్భాల్లోనే ప్రభుత్వ నిర్ణయాల వల్ల వినియోగదారుడికి మేలు జరుతుంది లేదంటే లేదు. అరుణ్ జైట్లీ వీడియో వాదన కూడా ఇదే విషయాన్ని రుజువు చేస్తోంది. ఇంతకు న్యాప్కిన్లపై పన్ను రాయితీ ఏ మేరకు ఉంటుందని కేంద్ర వాణిజ్య శాఖ అధికారులను సంప్రదించగా, న్యాప్కిన్ల ముడి పదార్థాలపై జీఎస్టీ నాలుగైదు శాతానికి మించదని తెలిపారు. అంటే 12 శాతం జీఎస్టీలో ఐదారు శాతం పన్ను కలసి వస్తోందన్న మాట. ఆ కలసివచ్చిన శాతాన్ని వ్యాపారి వినియోగదారులకు బదిలి చేయాలి. ఈ విషయాన్ని పక్కన పెడితే చైనా, మరికొన్ని దేశాలు న్యాప్కిన్లు, మరికొన్ని వస్తువులపై విదేశీ జీఎస్టీని ఎత్తివేయాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయి. ఆయా దేశాలకు ప్రయోజనం కల్పించేందుకే కేంద్రం న్యాప్కిన్లపై జీఎస్టీని రద్దు చేసిందనే విమర్శలు కూడా వస్తున్నాయి. న్యాప్కిన్ల విషయంలో చైనా మన దేశంతో ఎక్కువ పోటీ పడుతోంది. న్యాప్కిన్లపై జీఎస్టీని రద్దు చేయడం వల్ల చైనా న్యాప్కిన్లు మన మార్కెట్ను ముంచెత్తే అవకాశం ఉంది. అప్పుడు భారత వ్యాపారులు దెబ్బతింటే భారత వినియగదారులు లబ్ధి పొందుతారు. -
సీఎస్సీ విలేజ్ లెవల్ సెంటర్ ప్రారంభం
సాక్షి, అల్గునూర్(మానకొండూర్) : ప్రభుత్వ, ప్రైవేటు సేవలను పౌరులకు అందించేందుకు ప్రభుత్వ అనుబంధంగా ఏర్పాటు చేసిన సిటిజన్ సర్వీస్ సెంట్ విలేజ్ లెవల్ కార్యాలయం తిమ్మాపూర్ మండలం అల్గునూర్లో ఏర్పాటయింది. రైతులకు అవసరమైన ఎరువులను ఈ సర్వీస్ సెంటర్ ద్వారా అందించేందుకు ఏర్పాటు చేసిన గోదామును కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ మంగళవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేటురంగ సేవలు ఈ సిటిజన్ సర్వీస్ సెంటర్ ద్వారా అందుబాటులోకి వస్తాయన్నారు. దేశంలో ఇప్పటివరకు సీఎస్సీ ఆధ్వర్యంలో ఒకేఒక్క ఫర్టిలైజర్ గోదాముందని, రెండోది, రాష్ట్రంలో మొట్టమొదటి గోదాం అల్గునూర్లో ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. సీఎస్సీ సేవలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం సేవలన్నీ ఈ సెంటర్లో అందుబాటులో ఉంటాయని, హైదరాబాద్లో ఉన్న డాక్టర్ సేవలను కూడా ఇక్కడి నుంచి పొందొచ్చని తెలిపారు. రైతులకు కావాల్సిన ఎరువులన్నీ సీఎస్సీ కేంద్రంలో అందుబాటులో ఉంటాయ ని పేర్కొన్నారు. ఈ కేంద్రం ద్వారా త్వరలో మరిన్ని సేవలు పౌరులకు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. సీఎస్సీ హైదరాబాద్ ఇన్చార్జి మంజుల వీఎల్ఈ శానిటరీ నాప్కిన్ యూనిట్ను ప్రారంభించారు. సీఎస్సీ జిల్లా మేనేజర్ శ్రీరాం శ్రీనివాస్రెడ్డి, రాష్ట్ర బ్యాధుడు శివకుమార్, సొసైటీ అధ్యక్షుడు రాజు, అల్గునూర్ సర్పంచ్ చిందం కిష్టయ్య, ఎంపీటీసీ స్వామిరెడ్డి, తహసీల్దార్ జగత్సింగ్, కంది రాంచంద్రారెడ్డి, చల్ల మహేందర్రెడ్డి, జాప శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. -
రైల్వేస్టేషన్లలో శానిటరీ నాప్కిన్ల అమ్మకం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రైల్వేస్టేషన్ల లోపల, బయట శానిటరీ నాప్కిన్లతో పాటు కండోమ్స్ను అమ్మాలని రైల్వేశాఖ నిర్ణయించింది. రైల్వేస్టేషన్ల సమీపంలో నివసించే ప్రజల కోసం ఉచిత మరుగుదొడ్లను నిర్మించాలన్న ప్రతిపాదనకు ఓకే చెప్పింది. ఈ మేరకు అధికారులు రూపొందించిన ‘టాయిలెట్ పాలసీ’కి రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. పరిసరాలను శుభ్రంగా ఉంచేందుకు రైల్వేస్టేషన్ల సమీపంలో మరుగుదొడ్లను నిర్మించాలని సూచించినట్లు రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. రైల్వేస్టేషన్ల లోపల, బయట చౌకగా లభించే శానిటరీ నాప్కిన్లు, కండోమ్స్ అమ్మేందుకు కియోస్క్లను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్ఆర్) నిధి సాయంతో దేశవ్యాప్తంగా 8,500 రైల్వేస్టేషన్లలో వీటిని ఏర్పాటు చేస్తామన్నారు. -
ఫొటోలో ఏదో తేడా ఉందే.. కేంద్ర మంత్రిపై సెటైర్లు
ఢిల్లీ: అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించే మంత్రులు.. సంబంధిత ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం రివాజే. కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ కూడా అదే పనిచేశారు. కానీ అనూహ్యంగా విమర్శలు, సెటైర్లు ఎదుర్కోవల్సి వచ్చింది. విషయంలోకి వెళితే.. మొన్న మే 20న మంత్రిగారు ఉత్తరప్రదేశ్లోని గౌతంబుద్ధనగర్ జిల్లా ధనౌరికలాన్ గ్రామంలో పర్యటించారు. డిజిగావ్ పథకంలో భాగంగా అక్కడ వైఫై సేవలను ప్రారంభించారు. పనిలోపనిగా అక్కడి మహిళల ఆధ్వర్యంలో నడుస్తోన్న శానిటరీ ప్యాడ్స్ తయారీ కేంద్రాన్ని సదర్శించారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోకు ‘‘ఈ మహిళలను కలుసుకోవడం సంతోషంగా ఉంది. శానిటరీ ప్యాడ్ల తయారీతో వీరికి జీవనోపాధి లభించడమేకాదు, స్త్రీస్వాభిమానాన్ని కూడా నిలబెడుతున్నారు’’ని కామెంట్ను జతచేసి ట్వీట్ చేశారు మంత్రిగారు. కాగా, సదరు ఫొటోలో శానిటరీ ప్యాడ్లు తయారుచేసే మహిళల్లో ఒక్కరు కూడా లేకపోవడాన్ని నెటిజన్లు తప్పుపట్టారు. ‘ఏంటి సార్.. మహిళల కష్టాన్ని మగవాళ్లు క్యాష్ చేసుకుంటున్నారా?’, ‘శానిటరీ ప్యాడ్లు మగవారికా, ఆడవారికా?’, ‘ఫొటోలో ఏదో తేడా ఉందే!’,.. తరహా కామెంట్లు కుప్పలుతెప్పలుగా వచ్చిపడ్డాయి. కొన్ని గంటలకుగానీ పొరపాటును గ్రహించిన మంత్రివర్యులు.. ఆ మహిళలతో కలిసి దిగిన ఫొటోలను పోస్ట్చేశారు. It was heartening to interact with the village women who have set up sanitary pad manufacturing unit in Digi Gaon Dhanauri Kalan. This has not only created source of livelihood but also promoted awareness about menstrual hygiene. This is part of #StreeSwabhiman initiative of CSC. pic.twitter.com/YHGd9nNwGv — Ravi Shankar Prasad (@rsprasad) May 20, 2018 where are the women?😨😨😨 — Vijay V ಬೆಂಗಳೂರು (@vijay4joe) May 21, 2018 uh! why are there no women in the picture? — Asif Khan (@_asif) May 20, 2018 Find a woman in this frame and get ,1 sanitary pad free — hariom sharma (@h_sharma22) May 20, 2018 Why don't I see any women in this photo? Where are the heroines of this commendable efforts? I want to see them.. not bunch of men who wants to steal their credit. — अज्ञात ठेकेदार (@xandoomal) May 20, 2018 Proud of these women of Dhanauri Kalan village in UP who are not only creating awareness about menstrual health but also making low cost sanitary pads, as part of #StreeSwabhiman movement of CSC. They are indeed breaking barriers & transforming lives. pic.twitter.com/Q6CZOBAHu6 — Ravi Shankar Prasad (@rsprasad) May 20, 2018 -
శానిటరీ ప్యాడ్ వాడిందెవరు?
భోపాల్ : స్త్రీల సహజసిద్ధ రుతుక్రమాన్ని అర్థం చేసుకొనేందుకు ఈ సమాజానికి ఇంకెంత కాలం పడుతుందోనన్న అనుమానం ఈ ఘటనతో మరింత బలపడుతోంది. శానిటరీ నాప్కిన్స్ తయారుచేసే యంత్రాన్ని తొలిసారిగా పరిచయం చేసిన మధ్యప్రదేశ్లోని డాక్టర్ హరిసింగ్ గౌర్ యూనివర్సిటీలో జరిగిన ఈ ఘటన అమ్మాయిల పట్ల వివక్షనీ, అవమానకర వైఖరిని మరోమారు రుజువుచేసింది. మధ్యప్రదేశ్లోని డాక్టర్ హరిసింఘ్ గౌర్ యూనివర్సిటీ కి చెందిన హాస్టల్లో వాడిపడేసిన శానిటరీ ప్యాడ్ కనిపించడంతో, దాన్ని వాడిందెవరో తెలుసుకునేందుకు ఒక్కొక్కరుగా విద్యార్థులందరి దుస్తులనూ విప్పించి చెక్చేయడం వివాదానికి తెరతీసింది. విద్యార్థులను అవమానించిన రాణీ లక్ష్మీబాయి హాస్టల్ వార్డెన్ చందాబెన్ వైఖరికి వ్యతిరేకంగా ఆమె ఇంటిముందు విద్యార్థులు ఆందోళనకి దిగడంతో విషయం వెలుగులోనికి వచ్చింది. హాస్టల్లో కనిపించిన శానిటరీ ప్యాడ్ ఎవరు వాడారో తెలుసుకోవడం కోసం రాణీ లక్ష్మీబాయి హాస్టల్ వార్డెన్ చందాబెన్ తమ బట్టలు విప్పించి అవమానించారని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆర్పి తివారీకి విద్యార్థులు ఫిర్యాదు చేసారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన యూనివర్సిటీ విసి ఆర్పి తివారీ విద్యార్థులకు క్షమాపణ చెప్పారు. ఘటనపై ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని నియమించడంతో పాటు, వార్డెన్ తప్పిదం రుజువైతే కఠినంగా శిక్షిస్తామని విద్యార్థులకు హామీ ఇవ్వడంతో విషయం సద్దుమణిగింది. విచిత్రమైన విషయమేమిటంటే రుతుక్రమం పట్ల విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకూ, అమ్మాయిల్లో డ్రాప్ఔట్ రేట్ ని తగ్గించే ఉన్నతమైన లక్ష్యంతోనూ, పేద విద్యార్థులకు ఉచితంగా శానిటరీ ప్యాడ్స్ని అందించేందుకు దేశంలోనే తొలిసారిగా భోపాల్లోని మోడల్ హైస్కూల్స్లో శానిటరీ నాప్కీన్స్ తయారుచేసే మిషన్స్ ని అమర్చిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా శానిటరీ ప్యాడ్స్ తీసుకునేందుకు విద్యార్థినులకు ప్రత్యేకమైన కాయిన్స్ని యిస్తుంది. ప్యాడ్స్ అవసరమైనప్పుడు ఆ కాయిన్స్ని ఇచ్చి విద్యార్థులు ప్యాడ్స్ని ఉపయోగించుకొనే సౌలభ్యం ఉంటుంది. ఇంత ప్రయోజనకరమైన ప్రాజెక్ట్ని తొలిసారిగా ప్రవేశపెట్టిన రాష్ట్రంలోనే శానిటరీ న్యాప్కీన్ వాడిపడేసినందుకు విద్యార్థులను అవమానించిన ఘటన ఉత్పన్నం కావడం చర్చనీయాంశం అయ్యింది. అనేక దశాబ్దాలుగా స్త్రీల హక్కులను గురించి, వారి శారీరక శాస్త్రీయతను అర్థం చేసుకోవాల్సిన ఆవశ్యకతను గురించీ పదే పదే మహిళలు విభిన్న రీతుల్లో ఉద్యమిస్తూనే ఉన్నారు. దానికి తోడు అక్షయ్ కుమార్ ‘ప్యాడ్మాన్’ సినిమా తీసుకొచ్చిన చైతన్యం నేపథ్యంలో మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా 200 ప్రధాన రైల్వే స్టేషన్లలో శానిటరీ నాప్కిన్ మెషిన్స్ని ప్రారంభించామనీ, వెనుకబడిన, బలహీన వర్గాల స్త్రీలకూ, మహిళా ఉద్యోగులకు ఎంతగానో ఉపయోగకరమనీ రైల్వే బోర్డు ఛైర్మన్ అశ్వినీ లోహనీ వ్యాఖ్యానించారు. అయితే అక్షయ్ కుమార్ ‘పాడ్మాన్’ తరహా సినిమాలు మాత్రమే ఆశించిన మార్పుని తేలేవన్న విషయాన్ని ఈ ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
చౌకైన శానిటరీ న్యాప్కిన్ల ఆవిష్కరణ
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అత్యంత చౌకైన, మట్టిలో కలసిపోయే శానిటరీ న్యాప్కిన్లను కేంద్రం గురువారం ఆవిష్కరించింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రధానమంత్రి భారతీయ జనఔషధి పరియోజన(పీఎంబీజేపీ) కేంద్రాల్లో నాలుగు న్యాప్కిన్లు ఉండే ఒక్కో ప్యాక్ను ‘సువిధా’ పేరుతో కేవలం రూ.10కే అందించనున్నట్లు కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రి అనంత్కుమార్ తెలిపారు. ఈ ఏడాది మే 28 నాటికల్లా దేశంలోని 3,200 పీఎంబీజేపీ కేంద్రాల్లో వీటిని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. -
రైల్వే స్టేషన్లలో శానిటరీ న్యాప్కిన్ డిస్పెన్సర్లు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8వ తేదీ నాటికి దేశ వ్యాప్తంగా ఉన్న 200 రైల్వే స్టేషన్లలో శానిటరీ న్యాప్కిన్ డిస్పెన్సర్లను ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే మంత్రి గోయెల్ తెలిపారు. ఢిల్లీలోని సరోజినీ నగర్ రైల్వే కాలనీ శానిటరీ న్యాప్కిన్ తయారీ కేంద్రం ‘దస్తక్’ను ఆయన సోమవారం సందర్శించారు. ఇక్కడ తయారయ్యే ఆరు న్యాప్కిన్ల ప్యాక్ ధర రూ.22 మాత్రమేనన్నారు. మరోవైపు, తమ రాష్ట్రంలోని దాదాపు 17 లక్షల మంది బాలికలకు ఉచితంగా శానిటరీ ప్యాడ్స్ను అందజేయాలని ఒడిశా సర్కారు నిర్ణయించింది. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 6–12వ తరగతి బాలికలకు వీటిని ఇవ్వనున్నారు. ఇందుకు ఏడాదికి రూ.70 కోట్లు ఖర్చుకానుంది. -
పాడ్మన్ స్ఫూర్తిని చాటిన ఒడిశా
సాక్షి, భువనేశ్వర్ : అక్షయ్కుమార్ పాడ్మన్ మూవీ పలువురిని కదిలిస్తోంది. ఒడిశా ప్రభుత్వం ఖుషీ పేరుతో స్కూల్ విద్యార్థినులకు ఉచిత శానిటీరీ ప్యాడ్స్ పంపిణీ పథకాన్ని చేపట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 12వ తరగతి విద్యార్ధినులందరికీ ఉచితంగా శానిటరీ నాప్కిన్లను అందించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రారంభించారు. రాష్ట్రంలో 17 లక్షల మంది స్కూల్ విద్యార్థినులకు శానిటరీ నాప్కిన్లను ఉచితంగా అందించే పథకం ప్రవేశపెడుతున్నామని, సబ్సిడీ ధరలకు ఇతర మహిళలు, విద్యార్థినులకు వీటిని పంపిణీ చేసే ఉద్దేశం ఉందని ఈ సందర్భంగా సీఎం పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో స్కూల్ విద్యార్థినుల్లో పరిశుభ్రత, ఆరోగ్యం మెరుగై మహిళా సాధికారత దిశగా అడుగులుపడతాయని చెప్పుకొచ్చారు. పాఠశాల విద్యార్థినులు విద్యను కొనసాగించేందుకూ ఈ నిర్ణయం దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
నేస్తమా.. నువ్వెక్కడ?
శ్రీకాకుళం: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న బాలికల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వం ‘నేస్తం’ పథకాన్ని ప్రవేశపెట్టింది. రుతుక్రమ సమయంలో 15 ఏళ్లలోపు బాలికలు మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని గుర్తించిన అప్పటి విద్యాశాఖ ఉన్నతాధికారులు ఈ పథకాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఇందులో భాగంగా... రుతు రుమాళ్ల(శానిటరీ న్యాప్కిన్స్)ను ఉపాధ్యాయినుల పర్యవేక్షణలో బాలికలకు ఉచితంగా అందజేశారు. ఒక్కో బాలికకు అప్పట్లో 6 నుంచి 8 న్యాప్కిన్లను పంపిణీ చేశారు. బయట మార్కెట్లో పదింటి ధర రూ.35 నుంచి రూ.50 వరుకు ఉంటుంది. అయితే మూడేళ్లుగా ఈ పథకం అటకెక్కడంతో బాలికలకు రుమాళ్లు అందడం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థినులకు సొంత డబ్బుతో న్యాప్కిన్లు కొనుగోలు చేసుకునే స్థోమత లేకపోవడం, రుతుక్రమంపై సరైన అవగాహన లేకపోవడంతో వారంతా ఇబ్బందులు పడుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో కర్ణాటక, కేరళ, బిహార్, తమిళనాడు రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో బాలికలకు రుమాళ్లను ప్రభుత్వమే ఉచితంగా అందజేస్తుంది. వీటిని వినియోగించడం ద్వారా కలిగే ప్రయోజనాలపై విస్తృతంగా ఎప్పటికప్పుడు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఫలితంగా పాఠశాలలకు దూరమయ్యే బాలికల సంఖ్య తగ్గినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రత్యేక గదులు లేవు ప్రభుత్వ పాఠశాలల్లో బాలికల వ్యక్తిగత అవసరాలకు ఏ పాఠశాలల్లోనూ ప్రత్యేకమైన గదులు కానరావడం లేదు. ఫలితంగా విద్యార్థినుల హాజరు శాతం తగ్గడంతో పాటు వారు మానసికంగా కుంటుబాటుకు గురవుతున్నారు. బాలికల ఆరోగ్యాన్ని పరిరక్షించే ఉద్దేశంతో ప్రవేశ పెట్టిన ఈ పథకాన్ని నీరుగార్చడంపై విద్యార్థినులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి నేస్తం పథకాన్ని పునఃప్రారంభిండంతో పాటు ప్రత్యేక గదుల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని విద్యార్థినుల తల్లిదండ్రులు కోరుతున్నారు. -
ప్యాడ్ మ్యాన్ ఎఫెక్ట్
సాక్షి, న్యూఢిల్లీ : బాలీవుడ్లో తాజాగా విడుదలైన ప్యాడ్ మ్యాన్ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఆడవారు ఎదుర్కొనే రుతుక్రమం ఒక రహస్యం కాదని, చర్చించాల్సిన అంశమన్న కాన్సెప్ట్తో తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రత్యేక ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ చిత్రంతో ప్రభుత్వాల్లో కూడా కదలిక వచ్చింది. పాఠశాలలోని విద్యార్థినులకు శానిటరీ ప్యాడ్లను ఉచితంగా అందించేందుకు ఢిల్లీ సర్కార్ సిద్ధమైపోయింది. ఇందులో భాగంగా దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ నిధులను కూడా విడుదల చేసింది. ‘ఇది దాచుకోవాల్సిన అంశం ఏం కాదు. ఉపాధ్యాయులు కూడా ఈ విషయంలో అందరికీ అవగాహన కల్పించారు. ఆ సమయంలో విద్యార్థినులు పాఠశాలలకు గైర్హాజరు అవుతుంటారు. అందుకే వారికి ఉచితంగా ప్యాడ్లను అందించేందుకు సిద్ధమయ్యాం’ అని స్థానిక నేత శిఖా రాయ్ వెల్లడించారు. 2018-19 బడ్జెట్కి గానూ ఈ నిధులను విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే ప్రత్యేక సమావేశంలో ఇందుకు సంబంధించిన బిల్లును మేయర్ కమల్జీత్ షెరావత్ ఆమోదించగా.. మునిసిపల్ కమిషనర్ ఆమోదించాల్సి ఉంది. మరోవైపు మరికొన్ని రాష్ట్రాలు కూడా ఈ దిశగా ఆలోచన చేస్తున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. ఆర్.బాల్కీ డైరెక్షన్లో అక్షయ్ కుమార్, రాధికా ఆప్టే, సోనమ్ కపూర్ ముఖ్యపాత్రల్లో ఈ చిత్రం తెరకెక్కింది. -
ఆ విషయంలో సిగ్గెందుకు!
ప్రభుత్వం బొట్టు, గాజులు, పారాణి వంటి సౌభాగ్య చిహ్నాలను అడగకుండానే ట్యాక్స్ ఫ్రీ చేసింది కానీ, స్త్రీలు నోరు తెరిచి అడిగినా ప్యాడ్లను ట్యాక్స్ ఫ్రీ చేయకుండా భీష్మించుకుంది. పాలకుల పురుషస్వామ్య దృక్పథానికిది నిదర్శన. ‘‘అవును నా చేతిలో ఉన్నది ప్యాడ్ – నేను సిగ్గుపడాల్సింది ఏమీ లేదు... అది చాలా సహజమైనది! పీరియడ్’’ అని ట్వీట్ చేశారు దీపికా పదుకొనె, ప్యాడ్ మ్యాన్ చాలెంజ్ తీసుకుంటూ. ‘ప్యాడ్ మ్యాన్’ ఈ నెల 9వ తేదీ విడుదలవుతున్న అక్షయ్ కుమార్ సినిమా. అరుణాచలం మురుగనంతం జీవితాన్ని ఇది మనకు చూపిస్తుంది. అరుణాచలం తమిళనాడుకి చెందిన వ్యక్తి. తన భార్య నెలసరి రోజులలో పాత గుడ్డముక్కలు, కాగితాలు వాడటం చూసి కలత చెంది, దానికో పరిష్కార మార్గం చూపించాలని భావించాడట. ఈ పరిశోధనలో ఆయన అనేక కష్టాలను ఎదుర్కొన్నాడు. విదేశాలనుంచి దిగుమతి అయ్యే శానిటరీ నాప్కిన్ తయారీ మెషీన్ విలువ మూడున్నరకోట్లు. ఇంత ఖరీదైన మెషీన్తో ప్యాడ్లు తయారు చేయడం వలన మార్కెట్కు చేరేప్పటికీ ప్యాడ్ ఖరీదు పెరిగి సామాన్యులకు అందుబాటులో లేకుండా పోతుందని గ్రహించాడు. చివరికి అన్ని అడ్డంకులనూ అధిగమించి రూ. 65 వేలకే వచ్చే ప్యాడ్ ఉత్పత్తి మెషీన్ను ఆయన కనుగొన్నాడు. పైగా ఆ మెషీన్ను సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకు మాత్రమే అమ్ముతానని భీష్మించుకున్నాడు. ఈయన ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న 100 మంది వ్యక్తులలో ఒకరని టైం మేగజైన్ ప్రకటిం చింది. భారత ప్రభుత్వం పద్మశ్రీతో సన్మానించింది. ఇండియాలో అధిక శాతం ప్రజలు అల్పాదాయ వర్గాల వారే. వారికి మార్కెట్లో దొరికే ప్యాడ్లను కొనగలిగే స్థోమత ఉండదు. 2016లో చేసిన ఒక పరిశోధన ప్రకారం దేశంలో 84% అమ్మాయిలూ, 92.2% శాతం తల్లులూ ఇప్పటికీ నెలసరి సమయంలో గుడ్డని వాడుతున్నారు. వారిలో కొందరే ఆ గుడ్డని ఎండలో ఆరబెడుతున్నారు. ప్రభుత్వ సర్వే ప్రకారం మనదేశంలో కేవలం 12% మంది మాత్రమే ప్యాడ్లు వాడగలిగే స్థితిలో ఉండటం వలన 37.8% పెళ్లి కాని పిల్లలు యోని దగ్గర దురదతో, దుర్వాసనతో బాధపడుతున్నారు. స్త్రీలను అమితంగా బాధించే రీప్రొడక్టివ్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (ఆర్టీఐ)కి, సర్వైకల్ కేన్సర్కు 70% కారణం నెలసరి సమయంలో శుభ్రమైన ప్యాడ్లు వాడకపోవడమేనని 97% మంది గైనకాలజిస్టులు అఇ నీల్సన్ సర్వేలో చెప్పారు. మహిళలకు ఏమీ చేయడంలేదనిపించుకోకుండా ప్రభుత్వం 2011లో రుతు సంబంధమైన శుభ్రతా పథకం (ఎమ్హెచ్ఎస్)ని ప్రారంభించి, 100 కోట్లను కేటాయించింది. అయితే ఈ కార్యక్రమం గురించి నెల్లూరు జిల్లాలో ఒక ఆశా వర్కర్ని అడిగినపుడు ఆమె తన అనుభవాలను పంచుకున్నది. రెండేళ్ల క్రితం ఒకే ఒకసారి రాష్ట్రీయ కిశోర్ స్వాస్థ్య కార్యక్రమం క్రింద (ఆర్కెఎస్కె) గ్రామాలలో ప్యాడ్లు పంచడం జరిగిందట. ప్యాకెట్టు విలువ రూ. 6లు. అందులో ఆశా వర్కర్కి రూపాయి. మరి గ్రామాలలో స్పందన ఎలా ఉండింది అంటే ‘‘చాలా బాగుండిందమ్మా. రేటు తక్కువ కాబట్టి ‘కౌమార బాలికలు’ ఉత్సాహంగా కొన్నారు’’ అన్నది. ‘కానీ అంత రేటు పెట్టి కొనగలిగే స్థోమత తమకు లేద’ని 83% మంది దిగువ తరగతి వారు తమ నిస్సహాయతను వ్యక్తం చేశారు. ఆడవారి రుతుస్రావం చుట్టూ నొప్పుల బాధలు ప్రకృతి ఎలాగూ పెట్టింది. అది కాక రోగాలు రాకుండా శుభ్రతను పాటించాలంటే నెలనెలా ఖర్చు పెట్టాల్సి రావడం చాలామందికి స్థోమతకు మించిన బాధ. అలాంటిది ప్రభుత్వం సానిటరీ ప్యాడ్లను 12% జీఎస్టీలోకి నెట్టడం ఇంకా బాధాకరం. ఢిల్లీ జేఎన్యూ విద్యార్థిని జర్మినా ఇస్రార్ ఖాన్ గత ఏడాది ఈ 12% ట్యాక్స్ రాజ్యాంగ విరుద్ధమూ, అన్యాయమూ అని ఢిల్లీ కోర్టులో కేసు వేసినా ప్రభుత్వం చలించలేదు. ప్యాడ్లను ట్యాక్స్ ఫ్రీ చేయాలనే డిమాండ్కి స్పంది స్తూ అరుణ్జైట్లీ ‘12 శాతాన్ని తగ్గించినట్లయితే... భారతీయ ఉత్పత్తిదారులు ఎవరూ మిగలరు’ అని వ్యాపార సూత్రాన్ని చెప్పారు. ఈ జనవరి 22న సుప్రీం కోర్టు ముంబై ఢిల్లీ కోర్టులలో ఉన్న ఈ కేసు ప్రొసీడింగ్స్పై స్టే విధించి, దీన్ని తన పరిధిలోకి తీసుకోవడంపై పరిశీలిస్తానని పేర్కొన్నది. ‘తాగునీరు, పారిశుధ్య మంత్రిత్వ శాఖ’ వారు 2015లో విడుదల చేసిన ‘రుతుసంబంధమైన ఆరోగ్య నిర్వహణ మార్గదర్శకాలు’ చదువుతూ, నేను నా కూతుర్ని ‘మీ స్కూల్ లో ప్యాడ్స్ ఎలా వాడాలో ఎప్పుడన్నా చెప్పారమ్మా’ అని అడిగాను. నా కూతురు ‘అవంతా చెప్పలేదమ్మా, ఎక్కడ పడేయాలో మాత్రం చెప్పారు అంటూనే, ఆ.. ఇంకా మేల్ స్టాఫ్తో మాట్లాడొద్దని కూడా చెప్పారమ్మా’ అన్నది. ఆడపిల్లల్ని మగవాళ్ళకి దూరంగా ఉంచి పద్దతిగా పెంచడంలో ఉండేంత శ్రద్ధ.. వాళ్ల బడి వాళ్లకు ఆ పిల్లల శుభ్రత మీద లేదు. దీని వెనుకనున్న భావజాలం పేరు పితృస్వామ్యం. ప్రభుత్వం బొట్టు, గాజులు, పారాణి వంటి సౌభాగ్య చిహ్నాలను అడగకుండానే ట్యాక్స్ ఫ్రీ చేసింది కానీ, స్త్రీలు నోరు తెరిచి అడిగినా ప్యాడ్లను ట్యాక్స్ ఫ్రీ చేయకుండా భీష్మించుకున్నది. పాలకుల పురుషస్వామ్య దృక్పథానికి ఇది నిదర్శన. దీపికా వంటి సెలెబ్రిటీలు ప్యాడ్ మ్యాన్ చాలెంజ్ తీసుకోవాల్సింది, ప్యాడ్ని ప్రదర్శించడానికి కాదు, వీటన్నిటి గురించీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి తీసుకోవాలి, అప్పుడే అరుణాచలంపై సినిమాకి ఒక అర్థం ఉంటుంది. - సామాన్య వ్యాసకర్త ప్రముఖ రచయిత్రి ‘ 80196 00900 -
‘నేనేం సిగ్గు పడట్లేదు’
సాక్షి, హైదరాబాద్ : మహిళల రుతుస్రావంపై అవగాహన కలిగించేందుకు బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ సైతం నడుం బిగించాడు. ప్యాడ్ మన్ చాలెంజ్లో భాగంగా శానిటరీ నాప్కిన్ చేతిలో పట్టుకున్న ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. అంతేకాకుండా దీనికి నేను సిగ్గుపడటం లేదని, ఈ చాలెంజ్ స్వీకరించి మరొకరికి సవాల్ విసరండని అభిమానులను కోరారు. తాను బిగ్బీ అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్లను చాలెంజ్ చేస్తున్నానని ట్వీటర్లో పేర్కొన్నాడు. ఆ ఫొటోకు క్యాఫ్షన్గా ‘నా చేతిలో ప్యాడ్ ఉంది. దీనికి నేనేం సిగ్గుపడట్లేదు. పీరియడ్ అనేది సహజం. ఇలా ప్యాడ్తో ఫొటో దిగి మీ స్నేహితులకు చాలెంజ్ విసరండి. నేను ఇప్పుడు అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్లను చాలెంజ్ చేస్తున్నాను’ అని ట్వీట్ చేశాడు. దేశవ్యాప్తంగా రుతస్రావం, నాప్కీన్స్ వాడకంపై అవగాహన కలిగించేందుకు ఎన్జీవోలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. ఇక సామాజిక కార్యకర్త అరుణాచలం మురుగనాథమ్ స్టోరీ ఆధారంగా అక్షయ్ కుమార్ లీడ్రోల్లో రాధిక ఆప్టే కథానాయికగా ప్యాడ్మన్ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. Thank you @mrsfunnybones Yes, that’s a Pad in my hand & there's nothing to be ashamed about. It's natural! Period. #PadManChallenge. Copy, Paste this & Challenge your friends to take a photo with a Pad. Here I am Challenging @SrBachchan , @iamsrk & @BeingSalmanKhan pic.twitter.com/lY7DEevDmD — Aamir Khan (@aamir_khan) 2 February 2018 -
సానిటరీ ప్యాడ్స్పై పతంజలి దృష్టి
న్యూఢిల్లీ : రాందేవ్ బాబా ఆధ్వర్యంలోని పతంజలి ప్రొడక్ట్స్ రోజురోజుకు తన ఉత్పత్తుల సంఖ్యను పెంచుకుంటూపోతోంది. ఇప్పటికే వివిధ రకాల మార్కెట్లపై దృష్టి సారించిన పతంజలి గ్రూప్ తాజాగా ఆరోగ్యకరమైన న్యాప్కిన్లు, డైపర్ల తయారీపై ఆసక్తి కనబరుస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం నాటికి ఈ రంగంలో రూ. 16వేల కోట్ల మార్కెట్ సాధిస్తామని పతంజలి అధికార ప్రతినిధి ఎస్కే గుప్తా తెలిపారు. 2006లో మొదటిసారి హెర్బల్ ఉత్పత్తులతో ప్రస్థానం ప్రారంభించిన పతంజలి గ్రూప్.. ఆ తర్వాత న్యూడిల్స్, కాస్మోటిక్స్, పిల్లలు వినియోగించే వస్తువులను ఉత్పత్తి చేసింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న కంపెనీల్లో ఒకటిగా పతంజలి స్థానం సంపాదించుకుంది. ఫోర్బ్స్ జాబితాలో గత సంవత్సరం 45వ స్థానంలో ఉన్న పతంజలి గ్రూప్ ఈ ఏడాది 19వ స్థానంలో నిలిచింది. -
పాడ్మాన్ ట్రైలర్.. అక్కీ గట్స్కి హాట్సాఫ్
సాక్షి, సినిమా : బాలీవుడ్ అగ్ర హీరో అక్షయ్ కుమార్ ఈ మధ్య తన చిత్రాల ఎంపికలో మాములు వైవిధ్యం ప్రదర్శించటం లేదు. యాక్షన్ కిలాడీగా పేరున్న ఆయన గత కొంత కాలంగా ఆ ట్యాగ్ లైన్కు దూరంగా ఉంటూ విమర్శకుల చేత శభాష్ అనిపించుకునే కథలను ఎంచుకుంటున్నారు. ఎయిర్లిఫ్ట్, రుస్తుం, టాయ్లెట్-ఏక్ ప్రేమ్కథా ఇలా వరుసపెట్టి చేసిన చిత్రాలే అందుకు నిదర్శనం. ఇక ఇప్పుడు కొత్త చిత్రం పాడ్మాన్ కూడా ఆ కోవలోనిదే. ఆ చిత్ర ట్రైలర్ కాసేపటి క్రితం వచ్చేసింది. అమెరికాకు స్పైడర్ మాన్ ఉన్నాడు.. బ్యాట్ మాన్ ఉన్నాడు. సూపర్ మాన్ ఉన్నాడు. ఇక ఇండియాకు పాడ్ మాన్ ఉన్నాడు అంటూ అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్ తో ట్రైలర్ మొదలయింది. దేశానికి కావాల్సింది శక్తివంతమైన మహిళలే అని హీరో ట్రైలర్ డైలాగ్ చెప్పటం చూడొచ్చు. అతని వ్యవహారం నచ్చక భార్య, కుటుంబం దూరమైన క్రమంలో అతనికి సాయం అందించే పాత్రలో సోనమ్ కపూర్ నటించింది. ఇక అక్షయ్ భార్య పాత్రలో రాధికా ఆప్టే కనిపించింది. కాస్త వైవిధ్యం, కొన్ని పాయింట్లు ఎబ్బెట్టుగా ఉన్నప్పటికీ కథలో కంటెంట్ మాత్రం చాలా బలంగానే ఉన్నట్లు అనిపిస్తోంది. మహిళల సమస్యపై ఇంత బోల్డ్గా నటించే ధైర్యం బహుశా అక్కీ తప్ప మరెవరూ చేయరేమో. ఇక 'పాడ్మాన్' కథ విషయానికొస్తే... అరుణాచలం మురుగనాథం అనే ఓ సోషల్ ఎంట్రపెన్యూర్కి సంబంధించిన కథ. భారతదేశంలో అతి తక్కువ ధరకి శానిటరీ నేప్కిన్స్ని అందజేయ్యొచ్చునని నిరూపించిన వ్యక్తి.. అంతర్జాతీయ సత్కారాలు కూడా అందుకున్న అతని బయోపిక్ ని దర్శకుడు ఆర్ బాల్కీ దృశ్యరూపకంగా పాడ్మాన్ పేరుతో మలిచారు. రిపబ్లిక్ డే కానుకగా పాడ్మాన్ ప్రేక్షకుల ముందుకు రానుంది. Presenting the much awaited #PadManTrailer, this one's for the mad ones, the ones who are crazy enough to change the world https://t.co/o2NiC2q1SU@PadManTheFilm @sonamakapoor @radhika_apte @mrsfunnybones @SonyPicsIndia @kriarj #RBalki — Akshay Kumar (@akshaykumar) December 15, 2017 -
శానిటరీ న్యాప్కిన్లపై జీఎస్టీ ఎందుకు?
న్యూఢిల్లీ: అలంకారానికి వాడే సిందూరం, కాటుక లాంటి వాటికి జీఎస్టీ నుంచి మినహాయింపు ఇస్తూ మహిళలకు అత్యంత అవసరమైన శానిటరీ న్యాప్కిన్లపై పన్ను వేయడంలోని హేతుబద్ధత ఏంటని ఢిల్లీ హైకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. శానిటరీ న్యాప్కిన్లు అత్యంత అవసరమని, వాటిపై పన్ను విధించడానికి సంబంధించి వివరణ ఇవ్వగలరా అని అడిగింది. జీఎస్టీ మండలిలో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించకపోవడంపై కూడా కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. న్యాప్కిన్లపై 12 శాతం జీఎస్టీ విధించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన ఓ పిటిషన్ను కోర్టు బుధవారం విచారించింది. -
ఆడవాళ్ల నాప్కిన్స్ కు మగవాళ్ల హడావిడి
న్యూఢిల్లీ: దేశంలోని పాఠశాలల్లో, కాలేజీల్లో, ఆస్పత్రుల్లో, ఆఫీసుల్లో బాలికలకు, మహిళలకుశానిటరీ నాప్కిన్స్ సౌకర్యాన్ని ఉచితంగా కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో ప్రకటించింది. అయితే అది ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. ఈ పథకాన్ని అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖది. పథకం అమలుకు వ్యూహరచన చేస్తోంది. దేశవ్యాప్తంగా పథకాన్ని అమలు చేయాల్సిన తమ శాఖా కార్యాలయంలోనే మహిళలకు శానిటరీ నాప్కిన్స్ లేకపోతే ఎలా? అన్న సందేహం వచ్చినట్టుంది. వెంటనే నాలుగు శానిటరీ నాప్కిన్స్ వెండింగ్ మిషన్స్ను కొనుగోలు చేసి నిర్మన్ భవనంలోని తమ శాఖా కార్యాలయాల్లోని మహిళల వాష్రూముల్లో ఏర్పాటు చేసింది. సెప్టెంబర్ 11వ తేదీన ఆ శాఖ అదనపు కార్యదర్శి, జాతీయ ఆరోగ్య మిషన్ డెరైక్టర్ సీకే మిశ్రా ఆర్భాటంగా వెండింగ్ మిషన్ల ప్రారంభించి, వాటికి సంబంధించిన ఫొటోను మీడియాకు విడుదల చేశారు. ఆ రోజు జరిగిన కార్యక్రమంతా మగవాళ్ల హడావిడిగానే కనిపించడం చిత్రం. ప్రారంభోత్సవ కార్యక్రమం ఫొటోలో ఒక్క మహిళ కూడా లేకపోవడం విచిత్రం. ఆ కార్యక్రమంలో మహిళలు కూడా పాల్గొన్నారని, అయితే వారెవరూ కెమెరా కంటికి కనపడలేదని, సీకే మిశ్రాపైనే దృష్టిని కేంద్రీకరించడం వల్ల అలా జరిగిందని ఆనక ఆరోగ్య శాఖ వివరణ ఇచ్చుకున్నది. అయినా ఆడవాళ్ల నాప్కిన్స్ కార్యక్రమానికి మొగవాళ్ల హడావిడి ఏమిటని ప్రశ్నిస్తున్న వాళ్లు లేకపోలేదు. వాళ్లకు ఒకటే సమాధానం. కండోమ్స్ కొనేందుకు సిగ్గుపడే మగాళ్లలో ఎక్కువ మంది ఎలాంటి బెరకు లేకుండా లేడీస్ నాప్కిన్స్ కొంటున్నారని ఇటీవల ఓ సర్వేలో వెల్లడైంది. అంతెందుకు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా మహిళలు ఉపయోగించడం కోసం అతి చౌకైనా శానిటరీ నాప్కిన్స్ను ఉత్పత్తి చేసి సరఫరా చేస్తున్న ‘గూంజ్’ అనే ఎన్జీవోకి అనూష్ గుప్తా నేతృత్వం వహిస్తున్నారు. అంతేకాదు, ఈ విషయంలో గ్రామీణ మహిళల్లో చైతన్యం తీసుకొస్తున్నందుకుగానూ ఆయనకు గత జూలై నెలలో అంతర్జాతీయంగా ప్రతిష్టాత్మకమైన మెగసెసె అవార్డు కూడా ఇచ్చారు. ఆడవాళ్ల రుతుక్రమం పట్ల సమాజంలో పేరుకుపోయిన అపోహలను తొలగించేందుకు కృషి చేస్తున్న సామాజిక కార్యకర్తల్లో కూడా మగవాళ్లే ఎక్కువ ఉన్నారు.