Shimla
-
కొత్త జంటలకు ఏకాంతం.. ఆలుమగలకు ప్రశాంతం! ఈ రొమాంటిక్ ప్లేసెస్ గురించి ఎప్పుడైనా విన్నారా? (ఫొటోలు)
-
హిమాచల్లో భారీ మంచు
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్లో గత 24 గంటల్లో భారీగా మంచు కురియడంతో నలుగురు మృతి చెందారు. మూడు జాతీయరహదారు లు, మరో 220 దారులను మూసివేశారు. సిమ్లా, కులు, మండి, చంబా, సిర్మౌర్ జిల్లాలతో పాటు కిన్నౌర్, లాహౌల్, స్పితి జిల్లాల్లో భారీగా మంచు కురిసింది. పలు వాహనాలు అదుపుతప్పి బోల్తా పడటంతో నలుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. దీంతో సిమ్లాలో 145, కులులో 25, మండీ జిల్లాల్లో 20 రహదారులను మూసివేశారు. 356 ట్రాన్స్ ఫార్మర్ ఫెయిల్యూర్ కావడంతో చాలా ప్రాంతాల్లో విద్యుత్ లేదు. క్రిస్మస్, న్యూ ఇయర్ కోసం సిమ్లా, మనాలీలకు పర్యాటకులు పోటెత్తారు. స్థానిక నివేదికల ప్రకారం, అట్టారి నుంచి లేహ్, కులు జిల్లా లోని సంజ్ నుంచి ఔత్, కిన్నౌర్ జిల్లాలోని ఖాబ్ సంగం, లాహౌల్, స్పితి జిల్లాలోని గ్రామ్ ఫూ వరకు జాతీయ రహదారులు ట్రాఫిక్ కారణంగా మూసివేశారు. రోడ్లను క్లియర్ చేయడానికి హిమాచల్ ప్రభుత్వం రెండు స్నో బ్లోయర్లతో సహా 268 యంత్రాలను ఏర్పాటు చేసింది. జిల్లా యంత్రాంగం సూచనలను పాటించాలని, స్థానికులు చెప్పేది వినాలని, మంచులో డ్రైవింగ్ చేయవద్దని పర్యాటకులు సూచించింది.తెల్లని వండర్ల్యాండ్గా హిమాచల్.. హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లా, మనా లీ వంటి పర్యాటక కేంద్రాలు తెల్లని వండర్ల్యాండ్గా మారాయి. అలాగే జమ్మూకాశీ్మర్లోని కొన్ని ప్రాంతాల్లో తాజాగా మంచుకురిసింది. ఉష్ణోగ్రతలు గడ్డకట్టే స్థాయి కంటే అనేక డిగ్రీలు పడిపోయా యి. ఇది క్రిస్మస్ సెలవుల కోసం ప్రదేశాలను సందర్శించే పర్యాటకులకు ఉత్సాహాన్ని కలిగిస్తోంది. మరోవైపు వాహనాల రాకపోకలకు కష్టమవుతోంది. సోమవా రం అర్థరాత్రి మనాలీ, డల్హౌసీ శివారు ప్రాంతాల్లో తేలికపాటి హిమపాతం నమోదైంది. ఖద్రాలాలో అత్యధికంగా 24 సెంటీమీటర్లు, సంగ్లాలో 16.5 , షిల్లారోలో 15.3, చోపాల్, జుబ్బల్లో 15 సెంటీమీటర్ల చొప్పున, కల్పాలో 14, నిచార్లో 10, సిమ్లాలో 7, పూహ్లో 6, జోత్లో 5 సెంటీమీటర్ల చొప్పున మంచు కురిసింది. ప్రతికూల వాతావరణం, హిల్ స్టేషన్కు వెళ్లే మార్గంలో రహదారిపై ప్రాణాంతక పరిస్థితులు ఉన్నా పర్యాటకులు పోటెత్తారు. సిమ్లాలోని హోటల్ గదుల ఆక్యుపెన్సీ 70 శాతం నమోదైంది. గత ఏడాది డిసెంబర్ కంటే ఇది 30 శాతం ఎక్కువ. మంచు దుప్పటితో అందంగా కప్పబడిన సిమ్లా, మనాలీ చిత్రాలతో సోషల్ మీడియా నిండిపోయింది. శుక్రవారం సాయంత్రం నుంచి ఆదివారం మధ్యా హ్నం వరకు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా సిమ్లాలో భారీ వర్షా లు, మంచు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. -
రోడ్లపై మంచు గుట్టలు..చిక్కుకుపోయిన టూరిస్టులు
షిమ్లా:హిమాచల్ప్రదేశ్లో భారీగా మంచు కురుస్తోంది. భారీ మంచు ప్రభావంతో రోడ్లపై ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడుతోంది. రోడ్లపై మంచు గుట్టలుగుట్టలుగా పేరుకుపోవడంతో రోహ్తక్, సోలాంగ్, అటల్ టన్నెల్ మార్గంలో వెయ్యి వరకు వాహనాలు సోమవారం రాత్రి కొన్ని గంటల పాటు చిక్కుకుపోయాయి.స్థానిక అధికారులు,పోలీసుల సాయంతో ట్రాఫిక్ క్లియర్ చేశారు. మొత్తం 700 మంది టూరిస్టులను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. క్రిస్మస్, న్యూఇయర్ కావడంతో టూరిస్టుల తాకిడి ఎక్కువవడం ఇదే సమయంలో మంచు భారీగా కురుస్తుండడంతో సమస్యలు ఎదురవుతున్నాయని పోలీసులు చెప్పారు. ఈ సీజన్లో ఇక్కడుండే మంచు పర్వతాలను చూడడానికి ఎక్కువ మంది టూరిస్టులు వస్తుండడం గమనార్హం. #WATCH | Himachal Pradesh: Heavy snowfall causes a long traffic jam as nearly 1000 vehicles get stuck between Solang and Atal Tunnel, Rohtang. The police team is busy clearing the traffic jam amid snowfall. 700 tourists have been rescued safely. (23.12)Source: Himachal Pradesh… pic.twitter.com/wb9ZfKh6H6— ANI (@ANI) December 23, 2024 -
హిమాచల్లో రెండు డిగ్రీలకు కనిష్ట ఉష్ణోగ్రతలు
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్లో చలి తీవ్రత పెరిగింది. రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. లాహౌల్ స్పితి జిల్లా కుకుమ్సేరిలో కనిష్ట ఉష్ణోగ్రత రెండు డిగ్రీల సెల్సియస్కు చేరుకుంది. గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్. గరిష్ట- కనిష్ట ఉష్ణోగ్రతల మధ్య ఏర్పడిన వ్యత్యాసం పలువురికి అనారోగ్యాలను తెచ్చిపెడుతోంది. పగటిపూట ఎండవేడిమి, సాయంత్రం వీచే చల్లని గాలి వ్యాధులకు కారణంగా నిలుస్తోంది.సిమ్లా వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం అక్టోబర్ 17 వరకు వాతావరణం నిర్మలంగా ఉండనుంది. అంటే వర్షం, ఉరుములు, మెరుపులు, వడగళ్ల వాన మొదలైనవి ఉండవు. మరోవైపు కిన్నౌర్ జిల్లా కల్పాలో తేలికపాటి వర్షం నమోదైంది. ధర్మశాలలోని ధౌలాధర్ పర్వతాలపై కూడా తేలికపాటి హిమపాతం కనిపించింది.దీనిని ఈ సీజన్లో మొదటి హిమపాతంగా చెబుతున్నారు. ఎత్తయిన ప్రాంతాల్లో చలి తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. హిమాచల్ ప్రదేశ్లోని లాహౌల్ స్పితి జిల్లాలోని కుకుమ్సేరిలో అత్యల్ప ఉష్ణోగ్రత 2.1 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఉనాలో అత్యధికంగా 35.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. సిమ్లాలో 23.8 డిగ్రీలు, కల్పాలో 21.8 డిగ్రీలు, ధర్మశాలలో 28 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఇది కూడా చదవండి: ఎయిరిండియా విమానంలో బాంబు? -
హిమాచల్కు టూరిస్టుల తాకిడి.. హోటళ్లు కిటకిట
సిమ్లా: ప్రస్తుతం దేశంలో దేవీ నవరాత్రులు వైభవంగా కొనసాగుతున్నాయి. దసరా నేపధ్యంలో సెలవులను ఎంజాయ్ చేసేందుకు టూరిస్టులు హిమాచల్ ప్రదేశ్కు తరలివస్తున్నారు. రాష్ట్రంలోని పర్యాటక వ్యాపారం ఇప్పుడు మరింతగా ఊపందుకుంది.పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రల నుండి పర్యాటకులు హిమాచల్ చేరుకుంటారు. దీంతో ఇక్కడి హోటళ్లలోని గదులు 80 శాతం వరకూ నిండిపోయాయని తెలుస్తోంది. ట్రావెల్ ఏజెంట్ నరేన్ సహాయ్ మీడియాతో మాట్లాడుతూ పండుగగ సీజన్ ప్రారంభమైందని,అక్టోబర్ 11, 12, 13 తేదీల్లో లాంగ్ వీకెండ్ రాబోతోందని, ఈ సందర్భంగా పర్యాటకులు హిమాచల్కు అధిక సంఖ్యలో తరలివస్తారని భావిస్తున్నామన్నారు. ప్రస్తుతం, బెంగాలీ పర్యాటకులు వస్తున్నారని, దీపావళి సమయంలో గుజరాతీ పర్యాటకులు సిమ్లాను సందర్శిస్తారన్నారు.నవరాత్రుల సందర్భంగా ఇక్కడికి వచ్చే పర్యాటకుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోందని హోటల్ వ్యాపారి ప్రిన్స్ కుక్రేజా మీడియాకు తెలిపారు. వారాంతాల్లో గదుల బుకింగ్స్ కూడా జరుగుతున్నాయన్నారు. గత వారాంతంతో పోలిస్తే, ఈ వారాంతంలో ఎక్కువ సంఖ్యలో పర్యాటకులు సిమ్లా, హిమాచల్ ప్రదేశ్లను సందర్శించేందుకు రానున్నారని తెలిపారు. పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర , పంజాబ్, హర్యానా, ఢిల్లీ, చండీగఢ్ నుండి పర్యాటకులు హిమాచల్కు తరలివస్తున్నారన్నారు.ఇది కూడా చదవండి: ఈ జంట 150 ఏళ్లు జీవించాలని ఏం చేస్తున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు! -
ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తే.. పెన్షన్ రద్దు
సిమ్లా: పార్టీ ఫిరాయింపులను అరికట్టేందుకు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒక పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు మరో పార్టీకి చేరకుండా ఉండేందుకు బుధవారం అసెంబ్లీలో ఓ కొత్త బిల్లును తీసుకువచ్చింది. పార్టీ మారితే ఎమ్మెల్యేల పెన్షన్ రద్దు చేసేలా ఆ బిల్లును రూపొందించింది. ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు హిమాచల్ ప్రదేశ్ శాసనసభలో.. సభ్యుల భత్యాలు ,పెన్షన్ (సవరణ బిల్లు)- 2024 పేరుతో నూతన బిల్లును ప్రవేశపెట్టగా ఆమోదం పొందింది. ఇక ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలకు కొత్త బిల్లు ప్రకారం పెన్షన్ రద్దు వర్తిస్తుంది. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం ఏ సమయంలోనైనా ఎమ్మెల్యేలుగా అనర్హతకు గురైతే.. కొత్త బిల్లు ప్రకారం పెన్షన్కు అర్హులు కాదు’అని ఫిరాయింపు నిరోధక చట్టాన్ని ఈ బిల్లు ప్రస్తావించింది.ఇక..ఫిబ్రవరి 27న హిమచల్ ప్రదేశ్లో రాజ్యసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి కాకుండా బీజేపీ అభ్యర్థికి ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఓటు వేశారు. అనంతరం వారంతా బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. అయితే ఇటువంటి పరిస్థితులు ఎదురుకాకుండా ఉండేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కీలకమైన బిల్లును ఆమోదించింది. -
హిమాచల్: వరద బాధితులకు తక్షణ సాయం రూ. 50 వేలు
హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు ఎనిమిదిమంది మృతిచెందారు. 50 మంది గల్లంతయ్యారు. తాజాగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో స్థానిక యంత్రాంగం అప్రమత్తమైంది. భారీ వర్షాల కారణంగా పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. నదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.సిమ్లా జిల్లాలోని సమేజ్, రాంపూర్, కులులోని బాఘిపుల్, మండిలోని పద్దర్లలో భారీ వర్షాలు కురిసి విధ్వంసం సృష్టించాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ ప్రత్యేక కార్యదర్శి డీసీ రాణా తెలిపారు. భారీ వర్షాలకు 53 మంది గల్లంతయ్యారని తెలిపారు. ఆరు మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది వెలికితీశారు. 60కి పైగా ఇళ్లు కొట్టుకుపోయాయి. పలు గ్రామాలు అతలాకుతలమయ్యాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి.హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు, విద్యాశాఖ మంత్రి రోహిత్ ఠాకూర్లు సిమ్లా, కులు జిల్లాల్లో పర్యటించి వరద బాధితులతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ బాధితులకు తక్షణ సాయంగా రూ.50వేలు ఇస్తామని ప్రకటించారు. అలాగే వచ్చే మూడు నెలల పాటు నెలకు రూ.5వేలు చొప్పున ఇస్తామని, వంటగ్యాస్, ఆహారం, ఇతర నిత్యావసర వస్తువులను కూడా అందజేస్తామని తెలిపారు. #WATCH | Shimla: On Himachal Pradesh disaster, Special Secretary, Disaster Management DC Rana says, "A cloudburst in the Samej area of Shimla district, Rampur region, Baghipul area of Kullu, and Paddar area of Mandi has led to widespread destruction. 53 people are missing and six… pic.twitter.com/s0CAl1Me4e— ANI (@ANI) August 3, 2024 -
నవ్వుతారేమో అనుకున్నా: లాపతా లేడీస్ ప్రతిభ ఇంట్రస్టింగ్ జర్నీ
బాలీవుడ్ దర్శకురాలు కిరణ్రావు (బాలీవుడ్ హీరో ఆమీర్ ఖాన్ మాజీ భార్య) దర్శకత్వంలో వచ్చిన లాపతా లేడీస్ ఓటీటీలో మంచి ఆదరణ సంపాదించుకుంది. కుటుంబం, వైవాహిక వ్యవస్థలో మహిళల స్థితిగతులు, అమ్మాయిల ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా జరిగే బాల్య వివాహాలు, అమ్మాయిల తెగవును పట్టి ఇచ్చిన సినిమా ఇది. ముఖ్యంగా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన ప్రతిభా రాంటా తన అధ్బుతమైన నటనతో ఆకట్టుకుంది. సిమ్లా టూ బాలీవుడ్ ప్రతిభ రాంటా ఇంట్రస్టింగ్ జర్నీ ఒక సారి చూద్దాం.ఖుర్బాన్ హువా టీవీ సీరియల్తో వెలుగులోకి వచ్చింది ప్రతిభా రాంటా. ఆ తరువాత వెబ్ సిరీస్ చేస్తుండగా కిరణ్ రావు దృష్టిలో పడింది. అలాలాపతా లేడీస్లో అవకాశం వచ్చింది. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని తానేమిటో నిరూపించుకుంది. బాలీవుడ్కి పరిచయం అయిన కొత్త ముఖాల్లో ప్రతిభ రాంటా. నిజంగా తన యాక్టింగ్ ప్రతిభ, ఒకదాని తర్వాత ఒకటి తన ఆన్-స్క్రీన్ పెర్ఫార్మెన్స్తో, ముఖ్యంగా లాపతా లేడీస్ 'జయ' పాత్రలో సత్తా చాటింది. ఇటీవల విడుదలైన వెబ్ సిరీస్ హీరామండి: ది డైమండ్ బజార్లో 'వహీదా' (సంజీదా షేక్) కుమార్తె 'షామా' పాత్రను పోషించింది. 24 ఏళ్ల వయసులో చాలా తక్కువ సమయంలోనే తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. అయితే ఈ ప్రయాం అంత సాఫీగా సాగలేదు.ఎవరీ ప్రతిభా రాంటాసందేశనా రాంటా,, రాజేశ్ రాంటా దంపతుల కుమార్తె ప్రతిభా రాంటా. సిమ్లాలో పెరిగింది. చిన్నప్పటి నుంచీ డాన్స్ అంటే ఇష్టం. డాన్స్లో గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేసింది. అలా నటించాలనే ఆసక్తి పెరిగింది. ఆ మాటే ఇంట్లో చెబితే యాక్టింగ్ అంటే ఏంటి? అని అడిగారట. ఎందుకంటే కుటుంబంలో చాలా మంది ఉపాధ్యాయులు, అందుకే వారికి నటన గురించి ఏమీ తెలియదట. ఇంజనీర్, డాక్టర్ లేదా మరేదైనా ఇతర ప్రొఫెషనల్గా ప్రతిభను చూడాలని ఆశించారు. దీంతో యాక్టింగ్లో చేరడం చాలా కష్టమేమో , తనను చూసి నవ్వుతారేమో అనిపించిందని ఒక ఇంటర్య్వూలో వెల్లడించింది.పాఠశాల విద్యను పూర్తి చేసిన తర్వాత, ప్రతిభ ఎలాగోలా తన తల్లిదండ్రులను ఒప్పించి ఉన్నత చదువుకోసం ముంబైకి చేరింది. ఆడిషన్లు ఇవ్వడం మొదలు పెట్టింది. అందాల పోటీలో పాల్గొంది. 2018లో మిస్ ముంబై టైటిల్ను గెలుచుకుంది. నిస్సందే 2018 మిస్ ముంబై అందాల పోటీల్లో మిస్ ముంబై కిరీటం గెలుచుకుంది. దీంతో కేవలం ఆరు నెలలకే ‘ఖుర్బాన్ హువా’ టీవీ సీరియల్ 'చాహత్' పాత్రలో తొలి ఆఫర్ వచ్చింది. తరువాత,ఆధా ఇష్క్ అనే వెబ్ షోలో కూడా కనిపించింది. View this post on Instagram A post shared by Pratibha Rantta (@pratibha_ranta)ఇక లాపతా లేడీస్ ఆఫర్ గురించి మాట్లాడుతూ మొదట్లో కాస్త భయమేసిందని, అయితే సినిమాలో ‘జయ’ కథ ఒక విధంగా నిజ జీవితానికి సరిగ్గా సరిపోతుందని, అందుకే ఆ పాత్రలో పూర్తిగా లీనమైపోయానని చెప్పుకొచ్చింది. మొత్తానికి తన జర్నీ అంతా ఒక మ్యాజిక్లా సాగిపోయిందని వెల్లడించింది మెరిసే కళ్లతో. -
నేటితో ‘హిమాచల్’కు 76 ఏళ్లు!
హిమాచల్ ప్రదేశ్ ఈరోజు 76వ ఏట అడుగుపెట్టింది. ఈ రాష్ట్రం 1948 ఏప్రిల్ 15న ఆవిర్భవించింది. నేడు హిమాచల్ దినోత్సవాన్ని సిమ్లాలోని రిడ్జ్ గ్రౌండ్లో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జానపద కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించనున్నారు. అనేక మైలురాళ్లను దాటిన హిమాచల్ ప్రదేశ్ నేడు అన్ని రంగాల్లోనూ ముందు వరుసలో ఉంది. 1948లో హిమాచల్ ప్రదేశ్లో అక్షరాస్యత రేటు ఏడు శాతంగా ఉంది. ఇది 76 సంవత్సరాల తర్వాత అంటే నేటికి 82.80 శాతానికి చేరుకుంది. రాష్ట్రంలో మూడు విమానాశ్రయాలు ఉన్నాయి. 1948లో వీటి సంఖ్య సున్నా. ఆరోగ్య రంగంలో కూడా రాష్ట్రం అగ్రగామిగా నిలిచింది. హిమాచల్లో ప్రస్తుతం ఒక ఎయిమ్స్, ఐదు వైద్య కళాశాలలు, ఐదు డెంటల్ కళాశాలలు, పలు నర్సింగ్, ఫార్మసీ కళాశాలలు ఉన్నాయి. దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి కూడా విద్యనభ్యసించేందుకు విద్యార్థులు ఇక్కడికి వస్తున్నారు. 1948వ సంవత్సరంలో హిమాచల్ ప్రజల తలసరి ఆదాయం రూ.240 కాగా, ప్రస్తుతం రూ.2,35,199కి చేరుకుంది. స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘ సంస్కర్త యశ్వంత్ సింగ్ పర్మార్ హిమాచల్ తొలి ముఖ్యమంత్రి. ఈయన 1952 నుండి 1977 వరకు అధికారంలో ఉన్నారు. ఠాకూర్ రామ్ లాల్ 1977, 1980లలో రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు. శాంత కుమార్ 1977, 1990లో రెండుసార్లు అధికారంలో కొనసాగారు. వీరభద్ర సింగ్ 1985, 1993, 2003, 2012,2017లో ఆరుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రేమ్ కుమార్ ధుమాల్ 1998, 2007లో అధికారాన్ని చేపట్టారు. 2017లో జైరాం ఠాకూర్ ముఖ్యమంత్రి అయ్యారు. సుఖ్విందర్ సింగ్ సుఖు 2023 నుండి అధికారంలో కొనసాగుతున్నారు. -
కులు, మనాలీ, సిమ్లా.. ఒకేసారి చూసేందుకు ఐఆర్సీటీసీ అద్భుత ప్యాకేజీ!
హిమాచల్ప్రదేశ్లోని కులు, సిమ్లా, మనాలి పర్యాటక ప్రాంతాలు ఏడాది పొడవునా టూరిస్టులతో రద్దీగా ఉంటాయి. ముఖ్యంగా మార్చి ప్రారంభం నుండి కులు, సిమ్లా, మనాలిలకు పర్యాటకులు క్యూ కడుతుంటారు. ఇప్పుడు ఈ మూడు అద్భుత ప్రాంతాలను ఒకేసారి సందర్శించేలా ఐఆర్సీటీసీ అద్భుతమైన ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. తాజాగా ఐఆర్సీటీసీ ఒక ట్వీట్లో ఈ టూర్ ప్యాకేజీ గురించిన సమాచారాన్ని తెలియజేసింది. ఐఆర్సీటీసీ అందించే ఈ టూర్ ప్యాకేజీ 2024, మార్చి 27 నుండి ప్రారంభంకానుంది. ఈ టూర్ ప్యాకేజీలో ప్రయాణం తిరువనంతపురం నుంచి ప్రారంభం కానుంది. ఇది ఎయిర్ టూర్ ప్యాకేజీ. ఏడు రాత్రులు, ఎనిమిది పగళ్లతో కూడిన ఈ టూర్ ప్యాకేజీలో హిమాచల్లోని ఈ మూడు ప్రముఖ పర్యాటక ప్రాంతాలను చూడవచ్చు. ఈ టూర్ ప్యాకేజీలో ప్రయాణించాలనుకుంటే.. ఒకరైతే రూ.67,500, ఇద్దరికైతే రూ.53,470, ముగ్గురికి రూ.51,120 చెల్లించాల్సివుంటుంది. 5 నుంచి 11 ఏళ్ల పిల్లలకు బెడ్ రిజర్వేషన్కు రూ.46,420, బెడ్ లేకుండా అయితే రూ.43,800 చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే రెండు నుంచి నాలుగేళ్ల వయసు గల పిల్లలకు, ఛార్జీగా రూ. 33,820లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్యాకేజీని బుక్ చేసుకోవడానికి ఐఆర్సీటీసీ అధికారిక వెబ్సైట్ను సందర్శించాలి. It's time for a vacation amidst the hills. Visit #shimla-#Kullu-#Manali with IRCTC (SEA23) on 27.03.2024 from #Thiruvananthapuram Book now on https://t.co/9ulobfRHWU . . .#dekhoapnadesh #Travel #Booking #Tours #traveller #vacations #ExploreIndia #HimachalPradesh @hp_tourism… pic.twitter.com/dgf3PbNLhp — IRCTC (@IRCTCofficial) February 21, 2024 -
Video: అకస్మాత్తుగా కూలిన అయిదు అంతస్తుల భవనం
అది అయిదు అంతస్తుల భవనం.. చుట్టు కొండల మధ్య ఒక్కటే బిల్డింగ్. శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా ఆ బహుళ అంతస్తుల భవనం కుప్పకూలింది. అందరూ చూస్తుండగానే పేకమేడల్లా నెలకొరిగింది. అయితే ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.. అసలు ఏం జరిగిందంటే.. హిమాచల్ ప్రదేశ్ రాజధాని షిమ్లాకు 26 కిలోమీటర్ల దూరంలో ధామి పట్టణంలోని మరహ్వాగ్ అనే గ్రామం ఉంది. అక్కడ రాజ్ కుమార్ అనే వ్యక్తికి అయిదు అంతస్తుల భవనం ఉంది. ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదలతో అతని ఇంటి చుట్టుపక్కల ఉన్న కొండచరియలు విరిగిపడ్డాయి. కొండ రాళ్లు ఈ బిల్డింగ్ గోడలను ఢీకొట్టాయి. ఈ క్రమంలో దానికి మరమ్మత్తులు చేశారు. అయినా కొన్ని రోజులుగా బిల్డింగ్లో కదలికలు రావడంతో అప్రమత్తమైన యజమాని.. బిల్డింగ్లోని నివాసితులను ఖాళీ చేయించి, మళ్లీ రిపేర్ చేయాలని భావించాడు. అధికారులను స్పందించగా బిల్డింగ్ ఎప్పుడైనా కూలిపోతుందని.. మరమ్మతులు చేయించిన ఫలితం ఉండదని చెప్పడంతో ఆ బిల్డింగ్ను అలాగే ఉంచేశాడు.. దీంతో కొన్ని రోజులకు బిల్డింగ్ బేస్మెంట్కు పగుళ్లు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో బిల్డింగ్ అకస్మాత్తుగా కూలిపోయింది. అందులోని నివాసితులను అధికారులు ముందుగానే ఖాళీ చేయించారు. విద్యుత్ సరాఫరా కూడా నిలిపివేశారు. దీంతో ఎవరికి ఎలాంటి నష్టం జరగలేదు. అయితే ధామి ప్రభుత్వ డిగ్రీ పాఠశాలకు వెళ్లే రహదారి దెబ్బతింది. ట్రాఫిక్కు సైతం అంతరాయం ఏర్పడింది. 15 సెకన్ల నిడివిగల ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (రూరల్) నిశాంత్.. ఇంటి పైన ఉన్న కొండ ప్రాంతంలో తవ్వకాలు చేపట్టడం వల్లే భవనం కూలిపోయిందని తెలిపారు. చదవండి: భారత్లోకి మయన్మార్ సైనికులు.. భారత్ కీలక నిర్ణయం Breaking: Major landslide in Shimla, where a 5-story building collapsed, and cracks appeared in the adjoining area and buildings. No casualties reported till now. #Shimla #Himachal pic.twitter.com/hRVXPY45Km — Gagandeep Singh (@Gagan4344) January 20, 2024 -
రైల్వే ట్రాక్ ఎలా వేలాడుతుందో చూడండి..
షిమ్లా: హిమాచల్ ప్రదేశ్లో కురుస్తున్న భారీ వర్షాలకు షిమ్లా సమ్మర్ హిల్లో ఒక చోట రైల్వే ట్రాక్ కింద ఉన్న భూభాగం తుడిచిపెట్టుకు పోయింది. దీంతో ఆ రైల్వే ట్రాక్ గాల్లో వేలాడుతూ ఉంది. కాకపోతే ఇది సాధారణ రైల్వే ట్రాక్ కాదు. యునెస్కో వారు పర్యాటకం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. దీనిపై టాయ్ ట్రైన్ ప్రయాణిస్తుంటుంది. షిమ్లా సమ్మర్ హిల్ హిమాచల్ ప్రదేశ్ పర్యాటకంలో ఒక భాగం. ఈ ట్రాక్ పైన వెళ్లే టాయ్ ట్రైన్ ప్రయాణం చాలా మందికి బాల్య జ్ఞాపకాలను గుర్తు చేసే యునెస్కో వారి ప్రత్యేక ఆకర్షణ. ఈ ట్రాక్ కక్ల నుండి షిమ్లా వైపుగా 96 కి.మీ. ప్రయాణిస్తుంటుంది. ఐదు గంటల పాటు సాగే ఈ ప్రయాణంలో హిమాచల్ ప్రదేశ్లోని అందమైన హిమాలయాల సొగసులు, ఆహ్లాదకరమైన ప్రకృతి అందాలు దర్శనమిస్తాయి. కానీ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఈ ట్రాక్ కింద భూభాగం కొట్టుకుపోవడంతో ఈ ట్రాక్ గాలిలో వేలాడుతోంది. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే టాయ్ ట్రైన్ రాకపోకలు ప్రస్తుతానికైతే నిలిచిపోయాయి. దీని మరమ్మత్తులకు కనీసం రూ.15 కోట్లు వ్యయం అవుతుందని దాని కోసం సుమారు నెలరోజుల సమయం పడుతుందని రైల్వే అధికారలు చెబుతున్నారు. ఇదే షిమ్లా సమ్మర్ హిల్ సమీపంలో మరొక దేవాలయం కూడా భారీ వర్షాలకు నేలకొరిగింది. భారీ సంఖ్యలో భక్తులు సావాన్ ప్రార్ధనలు నిర్వహిస్తుండగా ఈ దేవాలయం కుప్పకూలింది. విపత్తు నిర్వహణ బృందం సహాయక చర్యలు చేపడుతుండగా శిథిలాల్లో 13 మృతదేహాలు లభ్యమయ్యాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలకు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రమంతా అతలాకుతలమైంది. ఎక్కడికక్కడ వాన నీరు నిలిచిపోయి రహదారులు నదులను తలపిస్తుంటే నదులు మాత్రం నీటిప్రవాహానికి పోటెత్తుతూ ఉన్నాయి. ఇదిలా ఉండగా కొండ ప్రాంతాల్లో మాత్రం ఘాట్ రోడ్డు పొడవునా కొండచరియలు విరిగిపడటంతో వాహనదారులకు తీవ్ర అంతరాయం కలిగిస్తూ ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ మాట్లాడుతూ వర్షాలకు హిమాచల్ ప్రదేశ్లో భారీ నష్టం వాటిల్లిందని 60 మంది ప్రాణాలు కోల్పోగా ప్రభావిత ప్రాంతాలను పునరుద్ధరించేందుకు కనీసం రూ.10,000 కోట్లు ఖర్చవుతుందని దానికి ఏడాదికి పైగా సమయం పడుతుందని అన్నారు. "Guys this is very scary" Heavy damage to Kalka-Shimla railway track due to heavy rain and landslides. The earth below the track and been washed away at one place.#Himachal #HimachalPradeshRains #HimachalFloods #himachalrains #HimachalPradesh #TRAIN @AshwiniVaishnaw pic.twitter.com/E4V8jIS2uZ — कालनेमि (Parody) (@kalnemibasu) August 14, 2023 ఇది కూడా చదవండి: చంద్రయాన్-3లో కీలక ఘట్టం..మాడ్యూలర్ నుంచి విడిపోయిన ల్యాండర్ -
హిమాచల్ ప్రదేశ్లో వర్ష బీభత్సం (ఫోటోలు)
-
విరుగుతున్న కొండచరియలు.. కుప్పకూలుతున్న ఇళ్లు
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కొండరియలు విరిగిపడుతున్నాయి. తాజాగా సిమ్లాలోని కృష్ణ నగర్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడగా.. వాటిపై ఉన్న ఏడు ఇళ్లు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. ఈ భయానక దృశ్యాలు భీతికొల్పేవిగా ఉన్నాయి. ఈ ఘటనలో మరణాల సంఖ్య ఇంకా ఓ అంచనాకు రాలేమని సీపీ సంజీవ్ కుమార్ తెలిపారు. #WATCH | Several houses collapsed in Krishna Nagar area in Himachal Pradesh's Shimla after a landslide took place. Rescue operation underway. (Video Source: Local; confirmed by Police and administration) pic.twitter.com/qdYvR4C4fx — ANI (@ANI) August 15, 2023 కాగా.. గత మూడు రోజులుగా హిమాచల్ ప్రదేశ్ వర్షాలతో అతలాకుతలం అవుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో వర్షాల కారణంగా 54 మంది మరణించారు. వర్షపు నీటితో నదులు ఉద్దృతంగా ప్రవహిస్తున్నాయి. సోమవారం వివిధ చోట్ల జరిగిన కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో 12 మంది మృతి చెందారు. రహదారులు మూతపడ్డాయి. దీంతో రాష్ట్రంలో నేడు స్వాతంత్య్ర వేడుకలు కూడా జరపలేదు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది నిర్విరామంగా పనిచేస్తున్నారు. #WATCH | Hill collapsed in Krishna Nagar area in HP's Shimla. Around five to seven houses collapsed. Further details awaited. pic.twitter.com/esWoGcjxlB — ANI (@ANI) August 15, 2023 కాగా.. మరో రెండు రోజులు హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాఖండ్, ఈశాన్య భారతంలో మరో ఐదు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు. ఇదీ చదవండి: స్వాతంత్య్ర వేడుకలకు దూరంగా ఆ రాష్ట్రం.. ఎందుకంటే. -
దారుణం: కుంగిన రహదారి.. లోయలో బస్సు బోల్తా.. ఏడుగురి మృతి..
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్లో దారుణం జరిగింది. బస్సు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. మరో నలుగురు పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. సిమ్లాకు వెళ్లే దారిలో మండి జిల్లాలో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. రహదారి దెబ్బతిన్న కారణంగానే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో జాతీయ రహదారి 5పై ఉన్న సిమ్లా-కల్కా రోడ్డును గత కొద్దిరోజులుగా మూసి ఉంచారు. గురువారమే ఆ దారిలో తేలిపాటి వాహనాలకు అనుమతులు ఇచ్చారు. ఆ రహదారిలో బస్సు రావడంతో ఒక్కసారిగా రోడ్డు కుంగిపోయింది. దీంతో ప్రమాదం జరిగింది. ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. వర్షాలతో రాష్ట్రంలో దాదాపు 200 రోడ్డు మార్గాలను మూసివేశారు. సుమారు 200 మార్గాల్లో ఎలక్ట్రిసిటీని కూడా నిలిపివేశారు. ప్రస్తుతం కొన్ని మార్గాల్లో తేలికపాటి వాహనాలను అనుమతించారు. దీంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో కొన్ని జిల్లాలో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇదీ చదవండి: నూహ్ అల్లర్లు: ప్రముఖ టీవీ ఛానల్ ఎడిటర్ అరెస్టు.. -
సిమ్లా కాదు బెంగళూరు
న్యూఢిల్లీ: వచ్చే లోక్సభ ఎన్నికల్లో అధికార బీజేపీని గద్దె దింపడమే లక్ష్యంగా చేతులు కలిపిన ప్రతిపక్ష పార్టీలు రెండో విడతగా బెంగళూరులో సమావేశం కానున్నాయి. తొలుత సిమ్లాలో భేటీ నిర్వహించాలని భావించినప్పటికీ వేదికను బెంగళూరుకి మార్చారు. జులై 13, 14 తేదీలలో విపక్షాల భేటీ ఉంటుందని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ వెల్లడించారు. పట్నాలో జరిగిన తొలి సమావేశంలో 17 పార్టీలు కలసి కట్టుగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ సారి సమావేశంలో ప్రతిపక్ష పార్టీ నాయకులు ప్రజా సమస్యలపై పోరుబాట, లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ఉమ్మడి ఎజెండా, సీట్ల సర్దుబాటు వంటి అంశాలపై చర్చించనున్నారు. గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడిన శరద్ పవార్ పట్నా సమావేశం తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీలో అసహనం పెరిగిపోయిందని ఆరోపించారు. ఉమ్మడి పౌరస్మృతి మన దేశానికి అవసరమని ప్రధాని వ్యాఖ్యలపై చర్చ జరుగుతున్న సమయంలో యూసీసీపై తమ పార్టీ ఏ నిర్ణయం తీసుకోలేదన్నారు. వివిధ వర్గాలు, మత సంస్థలతో చర్చించాక తుది నిర్ణయం వెల్లడిస్తామన్నారు. యూసీసీ కంటే ముందు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని పవార్ డిమాండ్ చేశారు. -
Himachal Pradesh: కాంగ్రెస్ సీఎం అభ్యర్థిపై ఉత్కంఠ
షిమ్లా: గుజరాత్ ఫలితంతో ఢీలా పడిన కాంగ్రెస్ పార్టీ.. హిమాచల్ ప్రదేశ్లో మాత్రం ఘన విజయంతో శ్రేణులు కాస్త ఊరట చెందాయి. ఈ తరుణంలో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని చూస్తోంది. హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ఇవాళ(శుక్రవారం) కీలక సమావేశం నిర్వహించనుంది. అంతకు ముందు.. ఫలితాల ఊగిసలాట సమయంలో ఆపరేషన్ లోటస్కి భయపడి కొత్తగా ఎంపికైన ఎమ్మెల్యేలను ఛండీగఢ్కు ఆహ్వానించాలని భావించింది. అయితే.. స్పష్టమైన మెజారిటీ రావడంతో ఆ ఆలోచనను విరమించుకుంది. కొత్త లెజిస్లేచర్ పార్టీ నేతను ఎనుకున్నేందుకు శుక్రవారం సిమ్లాలోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా భేటీ కాన్నుట్లు కాంగ్రెస్ హిమాచల్ ప్రదేశ్ వ్యవహారాల ఇన్ఛార్జి రాజీవ్ శుక్లా మీడియాకు వెల్లడించారు. మరోవైపు ఈ వ్యవహారాన్ని చూసుకునేందుకు ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బాఘేల్, సీనియర్ నేత భూపిందర్ హుడాలను పర్యవేక్షకులుగా అక్కడికి పంపనుంది. ఇదిలా ఉంటే.. ఒక్కో దఫా ఒక్కో పార్టీకి అధికారం కట్టబెట్టే హిమాచల్ ప్రజలు.. ఈసారి కూడా అదే ఆనవాయితీ కొనసాగించారు. కాంగ్రెస్కు పట్టం కట్టారు. మొత్తం 68 స్థానాలున్న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో.. 40 స్థానాలు కైవసం చేసుకుని ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది కాంగ్రెస్. మరోవైపు హిమాచల్ కాంగ్రెస్ చీఫ్ ప్రతిభా సింగ్ సీఎం అభ్యర్థి రేసులో ఉన్నారు. మాజీ సీఎం వీరభద్ర సింగ్ భార్య కావడం ఈమెకు కలిసొచ్చే అంశం. అయితే ఇంతకు ముందు ప్రతిపక్ష నేతగా ఉన్న సుఖ్వీందర్ సుఖు, ముఖేష్ అగ్నిహోత్రిలు కూడా సీఎం రేసులో ఉండడంతో ఇవాళ్టి భేటీపై ఆసక్తి నెలకొంది. బీజేపీకి రెబల్స్ దెబ్బ పడిందని విశ్లేషకులు అభిప్రాయపడినప్పటికీ.. అలాంటిదేం లేదని తేల్చారు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేడీ నడ్డా. మొత్తం 68 స్థానాల్లో 21 చోట్ల రెబల్స్ పోటీ చేయగా.. కేవలం ఇద్దరు మాత్రమే గెలుపొందడం గమనార్హమని ఆయన గుర్తు చేస్తున్నారు. -
ఢిల్లీ టూ సిమ్లా: విమాన టికెట్ ధర కేవలం రూ. 2480
ముంబై: రెండున్నరేళ్ల విరామం తర్వాత రాజధాని నగరం ఢిల్లీ నుంచి విమాన సర్వీసులు తిరిగి ప్రారంభంకానున్నాయి. విమానయాన సంస్థ అలయన్స్ ఎయిర్ అధికారికంగా వెల్లడించింది. ఢిల్లీ-సిమ్లా మధ్య సర్వీసులను తిరిగి ప్రారంభించనున్నట్టు మంగళవారం ప్రకటించింది. సెప్టెంబర్ 6 నుంచి ప్రతిరోజు ఈ సర్వీసు ఉంటుందని వెల్లడించింది. కేవలం రూ. 2,480 పరిచయ ధరను ఆఫర్ చేస్తోంది. ఈ విమానం ఉదయం 6.25 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరి 7.35 గంటలకు సిమ్లా జుబ్బర్హట్టి విమానాశ్రయానికి చేరుకుని తిరిగి 8 గంటలకు ఢిల్లీకి చేరుకుని 9.10 గంటలకు ఢిల్లీ చేరుకుంటుందని సంస్థ తెలిపింది. న్యూఇండియాను అనుసంధానించే క్రమంలో టైర్-2/టైర్-3 పట్టణాల మధ్య ఆయా సిటీ హబ్లతో మెరుగైన ఎయిర్ కనెక్టివిటీని అందించే ప్రయత్నంలో ఢిల్లీ-సిమ్లా విమానాలను ప్రారంభించామని అలయన్స్ ఎయిర్ తెలిపింది. ఇది ఉత్తర భారతదేశంలో కనెక్టివిటీని విస్తరింప జేస్తుందని అలయన్స్ ఎయిర్ డిప్యూటీ ఇంజనీర్ యష్ వర్ధన్ సింగ్ అన్నారు. సెప్టెంబర్ 6నుంచి ప్రతీ రోజూ విమానాలు నడుస్తాయన్నారు. కాగా ఈ మార్గంలో అలయన్స్ ఎయిర్ తొలిసారిగా 2017 జూలైలో విమానాన్ని నడిపింది. ఆ తర్వాత పలు కారణాలతో ఈ సర్వీసును నిలిపివేసింది. -
నాడు స్కాములు, నేడు స్కీములు
షిమ్లా: 2014కు ముందు దేశంలో అవినీతి ప్రభుత్వంలో విడదీయలేని భాగంగా ఉండేదంటూ నాటి కాంగ్రెస్ పాలనపై ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు చేశారు. ‘‘బీజేపీ ఎనిమిదేళ్ల పాలనలో అవినీతిపై ఉక్కుపాదం మోపింది. దాంతో ఈ విషయంలో చెప్పలేనంత మార్పు వచ్చింది. ప్రజలూ దీన్ని గమనిస్తున్నారు’’ అని చెప్పారు. కేంద్రంలో బీజేపీ పాలనకు ఎనిమిదేళ్లు నిండిన సందర్భంగా షిమ్లాలో మంగళవారం గరీబ్ సమ్మాన్ నమ్మేళన్ పేరిట జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. అప్పట్లో నిత్యం స్కాముల (కుంభకోణాల) గురించి వార్తలు కాగా ఇప్పుడెక్కడ చూసినా స్కీముల (పథకాల) గురించి వార్తలే ఉంటున్నాయన్నారు. దేశ సరిహద్దులు కూడా 2014తో పోలిస్తే ఇప్పుడు చాలా సురక్షితంగా ఉన్నాయన్నారు. పలు పథకాల లబ్ధిదారుల జాబితాలోంచి ఏకంగా 9 కోట్ల నకిలీ పేర్లను తాము ఏరివేసినట్టు చెప్పారు. ఏకంగా రూ.22 లక్షల కోట్లను పలు పథకాల లబ్ధిదారుల ఖాతాలకు నేరుగా జమ చేశామని వివరించారు. కరోనా కల్లోలాన్ని తమ ప్రభుత్వం ఎంత సమర్థంగా ఎదుర్కొన్నదీ ప్రపంచమంతా చూసిందన్నారు. ప్రజలకు 200 కోట్లకు పై చిలుకు వ్యాక్సీన్లు ఉచితంగా వేశామని గుర్తు చేశారు. అంతేగాక వాటిని ఎన్నో దేశాలకు వాటిని ఎగుమతి చేశామన్నారు. దేశంలో జిల్లాకో మెడికల్ కాలేజీ లక్ష్యంగా పెట్టుకున్నట్టు గుర్తు చేశారు. ప్రధాన సేవకున్ని మాత్రమే.. ‘‘నన్ను నేను ప్రధానిగా భావించను. ప్రజలకు ప్రధాన సేవకున్ని మాత్రమే అని అనుకుంటాను’’ అని మోదీ పేర్కొన్నారు. ‘‘130 కోట్ల పై చిలుకు భారతీయులతో కూడిన అతి పెద్ద కుటుంబంలో నేను సభ్యున్ని. నా జీవితం వాళ్లకే అంకితం’’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. కేంద్ర పథకాల లబ్ధిదారులతో మాట్లాడారు. కర్నాటకలోని కలబుర్గికి చెందిన సంతోషి తన అభిప్రాయాలను సూటిగా వ్యక్తం చేసిన తీరు ఎంతగానో ఆకట్టుకుందన్నారు. ఆమె బీజేపీ కార్యకర్త అయి ఉంటే ఎన్నికల్లో పోటీ చేయాలని కోరేవాడినని చెప్పారు. ప్రధాని ముద్రా యోజన కింద రూ.7.2 లక్షల రుణం తీసుకుని 12 మందికి ఉపాధి కల్పిస్తున్నట్టు చెప్పిన గుజరాత్కు చెందిన అర్వింద్ పేటల్ను అభినందించారు. అందరిలా ఉద్యోగం చేయాలనుకోకుండా ఎందరికో ఉపాధి కల్పిస్తుండటం గొప్ప విషయమన్నారు. 10 కోట్ల మంది రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి 11వ విడత కింద రూ.21 వేల కోట్లను ఈ సందర్భంగా ప్రధాని విడుదల చేశారు. నోట్ల రద్దు ఎప్పటికీ బాధిస్తుంది: రాహుల్ న్యూఢిల్లీ: ప్రధాని మోదీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం దేశాన్ని ఎప్పటికీ బాధిస్తూనే ఉంటుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. మోదీ పాలనకు ఎనిమిదేళ్లు పూర్తయిన సందర్భంగా రాహుల్ తీవ్ర విమర్శలు చేశారు. ‘2016లో పెద్ద నోట్లను రద్దు చేసి ప్రజల్ని రోడ్లపై నిలబెట్టారు. 2016లో 18 లక్షల కోట్ల నగదు చెలామణిలో ఉంటే, ఇప్పుడది 31 లక్షల కోట్లకు పెరిగింది. మీ డిజిటల్, కేష్లెస్ ఇండియా ఏమైనట్టు?’ అన్నారు. బీజేపీ ఓడితేనే విద్వేష వ్యాప్తికి చెక్: మమత పురూలియా: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడం ఖాయమని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ధీమా వెలిబుచ్చారు. బీజేపీ ఓటమితో దేశంలో విద్వేష వ్యాప్తికి అడ్డుకట్ట పడుతుందన్నారు. 2024 లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీకి ఢిల్లీలో అధికార పీఠాన్ని చేరే అవకాశమే ఉండదన్నారు. కేంద్రంలో బీజేపీ పాలనకు ఎనిమిదేళ్లయిన నేపథ్యంలో మమత మంగళవారం పురూలియాలో ఒక సభలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. -
PM KISAN: రైతుల ఖాతాలోకి నగదు జమ చేసిన ప్రధాని మోదీ
షిమ్లా: కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోన్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (పీఎం కిసాన్) పథకంలో భాగంగా.. 11వ విడత నిధుల్ని నేడు విడుదల చేశారు. మంగళవారం గరిబ్ కళ్యాణ్ సమ్మేళనం కోసం ప్రధాని మోదీ షిమ్లాకు వెళ్లారు. ఈ వేదికగానే ఆయన రైతుల ఖాతాలో నగదు జమ చేశారు. షిమ్లాలోని రిడ్గే మైదానంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. తొమ్మిది మంత్రిత్వ శాఖల ద్వారా అమలు అవుతున్న 16 పథకాల పని తీరు గురించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని స్వయంగా కొందరు లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ఇక పీఎం కిసాన్ స్కీమ్లో భాగంగా.. రైతులకు పెట్టుబడి సాయం కింద ఏటా రూ.6000(2 వేలు చొప్పున మూడు దఫాలుగా) అందిస్తోంది. ఏడాదికి మూడు విడతచొప్పున ఇప్పటి వరకు 10 ఇన్స్టాల్మెంట్లలో డబ్బులు రైతుల ఖాతాల్లోకి చేరగా, ఇవాళ 11వ విడత డబ్బులు జమ చేసింది. దాదాపు పది కోట్ల కంటే ఎక్కువ మంది రైతుల ఖాతాలో పీఎం సమ్మాన్ నిధి నుంచి రూ.21 వేల కోట్ల రూపాయలను విడుదల చేశారాయన. అయితే ప్రభుత్వం నుండి పిఎం కిసాన్ పథకం ద్వారా.. దేశంలోని రైతులందరికీ గ్రాంట్లు అందవు. PM కిసాన్ పథకానికి అర్హత ప్రమాణాలు ఉన్నాయి. ముందుగానే రిజిస్టర్ అయ్యి ఉండాలి. అలాగే చిన్న మరియు సన్నకారు రైతులు ప్రయోజనాలను పొందుతారు. కొన్ని షరతులు వర్తిస్తాయి కూడా. ఎలా తెలుసుకోవాలంటే.. https://pmkisan.gov.in/BeneficiaryStatus.aspx లింక్ను క్లిక్ చేయాలి. కుడి వైపు ఆప్షన్స్లో బెనిఫీషియరీ(లబ్దిదారుడు) స్టేటస్ ఉంటుంది. అక్కడ ఆధార్, అకౌంట్ నెంబర్ను ఎంటర్ చేసి గెట్ డేటాపై క్లిక్ చేయాలి పీఎం కిసాన్కు రిజిస్టర్ చేసుకుని.. ఈ-కేవైసీ పూర్తి అయ్యి ఉంటే ఖాతాలోకి డబ్బు జమ అవుతుంది. -
వేసవి ప్రయాణానికి రెడీ
న్యూఢిల్లీ: పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో పర్యాటకులు చల్లటి ప్రదేశాలకు ప్రయాణం కడుతున్నారు. వరుసగా రెండు వేసవి సీజన్లలో కరోనా కారణంగా ప్రయాణం చేయలేని పరిస్థితులు.. ఈ విడత లేకపోవడం కూడా పర్యాటక రంగంలో సందడిని పెంచింది. గరిష్ట ఉష్ణోగ్రతల నుంచి సేదతీరేందుకు పట్టణ వాసులు మొగ్గు చూపిస్తున్నారు. పర్వత, కొండ ప్రాంతాల్లోని పర్యాటక కేంద్రాలకు ఈ విడత డిమాండ్ అనూహ్యంగా ఉన్నట్టు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. హోటళ్లు, ఫ్లయిట్ బుకింగ్లు జోరుగా జరుగుతున్నట్టు పేర్కొన్నాయి. ప్రతి ఇద్దరు భారతీయుల్లో ఒకరు ఈ వేసవిలో ప్రయాణం చేయాలని అనుకుంటున్నారు. ఇందులోనూ ఎక్కువ మంది విహార యాత్రలకే మొగ్గు చూపిస్తున్నట్టు ఓయో సర్వేలో తెలిసింది. 64 శాతం మంది వేసవిలో సెలవులు పెట్టేసి నచ్చిన ప్రదేశానికి వెళ్లొద్దామని అనుకుంటుంటే.. 94 శాతం మంది దేశీయంగా ఉన్న పర్యాటక ప్రాంతాలకు వెళ్లేందుకు సుముఖంగా ఉన్నారు. ఉత్తరాదిలో వీటికి డిమాండ్.. ఆన్లైన్లో వివిధ పోర్టళ్లపై బుకింగ్ తీరును పరిశీలిస్తే.. ఉత్తరాదిలో రిషికేష్, హరిద్వార్, సిమ్లా, ముస్సోరీ, డెహ్రాడూన్ ప్రాంతాలకు ఎక్కువ డిమాండ్ నెలకొంది. ఈ ప్రాంతాల్లోని హోటల్స్, రిసార్ట్ల్లో దాదాపు గదులన్నీ బుకింగ్ అయిపోయాయి. రూమ్ టారిఫ్లు కరోనాకు ముందుతో పోలిస్తే 10–15 శాతం అధికంగా ఉన్నట్టు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా రిషికేష్, హరిద్వార్లోని అన్ని ఇంటర్నేషనల్ బ్రాండెడ్ హోటళ్లలో మే నుంచి జూన్ చివరికి నాటికి బుకింగ్లు పూర్తిగా అయిపోయాయి. ఈ ఏడాది పర్యాటక ప్రాంతాల్లో హోటళ్లకు డిమాండ్ కరోనా ముందు నాటి స్థాయికి చేరుకున్నట్టు, సగటు రూమ్ చార్జీలు 10 శాతం పెరిగినట్టు ఎస్సైర్ హాస్పిటాలిటీ గ్రూపు సీఈవో అఖిల్ అరోరా తెలిపారు. ఎస్సైర్ గ్రూపునకు బిమ్టల్, జిమ్కార్బెట్ ప్రాంతాల్లో హోటళ్లు ఉన్నాయి. కరోనా కేసులు స్వల్పంగా పెరుగుతున్నా ప్రయాణాలకు డిమాండ్ తగ్గలేదని అరోరా చెప్పారు. పుంజుకున్న బుకింగ్లు.. వేసవి కోసం కశ్మీర్, రాజస్తాన్, హిమాచల్ప్రదేశ్, గోవా, అరుణాచల్, మణిపూర్, త్రిపుర ప్రాంతాలు ఆకర్షణీయంగా (అధిక డిమాండ్) మారిపోయాయి. దేశం బయట దుబాయి, మాల్దీవులు, థాయిలాండ్, యూఎస్కు డిమాండ్ నెలకొంది. ‘‘మే, జూన్ నెలలకు సంబంధించి ముందస్తు బుకింగ్లు పెద్ద ఎత్తున పెరిగాయి. ప్రజలు ఎక్కువ రోజుల పాటు విడిది కోసం వెళ్లాలని చూస్తున్నారు’’అని ఈజ్మైట్రిప్ ప్రెసిడెంట్ హిమంక్ త్రిపాఠి తెలిపారు. ఫ్లయిట్ బుకింగ్లు కరోనా ముందు నాటికి చేరినట్టు మేక్మైట్రిప్ సీఈవో రాజేష్ మాగోవ్ వెల్లడించారు. సులభ వాయిదాల్లో రుణాలు లభించడం డిమాండ్కు తోడ్పడుతున్నట్టు ఆయన చెప్పారు. రికవరీ బలంగా.. 2022 ఏప్రిల్ నెలలో సగటు రోజువారీ ఫ్లయిట్ డిపార్చర్లు 2,726గా ఉన్నాయి. 2021 ఏప్రిల్లో రోజువారీ 2,000తో పోలిస్తే మంచి వృద్ధి కనిపిస్తోంది. మార్చి నెలలో రోజువారీ డిపార్చర్లు 2,588తో పోల్చి చూసినా ఏప్రిల్లో 5 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. విమానాల్లో ప్రయాణికుల భర్తీ కూడా గతేడాది ఇదే నెలతో పోలిస్తే 2022 ఏప్రిల్లో 36 శాతం అధికంగా ఉంది. గత నెలలో ఒక ఫ్లయిట్లో సగటు ప్రయాణికుల సంఖ్య 128గా ఉంది. కరోనాకు ముందు సగటు ప్రయాణికులు 135 కంటే కొంచెం తక్కువగా ఉంది. దేశీయంగా ప్రయాణికుల రద్దీ ఏప్రిల్లో వార్షికంగా చూస్తే 83 శాతం పెరిగి 10.5 మిలియన్లుగా ఉంది. కరోనాకు ముందున్న 11 మిలియన్ల కంటే ఇది స్వల్పంగానే తక్కువ. పెంటప్ డిమాండ్ ఈ ఏడాది పర్యాటక ప్రాంతాలు, విహార యాత్రా స్థలాలకు డిమాండ్ గణనీయంగా ఉండడానికి.. గత రెండు వేసవి సీజన్లలో ప్రయాణం చేయలేని వారు ఈ ఏడాది ప్రాధాన్యం ఇస్తుండడం వల్లేనని అనుకోవాలి. గుడ్ ఫ్రైడే, విసు వీక్ సందర్భంగా 8 లక్షల బుకింగ్లు నమోదయ్యాయని.. 2022లో ఇదే అత్యధికమని ఓయో చీఫ్ సర్వీస్ ఆఫీసర్ షీరంగ్ గాడ్బోల్ తెలిపారు. రానున్న కొన్ని నెలల్లో ఈ డిమాండ్ మరింత పెరుగుతుందని తాము అంచనా వేస్తున్నట్టు చెప్పారు. -
స్ఫూర్తి..:వెటకారం చేసిన నోళ్లే... వేనోళ్ల పొగిడాయి!
‘క్వీన్ ఆఫ్ హిల్స్టేషన్స్’ అని పిలుచుకునే సిమ్లా(హిమాచల్ప్రదేశ్)లో డ్రైవింగ్ అనేది అంత సులభమేమీ కాదు. అలాంటి చోట ‘సూపర్ డ్రైవర్’గా ప్రశంసలు అందుకుంటోంది మీనాక్షి నేగి. కిన్నార్ ప్రాంతంలోని మారుమూల గిరిజన గ్రామానికి చెందిన మీనాక్షికి ‘డ్రైవింగ్’ను వృత్తిగా చేసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. తండ్రిలా ప్రభుత్వ ఉద్యోగం చేయాలనుకుంది కానీ కుదరలేదు. తమ ఇద్దరు పిల్లలను బైక్ మీద స్కూలుకు తీసుకెళుతుండేది మీనాక్షి. అప్పుడప్పుడూ ఇరుగింటి, పొరుగింటి వారు కూడా తమ పిల్లల్ని బైక్పై బడికి తీసుకెళ్లడానికి మీనాక్షి సహాయం తీసుకునేవారు. ఆమె డ్రైవింగ్ నైపుణ్యాన్ని మెచ్చుకునేవారు. ఇంట్లో ఖాళీగా కూర్చోవడం కంటే, డ్రైవింగ్నే వృత్తిగా ఎందుకు ఎంచుకోకూడదు? అనుకుంది మీనాక్షి. తన ఆలోచనకు ఎవరూ‘యస్’ చెప్పలేదు. ఇక వెటకారాలు సరేసరి. అయినప్పటికీ వెనక్కి తగ్గకుండా ట్యాక్సీ (కార్) కొనుగోలు చేసింది. వెటకారాలు మరింత ఎక్కువయ్యాయి. భర్త, అత్తామామలను ఒప్పించడం చాలా కష్టం అయింది. ‘ఏనుగును మేపడం ఎంతో ఇది అంతే’ అన్నారు. సరిగ్గా అదే సమయంలో కోవిడ్ లాక్డౌన్ వచ్చింది. బండి తెల్లముఖం వేసింది. వాయిదాలు కట్టడం మీనాక్షికి కష్టమైపోయింది. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆమెలో ధైర్యం సడలలేదు. ‘అన్నిరోజులు ఒకేలా ఉండవు కదా!’ అనుకుంది. అదే నిజమైంది. లాక్డౌన్ ఎత్తేశారు. మెల్లగా బండి వేగం పుంజుకుంది. ‘డ్రైవింగ్ వృత్తిలో మగవాళ్లు మాత్రమే ఉంటారు... అని చాలామంది నమ్మే సమాజంలో ఉన్నాం. మహిళలు నడిపే వాహనాల్లో ప్రయాణించడానికి తటపటాయిస్తుంటారు. అలాంటి వారికి నా డ్రైవింగ్తోనే సమాధానం చెప్పాను. వారి ఆలోచన ధోరణిలో మార్పు వచ్చింది, భర్త,అత్తమామలు కూడా మెచ్చుకోవడం మరో ఆనందం’ అని చెబుతుంది నలభై రెండు సంవత్సరాల మీనాక్షి. హిమాచల్ ప్రదేశ్కు మాత్రమే పరిమితం కాకుండా వేరే రాష్ట్రాలకు కూడా ట్యాక్సీ నడుపుతుంది మీనాక్షి. అయితే, ప్రయాణికుల ఎంపికలో తగిన జాగ్రత్తలు పాటిస్తోంది. ఫ్యామిలీలకు ప్రాధాన్యత ఇస్తుంది. మీనాక్షి ఇప్పుడు పేదమహిళలకు ఉచితంగా డ్రైవింగ్ నేర్పిస్తుంది. ‘ఉపాధి అనేది తరువాత విషయం. డ్రైవింగ్ నేర్చుకోవడం ద్వారా తమ మీద తమకు నమ్మకం పెరుగుతుంది. భవిష్యత్ విజయాలకు ఇది పునాది’ అంటుంది మీనాక్షి. మీనాక్షి నేగి భవిష్యత్ ప్రణాళిక ఏమిటి? సిమ్లాలో ఫస్ట్ ఉమెన్ ట్యాక్సీడ్రైవర్స్ యూనియన్ ఏర్పాటు చేయాలనేది ఆమె కల. యూనియన్ సరే, అంతమంది మహిళా ట్యాక్సీ డ్రైవర్లు ఎక్కడి నుంచి వస్తారు? అనే సందేహం ఉంటే, మీనాక్షి నేగి నుంచి స్ఫూర్తి పొందిన మహిళలను పలకరించండి చాలు. నేగి కల సాకారం కావడానికి ఎంతోకాలం పట్టదని తెలుసుకోవడానికి! -
ఉమ్మడి కృషితో దేశం ఉన్నత శిఖరాలకు
న్యూఢిల్లీ/సిమ్లా: పార్లమెంట్ సభ్యుల నుంచి సామాన్య ప్రజల వరకు ఎవరి విధులను వారు సక్రమంగా నిర్వర్తించాల్సిన అవసరం ఉందని, దేశ అభివృద్ధి పరుగులు పెట్టడానికి ఇదే తారక మంత్రమని ప్రధాని మోదీ ఉద్బోధించారు. పార్లమెంట్తోపాటు రాష్ట్రాల శాసనసభ స్పీకర్లు, శాసన మండలి చైర్మన్ల (అఖిల భారత ప్రిసైడింగ్ ఆఫీసర్లు) సదస్సు బుధవారం హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాలో ప్రారంభమయ్యింది. రెండు రోజులపాటు జరగనుంది. తొలి రోజు సదస్సును ఉద్దేశించి ప్రధాని మోదీ ఆన్లైన్ ద్వారా ప్రారంభించారు. రాష్ట్రాల భాగస్వామ్యంతోపాటు ప్రజలందరి ఉమ్మడి కృషితోనే దేశాన్ని అభివృద్ధి పథంలో ఉన్నత శిఖరాలకు చేర్చవచ్చని అన్నారు. కోవిడ్–19 మహమ్మారిపై మనం సాగించిన పోరాటం సబ్ కా ప్రయాస్కు (అందరి కృషి) ఒక చరిత్రాత్మక ఉదాహరణ అని గుర్తుచేశారు. పలు భిన్నమైన అంశాలపై రగడ కారణంగా పార్లమెంట్ సమావేశాలకు తరచుగా అంతరాయం కలుగుతుండడం పట్ల మోదీ విచారం వ్యక్తం చేశారు. చట్టసభ సభ్యుల ప్రవర్తన భారతీయ విలువల దారిలోనే ఉండాలని సూచించారు. చట్టసభల్లో ఆమోదించే చట్టాలు, తీసుకొనే విధాన నిర్ణయాలు ‘ఏక్ భారత్, శ్రేష్ట భారత్’ అనే సెంటిమెంట్ను బలోపేతం చేసేవిగా ఉండాలన్నారు. చట్టసభల్లో పాటించే సంప్రదాయాలు, పద్ధతులు భారతీయ ఆత్మను ప్రతిబింబించాలని ఉద్ఘాటించారు. పార్లమెంట్, అసెంబ్లీ, మండలిలో చర్చలు అర్థవంతంగా, హూందాగా, గౌరవప్రదంగా జరగాలని ఆకాంక్షించారు. సభ్యుల మధ్య రాజకీయ ఆరోపణలు, విమర్శలకు తావులేకుండా నాణ్యమైన, ఆరోగ్యకరమైన సంవాదాలు, చర్చల కోసం చట్టసభల్లో ప్రత్యేక సమయం కేటాయిస్తే బాగుంటుందని సూచించారు. ఒకే దేశం.. ఒకే చట్టసభ వేదిక ప్రజాస్వామ్యం అనేది భారత్కు కేవలం ఒక వ్యవస్థ కాదని, అది దేశ సహజ స్వభావమని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. రాబోయే 25 సంవత్సరాలు మనకు అత్యంత కీలకమని చెప్పారు. వందేళ్ల స్వాతంత్య్ర దినోత్సవాల దిశగా భారత్ ముందుకు పయనిస్తోందని తెలిపారు. ఇలాంటి తరుణంలో చట్టసభల సభ్యులు వారి విధులకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. వారి ప్రవర్తన, చేసే పనులు దేశ ప్రజలపై కచ్చితంగా ప్రభావం చూపుతాయని వ్యాఖ్యానించారు. డ్యూటీ, డ్యూటీ, డ్యూటీ అనే ఒక మంత్రాన్ని పఠిస్తూ ఆచరణలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. దేశ ఐక్యత, సమగ్రతపై అసమ్మతి స్వరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని చట్టసభల సభ్యులకు సూచించారు. మన దేశ భిన్నత్వాన్ని కాపాడుకోవాలన్నారు. ‘ఒకే దేశం.. ఒకే చట్టసభ వేదిక’ అనే ఆలోచనను మోదీ తెరపైకి తీసుకొచ్చారు. ఈ పోర్టల్తో మన పార్లమెంటరీ వ్యవస్థకు సాంకేతిక తోడ్పాటు లభించడమే గాక దేశంలోని అన్ని ప్రజాస్వామ్య వ్యవస్థలను అనుసంధానించవచ్చని వివరించారు. చట్టసభల గౌరవాన్ని పెంచే చర్యలు: బిర్లా దేశంలో చట్టసభలు పని చేసే సమయం నానాటికీ తగ్గిపోతుండడం పట్ల లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆందోళన వ్యక్తం చేశారు. చట్టాల రూపకల్పన, ఆమోదంపై సరైన చర్చ జరగకపోవడం మంచి పరిణామం కాదన్నారు. స్పీకర్ల సదస్సులో మాట్లాడారు. చట్టసభల గౌరవాన్ని, ప్రతిష్టను పెంచేందుకు అన్ని రాజకీయ పార్టీలతో చర్చించి, నిర్ణయాత్మక చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. -
షాపింగ్మాల్ వద్ద మాటువేసి.. లక్కీ డ్రా అంటూ..
సిమ్లా: సార్ మీరు కారు గెలుచుకున్నారు, లక్ష రూపాయల గిఫ్ట్ వోచర్ గెలుచుకున్నారు అంటూ.... రకరకాల ఫ్రాడ్ కాల్స్ గురించి మనం నిత్యం వింటూనే ఉన్నాం. ఇదే తరహా కొంతమంది కేటుగాళ్లు హాలీడే ప్యాకేజీలు.. కళ్లు చెదిరిపోయి గిఫ్ట్లు గెలుచుకోవచ్చు అంటూ మాయమాటలు చెప్పి సిమ్లాలోని ఒక జంటను దారుణంగా మోసం చేశారు. వివరాల్లోకెళ్లితే... ఓ జంట ఆగస్టు 27న సిమ్లాలో షాపింగ్ చేసి వస్తుంటే అక్కడే మాటువేసిన కొంతమంది తమ ట్రావెలింగ్ సంస్థలో అద్భుతమైన ఆఫర్లు ఉన్నాయని.. లక్కీ డ్రా కూడా ఉందని నమ్మించారు. మీరు లక్కీ డ్రాలో ఆకర్షణీయమైన టూర్ ప్యాకేజీలు, గిఫ్ట్లు గెలుచుకొవచ్చు అని చెప్పి కొన్ని కూపన్లను కొనుగొలు చేయమన్నారు. ఈ క్రమంలో ఆ జంట కూపన్ తీసుకుని స్క్రాచ్ చేసి చూస్తే 10 సంవత్సరాల టూర్ ప్యాకేజ్ గెలుపొందినట్లు నమ్మించారు. (చదవండి: తాలిబన్ల ప్రభుత్వ ప్రారంభోత్సవంలో మేము పాల్గొనం।): ప్యాకేజీ ప్రకారం ప్రతి ఏడాది భారతదేశంలోని ఏదో ఒక రాష్ట్రంలో పర్యటించే భారీ ప్యాకేజ్ గెలుచుకున్నారంటూ చెప్పడంతో తాము ఆనందంగా సభ్యత్వ రుసుము కింద వారికి రూ.1.40 లక్షలు చెల్లించినట్లు ఆ బాధిత జంట పేర్కొంది. ఆ తర్వాత ఆ సంస్థ గురించి విచారిస్తే తాము మోసపోయినట్లు గుర్తించామని చెప్పారు. దీంతో వారు సిమ్లాలోని స్థానిక సదర్ పోలీస్టేసన్లో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. ఈ మేరకు పోలీసులు ఆ గ్యాంగ్లో ఒక మహిళతో సహా ఐదుగురు సభ్యులు ఉన్నారని, వారిని చీటింగ్ కేసు కింద అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.(చదవండి: పరువు హత్య: చెల్లిని తుపాకీతో కాల్చి చంపేశాడు!) -
సిమ్లాలో సీఎం జగన్కు ఘన స్వాగతం
సిమ్లా పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి హిమాచల్ప్రదేశ్ డీజీపీ సంజయ్ కుందూ, సిమ్లా ఎస్పీ మోనిక ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్కు సంప్రదాయ కులూ టోపీ, శాలువా, దశావతార జ్ఞాపికను డీజీపీ సంజయ్కుందూ అందజేశారు. -
సిమ్లా పర్యటనకు వెళ్లిన సీఎం వైఎస్ జగన్
విమానాశ్రయం (గన్నవరం): సీఎం వైఎస్ జగన్ గురువారం సిమ్లా పర్యటనకు వెళ్లారు. తొలుత తాడేపల్లి నుంచి రోడ్డుమార్గం ద్వారా ఆయన ఉదయం 10 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి కుటుంబసభ్యులతో కలిసి చండీగఢ్ ఎయిర్పోర్ట్కు బయలుదేరి వెళ్లారు.విమానాశ్రయంలో సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం, విజయవాడ సీపీ బత్తిన శ్రీనివాసులు, డీసీపీ హర్షవర్థన్రాజు, పలువు రు అధికారులు సీఎంకు వీడ్కోలు పలికారు. చదవండి: Jagananna Vidya Kanuka:..రూ.789 కోట్లతో 48 లక్షలమంది పిల్లలకు ‘కానుక’ -
కశ్మీర్, హిమాచల్లో ఆకస్మిక వరదలు.. 17 మంది మృతి
జమ్మూ/షిమ్లా: జమ్మూకశ్మీర్, లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్లు బుధవారం ఆకస్మిక వరదలతో వణికిపోయాయి. కుండపోత వానలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. బీభత్స వానలకు 17 మంది ప్రాణాలు కోల్పోతే పదుల సంఖ్యలో గల్లంతయ్యారు. ఇళ్లు, పంట పొలాలు నీట మునిగాయి. కశ్మీర్లోని మారుమూల గ్రామమైన కిస్త్వార్లో భారీ వర్షాలకు ఏడుగురు మరణించారు. మరో 17 మంది గాయపడ్డారు. 30 మందికిపైగా గల్లంతయ్యారు. ఇళ్లు, గోశాలలు నీట మునిగాయి. లద్దాఖ్లో భారీ వర్షాలకు కార్గిల్ సమీపంలో ఉన్న మినీ విద్యుత్ ప్లాంట్ ధ్వంసమైంది. హిమాచల్ ప్రదేశ్ భారీ వర్షాలకు అతలాకుతలమైంది. ఉదయ్పూర్లోని టోజింగ్ నల్లాలో వరదలకు ఏడుగురు మరణించారు. చంబాలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్టుగా రాష్ట్ర విపత్తు నిర్వహణ డైరెక్టర్ సుదేష్ చెప్పారు. కశ్మీర్లోని కిస్త్వార్లో పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టుగా ప్రధాని మోదీ వెల్లడించారు. అన్ని రకాలుగా కశ్మీర్కు సాయం అందిస్తామని అన్నారు. అందరూ క్షేమంగా ఉండాలని ప్రధాని ఆకాంక్షించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జమ్మూకశ్మీర్ లెఫ్ట్నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, డీజీపీ దిల్బాగ్ సింగ్తో మాట్లాడారు. కిస్త్వార్లో ఇప్పటివరకు ఏడు మృతదేహాలను వెలికి తీయగా, 17 మంది క్షతగాత్రుల్ని వరద ముప్పు నుంచి కాపాడినట్టుగా పోలీసు అధికారులు తెలిపారు. -
ఊహించని ఉపద్రవం.. ధర్మశాలలో ఆర్తనాదాలు
Dharamshala Cloud Burst కమ్ముకున్న నల్ల మేఘాలు, ఆ వెంటనే భారీ వర్షాలు.. హఠాత్తుగా ముంచుకొచ్చిన వరదలతో భయానక పరిస్థితులు కనిపిస్తున్నాయి హిమాచల్ ప్రదేశ్ ధర్మశాలలో. ముఖ్యంగా భాగ్సు నాగ్ ఏరియాలో వరదల్లో చిక్కుకుపోయిన వందల మంది సాయం కోసం కేకలు వేస్తున్నారు. సిమ్లా: కుంభవృష్టితో ధర్మశాల నీట మునిగింది. సోమవారం ఉదయం వరకు మూడు వేల మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు సమాచారం. కొండలపై నుంచి నీళ్లు.. భాగ్సునాగ్ నాలా ఉప్పొంగడంతో ధర్మశాలలోకి నీరు చొచ్చుకువచ్చింది. బురద నీటి ప్రవాహం, కార్లు కొట్టుకుపోవడం, కట్టలు తెగిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Himachal Pradesh rains wreak havoc in #Dharamshala. pic.twitter.com/J60nmYNKJp — Ayushi Agarwal (@ayu_agarwal94) July 12, 2021 #HimachalPradesh Surge in water level of #Bhagsunag nullah in #Dharamshala following heavy rainfall. pic.twitter.com/S7f5dscHt8 — αѕℓαм кнαη ᴀɴᴛɪ ᴡᴀʀ ᴀᴄᴛɪᴠɪꜱᴛ. (@aslamkhanbombay) July 12, 2021 As rains lash down in #Dharamshala shanties of safai karamcharis get washed out by the river in spate. This community has been demanding proper & safe housing for the last 5 years. HP govt & admin is accountable. They should be given immediate relief by providing shelter & food. pic.twitter.com/MfcKRJRZU6 — Endangered Himalaya (@EndangeredHimal) July 12, 2021 ఆ వీడియోలు అక్కడి ప్రజల నిస్సహయ పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. తమను కాపాడాలంటూ చాలామంది సోషల్ మీడియాలోనే వీడియోలు పెడుతున్నారు. ఇక మాన్హి నది ఉప్పొంగడంతోనూ వరదలు మరింత పొటేత్తాయి. Orange Alert in #Dharamshala in #HimachalPradesh after a huge cloud burst pic.twitter.com/D52FHzN0Wk — Holidays Hunt (@HolidaysHunt) July 12, 2021 This is Gaggal Bridge.#Dharamshala#HimachalPradesh pic.twitter.com/F2jL1suMGd — Aryan Rajput🇮🇳 (@AryanRajput21) July 12, 2021 Hoping everyone is safe.🙏 #dharamshala pic.twitter.com/80qP8IXZ1y — Srejan Shankar (@SrejanShankar) July 12, 2021 లాక్డౌన్ తర్వాత ఆంక్షలు సడలించడం, పైగా వారాంతం కావడంతో చాలామంది టూరిస్టులు అక్కడికి క్యూ కట్టారు. ఈ నేపథ్యంలో హఠాత్తుగా ఊడిపడ్డ వరదల్లో వాళ్లు చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం భారీ వర్షం కురవడం, వరద ఉధృతి పెరుగుతుండడంతో సహాయక చర్యలకు విఘాతం కలుగుతోందని ధర్మశాల అధికారులు చెప్తున్నారు. Flash flood in Bhagsu Nag, #Dharamshala due to heavy rainfall. #HimachalPradesh (Video credit: SHO Mcleodganj Vipin Chaudhary) ANI pic.twitter.com/O3kbHOToji — Jagran English (@JagranEnglish) July 12, 2021 -
MS Dhoni: 2005 నుంచి ట్రై చేస్తే ఇప్పటికి కుదిరింది!
తన ఆరాధ్య క్రికెటర్ను కలుసుకోవడం.. కాసేపు సరదాగా ముచ్చటించడం, ఫొటోలు దిగడం... సగటు అభిమానికి ఉండే సాధారణ కోరికలు. కానీ.. భద్రత గోడలు దాటుకుని వారిని చేరుకోవడం అంత తేలికైన విషయమేమీ కాదు. ఒక్కోసారి ఆటోగ్రాఫ్ కోసమే ఏళ్ల తరబడి వేచి చూడాల్సి ఉంటుంది. దేవ్ అనే ఓ వ్యక్తికి కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని వీరాభిమాని అతడు. ఒక్కసారైనా ధోనిని నేరుగా కలవాలన్నది అతడి చిరకాల కోరిక. ఇందుకోసం ఏకంగా తను పనిచేసే ఊరి నుంచి మరో చోటుకు బదిలీ చేయించుకున్నాడు దేవ్. పదహారేళ్ల తర్వాత ఎట్టకేలకు తన అభిమాన ఆటగాడిని కలుసుకున్నాడు. కరోనా కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ అర్ధంతరంగా ఆగిపోయిన నేపథ్యంలో ఇంటికి చేరుకున్న ధోని, కుటుంబంతో ఎక్కువగా సమయాన్ని గడుపుతున్న సంగతి తెలిసిందే. భార్య సాక్షి, కూతురు జీవాతో కలిసి అతడు ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్లో పర్యటిస్తున్నాడు. ఈ క్రమంలో రత్నారీలోని మీనాభాగ్ హోటల్లో ధోని కుటుంబం బస చేసింది. అదే హోటల్ మరో బ్రాంచీలో పనిచేస్తున్న దేవ్... ఈ విషయం తెలుసుకుని.. తనను షిమ్లా నుంచి రత్నారీ బదిలీ చేయాల్సిందిగా పై అధికారులను కోరాడు. దేవ్ అభ్యర్థనను వారు మన్నించడంతో రత్నారీ వచ్చి ధోని కలుసుకున్నాడు. ధోనితో ఫొటో దిగడంతో పాటుగా, తన ఫోన్ కవర్పై అతడి ఆటోగ్రాఫ్ కూడా తీసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను మీనాభాగ్ యాజమాన్యం తమ ఇన్స్టా పేజీలో పంచుకుంది. 2005లో రోహ్రు(హిమాచల్ ప్రదేశ్)లో క్రికెట్ టోర్నీ జరుగుతున్న సమయంలో దేవ్.. ధోనిని కలిసేందుకు వెళ్తే.. పోలీసులు దెబ్బలు తినాల్సి వచ్చిందని, ఇప్పుడు ఇదిగో ఇలా అతడిని కలిసే అవకాశం దక్కిందని హర్షం వ్యక్తం చేసింది. View this post on Instagram A post shared by MeenaBaghHomes (@meenabaghhomes) -
HP: ఔషధ మొక్కల పెంపకానికి ఆయుష్ 128.94 లక్షలు
ప్రపంచంలోనే అత్యంత పురాతన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ఆయుర్వేదం. భారతదేశంలో 5000 సంవత్సరాల పూర్వం నుంచే ఆయుర్వేదంతో చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికీ ఎంతో మంది ఆరోగ్య సమస్యలను అధిగమించడానికి ఆయుర్వేంద చిట్కాలను అనుసరిస్తుంటారు. ఇక కొన్నాళ్ల క్రితం కాలుష్యం తక్కువగా ఉండేది. అందువల్ల అంతగా ఆరోగ్య సమస్యలు ఉండేవి కాదు. కానీ ప్రస్తుతం కాలుష్యం కారణంగా ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సి వస్తోంది. అంతేకాకుండా ఔషధ మొక్కల వినియోగం వాటి విలువ గురించి చాలామందికి పూర్తిగా తెలియదు. ఈ మొక్కల ఉపయోగం గురించి అవగాహన కల్పించే ప్రయత్నంలో ఆయుష్ డిపార్ట్మెంట్ జాతీయ ఆయుష్ మిషన్ కింద ఔషధ మొక్కల సాగు కోసం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక సహాయం అందిస్తోంది. సిమ్లా: సహజ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోంది. దీంతో చిన్న మొత్తంలో భూములు కలిగిన రైతుల ఆదాయం పెంచడానికి ఔషధ మొక్కలను పెంచాల్సిందిగా హిమాచల్ ప్రదేశ్ రైతులను పోత్సహిస్తున్నట్లు అక్కడి అధికారులు సోమవారం తెలిపారు. ఇందుకోసం కొంతమంది రైతులను ఓ బృందంగా ఏర్పాటు చేశారు. అయితే ఔషధ మొక్కలను పెంచడానికి ఆర్థిక సాయం కావాలంటే రెండు హెక్టార్ల భూమి ఉండాలి. ఔషధ మొక్కల కోసం 2018 జనవరి నుంచి 318 మంది రైతులకు 99.68 లక్షలు ఆర్థిక సహాయం అందించినట్లు అధికారులు వెల్లడించారు. కాగా 2019-20లో జాతీయ ఆయుష్ మిషన్ కింద రాష్ట్రంలో ఔషధ మొక్కలను పెంచడానికి 128.94 లక్షలు అందించారు. ఇందులో 54.44 లక్షలు ‘అటిస్’, ‘కుట్కి’, ‘కుత్’, ‘షాతావారి’, స్టెవియా, ‘సర్పగంధ’ సాగుకు మంజూరు చేసినట్లు తెలిపారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ నేషనల్ మెడిసినల్ ప్లాంట్స్ బోర్డు జోగిందర్ నగర్లోని ఇండియన్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్లోని రీసెర్చ్ ఇనిస్టిట్యూట్లో లోకల్-కమ్-ఫెసిలిటేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ కేంద్రం ఆరు పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఔషధ మొక్కల పెంపకం, పరిరక్షణను ప్రోత్సహిస్తోంది. అంతేకాకుండా ప్రజలలో అవగాహన కల్పించడానికి, ఆయుష్ విభాగం ప్లాంటేషన్ డ్రైవ్ ‘చారక్ వాటిక’ నిర్వహించింది. ఈ డ్రైవ్ కింద 1,167 ఆయుర్వేద సంస్థలలో 11,526 మొక్కలను నాటడంతో చారక్ వాటికలను స్థాపించారు. చదవండి: ఆ ఇరువురు డైరెక్టర్లను నియమించండి! -
ధోని మెసేజ్పై అభిమానుల ఆగ్రహం.. ట్వీట్ వైరల్
సిమ్లా: టీమిండియా మాజీ ఆటగాడు ఎంఎస్ ధోని ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఫ్యామిలీకి ఎక్కువ సమయం కేటాయిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా సిమ్లా పర్యటనలో ఉన్న ధోని తన కుటుంబంతో హాయిగా గడుపుతున్నాడు. ప్రస్తుతం సిమ్లాలో ధోని ఉన్న ఇళ్లు పూర్తిగా చెక్కతో తయారుచేశారు. ఈ ప్రాంతంలో మంచు ఎక్కువగా కురుస్తుంది కాబట్టి అక్కడ ఎక్కువ శాతం ఇళ్లు చెక్కతోనే నిర్మిస్తారు. అక్కడి వాతావారణాన్ని ఎంజాయ్ చేస్తున్నట్లుగా కనిపించిన ధోని ఫోటోలను షేర్ చేస్తూనే 'చెట్లు నాటండి.. అడవులు కాపాడండి' అంటూ మెసేజ్ ఇచ్చాడు. ఈ మెసేజ్ ధోని అభిమానులను రెండుగా చీల్చింది. ఒక వర్గం ధోనిని పొగిడితే.. మరో వర్గం మాత్రం ధోని చర్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. '' ఒకవైపు చెట్లను నరికి ఇల్లు కడుతున్న ధోనీ.. వేరే వాళ్లకు మాత్రం చెట్లు నాటమని సలహా ఇవ్వడం ఏంటని మండిపడుతున్నారు. ధోని ఆ ఇంటి నిర్మాణం కోసం ఎన్ని చెట్లను నరికావో చెప్పు'' అంటూ ట్రోల్ చేస్తున్నారు. దీనిపై సీఎస్కే స్పందింస్తూ 'ప్లాంటింగ్ ద రైట్ థాట్స్' అంటూ క్యాప్షన్ పెట్టింది. కాగా ఐపీఎల్ 2021 సీజన్లో సీఎస్కే జట్టును ఎంఎస్ ధోని విజయవంతంగా నడిపించిన సంగతి తెలిసిందే. యూఏఈ వేదికగా జరిగిన గత సీజన్ను మరిపిస్తూ చెన్నై ఈ సీజన్లో అద్భుత ప్రదర్శన చేసింది. ఆడిన 7 మ్యాచ్ల్లో 5 విజయాలు.. రెండు ఓటములతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. ఇక కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ సీజన్ సెప్టెంబర్ 19 నుంచి జరగనుంది. కాగా ప్రస్తుతం కుటుంబంతో హాయిగా గడుపుతున్న ధోని ఆగస్టులో సీఎస్కే టీంతో కలవనున్నాడు. చదవండి: పాపం ఇలా అవుటవుతానని ఊహించి ఉండడు గుర్రంతో పోటీపడి పరుగులు తీస్తున్న ధోని.. Planting the right thoughts! 💛 Thala 😍#WhistlePodu #Yellove 🦁 pic.twitter.com/rbZmSwGA2n — Chennai Super Kings - Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) June 25, 2021 -
హిమాచల్ పోలీసులు, సీఎం భద్రత సిబ్బంది మధ్య కొట్లాట
-
వైరల్: చెంప దెబ్బ కొట్టిన ఎస్పీ.. కాలితో తన్నిన సీఎం పీఎస్ఓ
సిమ్లా: భుంటార్ విమానాశ్రయం సమీపంలో కులు జిల్లా పోలీసు సిబ్బంది, హిమాచల్ ప్రదేశ్ సీఎం భద్రతా సిబ్బందికి మధ్య బుధవారం తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ వాగ్వాదం కాస్త చివరకు పెద్దదై చేయి చేసుకునే వరకూ వెళ్లడం కలకలం రేపింది. సీఎం జైరాం ఠాకూర్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీల పర్యటన సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సిమ్లాలోని పోలీసు ప్రధాన కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. వివరాల్లోకి వెళితే.. ఫోర్ లేన్ ప్రభావిట్ కిసాన్ సంఘ్ సభ్యులు విమానాశ్రయం బయట గుమికూడారు. అయితే అక్కడ ప్రజలు గుమిగూడడాన్ని సీఎం భద్రతా సిబ్బంది అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో కులు ఎస్పీ, సీఎం భద్రతా సిబ్బంది మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో అదనపు ఎస్పీ బ్రిజేష్ సూద్ను, కులు ఎస్పీ గౌరవ్ సింగ్ చెంప దెబ్బ కొట్టాడు. ఈ సమయంలో ఎస్పీ గౌరవ్ సింగ్ని సీఎం పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ (పీఎస్ఓ) బల్వంత్ సింగ్ కాలితో తన్నారు. కాగా, ఈ సంఘటనలో పాల్గొన్న ముగ్గురు అధికారులను విచారణ ముగిసే వరకు సెలవుపై పంపినట్లు రాష్ట్ర డీజీపీ సంజయ్ కుండు తెలిపారు. ప్రస్తుతం కులు ఎస్పీ బాధ్యతను డీఐజీ (సెంట్రల్ రేంజ్) మధుసూదన్ చూసుకుంటారని అన్నారు. అలాగే బ్రిజేష్ సూద్ స్థానంలో పండోహ్ 3వ బెటాలియన్ చెందిన ఏఎస్పీ పునీత్ రఘును నియమించినట్లు తెలిపారు. చదవండి: వైరల్: నెటిజన్లు మెచ్చిన పసి హృదయం -
నెగిటివ్ రిపోర్టు వద్దనేసరికి రోడ్లన్నీ జామ్!
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్లోకి ప్రవేశించేవారు కొవిడ్-19 ఆర్టీపీసీఆర్ నెగటివ్ రిపోర్టును చూపించాల్సిన అవసరంలేదని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో గంటల వ్యవధిలోనే ఆ రాష్ట్ర సరిహద్దులో రహదారులు కార్లతో నిండిపోయాయి. వేలాది వాహనాలు కిలోమీటర్ల మేరకు బారులు తీరాయి. గత 36 గంటల్లో షోగి రహదారి ద్వారా సుమారు 5,000 వాహనాలు రాజధాని సిమ్లాలోకి ప్రవేశించాయి. దీంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరోవైపు కొవిడ్ నిబంధనలను పాటించాల్సిందిగా పర్యాటకులకు హిమాచల్ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్ ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం.. ప్రస్తుతం రాష్ట్రంలో 5,402 పాజిటివ్ కేసులు ఉన్నాయి. కాగా మాస్కు ధరిస్తూ, సామాజిక దూరం పాటించాలని ఆ రాష్ట్ర పోలీసులు సూచించారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చిరించారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఆంక్షలను సడలించి పర్యాటకులను అనుమతిస్తున్నట్టు శుక్రవారం తెలిపింది. ఇక జూన్ 14 నుంచి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దుకాణాలు తెరిచి ఉంటాయని వెల్లడించింది. అలాగే ప్రతిరోజూ సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ఆ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. As Himachal Pradesh has now allowed entry without RT-PCR test report, this is hw the decision was welcomed.... pic.twitter.com/JVotyxSIlF — Mohammad Ghazali (@ghazalimohammad) June 13, 2021 చదవండి: 38 భార్యల ముద్దుల భర్త ఇక లేరు -
ట్రంప్, అమితాబ్లకు లాక్డౌన్ పాసులు!!
సిమ్లా: లాక్డౌన్ టైంలో జనాల అత్యవసరాల సేవల కోసం పోలీసులు ఈ-పాస్లు జారీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే హిమాచల్ ప్రదేశ్ పోలీసుల నిర్వాకంపై జనాలు నవ్వుకుంటున్నారు ఇప్పుడు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్లకు లాక్డౌన్ ఈ-పాస్లు జారీ చేశారు అక్కడి పోలీసులు. ఈ వ్యవహారం మీడియాలో హైలైట్ కాగా, ఈ వ్యవహారం వెనుక ఉన్న జర్నలిస్ట్పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడంతో వ్యవహారం కోర్టుకి చేరింది. లాక్డౌన్ టైంలోనూ ప్రైవేట్ వాహనాలు ఎక్కువ సంఖ్యలో యథేచ్చగా తిరుగుతుండడంతో అమన్ కుమార్ భరద్వాజ్ అనే జర్నలిస్ట్ ‘ఈ-పాస్ వ్యవహారం’పై అనుమానపడ్డాడు. తన ఆధార్ వివరాల్ని ఇచ్చి.. ట్రంప్, అమితాబ్ ఫొటోలతో పాస్ల కోసం పోలీస్ ప్రత్యేక వెబ్ పోర్టల్లో దరఖాస్తు చేసుకున్నాడు. అయితే కనీసం ఆ ఫొటోల్ని కూడా పట్టించుకోకుండా, దరఖాస్తుల్ని కూడా వెరిఫై చేయకుండానే పాస్లు జారీ చేశారు పోలీసులు. ఈ వ్యహారంపై మే 5న అమన్ కుమార్ రిపోర్ట్ చేసిన స్టోరీ టీవీ ఛానెల్లో టెలికాస్ట్ అయ్యింది. దీంతో పోలీసులు అదే రోజు సాయంత్రం ఆ జర్నలిస్ట్పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అంతేకాదు డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్, ఐటీ యాక్ట్ సెక్షన్ల కింద అరెస్ట్ కోసం ప్రయత్నించారు. ఈలోపే అమన్ అప్రమత్తమై హైకోర్టును ఆశ్రయించాడు. ఈ-పాస్ల విషయంలో పోలీసుల నిర్లక్ష్యం బయటపడిందని, పత్రికా స్వేచ్ఛను పోలీసులు అణిచివేయాలని చూస్తున్నారంటూ పిటిషన్లో పేర్కొన్నాడు. అయితే అతని విజ్ఞప్తిని మన్నించిన హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు.. ఈ వ్యవహారంలో పోలీసులపై అక్షింతలు వేసింది. అంతేకాదు ఈ కేసు విచారణలో తదుపరి వాదనల వరకు అమన్ను అరెస్ట్ చేయొద్దని పోలీసులను కోర్టు ఆదేశించింది. చదవండి: సంసారానికి పనికి రాడనడం దాని కిందకే లెక్క! -
వ్యాక్సినేషన్ పూర్తి.. మరోసారి పాజిటివ్
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసిన మహ్మమారి కరోనా వైరస్ ఇప్పటికీ ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా సాగుతున్నప్పటికీ ఏదో ఒక మూలన దాని ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా భారత్లోనూ అక్కడక్కడ కరోనా కొత్త కేసులు రావడం ఆందోళన కలుగుతోంది. అయితే వ్యాక్సిన్ వారికి కూడా కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడం వైద్యులను సైతం కలవరానికి గురిచేస్తోంది. హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాలో ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీలో వైద్యులుగా విధులు నిర్వర్తిస్తున్న ముగ్గురికి తాజాగా కోవిడ్ పాజిటివ్గా తేలింది. వీరిలో వైద్యులైన భార్యభర్తలు కూడా ఉన్నారు. వారు 10 రోజుల కిందటే వ్యాక్సిన్ తొలి డోసును తీసుకున్నారు. గత రెండు రోజులుగా వారిలో స్పల్ప కరోనా లక్షణాలు కనిపించడంతో అత్యున్నత వైద్య బృందం సమక్షంలో మరోసారి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా ముగ్గిరికీ పాజిటివ్గా తేలింది. దీంతో వైద్యులు ఆశ్చర్యంలో మునిగిపోయారు. వ్యాక్సిన్ తీసుకున్నాక కూడా పాజిటివ్గా తేలడంతో ఆందోళన చెందారు. ప్రస్తుతం వారిని కోవిడ్ వార్డులో ఐసోలేషన్ చేసినట్లు తెలిపారు. అయితే ఇతరుల ద్వారానే వైరస్ వీరికి సోకినట్లు డాక్టర్ పతానియా వెల్లడించారు. మరోవైపు దేశ వ్యాప్తంగా కరోనా రెండో డోస్ ప్రక్రియ కూడా ఆరంభమైన విషయం తెలిసిందే. తొలిడోస్ వేసుకున్న వారికి ఈ విడతలో వ్యాక్సిన్ వేయనున్నారు. -
మంచుకొండల్లో ఎంజాయ్ చేసిన గవర్నర్
సిమ్లా: చలికాలం కావడంతో ప్రస్తుతం మంచు ప్రాంతాల్లో భారీగా మంచు కురుస్తోంది. జమ్మూ, కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ ప్రాంతాలు మంచు దుప్పటిలో మునిగిపోయాయి. మంచుతో నిండిన ఆ ప్రాంతాలు చూపరులను కనువిందు చేస్తున్నాయి. ఓ మంచు ప్రాంతం గవర్నర్గా ఉన్న తెలంగాణ వ్యక్తి ఎంజాయ్ చేస్తున్నారు. మంచు ప్రాంతాల్లో పర్యటించి అందాలను ఆస్వాదించారు. ఆయనే హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ. హిమాచల్ప్రదేశ్లోని సిమ్లా ప్రాంతం భారీ ఎత్తున మంచు దుప్పటి కప్పేసింది. దీంతో ఆ రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ తన సతీమణి వసంతతో కలిసి మంచు ప్రాంతాల్లో కలియ తిరిగారు. రాజ్ భవన్ ఆవరణలోనే కురిసిన మంచును పరిశీలించారు. హిమ ఫలకాలను పట్టుకుని ఎగురవేశారు. చిన్నపిల్లాడి మాదిరి గవర్నర్ ఆ మంచుతో ఆడుకున్నారు. ఆయన వెంట రాజ్భవన్ అధికారులు, సిబ్బంది కూడా ఉన్నారు. హిమపాతం ప్రకృతి ఇచ్చిన వరంగా ఈ సందర్భంగా దత్తాత్రేయ కొనియాడారు. ఇది కచ్చితంగా సానుకూల శక్తిని ఇస్తుందని పేర్కొన్నారు. హిమపాతం పండ్ల తోటలకు ఎరువుగా ఉపయోగపడుతుందని, రాబోయే కాలంలో మంచి దిగుబడికి ఇది సహాయపడుతుందని తెలిపారు. ఈ క్రమంలో మంచు కురుస్తుండడంతో అధికారులకు జాగ్రత్తలు సూచించారు. ప్రజలు ఎటువంటి అసౌకర్యాలకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని గవర్నర్ దత్తాత్రేయ అధికారులను ఆదేశించారు. -
ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్న మాజీ సీఎం
సిమ్లా: దేశంలోనే సీనియర్ రాజకీయ నాయకుడు.. ఆరు సార్లు ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి ఇకపై ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించారు. ఇకపై ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని.. కాకపోతే పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకుంటానని 86 ఏళ్ల వీరభద్ర సింగ్ తెలిపారు. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా వీరభద్ర సింగ్ పని చేశారు. 2017లో అధికారం నుంచి దిగిపోయిన అనంతరం రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నారు. తన సొంత నియోజకవర్గం అర్కీలో గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘ఇకపై ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తా. మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు పని చేస్తా’’ అని వీరభద్ర సింగ్ తన నియోజకవర్గానికి చెందిన వారితో చెప్పారు. వీరభద్ర సింగ్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్నాడు. సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పని చేసిన వారిలో ఆయన ఒకరు. ఆయనపై బీజేపీ ప్రభుత్వం పలు కేసులు నమోదు చేసింది. ప్రస్తుతం వాటి విచారణ కొనసాగుతోంది. అయితే వృద్ధాప్య సమస్యలతో పాటు అనారోగ్యం నేపథ్యంలో ఆయన ప్రత్యక్ష రాజకీయాల నుంచి దూరంగా ఉండేందుకు నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం దేశంలో అత్యంత సీనియర్ రాజకీయ నాయకుడుగా వీరభద్ర సింగ్ ఉన్నారు. 2012 నుంచి 2017 వరకు హిమాచల్ ప్రదేశ్ సీఎంగా వ్యహరించారు. 1983 నుంచి 1990, 1993 నుంచి 98, 2003-07కాలంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1962, 67, 71, 80, 2007లో లోక్సభ ఎంపీగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఈ రాష్ట్రానికి తెలంగాణకు చెందిన బండారు దత్తాత్రేయ గవర్నర్గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. -
కరోనా : మహిళ అంత్యక్రియలు అడ్డుకున్నందుకు
సిమ్లా : కరోనాతో చనిపోయిన వ్యక్తికి సంబంధించిన అంత్యక్రియలను అడ్డుకున్నందుకు గాను హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ సీనియర్ నేతతో పాటు ముగ్గురు కౌన్సిలర్లు, మరో 16 మందిపై హిమాచల్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. 63 ఏళ్ల కిడ్నీ పేషెంట్ అయిన మహిళకు కరోనా సోకడంతో మండిలోని శ్రీ లాల్ బహుదూర్ శాస్ర్తి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఐసోలేషన్లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. కాగా ఆమె సోమవారం మృతి చెందడంతో అంత్యక్రియలు నిర్వహించడానికి సొంతూరుకు తీసుకువచ్చారు. దహన సంస్కారాలకు అంతా సిద్దం చేస్తుండగా ఇంతలో మండి జిల్లా కాంగ్రెస్ చీఫ్ సుమన్ చౌదరీ కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు కన్సా, తన్వా గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలను వెంటబెట్టుకొని అంత్యక్రియలు నిర్వహించే చోటుకు చేరుకున్నారు. (వైరలవుతోన్న పెరూ మేయర్ చావు ఫోటోలు) కరోనా వైరస్ సోకిన మహిళ దహన కార్యక్రమాలు నిర్వహించడానికి వీలు లేదంటూ రోడ్డు మొత్తం బ్లాక్ చేస్తూ మహిళ మృతదేహం ఉన్న ఆంబులెన్స్ను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుమన్ చౌదరీతో పాటు ముగ్గురు కౌన్సిలర్లు, మరో 16 మందిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.ఇదే సుమన్ చౌదరీ కొన్ని రోజుల క్రితం కరోనా యోదులకు సలాం చేస్తూ 'కరోనాను ఓడిద్దాం.. మానవత్వాన్ని కాపాడుదాం' అంటూ ప్లకార్డును చేత పట్టుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పుడు కరోనా సోకి చనిపోయిన మహిళ అంత్యక్రియలను అడ్డుకొని తాను మానవత్వం మరిచిందంటూ పేర్కొన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షురాలిగా ఉంటూ అంత్యక్రియల కార్యక్రమం అడ్డుకోవడంతో మానవత్వాన్ని మరిచి రాష్ట్రంలో పార్టీ పరువు తీశారంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. (మటన్ వ్యాపారి ఇంట్లో 14 కరోనా కేసులు) -
లాక్డౌన్: ట్రక్కులో దొరికిన ప్రేమికులు
సిమ్లా: ఎంత కష్టం.. ఎంత కష్టం.. ప్రేమించుకున్నవారికి ఇన్ని రోజుల ఎడబాటు ఎంతో కష్టం. అందుకే ఇప్పుడప్పుడే కరోనా పోయేలా లేదని ఓ ప్రేమ జంట పెళ్లి చేసుకునేందుకు రహస్యంగా జిల్లాలోకి చొరబడేందుకు ప్రయత్నించగా పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన బుధవారం హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుల్లు జిల్లాలోని నిర్మాండ్ ప్రాంతానికి చెందిన ఇరవైయేళ్ల యువకుడు, ముప్పై యేళ్ల రష్యన్ యువతి గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. (చావులో ఒక్కటయ్యారు..) లాక్డౌన్ వల్ల నోయిడాలోనే ఇరుక్కుపోయిన వీరు స్వస్థలానికి వెళ్లి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అందుకోసం అక్కడి నుంచి వస్తున్న ట్రక్కులో దాక్కున్నారు. అయితే అక్కడికి సిమ్లా మీదుగా వెళ్లాల్సి ఉండగా ఆ జిల్లాలో కర్ఫ్యూ అమల్లో ఉంది. అనుమానం వచ్చిన పోలీసులు షోగి ప్రాంతం వద్ద ట్రక్కును అడ్డుకుని కర్ఫ్యూ పాస్ చూపించమని అడగడంతో వారు బిక్కమొహం వేశారు. దీంతో జిల్లాలో చొరబడేందుకు ప్రయత్నించిన ప్రేమికులను అదుపులోకి తీసుకున్నారు. ట్రక్కు డ్రైవర్, క్లీనర్ను కూడా పట్టుకున్నారు. వీళ్లందరినీ క్వారంటైన్కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (ప్రేమా.. ఇది నీకు న్యాయమా?) -
మంత్రగత్తె ముద్ర వేసి చెప్పుల దండతో ఊరేగింపు..
సిమ్లా : మంత్రగత్తె ముద్ర వేసి 81 ఏళ్ల మహిళ ముఖానికి నల్ల రంగు పూసి, చెప్పుల దండతో ఊరేగించిన ఘటనకు సంబంధించి 21 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో బాధ్యులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని హిమాచల్ప్రదేశ్ సీఎం జైరాం ఠాకూర్ పోలీసులను ఆదేశించారు. సర్కాఘట్ సబ్డివిజన్లోని సమహాల్ గ్రామంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. వృద్ధురాలిని మంత్రాల నెపంతో హింసించిన కేసులో 21 మందిని అరెస్ట్ చేశామని, తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని మండి ఎస్పీ గౌరవ్ శర్మ తెలిపారు. కాగా ఇలాంటి ఘటన జరుగుతుందనే ఆందోళనతో తాను అక్టోబర్ 23న పోలీసులకు ఫిర్యాదు చేశానని బాధితురాలు కుమార్తె వెల్లడించారు. ఫిర్యాదు రాగానే పోలీసులు గ్రామాన్నిసందర్శించారని అయితే తర్వాత ఫిర్యాదును ఉపసంహరించుకున్నారని అధికారులు తెలిపారు. -
గౌలిగూడ టు సిమ్లా
కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయను గవర్నర్ పదవి వరించింది. ఈ మేరకు కేంద్రం ఆయన్ను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా నియమించడంతో స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తల్లో ఆనందోత్సాహాలు వెల్లువెత్తాయి.నగరంలోని గౌలిగూడలో పుట్టిపెరిగిన దత్తన్న మరోసారి ఉన్నత పదవి చేపడుతుండడం గర్వకారణమనిపలువురు ఆయన్ని అభినందనలతో ముంచెత్తారు. ముషీరాబాద్: గౌలిగూడ బస్తీలో పుట్టి పెరిగి రాంనగర్ కేంద్రంగా రాజకీయాలు ప్రారంభించిన బండారు దత్తాత్రేయను హిమాచల్ప్రదేశ్ గవర్నర్గా నియమించడంతో బీజేపీ శ్రేణులు, అభిమానుల్లో ఒక్కసారిగా ఆనందోత్సాహాలు వెల్లువెత్తాయి. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నుంచి తన ప్రస్థానాన్ని ప్రారంభించిన దత్తన్న నగరం కేంద్రంగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలైనా సికింద్రాబాద్ లోక్సభ నుంచి అత్యధిక సార్లు విజయం సాధించటంతో పాటు రెండుమార్లు కేంద్రమంత్రి పదవిని చేపట్టారు. తాజాగా మరో మెట్టు ఎదిగి గవర్నర్ కావడంతో నగర బీజేపీ శ్రేణులు ఆదివారం ఆయనను అభినందనలతో ముంచెత్తాయి. సింపుల్ మ్యాన్... గౌలిగూడలో ఓ సాదాసీదా ఇంటిలో నివాసం ఉన్న దత్తాత్రేయ మొదటిసారిగా 1991లో సికింద్రాబాద్ పార్లమెంటు నుంచి ఎన్నికయ్యారు. సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో 1998లో రాంనగర్కు మకాం మార్చారు. అదే సమయంలో వాజ్పేయి ప్రభుత్వంలో గ్రామీణాభివద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటికీ.. రాంనగర్లోనే నివసిస్తూ ఒక కిరాయి ఇంట్లో సుమారు రెండేళ్లు ఉండి అదే ప్రాంతంలో ఇల్లు నిర్మించుకున్నారు. ఇప్పటికీ అదే ఇంట్లో ఉంటూ దాదాపు 22 ఏళ్లుగా రాంనగర్తో అవినాభావ సంబంధం ఏర్పర్చుకున్నారు. ఎంపీ అయినా, కాకపోయినా అందరితో కలిసిపోవడం, ఎలాంటి ఆర్భాటాలకు పోక పోవడం ఆయన నైజం. ఎప్పుడు చూసినా సౌమ్యంగా కనబడడం, ముఖ్యంగా మధ్యతరగతి, పేదలకు అందుబాటులో ఉండ డం అతని సహజ లక్షణం. అం దుకే మినిస్టర్ కాగానే ఎంతో మం ది సన్నిహితులు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లకు వెళ్దామని ఒత్తిడి తెచ్చినా లొంగకుండా పేదలకు అందుబాటులో ఉండాలనే ఒకే ఒక్క కారణంతో రాంనగర్ను విడిచి వెళ్లలేదు. కూతురు వివాహ రిసెప్షన్లో ప్రధాని మోదీతో దత్తాత్రేయ ఆలస్యంగా వివాహం... ఆర్ఎస్ఎస్లో, సేవా కార్యక్రమాల్లో మునిగితేలిన దత్తాత్రేయ వివాహం చేసుకోవాలనే ఆసక్తి కనపర్చలేదు. వివాహం తన పార్టీ కార్యక్రమాలకు విఘాతం కల్గిస్తుందని భావించారు. అప్పటి ప్రధాని వాజ్పేయి సూచన మేరకు ఆర్ఎస్ఎస్ నుంచి 1980లో బీజేపీలో చేరారు. బీజేపీలో కూడా చురుకైన పాత్ర పోషించి 1981–89 వరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఈ సమయంలో పార్టీ పెద్దలు, సహచరులు వివాహం చేసుకోవాలని ఒకవైపు ఒత్తిడి చేస్తుండగా.. మరోవైపు సమీప బంధువైన వసంత దత్తాత్రేయనే చేసుకుంటానని, లేకపోతే పెళ్లి చేసుకోనని చెప్పడంతో చివరికి తన 42వ ఏటా పెండ్లి చేసుకున్నారు. ఆయన కూతురిని బీజేపీ ముఖ్యనాయకుడు బి.జనార్ధన్రెడ్ది తనయుడు డాక్టర్ జిగ్నేష్రెడ్డికి ఇచ్చి వివాహం చేశారు. కుమారుడు సంవత్సరం క్రితం గుండెపోటుతో మరణించడంతో దత్తాత్రేయ మానసికంగా కుంగిపోయారు. అయినా తేరుకుని పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న సమయంలో హిమచల్ప్రదేశ్ గవర్నర్గా నియమించడం పట్ల ఆయన కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. అభినందనల వెల్లువ బీజేపీ అగ్రనేత బండారు దత్తాత్రేయను హిమాచల్ప్రదేశ్ గవర్నర్గా నియమిస్తున్నట్లు ఆదివారం ఉదయం వార్త వెలువడగానే ఆయన నివాసం అభిమానులతో నిండిపోయింది. అధికారిక ప్రకటన వచ్చే సమయానికి దత్తాత్రేయ నాంపల్లిలో గణేష్ ఉత్సవ సమితి సమావేశంలో ఉన్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఉత్సవ సమితి సభ్యులు ఆయనను అభినందనలతో ముంచెత్తారు. కొత్త బాధ్యతల్లోకి వెళుతున్న దత్తాత్రేయను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, గవర్నర్లు నరసింహన్, విశ్వభూషణ్ హరిచందన్, విద్యాసాగర్రావు, కల్రాజ్ మిశ్రా, ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, కె.కేశవరావు, రామ్మోహన్రావు,సుజనాచౌదరి, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, కేంద్ర మంత్రులు జవదేకర్, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ వినోద్కుమార్, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, మాజీ ఎంఎల్సీ చుక్కా రామయ్య, మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు అభినందించారు. అమ్మవారికి బోనం చాంద్రాయణగుట్ట: హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా నియమితులైన బీజేపీ సీనియర్నేత బండారు దత్తాత్రేయకు పాతబస్తీ ఆషాఢ మాసం బోనాలతో విడదీయరాని అనుబంధం ఉంది. ఏటా ఉత్సవాలకు హాజరై లాల్దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పిస్తారు. కేంద్ర మంత్రిగా ఉన్న సమయంతో పాటు ఈ ఏడాది కూడా అమ్మవారి ఆలయానికి కుటుంబ సమేతంగా విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఓయూలో మార్నింగ్ వాక్ ఉస్మానియా యూనివర్సిటీ: బండారు దత్తాత్రేయ నియామకం పట్ల ఓయూలో పలువురు విద్యార్థులు, అధ్యాపకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఓయూ క్యాంపస్కు ప్రతి రోజు మార్నింగ్ వాకింగ్కు వచ్చి అనేక మంది ప్రొఫెసర్లు, అధ్యాపకులు, విద్యార్థులతో వివిధ అంశాలపై చర్చించేవారు. కేంద్ర మంత్రిగా ఓయూలో ఉద్యోగ, ఉపాధి శిక్షణ కేంద్రాన్ని ఎంప్లాయిమెంట్ బ్యూరో కార్యాలయాన్ని ప్రారంభించారు. లేడీస్ హాస్టల్లో ప్రతి ఏటా విద్యార్థినులు జరుపుకును బతుకమ్మ పండుగలో పాల్గొనేవారు. ఏబీవీపీ నాయకులను పేరుపెట్టి పిలిచేంత చనువుగా ఉండేవారు. సికింద్రాబాద్ ఎంపీగా, మంత్రిగా దత్తాత్రేయ ఓయూలో అనేక కార్యక్రమాల్లో పాల్గొని ప్రసంగించారు. కళా పురస్కారాల ప్రదానం వివేక్నగర్:మోహన్ ట్రస్ట్, కీర్తన ఆర్ట్స్ ఆధ్వర్యంలో ఆదివారం త్యాగరాయ గానసభలో 12గంటల పాటు తెలుగు కళా సంరంభం, సంగీత నృత్య సమ్మేళనం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన తమిళనాడు మాజీ గవర్నర్ డా.కె.రోశయ్య వివిధ రంగాల ప్రముఖుల్ని కళా పురస్కారాలతో సత్కరించారు. ఆయన మాట్లాడుతూ.. సాంçస్కృతిక సంస్థలు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. బీసీ కమిçషన్ సభ్యుడు డా.వకుళాభరణం కృష్ణమోహనరావు, దైవజ్ఞశర్మ, కొత్త కృష్ణవేణి, మహ్మద్ రఫీ, వై.రాజేంద్రప్రసాద్, మోహన్ గాంధీ, శ్రీనివాసగుప్తా, శశిబాల తదితరులు పాల్గొన్నారు. కుమ్మేసింది వర్షం కుమ్మేసింది. ఆదివారం సాయంత్రం నగరంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. రహదారులపై వరద పోటెత్తింది. ఫలితంగా ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. హుస్సేన్సాగర్ (ట్యాంక్బండ్) నీటి మట్టం ఆదివారం సాయంత్రానికి +513.410 అడుగులకు చేరింది. ట్యాంక్బండ్ సామర్థ్యం +514.910 అడుగులు కావడంతో భయపడాల్సిన అవసరం లేదని జీహెచ్ఎంసీ వర్గాలు పేర్కొన్నాయి. -
కశ్మీర్పై భారత్కు రష్యా మద్దతు
మాస్కో/న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: కశ్మీర్ విషయంలో భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలకు రష్యా మద్దతు ప్రకటించింది. జమ్మూకశ్మీర్కు స్వతంత్ర ప్రతిపత్తి రద్దు, ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడం వంటివి భారత రాజ్యాంగానికి లోబడే జరిగాయని స్పష్టం చేసింది. భారత్, పాక్ల మధ్య సంబంధాలు సాధారణ స్థాయికి రావాలని కోరుతున్నాం. ఇందుకోసం రెండు దేశాలు తమ మధ్య ఉన్న విభేదాలను సిమ్లా ఒప్పందం, లాహోర్ ప్రకటనపాతిపదికన రాజకీయంగా, దౌత్యపరంగా పరిష్కరించుకుంటాయని ఆశిస్తున్నాం’ అని రష్యా విదేశాంగ శాఖ తెలిపింది. నేవీలో హై అలర్ట్ భారత నేవీలో శనివారం హై అలర్ట్ ప్రకటించారు. ఎలాంటి సముద్ర దాడులనైనా సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు తాము అప్రమత్తంగా ఉన్నట్లు నావికాదళం తెలిపింది. ‘తీర ప్రాంత భద్రతా చర్యలు వేగవంతమయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ చర్యలు జరగకుండా ఉండేందుకు భద్రతా దళాలు అప్రమత్తంగా ఉన్నాయి’అని నావికాదళ సిబ్బంది డిప్యూటీ చీఫ్ మురళీధర్ పవార్ వెల్లడించారు. ‘సముందరి జిహాద్’పేరుతో పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాద సంస్థలు సముద్రంలో దాడులు చేసేందుకు తమ కేడర్కు శిక్షణ ఇస్తున్నట్లు విశ్వసనీయంగా సమాచారం అందింది. ఈ నేపథ్యంలో అన్ని నేవీ స్టేషన్లలో హై అలర్ట్ విధించారు. లాహోర్–ఢిల్లీ బస్ సర్వీసులు నిలిపివేత లాహోర్–ఢిల్లీల మధ్య నడుస్తున్న బస్ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు పాక్ ప్రకటించింది. జాతీయ భద్రతా సంఘం నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచార, పోస్టు సేవల మంత్రి మురద్ సయీద్ అన్నారు. కరాచీ నుంచి వచ్చే థార్ ఎక్స్ప్రెస్ 165 మంది ప్రయాణికులతో శనివారం భారత్ సరిహద్దుకు చేరుకుంది. అక్కడి నుంచి మరో లింకు రైలు ద్వారా ప్రయాణికులను భారత్ తీసుకొచ్చారు. దీనికి ముందు ఈ రైలును సరిహద్దు వరకు తీసుకురావడానికి పాక్ అనుమతించింది. -
సిమ్లాను ముంచెత్తిన మంచు
సిమ్లా: హిమాచల్ప్రదేశ్లోని సిమ్లాను మంచు ముంచెత్తింది. మరోవైపు, రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి వర్షం, వడగండ్ల వానతో శనివారం తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కుఫ్రి, మషోబ్రా, ధల్లి ప్రాంతాల్లో వడగండ్లు పడగా, సిమ్లా, ధర్మశాల, డల్హౌసీ, ఫగు, సంగ్లా, రాజ్గఢ్, సంధోల్లలో తేలికపాటి వాన కురిసింది. గరిష్ట ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల మేర తగ్గాయని పేర్కొంది. ఉనాలో అత్యధికంగా 41.5 డిగ్రీలు నమోదు కాగా, లాహౌల్, స్పిటి గిరిజన జిల్లాల్లో అత్యంత కనిష్టంగా 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వివరించింది. పేరుకుపోయిన మంచు, వర్షం కురుస్తున్న దృశ్యం -
పనిమనిషిని చంపి.. అడ్డంగా బుక్కయ్యాడు!
సిమ్లా : ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఆశపడి పనిమనిషిని చంపి అడ్డంగా బుక్కయ్యాడు ఓ వ్యక్తి. తన పథకం పారకపోవడంతో పోలీసుల చేతికి చిక్కి కటకటాలపాలయ్యాడు. పోలీసుల వివరాలు... చండీగఢ్కు చెందిన ఆకాశ్ వద్ద రాజస్తాన్కు చెందిన ఓ వ్యక్తి పనిచేసేవాడు. అయితే గత కొంతకాలంగా ఆకాశ్ ఆర్థిక పరిస్థితి దిగజారింది. ఈ క్రమంలో తన పేరిట ఉన్న బీమా డబ్బులు వస్తే ఈ కష్టాల నుంచి గట్టెక్కవచ్చని భావించాడు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులతో కలిసి పథకం రచించాడు. తాను చనిపోయినట్లుగా నటించి.. గత నెలలో తమ ఇంటి పనివాడిని చంపిన ఆకాశ్ అతడి మృతదేహాన్ని తన కారులో హిమాచల్ ప్రదేశ్లోని నహన్ పట్టణానికి తరలించాడు. ఆ తర్వాత కారుకు నిప్పంటించాడు. తన ఆచూకీ తెలియకుండా ఉండాలనే ఉద్దేశంతో నేపాల్ పారిపోవాలని నిర్ణయించుకున్నాడు. పథకంలో భాగంగా కారు ప్రమాదంలో ఆకాశ్ మరణించాడంటూ అతడి మేనల్లుడు పోలీసులకు సమాచారం అందించాడు. అయితే ఆకాశ్ చనిపోయాడనే వార్త తెలిసిన మరుసటి రోజు నుంచే అతడి మరణ ధ్రువీకరణపత్రం కావాలంటూ కుటుంబ సభ్యులు ఒత్తిడి చేయడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. ఈ నేపథ్యంలో లోతుగా దర్యాప్తు చేయడంతో అసలు నిజం బయటపడింది. దీంతో ఆకాశ్ను పల్వాల్ రైల్వే స్టేషన్లో పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. -
జైలులో ఉంటూ సివిల్స్కు ప్రిపేర్
సిమ్లా: ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన బ్లాక్బస్టర్ హిట్ ‘స్టూడెంట్ నెం1’ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ సినిమాలో ఆదిత్య(ఎన్టీఆర్) చేయని తప్పుకు జైలులో శిక్ష అనుభవిస్తూ ‘లా’ చదివి తండ్రి కోరికను తీరుస్తాడు. కొంచెం అటూ ఇటూగా నిజజీవితంలోనూ ఇలాంటి ఘటనే సిమ్లాకు చెందిన 27 ఏళ్ల విక్రమ్ సింగ్కు ఎదురైంది. అత్యాచార కేసులో స్థానిక సెషన్స్ కోర్టు అతడికి జైలు శిక్ష విధించింది. దీంతో తన సివిల్స్ కల చెదిరిందనుకున్నాడు. కానీ ఓ వైపు తాను నిర్దోషినంటూ హిమాచల్ ప్రదేశ్ హైకోర్టులో పోరాటం చేస్తూనే మరోవైపు జైలులోనే సివిల్స్కు ప్రిపేరయ్యాడు. విక్రమ్ సింగ్ కృషి, పట్టుదల, నమ్మకంతో సగం విజయం సాధించాడు. హైకోర్టు అతడిని నిర్దోషిగా తేలుస్తూ తీర్పును వెలువరించింది. ఇక తరువాతి లక్ష్యం సివిల్స్ సాధించడమే అని అతడు పేర్కొన్నాడు. నిరుద్యోగుల కోసం ‘కాంపిటీషన్ కంపెనియన్’ జైలు జీవితం గురించి విక్రమ్ సింగ్ ఆయన మాటల్లోనే ‘రెండేళ్లు జైలు జీవితం గడిపా. నేను ఎలాంటి తప్పు చేయలేదని నా అంతరాత్మకు, కుటుంబ సభ్యులకు, స్నేహితులకు తెలుసు. సెషన్స్ కోర్టు దోషిగా తేల్చి జైలు శిక్ష విధించినప్పుడు ఆందోళన చెందలేదు. న్యాయవ్యవస్థపై నమ్మకంతోనే హైకోర్టులో పోరాడా. చివరికి విజయం సాధించా. జైలులో ఉన్నప్పుడు కుంగిపోకుండా నా సివిల్స్ ప్రిపరేషన్ ఆగకూడదని నిశ్చయించుకొని దానికనుగుణంగా కష్టపడ్డాను. అదే విధంగా నా లాంటి నిరుద్యోగులకు ఉపయోగపడే విధంగా ‘కాంపిటీషన్ కంపెనియన్’అనే మ్యాగజైన్ రాశాను. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారికి నేను రాసిన పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుంది. రాష్ట్రంలో చాలా మంది యువత డ్రగ్స్కు బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అందుకే సివిల్స్కు ప్రిపేర్ అవుతూనే మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా విశేష ప్రచారం చేయాలని భావిస్తున్నాను. వారికి ప్రత్యేక ధన్యవాదాలు హిమాచల్ ప్రదేశ్ జైళ్ల శాఖ డీజీ జనరల్ సోమేశ్ గోయల్కు, ఇతర జైలు అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలయజేస్తున్నాను. వారు జైలులోని ఖైదీలలో పరివర్తన తీసుకరావడానికి ఎంతగానో ప్రయత్నించేవారు. నేను సివిల్స్కు ప్రిపేర్ కావడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా మ్యాగజైన్ రాసేటప్పుడు ఎంతో సహాయం చేశారు. వారు చేసిన సహాయసహకారాలకు జీవితాంతం రుణపడి ఉంటాను’అంటూ విక్రమ్ సింగ్ పేర్కొన్నాడు. ఆనందంగా ఉంది: సోమేశ్ గోయల్ ‘నన్ను, మా అధికారులను విక్రమ్ సింగ్ కలిసి తాను ఎలాంటి తప్పు చేయలేదని చెప్పాడు. మీరు సహకరిస్తే సివిల్స్కు ప్రిపేర్ అవుతానని పేర్కొన్నాడు. అతడికి కావల్సిన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశాము. పోటీ పరీక్షల కోసం సన్నద్ధమయ్యే విద్యార్థుల కోసం మ్యాగజైన్ రాస్తానని చెబితే అతడికి కావల్సిన వార్తా పత్రికలు, ఇతర మ్యాగజైన్స్ అందించాము. విక్రమ్ సింగ్ రాసిన మ్యాగజైన్ విడుదల కావడం ఆనందంగా ఉంది. విక్రమ్ సింగ్ ఒక్కడికే కాదు జైలులో ఉన్న ఖైదీలందరికీ సౌకర్యవంతమైన వాతావరణాన్ని కల్పిస్తూ, అనేక సదుపాయాలు, అవకాశాలు కల్పిస్తున్నాం’అంటూ జైళ్ల శాఖ డీజీ సోమేశ్ గోయల్ వివరించారు. -
సిమ్లా.. ఇకపై శ్యామల!
సిమ్లా : హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా పేరును శ్యామలగా మార్చేందుకు అధికార బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. హిందుత్వవాదులు, నేతల ఒత్తిడితో సిమ్లా పేరు మార్చాలనే ప్రతిపాదనకు జైరాం ఠాకూర్ నేతృత్వంలోని ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. ఈ విషయం గురించి జాతీయ మీడియాతో మాట్లాడిన రాష్ట్ర వైద్యశాఖ మంత్రి విపిన్ సింగ్... ‘దేశంలోని చాలా మటుకు చరిత్రాత్మక ప్రదేశాల పేర్లను మార్చారు. ఒకవేళ ప్రజలు సిమ్లా పేరును శ్యామలగా మారాలని కోరుకుంటే అందులో తప్పేం ఉంది. ఈ ప్రతిపాదనను మేము కచ్చితంగా పరిగణనలోకి తీసుకుంటాం అని వ్యాఖ్యానించారు. రాజధాని పేరు మార్పు విషయమై బీజేపీపై ప్రతిపక్ష కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా కేవలం రాజకీయాలకే ప్రభుత్వం పరిమితమవుతోందంటూ ఆ రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత హర్భజన్ సింగ్ భజ్జీ విమర్శించారు. కాగా ఇటీవలే ఉత్తరప్రదేశ్ ముఖ్య పట్టణం అలహాబాద్ పేరును ప్రయాగరాజ్గా మారుస్తూ సీఎం యోగి ఆదిత్యనాథ్ వివాదాస్పద నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. -
రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి
సిమ్లా: హిమాచల్ప్రదేశ్ రాష్ట్రం సిమ్లా జిల్లాలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 13 మంది చనిపోయారు. స్వారా నుంచి తియునికి వెళ్తున్న జీపుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో రోడ్డు పక్కనే ఉన్న లోయలోకి పడిపోయింది. జీపులో ఉన్న వారిలో పది మంది అక్కడికక్కడే చనిపోగా మరో ముగ్గురు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో ప్రాణాలు విడిచారని పోలీసులు తెలిపారు. మృతుల్లో మూడు జంటలు, వారి పిల్లలూ ఉన్నారు. -
సిమ్లా టూ చండీగఢ్.. జస్ట్ 20 నిమిషాలే!
సిమ్లా : హిమాచల్ప్రదేశ్ టూరిస్ట్ రిసార్ట్ నుంచి చండీగఢ్కు అరగంటలో వెళ్లాలనుకుంటున్నారా? అయితే ఇక నుంచి అది కూడా సాధ్యమవుతుంది. సిమ్లా నుంచి చండీఘడ్కు కేవలం 20 నిమిషాల్లో చేరుకునే హెలీ-ట్యాక్సీ సర్వీసును సోమవారం ప్రారంభించారు. హెలికాప్టర్ సర్వీసు ఆపరేటర్ పవన్ హ్యాన్స్ లిమిటెడ్తో భాగస్వామ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ సర్వీసులను లాంచ్ చేసింది. రోడ్డు మార్గం ద్వారా నాలుగు గంటల ప్రయాణ సమయాన్ని ఈ సర్వీసులు 20 నిమిషాలకే కుదించనున్నాయి. 19 ప్రయాణికులను ఈ హెలీ-ట్యాక్సీలో ప్రయాణించవచ్చు. కనీస ఛార్జ్ ఒక్కో వ్యక్తికి 2,999 రూపాయలు. వారానికి రెండు సార్లు అంటే సోమవారం, శుక్రవారం ఈ హెలీ-ట్యాక్సీ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. సిమ్లా ఎయిర్పోర్టు నుంచి ఉదయం 8 గంటలకు టేకాఫ్ అయ్యే ఈ హెలికాప్టర్, చండీగఢ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉదయం 8.20 కల్లా ల్యాండ్ అవుతుంది. అనంతరం చండీగఢ్ నుంచి ఉదయం 9 గంటలకు టేకాఫ్ అయి, సిమ్లాకు ఉదయం 9.20 కి చేరుకుంటుందని పవన్ హ్యాన్స్ అధికారులు చెప్పారు. ప్రయాణికుల నుంచి వచ్చే స్పందన బట్టి ఈ సర్వీసులను మరింత పెంచుతామని తెలిపారు. సిమ్లా నుంచి తొలి సర్వీసును హిమాచల్ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరామ్ థాకూర్ ప్రారంభించారు. రాష్ట్రంలో టూరిజం రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఈ సర్వీసులు ఎంతో ఉపయోగపడనున్నాయన్నారు. చండీగఢ్ నుంచి మనాలీ మధ్యలో కూడా ఈ హెలీ-ట్యాక్సీ సర్వీసులను లాంచ్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. -
నీటి కోసం హైవే ముట్టడి
సాక్షి, న్యూఢిల్లీ : సిమ్లాలో తీవ్ర నీటిఎద్దడితో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు గత కొన్ని రోజులుగా ఆందోళన చేపడుతున్న క్రమంలో గురువారం జాతీయ రహదారిపై కచి ఘటి ప్రాంతంలో భారీ నిరసనకు దిగారు. నీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ హైవేను దిగ్భందించారు. నీటి సంక్షోభానికి నిరసనగా జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు. తమకు కుళాయిల నుంచి నీళ్లు రావడం లేదని, పైప్లైన్ల ద్వారా నీటి సరఫరా చాలారోజుల నుంచి నిలిచిపోయిందని స్ధానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ట్యాంకర్లు సైతం నివాస ప్రాంతాలకు రాకుండా, వీఐపీ ప్రాంతాలకు తరలిస్తున్నారని ఆరోపించారు. సిమ్లాలో పరిస్థితి ఇలా ఉంటే గ్రామాల్లో పరిస్ధితి దయనీయంగా ఉంది. తాగునీటి కోసం సిమ్లా పట్టణం సహా పరిసర ప్రాంతాల ప్రజలు వారం రోజులు పైగా వేచిచూస్తున్నారు. నీటిఎద్దడి నెలకొన్న నేపథ్యంలో వీఐపీ ప్రాంతాలకు ప్రత్యేక ట్యాంకర్ల ద్వారా నీటిసరఫరా చేయవద్దని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. టూరిస్టులు సైతం కొద్దిరోజులు హిల్స్టేషన్కు దూరంగా ఉండాలని, నిర్మాణ కార్యకలాపాలను కొద్దిరోజుల పాటు నిలిపివేయాలని కోర్టు ఆదేశించింది. -
సిమ్లాలో నీటి కష్టాలు
-
ప్లీజ్.. మా ఊరికి రావద్దు
సిమ్లా, హిమాచల్ ప్రదేశ్ : దేశంలోని పలు ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఎంత తీవ్రంగా ఉందంటే మా ఇంటికోస్తే ఓ పూట భోజనం పెడ్తాం.. కానీ గుక్కెడు నీళ్లు మాత్రం ఇవ్వలేం అనే దయనీయ పరిస్ధితులు ఏర్పడ్డాయి. హిమాచల్ రాజధాని సిమ్లా తీవ్ర నీటి ఎద్దడితో అల్లాడుతోంది. ఈ వేసవి తాపానికి దూరంగా.. చల్లగా సేద తీరాలనుకునే వారికి, ప్రకృతి ప్రేమికులకు ఇష్టమైన వేసవి విడిది సిమ్లా. నిత్యం టూరిస్టులతో కిక్కిరిసి ఉండే సిమ్లా మాల్ రోడ్డు ప్రాంతం ప్రస్తుతం నీళ్ల బిందెలు పట్టుకుని బారులు తీరిన ప్రజలతో నిండిపోయింది. వారం రోజులుగా సిమ్లాలో కుళాయిల నుంచి నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. తీవ్ర నీటి ఎద్దడి నేపథ్యంలో పర్యాటకులను తమ నగరానికి రావద్దని అక్కడి ప్రజలు కోరుతున్నారు. ప్రస్తుతం సిమ్లాలో ఏర్పడ్డ అకాల నీటి కరువు గురించి హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేయడమే కాక వెంటనే సమస్యను పరిష్కరించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ విషయం గురించి హిమాచల్ ముఖ్యమంత్రి అధికారులతో చర్యలు జరుపుతున్నామని, అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సిమ్లా మున్సిపల్ కార్పొరేషన్ తరుఫున 14 వాటర్ ట్యాంకర్లను, 8 పికప్ వెహికల్స్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అంతేకాక మొత్తం సిమ్లా పట్టణాన్ని మూడు జోన్లుగా విభజించామని, అన్ని ప్రాంతాలకు సమానంగా వాటర్ ట్యాంకర్లను పంపుతున్నట్లు ప్రకటించారు. ఇవే కాక ప్రతి వార్డుకు ఒక వాటర్ ట్యాంకర్ను పంపిస్తున్నట్లు తెలిపారు. అయితే ప్రభుత్వం రాజకీయ నాయకులు, సినీతారలు ఉండే ప్రాంతాలకే ఎక్కువ మొత్తంలో వాటర్ ట్యాంకర్లను పంపిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ నీటి ఎద్దడి నేపథ్యంలో సామాజిక కార్యకర్తలు పర్యాటకులను తమ ఊరికి రావద్దని వేడుకుంటూ సామాజిక మాధ్యామాల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. హోటళ్లు కూడా బుకింగ్లను రద్దు చేసుకునేందుకు అనుమతించటమే కాక రద్దు చేసుకున్న మొత్తాన్ని రీఫండ్ చేస్తున్నట్లు తెలిపారు. -
మహిళ అధికారిని హతమార్చి.. ఆపై వేషం మార్చి
సిమ్లా : విధులు నిర్వహిస్తున్న మహిళ అధికారిని హతమార్చి వేషం మార్చుకుని తిరుగుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అక్రమ కట్టడాలు కూల్చివేయాల్సిందిగా ఏప్రిల్ 17న హిమచల్ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో ప్రభుత్వం కసౌలీ, ధరమ్పూర్ పట్టణాల్లోని అక్రమ కట్టడాల కూల్చివేతకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. అసిస్టెంట్ టౌన్ ప్లానర్గా విధులు నిర్వహిస్తున్న షేల్ బాలా అందులోని ఓ బృందానికి నేతృత్వం వహిస్తున్నారు. తన విధుల్లో భాగంగా మంగళవారం కసౌలీ పట్టణంలోని విజయ్ సింగ్ అనే వ్యక్తికి చెందిన హోటల్ భవనాన్ని కూల్చేందుకు ఆమె ఆదేశాలు జారీ చేశారు. నాలుగు అంతస్తులకే అనుమతి తీసుకున్న విజయ్ ఆరు అంతస్తుల భవనాన్ని నిర్మించడంతో ఆమె ఆ విధమైన నిర్ణయం తీసుకున్నారు. కానీ దీనిని వ్యతిరేకిస్తూ.. విజయ్సింగ్, అతని తల్లి మహిళ అధికారిణితో వాగ్విదానికి దిగారు. అయిన ఆమె వెనక్కి తగ్గకపోవడంతో విజయ్ అక్కడవున్న అధికారులపై మూడు రౌండ్ల కాల్పులు జరిపాడు. దీంతో షేల్ బాలా అక్కడిక్కడే మృతి చెందారు. అనంతరం విజయ్ సమీపంలోని అటవీ ప్రాంతలోకి పారిపోయాడు. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న పోలీసు శాఖ అధికారులు అతని ఆచూకీ తెలిపిన వారికి లక్ష రూపాయల రివార్డు అందజేస్తామని ప్రకటించారు. అడవిలోకి పారిపోయిన అనంతరం విజయ్ తన స్నేహితులకు ఫోన్ చేసి సహాయం చేయాల్సిందిగా కోరారు. పోలీసులు ఫోన్ను ట్రేస్ చేస్తారనే అనుమానంతో వెంటనే మొబైల్ స్విచ్ఛాప్ చేశాడు. ఇలా అయితే దొరికిపోతామనే ఆలోచనతో గడ్డం తీయించడంతో పాటు, హెర్ స్టైల్ మార్చి, వివిధ ప్రాంతాల్లో సంచరించడం మొదలు పెట్టాడు. మళ్లీ తన స్నేహితులకు విజయ్ కాల్ చేయడంతో, పోలీసులు అతని లోకేషన్ ట్రేస్ చేశారు. అతడు మథురాలో ఉన్నట్టు తెలీడంతో, ఢిల్లీ పోలీసులను సహాయంతో గురువారం అతన్ని అదుపులోకి తీసుకున్నట్టు ఎస్పీ తెలిపారు. -
నడిరోడ్డుపై మహిళా అధికారి కాల్చివేత..
సిమ్లా : అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలన్న న్యాయస్థాన ఆదేశాలను అమలు చేస్తున్న మహిళా అధికారిని ఓ వ్యక్తి కాల్చి చంపాడు. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్లోని కసౌలీ పట్టణంలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అక్రమ కట్టడాలను కూల్చివేయాల్సిందిగా సుప్రీం కోర్టు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ అధికారులు కసౌలీ పట్టణానికి చేరుకున్నారు. పోలీసుల సాయంతో అక్రమ కట్టడాల కూల్చివేత ప్రారంభించారు. ఈ క్రమంలో మండో మాట్కండలో ఉన్న నారాయణి గెస్ట్ హౌజ్ వద్దకు చేరుకున్నారు. నాలుగు అంతస్తులకు మాత్రమే అనుమతి ఉన్నఈ గెస్ట్హౌజ్ను ఆరు అంతస్తులకు పెంచినందున ఆ భవనాన్ని కూల్చివేయాల్సిందిగా అసిస్టెంట్ టౌన్ ప్లానర్ షేల్ బాలా ఆదేశించారు. ఈ విషయమై షేల్ బాలా, గెస్ట్హౌజ్ యజమాని విజయ్ సింగ్, అతని తల్లిల మధ్య వాగ్వాదం మొదలైంది. ఈ క్రమంలో భవనాన్ని కూల్చివేయాల్సిందిగా షేల్ బాలా పట్టుబట్టడంతో కోపోద్రిక్తుడైన విజయ్ సింగ్ తుపాకీతో పీడబ్ల్యూడీ అధికారులపై మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో షేల్ బాలా అక్కడిక్కడే మృతి చెందగా, మరో అధికారి తీవ్రంగా గాయపడ్డారు. లక్ష రూపాయల రివార్డు... షేల్ బాలా మరణించడంతో విజయ్ సింగ్ సమీపంలోని అడవిలోకి పారిపోయాడు. అతని ఆచూకీ తెలిపిన వారికి లక్ష రూపాయల రివార్డు అందిస్తామని పోలీసులు తెలిపారు. అక్రమ కట్టడాల కూల్చివేత సమయంలో అల్లర్లు చెలరేగుతాయనే కారణంతో తాము అక్కడే ఉన్నప్పటికీ ఇలా జరిగిందని పోలీసులు పేర్కొన్నారు. నిందితుడికి త్వరలోనే శిక్ష పడేలా చూస్తామని ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ హామీ ఇచ్చారు. -
షూటింగ్ అని పిలిచి.. లైంగిక దాడి చేశాడు!
సాక్షి, న్యూఢిల్లీ: బాలీవుడ్ సీనియర్ నటుడు, నిర్మాత జితేంద్ర (రవి కపూర్) తనను లైంగికంగా వేధించాడంటూ ఆయన మేనకోడలు ఆరోపించారు. లైంగిక వేధింపుల ఘటనను వివరిస్తూ హిమాచల్ ప్రదేశ్ డీజీపీ కార్యాలయానికి బాధితురాలు ఫిర్యాదు లేఖ రాశారు. కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని లేఖ ద్వారా ఆమె కోరినట్లు సమాచారం. లైంగిక వేధింపులకు గురైన వారు ధైర్యంగా బయటకు వచ్చి జరిగిన అన్యాయంపై పోరాడటం, బాధితులకు అండగా నిలిచేందుకు చేపట్టిన మీటూ ఉద్యమం (#MeToo campaign) వల్లే తాను 47 ఏళ్ల కిందట ఎదుర్కొన్న లైంగిక దాడిపై ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు చెబుతున్నారు. హోటల్ గదికి తాగొచ్చాడు.. '1971లో జితేంద్ర సిమ్లా లోకేషన్లలో షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు. అప్పుడు ఆయనకు 28 ఏళ్లు కాగా, నాకు 18 ఏళ్లు. అన్ని సిద్ధం చేశానని, షూటింగ్ చూసేందుకు రావాలని జితేంద్ర కోరగా.. నేను ఢిల్లీ నుంచి సిమ్లాకు వెళ్లాను. హోటల్ రూములో నా కోసం రూమ్ బుక్ చేశాడు. షూటింగ్లో పాల్గొన్న ఆయన రాత్రి హోటల్లో నా గదికి వచ్చారు. చాలా అలసిపోయాననని, ఇక్కడే విశ్రాంతి తీసుకుంటానని చెప్పాడు. మధ్యరాత్రి లేచి చూసేసరికి జితేంద్ర తన బెడ్ను నా బెడ్తో కలిపి ఉంచారు. కళ్లు తెరిచి చూసేసరికి నన్ను ఆక్రమించుకోవడం మొదలుపెట్టారు. మద్యం మత్తులో నాపై లైంగిక దాడి చేసిన తర్వాత జితేంద్ర హోటల్ నుంచి వెళ్లిపోయారు. ఆ రాత్రికి భయంభయంగా అక్కడే ఉండిపోవాల్సి వచ్చిందని రెండు పేజీల ఫిర్యాదు లేఖలో ఆమె పేర్కొన్నారు. పరువు పోతుంది.. వద్దన్నారు..! నాకు అన్యాయం జరిగిన సమయంలో జితేంద్రకు బాగా పలుకుబడి ఉంది. నా తల్లిదండ్రులకు చెబితే.. వారు పరువు పోతుందంటూ ఫిర్యాదు చేయవద్దన్నారు. కానీ ప్రస్తుతం సమాజంలో ఎంతో మార్పు వచ్చింది. ఇప్పుడు సోషల్ మీడియా, మీటూ ఉద్యమం, మహిళా సంఘాల పోరాటాలు, హాలీవుడ్లో ఇటీవల చోటుచేసుకున్న లైంగిక వేధింపుల ఫిర్యాదులతో నాకు అవగాహనా వచ్చింది. పోరాడేందుకు నిర్ణయించుకున్నాకే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు చెబుతున్నారు. -
ఎమ్మెల్యే చెంప వాయించిన మహిళ కానిస్టేబుల్
-
ఎమ్మెల్యే చెంప పగలకొట్టిన లేడీ కానిస్టేబుల్
షిమ్లా : కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆశాకుమారికి తీవ్ర అవమానం ఎదురైంది. ఓ మహిళ కానిస్టేబుల్ తో దురుసుగా ప్రవర్తించబోయి.. చెంప దెబ్బ తిన్నారు. సమీక్ష సమావేశం కోసం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేడు షిమ్లాకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కార్యాయలం దగ్గరకు ఆశాకుమారి చేరుకున్నారు. అయితే పోలీస్ సిబ్బంది ఆమెను లోపలికి అనుమతించలేదు. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన ఆమె వాగ్వాదానికి దిగారు. అంతటితో ఆగకుండా ఓ మహిళా కానిస్టేబుల్ చెంప పగలకొట్టారు. అయితే దానికి ప్రతిగా ఆ కానిస్టేబుల్ కూడా ఆమె చెంప వాయించింది. ఆపై ఆశాకుమారి ఆగ్రహంతో ఊగిపోగా.. కార్యకర్తలు ఆమెను పక్కకు తీసుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది. ఎమ్మెల్యే చెంప వాయించిన మహిళ కానిస్టేబుల్ -
శ్వేతవర్ణ శోభితమైన సిమ్లా
-
ఆ పేరెలా వచ్చింది?
సెల్ఫ్ చెక్ ఊరుంటే దానికి పేరుండాలి కదా! ఆ పేర్లు కొన్ని తమాషాగా ఉంటాయి. కొన్ని పేర్లు వింటే ఇవి ఎలా వచ్చాయో అనిపిస్తుంటుంది. వాటి మూలం ఆసక్తిగా కూడా ఉంటుంది. పేరెలా వచ్చిందో తెలుసుకుంటే ఆ ఊరి ప్రాథమిక వివరాలు తెలిసినట్లే. 1. గుర్గావ్ అంటే ధర్మరాజు ద్రోణాచార్యునికి ఇచ్చిన గ్రామం. ‘గురువుకిచ్చిన గ్రామం’ అని అర్థం. ఎ. అవును బి. కాదు 2. మునార్... అంటే మూడు నదుల మధ్య ప్రదేశం అని అర్థం. ఎ. అవును బి. కాదు 3. చండీఘర్ అంటే చండీమాత ఆవాసం అని అర్థం. ఎ. అవును బి. కాదు 4. సిమ్లాకు ఆ పేరు శ్యామలాదేవి అనే దేవత పేరుతో వచ్చింది. శ్యామల క్రమంగా వాడుకలో సిమ్లా అయింది. ఎ. అవును బి. కాదు 5. మేఘాలయ అంటే మేఘాల నిలయం అనే అర్థంలో ఆ పేరు వచ్చింది. ఎ. అవును బి. కాదు 6. మహిషూరు క్రమంగా మైసూరుగా మారింది. మహిష నివసించిన ఊరని పురాణోక్తి. ఎ. అవును బి. కాదు 7. స్థానికపదం వడోదర బ్రిటిష్ పాలకుల ఉచ్చారణలో బరోడాగా మారిపోయింది. ఎ. అవును బి. కాదు 8. హుబ్బలి అంటే పూలతీగ అని అర్థం. ఇది క్రమంగా హుబ్లి అయింది. ఎ. అవును బి. కాదు మీ సమాధానాల్లో ‘ఎ’లు ఆరుకంటే ఎక్కువగా వస్తే పదాలు, పేర్లు... గురించిన ఆసక్తి ఎక్కువ అనుకోవాలి. ‘బి’లు ఎక్కువైతే మీరు అవసరమైన వివరాల గురించి తప్ప మిగిలిన వాటి మీద పెద్దగా ఆసక్తి చూపరు అనుకోవాలి. -
జీపు బోల్తా: ఏడుగురు మృతి
సిమ్లా: హిమాచల్ప్రదేశ్ రాష్ట్రం సిమ్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ జీపు అదుపుతప్పి కొండలో బోల్తా పడింది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సిమ్లా ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
విమానయానరంగంలో భారీ అవకాశాలు
సిమ్లా: విమాన ప్రయాణాన్ని సామాన్య ప్రజలకూ అందుబాటులో కితీసుకొచ్చే ప్రణాళిలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉడాన్ విమానాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఉడాన్ (ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్) పథకంలో భాగంగా మొట్టమొదటి ‘ఉడాన్’ ప్రాంతీయ విమానాలను హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ప్రధాని ఇక విమాన ప్రయాణాలు కేవలం ధనికులకు మాత్రమే కాదు, పేదలకు కూడా అందుబాటులోకి వచ్చాయని వ్యాఖ్యానించారు. దేశీయ విమానయారంగం భారీ అవకాశాలతో నిండి ఉందని తెలిపారు. చండీగడ్ విమానాశ్రయంలో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, పంజాబ్ గవర్నర్ వి.పి. బడ్నోర్ హర్యానా గవర్నర్ కెప్టెన్ సింగ్ సోలంకి, ఇతర ముఖ్య అధికారులు మోదీకి స్వాగతం పలికారు. సిమ్లా-ఢిల్లీ మార్గంతో సహా, కడప-హైదరాబాద్, నాందేడ్-హైదరాబాద్ మార్గాల్లోనూ ఉడాన్ విమాన సర్వీసులను మోదీ ప్రారంభించారు. ప్రపంచ విమానయాన రంగంలో ఈ తరహా పథకాన్ని ప్రవేశపెట్టనుండటం ఇదే తొలిసారి కావడం విశేషం. సిమ్లాలో ప్రధాని చారిత్రాత్మక రిడ్జ్ మైదాన్ లో ఒక ర్యాలీలో ప్రసంగించనున్నారు. ప్రధానమంత్రి పదవిని చేపట్టిన అనంతరం సిమ్లాకు రావడం ఇదే మొట్టమొదటి సారి . ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా 2003 లో హిమాచల్ ప్రదేశ్ రాజధాని షిమ్లాలో పర్యటించారు. కాగా గంట ప్రయాణానికి రూ.2,500 మాత్రమే వసూలు చేయాలనే ఉద్దేశంతోఅందుబాటులోకి తీసుకువస్తామని మోదీ సర్కార్ గత ఏడాది ప్రకటించిన విషయం తెలిసిందే. Haryana Governor Kaptan Singh Solanki, Punjab Governor VP Badnore, CM @mlkhattar and other dignitaries welcomed PM to Chandigarh. pic.twitter.com/Uy5l5zFs2n — PMO India (@PMOIndia) April 27, 2017 -
హిమాచల్ప్రదేశ్లో ఘోర ప్రమాదం
-
సిమ్మ్..లా
ప్రకృతి మాత భారతావని సిగలో నెలవంకను తురిమిందా అన్నట్లు ఉంటుంది సిమ్లా ఏరియల్ వ్యూ. అర్ధచంద్రాకారపు పర్వత సానువుల పై భాగంలో ఉండే ఈ పట్టణంలో ఎటు చూసినా పైన్, దేవదారు చెట్లు ఒక దాన్ని మించి మరొకటి ఆకాశాన్నంటాలన్న తాపత్రయంలో పెరుగుతున్నట్లు ఉంటాయి. శీతాకాలంలో అయితే ఈ చెట్లను మంచు కప్పేసి ముగ్గుబుట్ట తలమీద గుమ్మరించుకున్న పాపాయిలా ఉంటుంది సిమ్లా. సిమ్లా వేసవి విడిది మాత్రమే కాదు, ఒకప్పటి వేసవి రాజధాని కూడా. కీలకమైన ద్వైపాక్షిక ఒప్పందాలకు మౌనసాక్షి. సిమ్లా పట్టణం మాత్రమే చూసి వెనక్కి వస్తే టూర్ తృప్తినివ్వదు. పట్టణంలో ఉన్న ముఖ్యమైన ప్రదేశాలతోపాటు పరిసరాల్లో ఉన్న పర్యాటక ప్రదేశాలను ఎన్ని కవర్ చేయగలిగితే అంత సంతృప్తి సొంతమవుతుంది. మే నుంచి సెప్టెంబర్ వరకు ఒక్క సిమ్లానే కాదు, హిమాచల్ప్రదేశ్లోని ఏ ప్రాంతానికి వెళ్లాలన్నా మే నుంచి సెప్టెంబర్ మధ్య కాలం అనువైన కాలం. ఇంకా చెప్పాలంటే మే, జూన్లే సిమ్లా దర్శించడానికి సరైన కాలం. కల్కా నుండి సిమ్లా వెళ్లే టాయ్ ట్రైన్ శతాబ్ది ఎక్స్ప్రెస్కు కనెక్టింగ్ ట్రైన్. నిజానికి సిమ్లా ప్రయాణంలో ఆనందం కల్కా నుండే మొదలవుతుంది. ఇక్కడి నుంచి నారోగేజ్ రూట్. పర్యాటకులకు టాయ్ట్రైన్లో ప్రయాణించడం మరిచిపోలేని అనుభూతిగా మిగులుతుంది. ఎటు చూసినా హిమాలయ పర్వత శ్రేణులు, లోయలు, క్రమశిక్షణతో పెరిగినట్లు తిన్నగా పెరిగిన పైన్, ఓక్ చెట్లు అడుగడుగునా కళ్లముందు ప్రత్యక్షమవుతాయి. అలసటగా ఒక్క క్షణం కళ్లు మూసి తెరిస్తే అంతా చీకటిగా ఉంటుది, కళ్లు తెరిచామా లేదా అని విప్పార్చి చూస్తే అప్పుడు తెలుస్తుంది ట్రైన్ ఒక టన్నల్ గుండా ప్రయాణిస్తోందని. సిమ్లా, కల్కాల మధ్య 103 టన్నళ్లు, 87 బ్రిడ్జిలు ఉన్నాయి. ‘గ్రేటెస్ట్ నారో గేజ్ ఇంజనీరింగ్ అచీవ్మెంట్ ఇన్ ఇండియా’గా గిన్నెస్ బుక్లో రికార్డయిన మార్గం ఇది. ఈ రూట్లో లెక్కలేనన్ని చిన్న పెద్ద నదులుంటాయి. అయితే వీటిలోని చాలా నదుల్లో ఎండకాలంలో నీళ్లుండవు. కొండ పక్కగా కొంతసేపు, సొరంగంలో మరికొంత సేపు, కిందకు చూస్తే నది... ఇలా సహజత్వానికి సాంకేతికత మేళవించిన సిమ్లా యాత్రలో ప్రతిక్షణం అమూల్యమైనదిగా అనిపిస్తుంది. ఒక్క క్షణం ఏమరుపాటుగా ఉంటే ఏం మిస్సవుతామోనని కళ్లప్పగించి పరిసరాలను, ప్రకృతి రమణీయతను ఆస్వాదిస్తూండగానే కనుచూపు మేరలో ట్రెక్కింగ్ బృందం కనిపిస్తుంది. కొన్ని పర్వతాలకు ప్రదక్షిణ చేసి, మరికొన్నింటి కడుపులో నుండి దూసుకుపోయి సిమ్లా చేరేటప్పటికే టూర్లో కొంత ఆనందం సొంతమవుతుంది. సిమ్లాలో చూడాల్సినవి సిమ్లా పట్టణం కొండవాలులోనే విస్తరించి ఉంటుంది. దూరం నుండి చూస్తే ఇళ్లన్నీ ఒకదాని మీద మరొకటి ఉన్నట్లుగా అనిపిస్తాయి. సిమ్లా వెళ్లిన వాళ్లు మొదటగా చూసేది మాల్రోడ్నే. మాల్సెంటర్ ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. షాపింగ్ చేసినా, చేయకపోయినా అంతా తిరిగి చూడడం బాగుంటుంది. గుర్రమెక్కి మాల్ అంతా చుట్టి, పనిలో పనిగా ఒక ఫొటో తీసుకుంటే ఆ మధురానుభూతి ఎప్పటికీ మర్చిపోలేం.ఇక్కడ ఉలెన్ దుస్తులు చాలాతక్కువ ధరకు దొరుకుతాయి. ఇక మిగిలినవన్నీ తాకితే కాలేటట్లు ఉంటాయి. సిమ్లా దాని చుట్టుపక్కల ఆపిల్ తోటలు ఎక్కువ. పర్యాటకులు ఈ పండ్లను కోసుకుంటున్నా స్థానికులు ఏమీ అనరు. అయితే పండు కాకుండా పచ్చికాయను ముట్టుకుంటే ఒప్పుకోరు. పట్టణంలో తిరుగుతున్నంత సేపూ మనదేశంలో ఉన్నామా? మరొక దేశానికి వచ్చామా? అన్న అనుభూతి కలుగుతుంది. ఇక్కడ బ్రిటిష్ పాలకుల ప్రభావం ఎక్కువ. ఇప్పటికీ ఆ పరిస్థితి కొనసాగుతూనే ఉందేమోననిపిస్తుంది. స్థానికులు వస్తువులను పిల్లలు స్కూలుబ్యాగు వేసుకున్నట్లు వీపుకు కట్టుకుని వెళ్తుంటారు. కొండ ప్రాంతం కావడంతో ఎగుడుదిగుడు మార్గంలో ఆవిధంగా వెడితేనే సౌకర్యంగా ఉంటుంది. ఇండియా నుంచి పాకిస్తాన్ వేరుపడడానికి జరిగిన ఒప్పందం, కీలకమైన కాశ్మీర్ సమస్యపై చర్చ ఇక్కడి వైస్రాయల్స్ భవనంలో జరిగింది. సిమ్లాకు వచ్చిన పర్యాటకులు తప్పకుండా ఈ భవనాన్ని చూస్తారు. బ్రిటీష్ పాలకులు వేసవిలో ఇక్కడికి వచ్చి సేదదీరేవారు, వారి సౌలభ్యం కోసం ఇక్కడి నుంచే పాలన సాగించారు. తరువాత వచ్చిన మన ప్రధానులు కూడా ఆ ఆనవాయితీని కొనసాగించారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ దానికి స్వస్తి చెప్పి ఆ భవనంలో ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్’ను ఏర్పాటు చేశారు. శ్యామలే సిమ్లా హిమాలయ పర్వతాలు అందంగా కనిపించే స్కాండల్ పాయింట్, చర్చి, లైబ్రరీ, లక్కడ్ బజార్ ముఖ్యమైనవి. లక్కడ్ బజార్లో కొయ్యతో చేసిన హస్తకళలు దొరుకుతాయి. స్కాండల్ పాయింట్ నుండి జనరల్ పోస్ట్ ఆఫీస్ వైపు కొద్ది దూరం నడిస్తే కాలాబరి ఆలయం వస్తుంది. ఇందులో ఉన్న దేవత శ్యామల దేవి. సిమ్లాకు ఆ పేరు వచ్చింది శ్యామల దేవత నుంచేనట. ఇక జాకూ ఆలయం ఉన్న శిఖరం చూసి తీరాల్సిందే. ఇక్కడి నుంచి చూస్తే సిమ్లా అంతా కళ్ల ముందుంటుంది. ఇక్కడ హనుమాన్ ఆలయం ఉంది. ఇక్కడికి కొంచెం ఓపిక ఉంటే నడిచి వెళ్లవచ్చు, నడవలేని వాళ్ల కోసం పోనీలు (గుర్రాలు), టాక్సీలు ఉంటాయి. స్టేట్ మ్యూజియంలో హిమాచల్ప్రదేశ్కు చెందిన పురాతన, చారిత్రక ప్రాధాన్యం ఉన్న శిల్పాలు, పెయింటింగ్స్ ఉంటాయి. మన కల్చర్ని ఇక్కడ బాగా ఎంజాయ్ చేయవచ్చు. ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్’ను తప్పకుండా చూడాలి. ఇక్కడి నుండి పది– పదిహేను నిమిషాలు నడిస్తే ప్రాస్పెక్ట్ హిల్ వస్తుంది. ఇక్కడ కామనదేవి ఆలయం ఉంది. ఇక్కడికి ఏడు కిలోమీటర్ల దూరంలో సమ్మర్ హిల్ ఉంది. మహాత్మాగాంధీ ఇక్కడ ఉన్న జార్జియన్ హౌస్లో విడిది చేసారట. హిమాచల్ప్రదేశ్ యూనివర్శిటీ కూడా ఇక్కడే ఉంది. దారి పొడవునా... సిమ్లా నుండి బయలు దేరినప్పటి నుండి ప్రతి ఐదారు కిలోమీటర్లకు ఒక టూరిస్ట్ ప్లేస్ ఉంది. ‘తత్తపాని’ హాట్ వాటర్ స్ప్రింగ్ మర్చిపోకుండా చూడాలి. హిమాచల్ప్రదేశ్ వాసులకు వేడినీటి గుండాలు మామూలు విషయమే కాని, మనకు వాటిని చూస్తే ఆశ్చ ర్యంగానే ఉంటుంది. ఆ నీటిగుండం మినహా పరిసరాల వాతావరణం రక్తం గడ్డకట్టేంత చల్లగా ఉంటుంది. హాట్వాటర్ స్ప్రింగ్లో నీళ్లు మాత్రం మరుగుతుంటాయి. ఈ నీటిలో సల్ఫర్ ఉన్న కారణంగా రసాయనిక చర్య జరిగి అలా జరుగుతుందట. ఇక్కడ స్నానం చేస్తే చర్మవ్యాధులు పోతాయంటారు. ఇంకా ఆసక్తి, సమయం ఉంటే ప్రణాళిక ప్రకారం పరిసరాల్లో ఉన్నవన్నీ చూడవచ్చు. సిమ్లాలో హిమాచల్ప్రదేశ్ టూరిజం ఆఫీస్లో సంప్రదించి ఆ ప్యాకేజ్లో వెళ్తే తక్కువ టైంలో ఎక్కువ ప్రదేశాలను చూడవచ్చు. లేదా రూట్ మ్యాప్ ప్రకారం సొంత వాహనంలో వెళ్లడం కూడా సౌకర్యంగా ఉంటుంది. నచ్చిన ప్రదేశంలో ఎక్కువ సమయం గడపడానికి వీలవుతుంది. అడ్వెంచర్ టూర్ సిమ్లా నుంచి నర్కందా వెళ్లే వరకు పర్వతాలన్నీ మంచురాశి పోసినట్లుంటాయి. దట్టంగా పరుచుకున్న మంచుకొండల మీద సూర్యకిరణాలు పడి మెరుస్తూ వెండికొండలన్న విశేషణం అక్షరాలా నిజమనిపిస్తుంది. స్నో స్కీయింగ్ చేయడానికి ఇది చక్కటి లొకేషన్. సిమ్లా నుంచి కుఫ్రి వెళ్ళే దారి అంతా ఒకవైపు ఆకాశాన్నంటే పర్వతాలు ఉంటే మరొక వైపు అగా«ధాలుంటాయి. ఈ శివాలిక్పర్వతశ్రేణులన్నీ మంచుదుప్పటి కప్పుకున్నట్టుంటే, లోయలు రంగురంగుల పూలతో సీతాకోకచిలుకల్లా ఉంటాయి. వింటర్ స్పోర్ట్స్కు ఇది కేంద్రం. ప్రతి ఏడాది ఫిబ్రవరిలో స్పోర్ట్స్ వేడుకలు జరుగుతాయి. రాంపూర్ సట్లెజ్ నది ఒడ్డున ఉంది. ఇది రివర్ రాఫ్టింగ్కు అనువైన ప్రదేశం. ఇక్కడ మరొక వింత కూడా ఉంది. ఇక్కడ దుకాణాల్లో లావాదేవీకి డబ్బు పనికిరాదు. కరెన్సీ అమలులోకి రాకముందు వస్తుమార్పిడి విధానం(బార్టర్ సిస్టం) ఉండేదని చిన్నప్పుడు చదువుకున్నాం కదా? దాన్ని ఇక్కడ స్వయంగా చూడవచ్చు. స్థానికంగా తయారైన ఉన్ని ఉత్పత్తులన్నీ చవక. డ్రైఫ్రూట్స్ చాలా రకాలు దొరుకుతాయి. ధర కూడా బాగా తక్కువ. – వాకా మంజులారెడ్డి -
పెట్రోల్ బంకుల్లో లిమిట్!
సిమ్లా: రూ. 500, 1000 నోట్లను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని పెట్రోల్ బంకుల నిర్వాహకులు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. మీరు ఎంత మొత్తంలో పెట్రోల్, డీజిల్ కావాలని అరచి గోల చేసినా మేం మాత్రం 500 రూపాయల పెట్రోల్ మాత్రమే పోస్తామంటూ వినియోగదారులకు స్పష్టం చేశారు. దీంతో ఎక్కువ మొత్తంలో పెట్రోల్ పోయించుకొని బ్యాంకులకు వెళ్లకుండానే రూ. 500, 1000 రూపాయలను 'సేల్' చేద్దామనుకున్న వాహనదారులకు చుక్కెదురైంది. దేశ వ్యాప్తంగా పెట్రోల్ బంకుల నిర్వాహకులను చిల్లర కష్టాలు వేదిస్తున్న సంగతి తెలిసిందే. చిల్లర కష్టాలను తొలగించేందుకు టోల్ గేట్ల వద్ద టోల్ట్యాక్స్ను సైతం ప్రభుత్వం తాత్కాలికంగా రద్దు చేసింది. నేటి నుంచి బ్యాంకుల్లో పాత నోట్లను మార్చుకునే అవకాశం ఉంది. అయితే.. ఒక్కో వ్యక్తికి 4 వేల వరకు మాత్రమే పరిమితి ఉంది. రేపటి నుంచి ఏటీఎంలు పనిచేయనున్నాయి. -
ఢిల్లీ కాలుష్యంతో హిమచల్ కు కాసుల పంట
-
ఢిల్లీ కాలుష్యంతో హిమచల్ కు కాసుల పంట
సిమ్లా: ఢిల్లీ కాలుష్యం హిమచల్ ప్రదేశ్ కాసులు పండిస్తోంది. ఇదేంటి అనుకుంటున్నారా. ఇది అక్షరాల నిజం. కాలుష్య కాసారంగా మారిన దేశ రాజధాని నుంచి హిమచల్ కు పర్యాటకులు పోటెత్తుతున్నారు. స్వచ్ఛమైన గాలికోసం సిమ్లా, ధర్మశాలకు తరలివస్తున్నారు. హస్తినలో గాలి కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరడంతో టూరిస్టులు ఢిల్లీవైపు చూసేందుకు జంకుతున్నారు. ఢిల్లీవాసులు కూడా కాలుష్యం బారిన పడకుండా ఉండేందుకు శీతల ప్రాంతాలకు తరలివెళుతున్నారు. ఈ నేపథ్యంలో హిమచల్ ప్రదేశ్ లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలు సిమ్లా, ధర్మశాల టూరిస్టులతో కిటకిటలాడుతున్నాయి. కాలుష్యం నుంచి ఉపశమనం కోసం ఇక్కడకు వచ్చామని సిమ్లాకు పర్యటనకు వచ్చిన ఢిల్లీవాసి ఒకరు చెప్పారు. కాలుష్యంతో ఢిల్లీ పర్యటన వాయిదా వేసుకున్నామని ధర్మశాలకు వచ్చిన మహిళా టూరిస్ట్ ఒకరు వెల్లడించారు. గతవారం ఢిల్లీ పర్యటించిన తనకు కాలుష్యంతో కూడిన పొగమంచు కారణంగా గొంతు నొప్పి మొదలైందని విదేశీ మహిళ తెలిపారు. పర్యాటకులు పెరగడంతో అథితి గృహాలకు డిమాండ్ పెరిగిందని హిమచల్ ప్రదేశ్ టూరిజం హోటల్స్ బుకింగ్ ఇంచార్జి ధర్మశాలలో చెప్పారు. -
వారెవ్వా.. ఆ గృహిణికి సోల్జర్స్ సెల్యూట్
షిమ్లా: తోటి జవాను అనుకోని ప్రమాదంలో పడి ప్రాణాల కోసం పోరాడుతుంటే చూసి తోటి జవాన్లు నిస్సహాయులుగా మారగా ఓ సామాన్య గృహిణీ మాత్రం అతడి ప్రాణాలు నిలబెట్టింది. ఏమాత్రం సంకోచించకుండా అతడికి నోటి ద్వారా శ్వాసను అందించి తిరిగి ఊపిరిపోసింది. ఈ ఘటన గత నెల(ఆగస్టు) 20న చోటుచేసుకుంది. షిమ్లాకు పన్నెండు కిలోమీటర్ల దూరంలోని బానుతి ప్రాంతంలో అస్సోం రైఫిల్స్కు చెందిన కొందరు సైనికులకు శిక్షణా శిబిరం నిర్వహిస్తున్నారు. అక్కడ శిక్షణ పొందుతున్న సైనికుల్లో కొందరు వీధిలో వెళుతుండగా పెద్దమొత్తంలో వీధి కుక్కలు ముకేశ్ కుమార్ అనే సైనికుడిపైకి ఎగబడ్డాయి. వాటి నుంచి తప్పించుకునే క్రమంలో పరుగెడుతూ ప్రమాదవశాత్తూ రోడ్డుపక్కనే ఉన్న 50 అడుగుల గుంతలో పడ్డాడు. అందులోని రాయికి అతడి తల బలంగా తగిలింది. దీంతో అతడు స్పృహలేకుండా పడిపోయాడు. ఆ సమయంలో తోటి సైనికులు సహాయంకోసం అరవడం మొదలుపెట్టారు. ఆ అరుపులు విని వచ్చిన వీణా శర్మ (42) అనే గృహిణి అక్కడ ఏం చేయాలో పాలుపోక నిస్సహాయంగా నిల్చున్న సైనికులను చూసి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెళ్లి స్పృహకోల్పోయిన సైనికుడికి తన నోటి ద్వారా ఊపిరి అందించింది. అనంతరం తన తండ్రి రమేశ్ శర్మను పిలిచి కారులో ఎక్కించి జుతోఘ్ లోని మిలటరీ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి తిరిగి షిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీకి తరలించి ప్రత్యేక వైద్య సేవలు అందించడంతో అతడికి ప్రాణాపాయం తప్పింది. వీణా శర్మ సమయస్ఫూర్తితో చేసిన ఆపనికి అందరు శబాష్ అంటున్నారు. -
ప్రియాంకా గాంధీ సిమ్లా ఇంటిపై వివాదం
సిమ్లా: సోనియా గాంధీ కూతరు ప్రియాంకా గాంధీ సిమ్లాలో నిర్మిస్తున్న ఇంటిపై వివాదం నెలకొంది. స్థానిక బీజేపీ నేత సురేష్ భరద్వాజ్ ఈ ఇంటి నిర్మాణంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. హోం మంత్రి రాజనాథ్ సింగ్కు ఓ లేఖ రాశారు. ప్రియాంకా గాంధీ కొత్త ఇంటిని నిర్మిస్తున్నది.. రాష్ట్రపతి వేసవి విడిది భవనానికి అత్యంత సమీపంలో ఉండటం వల్ల రాష్ట్రపతి, ఇతర ప్రముఖులకు ఈ నిర్మాణం అపాయకరమని, ఇంటి నిర్మాణానికి సంబంధించిన అనుమతులను రద్దు చేయాల్సిందిగా ఆయన లేఖలో కోరారు. గతంలో ఆ ప్రాంతంలో సామాన్యులు ఇళ్లు నిర్మించుకోదలచినప్పుడు భద్రత పరమైన కారణాలను చూపిస్తూ ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదని.. అయితే ప్రియాంకా గాంధీ మాత్రం తన 'ఫ్యామిలీ స్టేటస్' సహాయంతో నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు పొందారని ఆయన ఆరోపించారు. -
టూరిస్ట్ స్పాట్ లోనూ..!
సిమ్లా: వేసవిలో ఉపశమనం కోసం సిమ్లాకు వెళ్దామనుకుంటున్నారా? అయితే, మీరు తప్పులో కాలేసినట్లే..! ఎప్పుడు చల్లగా ఆహ్లాదంగా ఉండే ఈ టూరిస్ట్ స్పాట్ ఇప్పుడు హాట్ హాట్ గా ఉంది. శుక్రవారం రికార్డు స్థాయిలో దాదాపు 42 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో కూల్ కూల్ గా సేద తీరడానికి పట్టణానికి వచ్చిన యాత్రికులందరూ వేడి, ఉక్కపోతతో బెంబేలెత్తిపోయారు. కాగా, దేశవ్యాప్తంగా శుక్రవారం భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాజస్థాన్ లో అత్యధికంగా 51 డిగ్రీలు, అహ్మదాబాద్ లో వందేళ్ల గరిష్ట ఉష్ణోగ్రత 48 డిగ్రీలు గా నమోదయింది. -
అట్టహాసంగా సిమ్లా వింటర్ కార్నివాల్
-
అక్కడ గుండెల్లో రైళ్లు పరిగెడతాయి
మిస్టరీ సిమ్లా... 2005... ‘‘సురభీ... సురభీ... ఏంటా మొద్దు నిద్ర? బాబు ఏడుస్తున్నాడు చూడు’’... భార్య వీపు మీద చరిచాడు రాజేందర్. ఉలిక్కిపడి లేచింది సురభి. పిల్లాడు గుక్కపట్టి ఏడుస్తున్నాడు. గబగబా చేతుల్లోకి తీసుకుని పాలు పట్టింది. ఊరుకున్నాడు. ‘‘ఏంటింత నిద్ర పట్టేసింది? పిల్లాడు ఏడ్చినా మెలకువ రాలేదు. ఛ’’... మనసులో అనుకోవాల్సింది పైకే అంది. ‘‘ఫర్లేదులే... అలసిపోయావ్ కదా, అందుకే మత్తుగా నిద్ర పట్టేసివుంటుంది’’ అంది అత్తగారు. ‘‘రైలు ఆగి చాలా సేపయ్యింది. ఇంకా బయలుదేరడం లేదేంటి?’’ అన్నాడు రాజేందర్ కిటికీలోంచి బయటకు చూస్తూ. అప్పుడుగానీ రైలు కదలడం లేదన్న విషయం మిగిలినవాళ్లకి అర్థం కాలేదు. అందరూ ఒకేసారి కిటికీలోంచి బయటకు చూశారు. కానీ ఏమీ కనిపించడం లేదు. చిమ్మ చీకటి. ‘‘బాబోయ్... ఏంటింత చీకటిగా ఉంది?’’ అంది సురభి భయంగా. ‘‘నేను తెలుసుకుని వస్తాను ఉండు’’ అంటూ లేచి వెళ్లాడు రాజేందర్. చాలా బెర్తులు ఖాళీగా ఉన్నాయి. అంటే వాళ్లంతా కూడా దిగి ఉంటారు. వడివడిగా తనూ రైలు దిగాడు. అది ఒక టన్నెల్... రైలు సరిగ్గా అందులో ఆగిపోయింది. అందుకే అంత చీకటిగా అనిపించింది. డ్రైవర్, కొంతమంది టెక్నీషియన్లు లాంతర్లు పట్టుకుని రైలు ఎందుకు ఆగిందా అని పరిశోధిస్తున్నారు. విసిగి పోయిన ప్రయాణికులు అటూ ఇటూ తిరుగుతున్నారు. కొందరు సిగరెట్లు ముట్టించారు. కొందరు పక్కవాళ్లతో బాతాఖానీ కొట్టడంలో మునిగిపోయారు. ‘‘ఏమైందండీ... ఇంకా ఎంతసేపు పడుతుంది రైలు బయలుదేరడానికి?’’... డ్రైవర్ని అడిగాడు రాజేందర్. ‘‘ఏమోనయ్యా... సమస్య ఏంటో అర్థం కావట్లేదు. ఎందుకు ఆగిందో ముందు నాకు తెలిస్తే, ఎంత సమయం పట్టుద్దో నేను నీకు చెప్తా’’ అన్నాడు విసుగ్గా. రాజేందర్ మౌనం వహించాడు. అంతలో... ‘‘పోనీ నన్ను ఓసారి చూడమంటారా?’’ అన్న స్వరం వినబడింది. డ్రైవర్, రాజేందర్లతో పాటు అందరూ అటువైపు చూశారు. ఎవరో పెద్దాయన. తెల్లగా ఉన్నాడు. విదేశీయుడనుకుంటా. ‘‘మీకు అభ్యంతరం లేకపోతే నేను చూస్తాను’’ అంటూ వచ్చాడు. ‘‘మీకు ఎలా తెలుస్తుంది?’’ అన్నాడు డ్రైవర్. ‘‘నేను ఇంజినీరింగ్ చేశాను. అలా అని కచ్చితంగా సమస్యేంటో నేను కనిపెట్టేస్తానని చెప్పడం లేదు. కనిపెట్టడానికి ట్రై చేస్తానంతే’’ అన్నాడు చిరునవ్వు నవ్వుతూ. సరేనని తలూపి లేచాడు డ్రైవర్. మిగతా వాళ్లంతా కూడా తప్పుకుని దారి ఇచ్చారు. ఆ పెద్దాయన ఇంజిన్ దగ్గరకు వెళ్లి తన పనిలో తాను మునిగిపోయాడు. ఐదు... పది... ఇరవై నిమిషాలు గడిచాయి. ‘‘ఓకే... అయిపోయింది. చిన్న సమస్యే. ఇక స్టార్ట చేయండి’’ అన్నాడాయన ఊపిరి గట్టిగా వదులుతూ. అందరి ముఖాలూ ఒక్కసారిగా వెలిగాయి. క్యాబిన్లోకి వెళ్లి డ్రైవర్ స్టార్ట్ చేశాడు. స్టార్ట అయ్యింది. ‘‘థ్యాంక్సండీ. పొద్దుటి వరకూ ఈ చీకట్లో ఇక్కడే పడిగాపులు పడాలేమోనని భయపడి చచ్చాను’’ అన్నాడు ఆనందంగా. ‘‘ఫరవాలేదు’’ అన్నాడాయన. ‘‘అందరూ వెళ్లి ఎక్కండి... త్వరగా’’ అన్నాడు ప్రయాణీకుల వైపు చూస్తూ. అందరూ గబగబా వెళ్లి ఎవరి బోగీల్లోకి వాళ్లు ఎక్కారు. రాజేందర్ కూడా వెళ్లబోతూ ఆయన దగ్గర ఆగాడు. ‘‘యు ఆర్ గ్రేట్ సర్. మీరు ఎక్కడం లేదేంటి’’ అన్నాడు. ‘‘మీరు పదండి. కాస్త చేతులు కడుక్కుని ఎక్కుతాను’’ అన్నాడాయన నవ్వుతూ. ‘‘సరే. ఇంతకీ మీది ఏ కోచ్?’’ ‘‘ఎస్ 2... బెర్త్ నంబర్ పదిహేడు’’ ‘‘ఓకే’’ అనేసి వెళ్లి రెలైక్కి తన సీట్లోకెళ్లి కూచున్నాడు రాజేందర్. రైలు బయలుదేరింది. ఒక్కసారిగా అతడి మెదడులో ఏదో మెదిలినట్లయ్యింది. చప్పున లేచి నిలబడ్డాడు. గబగబా కోచ్ అంతా కలియదిరిగాడు. ఆయన ఎక్కడా కనిపించలేదు. మతి పోయినట్లయ్యింది. నీరసంగా వచ్చి సీట్లో కూర్చున్నాడు. ‘‘ఏమైందండీ... ఎందుకలా టెన్షన్ పడుతున్నారు?’’... అడిగింది సురభి. ‘‘ఆయన... ఆయన లేడు. ఎక్కడా లేడు. ఏమయ్యాడు?’’ అంటూ మౌనంగా బెర్తుపై వాలాడు రాజేందర్. ఉదయం రైలు దిగాక కూడా అతడి గురించి అంతా వెతికాడు. కానీ ఆయన ఎక్కడా కనిపించలేదు. ‘‘మళ్లీ ఆయన కోసమే వెతుకు తున్నారా?’’ అంది సురభి భర్తవైపు విచిత్రంగా చూస్తూ. ‘‘అవును సురభీ. ఎస్ 2... బెర్త్ నంబర్ పదిహేడు అని చెప్పాడు. నేనూ ఊకొట్టేశాను. కానీ ఆ బెర్త్ నాది. అందులో నేనే ప్రయాణిస్తున్నాను. ఆ విషయం నాకు తట్టనే లేదు. అసలు ఎవరాయన? ఎందుకలా చెప్పాడు? ఏమైపోయాడు?’’ ప్రశ్నలే ప్రశ్నలు. జవాబు లేని ప్రశ్నలు. బహుశా ఆ రైలు ఆగిపోయిన స్థలం గురించి పూర్తిగా తెలిసివుంటే రాజేందర్ మనసులో అన్ని ప్రశ్నలు తలెత్తేవి కావు. ఇంతకీ ఏమిటా స్థలం వెనుక, ఆ వ్యక్తి వెనుక ఉన్న రహస్యం? రైలు ఆగిపోయిన ఆ చోటు... బరోగ్ టన్నెల్. రైలు బాగు చేసిన ఆ వ్యక్తి... బ్రిటిష్ కల్నల్ బరోగ్. ఆయన చనిపోయి అప్పటికి చాలా సంవత్సరాలయ్యింది!!! టన్నెల్ నంబర్ 33... బరోగ్ టన్నెల్... ఈ మాట వింటేనే సిమ్లాలో చాలామంది ఉలిక్కిపడుతుంటారు. దాని గురించి మాట్లాడటం ఎందుకులే అన్నట్టు ముఖం పెడతారు. ఎందుకంటే దాని చరిత్ర అలాంటిది. బ్రిటిష్వాళ్లు భారతదేశాన్ని పరిపా లించిన కాలంలో, కల్కా ప్రాంతంలో ఒక రైలు మార్గాన్ని నిర్మించాలని తలచారు. ఆ పనికి కల్నల్ బరోగ్కి అప్పగించారు. బరోగ్ రైలు మార్గాన్ని వేయడానికి ప్రణాళికలన్నీ సిద్ధం చేశాడు. అయితే అక్కడ ఓ కొండ అడ్డుగా ఉంది. దాన్ని తొలిచి, సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేసి, అందులో రైల్వే లైను వేయాలన్నది బరోగ్ ఆలోచన. అనుకున్నదే తడవుగా ఆ పని మొదలు పెట్టేశాడు. త్వరగా పూర్తవడం కోసమని... కొండను రెండు పక్కల నుంచి తవ్వుకుంటూ రమ్మని పనివాళ్లను ఆదేశించాడు. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ ఇక్కడి నుంచే అసలు సమస్య మొదలైంది. ఆ అతి పెద్ద కొండని చెమటోడ్చి తవ్వసాగారు పనివాళ్లు. అయితే కొలతలు వేయడంలో తేడా వల్ల రెండు పక్కల నుంచీ తవ్వుకుంటూ వెళ్తే ఆ దార్లు ఒకేచోట కలవడం అసాధ్యమని తేలింది. షాకైపోయాడు బరోగ్. తన లెక్క ఎక్కడ తేడా వచ్చిందో అర్థం కాలేదు. తప్పును సరి చేసుకుందామంటే అప్పటికే లక్షల్లో ఖర్చయ్యింది. పనివాళ్లు కూడా తవ్వి తవ్వి విసిగిపోయి ఉన్నారు. దానికితోడు అధికారులు కూడా గుర్రుమంటున్నారు. దాంతో తీవ్ర మనస్తాపం చెందాడు బరోగ్. తన తప్పుకు తనలో తానే కుమిలి పోయాడు. ఓ రోజు మార్నింగ్ వాక్కి వెళ్లిన ఆయన... కొండ దగ్గరకు వెళ్లి, తుపాకీతో కాల్చుకుని మరణించాడు. ఈ సంఘటన అందరినీ నివ్వెర పరిచింది. అధికారులు సైతం షాకై పోయారు. కేవలం ఓ రైలు మార్గం కోసం ఓ మంచి అధికారి ప్రాణాలు తీసుకోవడం అందరినీ కలచివేసింది. దాంతో ఆ కొండ దగ్గరే ఆయన్ని గొయ్యి తీసి పూడ్చి పెట్టారు. ఆ తర్వాత మరో అధికారిని నియమించి, కొత్త ప్లాన్ వేసి, టన్నెల్ను పూర్తి చేశారు. దానికి బరోగ్ పేరునే పెట్టారు. అక్కడితో ఆ కథ ముగిసిపోయిందని అనుకున్నారు. కానీ ముగియలేదు. మొదలైంది. రైళ్లు ఆ టన్నెల్ దగ్గరకు వచ్చినప్పుడల్లా ఏవేవో వింత శబ్దాలు, అరుపులు వినిపించడం మొదలైంది. ఒక్కోసారైతే ఎవరో మౌనంగా ఏడుస్తున్నట్టు అనిపించేది. ఆ ఏడుపు చాలా బాధతో నిండినట్టుగా ఉండేది. అలాగే బరోగ్ కూడా చాలా మందికి కనిపిస్తూ ఉండేవారు. మొదట్లో ఆయనెవరో ఎవరికీ తెలిసేది కాదు. కానీ బరోగ్ ఎలా ఉంటారో తెలిసిన కొందరు, అది బరోగ్ ఆత్మ అని తేల్చారు. నాటి నుంచీ బరోగ్ ఆత్మ తన ప్రాణాన్ని బలి తీసుకున్న టన్నెల్ చుట్టూనే తిరుగు తోందనే వార్త అంతటా పాకింది. అయితే ఎప్పుడూ ఎవరికీ ఏ హానీ మాత్రం జరగలేదు. పైగా ఓసారి రైలు చెడిపోతే ఆయన ఆత్మ వచ్చి రైలును బాగు చేసిందని కూడా కొందరు చెబుతుంటారు. ఇవన్నీ నిజమని నమ్మేవాళ్లు చాలామంది ఉంటే... కాదని వాదించేవాళ్లు కూడా చాలామంది ఉన్నారు. టన్నెల్ విషయంలో జరిగిన తప్పు వల్ల ఆయన ప్రాణాలు తీసుకుని ఉండొచ్చు, కానీ ఆయన ఆత్మ అక్కడే ఉందనడం మాత్రం అసత్యం అని తేల్చి చెప్పేస్తున్నారు వాళ్లు. ఏది నిజమో మనకు తెలియదు. నిజమే అయినా మనం చేసేదేమీ లేదు. నిజం కాకపోతే దాని గురించి ఆలోచించాల్సిన అవసరమూ లేదు. అయితే నిజమా అబద్ధమా అన్నదానితో సంబంధం లేకుండా నేటికీ ఆ సొరంగ మార్గంలో రైళ్లు ప్రయాణిస్తూనే ఉన్నాయి. నిజానిజాలు నిర్ధారించుకోవాలన్న ఆసక్తి కనుక మీరు ఉంటే... ఓసారి మీరూ వెళ్లి ఆ దారిలో ప్రయాణించి రావొచ్చు! -
సిమ్లాలో ఆపిల్ ఫెస్టివల్
-
సిమ్లాలో ఆకట్టుకుంటున్న వాతావరణం
-
కోతే కదా అని....!
-
ఆ థియేటర్లో మైకు లేదు... లైటు లేదు
నైపుణ్యం సిమ్లా... చలి, మంచు... అంతలోనే లేలేత ఎండ... దోబూచులాడే చిరుజల్లుల్ని ఆస్వాదిస్తూ అలా మాల్ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే రకరకాల దుకాణాలు, రెస్టారెంట్లు... కొండ ఎక్కడానికి, దిగడానికి ఉన్న లిఫ్ట్ దాటాక ఎడమవైపు కనిపిస్తుంది ఠీవిగా వందేళ్ల గైతీ థియేటర్! గత వైభవ దీప్తికి నిలువెత్తు నిదర్శనంలా! విక్టోరియన్ గోతిక్ వాస్తు శైలిలో నిర్మించారు దీనిని. ఇది లండన్లోని రాయల్ అల్బర్ట్ హాల్కి నకలు. యురోపియన్ పర్యాటకులను బాగా ఆకట్టుకుంటుందీ ఈ పురాతన రంగస్థలం. భారత్కు వచ్చిన యురోపియన్లు ఈ థియేటర్ను చూడకుండా వెళ్లరు. ఆ ఆకర్షణకు కారణం... ప్రత్యేకమైన గోతిక్ వాస్తుశైలి ఒకటైతే... శతాబ్ద కాలం కళా సాంస్కతిక నిలయంగా నిలవడం మరో కారణం! బాల్కనీ, జనరల్, రాయల్ క్లాస్లతో 365 సీట్లతో రంగస్థల కళలకు కేంద్రం ఈ థియేటర్. దీని మరో ప్రత్యేత... పర్యావరణ సానుకూలత. విద్యుత్ సౌకర్యం లేని కాలంలో దీని నిర్మాణం జరిగింది. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా వేదికపై సహజసిద్ధమైన కాంతి ప్రసరించేలా నిర్మించారు. అయితే, ఇప్పుడు అదనపు లైటింగ్ కోసం షాండ్లియర్స్ను ఉపయోగిస్తున్నారు. ఈ థియేటర్లో మైక్స్ ఉపయోగించరు అనేకంటే అసరమేలేదు అనడమే సబబు. ఎందుకంటే ఫ్రాన్స్ నుంచి తెప్పించిన పారిస్ కాగితపు గుజ్జుతో థియేటర్ లోపలి గోడలకు పూత పూశారు. అది శబ్దాన్ని గ్రహించి విడుదల చేస్తుంది. అంటే మైక్లా పనిచేస్తుందన్నమాట. ఆ ఆడిటోరియంలో ఏ స్థాయి శబ్దం అవసరమో అంత స్థాయిలోనే వినిపిస్తుంది. చెవులు చిల్లులు పడే శబ్దాలుండవు. ఇప్పటికీ సహజసిద్ధమైన లైటింగ్ అండ్ మైక్ సిస్టమ్తోనే నాటకాలు ప్రదర్శిస్తున్నారు. ఇదీ చరిత్ర... బ్రిటిష్ హయాంలో అప్పట్లో సిమ్లా సూపరింటెండెంట్గా పనిచేసిన లార్డ్ హెన్రీ ఇర్విన్ 1889లో ఈ థియేటర్కు రూపకల్పన చేశారు. తొలుత ఇది ఐదంతస్తుల భవనం. బాల్రూమ్, ఆయుధాగారం, పోలీసు కార్యాలయం, బార్, ఆర్ట్ గ్యాలరీ వంటివన్నీ ఉండేవి. నిత్యం ఏదో ఒక వేడుకతో కళకళలాడే ఈ థియేటర్ అప్పట్లో సిమ్లాలో ఉండే బ్రిటిష్ వారికి ఆటవిడుపు కేంద్రం. గట్టి పునాదులపై దీనిని నిర్మించలేదనే కారణంగా ఇరవయ్యేళ్ల తర్వాత కొన్ని అంతస్తులను కూల్చేశారు. పునరుద్ధరణ పనుల కోసం 2005 నుంచి 2009 వరకు దీనిని మూసివేశారు. 2009లో ఇది పునఃప్రారంభమైంది. పుణ్యక్షేత్రం రుడ్యార్డ్ క్లిప్పింగ్, బాతెన్ పాల్, కె.ఎల్.సైగల్, పృథ్వీరాజ్ కపూర్, జెన్నిఫర్ కపూర్, బల్రాజ్ సహానీ, ప్రాణ్, మనోహర్ సింగ్, శశికపూర్, రాజ్ బబ్బర్, నసీరుద్దీన్ షా, అనుపమ్ ఖేర్ వంటి నటదిగ్గజాలు ఈ వేదికపై నటనా కౌశలం చాటుకున్నవారే. 1960, 70ల్లోని బాలీవుడ్ చిత్రాలే కాకుండా, ఇటీవలి గదర్ ఏక్ ప్రేమ్ కథా, బ్యాంగ్ బ్యాంగ్ వంటి చిత్రాలూ ఈ థియేటర్లో షూటింగ్ జరుపుకొన్నాయి. అయితే షూటింగ్ల వల్ల థియేటర్ కాస్త దెబ్బతినడంతో సినిమా షూటింగ్లను నిషేధించారు. అటు నాటకరంగంలోని దిగ్గజాల నుంచి ఔత్సాహిక కళాకారులు, ఇటు సాధారణ ప్రేక్షకుల నుంచి విదేశీ పర్యాటకుల వరకు అందరికీ అభిమాన సాంస్కృతిక కేంద్రంగా ఉన్న ఈ గైతీ థియేటర్ నిజంగా మన దేశ చారిత్రక, కళాత్మాక సంపదే! - సరస్వతి రమ -
ఆదిలాబాద్ ఆపిల్
ఉట్నూర్ : ఆపిల్ పండ్లు.. చల్లని ప్రదేశాల్లో వాటిని పండిస్తారు. అందుకే సిమ్లా, కశ్మీర్ వాటికి కేంద్రాలయ్యాయి. అయితే.. ఇప్పుడు రాష్ట్రంలోనే అత్యల్పంగా జిల్లాలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ఇక్కడ కూడా ఆపిల్ పండ్లు పండించవచ్చని, అనుకూలమైన వాతావరణం ఉందని సెంటర్ ఫర్ సెల్యూలార్ మాలిక్యులర్ బయోలాజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇందులో భాగంగానే జిల్లాలో ఆపిల్ సాగుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందుకు కెరమెరి మండలం సరిహద్దు ప్రాంతాలను ఎంచుకున్నారు. జిల్లాలోనే అతితక్కువ ఉష్టోగ్రతలు.. శీతాకాలం వచ్చిందంటే జిల్లాలో అతితక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా కెరమెరి మండల సరిహద్దు ప్రాంతాల్లో అతి తక్కువ ఉ ష్టోగ్రతలు నమోదు కావడాన్ని సీసీఎంబీ శాస్త్రవేత్తలు గుర్తించారు. చుట్టూ గుట్ట ప్రాంతం కావడం.. అడవులు విస్తరించి ఉండడంతో ఇక్కడ తక్కువ ఉ ష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. యాపిల్ పండ్లు సాగు కావాలంటే అత్యల్ప ఉష్ణోగ్రతలు ఉండాలి. పంట కాలం 90నుంచి 110 రోజులు మాత్రమే ఉండడంతో ఇక్కడ ఆపిల్ సాగు సాధ్యమేనని శాస్త్రవేత్తలు అంచనాకొచ్చారు. విడుతలుగా సాగు.. ఆపిల్ పండ్ల సాగును విడుతలుగా విస్తరించాలని సీసీఎంబీ బావిస్తూంది. వచ్చే జనవరిలో ఆపిల్ సాగుకు ముందుకు వచ్చే రైతుల్లో కొంత మందిని గుర్తించి.. మొక్కలందించి సాగు చేపట్టేలా సన్నాహాలు చేయనున్నారు. ఆపి ల్ సాగు సత్ఫలితాలిస్తే విడుతలుగా విస్తీర్ణం పెంచనున్నారు. ఆపిల్ సాగు విజయవంతమైతే కశ్మీర్, సిమ్లా ప్రాంతాల సరసన మన జిల్లా చేరనుంది. కిలోకు వందల రూపాయలు వెచ్చించలేని పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఆపిల్ చౌకగా లభిస్తాయి. అదీకాక ఏజెన్సీలో పోషకాహార లోపం గిరిజనులకు శాపంగా మారింది. కెరమెరి ఏజెన్సీ ప్రాంతం కావడంతో చుట్టుపక్కల గిరిజన ప్రాంతాలకు పండ్లు అందుబాటులోకి వస్తాయి. అంతేగాకుండా సాగు సక్సెస్తో గిరిజన ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు నిత్యం అందించే పండ్ల సరసన ఆపిల్ చేర్చవచ్చు. ఆపిల్ తోటల పెంపకానికి మన ప్రాంతం అనుకూలంగా ఉంటుందా లేదా అనేది కొన్ని నెలల్లో తేలనుంది. -
బస్సు రిజర్వాయర్లో పడి 22 మంది మృతి
సిమ్లా: హిమాచల్ప్రదేశ్లో బిలాస్పూర్ జిల్లాలో బుధవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కిక్కిరిసిన ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు గోవింద్ సాగర్ రిజర్వాయర్లో ప్రమాదవశాత్తు పడిపోయింది. ఈ దుర్ఘటనలో 22 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. బస్సులోని ప్రయాణికులంతా గాయపడ్డారని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. రిజర్వాయర్లో పడిపోయిన బస్సులో నుంచి ప్రయాణికులను బయటకు తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఎంత మంది ప్రయాణికులు ఉన్నారనే సంగతి తెలియదని చెప్పారు. రుషికేష్ నుంచి బిలాస్పూర్ పట్టణానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని ఆయన వివరించారు. బస్సులో ప్రయాణికులంతా స్థానికులేనని ఎస్పీ చెప్పారు. -
సిమ్లా టు సిటీ!
నరేంద్రలూథర్ ‘శ్యామలా’ అనే దేవత కొలువున్న ‘శామ్లా’ ప్రాంతం సిమ్లాగా మారిందట! బ్రిటిష్ ప్రభుత్వానికి వేసవి రాజధాని అయిన సిమ్లాలో నాన్న ఉద్యోగం. కొండపై ప్రభుత్వ బంగళాలో నివాసం. కొండ కింద మేఘసంచారం. నూరు వంతెనల రైలు మార్గంలో ప్రయాణాలు. నీట్ సిటీ. ‘ఆవుపేడ’ చూడలేదుంటే అతిశయోక్తి కాదు. సిమ్లాలో ఏడేళ్ల బాల్యం కలగా గడచి పోయింది. నాన్న బదిలీలతో 1946లో లాహోర్కి, ఆ తర్వాత రావల్పిండికి మా నివాసాలు మారాయి. అమ్మ రామచరితమానస్ శ్రావ్యంగా చదివేది. చెల్లెళ్లు సితారా వాయించేవారు. నాకు తబలా వచ్చు. మెట్రిక్యులేషన్ పరీక్ష రాశాను. రిజల్ట్స్ రాలేదు. దేశ విభజన వార్తలు వస్తున్నాయి. తుపాకుల మోతల మధ్య ఆగస్ట్ 14-15 అర్ధరాత్రి నెహ్రూ ఉపన్యాసం బిక్కుబిక్కుమంటూ విన్నాం. నాన్న స్నేహితుడు ఒక ముస్లిం ఉద్యోగి, మా కుటుంబానికీ మరో రెండు కుటుంబాలకు ఆశ్రయం ఇచ్చారు. బయటకు వెళ్తే ముస్లిం పేర్లు చెప్పాలి. మా తమ్ముడి పేరు అక్రమ్. నా పేరు అస్లమ్. ఇక్కడ జీవించలేరు, ఇండియా వెళ్లిపోండి అని హితైషులు చెప్పినా, పుట్టిన గడ్డను విడిచేందుకు నాన్న ఇష్టపడలేదు. తర్వాత పరిణామాలరీత్యా ఇండియా వెళ్దామని అన్నారు. ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా వేసిన రైలులో 14మంది కూర్చునే కంపార్ట్మెంట్లో 40 మంది ‘సర్దుకున్నాం’! మూడురోజుల ప్రయాణం తర్వాత మృతుల-జీవన్మృతుల కంపార్ట్మెంట్లతో రైలు అమృత్సర్ చేరింది. రైల్వే స్టేషన్కు ఆనుకునే తాత్కాలిక శ్మశానాలు. బాధితులకు సేవలు చేసేందుకు స్వచ్ఛందంగా యువత ముందుకు వచ్చేది. ‘సంఘసేవ’ చేసినందుకు గత విద్యార్హతలతో సంబంధం లేకుండా వయసును బట్టి పట్టభద్రత ఇచ్చేవారు. నేను ‘మెట్రిక్యులేట్’ని! ఆగస్ట్ 15 అంటే కొందరికి స్వాతంత్య్రం వచ్చిన రోజు. మా బోటోళ్లకు దేహం ఖండితమైన రోజు! నాన్నకు హోషియార్పూర్ జిల్లాలోని గడ్శంకర్లో పోస్టింగ్ ఇచ్చారు. కట్టుబట్టలతో ‘రేఖ’కు అటు నుంచి ఇటు వచ్చినట్లు, ఇటు నుంచి అటు కూడా వెళ్లిన వారు ఉంటారు కదా! అలా ఖాళీ అయిన నివాసంలో కొన్ని గదులను మా కుటుంబానికి ఇచ్చారు. కొందరు వదిలేసిన వస్తువుల్లో కావాల్సినవి తీసుకోవలసినదిగా గ్రామ పెద్దలు చెప్పడంతో కుటుంబ ప్రతినిధిగా నేను గ్రామపంచాయతీ దగ్గర వరుసలో నిల్చున్నా. చేతిలో సంచి లేదు. ఒక మగ్గు కన్పించింది. ఆ పాత్రపై ఉర్దూలో కవిత ‘మధువు తాగితాగి హృదయం భగ్గుమంటోంది॥ ఓ పాత్రధారీ, కొన్ని మంచు ముక్కలు వేసి ఉపశమనం కలిగించవా॥ అని. అక్కడి వస్తువుల్లో ఒక ఖురాన్ ప్రతి కన్పించింది. నాన్నను రావల్పిండిలో ‘మహాత్మా’ అనీ ‘మౌలానా’ అనీ పిలిచేవారు. ఆయన గీతను, ఖురాన్ను అంత తన్మయంగా గానం చేసేవారు. నాన్న ఖురాన్ తెచ్చుకునేందుకు వీలు కాలేదు. సో... ఒక చేత్తో మగ్గూ మరో చేత్తో ఖురాన్తో ఇంటికి వచ్చాను. కవిత్వం నచ్చి మగ్గు తెచ్చానని హాస్యమాడారు. ఖురాన్ ఎందుకు తెచ్చావు, ఇన్ని గొడవలకు కారణం ఈ పుస్తకమేగా అని అక్క అంది. ‘ఖురాన్ను చదివి అర్థం చేసుకున్నవారే మనకు ఆశ్రయం ఇచ్చారు. మంచి పని చేశావు’ అని నాన్న మెచ్చుకున్నారు. ఆ ప్రతి ఇప్పటికీ నా దగ్గర భద్రంగా ఉంది! 1953లో ఎం.ఎ, 1954లో ఐఏఎస్ పూర్తి చేశాను. ఢిల్లీలో, వైజాగ్లో ఒక సంవత్సరం ట్రైనింగ్. నా తొలి పోస్టింగ్ మద్రాసు నుంచి విడిపోయిన ‘ఆంధ్ర రాష్ట్రం’ గూడూరులో. మూడు రోజుల భారీ వర్షాల వల్ల సువర్ణముఖి నదికి వచ్చిన వరదల సహాయక చర్యలతో నా ఉద్యోగ జీవితం ప్రారంభమైంది. ‘మద్రాసీ’ అనే భాష లేదని, ‘తెలుగు’ భాష ఉందనీ ఇక్కడకు వచ్చాకే తెలిసింది. 1959లో రాష్ట్ర సమాచార - ప్రజా సంబంధాల శాఖ డెరైక్టర్గా హైదరాబాద్ వచ్చాను. నగరం నన్ను నన్నుగా తీర్చిదిద్దింది! ప్రజెంటేషన్ : పున్నా కృష్ణమూర్తి -
హిమాచల్లో లోయలోపడ్డ బస్సు
20 మంది మృతి సిమ్లా: హిమాచల్ప్రదేశ్లో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిమ్లా నుంచి 30 మందికిపైగా ప్రయాణికులతో సవేరాఖుడ్కు వెళ్తున్న హిమాచల్ ఆర్టీసీ బస్సు కతార్ఘాట్ వద్ద అదుపుతప్పి లోయలో పడింది. బసంత్పూర్-కింగాల్ జాతీయ రహదారిపై జరిగిన ఈ దుర్ఘటనలో 20 మంది మృతిచెందగా మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో డ్రైవర్ బస్సులోంచి దూకి ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రమాదవార్త తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు తునాతునకలైన బస్సులోంచి మృతదేహాలను వెలికి తీశారు. సహాయ చర్యలను ముమ్మరంగా చేపట్టాలని ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులను ఆయన పరామర్శించారు. బీహార్లో 12 మందిని చిదిమేసిన కంటెయినర్ ఔరంగాబాద్: బీహార్లోని ఔరంగాబాద్ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున అదుపు తప్పిన ఓ కంటెయినర్ రోడ్డు పక్కన నిద్రిస్తున్న భక్తులపై దూసుకెళ్లడంతో 12 మంది మృతిచెందారు. మరో 22 మంది గాయపడ్డారు. న్యూఢిల్లీ-కోల్కతా రెండో నంబర్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. వీరంతా జార్ఖండ్లోని దేవ్గఢ్ ఆలయంలో దర్శనం చేసుకొని ఇళ్లకు తిరిగి వస్తుండగా ఈ దారుణం జరిగింది. కంటెయినర్ భక్తుల పైనుంచి దూసుకెళ్లాక పక్కన ఉన్న వారి బస్సును ఢీకొని ఆగింది. -
మంచుతో కూరుకుపోతున్న ఇళ్ళు, రోడ్లు